breaking news
Pakistan
-
పాకిస్తాన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్రేట్ను మాత్రమే సూపర్ సిక్స్కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తే పాక్కు రన్రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్రేట్ను ప్రభావితం చేస్తే కెప్టెన్పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
టీ20 వరల్డ్కప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్తో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్కు దూరంగా ఉండి, బిగ్బాష్ లీగ్లో పాల్గొన్నారు. మరో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్కు చోటు దక్కింది.లాహోర్లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాక్ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్కు చేరుకుంటుంది. మ్యాచ్లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్ ఇది. చివరిగా ఆసీస్ 2022లో పాక్లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్ మొదలవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ -
ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ పై ..ఇజ్రాయెల్ విమర్శ
గాజాలో శాంతికోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం గాజాలో శాంతికోసమే మాత్రమే కాదని అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే తాజాగా దీనిపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలు గాజాలో బలగాలను మెహరిస్తాయంటే తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని ఆ దేశ మంత్రి నిర్ బర్కత్ అన్నారు.డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్త రూపం మెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభేదాలను పరిష్కరిస్తానంటూ బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ఒక అంతర్జాతీయ శాంతిమండలిని ఏర్పాటు చేశారు. నిన్న దావోస్లో జరిగిన మీటింగ్లో దీనిని 35 దేశాలతో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక యుద్ధాలను ఆపడమే తరువాయి అంటున్నారు. అయితే ట్రంప్ క్లోజ్ ఫ్రైండైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ తొలుత దీనిని వ్యతిరేకించారు. అనంతరం అంగీకారం తెలిపాడు. ఇప్పుడు తాజాగా ఆదేశ ఆర్థిక మంత్రి దావోస్లో ఈ అంశంపై మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ "ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల బలగాలని గాజాలో మెహరించడానికి మేము ఒప్పుకోం. ఖతర్, టర్కీ దేశాల బలగాల్ని మేము ఆమెదించం ఎందుకంటే వారా గాజాలోని జిహాది ఆర్గనైజేషన్లకు మద్దతిస్తారు. వారు అక్కడ కాలుమోపితే మేము నమ్మం వారు ట్రంప్కు చెందిన సంస్థలో ఉన్న మేము పట్టించుకోం" అని బర్కత్ అన్నారు. ప్రస్తుతం ఒక మంచి ప్రతిపాదనతో ముందుకెళ్తున్నారు. అయితే హమాస్ పరిస్థితి ఏంటి దానిని ఖచ్చితంగా నాశనం చేయాల్సిందే అన్నారు. దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఏదైనా దేశం పరస్పరం సహకరించుకుంటాయన్నారు. అందుకే గాజాలో పాకిస్థాన్ బలగాల్ని తాము నమ్మకమైన అంగీకరమైన భాగస్వామిగా చూడడం లేదన్నారు. అయితే నిన్న ( గురువారం) దావోస్లో పాకిస్థాన్ డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి అంగీకారం తెలిపింది. కాగా ఇదివరకూ జరిగిన ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ గాజాలో శాంతి కోసం తమ బలగాల్ని మెహరించాల్సి ఉంటుంది -
కరాచీ మాల్ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు
కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.ఒకే చోట 30 మంది..సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ షట్టర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.అయితే ఈ విషాధ సంఘటనలో మరణించిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు లభ్యమైన 61 మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించినట్లు సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒకరు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈ భవనంలో భద్రత లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది. -
'నాకు ముగ్గురు కూతుళ్లు.. నన్నెవరూ భయపెట్టలేరు'
‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది. View this post on Instagram A post shared by SYED KAZIM🩶 (@syed_kazimkazmi110)“మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్నమాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ను సంపాదించింది.నెటిజన్ల రియాక్షన్ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో”, “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం. -
రెచ్చగొట్టిన పాక్.. ఇరుదేశాల మధ్య కాల్పులు
దాయాది పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. నిన్న రాత్రి ( మంగళవారం) నార్త్ కశ్మీర్ ప్రాంతంలోని కేరన్ సెక్టార్ ప్రాంతంలో భద్రతా బలగాలు పహారా చేస్తున్న సమయంలో కాల్పులు జరిపింది. అయితే భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ నిఘావ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. పాకిస్థాన్తో సరిహాద్దు పంచుకుంటున్న సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఆధునాతన సీసీ సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా ఆసమయంలో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది.కెమెరాలు ఏర్పాటును అడ్డుకునేలా రెండు రౌడ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈకాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ప్రమాదంలో రెండువైపులా ఎవరికీ గాయాలుకానట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో చిల్లైకలానే అత్యంత కఠినమైన చలి ఉండే సమయం నడుస్తోంది. ఈ సమయంలో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది. అందుకే సరిహద్దు వెంబడి భద్రతను మరింత కఠినతరం చేశారు. ఎటువంటి చిన్నబొరబాట్లు సైతం దేశంలోకి జరగకుండా ప్రత్యేక నిఘావ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. -
పబ్లిసిటీ పిచ్చి ఎంత పని చేసింది!
పాకిస్థాన్లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi— Adeel Raja (@adeelraja) January 20, 2026 -
లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా..
బంగ్లాదేశ్ 2026 సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరోమారు ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది. గత 50 ఏళ్లుగా ఆ దేశంలో అనామకులుగా మిగిలిపోయిన ‘బిహారీ’ల ప్రస్తావన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం లభించి ఇన్లేళ్లు గడిచినా, వారి జీవితాల్లో ఇసుమంత వెలుగు కూడా కానరాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి వెతలు తీరలేదు. ఇంతకీ ‘బంగ్లా’లో మగ్గిపోతున్న ‘బిహారీ’లు ఎవరు? వారి సమస్య ఏమిటి? పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది?బంగ్లాదేశ్లో అనామక పౌరులు1971 యుద్ధానంతరం బంగ్లాదేశ్లోనే ఉండిపోయిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు లేదా ‘బీహారీ’ (పాక్ అనుకూల వర్గాలు)ల దుస్థితి మరోమారు అందరి నోళ్లలో నానుతోంది. 1971 డిసెంబర్ 16న దేశం విడిపోయిన నాటి నుంచి వారు బంగ్లాదేశ్లో అనామక పౌరులుగా మిగిలిపోయారు. వీరికి ఫలానా దేశానికి చెందినవారనే గుర్తింపు కూడా లేదు. నాడు పాకిస్థాన్ కు సహకరించారన్న ఆరోపణలతో వీరిని తాత్కాలిక శిబిరాల్లో బంధించారు. నేటికీ ఆ శిబిరాలే వారికి శాశ్వత నివాసాలుగా మారాయి. పాకిస్తాన్ తమను తిరిగి తీసుకువెళుతుందని వీరంతా ఆశించినా, కేవలం 1.70 లక్షల మందిని మాత్రమే ఆ దేశం వెనక్కి తీసుకుంది. మిగిలిన లక్షలాది మంది బంగ్లాదేశ్లో పూర్తిగా కలవలేక, పాకిస్తాన్ కు తిరిగి వెళ్లలేక నిరంతర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.గడచిన ఐదు దశాబ్దాల్లో..వీరి సమస్యకు పరిష్కారంగా 2003, 2008లో వచ్చిన కోర్టు తీర్పులు కొంతమందికి పౌరసత్వం కల్పించినా, 1971 నాటికి వయోజనులుగా ఉన్నవారికి ఇంకా ఓటు హక్కు గానీ, పూర్తి పౌరసత్వం గానీ దక్కలేదు. గడచిన ఐదు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లో అనేక ప్రభుత్వాలు మారాయి. సైనిక పాలనలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఇలా సుమారు 15 రకాల పాలనా యంత్రాంగాలు మారినప్పటికీ, ‘బీహారీ’ల తలరాత ఏమాత్రం మారలేదు. వారికి పౌరసత్వం అనేది ఒక కలగానే మిగిలిపోయింది తప్ప, నిజ జీవితంలో సమాన హక్కులు దక్కలేదు.మరోమారు వంచన, దోపిడీ?ఇప్పుడు 2026 ఎన్నికల్లో కూడా వీరు మరోమారు రాజకీయ వంచనకు, దోపిడీకి గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. వీరి విషయంలో పాకిస్తాన్ తన బాధ్యతను విస్మరించడం. పాక్ ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ అంశంపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వీరిని వెనక్కి రప్పించేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదు. రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు, సంబంధాలు మెరుగుపడినప్పటికీ, స్వదేశానికి రావాలనుకునే వారిని అనుమతించడంలో పాక్ జాప్యం చేస్తోంది. ఇక రెండోది.. బంగ్లాదేశ్లోని రాజకీయాలు చరిత్రను తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఖలీదా జియా వంటి నేతలు సైతం దేశ గత చరిత్రలోని వివాదాలను విస్మరిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో, నాడు పాకిస్తాన్కు విధేయులుగా ఉండిపోయిన సామాన్యుల వెతలు ఎవరికీ పట్టడం లేదు.నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలుఇరు దేశాలు దౌత్య సంబంధాల సాధారణీకరణ పేరుతో చరిత్రను తారుమారు చేయడం లేదా మౌనం వహించడం చేయడం కారణంగా ఈ వర్గాల ప్రజల హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు రెండూ గతంలో చోటుచేసుకున్న నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలు, వ్యవస్థాగత నిర్లక్ష్యాలను నిరంతరం కప్పిపుచ్చుతున్నాయి. పాక్లోని ఇస్లామిక్ పార్టీలు సైతం ఈ అభాగ్యుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దాదాపు 3.24 లక్షల మంది పాకిస్తానీ పౌరులు 54 ఏళ్లుగా విదేశీ గడ్డపై దిక్కులేకుండా పడి ఉంటే, ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.దుర్భర స్థితిలో మూడో తరం ‘బీహారీ’ యువతప్రస్తుతం పాక్, ‘బంగ్లా’ మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం, క్రికెట్, సైనిక సహకారం మొదలైవాటి చుట్టూనే తిరుగుతున్నాయి. 2026 ఎన్నికలు బంగ్లాదేశ్కు ఒక నైతిక పరీక్ష లాంటివి. 1971 నాటి ద్వేషాన్ని, చరిత్రను పక్కనపెట్టి, బంగ్లాదేశ్ తన గొప్పతనాన్ని చాటుకోవాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమయ్యింది. మురికివాడల్లో మగ్గుతున్న మూడో తరం ‘బీహారీ’ యువతను తమ దేశ పౌరులుగా ఆదరించాలి. వచ్చే ఎన్నికల్లో వీరిని కేవలం ఓటర్లుగా లెక్కించడమే కాకుండా, దేశంలో భాగస్వామ్యం చేయాలని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? -
‘పాకిస్తాన్ ఉగ్ర దేశమే.. ఆ సైన్యం 40 మసీదులను కూల్చేసింది’
జమ్మూ–కాశ్మీర్లోని మసీదులను భారత్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. పాకిస్తాన్ సైన్యమే మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఆరోపించారు.పాకిస్తాన్ను ఆయన బహిరంగంగా ‘ఉగ్రవాద దేశం’గా పేర్కొనడం గమనార్హం. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్లో మసీదులు, ఇమాములు, కమిటీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగానే ఈ వ్యాఖ్యలు చేశారు.బలూచిస్తాన్లో 40 మసీదుల ధ్వంసంబలూచ్ జాతీయవాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన మీర్ యార్ బలూచ్ ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో సుమారు 40 మసీదులను ధ్వంసం చేసింది. ఇందులో మసీదులపై నేరుగా బాంబు దాడులు చేయడం, పవిత్ర ఖురాన్ను దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.భారత్కు బలూచిస్తాన్ మద్దతుజమ్మూ–కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకుంటున్న సూత్రప్రాయ వైఖరికి బలూచిస్తాన్ రిపబ్లిక్ పూర్తి మద్దతు ఇస్తోందని మీర్ యార్ పేర్కొన్నారు. మత, జిహాదీ తీవ్రవాద శక్తులను ఉపయోగించి హిందువులు సహా మైనారిటీలను అణచివేస్తున్న పాకిస్తాన్, ఇతర దేశాలకు మానవ హక్కులపై పాఠాలు చెప్పడం విడ్డూరమని ఆయన విమర్శించారు.పాకిస్తాన్కు చెందిన “బాహ్య శక్తులు” బలూచిస్తాన్లో మసీదులపై బాంబు దాడులు చేయడం, ఖురాన్ దహనం చేయడం, మసీదుల అధిపతులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.పాకిస్తాన్ ఆక్రమణ సైన్యం ట్యాంకులతో దాడులు జరిపి పౌరులపై షెల్స్, ఫిరంగులు ప్రయోగించినప్పుడు తొలి బలైంది ఖాన్ ఆఫ్ కలత్ మసీదు అని మీర్ యార్ బలూచ్ తెలిపారు. ఆ మసీదులో ఇప్పటికీ మోర్టార్ షెల్స్ మోగిన శబ్దాలు వినిపిస్తాయని, అది పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు.మైనారిటీలపై దౌర్జన్యాలుహిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా అనేక మైనారిటీ వర్గాలు పాకిస్తాన్లో నిరంతర హింసకు గురవుతున్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని మీర్ యార్ బలూచ్ వ్యాఖ్యానించారు. అటువంటి దేశానికి భారత్, బలూచిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లకు మానవ హక్కులపై ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత లేదని ఆయన తేల్చిచెప్పారు. -
26కు పెరిగిన పాక్ మాల్ మృతుల సంఖ్య
కరాచీ: పాకిస్తాన్లోకి కరాచీలో జనసమ్మర్థ గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారానికి 26కు పెరిగింది. దాదాపు 60 మంది మంది జాడ గల్లంతైంది. మంటలను ఆదివారం రాత్రి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ హోల్సేల్, రిటైల్ దుకాణాల సముదాయమైన ఈ షాపింగ్ మాల్లోకి సోమవారం ఉదయం అగి్నమాపక సిబ్బంది ప్రవేశించి శిథిలాలను తొలగిస్తున్నారు. మరికొందరి మృతదేహాలు లభ్యమవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా పలువురు ఆచూకీ తెలియాల్సి ఉందని ‘రెస్క్యూ 1122’అధికార ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్ఖాన్ చెప్పారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో కోటి పాకిస్తాన్ రూపాయలను ఆయన ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు. ప్రమాదంలో షాపింగ్మాల్లోని దాదాపు 300 కోట్ల పాక్ రూపాయల సరకు బుగ్గిపాలైందని అంచనావేస్తున్నారు. భవనం చాలా గంటలపాటు కాలిపోవడంతో నిర్మాణం బాగా దెబ్బతిన్నదని, దాదాపు భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాల్సి రావొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. కరాచీలో సరైన రక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అధిక విద్యుత్ లోడు, అక్రమ నిర్మాణాల కారణంగా గతంలో పలు షాపింగ్ మాల్స్ ప్రమాదాల బారిన పడ్డాయి. -
ప్రపంచకప్లో బోణీ కొట్టిన పాక్
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్తో స్కాట్లాండ్ పతనాన్ని శాశించాడు. మొమిన్ కమర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ తలో వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన థామస్ నైట్ టాప్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్ (33), ఓల్లీ జోన్స్ (30), మను సరస్వత్ (25), రోరి గ్రాంట్ (21), ఫిన్లే కార్టర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్కు సరస్వత్, ఫిన్లే జోన్స్ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్ ఖాన్ (75), అహ్మద్ హుసేన్ (47) పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ ఫర్హాన్ (18 నాటౌట్) పాక్ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్ ఇన్నింగ్స్లో అలీ హసన్ బలోచ్ 15, స్టార్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఓల్లీ జోన్స్, సరస్వత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్ సూపర్-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బుల్బులియా, జేసన్ రోల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. -
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్కు వంత పాడుతున్న పాక్
2026 టీ20 ప్రపంచకప్కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్లో జరగబోయే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్ను పరిష్కరించకపోగా, భారత్లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్ ఆడబోమని ఓవరాక్షన్ చేస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్కప్ మ్యాచ్లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.దీన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. -
పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..
-
పాక్ మాజీ ప్రధాని ఇంట పెళ్లి.. భారతీయ దుస్తులపై దుమారం
భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితంగానే ఉంటాయి. దేశ విభజన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్లో పహల్గాం దాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి, రెండు దేశాలు యుద్ధానికి చేరువయ్యాయన్న భావన కూడా నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి కారణం వధువు భారతీయ ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించడం.ఎవరిదీ వివాహం?నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్, లాహోర్లో షాంజే అలీ రోహైల్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ, వధువు దుస్తులు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువయ్యాయి. జునైద్ సఫ్దర్కు ఇది రెండో వివాహం. ఆయన 2021లో అయేషా సైఫ్ ఖాన్ను వివాహం చేసుకోగా, ఇద్దరూ 2023 అక్టోబర్లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఆకర్షణగా నిలిచిన పెళ్లి దుస్తులుమెహెందీ వేడుకలో షాంజే అలీ, భారతీయ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు జరీ వర్క్తో కూడిన ఆకుపచ్చ లెహంగా, డబుల్ దుపట్టాతో మెరిశారు. ప్రధాన వివాహ వేడుకలో ఆమె తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఎరుపు చీరను ధరించారు. తలపై ఎరుపు ముసుగు, జుట్టులో సొగసైన బన్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ఫొటోలను పాకిస్తాన్ సిటిజన్ మీడియా పోర్టల్ ‘డైలాగ్ పాకిస్తాన్’ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన మొదలైంది. పాకిస్తాన్కు చెందిన కొంతమంది నెటిజన్లు, ఇంతటి రాజకీయ కుటుంబానికి చెందిన కోడలు పాకిస్తాన్ డిజైనర్లను పక్కన పెట్టి భారతీయ డిజైన్లను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కొందరు పాకిస్తాన్ నేతలు భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.అయితే మరికొందరు వధువును సమర్థిస్తూ, ఇది వివాహం పూర్తిగా వ్యక్తిగత అంశమని, తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్తాన్ డిజైనర్లు కూడా అంతే స్థాయిలో ప్రతిభావంతులేనని కొందరు అభిప్రాయపడ్డారు. -
‘పాక్లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్
ఇస్లామాబాద్: సర్భ్జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్లో వాఘబార్డర్ మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.అందులో అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్జిత్ కౌర్కు చెందిందా కాదా అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.అయితే సర్బ్జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్జిత్ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే కౌర్ను ఇది వరకే పాకిస్థాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడి అధికారులు అన్నారు. -
పాకిస్తాన్లో ఘోర ప్రమాదాలు.. 24 మంది మృతి
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటన లాహోర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధా జిల్లాలోని కోట్ మోమిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రమాదానికి గురైన ట్రక్కులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు తెలిపారు. వీరంతా ఫైసలాబాద్లో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారి మూసివేయడంతో డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తక్కువ దృశ్యమానత కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి గాలాపూర్ వంతెన నుంచి నీరు లేని కాలువలోకి ట్రక్కు పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోట్ మోమిన్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బలూచిస్థాన్లో బస్సు బోల్తా: 10 మంది మృతిఇదే రోజు బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ సమీపంలోని మక్రాన్ తీరప్రాంత రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. -
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్లో సామాన్యులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల లోపం కారణంగా పాకిస్తాన్లో గోధుమ పిండి సంక్షోభం అత్యంత తీవ్రమైంది. ఆ దేశంలోని దక్షిణ పంజాబ్ ప్రాంతంలో మొదలైన ఈ సంక్షోభంతో పేద ప్రజలు రెండు పూటల కూడా తిండి తినలేని పరిస్థితి నెలకొంది.ప్రాంతీయ బహిరంగ మార్కెట్లలో గోధుమ ధరలు 40 కిలోలకు రూ.4,600 (పాకిస్తాన్ రూపాయలు) చేరగా, ఒక్క కేజీ గోధుమ పిండి దాదాపు రూ.130 లకు చేరింది. అంటే, ఒక సామాన్య కుటుంబం 10 కిలోల పిండి కోసం రూ.1,300 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేదలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది.మరోవైపు అక్కడి ప్రభుత్వం సబ్సిడీతో పిండి అందిస్తున్నా దాంతో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. 10 కిలోల పిండి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.910 కాగా 20 కిలోలకు రూ.1,820. అయితే లాహోర్ వెలుపల ప్రభుత్వ పిండి లభ్యత చాలా తక్కువగా ఉంది. దక్షిణ పంజాబ్ ప్రజలు ఇప్పుడు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడాల్సి వస్తోంది.పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. వ్యాపారులు, సామాన్య ప్రజల వద్ద గోధుమ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. సుమారు 50 లక్షల జనాభా ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ గోధుమల స్థిర కోటా అందుబాటులో లేకపోవడం వల్ల సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్లో 80 శాతం పిండి మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయని మిల్లర్లు తెలిపారు.పెరుగుతున్న ఖర్చులు, బలహీన పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ ఉదాసీనత పరిస్థితిని మరింత తీవ్రముగా మార్చాయని మిల్లర్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం తన 1.5 మిలియన్ టన్నుల నిల్వల నుండి జనవరి 20 నుండి మార్చి 20 వరకు రోజుకు 20,000–22,000 టన్నుల గోధుమలు విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ సంక్షోభం మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు. -
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
టొరంటో: పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ కెనడా పౌరుడు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత వీసా పొందినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.సోషల్ మీడియాలో తనను తాను ఫారెక్స్ ట్రేడర్గా పరిచయం చేసుకునే అభయ్కు ఒక నెల కాలపరిమితి కలిగిన సింగిల్ ఎంట్రీ భారత వీసా మంజూరైంది. ఈ సందర్భంగా అతడు వీసా దరఖాస్తు ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో వివరించాడు.“నేను కెనడా పౌరుడిని. ప్రస్తుతం పాకిస్తాన్లో నివసించడం లేదు. అయినప్పటికీ, పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తినన్న కారణంతో భారత వీసా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దానికి గల కారణాలు నాకు పూర్తిగా తెలియవు” అని అభయ్ పేర్కొన్నారు.అయితే, ఎట్టకేలకు వీసా లభించడంతో సంతోషం వ్యక్తం చేసిన అతడు, భారత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు లభించిన ఈ అవకాశం ఎంతో విలువైనదని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s) -
కరాచీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతి
పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది.కరాచీ అంతర్జాతీయ నౌకాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలను తీసుకెళ్తున్న కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం ఇవి వెనువెంటనే వేరే కంటైనర్లకు వ్యాపించడంతో 20 వరకూ కంటైనర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.అయితే మంటలు వ్యాపించిన సమయం మధ్యాహ్నం ఒంటిగంటతో పాటు నిన్న శుక్రవారం కావడంతో కార్మికులంతా నమాజ్ కోసం దగ్గర్లో ఉన్న మసీద్కు వెళ్లారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడంలో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
సుడాన్కు ఆయుధాలు అమ్ముతున్న పాకిస్తాన్
సౌదీ అరేబియా నుంచి సూడాన్, లిబియా వరకు పాకిస్తాన్ సైనిక ఉనికి, ఆయుధాల విక్రయ పరిధి క్రమంగా విస్తరిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సుడాన్కు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.పాకిస్తాన్–సుడాన్ దేశాలు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుడాన్లో సైన్యం, పారామిలిటరీ సంస్థ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత దాదాపు మూడేళ్లుగా తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలను ఆర్ఎస్ఎఫ్ ఎదుర్కొంటోంది.అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా, ఇప్పుడు నేరుగా ఆయుధాలు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది.ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానం. ఇది పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి, బహుళ-పాత్ర యుద్ధ విమానం. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, చైనాకు చెందిన చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ కలిసి దీనిని తయారు చేస్తున్నాయి. తాజా బ్లాక్-3 వెర్షన్లో ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, సుదూర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉన్నాయి.ఒక్కో JF-17 యుద్ధ విమానం ధర సుమారు 25 నుంచి 30 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇది పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, పరిమిత రక్షణ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. -
గుజరాత్ లో పాక్ పడవ.. తొమ్మిది మంది అరెస్ట్
-
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. హై అలర్ట్లో భారత సైన్యం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తొలుత సోమవారం నౌషెరా-రాజౌరీ సెక్టార్లో పలు డ్రోన్లు కనిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తమై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మంగళవారం రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టార్లోనూ డ్రోన్ల కదలికలు కనిపించాయి. మొదటిసారి డ్రోన్లు కనిపించిన వెంటనే భారత్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ తన ఆందోళనను, అభ్యంతరాలను పాక్ అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం రాజస్థాన్లోని జైపూర్లో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, గురువారం రాజౌరీ జిల్లాలో భద్రతా దళాలు భారీ ముప్పును తప్పించాయి. అందిన కచ్చితమైన సమాచారం మేరకు కాకోరా గ్రామంలో నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. -
భారత్లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!
భారత్లో చొరబడేందుకు పాకిస్తానీయులు యత్నించారు. అరేబియా సముద్ర మార్గం ద్వారా తొమ్మిదిమంది పాకిస్తానీయులు.. భారత్లో చొరబాటుకు యత్నించారు. కానీ వారిని భారత సైనికులు పట్టుకున్నారు. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని బంధించి గుజరాత్కు తీసుకువస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పినా వారి కార్యకలాపాల్లో మార్పు రావడం లేదు. మత్స్యకారుల వేషంలో ఓ పడవలొ పయనిస్తూ తొమ్మిదిమంది పాక్ దేశీయలు భారత్లో చొరబడేందుకు పన్నాగం వేశార. నిన్న(బుధవారం, జనవరి 14వ తేదీ) రాత్రి, భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉంది. అయితే . అకస్మాత్తుగా, రాడార్ అనుమానాస్పద కదలికను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. ఇది సాధారణ ఫిషింగ్ నౌకలా కనిపించలేదు, ఎందుకంటే దాని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదే సైనికుల అనుమానాలను రేకెత్తించింది. దాంతో కోస్ట్గార్డ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్లోని పోర్ట్కు తీసుకువస్తున్నారు. इंडियन कोस्ट गार्ड ने 9 पाकिस्तानी नागरिक को अवैध घुसपैठ की कोशिश में पकड़ा है. अरब सागर में 14 जनवरी की रात इंडियन कोस्ट गार्ड पेट्रोलिंग कर रही थी तभी उन्हें मछुवारों के भेस में भारत की सीमा में प्रवेश करते हुए पकितानियों को पकड़ा है. फिलहाल मामले की जांच जारी है. pic.twitter.com/A1lQfhHCBR— Versha Singh (@Vershasingh26) January 15, 2026 -
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్-పాక్ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే ఆసీస్ జట్టే ఈ సిరీస్లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్ కోసం పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్, టీ20 సిరీస్లను ఆసీస్ గెలుచుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్.. టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఉంది. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. -
పాకిస్తాన్ నక్క బుద్ది.. భారత్ టార్గెట్గా భారీ ప్లాన్?
ఇస్లామాబాద్: కుక్క తోక వంకర అనే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం విషయంలో బహిరంగ వేదికలపై తమ దేశం వ్యతిరేకం అంటూనే.. అంతర్గతంగా మాత్రం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైనప్పటికీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం భద్రతా సంస్థలు కలిసి రెండో తరం ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో సీనియర్ ఉగ్రవాద కమాండర్ల కుమారులు, వారి దగ్గరి బంధువులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్ టార్గెట్గా దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా వర్ణించబడిన ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జమ్ముకశ్మీర్లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం, భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడమే ముఖ్య లక్ష్యమని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే, జమ్ముకశ్మీర్లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జెఎమ్) కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.పహల్గాం తరహా ప్లాన్?మరోవైపు.. సీనియర్ లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైష్ కమాండర్ అబ్దుర్ రౌఫ్తో ఇటీవలే బహవల్పూర్కు చేరుకున్నారు. అక్కడే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తో తల్హా సయీద్, సైఫుల్లా కసూరి రహస్య సమావేశం నిర్వహించారని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, పహల్గాం దాడికి ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశం ఇది రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి సీనియర్ ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు ISI ఇప్పుడు దృష్టిని మళ్లిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. నాయకత్వం, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి రెండో తరం ఉగ్రవాద కార్యకర్తలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఇందుకు అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నారు. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్వర్క్లు మరియు అంతర్జాతీయ సంబంధాలలో కూడా అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.అదేవిధంగా, మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్కు ISI మద్దతు, శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, అస్గర్.. జైష్-ఎ-మొహమ్మద్లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, ఉగ్రవాద మాడ్యుల్స్ సిద్ధం చేయడం, సరిహద్దు కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి పెద్ద నాయకత్వ పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రౌఫ్ అస్గర్ గతంలో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే చర్చ మొదలైంది. -
ఇమ్రాన్ను కలవనివ్వండి.. ఖురాన్తో సోదరిల నిరసన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్లో చర్చనీయాంశమైంది.ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. -
పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తాం: ఆర్మీ చీఫ్ హెచ్చరిక
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందన్నారు. దాయాది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్లో ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆర్మీ చీఫ్ ద్వివేది తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్లో త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం. దేశంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్దంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా అది స్పష్టమైంది. జమ్ము కశ్మీర్లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా.. ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉండటం కీలకం. భారత మోహరింపులు బలంగా ఉన్నాయి. భవిష్యత్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఆపరేషన్ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. కవ్వింపు చర్యలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని’ అని అన్నారు.ఇదే సమయంలో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. వారిలో దాదాపు 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారే ఉన్నారు. వీరిలో ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. స్థానికంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు సింగిల్ డిజిట్కు పడిపోయింది. అయితే, ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపుగా లేవు. మా సమాచారం ప్రకారం దాదాపు ఎనిమిది శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. వీటిలో, రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా.. ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. ఈ శిబిరాల్లో కొంత ఉనికి లేదా శిక్షణ కార్యకలాపాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మేము నిశితంగా గమనిస్తూ ఇన్పుట్లను సేకరిస్తున్నాం. అలాంటి కార్యకలాపాలు మళ్ళీ గుర్తించబడితే, అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటాం అని హెచ్చరించారు. -
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది. నిన్న కూడా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు నుంచి వచ్చిన ఒక డ్రోన్, సాంబా సెక్టార్లో ఆయుధాల సరుకును వదిలింది. డ్రోన్లను అడ్డుకోవడానికి సైన్యం మెషిన్ గన్స్ను వినియోగించింది. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి. సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదలికను గమనిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
పాక్-అమెరికా సైనిక విన్యాసం.. ఎందుకో తెలిస్తే షాక్..!
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్కు చెందిన వారేనని పేర్కొంది. అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.అయితే ఈ ఆపరేషన్పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే. -
'ఒకరు కాదు.. వెయ్యి మంది కాదు.. భారత్కు మసూద్ అజార్ హెచ్చరికలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.ఆపరేషన్ సిందూర్లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సిందూర్పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.కాగా, భారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్కోట్లో ఎయిర్బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
"ఇంటర్నెట్ నాకు తెలియదు": అజిత్ దోవల్
అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకునే ఈ ఆఫీసర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారత గూఢచారిగా ఎన్నో సీక్రెట్ మిషన్లలో పాల్గొని దేశ భద్రతలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఇంటర్నెట్ వాడడం లేదని, మెుబైల్కు సైతం చాలావరకూ దూరంగా ఉంటానని తెలిపారు.భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాతృభూమి రక్షణ కోసం అనునిత్యం తపించే ఈ ఆఫీసర్ దేశం కోసం ఎన్నో రిస్కీ ఆపరేషన్లు చేశారు. 1980 దశకంలో పాకిస్థాన్లో ఏడేళ్లపాటు ముస్లిం వ్యాపారిగా, బిచ్చగాడిగా నటిస్తూ భారత్కు ఎంతో కీలక సమాచారాన్ని చేరవేశారు. అంతేకాకుండా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన మిలిటెంట్లను బయిటకి తీసేందుకు అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశారు. ఇలా భారత్ కోసం ఆయన ప్రాణాలు తెగించి చేసిన ఆపరేషన్లు అనేకం. అందుకే ఆయనను అందరూ ఇండియన్ జేమ్స్బాండ్ అని పిలుచుకుంటారు.అయితే శనివారం ఢిల్లీ భరత మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్-2026- కార్యక్రమం జరిగింది. అందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ" నేను అసలు ఇంటర్నెట్ వినియోగించను. ఇది నిజం అంతేకాకుండా మెుబైల్ ఫోన్ అసలు వాడను. కేవలం విదేశాల్లో ఉన్నప్పుడు మా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి తప్ప దానిని వినియోగించను. నాపని అంతా అలానే సాగుతుంది" అని అజిత్ దోవల్ అన్నారు. 1945లో ఉత్తరాఖండ్లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్ సాధించి కేరళ క్యాడర్కు ఎంపికయ్యారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సమయంలో భారత్ తరపున చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో కీర్తి చక్ర అవార్డుకు ఎంపికయిన పోలీసు ఆఫీసర్గా ఆయన రికార్డు సృష్టించారు. అజిత్ దోవల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో దశాబ్దాల కాలం పాటు భారత్కు సేవలందించారు. -
పాకిస్థాన్లో హిందూ రైతు దారుణహత్య
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న ఓ హిందు రైతుని సర్ఫరాజ్ నిజామని అనే భూస్వామి కాల్చిచంపారు. దీంతో అక్కడి మైనార్టీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. భారత్లోమైనార్టీల హక్కులు కాలరాస్తున్నారని అక్కడి విదేశాంగశాఖ మంత్రి ప్రసంగించిన మరుసటి రోజే అక్కడి ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ఇస్లామిక్ అధిపత్యం ఉన్న దేశాలలో హిందువులపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రస్థాయిలో హింస చేలరేగింది. అక్కడి స్టూడెంట్ లీడర్ మృతితో అక్కడి మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. ఇస్లాం వ్యతిరేక ప్రచారాల నెపం మోపి అనేక మందిపై దాడి చేసిం చంపారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే తాజాగా పాకిస్థాన్లో మరోసారి హిందూ రైతుని కాల్చిచంపారు.సింధూ ప్రావిన్సూకు చెందిన సర్ఫరాజ్ నిజమని అనే భూస్వామికి చెందిన భూమిని కైలాస్ కోల్హి అనే హిందూ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు. రెండురోజుల క్రితం కైలాస్ కోల్హి ఛాతిపై సర్ఫరాజ్ కాల్పులు జరిపాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రైతు మృతితో పాకిస్థాన్లోని మైనార్టీలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి" అని ఆయన అన్నారు. కైలాస్ కోల్హిపై ఎందుకు కాల్పులు జరిపారో అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి, నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి." అని ఆయన అన్నారు. కాగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలని తొలగించే పనులలో భాగంగా టర్కీగేట్ వద్ద ఫైజ్-ఇ-ఇలాహి మసీదు సమీపంలోని కట్టడాలను తొలగించారు.దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ భారత్లో మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారంటూ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మైనార్టీలపై తరచుగా దాడులు చేసే దేశానికి ఈ వ్యాఖ్యలు చేసే హక్కులు లేదని విమర్శించింది. Badin SindhThe protest for the arrest of the killers of the martyred Kalash Kolhi is making history.Shiva Kachhi, Chairman of Pakistan Darawar Ittehad @PItehad is leading the historic protest sit-in.This was not just a protest—it was the cry of a wounded conscience.From… pic.twitter.com/uo9io9PAk0— Shiva Kachhi (دراوڙ)🇵🇰 (@FaqirShiva) January 9, 2026 -
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
సొంత దేశంపై బంగ్లాదేశ్ క్రికెటర్ తిరుగుబాటు
భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్పై ఆ దేశ క్రికెటరే తిరుగుబాటు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అయిన తమీమ్ ఇక్బాల్ భారత్తో అనుసరిస్తున్న విధానాలపై సొంత దేశ నాయకులను, క్రికెట్ బోర్డును హెచ్చరించినట్లు సమాచారం. పాక్ అండ చూసుకొని భారత్పై రెచ్చిపోవద్దని తమీమ్ స్వదేశీ క్రికెట్ బోర్డుకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే ఐసీసీతో విరోధం కూడా మంచి కాదని హెచ్చరించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం తమీమ్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో 90 నుంచి 95 శాతం ఐసీసీ నుంచే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీతో విరోధం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదం.టీ20 వరల్డ్కప్ విషయంలో ప్రజల్లో ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం కంటే, బోర్డు లోపల చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలు తీరతాయి.భారత్లో ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్ మార్గాన్ని అనుసరించడం బంగ్లాదేశ్కు హానికరం. వారు చేశారని మనమూ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.ప్రపంచ కప్ నుంచి వైదొలగడం దేశ క్రికెట్ సంస్కృతిని దెబ్బతీస్తుంది.తమీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ నాయకులు, ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలు అనురిస్తున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. తమీమ్ మొదటి నుంచి విధానాల విషయంలో బీసీబీ పెద్దలను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. తాజా పరిణామాలపై అతను మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమీమ్ వ్యాఖ్యల్లో క్రికెట్ ముందు, రాజకీయాలు తర్వాత అన్న విషయం స్పష్టమవుతుంది.భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంషేక్ హసీనా స్థానంలో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కావడంతో భారత్తో సంబంధాలు క్షీణించాయి. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించింది.ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అతిగా స్పందించింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్లో వరల్డ్కప్ మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది. టీ20 వరల్డ్కప్ మ్యాచ్లను భారత్కు బదులుగా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ కోరింది. ఐసీసీ ససేమిరా అంటుండటంతో వాకౌట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతుంది. పాక్ అండ చూసుకొని, ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మొత్తంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ను చూపిస్తూ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. -
ప్రధాని మోడీ హెచ్చరికలతో పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళన
-
పాక్లో హమాస్ - లష్కరే భేటీ.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో ముందు వరుసలో ఉందనే పేరుపొందిన పాకిస్తాన్ గడ్డపై తాజాగా మరో ప్రమాదకర పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హమాస్, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ల మధ్య జరిగిన భేటీ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూపు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే ఉగ్రవాదులు తమ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లోని గుజ్రన్ వాలాలో లష్కరే తోయిబాకు చెందిన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఉగ్ర ముఠాల మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి. Senior Hamas commander attended Lashkar terrorist function as Chief guest in Gujranwala, PakistanIsrael will be watching this 😎 pic.twitter.com/kuTKF0zHpP— Megh Updates 🚨™ (@MeghUpdates) January 7, 2026హమాస్ నేత నజీ జహీర్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు ఈనాటికి కావు.. 2025, ఫిబ్రవరిలో పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించి, లష్కరే, జైషే మొహమ్మద్ కమాండర్లతో కలిసి భారత వ్యతిరేక ర్యాలీలో ప్రసంగించారు. అంతకుముందు 2024 జనవరిలో కరాచీ ప్రెస్ క్లబ్లో ప్రసంగించారు. ఇస్లామాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సన్మానం కూడా అందుకున్నారు. ఈ ఉగ్ర ముఠాల ఐక్యత మరింతగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాణించిన బౌలర్లు, ఫర్హాన్.. శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 7) జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ రాణించడంతో పాక్ తిరుగులేని విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ 19.2 ఓవర్లలోనే శ్రీలంకను ఆలౌట్ చేసింది. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంకేయులు 128 పరుగులకే చాపచుట్టేశారు. ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్ తలో 2 వికెట్లు తీసి సత్తా చాటారు. లంక ఇన్నింగ్స్లో మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియనాగే (40) టాప్ స్కోరర్గా నిలువగా.. మరెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.ఓపెనర్లు పథుమ్ నిస్సంక 12, కమిల్ మిషారా 0, వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ 14, ధనంజయ డిసిల్వ 10, చరిత్ అసలంక 18, వనిందు హసరంగ 18, దసున్ షనక 12, దుష్మంత చమీరా 0, మహీశ్ తీక్షణ 1 పరుగుకు ఔటయ్యారు. శ్రీలంక చివరి 5 వికెట్లు 18 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (51), సైమ్ అయూబ్ (24) శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత కెప్టెన్ సల్మాన్ అఘా (16), ఫకర్ జమాన్ (5) విఫలమైనా, ఉస్మాన్ ఖాన్ (7 నాటౌట్), షాదాబ్ ఖాన్ (18 నాటౌట్) పాక్ను విజయతీరాలకు చేర్చారు. 16.4 ఓవర్లలో పాక్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, ధనంజయ డిసిల్వకు తలో వికెట్ దక్కింది. సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా జనవరి 9న జరుగనుంది. -
ట్రంప్ ముందు మోకరిల్లిన పాక్
ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ ఉద్రిక్తతల్లో తలదూర్చాలని అమెరికాను బతిమాలిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చర్చల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అమెరికాకే చెందిన 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' (FARA) ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు బయటపెట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భావన నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించి కాల్పుల విరమణ పాటించాయి. అయితే ఈ అంశంలో తరుచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నోటివాటం చూపించారు. వీరిద్దరి మధ్య యుద్ధం తానే ఆపానన్నారు. అధిక పన్నులు వేస్తానని హెచ్చరించడంతో రెండు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. అనంతరం పాక్ను అక్కున చేర్చుకొని ఆ దేశానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ భారత్తో డిస్టెన్స్ మెయింటేన్ చేశారు.అయితే తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం అమెరికా మద్ధతు కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించిందని FARA నివేదిక తెలిపింది. అమెరికా తనకు మద్దతిచ్చేలా వ్యవహరించడానికి అనేక లాబీయింగ్ సంస్థలను రంగంలోకి దింపినట్లు ప్రచురించింది. ఈ లాబీయింగ్ సంస్థల ద్వారా పాక్ దౌత్యవేత్తలు, లాబీయిస్టులు.. అమెరికా చట్టసభల ప్రతినిధులతో పాటు పలు విభాగాల అధిపతులను, రక్షణశాఖ అధికారులను భేటీ అయ్యారని పేర్కొంది.పాకిస్థాన్ లాబీయింగ్ కుదుర్చుకున్న ఏజెన్సీలో డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితులైన జార్జ్ సోరియల్, కీత్ షిల్లర్ వంటి వారు ఉన్నారంది. అంతేకాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ పర్యటనను సైతం ఈ లాబీయింగ్ సంస్థలే ఏర్పాటు చేశాయని FARA తెలిపింది. ప్రధాన పత్రికలైన 'వాల్ స్ట్రీట్ జర్నల్', 'న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికల్లో పాకిస్థాన్కు అనుకూలంగా కథనాలు వచ్చేలా మీడియా మేనేజ్మెంట్ చేసిందని పేర్కొంది. దీనికోసం స్వల్పకాలంలో పాక్ ఐదు మిలియన్ డాలర్లు.. భారత్ కరెన్సీలో దాదాపు రూ. 45కోట్లు ఖర్చుచేసినట్లు ప్రచురించింది. దీంతో ట్రంప్, భారత్తో గ్యాప్కు పాక్ సంప్రదింపులు సైతం ఓ కారణమేనా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో భారత్ సైతం అమెరికాతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించిందని 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' ప్రచురించింది. -
ప్రమాదపుటంచుల్లో పాకిస్తాన్..!
-
పాక్ ఎత్తుగడ.. భారత్ ఎలా చిత్తు చేస్తోందంటే?
పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు పంజాబ్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు పాక్ ఎత్తుగడ ఏంటి? దాన్ని భారత్ ఎలా చిత్తుచేస్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.భారతదేశ రహస్యాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేయిస్తోందనే విషయం బహిర్గతం కావడంతో.. మన బలగాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా పంజాబ్ పోలీసులు 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని గూఢచర్య అభియోగాలపై అరెస్టు చేశారు. దాంతో.. ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. మిలటరీ ఎస్టాబ్లిష్మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు? ఏయే సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్కు పంపాడు? అనే వివరాలను అధికారులు గుర్తించారు.తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు. ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో.. పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. అయితే.. జమ్మూకశ్మీర్, పంజాబ్లలో పలువురు బాలలతో పాకిస్థాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.జమ్మూకశ్మీర్, పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి.. ఇక్కడి బాలలను హనీట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. మైనర్ బాలురతో గూఢచర్యం చేయిస్తే.. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో.. మరింత మంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
పాక్లో నెక్ట్స్ జరిగేది ఇదేనా?
పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.పాకిస్తాన్లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్గా చూస్తే.. పాకిస్తాన్లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు. -
పాక్లో షరారత్ క్రేజ్ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్
బాలీవుడ్ స్టార్హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్గా కూడా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
టీ20 వరల్డ్కప్కు పాక్ జట్టు ప్రకటన.. ఎట్టకేలకు స్టార్ ప్లేయర్కు చోటు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీని (వైస్ కెప్టెన్) ప్రకటించలేదు.ఫామ్లేమితో సతమతమవుతున్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్నెస్పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్కు బ్యాకప్గా మరో పేసర్ హరీస్ రౌఫ్ ఎంపికయ్యాడు. షాహీన్ తాజాగా బిగ్బాష్ లీగ్లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్కీపర్గా ఎంపికయ్యాడు. మెయిన్ స్క్వాడ్ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు. టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు- సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్) - బాబర్ ఆజమ్ - షాహీన్ అఫ్రిది (ఫిట్నెస్ అనిశ్చితి) - ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్) - షాదాబ్ ఖాన్ - మొహమ్మద్ నవాజ్ - ఫహీమ్ అష్రఫ్ - హారిస్ రౌఫ్ (షాహీన్కు ప్రత్యామ్నాయం) - ఫకర్ జమాన్- మొహమ్మద్ వసీం జూనియర్- నసీం షా- అబ్దుల్ సమద్- సాహిబ్జాదా ఫర్హాన్- సైమ్ అయూబ్- సల్మాన్ మీర్జా- అబ్రార్ అహ్మద్కాగా, టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ గ్రూప్-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్తో పాక్ తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది. -
మోదీజీ పాక్పై అటాక్ చేయండి: అసదుద్దీన్
వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని సూచించారు. అమెరికా ఆ పని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్మైండ్గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్కు ప్రత్యేక బలగాలను పంపండి. 26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు" అని అసదుద్దీన్ అన్నారు.అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే. -
భారత్లో ఆడబోము..! పాక్ బాటలోనే బంగ్లాదేశ్?
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026.. ప్రారంభానికి ముందే హాట్ టాపిక్గా మారింది. భారత్తో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ మ్యాచ్ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమన్ను తమ జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ముస్తఫిజుర్ను ఐపీఎల్లో ఆడించరాదంటూ కొంత కాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బంగ్లా పేస్ బౌలర్ బరిలోకి దిగితే టీమ్ యజమాని షారుఖ్ ఖాన్పై కూడా దాడులు చేస్తామంటూ పలు చోట్ల హెచ్చరికలు జారీ అయ్యాయి.వీటిని దృష్టిలో ఉంచుకుంటూ అతడిని తప్పించాలంటూ స్వయంగా బీసీసీఐ కేకేఆర్ యాజమాన్యానికి సూచించింది. దీంతో బోర్డు ఆదేశాల మేరకు జట్టు నుంచి ముస్తఫిజుర్ను కేకేఆర్ విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బాటలోనే బంగ్లాదేశ్ కూడా పయనించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాదిరిగానే వరల్డ్కప్లో ఆడే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుందంట."ముస్తాఫిజుర్ను విడుదలకు సంబంధించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే అది పూర్తిగా బీసీసీఐ, ఫ్రాంచైజీ అంతర్గత విషయం. టీ20 ప్రపంచకప్లో పాల్గొనే విషయానికి వస్తే, అది ఐసీసీ నిర్వహించే ఈవెంట్. ఈ విషయంపై త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీతో చర్చిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. మేము కూడా మా డిమాండ్లను ఐసీసీ ముందు పెడతాము. ఇందుకు సంబంధించి ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.ఇదే విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పందించాడు. "బీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఒక ఆటగాడు భారత్లో ఆడలేనప్పడు.. మొత్తం బంగ్లాదేశ్ జట్టు అక్కడ సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. అందుకే మా నాలుగు లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని జైషా నేతృత్వంలోని ఐసీసీని కోరమని బోర్డుకు సూచించాను" అని బీసీబీకి రాసిన లేఖలో ఆసిఫ్ పేర్కొన్నాడు.కాగా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్లను భారత్లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్, 17న వాంఖడేలో నేపాల్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: VHT 2025-26: అర్షిన్, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్ -
పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.ఇక పాకిస్థాన్లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇక పాకిస్థాన్లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ::: హెచ్.కమలాపతిరావు -
బలూచిస్తాన్పై చైనా కన్నుపడిందా?
విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది. పాక్పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?బలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.బలూచిస్తాన్లో యురేనియం నిల్వల పరిస్థితిబలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్కు సాయం చేస్తే తర్వాత భారత్కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.అందుకోసమేనా ఎదురుచూపులు?తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు. -
పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవితఖైదు..
ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అనుకూలంగా వీరు యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది. ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం, సైన్యం.. ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. కోర్టు ఏం చెప్పింది?కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని , విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది. దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు. -
చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి!
బలూచిస్తాన్.. పాకిస్తాన్తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. గతంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్ కూడా పాక్ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. అయితే గతంలో భారత్ సాయం కోరిన బలూచిస్తాన్.. మరొకసారి భారత్ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్ సైన్యం తమతో కలిస్తే పాక్ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. బలూచ్ అగ్రనేత మిర్ యార్ బలూచ్.. ఈ మేరకు భారత్కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలుఅదే సమయంలో పాక్తో యుద్ధంలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై సైతం బలూచిస్తాన్ నేత మీర్ ప్రశంసలు కురిపించారు. . పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్.. పాక్కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్కు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. Open letter to Honorable Foreign Minister of #Bharat Shri @DrSJaishankar ji From, Baloch Representative,Republic of BalochistanState.The Honorable Dr. S. Jaishankar,Minister of External Affairs,Government of Bharat,South Block, Raisina Hill,New Delhi – 110011January… https://t.co/WdjaACsG2V pic.twitter.com/IOEusbUsOB— Mir Yar Baloch (@miryar_baloch) January 1, 2026 -
"చెడగొడితే రిప్లై ఇలానే ఉంటుంది"
సాక్షి,తమిళనాడు: భారత్-పాక్ వివాదంలో అమెరికా-చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికి లేదని పరోక్షంగా హెచ్చరించారు. పాకిస్థాన్ లాంటి చెడ్డ పొరుగుదేశంతో భారత్ సరిహద్దు పంచుకోవాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఐఐటీ మాద్రాస్ క్యాంపస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇండియా ఎయిర్ఫోర్స్ కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పాక్ టెర్రరిస్టులను వారి సొంత దేశంలో భారత్ మట్టి కరిపించింది. అంతే కాకుండా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాల్పులు విరమణ జరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం తాను చెబితేనే ఆగిందని, పన్నులు పెంచుతానని హెచ్చరించడంతో ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాయని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. భారత్ ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం ఇదే తంతు ఎత్తుకుంది. ఇండియా పాక్ యుద్ధాన్ని తామే నివారించామని ఇటీవల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రగల్భాలు పలికారు.ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " భారత్కు ఏంచేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికీ లేదు తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇండియాకు చాలా క్లియర్గా తెలుసు’ అంటూ పరోక్షంగా ఈ రెండు దేశాలకు కౌంటరిచ్చారు. అనంతరం పాకిస్థాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతిఒక్కరికీ చుట్టుప్రక్కల వారు ఉంటారు. అలాగే భారత్కు ఉన్నారు. అయితే వారు చెడ్డవారు. మన సరిహద్దుకు పశ్చిమ దిక్కునున్న దేశం దిక్కు చూస్తే వారు తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన ప్రజలను టెర్రరిజం నుంచి కాపాడుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది. ప్రస్తుతం అదే చేస్తున్నాం" అని జైశంకర్ అన్నారు.అదేవిధంగా ఆయన సిందూనది జలాల ఒప్పందం అంశంపై మాట్లాడుతూ. "చాలా సంవత్సరాల క్రితం సిందూనది జలాల ఒప్పందం చేసుకున్నాము. కానీ దశాబ్ధాలుగా మనకు సత్సంబంధాలు లేవు. మంచి సంబంధాలు లేనప్పుడు దాని ఫలితాలు అదే విధంగా ఉంటాయి. దయచేసి మీరు మాకు నీరు ఇవ్వండి మేము మాత్రం ఉగ్రవాదులని మీదేశానికి పంపుతాము అంటే ఏలా కుదురుతుంది" అని జైశంకర్ ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఎట్టకేలకు గాడిలో పడిన బాబర్ ఆజమ్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.వాస్తవానికి బాబర్ నుంచి ఇంకా చాలా రావాల్సి ఉన్నా.. ఇటీవలికాలంలో అతని పరిస్థితిని బట్టి చూస్తే ఇది కాస్త బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతగాడు రెండేళ్లకు పైగా అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లు) శతకం లేకుండా గడిపాడు. అప్పుడెప్పుడో 2023లో పసికూన నేపాల్పై సెంచరీ చేసిన బాబర్.. ఇటీవలే (ఈ ఏడాది నవంబర్) శ్రీలంకపై మళ్లీ సెంచరీ చేశాడు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబర్ నుంచి అర్ద సెంచరీ కూడా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్లో బాబర్ చేసిన అర్ద సెంచరీలకు ఇంత ప్రాధాన్యత లభించడానికి మరో కారణం ఉంది.టీ20 ఫార్మాట్లో ఇటీవలికాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచకప్ జట్టులో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాక్ సెలెక్టర్లు బాబర్ ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో కూడా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అర్ద సెంచరీలు అతని ప్రపంచకప్ బెర్త్ ఆశలను సజీవంగా ఉంచాయి.ఇదే ఫామ్ను బాబర్ మరో ఐదారు మ్యాచ్ల్లో కొనసాగిస్తే ప్రపంచకప్ బెర్త్కు ఢోకా ఉండదు. ఇక్కడ బాబర్కు మరో సమస్య కూడా ఉంది. తాజాగా అతను రెండు అర్ద సెంచరీలు చేసినా, అవి పొట్టి ఫార్మాట్కు కావాల్సిన వేగంతో చేసినవి కావు. సిడ్నీ థండర్పై 42 బంతులు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్పై 46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. రెనెగేడ్స్పై బాధ్యతాయుత అర్ద సెంచరీతో మ్యాచ్ను గెలిపించినా, బాబర్లో మునుపటి వేగం లేదని స్పష్టంగా తెలిసింది.కాగా, బాబర్ హాఫ్ సెంచరీ, సీన్ అబాట్ (4-0-16-3) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా రెనెగేడ్స్పై సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరగులు చేసింది. జోష్ బ్రౌన్ (43), మెక్గుర్క్ (38), హసన్ ఖాన్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సిక్సర్స్ బౌలర్లలో అబాట్తో పాటు జాక్ ఎడ్వర్డ్స్, డ్వార్షుయిస్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో సిక్సర్స్ సైతం ఆదిలోన తడబడినప్పటికీ.. బాబర్-జోయెల్ డేవిడ్ (34 నాటౌట్) జోడీ సిక్సర్స్ను గెలిపించింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కొత్త సంవత్సరం వేళ : ఎల్వోసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. గురువారం పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ప్రమాదకరమైన పదార్థాలతో నిండిన బ్యాగ్ను భారత సైన్యం చ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవరహిత వైమానిక వాహనం భారత గగనతలంలోకి ప్రవేశించి ఐదు నిమిషాలకు పైగా ఉండి, చక్కన్ దా బాగ్ ప్రాంతంలోని రంగర్ నల్లా, పూంచ్ నది సమీపంలో దాని పేలోడ్ను పడవేసిందని అధికారులు తెలిపారు. ఇందులోఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఇడి), మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాలున్నాయని తెలిపారు.జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఖాదీ కర్మదా ప్రాంతంలో భారత భూభాగంలోకి పాకిస్తాన్కు చెందిన డ్రోన్ కొన్ని అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను జారవిడిచింది. ఇవి ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలను లేవనెత్తింది. ఇదీ చదవండి: స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి? A Pakistani drone crossed into Indian territory along the Line of Control (LoC) in Jammu and Kashmir’s Poonch, and dropped suspected explosive material, ammunition and narcotics, prompting massive search operations by security forces.Details.https://t.co/7eLEMRzdVp pic.twitter.com/EWCYJSedMm— Vani Mehrotra (@vani_mehrotra) January 1, 2026ify"> డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఖాదీ కర్మదా , పరిసర ప్రాంతాలలో విస్తృతమైన కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అదనంగా, భద్రతా దళాలు పఠాన్కోట్-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట కథువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్ జిల్లాల్లోని వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్మూ ప్రాంతం అంతటా భద్రతను పెంచిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు -
చైనాకు పాక్ ఉప ప్రధాని.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్దార్ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్లో జరుగుతాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆహ్వానం మేరకు దార్ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. -
జింబాబ్వే కెప్టెన్ ఇంట తీవ్ర విషాదం
జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్ల సికందర్ రజా పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రజా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. పాకిస్తాన్లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అప్పటికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఆల్రౌండర్గా అవతరించాడు. -
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
పాక్లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్మౌలానా ఫజలుర్రహ్మన్ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే... మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్... ఆఫ్గనిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్లోని తాలిబాన్ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్స్టాప్ పెట్టి ఆసిమ్ మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనగరల్ ఆసిమ్ మునీర్లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని... ఖేల్ ఖతమ్ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో... ఇప్పుడు మనం చూద్దాం.ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్ మునీర్కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్- ఆఫ్గాన్ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్ మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్ మునీర్ అనవసరంగా ఆఫ్గాన్పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. ఫజలుర్ రహ్మాన్ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్... పాక్ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పడం లేదు. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
ఇండియా-పాక్ వార్.. చైనా అక్కసు
ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించిందిఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు మద్ధతుగా నిలిచింది. పాక్కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. -
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉందితన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారుకానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.చట్టపరంగా చర్యలు తీసుకుంటాఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్రౌండర్.పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం.. -
ఆయుధంగా నదీ జలాలు!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. చదవండి: లాహోర్ లేడీ సింగానికి తప్పని ట్రోలింగ్ -
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) స్వదేశీ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. సూయ్ నార్త్రన్ గ్యాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరిట ఉండేది. ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్పై 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్ ఇంజమామ్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.అయితే, పాకిస్తాన్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉంది. సెహ్వాగ్ 2006లో జరిగిన లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.కాగా, యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు కే కింబర్ పేరిట ఉంది. ఇంగ్లండ్ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్ను సాధించాడు. షిన్వారి, కింబర్ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. హైదరాబాద్కు చెందిన తన్మయ్ అరుణాచల్ ప్రదేశ్పై 119 బంతుల్లో డబుల్ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లోనే డబుల్ పూర్తి చేశాడు. -
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్ ఉమెన్ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్ మీడియా..‘‘మేడమ్.. ఇది స్క్రిప్ట్ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్ టీవీ సిరీస్) కూడా ఇంత ఫాస్ట్గా కేసును సాల్వ్ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లాహోర్ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్ ప్రింట్ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..ఆవిడను ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్వై న్యూస్ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రాగా లిఫ్ట్ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్ ప్రకటించారు సదరు పాడ్కాస్ట్ వ్యాఖ్యాత.గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్కాస్ట్లో వివరించారు. డిఫెన్స్ ఫేస్ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది..కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్గా వెళ్లి ఎలా కేసును సాల్వ్ చేశారంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్(సీఐబీ సిరీస్ క్యారెక్టర్) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? అని ఒక యూజర్.. కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. అని మరో యూజర్ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని.. کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV— AliZai Vlogs (@alizaihere) December 21, 2025 -
భారత్ తరపున ఆడాడు.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
ప్రముఖ పాకిస్తాన్ అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ ఉబేదుల్లా రాజ్పుత్ నిషేధానికి గురయ్యాడు. అతను బహ్రెయిన్లో ఈ నెలారంభంలో జరిగిన ఓ ప్రైవేట్ టోర్నీలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. విదేశీ టోర్నీలో ఇలా ఆడాలంటే పాకిస్తాన్ కబడ్డీ సమాఖ్య (పీకేఎఫ్) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి.కానీ ఉబేదుల్లా మాత్రం ఎలాంటి ఎన్ఓసీ లేకుండానే బహ్రెయిన్ ఈవెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పీకేఎఫ్ అతని నిర్వాకంపై కన్నెర్ర జేసింది. ఉబేదుల్లాపై నిరవధిక నిషేధం విధించినట్లు పీకేఎఫ్ కార్యదర్శి రాణా సర్వార్ వెల్లడించారు.అయితే ఈ నిషేధంపై క్రమశిక్షణ కమిటీ ముందు అప్పీల్కు వెళ్లే హక్కు రాజ్పుత్కు ఉందని ఆయన చెప్పారు. ఈ నెలలో బహ్రెయిన్లో జీసీసీ కప్ టోర్నీ జరిగింది. ఇందులో ఉబేదుల్లా రాజ్పుత్ భారత జెర్సీ వేసుకొని, త్రివర్ణ పతాకంతో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీకేఎఫ్ చర్యలు చేపట్టింది.చదవండి: క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం! -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
పాకిస్థాన్ను వీడుతున్న మేథోసంపత్తి
పాకిస్థాన్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.గడిచిన 24 నెలలో పాకిస్థాన్లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది. -
పాక్ గుండెల్లో సిందూర్ 2.0 టెన్షన్
-
పాక్లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇప్పటికీ 20 లక్షల మందికి పైగా అఫ్గాన్లు నివసిస్తున్నారని ఐరాస శరణార్ధి విభాగం తెలిపింది. 2025లో 10 లక్షల మంది వరకు ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారంది. ఒక్క నవంబర్లోనే 1.71 లక్షల మంది అఫ్గానిస్తాన్కు వచ్చారని తెలిపింది.పాక్ అధికారులు చమన్, తోర్ఖామ్, బారాబ్చా బోర్డర్ పాయింట్ల మీదుగా మరో 37, 899 మందిని వెనక్కి పంపించి వేశారని పేర్కొంది. నవంబర్లో రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మానవతా సాయం పంపిణీపై ప్రభావం చూపాయని తెలిపింది. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటున్న అఫ్గాన్లను పంపించి వేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2023 సెపె్టంబర్ నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. స్వదేశంలో అస్థిర పరిస్థితులు, అణచివేత చర్యల కారణంగా వీరంతా పొరుగుదేశంలో తలదాచుకుంటున్నారు. -
ఆపరేషన్ సిందూర్ 2.0.. వణికిపోతున్న పాక్!
ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.సరిహద్దులో ప్రత్యేక నిఘాభారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్కు రావల్కోట్ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు. -
పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?.. రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది. అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. -
భారత్ కు మద్దతుగా పాక్ నేత కీలక వ్యాఖ్యలు
-
పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం సరైనదని పాక్ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Maulana Fazlur Rehman to Pakistan’s military regime:“If you justify attacking Afghanistan by claiming you are targeting your enemy there, then why do you object when India targets its enemy in Bahawalpur and Murid (inside Pakistan)?” pic.twitter.com/T91sdps611— Afghanistan Times (@TimesAFg1) December 23, 2025కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.ఇది కూడా చదవండి: భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే.. -
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ పూర్తి
ఇస్లామాబాద్:పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రైవేటీకరణలో విజయవంతంగా అమ్ముడుపోయింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఈ సంస్థను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 23, 2025) జాతీయ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించింది. ఈ ప్రక్రియలో మూడు సంస్థలు అరీఫ్ హబీబ్ గ్రూప్, లక్కీ సిమెంట్, ఎయిర్బ్లూ పోటీ పడ్డాయి. ప్రారంభ బిడ్డింగ్లో అరీఫ్ హబీబ్ రూ.115 బిలియన్, లక్కీ సిమెంట్ రూ.105.5 బిలియన్, ఎయిర్బ్లూ రూ.26.5 బిలియన్ ఆఫర్ చేశాయి. ప్రభుత్వ రిఫరెన్స్ ధర రూ.100 బిలియన్గా నిర్ణయించబడింది. చివరి దశలో ఓపెన్ ఆక్షన్లో అరీఫ్ హబీబ్ తన ఆఫర్ను పెంచుతూ 135 బిలియన్ రూపాయల వద్ద విజయం సాధించింది.ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం పీఐఏలోని 75శాతం షేర్లు అరీఫ్ హబీబ్ గ్రూప్కు బదిలీ అవుతాయి. మిగిలిన 25శాతం షేర్లను కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఇవ్వబడింది.గత కొన్ని ఏళ్లేగా పీఐఏ భారీ నష్టాల్లో ఉంది. మిస్మేనేజ్మెంట్, ఆర్థిక సమస్యలు, సేవా ప్రమాణాల లోపం కారణంగా ఈ సంస్థను నిలబెట్టడం కష్టమైంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ జాతీయ విమానయాన సంస్థను పునరుద్ధరించడమే ఈ ప్రైవేటీకరణ లక్ష్యంగా పాక్ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 బిలియన్ అదనపు పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా విమానయాన సేవలను మెరుగుపరచడం, ఆధునీకరణ చేయడం, అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా పీఐఏను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కాగా, పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ అమ్మకం దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక మలుపు. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఆధ్వర్యంలో పీఐఏ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. -
'ధురంధర్' కలెక్షన్స్లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్డ్రాప్లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఈ సినిమాని పాకిస్థాన్లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits"Kam se kam yeh toh theek karwa lein"🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025 -
ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు
బలూచిస్తాన్లో ఇంతవరకూ తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు.. ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్కు బలి అవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి, న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీ సంద్రంగా మార్చివేస్తున్నాయి. గతంలో బలూచ్ సంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి (హెచ్ఆర్సీబీ)నివేదిక ప్రకారం.. మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా, బలూచ్ ప్రతిఘటనను అణచివేయడమే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.హెచ్ఆర్సీబీ వెల్లడించిన కేసుల్లో కొన్ని..గుల్జాది.. ఒకే ఏడాదిలో మూడుసార్లు వేధింపులు.. మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్జాది జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025, ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటిడి బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో రెండుసార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు.. చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3-MPO (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద జైలులో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్ఆర్సీబీ పేర్కొంది.మహజబీన్ బలోచ్.. విద్యార్థిని అని కూడా చూడకుండా.. యూనివర్శిటీ ఆఫ్ బలూచిస్తాన్లో బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చదువుతున్న 24 ఏళ్ల మహజబీన్, 2025, మే 29న క్వెట్టా సివిల్ హాస్పిటల్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అర్ధరాత్రి మూడు గంటలకు హాస్టల్ గదుల్లోకి చొరబడిన బలగాలు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాయో నేటికీ వెల్లడి కాలేదు. బలూచ్లో విద్యార్థినులకు కూడా రక్షణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.రొబినా బలోచ్.. ఆరోగ్య కార్యకర్తపై అమానుషం.. 2025, జూన్ 30న టర్బత్లోని ఓవర్సీస్ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ హెల్త్ విజిటర్ రొబినా ఇంటిని ఫ్రాంటియర్ కార్ప్స్ ధ్వంసం చేసింది. ఆమెను ఎటువంటి కారణం లేకుండా అపహరించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసి విడుదల చేశారు.సఫియా బీబీ.. సామూహిక శిక్షకు బలి2025, అక్టోబర్ 5న ఖుజ్దార్లోని జెహ్రీలో భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. ఆ ఊరంతా కర్ఫ్యూ విధించి, ఇంటింటిలో సోదాలు చేసిన బలగాలు సఫియా బీబీని రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రామాన్ని మొత్తం ముట్టడించి భయాందోళనకు గురిచేయడంలో భాగంగానే ఈ అపహరణ జరిగింది.నజియా షఫీ.. కస్టడీలో మృతి..2025, అక్టోబర్ 28న పంజ్గూర్లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా నిలిచింది. తల్లి పారి బలోచ్, కుమార్తె నజియాలను పాక్ బలగాలు తుపాకీతో బెదిరించి తమతో పాటు తీసుకెళ్లాయి. మరుసటి రోజు నజియాను తీవ్ర గాయాలతో ఆసుపత్రి సమీపంలో పడేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది నేరుగా ప్రభుత్వ కస్టడీలో జరిగిన హత్యేనని హెచ్ఆర్సీబీ చెబుతోంది. మృతురాలి తల్లి పారి బలోచ్ కూడా బలగాల చేతుల్లో చిత్రహింసలకు గురైన తర్వాత విడుదలైంది.నస్రీన్.. 15 ఏళ్ల బాలిక అదృశ్యం అవరాన్కు చెందిన నస్రీన్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికను నవంబర్ 22న హబ్ చౌకీ వద్ద అపహరించారు. సిటిడి, మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు ఆమెను అపహరించాయి. చిన్నపిల్లలపై ఈ తరహా దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.ఫర్జానా జెహ్రీ.. బహిరంగంగా కిడ్నాప్ 2025, డిసెంబర్ 1న ఖుజ్దార్లో ఆసుపత్రి నుండి వస్తున్న ఫర్జానాను దారి మధ్యలో పాక్ బలగాలు అపహరించాయి. ఇది జరిగింది ఎక్కడో గదుల్లోనే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసింది.రహిమా: గృహిణులు కూడా టార్గెట్ 2025, డిసెంబర్ 9న దల్బందిన్లో 20 ఏళ్ల గృహిణి రహిమాను, ఆమె 18 ఏళ్ల తమ్ముడిని అర్ధరాత్రి దాడుల్లో భాగంగా తీసుకెళ్లారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.చట్టం కనుమరుగు.. అణచివేత రాజ్యంపాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 (వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 10 (నిర్బంధంపై రక్షణ), ఆర్టికల్ 14 (మానవ గౌరవం)లను భద్రతా సంస్థలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థల, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఏమాత్రం గౌరవించడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని, చివరకు గృహిణులను కూడా వదలని ఈ నిరంకుశ పోకడలు బలూచిస్తాన్ను ఒక బహిరంగ జైలుగా మారుస్తున్నాయి. జవాబుదారీతనం లేని బలూచ్లో న్యాయం కనుమరుగవుతోంది. ఈ దుర్భర స్థితిపై అంతర్జాతీయంగా వచ్చే స్పందన కోసం వివిధ మానవహక్కుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం -
ఆపరేషన్ సిందూర్పై మునీర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్కు దైవిక సహాయం లభించిందని ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే నెలలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల సమయంలో తమ సైన్యానికి ఏదో అదృశ్య శక్తి తోడు అందించిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంలో ‘జిహాద్’ అంశంపై మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇస్లామిక్ దేశంలో ప్రభుత్వం లేదా అధికారం ఉన్న పాలకుల అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా జిహాద్కు ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు తాముగా ఫత్వాలు జారీ చేయడం చెల్లదని అన్నారు. మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల రక్షకులుగా ఉండే గౌరవం దేవుడు తమకే ఇచ్చారని ఈ సందర్భంగా మునీర్ పేర్కొన్నారు.పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్కు అసిమ్ మునీర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్లోకి చొరబడి దాడులకు తెగబడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)గ్రూపుల్లో 70 శాతం మంది ఆఫ్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రజల రక్తాన్ని కోరుతున్న వారికి మద్దతు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. భారతదేశంతో జరిగిన ఆ నాలుగు రోజుల సైనిక ఘర్షణ ముగిసిన తీరును ఆయన విశ్లేషించారు. మే 10న కుదిరిన ఒప్పందంతో సైనిక చర్యలు నిలిచిపోయినప్పటికీ, నాడు పాకిస్తాన్కు ఎదురైన గడ్డు పరిస్థితుల నుండి దైవ కృపే రక్షించిందని అన్నారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ -
తీరు మార్చుకోకుంటే.. బంగ్లాదేశ్కు దబిడి దిబిడే..!
బంగ్లాదేశ్.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్గా మహ్మద్ యూనస్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగెన ఉన్న భారత్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. గతంలో భారత్ చేసిన త్యాగాన్ని మరిచి మరీ బంగ్లాదేశ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ది కీలక పాత్ర అనేది చరిత్రను అడిగితే చెబుతుంది,. మరి అటువంటిది బంగ్లాదేశ్ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. నిశితంగా గమినిస్తున్న భారత్..కొంతకాలం క్రితం మహ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉన్న సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్ తెగ ఆరాటపడిపోతంది. ఆ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురి నేతల వెంట కూడా వస్తుంది. ఈ వ్యవహారాల్ని గమనిస్తు ఉన్న భారత్.. వారి వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది. ఒకనాడు పాకిస్తాన్కు మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్.. బంగ్లాదేశ్ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్.. ‘వారి వెనుక ఎవరున్నారు’ అనే విషయంపై కన్నేసి ఉంచింది. గతంలోనే ప్రధాని మోదీ వార్నింగ్..!ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహ్మద్ యూనస్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ నాల్గో తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ఆనాడు యూనస్ ఏమన్నారంటే..ఏప్రిల్ మొదటి వారంలో యూనస్.. భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశారు. సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూసఫ్ తెగ తంటాలు పడిపోతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. భారత్పై మరోసారి పరోక్షంగా అక్కసు..శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నముహమ్మద్ యూనస్..హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు. అంటే భారత్పై పరోక్షంగా యూనస్ వ్యాఖ్యానించట్లైంది. భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్గా హాది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశీయుల అనుసరిస్తున్నారని యూనస్ అంటున్నారు. అంటే ఆ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరో చోటా నేత సైతం..బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.పాక్ను మోకరిల్లేలా చేసిన వేళను మరిచారా?1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. సుమారు 300,000 నుండి 3,000,000 మంది వరకు బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా. పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 200,000 నుండి 400,000 వరకూ అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు. ఆనాడు భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహోసపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్ ఆటనును 13 రోజుట్లోనే కట్టించింది. డిసెంబర్ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్పై సాధించిన విజయంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్గా మారింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాక్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగబాటుగా కూడా రికార్డులెక్కింది. పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్ ఇంతటి త్యాగం చేస్తే.. మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదువ్వడానికి సిద్దం కావడం. ఒకటైతే.. అప్పుడ పాకిస్తాన్కు ఎదురైన అతి పెద్ద పరాభవం.. నేటి బంగ్లాదేశ్ ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే. -
టీమిండియాకు ఘోర పరాభవం
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది. ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మిన్హాస్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. గత ఎడిషన్లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. -
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. అహ్మద్ హుసేన్ (56) సమీర్కు అండగా నిలిచాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.చివరి మూడు ఓవర్లలో పాక్ టెయిలెండర్లు నికాబ్ షఫీక్ (12 నాటౌట్), మొహమ్మద్ సయ్యమ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్.. 17 ఏళ్ల జైలు శిక్ష
-
పాక్ పరువు తీస్తున్న అరబ్ కంట్రీస్
అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఇమేజ్ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్ దేశం అజర్ బైజాన్ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.హెచ్చరించినా కూడా.. 2024లో సౌదీ అరేబియా పాక్కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్ పౌరులపై వీసా పరిమితులు విధించింది. అరబ్ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం. వేల మంది ముఠాగా..ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది. మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్కు చెందిన డాన్ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం. ఈ పరిణామాలపై ఎఫ్ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్వర్క్ల వల్ల పాక్ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. -
చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు
అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్హౌస్కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్హౌస్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్కి అవసరమైంది. పైగా.. ట్రంప్కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్ను టార్గెట్గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్ను వైట్హౌస్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్లో కూడా ఆసిమ్ మునీర్పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!పాకిస్థాన్లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. - హెచ్.కమలాపతిరావుఇదీ చదవండి:చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..! -
నితీశ్ కుమార్కు పాక్ గాంగ్స్టర్ బెదిరింపులు, డీజీపీ స్పందన
పట్నా: హిజాబ్ వివాదంలో చిక్కుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు సంబంధించి ఒక బెదిరింపు వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటపై కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. నితీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, నితీశ్ మానసిక స్థితిపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బిహార్ సీఎం వెంటనే ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అని నటి జైరా వసీం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నితీష్ కుమార్కు పాకిస్తాన్కు చెందిన ఒక గ్యాంగ్స్టర్ ద్వారా సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ముస్లిం మహిళతో నితీష్ ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ భట్టి సదరు మహిళకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం తగదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.ఈ వీడియోపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వినయ్కుమార్ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించమని పట్నా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను కోరినట్లు చెప్పారు. ఇంతకుమించి ప్రస్తుతానికి వివరాలేమీ లేవంటూ, తదుపరి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు, ఈ వీడియోపై అధికారిక విచారణ అనంతరం, బెదిరింపులను పరిశీలిస్తామన్నారు. VIDEO | Hijab incident: On a Pakistan-based gangster allegedly issuing video threat to Bihar CM Nitish Kumar, Bihar DGP Vinay Kumar says, "The social media post is being investigated at the level of the IG, Patna. As of now, no immediate details are available."(Full video… pic.twitter.com/eQ4s3pOJ49— Press Trust of India (@PTI_News) December 17, 2025; కాగా పట్నాలో ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా ఒక మహిళా డాక్టర్ హిజాబ్ను (Hijab) దించి మరీ ముఖాన్ని చూడటంపై దుమారం రేపింది.ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా? -
పాక్ మరో దుశ్చర్య.. 40 ఏళ్ల ఆఫ్ఘన్ శిబిరాల మూసివేత
పెషావర్: పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయమిస్తున్న 42 శరణార్థి శిబిరాలను మూసివేస్తున్నట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అధికారికంగా ప్రకటించింది. 1979లో సోవియట్ యూనియన్.. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిన దరిమిలా లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్కు వలస వచ్చారు. సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా దశాబ్దాలుగా ఈ వలసదారులకు ప్రధాన ఆశ్రయ కేంద్రంగా ఉంటూ వస్తోంది.దాదాపు 45 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శిబిరాలను మూసివేయడం వెనుక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రావిన్స్లో శరణార్థుల నివాస వ్యవస్థను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించడమే ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో చట్టవిరుద్ధంగా, ఎటువంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి, శిబిరాల నుండి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.శిబిరాల మూసివేత ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా రెండు దశల్లో నిర్వహించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మొదటి దశలో భాగంగా వలసదారుల వివరాలను సేకరించి, రెండో దశలో శిబిరాల ఖాళీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వారికి ఈ హఠాత్ నిర్ణయం పెను సవాలుగా మారింది. క్రమబద్ధీకరణ పేరుతో తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.మరోవైపు ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శిబిరాల మూసివేత కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే, శరణార్థుల పునరావాసం, కనీస అవసరాల విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే మానవతా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇంటింటికీ చౌక అణు విద్యుత్.. భద్రత గాలికి? -
చైనా-పాక్ కటిఫ్..! కారణాలు తెలిస్తే షాకవుతారు..!!
-
చైనా-పాకిస్థాన్కు మధ్య చెడింది ఇక్కడే..!
‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్కు ధీటుగా పాకిస్థాన్ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్కు చైనా వెన్నంటే ఉంది.చైనా-పాకిస్థాన్ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్ను గుడ్డిగా నమ్మేసింది..!అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!-హెచ్.కమలాపతిరావు 👉ఇదీ చదవండి:చిక్కుల్లో ఆసిమ్ మునీర్.. పాక్-అమెరికా స్నేహానికి చెల్లు -
ట్రంప్తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భేటీ?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాల అప్గ్రేడ్ కోసం పాకిస్థాన్కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. ఈ చర్య భారత్ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. ఈ డీల్కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు. -
ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం!
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??.. పీటీఐ వర్గాలు, ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్బాజ్ షరీఫ్ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?.. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్ ఖాన్ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్ సెల్లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది. ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్ ఖాన్ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కుట్ర ఉందనేది ఖాన్ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్కు కేటాయించిన ఖైదీ నెంబర్) కనిపిస్తున్నాయి.నాటి నుంచి.. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్ అసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.ములాఖత్లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్ కెనన్లతో చెదరగొట్టారు.భారత్ రియాక్షన్ ఇదే..ఇమ్రాన్ ఖాన్ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు. ఖాన్ కొడుకులు లండన్లో..ఇమ్రాన్ ఖాన్కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్స్మిత్ బ్రిటిష్ జర్నలిస్గ్. 1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్ను ఖాన్ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. 2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్తో పాటు అరెస్ట్ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
విజయ్ దివస్ 2025: పాక్ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..
1971 డిసెంబర్ 16.. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత సైన్యం అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి, 13 రోజుల ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాక్పై చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ 16న యావత్ భారతదేశం విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత సైన్యం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సాయుధ దళాల ధైర్యసాహసాలను దేశంలోని ప్రజలు ఈ రోజున గుర్తుచేసుకుంటారు.సైనిక అణచివేతపై పోరాటం..1971 యుద్ధానికి మూలం తూర్పు పాకిస్థాన్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. పశ్చిమ పాకిస్తానీ సైన్యం అక్కడ తీవ్రమైన సైనిక అణచివేతకు పాల్పడింది. తూర్పు పాకిస్తానీ పౌరులు హింసను ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, శరణార్థుల సంక్షోభం తీవ్రమవడంతో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తూర్పు పాకిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారతదేశం రంగంలోకి దిగింది. ఈ జోక్యం 1971 డిసెంబర్ 3 నాటికి సైనిక సంఘర్షణగా మారింది.జనరల్ అమీర్ అబ్దుల్లా లొంగుబాటుభారత సాయుధ దళాలు.. తూర్పు పాకిస్తాన్లోని ముక్తి బాహిని (విముక్తి దళాలు) సహకారంతో, సమిష్టిగా పనిచేస్తూ, పాకిస్తానీ సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 1971, డిసెంబర్ 16న పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత సైన్యం, ముక్తి బాహిని సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. అలాగే సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను వీడారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటి. ఈ యుద్ధం తూర్పు పాకిస్థాన్కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.దేశం కోసం ప్రాణాలర్పించి..ఈ అద్భుతమైన విజయం ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. అయితే ఈ గెలుపునకు భారత్ భారీ మూల్యం చెల్లించింది. దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మరెందరో గాయపడ్డారు. విజయ్ దివస్ అనేది కేవలం విజయాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాదు.. నాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు నివాళులు అర్పించే రోజు ఇది. భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, సరిహద్దుల వద్ద మనలను రక్షించే సైనికులను గౌరవించాల్సిన అవసరాన్ని విజయ్ దివస్ గుర్తుచేస్తుంది. ఈ రోజును భారతదేశం అంతటా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో గల అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.నిరంతర స్ఫూర్తిదాయకంభారత్-బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను ప్రతిబింబించేలా 20 మంది సభ్యుల బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం భారతదేశంలో జరిగే విజయ్ దివస్ వేడుకలకు హాజరుకానుంది. ఈ బృందంలో 1971 యుద్ధ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది ముక్తిజోధాలు (విముక్తి యోధులు), బంగ్లాదేశ్ సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యువ తరానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించడం. స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి అని, దానిని నిరంతరం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఈ రోజు పునరుద్ఘాటిస్తుంది. ఇది కూడా చదవండి: విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు -
విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ‘మన చరిత్రలో గర్వించదగిన క్షణం’ అని ఈ విజయాన్ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత సైనికుల అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని,ఈ విజయం తరతరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. On Vijay Diwas, we remember the brave soldiers whose courage and sacrifice ensured India had a historic victory in 1971. Their steadfast resolve and selfless service protected our nation and etched a moment of pride in our history. This day stands as a salute to their valour and…— Narendra Modi (@narendramodi) December 16, 2025రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ చారిత్రక దినాన్ని పురస్కరించుకుని సాయుధ దళాలకు నివాళులు అర్పించారు. 1971లో దేశానికి విజయాన్ని అందించిన సైనికులకు దేశమంతా కృతజ్ఞతతో నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ వ్యూహాత్మక సంకల్పాన్ని ప్రతిబింబించిందని, సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించిందని అన్నారు. వారి శౌర్యం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తి మన జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో పేర్కొన్నారు.1971, డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 16 వరకు భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇది ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగిపోవడంతో డిసెంబర్ 16ను విజయ్ దివస్గా ప్రకటించారు. అదే రోజున 93 వేల మందికి పైగా పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. ఇది ఆధునిక సైనిక చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాట్లలో ఒకటిగా నిలిచింది.ఇది కూడా చదవండి: హఠాత్తుగా ఆగిన కేబుల్ కార్.. తుళ్లిపడిన ప్రయాణికులు! -
ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్
పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్ మునీర్కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్, లడఖ్ భారతదేశానికి విడదీయరాని భాగాలు. వాటిపై పాకిస్థాన్కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్పై ఉగ్రదాడులు జరిపింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. VIDEO | New York: Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish (@AmbHarishP), delivered India's statement at the Open Debate on ‘Leadership for Peace’ in the UN Security Council."India had entered into the Indus Waters Treaty, 65 years ago, in… pic.twitter.com/hMRWESj0xQ— Press Trust of India (@PTI_News) December 16, 2025 -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: అండర్–19 ఆసియాకప్లో ఘనవిజయంతో బోణీ కొట్టిన యువ భారత జట్టు ఆదివారం దాయాది పాకిస్తాన్తో అమీతుమీకి సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని యంగ్ ఇండియా భావిస్తోంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్ షేక్’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో భారత జట్టు 234 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి మంచి జోష్లో ఉంది. ఐపీఎల్ సహా సీనియర్ స్థాయిలో ఆడిన పలు టోర్నమెంట్లలో సెంచరీలతో విజృంభించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. యూఏఈతో పోరులో అతడు 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్స్లతో 171 పరుగులు చేసి అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కూడా అతడు అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైస్కెపె్టన్ విహాన్ మల్హోత్రాతో పాటు హైదరాబాద్ ఆటగాడు ఆరోన్ జార్జి మంచి టచ్లో ఉన్నారు. వీరంతా సమష్టిగా సత్తాచాటితే పాకిస్తాన్కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 297 పరుగుల తేడాతో మలేసియాపై గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరీహోరీ ఖాయమే! -
పాకిస్థాన్కు.. అమెరికా మరో వరం
జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.నిజానికి ఆపరేషన్ సిందూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్కు పంపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు.సరే.. పాకిస్థాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్థాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..!-హెచ్.కమలాపతి రావు -
పాక్ వర్సిటీలో సంస్కృతం కోర్సు.. భగవద్గీత, మహాభారతం పాఠాలు!
పాకిస్థాన్లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్కు చెందిన ప్రాచీన భాష సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు.. మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. దేశ విభజన తర్వాత సంస్కృతం పాక్లో అడుగపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (LUMS) ఈ భాషతో పార్ట్టైం కోర్సును ప్రారంభించింది. అంతకు ముందు.. మూడు నెలలుగా వారాంతపు వర్క్షాప్ కోర్స్గా ప్రవేశపెట్టగా.. అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్తాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది. ఫార్మన్ క్రిస్టియన్ కాలేజ్లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డా. షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన.. ఏడాదిపాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం కేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రుపెల్, ఆస్ట్రేలియన్ ఇండాలజిస్ట్ మెక్కామస్ టేలర్ వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందారు.‘‘ప్రాచీన భాషల్లో మానవజాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందినది. పాణిని గ్రామం ఇక్కడే ఉంది. ఇది ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. అందు కోసమైనా మేం కచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందినది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే.. పాకిస్తాన్లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే.. భాషలనేవీ అడ్డంకులు కాకుండా వంతెనలుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది’’ అని రషీద్ అంటున్నారు.సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని గంధార ప్రాంతంలో నివసించారు. ఆ గంధార ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్గా ఉంది.విద్యార్థులు మొదట సంస్కృతాన్ని కఠినంగా, కష్టంగా భావించారు. కానీ కొద్దికాలానికే అర్థం చేసుకోగలిగారు. ఉర్దూ భాషపై సంస్కృతం ఎంత ప్రభావం చూపిందో వారికి కొత్తగా తెలిసింది. కొంతమంది విద్యార్థులు సంస్కృతం హిందీకి భిన్నమని కూడా తెలియదు అని ప్రొఫెసర్ రషీద్ చెబుతున్నారు. హిందీ మహాభారత్ టీవీ సిరీస్ థీమ్ సాంగ్ అయిన “హై కథ సంగ్రామ్ కి” (మహాభారత టీవీ సిరీస్ థీమ్) యొక్క ఉర్దూ అనువాదాన్ని కూడా నేర్చుకుంటున్నారట. గుర్మాని సెంటర్ డైరెక్టర్ డా. అలీ ఉస్మాన్ ఖాస్మీ చెబుతున్నది ఏంటంటే.. పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృతం పామ్-లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్ పెద్ద కలెక్షన్ ఉంది. 1930లలో జేసీఆర్ వూల్నర్ వాటిని కేటలాగ్ చేశారు. కానీ 1947 తర్వాత పాకిస్తానీ అకాడెమిక్లు వాటిని ఉపయోగించలేదు. అయితే ఇప్పుడు స్థానిక పండితులను శిక్షణ ఇవ్వడం వల్ల పరిస్థితి మారుతుందని అన్నారు. లాహోర్ వర్సిటీ భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీతపై కోర్సులు ప్రారంభించాలనుకుంటోంది. మరో 10–15 ఏళ్లలో పాకిస్తాన్లో భగవద్గీత, మహాభారతంపై అధ్యయనాలు చేసే రీసెర్చర్లు కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని. -
పాకిస్థాన్ ప్రధానికి అవమానం
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్కు ఘోర పరాభవం ఎదురైంది. తుర్కిస్థాన్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడానికి ఆయన దాదాపు 40 నిమిషాలు ఎదురుచూశారు. అయినప్పటికీ పుతిన్ కలవకపోవడంతో షెహబాజ్ పుతిన్ ఉన్న ప్రదేశానికి నేరుగా వెళ్లాడు. దీంతో పాకిస్థాన్ అధ్యక్షుడిపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్- అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తరచుగా పాకిస్థాన్ని పొగుడుతూ వారిని బుట్టులో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం ఆ దేశ ప్రధాని షెహబాజ్తో పాటు ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్తోనూ నేరుగా చర్చలు జరిపారు. అంతేకాకుండా పాకిస్థాన్ను దక్షిణాసియాలో అవసరమైన మిత్రుడు అని గతంలో అభివర్ణించాడు. ఇదే సమయంలో భారత్తో ట్రంప్ డిస్టెన్స్ పెంచాడు. భారత్పై అధిక పన్నులు విధించడంతో పాటు ఆపరేషన్ సిందూర్ తానే ఆపానంటూ ప్రేలాపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. అయితే భారత్కు ఎల్లవేళలా నమ్మదగిన మిత్రుడిగా ఉండే రష్యా ఇప్పుడు పాక్కు చిన్న ఝలక్ ఇచ్చింది.తుర్కిస్థాన్లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సమ్మిట్లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశానికి వెళ్లాడు. ఆ పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడితో పుతిన్ భేటీ జరగాల్సి ఉంది. కాగా ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్తో పుతిన్ సమావేశంలో ఉన్నారు. దీంతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రితో కలిసి పుతిన్ను కలవడానికి ఎదురుచూశారు.దాదాపు 40 నిమిషాలపాటు వేచి చూసినప్పటికీ భేటీ ముగియకపోవడంతో షెహబాజ్ అసహానానికి గురయ్యారు. దీంతో పుతిన్ చర్చలు జరుపుతున్న ప్రాంతానికి నేరుగా వెళ్లాడని అక్కడ కొద్ది సేపు ఉన్న అనంతరం షెహబాజ్ తిరిగి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలవుతోంది. పుతిన్ సమయాన్ని వృథా చేసుకోరు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ట్రంప్ కూడా అలానే చేశారని మరో యూజర్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. పుతిన్కు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ స్వయంగా వెళ్లారు. అంతేకాకుండా పుతిన్ తనకు మిత్రుడని సంభోదించారు. -
12 భాగాలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్లో విభజన అనగానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభజన మాట బాగా వినబడుతోంది. అయితే ఈ విభజన వేరే రకమైనది. పాకిస్తాన్ జాతీయ సమాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ ఇటీవల చేసిన ప్రకటనతో విభజన చర్చ ఊపందుకుంది. దేశంలో చిన్న ప్రావిన్సుల ఏర్పాటు ఇప్పుడు ఖాయమని ఆయన చేసిన ప్రకటన పాక్లో సంచలనంగా మారింది. అయితే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారని జియో టీవీ నివేదించింది. అయితే ప్రావిన్సులను విభజించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు అంటున్నారు.పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్స్లను విడగొట్టి 12 చేయడానికి రంగం సిద్ధమైందని స్థానికి మీడియా సమాచారం. ఈ మేరకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య తుది చర్చలు జరిగాయని.. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. 1947 నాటికి పాకిస్తాన్లో ఐదు ప్రావిన్సులు ఉన్నాయి. అవి తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (NWFP), బలూచిస్తాన్. 1971 విముక్తి యుద్ధం తర్వాత తూర్పు బెంగాల్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని బంగ్లాదేశ్ ఏర్పడింది. పశ్చిమ పంజాబ్.. పంజాబ్ అయింది. వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరును ఖైబర్ పఖ్తుంఖ్వాగా (Khyber Pakhtunkhwa) మార్చారు. సింధ్, బలూచిస్తాన్ పేర్లు అలాగే ఉన్నాయి.ఎందుకీ విభజన?పరిపాలనా సౌలభ్యం కోసమమే చిన్న ప్రావిన్సుల ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పాకిస్తాన్ పాలకులు చెబుతున్నా అందుకు భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉద్రిక్తతలు పెరిగాయి. తమను స్వతంత్ర దేశాలుగా ప్రకటించాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు పోరాడుతున్నారు. మరోవైపు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ హైబ్రిడ్ పాలనపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విభజన చర్చ తెరపైకి వచ్చింది. దీంతో పాకిస్తాన్లో సెమినార్లు, మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.ఒక్కోదాన్ని మూడుగా విభజిస్తాంషెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ (IPP) నాయకుడు అబ్దుల్ అలీమ్ ఖాన్ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నింటిలోనూ అనేక చిన్న ప్రావిన్సులు ఉన్నాయని అన్నారు. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి అదనంగా మూడు ప్రావిన్సులు చొప్పున ఏర్పాటు అవుతాయని వెల్లడించారు. పరిపాలనా నియంత్రణను బలోపేతం చేయడానికి, పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ఇది సహాయపడుతుందని ఆయన చెప్పినట్టు జియో టీవీ తెలిపింది.మేం ఒప్పుకోంషెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం సింధ్ విభజనను వ్యతిరేకిస్తోంది. తమ ప్రావిన్స్ను విభజించడానికి లేదా మూడు ముక్కలు చేయడానికి తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని సింధ్ ముఖ్యమంత్రి, పీపీపీ నాయకుడు మురాద్ అలీ షా (Murad Ali Shah) గత నెలలో కుండబద్దలు కొట్టారు.12కు పెరగనున్న ప్రావిన్సులుదేశంలోని ఒక్కో ప్రావిన్స్ను మూడు భాగాలుగా చేయాలని పాకిస్తాన్ యోచిస్తున్నట్టు స్థానిక మీడియా సమాచారం. నాలుగు ప్రావిన్సులను విడగొట్టి 12కు పెంచేలా పాక్ సర్కారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్ ఉత్తర పంజాబ్, మధ్య పంజాబ్, దక్షిణ పంజాబ్గా విభజించబడుతుంది. సింధ్ ప్రావిన్స్ కరాచీ సింధ్, మధ్య సింధ్, ఎగువ సింధ్లుగా విభజించబడుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా మూడు భాగాలవుతుంది. వీటిని ఉత్తర, దక్షిణ, గిరిజన ఖైబర్ పఖ్తుంఖ్వాగా పరిగణిస్తారు. అదేవిధంగా, బలూచిస్తాన్ (Balochistan) కూడా తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రావిన్సులుగా మారుతుంది.కొత్త సమస్యలు ఖాయంప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రావిన్సులను విభజించడం వలన ప్రయోజనం ఉండదని మేధావులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాలనలోని అంతరాలను తొలగించకుండా ఏం చేసినా నిష్ఫలమన్నారు. బలహీనమైన సంస్థలు, అసమాన చట్ట అమలు, పేలవమైన స్థానిక పాలన అనేవి నిజమైన సమస్యలన.. వీటిని నివారించకుండా కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయడం వల్ల అసమానతలు మరింత తీవ్రమవుతాయని వెటరన్ పోలీసు ఉన్నత అధికారి సయ్యద్ అక్తర్ అలీ షా అభిప్రాయపడ్డారు.తిరుగుబాటు తప్పదుపరిపాలనా పునర్నిర్మాణంతో గతంలో చేసిన ప్రయోగాలు సమస్యలను మరింత పెంచాయని పాకిస్తాన్కు చెందిన మేధావి సంఘం పిల్దాట్ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ మెహబూబ్ పేర్కొన్నారు. కొత్త ప్రావిన్సులను సృష్టించడం అనేది ఖరీదైన, సంక్లిష్టమైన, రాజకీయంగా మోసపూరితమైనదిగా డాన్ పత్రికలో రాసిన తన వ్యాసంలో వర్ణించారు. ఇప్పుడు చేయాల్సింది విభజన కాదని, రాజ్యాంగానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం.. బ్రిటిష్ తరహాలో విభజించు- పాలించు విధానాన్ని అనుసరిస్తున్నాయని మరికొందరు విమర్శించారు. ఇలాంటి చర్యలతో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.పాకిస్తాన్లో మరిన్ని ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ముందుకు తీసుకురావడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిది కూడా కాకపోవచ్చు. కానీ గత ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి ప్రతిపాదనకు ప్రధానమంత్రి షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ, సింధ్ ఆధారిత ముత్తహిదా క్వామి మూవ్మెంట్-పాకిస్తాన్ (MQM-P) పార్టీలతో పాటు పలువురు మేధావులు మద్దతుగా నిలవడం గమనార్హం. -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!
రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్ను నెగెటివ్గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది. -
పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్కు షాక్, 14 ఏళ్ల జైలు
పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు, సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్ దుర్వినియోగం చేశారని సైనిక కోర్టు విశ్వసించింది. కోర్టు ప్రతి అభియోగంపై హమీద్ను దోషిగా నిర్ధారించింది. దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణFGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు -
ఒక నోట్ల కట్ట.. డజను ఎంపీలు
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఒక సంఘటన, ’నవ్వుకు నోబెల్ బహుమతి’ ఉంటే.. అది పాకిస్తాన్ పార్లమెంటుకే దక్కేదని నిరూపించింది. స్పీకర్ అయజ్ సాదిక్ గారు, పార్లమెంటు ఫ్లోర్పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు. అందులో ఏకంగా 10.. రూ.5,000 పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16,500 విలువ అన్నమాట. ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే రెండు బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతుంది. నోట్లు పది.. చెయ్యెత్తింది డజను మంది స్పీకర్ సాదిక్.. ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు. అయితే, అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేకపోయారు. ‘ఎవరి డబ్బు ఇది? దయచేసి చేయి ఎత్తండి!’.. అని ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. ఆయన నోటి మాట పూర్తి కాకముందే, అదో కబాబ్ దొరికినట్లు.. ఒక్క సెకన్లో 12 మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు. ఎంపీల వేగం చూసి స్పీకర్ గారికి నోట మాట రాలేదు. ‘నోట్లు ఉన్నది పదే. మరి యజమానులు ఏకంగా పన్నెండు మందా??’.. అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. పాకిస్తాన్కు చెందిన ఆజ్ టీవీ కథనం ప్రకారం, ఆ డబ్బు దాని నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చేరింది. ఆయన అసెంబ్లీ కార్యాలయం నుండి ఆ మొత్తాన్ని అందుకున్నారు. తలంటిన పాకిస్తానీలు సోషల్ మీడియాలో తెగ వైరలైన ఈ వీడియోపై చాలా మంది పాకిస్తానీలు తమ చట్టసభ సభ్యుల వైఖరిని ఛీత్కరించుకున్నారు. ఆ నోట్లు తమవేనని చేతులెత్తిన 12 మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు. ‘స్పీకర్ షరీఫ్ సోదరుల నుండి వచ్చిన 25 మిస్డ్ కాల్స్ గమనించలేదు’.. అని మహ్నూర్ ఆసిఫ్ వెటకారంగా ట్వీట్ చేశాడు. మరొకరు ‘ఎంపీలు లక్షల్లో జీతాలు, ప్రోత్సాహకాలు తీసుకుంటారు, అయినా వారి పరిస్థితి ఇదే’.. అని ట్వీట్ చేశారు. పార్లమెంటులో దొరికిన డబ్బులు కూడా అప్పుగా తీసుకొచి్చనవేమో అని పాకిస్తానీలు వెటకారంగా వ్యాఖ్యానించడం మరో హైలైట్. రజియా సుల్తాన్ అనే ఫేస్బుక్ యూజర్ నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను ఇందులోకి లాగారు. ‘పీఎంఎల్ఎన్ చాలా పేద పార్టీ. స్పీకర్ వారికి ఆ డబ్బు ఇవ్వాల్సింది.. అది మరియం నవాజ్ సన్నబడేందుకు సహాయపడుతుంది’.. అని పోస్టు చేశారు. మొత్తానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నడుస్తుంటే, పార్లమెంటు సభ్యులు మాత్రం ఫ్లోర్పై పడి ఉన్న రూ.16 వేల చిల్లర నోట్ల కోసం ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జడ్జి ఛాంబర్లోనే చోరీ.. ఎక్కడ? ఏమిటి?
లాహోర్: పాకిస్తాన్లోని ఓ సెషన్స్ కోర్టు జడ్జి ఛాంబర్ నుంచి రెండు యాపిల్స్తో పాటు ఒక హాండ్వాష్ బాటిల్ చోరీకి గురైన ఘటనపై కేసు నమోదైంది. దీనిపై పాకిస్తానీ పీనల్ కోడ్ సెక్షన్ 380 కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే, దొంగకు కనీసంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు పడే అవకాశా లున్నాయి. ఈ నెల 5వ తేదీన జరిగిన చోరీపై అదనపు సెషన్స్ జడ్జి నూర్ ముహ మ్మద్ బసాŠమ్ల్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిబ్బంది తెలిపారు. దొంగ ఎత్తుకుపోయిన రెండు యాపిల్స్, హ్యాండ్ వాష్ బాటిల్ మొత్తం విలువ వెయ్యి పాకిస్తానీ రూపాయలుగా పేర్కొంటూ పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్ నగర పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్ద చోరీ కేసుగా పేర్కొంటూ దీనిపై హక్కుల కార్యకర్తలు జోకులు పేలుస్తున్నారు. -
పాకిస్థాన్కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన
1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది. అంతేకాకుండా డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్లో భారత్లో తలదాచుకుంటుంది. -
పాక్ సీడీఎఫ్గా మునీర్ ప్రసంగం.. భారత్కు హెచ్చరికలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్పై కవ్పింపు చర్యలకు దిగింది. పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా నియమితుడైన తర్వాత తన తొలి ప్రసంగంలోనే ఆసిమ్ మునీర్.. భారత్కు హెచ్చరిక జారీ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ప్రతీకార చర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే, పాకిస్తాన్ చరిత్రలో పాకిస్తాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా ఆసిమ్ మునీర్ను షహబాజ్ షరీఫ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, మునీర్ సోమవారం తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో రక్షణ దళాల ప్రధాన కార్యాలయ స్థాపన చారిత్రాత్మకమైనది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏకీకృత చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాయుధ దళాలు యుద్ధానికి కొత్త అవసరాలకు అనుగుణంగా ఉండాలి. పాకిస్తాన్పై భారత్ ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి పాకిస్తాన్ ప్రతీచర్య తీవ్రంగా ఉంటుంది. పాక్ చాలా కఠినంగా స్పందిస్తుంది. కాబట్టి భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం పనితీరుపై మునీర్ ప్రశంసలు కురిపించారు. Mere Aziz Humwatano!After deep consultation with myself, as Field Marshal, I am proud to announce the selection of the most qualified candidate for the post of Chief of Defence Forces i.e. myself.Proud of myself for this smooth transfer of power! pic.twitter.com/XYUCZWPbfd— Field Marshal Syed Asim Munir's Ego (@JungjooGernail) December 8, 2025మునీర్ కోసం 27వ రాజ్యాంగ సవరణ..ఇదిలా ఉండగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేసింది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. -
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే యూనివర్సిటీల షాక్
-
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు షాకిచ్చిన యూకే
పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే విశ్వవిద్యాలయాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల వీసా దరఖాస్తుల తిరస్కరణకు కారణాలేమిటి?. వర్సిటీల నిర్ణయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ పరిస్థితి ఏంటి?.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థి వీసాలపై అమెరికా ఆంక్షలు తీవ్రం కావడంతో ఇప్పుడు ఆయా దేశాల విద్యార్థులు యూకేపై దృష్టి సారించారు. అయితే, ఇప్పటికే బ్రిటన్లో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. వలసలను అరికట్టాలని పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. విద్యార్థి వీసాల ముసుగులో బ్రిటన్కు వస్తున్న వారు ఇక్కడే సెటిలైపోతున్నారని, అక్రమ వలసదారులుగా కొనసాగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూకే ఇమిగ్రేషన్ విభాగం ఈ తరహా వలసలపై ఫోకస్ పెట్టింది.ఏయే విశ్వవిద్యాలయాలు తిరస్కరిస్తున్నాయి?కోవెంట్రీ, చెస్టర్ వంటి 9 విశ్వవిద్యాలయాలు ఇప్పుడు పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు తమ వర్సిటీల్లోకి నో ఎంట్రీ అని చెబుతున్నాయి. ముఖ్యంగా.. ఈ దేశాలకు చెందిన విద్యార్థులు నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ పత్రాలతో వస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఇంగ్లిష్ అర్హత పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించామని చెబుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన 18% మంది, బంగ్లాదేశ్కు చెందిన 22% మంది విద్యార్థుల వీసాలను తిరస్కరించినట్లు ప్రకటించాయి.విద్యార్థులకు ఎలాంటి నష్టం?నిజానికి యూకేలో చదువుకున్న విద్యార్థులకు ఆ స్థాయిలో ఉద్యోగాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో లభించడం తక్కువే. ఈ కారణంగా విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లి.. అక్కడే సెటిలవ్వడం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలతో ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపుతున్నారు. యూకే కూడా ఇప్పుడు అదే బాటలో ఉండడంతో.. పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదముంది. -
‘మోదీ జీ.. దయచేసి నాకు న్యాయం చేయండి’
ఇస్లామాబాద్: మోదీ జీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన భర్త తనను పాకిస్తాన్లో వదిలేసి.. భారత్లో రహస్యంగా మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని వీడియోలో పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఆమె అభ్యర్థించింది. బాధితురాలు నిఖితా నాగ్దేవ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మూలాలున్న విక్రమ్ నాగ్దేవ్ దీర్ఘకాలిక వీసాపై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నివాసం ఉంటున్నాడు. కాగా, పాక్లోని కరాచీకి చెందిన నిఖితతో విక్రమ్కు 2020 జనవరి 26న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన నెల తర్వాత, ఫిబ్రవరి 26న ఆమెను భారత్కు తీసుకొచ్చారు. అనంతరం, కొన్ని నెలలకే వీసాలో సాంకేతిక సమస్య ఉందని చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద నుంచి విక్రమ్.. నిఖితను బలవంతంగా పాకిస్తాన్కు పంపించేశాడు. అప్పటి నుంచి ఆమెను తిరిగి భారత్కు తీసుకువెళ్లలేదని నిఖిత తెలిపారు.అంతేకాకుండా.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తన మామకు చెబితే.. అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని నిఖిత ఆరోపించారు. ఢిల్లీకి చెందిన మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు నిఖిత చెప్పుకొచ్చారు.ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో ఈ కేసు పాకిస్తాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, విక్రమ్ను పాక్కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. అలాగే, 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయితీ కూడా విక్రమ్ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని నిఖిత వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే, న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుంది. దయచేసి తనకు అండగా నిలవండి అని ఆమె అభ్యర్థించారు. -
అమెరికా- భారత్ సంబంధాలు అందుకే దెబ్బతిన్నాయా?
భారత్- అమెరికా దౌత్య సంబంధాలపై అమెరికా మాజీ రక్షణ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇరు దేశాల మధ్య మైత్రి దెబ్బతినడానికి పాకిస్థాన్ కారణమన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే వల్లే భారత్ - రష్యా మధ్య స్నేహం మరింతగా చిగురిస్తుందని తెలిపారు.భారత్- అమెరికాల మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు మెరుగ్గా లేవు. దానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలతో పాటు తలబిరుసు వ్యాఖ్యలు ఈ రెండింటి కారణంతో భారత్- యూఎస్ మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో ఇండియా- రష్యా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ రక్షణ అధికారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబిన్ మాట్లాడుతూ "భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ రివర్స్ చేసిన విషయం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ ఇలా చేయడానికి కారణమేంటా అని? ఆలోచిస్తున్నారు. బహుశా పాకిస్థానీల పొగడ్తల వల్లనో లేక పాకిస్థాన్, టర్కీ, ఖతార్ దేశాలు ఆయనకు లంచం ఇచ్చి ఉండవచ్చు. ఈ లంచం అమెరికాను ద్రవ్యలోటులో ఉంచబోతుందని" ఆయన అన్నారు. రష్యాతో, అమెరికా వాణిజ్యం చేస్తూనే ఇండియాను ట్రేడ్ చేయద్దని అడ్డుకంటుందన్నారు.భారత ప్రజలు వారి ప్రధాని మోదీని ఎన్నుకున్నది అక్కడి ప్రజల అవసరాలను తీర్చడానికే అన్న విషయం అమెరికన్లకు అర్థం కావడం లేదన్నారు. భారత్ అనేది చాలా పేరు గల దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిచబోతుంది. అటువంటి దేశానికి ఎనర్జీ అవసరం ఎంతో ఉంటుందన్నారు. ఒకవేళ రష్యా చమురు కొనకుండా భారత్ ను నియంత్రించాలనుకుంటే అమెరికా అంతకంటే తక్కువ ధరకు ఆ దేశానికి చమురు అందించాలని తెలిపారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మౌనంగా ఉండడం ఉత్తమం అన్నారు. ఎందుకంటే ఏ దేశమైన వారి అవసరాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని మిచెల్ రుబెన్ తెలిపారు.యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధం తానే ఆపానని అన్నారు. అంతే కాకుండా రష్యా చమురు కొంటే అధిక పన్నులు విధిస్తానని భారత్ ను హెచ్చరించారు. ఇండియా ట్రంప్ వ్యాఖ్యలని లెక్కచేయకపోవడంతో ఆగస్టులో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధించారు. -
మళ్లీ భగ్గుమన్న పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దులు
పాకిస్తాన్--ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు మళ్లీ భగ్గుమన్నాయి. వీరి మధ్య మధ్య శాంతి ఒప్పందం జరిగిన 48 గంటల వ్యవధిలోనే మళ్లీ ఇరు దేశాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తమ దేశాలనికి చెందిన ఐదుగురు పౌరులు మృతిచెందిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. ఇరు దేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగియాని, పాకిస్తాన్ తమ సరిహద్దులు వెంబడి కాల్పులకు ఉపక్రమించిందని ఆఫ్ఘాన్ అధికారులు స్పష్టం చేశారు. వారి దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టామని, కాకపోతే ఐదుగురు పౌరులు మృత్యువాత పడటం బాధాకరమని ఆఫ్ఘాన్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఇరుదేశాల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయ్యింది. ఈ ఏడాది అక్టోబర్లో, ఆపై నవంబర్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగ్గా, తాజాగా వీరి మధ్య మరొకసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ సరిహద్దుల వెంబడి ఇరు దేశాలు కాల్పులు జరుపుకోవడం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.కందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంతో పాటు, అలాగే పాకిస్తాన్ సరిహద్దు చమన్ ప్రాంతం వద్ద కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆఫ్ఘాన్ చెబుతుండగా, ఆఫ్ఘానిస్తానే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని పాకిస్తాన్ అంటోంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాతే ఈ కాల్పుల విరమణ జరిగిందని ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి. -
పాక్ సంచలనం నిర్ణయం.. మునీర్కు కీలక బాధ్యతలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఆ దేశ ప్రభుత్వం ఉన్నత పదవిని కట్టబెట్టింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారులు లభించే అవకాశం ఉంది.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. మునీర్కు స్పెషల్ హోదా..ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్ అయ్యారు. దీంతో, పాకిస్తాన్ పలు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తిగా మునీర్ రికార్డులోకి ఎక్కారు. అయితే, సీడీఎఫ్గా ఆసిమ్ మునీర్ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ కావాలనే ఈ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
పాక్తో ఇంకా సంబంధాలెందుకు?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి. -
అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే!
పొరుగు దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం ఈసారి ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ను విక్రయించాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా అవినీతి, నిర్వహణ లోపాలు.. ‘పైలట్ లైసెన్స్ కుంభకోణం’తో కుదేలైన పీఐఏను కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు అర్హత పొందారు. అయితే ఈ రేసులో వివాదాల సర్వసైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ల(రూ. 63,220 కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)ని విక్రయించాలని నిర్ణయించుకుంది. రుణాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గుతూ ఈ నిర్ణయం తీసుకుంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన మేరకు.. పీఐఏ బిడ్డింగ్ 2025, డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించడం అత్యంత కీలకమైన షరతు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల(రూ. 8,600 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు.కన్నింగ్ మునీర్ చేతికి..ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు.ఈ బిడ్డింగ్కు ముందస్తు అర్హత పొందిన నాలుగు సంస్థలలో.. సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్లో భాగం. పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రత్యక్ష స్థానం లేదు. అయితే ఆయన క్వార్టర్మాస్టర్ జనరల్ (క్యూఎంజీ)నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే జరుగుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మునీర్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వాన్ని పక్కన పడేసి తానే నెంబర్1గా, నియంతగా పాక్ను పాలించే యోచనలో ఉన్నాడని పాక్ ప్రజలే మండిపడుతున్నారు. మరోపక్క పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మునీర్ను గుంటనక్కగా అభివర్ణిస్తూ.. పాక్ను నాశనం చేసేదాకా ఊరుకోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నిండా ముంచిన పైలట్ లైసెన్స్ కుంభకోణంపీఐఏ పతనానికి అనేక కారణాలున్నాయి. సంవత్సరాల తరబడి జరిగిన ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, 2020లో పైలట్ లైసెన్స్ కుంభకోణం కారణంగా సంస్థ సంక్షోభంలో చిక్కుకుంది. 30 శాతం కంటే ఎక్కువ మంది పాకిస్తానీ పైలట్లు నకిలీ లైసెన్స్లు కలిగి ఉన్నారని తేలింది. దీంతో సంస్థ 262 మందిని తొలగించవలసి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్, యూకే, యూఎస్లు పీఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లింది. అంతర్గత సమస్యలు కూడా పీఐఏను దెబ్బతీశాయి. సిబ్బందికి అధిక జీతాలు, ప్రయోజనాలు మొదలైనవి ఖర్చులను మరింతగా పెంచాయి. నిర్వహణ లోపాలతో పాటు, 2020లో జరిగిన పీఐఏ ఫ్లైట్ 8303 క్రాష్ వంటి భద్రతా వైఫల్యాలు సంస్థకు మరింత నష్టం కలిగించాయి. ఇది కూడా చదవండి: గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు -
అఫ్గాన్తో ఉద్దేశపూర్వకంగా మునీర్ వైరం
లాహోర్: పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ధ్వజమెత్తారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్ ఉర్దూలో ట్విట్టర్లో పోస్టు చేశారు.పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..‘ఆసిమ్ మునీర్కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్’ (ఇస్లామిక్ ఫైటర్) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్ ఆరోపించారు. డ్రోన్ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్ నుండి బహిష్కరించారు. డ్రోన్ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్ పేర్కొన్నారు. జనరల్ మునీర్ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. మునీర్ ఆదేశాలతోనే నిర్బంధంమునీర్ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు. -
ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యక్ష నరకం!
పొరుగు దేశం భారత్తో ఇమ్రాన్ ఖాన్ ఏనాడూ కయ్యానికి కాలు దువ్వలేదని.. పైగా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే అడుగులు వేశాడని ఆయన సోదరి అలీమా ఖాన్ అంటున్నారు. పాక్ మాజీ ప్రధాని భద్రతపై పుకార్లు షికార్లు చేయడంతో.. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆయన కుటుంబ సభ్యుల్ని ములాఖత్కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేశారు.అసిమ్ మునీర్ పాక్తో యుద్ధం జరగాలని ఆశించారు. కానీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం దోస్తీ కోసం తీవ్రంగా ప్రయత్నించారని ఆమె అన్నారు. ఈ క్రమంలో మునీర్పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ ఇమ్రాన్ ఖాన్ స్వేచ్ఛగా ఆలోచించేవాడు. అందుకే అధికారంలోకి రాగానే భారత్తో, అక్కడి అధికార పార్టీ బీజేపీకి స్నేహ హస్తం అందించే ప్రయత్నం చేశాడు. కానీ, మునీర్ రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్. అందుకే భారత్తో కయ్యానికి కాలు దువ్వాడు. అతని ఆ ప్రయత్నంలో భారత్ మిత్రదేశాలు కూడా ఇబ్బంది పడ్డాయి’’ అని అన్నారామె. ఇమ్రాన్ ఖాన్ను పాక్ జాతి సంపదగా అభివర్ణించిన అలీమా.. చెర నుంచి విడిపించేందుకు పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.ఒంటరిగా చిన్న సెల్లో బంధించారు. ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. బయటకు కూడా రానివ్వడం లేదు. సరైన తిండి పెట్టడం లేదు. మందులూ అందించడం లేదు. మానసికంగా ఆయన కుంగిపోయి ఉన్నారు. జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి అసిం మునీర్ కారణం. పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ఖాన్ అంటే భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయనకు పాక్ ప్రజల మద్దతు ఉంది కాబట్టి. ఇలాంటి చర్యల ద్వారా ఆయన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలనుకుంటున్నారు. కానీ, ఎంత అణిచివేస్తే అంత పెద్ద ఉద్యమం పుడుతుంది అని అలీమా సదరు మీడియా సంస్థతో అన్నారు.మునీర్తో చెడింది అక్కడే..2019లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయంలో ఆనాడు ఐఎస్ఐ డైరెకటర జనరల్గా ఉన్న మునీర్.. అతిగా ఆసక్తి చూపించారు. ఇది నచ్చని ఇమ్రాన్ఖాన్.. మునీర్ను పదవీ నుంచి తొలగించాడు. ఇది సాధారణంగానే ఇమ్రాన్ ఖాన్పై పగను పెంచుకునేలా చేసింది.పలుకేసుల్లో శిక్ష పడడంతో ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియా జైల్లో ఉంటున్నారు. అయితే.. నెల రోజుల నుంచి ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చివరి సందేశంలో ఆయన మునీర్పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలను ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన జైల్లోనే మరణించారని.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.. అనారోగ్యం బారిన పడ్డారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈలోపు..షెహబాజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. మంగళవారం ఇమ్రాన్ ఖాన్ మరో సోదరి ఉజ్మా ఖానుమ్ 20 నిమిషాలపాటు ఇమ్రాన్ ఖాన్తో ములాఖత్ అయ్యారు. జైల్లో ఆయన మానసికంగా నరకం అనుభవిస్తున్నారని అన్నారామె. ఇది పీటీఐ వర్గాలకు తీవ్రాగ్రహం తెప్పించింది.ఇండియా-పాక్ ఉద్రిక్తతలుఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు చేసింది భారత సైన్యం. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మెరుపు దాడులు నిర్వహించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నేలమట్టం చేసింది.Aleema Khanum, sister of Imran Khan, claims that her brother represents 90% of the people of Pakistan so by isolating him they are suppressing the people of Pakistan.Watch the full interview with @SkyYaldaHakim ⬇️https://t.co/YOYuCbPbZj📺 Sky 501, Virgin 602 and YouTube pic.twitter.com/oOacMmtHKP— Sky News (@SkyNews) December 2, 2025 -
జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలిసిన సోదరి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ అంశం పాకిస్థాన్ లోనే కాకుండా ఇతర దేశాలలోనూ చర్చనీయాంశం అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధానిని జైలులోనే చంపేశారని పుకార్లు రావడంతో ఆ దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను ఆమె సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిసింది.మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నాడా లేదా అనే అంశం ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న ఆయనను కలవడానికి కొంతకాలంగా అక్కడి అధికారులు నిరాకరించడం, దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని పుకార్లు రేగడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలని, ఆయనను కలవడానికి అనుమతించాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ ని ఆమె సోదరి డాక్టర్ ఖానుమ్ జైలులో కలిసింది. అతనితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" దేవుడి దయ వల్ల ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు. కానీ మానసికంగా ఆయనను చాలా వేధిస్తున్నారు. ప్రతిరోజు సెల్ లో నిర్భంధిస్తున్నారు. ఆయనను ఎవరితోనూ కలవనివ్వడం లేదు. కేవలం కొద్దినిమిషాలు మాత్రమే ఆయనను బయిటకి వదులుతున్నారు". అని తెలిపింది.తాను జైలులో ఉండడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని ఆయన ఇమ్రాన్ అన్నారని ఆమె తెలిపింది. మెుత్తానికి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని 2023లో అరెస్టు చేశారు. దేశద్రోహం, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఇలా ఆయనపై 121 కేసులు మోపారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ లో హింస చేలరేగింది. ఆయన మద్ధతు దారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో 500మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. -
పాక్తో పాటు చైనా వెన్నులో వణుకు పుట్టేలా..
బెలూచిస్తాన్ రీజియన్లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్ గ్రూప్స్ వరుస దాడులతో పాక్ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా దాడికి దిగింది. ఈ దాడిలో భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ.. బెలూచ్ వేర్పాటువాద సంస్థల దృష్టిలో ఆమె వీర మహిళ. చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాంబుతో ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికుల మరణించారు. అందుకే.. ఆమె త్యాగాన్ని అంతగా కీర్తిస్తున్నారు.బీఎల్ఎఫ్ ఈ తరహా మానవ బాంబు దాడులకు(fidayeen strike) దిగడం ఇదే తొలిసారి. అందునా ఒక మహిళతో దాడి చేయించడంతో ప్రముఖంగా నిలిచింది. ఈ మేరకు మహూ ఫొటోను టెలిగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది.చగయ్ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి, బంగారపు మైన్ కార్యాకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్ భారీగా సైన్యాన్ని మోహరించింది. మహూ తొలుత ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్నవాళ్లను హతమార్చింది. ఆపై రెబల్స్లోకి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. అయితే ఈ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్ సైన్యం ధృవీకరించలేదు.మరో వైపు.. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్ ఇంటెలిజెన్స్.. ఆర్మీ అధికారులు పలువురు మరణించారు.ఎందుకీ దాడులంటే..బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో ఇవి మొదలయ్యాయి. నెమ్మదిగా.. చైనా పెట్టుబడులు (CPEC ప్రాజెక్టులు), పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రమవుతున్నాయి. BLA (Baloch Liberation Army), BLF (Baloch Liberation Front) వంటి గ్రూపులు చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులపై దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు.. ఇప్పుడు ఏకంగా సూసైడ్ దాడుల్లాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి.ప్రధాన కారణాలు ఏంటంటే..బలూచిస్తాన్లో గ్యాస్, ఖనిజాలు, పోర్టులు ఉన్నప్పటికీ స్థానికులకు లాభం తక్కువ(ఆర్థిక దోపిడీ). వీటికి తోడు.. స్థానిక నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం(రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం). పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దాడులు, అపహరణలు, జాతి స్వతంత్రత(మానవ హక్కుల ఉల్లంఘనలు).. బలూచ్ జాతి వేర్పాటువాద పోరాటం.. చైనా పెట్టుబడులు (CPEC) పెడుతుండడాన్ని అక్కడి వాళ్లు భరించలేకపోతున్నారు. అందుకే తిరుగుబాటు గ్రూపుల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు మారాయి. ఇది సాధారణంగానే పాక్ సైన్యంతో పాటు చైనాకు గుబులు పుట్టిస్తోంది.బలూచిస్తాన్ తిరుగుబాట్ల చరిత్ర👇మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది.రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు.మూడో దశ తిరుగుబాటు (1962–63): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు..నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు..ఐదో దశ తిరుగుబాటు (2004–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి. -
ఖాన్ సాబ్ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్కు తెర
పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా?.. పాక్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుందా?. జైల్లో ఉన్న ఖాన్ను ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఖాన్ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిశాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయొద్దని ఆమెకు పాక్ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా.. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంతో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు.. హౌజ్ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా? అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా.. హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు.గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా? అనేది బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరిగిపోయింది. తెహ్రీక్ ఈ ఇన్షాఫ్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై.. ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంట్లలో అనే ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
ఇండియా సాయం కోరిన పాక్.. భారత్ గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఇమ్రాన్ఖాన్ బ్రతికే ఉన్నాడు.. ’
’కరాచీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ హత్య చేయబడ్డాడు అంటూ ఇటీవల వైరల్గా మారిన వార్తలను తన అనుచరుడు ఖుర్రాన్ జెషాన్ ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడని, అడియాలా జైల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు.కాకపోతే ఇమ్రాన్ ఖాన్ను దేశం విడిచి వెళ్లిపోవాలనే ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. ఇమ్రాన్ఖాన్కు పాకిస్తాన్లో ఉన ప్రజాదరణ కారణంగా ఆయనకు బెదిరింపులు ఎక్కువైనట్లు తెలిపారు. జైలు అధికారులు కనీసం ఇమ్రాన్ ఫోటోలను విడుదల చేయకపోవడానికి కారణం ఆయనకున్న పాపులారిటీనే కారణమన్నారు. ఆరోగ్యం క్షీణించి ఉన్న ఇమ్రాన్ఖాన్ ఫోటోలను విడుదల చేస్తే మళ్లీ ప్రజల నుంచి సరికొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించే అధికారులు అందుకు దూరంగా ఉన్నారన్నారు. అదే సమయంలో ఇమ్రాన్ను దేశం విడిచి వెళ్లిపోవాలనే ఒత్తిడి మాత్రం అధికంగా ఉందన్నారు. ఇక ఇమ్రాన్ మృతిచెందాడనే రూమర్స్పై కూడా ఖుర్రాన్ జెషాన్ క్లారిటీ ఇచ్చారు. ‘ ఇది నిజంగా దురదృష్టకరం. ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలలుగా ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇమ్రాన్ను ఎవరూ కలవడానికి లేకుండా చేశారు. ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ శ్రేణుల్ని కూడా కలవనివ్వడం లేదు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇమ్రాన్ను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నారనే విషయం ఈ పరిణామాల్ని బట్టి అర్థమవుతుంది. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేసి విదేశాలకు పంపించే ఒప్పందం చేసుకుంటున్నారు. వేరే దేశానికి పంపిన తర్వాత ఇమ్రాన్ ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఉండేందుక మాట తీసుకునే యత్నం జరుగుతుందనేది నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఇమ్రాన్ ఖాన్ వాటికి అంగీకరించరు’ అని పేర్కొన్నారు.. -
ఇమ్రాన్ సజీవంగా ఉన్నట్లు సాక్ష్యం చూపండి
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకి స్తాన్ తెహ్రీక్ ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవ స్థాపకుడు ఇమ్రాన్ ఖాన్(73) అడియా లా జైలులో సజీవంగానే ఉన్నట్లు చెబు తున్న ప్రభుత్వం, అందుకు తగిన సాక్ష్యా లను చూపాలని ఆయన కుమారుడు కాసిమ్ ఖాన్ డిమాండ్ చేశారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ రెండేళ్లుగా జైలులోనే ఉన్నారు. దాదాపు నెల రోజులుగా ఆయన్ను కలుసుకునేందుకు కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో పాటు లాయర్లకు సైతం జైలు అధికా రులు అనుమతివ్వడం లేదు. దీంతో, ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లుగా జరు గుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం కాసిమ్ ఖాన్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘మా తండ్రిని 845 రోజులుగా జైలులో ఉంచారు. ఆరు వారాలుగా ఆయనతో ఎవరినీ కలవనివ్వకుండా ఒంటరిగా ఉంచారు. ఆయన ఆరోగ్యం గురించి తెలియనివ్వడం లేదు. కోర్టు ఉత్తర్వులున్నా, ఆయన సోదరీమణు లను లోపలికి వెళ్లనివ్వడం లేదు. కనీసం ఫోన్ కాల్కూ అవకాశమివ్వడం లేదు. దీంతో, ఆయన పరిస్థితిపై అనుమానా లు కలుగుతున్నాయి. ఇమ్రాన్ సజీవంగా ఉన్నట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు తగిన సాక్ష్యాలను చూపాలి’అని అందులో పేర్కొన్నారు. ‘ఆయన భద్రత బాధ్యత పూర్తిగా పాక్ ప్రభుత్వంలోని పెద్దలదే. చట్టపరంగా, నైతికంగా, అంతర్జాతీయంగా కూడా వారే బాధ్యత వహించాలి’అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ బరువు బాగా తగ్గిపోయారు. దృష్టి సమస్యలు, విషప్రయోగం జరిగే అవ కాశం ఉందంటూ వస్తున్న వార్తలను కాసిమ్ ఖాన్ ప్రస్తావించారు. ఇమ్రాన్ ముగ్గురు సోదరీమణులు, పీటీఐ కార్యకర్తలు ఖైబర్ ప్రావిన్స్ సీఎం సొహైల్ అఫ్రిది సహా అడియాలా జైలు వెలుపలే కొద్ది రోజులుగా మకాం వేశారు. ఇమ్రాన్ను కలుసుకునేందుకు కుటుంబసభ్యులకు అనుమతివ్వాలని పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖాన్ సోదరి అలీమా ఖాన్ అడియాలా జైలు సూపరింటెండెంట్పై ఇస్లామాబాద్ హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేశారు. -
విజేత పాకిస్తాన్
రావల్పిండి: సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు టి20 టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆతిథ్య పాకిస్తాన్... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. శనివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కమిల్ మిశ్రా (47 బంతుల్లో 59; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్ల ప్రతాపానికి శ్రీలంక బ్యాటర్లు నిలవలేకపోయారు. కమిల్ ఒక్కడే అర్ధశతకం సాధించగా... పాథుమ్ నిశాంక (11), కుషాల్ మెండిస్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవన్ రత్ననాయకే (8), కుషాల్ పెరెరా (1), కెపె్టన్ దసున్ షనక (2), జనిత్ లియాంగే (0), వణిండు హసరంగ (5) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ నవాజ్ 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అబ్రార్ అహ్మద్కు 2 వికెట్లు దక్కాయి. బౌలింగ్లో క్రమశిక్షణ కనబర్చిన పాకిస్తాన్ బ్యాటింగ్లోనూ ఫర్వాలేదనిపించింది. లక్ష్యం పెద్దది కాకపోవడంతో నిదానంగా ఆడి విజయం సాధించింది. ఛేదనలో పాక్ 18.4 ఓవర్లలో 118 పరుగులు చేసి గెలిచింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (33 బంతుల్లో 36; 6 ఫోర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించారు. శ్రీలంక బౌలర్లలో పవన్ రత్ననాయకే 2 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ నవాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
బతికే ఉన్నాడా? చెప్పండి! ఇమ్రాన్ఖాన్ కుమారుడి బిగ్ వార్నింగ్
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరణం గురించి పుకార్లు, ఊహాగానాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. పాకిస్తాన్ జైల్లో హత్యకు గురయ్యారనే వార్త సంచలనం రేపుతోంది. అసలు ఇమ్రాన్ ఎందుకు హత్యకు గురయ్యాడు? అధికారిక ప్రకటన ఎందుకు రావడం లేదు? బతికే ఉన్నాడా? లేదా? అనే సందేహాలు యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్నాయి.పాకిస్తాన్ జైలు అధికారులు ఈ పుకార్లను తోసిపుచ్చినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిమ్ ఖాన్, తన తండ్రిని 'డెత్ సెల్'లో ఉంచారంటూ మండిపడ్డారు. ఈ 'అమానవీయ ఒంటరితనం' దారుణం అంటూ, తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అసలు బతికి ఉన్నాడా అనేది స్పష్టం చేయాలంటూ ఆయన కోరుతున్నారు. తన తండ్రి విడుదలను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి జైలు పాలై 845 రోజులు అయిందని, గత ఒకటిన్నర నెలలుగా, అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా అతన్ని డెత్ సెల్లో ఉంచారని కాసిం ఖాన్ ఆరోపించారు.గత ఆరు వారాలుగా, అతన్ని పూర్తిగా ఒంటరిగా ఉన్న డెత్ సెల్లో ఒంటరిగా ఉంచారు. స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అతని సోదరీమణులు ప్రతి సమావేశానికి హాజరుకాకుండా అడ్డుకుంటున్నారు. ఫోన్ కాల్స్ లేవు. ములాఖత్లు లేవు, అతని క్షేమం గురించి తెలియదు, తాను, తన సోదరుడు తండ్రిని ఏ విధంగానూ సంప్రదించలేకపోయామని కాసిం ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా సమాచారం నిషేధించడం ప్రోటోకాల్లోభాగం కాదని ఆరోపించారు. కావాలనే తన తండ్రి పరిస్థితిని దాచిపెట్టి, కుటుంబానికి ఆయన ఆచూకీ చెప్పకుండా వేధిస్తున్నారన్నారు.తండ్రి భద్రత సమాచారాన్ని దాచిపెట్టడం, అమానవీయ ఒంటరితనం పర్యవనాలను పాకిస్తాన్ ప్రభుత్వం, దాని మద్దతు దారులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పూర్తిగా చట్టపరమైన, నైతిక, అంతర్జాతీయ బాధ్యత వహించక తప్పదన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి చేశారు. తండ్రి బతికే ఉన్నారని ధృవీకరించాలని,రాజకీయ కారణాలతోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖానుమ్ కూడా తమ కుటుంబంతో సమావేశాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై జైలు ఎదుట పోరాటాన్ని కూడా చేపట్టారు.పాక్లో చీకటి రోజులొచ్చాయి: ఇమ్రాన్ సోదరిఅడియాలా జైలులో తన సోదరుడు చికిత్స పొందుతున్న తీరుపై ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏమైందీ, ఏమీ చెప్పడం లేదు, ఎవరినీ కలవనివ్వడం లేదని ఆరోపించారు. ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, తనను సంప్రదించడానికి వీలు లేకుండా చేశారన్నారు. పాకిస్తాన్లోగడ్డు రోజులొచ్చాయి. నిరంకుశుల గురించి చదువుకున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా పరిస్థితుల్లో జీవిస్తున్నాం అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను నోరీన్ నియాజీ "నియంత" అని విమర్శించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దేశ చరిత్రలోనే అత్యం ప్రజాకంటక పాలనగా అభివర్ణించారు. పాకిస్తాన్ తన చీకటి కాలంలో ఉంది. ప్రజలను అపహరించి చంపేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సంపూర్ణ ఆరోగ్యంతో ఇమ్రాన్
లాహోర్: మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73) కస్టడీలో చనిపోయారంటూ వస్తున్న వార్తలు, అడియాలా జైలు వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. జైలులోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గురువారం ప్రకటించింది. ఇమ్రాన్ను ఎక్కడికీ తరలించలేదని, జైలులోనే పూర్తి స్థాయిలో అవసరమైన వైద్య సాయం అందుతోందని పేర్కొంది. ‘తీవ్ర అనారో గ్యంతో ఉన్న ఇమ్రాన్ను అడియాలా జైలు నుంచి ఆస్పత్రికి తరలించామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు’అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ వివిధ అవినీతి ఆరోపణలు, ఉగ్రవాదం కేసుల్లో 2023 ఆగస్ట్ నుంచి, జైలు జీవితం గడుపుతుండటం తెల్సిందే. -
వైట్హౌజ్ ఘటనలో పాక్ ప్రమేయం?!
వైట్హౌజ్ వద్ద కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. నేరుగా అఫ్గనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలకు దిగింది. అఫ్గన్ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఇమిగ్రేషన్ దరఖాస్తుల సస్పెండ్కు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను పురమాయించారు కూడా. ఈ క్రమంలో.. తాలిబాన్ ప్రభుత్వం తాజా పరిణామాలపై స్పందించింది.వైట్హౌజ్ సమీపంలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా?. కాల్పులకు పాల్పడిన దుండగుడు రెహ్మనుల్లా లఖన్వాల్ను ఆ దేశమే బ్రెయిన్వాష్ చేసి పంపిందా?.. అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోంది అఫ్గనిస్తాన్. కాబూల్ ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరస్తోందని చెబుతోంది. ఈ దాడి తమ దేశాన్ని బద్నాం చేసే కుట్ర అయ్యి ఉండొచ్చని.. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడుతుందని అంటోంది. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ భారత్కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రమేయం ఉందనిపిస్తోంది. మా దేశగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యి ఉండొచ్చు కూడా. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుంది.... ఇది బయటి దేశాల గూఢచారి సంస్థలు(పాక్ ఐఎస్ఐను ఉద్దేశిస్తూ..) పని అయ్యి ఉండొచ్చు. అఫ్గాన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నమూ కావొచ్చు. ఇందులో ఏ కోణాన్ని మేం వదలిపెట్టబోం. ఎందుకంటే.. అయితే మా విధానం స్పష్టంగా ఉంది. మా పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరు. ఆఫ్గన్ నేలను, ఇక్కడి ప్రజల్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు మేం అంగీకరించబోం’’ అని అన్నారాయన. అఫ్గాన్ వలస ప్రక్రియను అమెరికా కఠినతరం చేయడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.గురువారం వాషింగ్టన్లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలో జరిగిన ఈ కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్వాల్ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్లకు అందించిన స్పెషల్ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. నేషనల్ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని ఎఫ్ఐబీ చీఫ్ కాష్ పటేల్ ప్రకటించారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.వైట్హౌజ్ దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్లోకి ప్రవేశించాడు. బైడెన్ పాలనలో అలా వచ్చినవాళ్లందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి శరణార్థులు అమెరికన్ల మనుగడకే ప్రమాదకరం’’ అని అన్నారు. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బంది మోహరింపునకు ఆదేశించారు. అంతేకాదు.. ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అఫ్గాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
ఇమ్రాన్ ఆరోగ్యంపై అడియాలా జైలు ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ, పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపధ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు.తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతనిని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.ఇదేవిధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కుటుంబ సభ్యులపై జైలు అధికారుల ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక: డిసెంబర్ ఒకటి లోగా కొత్త సీఎం? -
ఇమ్రాన్ ఖాన్ కు అసలేం జరిగింది..?
-
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందినట్టు వార్తలు
-
ఇమ్రాన్ఖాన్ హత్య?
ఇస్లామాబాద్: రాజకీయ హత్యలకు పెట్టింది పేరైన పాకిస్తాన్లో మరో మాజీ ప్రధాని రక్తం చిందిందా? పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) సారథి, అలనాటి మేటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారా? రాజకీయ నిర్బంధానికి గురై 2023 నుంచీ జైల్లోనే మగ్గుతున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారా? గత జనవరి నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉంటున్న 72 ఏళ్ల ఇమ్రాన్ను అక్కడే సైలెంట్గా చంపేశారంటూ అఫ్గాన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హాండిల్ ఎక్స్లో పెట్టిన పోస్టు బుధవారం పెను దుమారమే రేపింది. అత్యంత విశ్వసనీయ వర్గాలే తమకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు అది పేర్కొంది. దాంతో చూస్తుండగానే సోషల్ మీడియా అంతా ఈ వార్తలతోనే ఊగిపోయింది. పాక్కు చెందిన పలు సైట్లు కూడా ఇమ్రాన్ కుటుంబీకులు, పీపీపీ నేతలను ఉటంకిస్తూ ఇదే విషయాన్ని ప్రచారంలో పెట్టాయి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణగానీ, ఖండన గానీ వెలువడకపోవడం గమనార్హం. దాంతో పాక్వ్యాప్తంగా ఇమ్రాన్ అభిమానులు, పీపీపీ కార్యకర్తలు, నేతలు వీధుల్లోకి వచ్చి ఆందోళన బాట పట్టారు. అడియాలా జైలును ముట్టడించే ప్రయత్నం చేశారు. జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని ఇమ్రాన్ గత జూలైలో ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్తో కలిసి తనను ఏదో చేసేందుకు ఒక కల్నల్ రంగంలోకి దిగినట్టు పేర్కొన్నారు. తనకు ఏమన్నా అయితే ఆర్మీ చీఫ్ సీఎం మునీర్నే అందుకు బాధ్యున్ని చేయాలని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పిలుపు నిచ్చారు. జైలు అధికారులు తనను విపరీతంగా వేధిస్తున్నా రని ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను కలిసేందుకు తమను అనుమతించడం లేదని బుధవారం ఆయన కుటుంబీకులు ఆరోపించిన కాసేపటికే ఇలా హత్య వార్త ప్రచారంలోకి వచ్చింది. పాక్ సైన్యమే ఆయన్ను పొట్టన పెట్టుకుందంటూ ఎక్స్ సహా అన్ని సోషల్ సైట్లలోనూ పోస్టులు వెల్లువెత్తాయి. పైగా ఇమ్రాన్ను చూపించాలంటూ జైలు వెలుపల ధర్నాకు దిగిన ఆయన సోదరీమణులను పోలీసులు కొట్టి వెళ్ళగొట్టారన్న వార్తలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ప్రధానిగా ఉంటూ పాక్లో అత్యంత శక్తిమంతమైన సైన్యంతో పెట్టుకున్న కొద్ది రోజులకే ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం తెలిసిందే. ఆ వెంటనే పలు అవినీతి ఆరోపణలపై ఆయన జైలుకెళ్లారు. తర్వాత ఒక్కొక్క కేసులో ఆయనకు శిక్ష పడుతూ వచ్చింది. Reports are now surfacing from inside the prisons of PUnjabi Pakistan that Imran Khan, who was being held in custody, has been killed by Asim Munir and his ISI administration according to several news outlets. If this information is confirmed to be true, it marks the absolute end… pic.twitter.com/SbbVB5uJll— Ministry of Foreign Affairs Baluchistan (@BaluchistanMFA) November 26, 2025 -
ఫిబ్రవరి 15న పాక్తో భారత్ పోరు
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్ కప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్తో వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ను ఐసీసీ చైర్మన్ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్తో భారత్ లీగ్ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్ దశ తర్వాత తమ గ్రూప్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్–8’ మ్యాచ్ల తర్వాత రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్... మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్ కప్లో భాగంగా మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత్లో అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్ఎస్సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్ జట్టు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్ మ్యాచ్లకు కోల్కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్ సెమీస్ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్ను కోల్కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్ ఫైనల్ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్ల విజేత రోహిత్ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్ కప్ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్ కప్లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్ ఆడే టి20 మ్యాచ్లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.గ్రూప్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. -
ఘోరం: బాంబుదాడిలో 9మంది చిన్నారుల మృతి
అఫ్గానిస్థాన్ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్ తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్గా దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపై పాక్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.పాక్- అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఉలికిపాటు
ఇస్లామాబాద్: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. సోమవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. భవిష్యత్తులో సింధ్ భారతదేశానికి తిరిగి చెందవచ్చంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవని, ఇది విస్తరణవాద, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. రాజ్నాథ్ సింగ్ మాటలు హిందూత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యలు వాస్తవాలను సవాలు చేస్తున్నాయని, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 🔊PR No.3️⃣4️⃣8️⃣/2️⃣0️⃣2️⃣5️⃣Pakistan Strongly Condemns Indian Defense Minister Rajnath Singh's Remarks About Pakistan’s Sindh Province https://t.co/wdeTkEg3xY🔗⬇️ pic.twitter.com/qeXY0JmXgj— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) November 23, 2025రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సింధ్ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. సింధ్తో భారతదేశానికి ఉన్న శాశ్వత సాంస్కృతిక సంబంధాలపై దృష్టి సారించిన ఆయన, ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, దాని నాగరికత బంధం భారత్తో చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. ‘నేడు, సింధ్ భూమి భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుంది’ అని అన్నారు. రాజకీయ సరిహద్దులు తాత్కాలికమే అయినప్పటికీ, సాంస్కృతిక గుర్తింపు, ఉమ్మడి వారసత్వం చాలా కాలం పాటు ఉంటాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. #WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, "...Today, the land of Sindh may not be a part of India, but civilisationally, Sindh will always be a part of India. And as far as land is concerned, borders can change. Who knows, tomorrow Sindh may return to India again..."… pic.twitter.com/9Wp1zorTMt— ANI (@ANI) November 23, 2025రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో 1947 విభజన సమయంలో సింధ్ను కోల్పోవడంతో హిందువులు అనుభవించిన బాధను గుర్తు చేసుకున్నారు. సింధు నదిపై ఉన్న భక్తిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సింధు నదిని పవిత్రమైనదిగా భావించడం కేవలం హిందువులకే పరిమితం కాదని, సింధ్లోని పలువురు ముస్లింలు కూడా మక్కాలోని ఆబ్ ఎ జంజామ్ కంటే సింధు నది నీరు ఎంతో పవిత్రమైనదని నమ్ముతారన్నారు. ఇది కూడా చదవండి: పెషావర్లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి -
పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్తాన్
-
పెషావర్లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్ ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం ఇక్కడి ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ)పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు, ఆత్మాహుతి బాంబర్లు దాడి చేయడంతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం ఈ భీకర దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ సమన్వయ దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.దాడుల వెనుక ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని రాయటర్స్ పేర్కొంది. దాడి వ్యూహంలో భాగంగా తొలుత ఆత్మాహుతి బాంబర్ ప్రధాన కార్యాలయం ముఖద్వారంపై దాడి చేసి, తనను తాను పేల్చుకోగా, ఆ వెంటనే మరొక బాంబర్ దళాల దృష్టిని మళ్లించి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆవరణలోకి ప్రవేశించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడి సమయంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, వెంటనే భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు.దాడి జరిగిన వెంటనే చట్ట అమలు సిబ్బంది, సైన్యం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టారు. ప్రధాన కార్యాలయం లోపల ఇంకా కొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని , పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా భద్రతా దళాలు ఘటన జరిగిన వెంటనే ఎఫ్సీ ప్రధాన కార్యాలయం వెలుపలి రహదారిని మూసివేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. పెషావర్లోని పారామిలిటరీ ప్రధాన స్థావరంపై జరిగిన ఈ ఆత్మాహుతి దాడి, దేశ భద్రతకు పెను సవాలుగా పరిణమించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్బంధ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదులను నిలువరించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కారు దగ్ధానికి ఏసీ కారణమా? నిపుణులేమంటున్నారు? -
బాబర్ మెరుపులు.. ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్... ఆదివారం మూడో మ్యాచ్లో 69 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్స్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సయీమ్ అయూబ్ (8 బంతుల్లో 13; 2 సిక్స్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా... ఆఖర్లో ఫఖర్ జమాన్ (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ధనాధన్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జింబాబ్వే బౌలర్లలో సింకందర్ రజా 2 వికెట్లు పడగొట్టగా... బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ నగరవ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్ బుర్ల్ (49 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ సికందర్ రజా (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.పాకిస్తాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఉస్మాన్ తారిఖ్ ‘హ్యాట్రిక్’ సహా 4 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ రెండో బంతికి టోనీ (1)ని అవుట్ చేసిన అతడు... ఆ తర్వాత వరుస బంతుల్లో తషింగ ముసెకివా (0), వెల్లింగ్టన్ మసకద్జ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. మొహమ్మద్ నవాజ్కు 2 వికెట్లు దక్కాయి. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 6 పాయింట్లతో ఫైనల్కు చేరింది. టోర్నమెంట్ తదుపరి మ్యాచ్లో మంగళవారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.చదవండి: IND vs SA: పాపం సంజూ.. వరల్డ్ మోస్ట్ అన్లక్కీ క్రికెటర్! అగార్కర్పై ఫైర్ -
సరిహద్దులు మారొచ్చు.: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయిన సింధ్ అనే ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావొచ్చని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సింధ్ ప్రాంతం భారతదేశంలో భాగంగా లేదు కానీ ఆ నాగరికత సౌరసత్వం అనేది మనకే అనుసంధానమై ఉన్నందును తిరిగి భారత్లో విలీనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలో ఆదివారం సింధి సమాజ్ సమ్మేళన్ ఈవెంట్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎప్పుడో పాకిస్తాన్కు వెళ్లిపోయిన ఆ ప్రాంతం.. తిరిగి మన భారతదేశంలో భాగమవడానికి అవకాశం ఉందన్నారు. సింద్ అనేది ఎప్పటికీ మనదేనని, సరిహద్దులు అనేవి భౌగోళికంగా మారుతుంటాయన్నారు. కాగా, సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇది పాకిస్తాన్లోని నాలుగు ప్రధాన ప్రావిన్స్లలో ఒకటి. 1947లో భారత విభజన సమయంలో సింధ్ పాకిస్తాన్లో భాగమైంది. ఆ సమయంలో అనేక మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వెళ్లారు. సింధ్ ప్రాంతం మోహెంజోదారో వంటి పురాతన సింధు లోయ నాగరికత స్థలాలకు ప్రసిద్ధి. సింధ్ ప్రావిన్స్కు కరాచీ రాజధానిగా ఉంది. -
పాక్ నుంచి డ్రోన్లతో ఆయుధాలు
న్యూఢిల్లీ: సరిహద్దు వెంట భూమార్గంలో నిఘా కట్టుదిట్టంగా ఉండటంతో గగనతలంలో డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఆయుధాలను తరలిస్తున్న భారీ ముఠా గుట్టు రట్టయింది. చైనా తయారీ అత్యాధునిక ఆయుధాలను డ్రోన్లతో భారతగడ్డ మీదకు తీసుకొస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్చేశారు. ఈ సభ్యులకు పాకిస్తాన్లోని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో సంబంధాలున్న ఆయుధ సరఫరాదారులతో సంబంధాలున్నట్లు సమాచారం. తుర్కియేలో తయారైన పీఎక్స్ 5.7 మోడల్ పిస్టళ్లు, చైనా తయారీ పీఎక్స్3 పిస్టళ్లు ఐదు సహా 10 అత్యాధునిక పిస్టల్స్, 92 బుల్లెట్లను తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎక్స్ పిస్టల్లను సాధారణంగా ప్రత్యేక దళాలు మాత్రమే వినియోగిస్తాయి. పంజాబ్కు చెందిన మణ్దీప్ సింగ్, దల్వీందర్, యూపీలోని బాఘ్పత్కు చెందిన రోహన్ తోమర్, అజయ్ అలియాస్ మోనులనూ పోలీసులు అరెస్ట్చేశారు. ఐఎస్ఐతో సంబంధం ఉన్న, అమెరికాకు పారిపోయిన పంజాబ్ గ్యాంగ్స్టర్ సోనూ ఖత్రి అలియాస్ రాజేశ్ కోసం భారత్కు ఆయుధాలు తెప్పిస్తున్నారని నవంబర్ 19న పోలీసులకు సమాచారం అందింది. దీంతో రోహిణి పట్టణంలోని ఖాతూ శ్యామ్ ఆలయం వద్ద చాకచక్యంగా ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్చేసి వాళ్ల నుంచి పిస్టళ్లు, బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఫిలౌర్కు చెందిన మణ్దీప్, లూథియానాకు చెందిన దలీ్వందర్ చిన్ననాటి స్నేహితులు. గ్యాంగ్స్టర్ ఖత్రి సహాయకుడు జ్రస్పీత్తో వీళ్లకు సంబంధం ఉంది. జ్రస్పీత్ పాక్లోని ఐఎస్ఐ అనుబంధ సరఫరాదారుల ద్వారా ఈ ఆయుధాలను భారత్లోకి తెప్పిస్తున్నట్లు సమాచారం. రోహన్, అజయ్లు ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలోని గోగి గ్యాంగ్, భువూ గ్యాంగ్, కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు గ్యాంగ్లకు ఆయుధాలను సరఫరాచేస్తున్నారు. ఈ గ్యాంగ్లు సుపారీ తీసుకుని హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. -
పాకిస్తాన్లో భారీ పేలుడు.. 15 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ పేలడంతో 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్ తూర్పు ప్రాంతం ఫైసలాబాద్లోని గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత ప్రమాద స్థలం నుంచి ఫ్యాక్టరీ యజమాని పరార్ అవ్వగా.. ఫ్యాక్టరీ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనంతో పాటు సమీపంలో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. బాయిలర్ పేలడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.అయితే, తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల పరిశ్రమల్లో తరచుగా ప్రాణనష్టం జరుగుతోందని స్థానిక మీడియా చెబుతోంది. 2024లో ఫైసలాబాద్లోని ఒక టెక్స్టైల్ మిల్లులో జరిగిన బాయిలర్ పేలుడు కారణంగా 12 మంది కార్మికులు గాయపడ్డారు. గత వారం కరాచీలోని ఒక పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందారు. -
పాకిస్థాన్ వ్యవస్థలకు డిజిటల్ షాక్!
సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్ సైబర్ ఫోర్స్’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్పోర్ట్ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్పోర్ట్ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై రాన్సమ్వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్లను ఎన్క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
పోరులో పాక్ గెల్చిందట!
న్యూఢిల్లీ: పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది. పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు. -
SL Vs ZIM: రాణించిన సికందర్ రజా.. కష్టాల్లో శ్రీలంక
పాకిస్తాన్ ట్రై సిరీస్లో ఇవాళ (నవంబర్ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49), కెప్టెన్ సికందర్ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.మరుమణి 10, బ్రెండన్ టేలర్ 11, ర్యాన్ బర్ల్ 18, మున్యోంగ డకౌట్, ముసేకివా 11, బ్రాడ్ ఈవాన్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్ తీశారు.52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకఅనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక (0), కుసాల్ మెండిస్ (6), కుసాల్ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్ (9) ఔట్ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్లో ఉన్నారు.కాగా, పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ జరిగింది. నవంబర్ 18న జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వేపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.బెన్నెట్ (49), మరుమణి (30), సికందర్ రజా (34 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.లక్ష్య ఛేదనలో పాక్ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్ జమాన్ (44), ఉస్మాన్ ఖాన్ (37 నాటౌట్) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్ నవాజ్ (21 నాటౌట్) బ్యాట్తోనూ రాణించి పాక్ను విజయతీరాలకు చేర్చాడు. -
పాక్ ప్లేయర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్భజన్.. వీడియో
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య నో హ్యాండ్ షేక్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఈ టోర్నీలో పాక్తో ఆడిన మూడు మ్యాచ్లలోనూ టీమిండియా అంటిముట్టనట్టుగానే వ్యవహరించింది.ఆ తర్వాత మహిళల ప్రపంచకప్లో సైతం మన అమ్మాయిల జట్టు కూడా పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విముఖత చూపించారు. కానీ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇందుకు విరుద్దంగా ప్రవర్తించాడు. అబుదాబి టీ10 లీగ్లో హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అబుదాబి వేదికగా ఆస్పిన్ స్టాలియన్స్, నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం హర్భజన్.. నార్తర్న్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాకిస్తాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్లో జరిగిన 'వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్'లో పాకిస్తాన్తో మ్యాచ్లను యువరాజ్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ బాయ్కాట్ చేసింది. ఇండియా లెజెండ్స్ జట్టులో భజ్జీ కూడా సభ్యునిగా ఉన్నాడు.చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్?Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3— Ather (@Atherr_official) November 19, 2025 -
ఢిల్లీ పేలుడు పాక్ పనే.. ‘దాయాది నేత’ స్పష్టం
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు వెనుక పాక్ హస్తం ఉందని స్పష్టం అయ్యింది. ఈ దాడితో పాకిస్తాన్కు ప్రత్యక్ష సంబంధం ఉందంటూ ఆ దేశ రాజకీయ నేత ఒకరు బహిరంగంగా ప్రకటించడంతో దాయాది దేశం తీరు మరోమారు బయటపడింది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మంత్రి చౌదరి అన్వరుల్ హక్ పీఓకే అసెంబ్లీలో మాట్లాడుతూ ‘భారతదేశం ఉద్దేశపూర్వకంగా బలూచిస్తాన్లో అశాంతిని రేకెత్తిస్తే, తాము ఎర్రకోట నుండి కశ్మీర్ అడవుల వరకు దాడి చేస్తామని ముందే చెప్పామని, అల్లా దయతో మేము దీనిని చేసి చూపామని’ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ అధికారికంగా ఈ ప్రకటనపై స్పందించనప్పటికీ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశంతో యుద్ధం అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కాగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భారత్ అశాంతిని రేకెత్తిస్తోందన్న ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది.ఢిల్లీ పేలుడు కోసం జమ్ముకశ్మీర్లోని షోపియన్కు చెందిన ఇస్లామిక్ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ 10 మంది సభ్యుల సెల్ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అలాగే పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్ అలియాస్ హంజుల్లా దీనికి ఆర్గనైజర్ గా వ్యవహరించాడని వెల్లడయ్యింది. ఎన్ఐఏ అధికారులు ఈ సెల్లోని సభ్యులందరినీ అరెస్టు చేశారు. మరోవైపు ఈ పేలుడు తర్వాత జైష్ నేతలు భారతదేశంపై మరిన్ని దాడులు చేసేందుకు నిధులు కావాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకోసం వారు ‘సదాపే’యాప్ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఎన్ఐఏ దాడులతో జైష్ నేతల చర్యలకు అడ్డుకట్ట పడింది. ఇది కూడా చదవండి: యూరప్లో ‘హమాస్’ కుట్ర.. భగ్నం చేసిన ‘మొసాద్’ -
పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన నేపాల్
తొలిసారి జరుగుతున్న మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లో సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. కొలొంబో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 6 జట్లు (భారత్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూఎస్ఏ) పాల్గొంటున్న టోర్నీలో రెండో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ మెహ్రిన్ అలీ 77 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. రెండో అత్యధిక పరుగులు ఎక్స్ట్రాల రూపంలో (36) వచ్చాయి. పాక్ ఇన్నింగ్స్లో ఆరుగురు రనౌట్లయ్యారు.అనంతరం ఛేదనలో నేపాల్ ఓపెనర్, కెప్టెన్ బినిత పున్ చెలరేగిపోయింది. 54 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మన్కేశీ ఛౌదరీ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అజేయమైన 43 పరుగులు చేసింది. ఫలితంగా నేపాల్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. -
భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి పాక్ మంత్రి
పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్పై మరోసారి ఉద్రిక్త వాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం జరిగే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒకవేళ పూర్తిస్థాయిలో యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలన్నారు.ఇటీవలే భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆపరేషన్ సిందూర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం 88గంటల ట్రైలర్ మాత్రమేనన్నారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఖయ్యానికి కాలు దువ్వారు. ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ "నేను భారత్ను విస్మిరించడం లేదు అదే విధంగా నమ్మడం లేదు. నాఅంచనా ప్రకారం భారత్ నుంచి సరిహాద్దు చొరబాట్లైనా ఉండవచ్చు. లేదా పూర్తిస్థాయి యుద్ధమైనా జరగవచ్చు దేనికైనా మనం సిద్దంగా ఉండాలి" అని ఆసిఫ్ అన్నారు.అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన ఖవాజా గతంలోనూ ఇలానే కూతలు కూశారు. భారత్, ఆప్గాన్ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధం చేస్తామని ప్రకటించారు. పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఆదేశంలోని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈ నెల 10 ఎర్రకోట కారు బాంబు దాడిలో సైతం పాకిస్థాన్కు చెందిన ఉగ్రసంస్థ జైష్ మహమ్మద్కు సంబంధాలున్నాయని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. -
జింబాబ్వేతో మ్యాచ్.. బాబర్ ఆజామ్ అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే, శ్రీలంకతో ముక్కోణపు టీ20 సిరీస్ను పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ పేలవంగా ఆరంభించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వేపై బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఆజామ్ కేవలం మూడు బంతులే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్లో వికెట్ల ముందు ఈ పాక్ మాజీ కెప్టెన్ దొరికిపోయాడు. బాబర్ ఆజమ్కు గత ఆరు టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో ఇది మూడో డక్. ఈ క్రమంలో అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డౌకౌటైన రెండో పాక్ ఆటగాడిగా బాబర్ నిలిచాడు. ఇంతకుముందు ఈ అవాంఛిత రికార్డు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో అఫ్రిదిని ఆజామ్ అధిగమించాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ ఆక్మల్, యువ ఓపెనర్ సైమ్ అయూబ్లు సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు. ఆయూబ్, ఆక్మల్ టీ20ల్లో ఇప్పటివరకు పది సార్లు డకౌటయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ ఆటగాళ్లు వీరే..👉సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్ల్లో)👉ఉమర్ అక్మల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్ల్లో)👉షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్ల్లో)👉 కమ్రాన్ అక్మల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్ల్లో)👉మహ్మద్ హఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్ల్లో)👉మహ్మద్ నవాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్ల్లో) -
పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్ను పాకిస్తాన్ విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాక్ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (36 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సికందర్ రజా (24 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మరుమని (22 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా, సల్మాన్ మీర్జా, సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి విజయం సాధించింది. ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (28 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (12 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (22; 1 ఫోర్, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (1), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్.. అయినా సెమీస్కు భారత్ -
చెలరేగిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఇవాళ (నవంబర్ 18) ప్రారంభమైన ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. రావల్పిండి వేదికగా పసికూన జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో సత్తా చాటారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ తొలుత ఇబ్బంది పడింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (49), తదివనషే మరుమణి (30) జింబాబ్వేకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్కు 8 ఓవర్లలో 72 పరుగులు జోడించారు. ఆతర్వాత పాక్ బౌలర్లు లైన్లోకి రావడంతో జింబాబ్వే పతనం మొదలైంది. ఓ పక్క పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో కెప్టెన్ సికందర్ రజా (34 నాటౌట్) ఒంటిపోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించింది. ఓపెనర్లు బెన్నెట్, మరుమణి, సికందర్ రజాతో పాటు జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రెండన్ టేలర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ర్యాన్ బర్ల్ (8), టోనీ మున్యోంగా (3), తషింగ ముసేకివా (2), బ్రాడ్ ఈవాన్స్ (2), టినోటెండా మపోసా (1), రిచర్డ్ నగరవ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ (4-0-22-2), అబ్రార్ అహ్మద్ (4-0-28-1), సైమ్ అయూబ్ (4-0-31-1), షాహీన్ అఫ్రిది (4-0-34-1), సల్మాన్ మీర్జా (3-0-21-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలుత వీరంతా ధారాలంగా పరుగులు సమర్పించుకున్నా, ఆతర్వాత కుదురుకున్నారు. ముఖ్యంగా అబ్రార్, నవాజ్ జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ టోర్నీలో పాక్, జింబాబ్వేతో పాటు శ్రీలంక పాల్గొంటుంది. చదవండి: టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్లు..! -
శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్ ఆయుధం
పాకిస్తాన్ వేదికగా ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్కు (Pakistan Tri Series) ముందు శ్రీలంక జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. తొలుత అనారోగ్యం కారణంగా కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు. తాజాగా స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం (హామ్స్ట్రింగ్) కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అసలంక స్థానంలో దసున్ షనకకు కెప్టెన్గా నియమించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. హసరంగకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్పిన్ ఆయుధాన్ని (విజయకాంత్ వియాస్కాంత్) జట్టులోకి తీసుకుంది.23 ఏళ్ల వియాస్కాంత్ (Vijayakanth Viyaskanth) ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20నే ఆడినప్పటికీ.. ఐపీఎల్ సహా దేశవాలీ టోర్నీల్లో తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన వియాస్కాంత్ను స్వదేశంలో భవిష్యత్ హసరంగగా కీర్తిస్తుంటారు. పాక్ ట్రై సిరీస్లో వియాస్కాంత్ ప్రమాదకర బౌలర్గా మారే అవకాశముంది.కాగా, పాకిస్తాన్ ట్రై సిరీస్లో శ్రీలంకతో పాటు జింబాబ్వే పాల్గొంటుంది. ఇవాళ జరిగే టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి. శ్రీలంక తమ తొలి మ్యాచ్ను నవంబర్ 20న జింబాబ్వేతో ఆడనుంది. పాక్ చేతిలో చిత్తుట్రై సిరీస్కు ముందు పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ముగిసిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.పాక్ ట్రై సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, విజయ్కాంత్ వియాస్కాంత్, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.చదవండి: భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..! -
బాబర్ ఆజమ్కు భారీ షాక్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్కు (Babar Azam) భారీ షాక్ తగిలింది. నవంబర్ 16న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో మితిమీరి ప్రవర్తించినందుకు ఐసీసీ అతడికి జరిమానా విధించింది. ఆ మ్యాచ్లో బాబర్ ఔటయ్యాక వికెట్లను బ్యాట్తో తన్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఇలాంటి చర్య లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీని ఫలితం బాబర్ డిసిప్లినరీ రికార్డుకు ఓ డీ మెరిట్ పాయింట్ యాడ్ చేయబడింది. అలాగే ఆ మ్యాచ్కు సంబంధించిన ఫీజ్లో 10 శాతం కోత విధించబడింది. గడిచిన 24 నెలల కాలంలో బాబర్ చేసిన మొదటి తప్పిదం ఇదే కావడంతో ఐసీసీ నామమాత్రపు చర్యలతో వదిలిపెట్టింది. ఐసీసీ చర్యలను బాబర్ కూడా అంగీకరించాడు. దీంతో విచారణ నుంచి మినహాయింపు పొందాడు.ఆ మ్యాచ్కు ముందే బాబర్ తన సుదీర్ఘ సెంచరీ కలను నెరవేర్చుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో 807 రోజులు, 83 మ్యాచ్ల తర్వాత బాబర్ సాధించిన తొలి సెంచరీ ఇదే. ఈ మత్తులో ఉండగానే ఐసీసీ బాబర్కు షాకిచ్చింది. కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పాకిస్తాన్ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సదీరా సమరవిక్రమ (65 బంతుల్లో 48; 2 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... కెప్టెన్ కుశాల్ మెండిస్ (34), పవన్ రత్నాయకే (32), కామిల్ మిశారా (29), పతుమ్ నిసాంక (24) పర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ వసీమ్ (3/47) లంకను దెబ్బ తీయగా...హారిస్ రవూఫ్, ఫైసల్ అక్రమ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొహమ్మద్ రిజ్వాన్ (92 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు), ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి పాక్ను గెలిపించారు. హుస్సేన్ తలత్ (42 నాటౌట్), బాబర్ ఆజమ్ (34) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఈ సిరీస్ తర్వాత పాక్ సొంతగడ్డపైనే శ్రీలంక, జింబాబ్వేతో కలిపి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి. చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది? -
పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్
పాకిస్తాన్లో రేపటి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కాబోయే ముక్కోణపు సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వే కూడా పాల్గొంటున్న ఈ టోర్నీకి ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) దూరమయ్యాడు (అనారోగ్యం కారణంగా). అసలంక తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్గా షనక నియామకాన్ని లంక క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది.అసలంకతో పాటు మరో లంక బౌలర్ కూడా పాక్ ట్రై సిరీస్కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కూడా అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఈ ట్రై సిరీస్లో శ్రీలంక తమ తొలి మ్యాచ్ను నవంబర్ 20న ఆడనుంది. రావల్పిండి వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది.పాక్ ట్రై సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.షనక నాయకత్వ అనుభవంషనక లంక కెప్టెన్సీ బాధ్యతలు మోయడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్లో తొలిసారి శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి 2023 వరకు జట్టును ముందుండి నడిపించాడు. షనక నాయకత్వంలో శ్రీలంక 48 T20I మ్యాచ్లలో 22 విజయాలు సాధించి, 24 ఓటములను ఎదుర్కొంది. రెండు మ్యాచ్లు టై అయ్యాయి.పాక్ చేతిలో చిత్తుట్రై సిరీస్కు ముందు పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్లో వన్డే సిరీస్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.నిన్ననే ముగిసిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు
నసీరాబాద్: పాకిస్తాన్లో ‘జాఫర్ ఎక్స్ప్రెస్’కు పెను ప్రమాదం తప్పింది. బలూచిస్తాన్లో గల నసీరాబాద్ జిల్లా గుండా రైలు వెళుతుండగా బాంబు దాడి జరిగింది. అయితే రైలు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. షాహీద్ అబ్దుల్ అజీజ్ బుల్లో ప్రాంతంలో రైలు ట్రాక్ను దాటిన కొన్ని సెకన్ల తర్వాత రైల్వే ట్రాక్ వెంట అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలిపోయింది. ఈ ఘటనతో రైల్వే ట్రాక్కు కొంత నష్టం వాటిల్లినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు రోజుల పాటు నిలిపివేసిన తర్వాత, ఈ రైలు సేవలు తిరిగి ప్రారంభించిన వెంటనే ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే ఈ రైలుపై జరుగుతున్న దాడుల పరంపరలో ఈ తాజా ఘటన ఒకటి. దాడి జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దర్యాప్తు ప్రారంభించాయి. నసీరాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గులాం సర్వార్, దాడికి పాల్పడినవారిని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ధృవీకరించారు. ట్రాక్కు నష్టం జరగడం వలన క్వెట్టాతో పాటు ఇతర ప్రాంతాల మధ్య రైలు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.జాఫర్ ఎక్స్ప్రెస్ గత కొన్ని నెలలుగా తిరుగుబాటు గ్రూపులకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ సంవత్సరంలో మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లలో ఈ రైలుపై పలు దాడులు జరిగాయి. మార్చిలో నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఈ రైలును హైజాక్ చేసింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. అక్టోబర్లో సింధ్లో జరిగిన పేలుడులో ఐదు కోచ్లు పట్టాలు తప్పగా, సెప్టెంబర్, ఆగస్టులలో జరిగిన దాడులలోనూ రైలుకు నష్టం వాటిల్లింది. పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు.బలూచిస్తాన్ భౌగోళిక పరిస్థితులను అనువుగా చేసుకున్న తిరుగుబాటు గ్రూపులు కీలకమైన రైలు మౌలిక సదుపాయాలు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ రైల్వేలు నవంబర్ 9 నుండి 12 వరకు రైలు కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, సేవలు తిరిగి ప్రారంభమైన వెంటనే దాడి జరగడం, భద్రతా వ్యవస్థకు సవాలుగా మారింది. పదేపదే జరుగుతున్న ఈ దాడులు రైల్వే ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి. ఇది కూడా చదవండి: మదీనాలో ఘోర ప్రమాదం.. మృతుల్లో హైదరాబాదీలు -
భారత మహిళ నిర్వాకం.. పర్యాటకురాలిగా పాక్కు వెళ్లి..
లాహోర్/చండీగఢ్: పాకిస్తాన్లో గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనే వంకతో వాఘా సరిహద్దు గుండా దాయాది దేశంలో అడుగుపెట్టిన 48 ఏళ్ల భారతీయురాలు మరుసటి రోజే కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో పాకిస్తానీ పోలీసుల దర్యాప్తుతో ఆమె స్థానిక పాకిస్తానీయుడిని పెళ్లాడినట్లు వెల్లడైంది.సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన పాక్ జాతీయుడిని పేరు, మతం మార్చుకుని వివాహం చేసుకుని అతడితో కలిసి ఎటో వెళ్లిపోయినట్లు లాహోర్లోని పాక్ పోలీసులు శనివారం తెలిపారు. ఆమె జాడ కోసం తాము కూడా వెతుకుతున్నామని చెప్పారు. పంజాబ్లోని కపుర్తలా జిల్లా అమేనీపూర్ గ్రామానికి చెందిన సరబ్జీత్ కౌర్ నవంబర్ మూడో తేదీన 2,000 మంది సిక్కు పర్యాటకులతో కలిసి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు వెళ్లారు. తర్వాతి రోజే ఫరూఖాబాద్ పరిధిలోని షేఖూపురాకు చెందిన నసీర్ హుస్సేన్ను ఆమె పెళ్లాడారు. కౌర్ పేరును నూర్గా మార్చుకున్నారు. కౌర్కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్నారు. మరోవైపు. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. New footage shows, Sarbjit Kaur, Indian Sikh pilgrim on Pakistan visit, getting married to a local person.pic.twitter.com/fdOZnwXvcI— Sidhant Sibal (@sidhant) November 15, 2025


