breaking news
Pakistan
-
ఇమ్రాన్ఖాన్ 85 శాతం కంటి చూపు కోల్పోయారు..!
కరాచీ: ప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కల్గిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్ఖాన్ యొక్క కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్ పేర్కొన్నారు. ఇమ్రాన్ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతోనే కంటి చూపు సన్నగిల్లినట్లు ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్త గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.కొన్ని నివేదికలు ఆయనకు సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంటున్నాయి.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..? -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
అమెరికాపై పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు. పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ఉగ్రవాదంపై ఖవాజా చేసిన వ్యాఖ్యలు.. భారత్ తరచూ చేసే ఆరోపణలకు బలం చేకూర్చాయి. భారత్కు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఇటీవల పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమెరికా–పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను వాడుకుందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం మాకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో “జిహాద్” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్ నెట్వర్క్లు, పాలనా వైఫల్యాలు వల్ల పెరుగుతోందని ఆయన అంగీకరించారు. అమెరికా మద్దతును అనుసరించడం ఒక తీవ్రమైన నష్టంగా ఆయన అభివర్ణించారు. దీని పరిణామాలు పాకిస్తాన్కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.జిహాద్ యుద్ధాలను చట్టబద్ధం చేయడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చారని, ఆ సైద్ధాంతిక మార్పులు చాలా వరకు నేటికీ ఉన్నాయని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980లలో ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యకత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడింది. పాకిస్తాన్ తనది కాని సంఘర్షణలలో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేము అంటూ వ్యాఖ్యానించారు.కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్–అమెరికా సంబంధాలు1999 కార్గిల్ యుద్ధం తర్వాత అమెరికా–దక్షిణాసియా సంబంధాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు మద్దతు ఇచ్చారు. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను వాషింగ్టన్కు పిలిచి, సైన్యం వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన తర్వాత అమెరికా–భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. 2000లో క్లింటన్ భారతదేశాన్ని సందర్శించడం దీనికి సంకేతం. అయితే, కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించింది. -
పాకిస్తాన్దే పైచేయి
కొలంబో: గత టి20 ప్రపంచకప్లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో శనివారం నెదర్లాండ్స్తో జరిగిన తొలి పోరులో కష్టమ్మీద గట్టెక్కిన పాక్... అమెరికాపై మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ను ముగించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాక్ 32 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా... బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (19)తో తొలి వికెట్కు 54 పరుగులు (31 బంతుల్లో) జోడించిన ఫర్హాన్... మూడో వికెట్కు బాబర్ ఆజమ్తో 53 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. అమెరికా బౌలర్ షాల్విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభమ్ రంజనే (51; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో పాటు జహంగీర్ (49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మిలింద్ కుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. ఆఫ్ స్పిన్నర్ తారిఖ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. 1982లో తొలి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇ చ్చిన సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఫ్లడ్లైట్లతో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కావడం విశేషం. టి20 ప్రపంచకప్లో నేడుదక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్వేదిక: అహ్మదాబాద్; ఉదయం 11 గం‘‘ నుంచిఆ్రస్టేలియా X ఐర్లాండ్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గం‘‘ నుంచిఇంగ్లండ్ X వెస్టిండీస్ వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. కొన్నిరోజుల క్రితం టీమిండియాపై అద్బుతంగా ఆడిన అమెరికా జట్టు.. ఇప్పుడు పాక్పై కూడా అదే జోరు ప్రదర్శించింది. కానీ గెలుపు రుచిచూడలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరు చేసింది. ఫర్హాన్ 73 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బాబల్ ఆజమ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.అనంతరం అమెరికా జట్టు.. దూకుడుతో ఛేదన మొదలుపెట్టింది. కానీ వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ.. 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభం రంజనే 51, షయన్ జహంగీర్ 49 పరుగులతో మెప్పించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్ 3, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. -
T20 WC 2026: పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా పేసర్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 10) పాకిస్తాన్, యూఎస్ఏ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గత ఎడిషన్లో యూఎస్ఏ పాక్పై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ఏ ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్లో భారత జట్టుకు కూడా పోటీనివ్వడం ఈ ప్రాధాన్యతను రెట్టింపు చేసింది. యూఎస్ఏ ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నుంచే పాక్ను మరోసారి చిత్తు చేస్తామని సవాళ్లు చేశారు. ఇది కూడా ఓరకంగా ఈ మ్యాచ్కు హైప్ తెచ్చిపెట్టింది. యూఎస్ఏ జట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లతో పాటు పాక్ మూలాలున్న ఆటగాళ్లు (ఎహసాన్ ఆదిల్, మొహమ్మద్ మొహిసిన్) కూడా ఉన్నారు. వీరు కూడా పాక్ ఓడిస్తామని ఛాలెంజ్ చేయడం ఈ మ్యాచ్పై ఆసక్తిని మరింత పెంచింది.కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ ప్రారంభంలో పాక్ తడబడింది. అయితే పాక్ను తొలుత ఇబ్బంది పెట్టింది మాత్రం పాక్ మూలాలున్న ఆటగాళ్లు కాని, భారత మూలాలున్న ఆటగాళ్లు కానీ కాదు. షాడ్లే వాన్ ష్కాల్విక్ అనే సౌతాఫ్రికా మూలాలున్న ఆటగాడు. ఈ షాల్విక్ తొలి మ్యాచ్లో భారత్ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ టీమిండియాపై 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.ఇప్పుడు ఇదే బౌలర్ పాక్ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన సైమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా (1) వికెట్లు తీసిన షాల్విక్.. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్ ఝులిపిస్తున్న షాదాబ్ ఖాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (1) వికెట్లు తీశాడు. మొత్తంగా షాల్విక్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో పాక్ మూలాలున్న బౌలర్ మొహమ్మద్ మొహిసిన్ కూడా పాక్ను ఇబ్బంది పెట్టాడు. మొహిసిన్ పెద్దగా వికెట్లు తీయకపోయినా (4-0-27-1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో పాక్ మూలాలున్న పాక్ బౌలర్ ఎహసాన్ ఆదిల్ మాత్రం ధారాళంగా (3-0-29-0) పరుగులు సమర్పించుకున్నారు. భారత మూలాలున్న బౌలర్లు సౌరభ్ నేత్రావల్కర్ (4-0-40-1), హర్మీత్ సింగ్ (4-0-41-1) కూడా బాగానే పరుగులు ఇచ్చారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజమ్ (30) పర్వాలేదనిపించాడు. -
పాక్లో తక్షశిలకు ఎందుకెళ్లారు?
గువాహటి: అస్సాం బీజేపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మధ్య పరస్పర ఆరోపణల అగ్ని మరింత రాజుకుంది. ‘‘భార్య ఉద్యోగ పనుల నిమిత్తం 2013 డిసెంబర్లో పాకిస్తాన్కు వెళ్లానని గోగోయ్ చెప్తున్నారు. అయితే వీసా అనుమతుల ప్రకారం లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లకు మాత్రమే పర్యటించే వీలుంది. కానీ రావల్పిండి జిల్లాలోని తక్షశిలకు గోగోయ్ దంపతులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?. వీసా పరిధిలోని నగరాలకు వెళ్లేందుకు పాకిస్తాన్లో స్థానికంగా గొగోయ్కు ఎవరు అనుమతి ఇచ్చారు?. రావల్పిండి జిల్లాల పర్యటన ఏర్పాట్లు స్థానికంగా చేసిందెవరు?. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయం సైతం రావల్పిండిలోనే ఉంది. పాక్ నిఘా వర్గాలతో గొగోయ్కు సంబంధం ఉందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా?. గొగోయ్ తన పాక్ అనధికర, దేశవ్యతిరేక పర్యటనపై వివరణ ఇవ్వాల్సిందే’’అని సీఎం హిమంత డిమాండ్చేశారు. హిమంత మాటల్లో నిజం లేదు: గొగోయ్హిమంత ఆరోపణలపై గొగోయ్ సోమవారం దీటుగా ప్రతిదాడిచేశారు. ‘‘నా కుటుంబానికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు. భార్య పనినిమిత్తం పది రోజులు మాత్రమే పాక్కు వెళ్లివచ్చాం. అక్కడ ఎవరినీ కలవలేదు. ఈ విషయం అస్సాం పోలీస్ రిపోర్ట్లోనూ స్పష్టంగా ఉంది. నివేదిక వచ్చి ఆరు నెలలవుతుంటే ఇన్నాళ్లూ హిమంత ఏం చేస్తున్నట్లు?. హిమంత తన కుటుంబం ఆక్రమించిన వేల ఎకరాల భూముల అంశం నుంచి అస్సామీల దృష్టి మరల్చేందుకే నాపై అభాండాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు కులాలకు ఎస్టీ హోదా, మాదకద్రవ్యాలు హోరెత్తడం వంటి సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది. అవి వదిలేసి బంగ్లాదేశీ ముస్లిం వలసదారు(మియా)లను లక్ష్యంగా చేసుకుంటూ వాళ్లను రైఫిల్తో గురిపెట్టి కాల్చుతున్నట్లు ఉన్న వీడియోను ఆన్లైన్లో విస్తృత ప్రచారంచేశారు. ఇలాంటి మతవిద్వేష వీడియోలను బీజేపీ అస్సాం విభాగం సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్చేసి తీవ్ర విమర్శలు రాగానే తొలగించారు. ఈ వివాదంలో పోలీసులు సూమోటోగా కేసు నమోదుచేసి సీఎంపై నేరం మోపాలి’’అని గొగోయ్ డిమాండ్చేశారు. -
టీ20 వరల్డ్కప్ నుంచి పాక్ మూలాలున్న ఆటగాడి తొలగింపు
టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్ భారత్ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్ను నిందించడం సరికాదని వార్నింగ్ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్లో వారు న్యూజిలాండ్ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్ -
డాలస్లో కాదు.. పాక్లో ఉన్నట్లుంది!.. అమెరికా నేత ఆవేదన
న్యూయార్క్: అమెరికాలో ముస్లిం వలసల పెరుగుదలపై రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బ్రాండెన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో పలు ప్రాంతాలు భారీగా ‘ఇస్లామీకరణ’కు గురవుతున్నాయన్నారు. డాలస్ నగరంలో ఇస్లామీకరణ స్థానికులను ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు.‘‘డాలస్లోని కొన్ని మాల్స్ను సందర్శించండి.. మీరు డాలస్లో కాదు, పాకిస్తాన్లో ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని శుక్రవారం రియల్ అమెరికాస్ వాయిస్ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ‘‘తరాలుగా ముస్లింల యాజమాన్యంలో ఉన్న భూముల దగ్గర మసీదులు పుట్టుకొస్తున్నాయి. అవి అసలైన అమెరికాను చంపుతున్నాయి. స్థానిక సంస్కృతిని మార్చేస్తున్నాయి’’ అన్నారు. ముస్లిం ప్రముఖులతోపాటు పలువురు జర్నలిస్టులు, హక్కుల సంఘాల నేతలు గిల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన విద్వేషాలను రెచ్చగొడుతూ ముస్లిం సమాజంపై అపోహలు పెంచుతున్నారని మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్లో అతి పిన్నవయస్కుడైన గిల్ గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీపై, భారతీయుల వలసపై నోరుపారేసుకున్నారు. -
మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్ వేగవంతం
న్యూఢిల్లీ: ముష్కర మూకల దాడులతో పేట్రేగిపోతున్న పాకిస్తాన్కు బుద్ధిచెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ జల జీవనాడిని దెబ్బకొట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఇందులోభాగంగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. రామ్బాన్ జిల్లాలో రూ.5,129 కోట్లతో నిర్మించతలపెట్టిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాజాగా టెండర్లు పిలిచింది. ప్రభుత్వ రంగ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ టెండర్లను ఆహ్వానించింది. పాకిస్తాన్కు నీటి అవసరాలు తీర్చే చినాబ్ నదిపై ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 1,856 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్పూర్తయితే ఈ ప్రాంతంలోనే అతిభారీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్గా ఇది నిలిచిపోనుంది. సిందూ నదీజలాల ఒప్పందాన్ని స్తంభింపజేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ధిచెప్పడంతోపాటు సరిహద్దు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్ బాటలుపరుస్తుందని ఎన్డీఏ సర్కార్ తాజాగా పునరుద్ఘాటించింది. కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి డ్యామ్, సొరంగాలు, అనుబంధ పనులకు సంబంధించిన టెండర్లు వచ్చే నెల 12వ తేదీతో మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. టెండర్లలోని నిబంధనలు బిడ్ అనేది గరిష్టంగా 180 రోజులపాటు మనుగడలో ఉంటుంది. గరిష్టంగా 3,285 రోజుల్లోపు ప్రాజెక్ట్ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏకబిగిన దాదాపు పదిసంవత్సరాలపాటు డ్యామ్ నిర్మాణపనులు జరగనున్నాయి. దశాబ్దాల కల...: ఈ ప్రాంతంలో సావల్కోట్ హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ కట్టాలని భారత్ దశాబ్దాల క్రితమే భావించింది. అయితే గతంలో పాక్తో సింధూ నదీజలాల ఒప్పందం అమల్లో ఉండటం, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. అయితే గత ఏడాది పహల్గామ్ పచ్చికమైదానాల్లో 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు పాయింట్ బ్లాంక్లో కాల్చి హేయమైన చర్యలకు దిగడంతో భారత్ ఉగ్రరూపం దాల్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరుల శిక్షణ శిబిరాలతోపాటు పాక్ వైమానిక స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది. ఆ తర్వాత సిందూ నదీజలాల ఒప్పందం నుంచి గత ఏడాది ఏప్రిల్ నెలలో తప్పుకుంది. పాకిస్తాన్కు నీటికష్టాలు పెంచాలనే ఉద్దేశంతో వెంటనే పాత సావల్కోట్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జమ్మూకశీ్మర్ విద్యుత్ కష్టాలు తీరడంతోపాటు జాతీయ పవర్గ్రిడ్ సామర్థ్యం సైతం పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలు మెరుగవనున్నాయి. -
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాశ్మీర్ విషయంలో పాక్ కు షాక్ ఇచ్చిన అమెరికా
-
పాకిస్తాన్ ఇమ్రాన్ఖాన్కు మరో బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు వారికి.. 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో, ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే, వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. అనంతరం, బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో, తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు.ఈ సందర్బంగా నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయిన తర్వాత వరుస కేసులతో సతమతమవుతున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమేనని పాక్ చర్చ నడుస్తోంది. -
కశ్మీర్పై పాక్ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. భారత్పై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తాజాగా బయటకు వచ్చింది. మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో కశ్మీర్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జైషే ఉగ్రవాది మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ఆసిమ్ మునీర్ ‘ఘజ్వా-ఎ-హింద్’గా అభివర్ణించాడని అన్నాడు. యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్ను విముక్తి చేస్తామని చెప్పాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.అయితే, భారత్పై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘ఘజ్వా ఎ హింద్’ సూచిస్తుంది. మరోవైపు.. జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారి మధ్య సంబంధాలు మాత్రం ఇలా బయటకు వస్తున్నాయి. ఈ సమావేశంలో కొత్తగా చేరిన మిలిటెంట్లు కూడా పాల్గొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పాకిస్తాన్లోని బహిరంగ వేదికలను పదేపదే ఉపయోగించుకుని జిహాద్ను కీర్తిస్తున్నారు. భారత్లో ఘర్షణను మతపరమైన కోణంలో చిత్రీకరిస్తున్నారు. తరచుగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉన్న సమక్షంలోనే ఇది జరుగుతోంది.ఇక, గత సంవత్సరం ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తరువాత భారత్.. ఉగ్రవాదంపై కఠినమైన దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్, ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఎయిర్బేస్లపై దాడి చేసి దాయాదిని కోలుకోలేని దెబ్బకొట్టింది. అలాగే, పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు సైతం విధించింది. -
పాకిస్తాన్లో దాడి.. ఐఎస్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియాలకు చెందిన మసీదులో శుక్రవారం జరిగిన భారీ ఆత్మాహుడి దాడికి తామే కారణమని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)శనివారం ప్రకటించుకుంది. ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 169 మంది గాయపడటం తెల్సిందే. తమ బాంబర్ను మసీదు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, వారిపైకి కాల్పులు జరిపి లోపలున్న వారికి సమీపంలోకి వెళ్లి పేల్చేసుకున్నాడని తెలిపింది.ఇదే సమయంలో సిరియాలో షియా సాయుధ గ్రూపులకు పాకిస్తాన్ మానవ వనరుగా మారిందని, ఇక్కడి నుంచే రిక్రూట్లు జరుగుతున్నాయని ఆరోపించింది. అందుకే తాము పాకిస్తాన్లోని షియాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపింది. ఇలా ఉండగా, శుక్రవారం నాటి ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారి సహా నలుగురిని ఖైబర్ ప్రావిన్స్లోని పెషావర్, నౌషేరాల్లో అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా ఆత్మాహుతి బాంబర్ను పెషావర్కు చెందిన యాసిర్గా గుర్తించామన్నారు. ఇతడు ఐదు నెలలపాటు అఫ్గానిస్తాన్లో ఉండి ఆయుధాల వినియోగంతోపాటు ఆత్మాహుతి దాడులకు శిక్షణ తీసుకున్నాడన్నారు. -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
భారత్ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్ మంత్రి ఆవేదన
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్కు ఫార్మా రూపంలో మరో షాక్ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి 400 మిలియన్ డాలర్లు అవుతోందని పాక్ ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం, భారత్పై ఆగ్రహంతో పాక్ ఆంక్షలు విధించడంతో ఇటు ఇండియా కూడా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే ఫార్మా ఉత్పత్తులు(మెడిసిన్) కేంద్రం నిలిపివేసింది. దీంతో, పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. మందుల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి ముస్తాఫా కమాల్ స్పందిస్తూ.. భారత వ్యాక్సిన్లు లేకపోవడంతో మా దేశంపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం ఏటా దాదాపు 400 మిలియన్ డాలర్లతో వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో 49 శాతం ఖర్చులను గావీ(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (GAVI)) ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51శాతం వాటా ప్రభుత్వం భరిస్తోంది. స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే.. 2031 నాటికి దిగుమతి కోసం దాదాపు రూ.10వేల కోట్లు (1.2 బిలియన్) ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో మా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు 2031 నాటికి ముగుస్తుందని కూడా ఆయన చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది కొవిడ్ టీకాలను భారత్ నుంచి సేకరించడంలో గావీ సహాయం చేసిందన్నారు. దాతల మద్దతుపై ఆధారపడకుండా స్థానికంగా టీకాల తయారీకి సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అయితే, పాక్ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తుంది. అయినప్పటికీ ఏదీ స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. వ్యాక్సిన్లు అన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పాకిస్తాన్లో దాదాపు 24కోట్ల జనాభా ఉండగా.. ఏటా 62 లక్షల జననాలు నమోదువుతున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ల డిమాండ్ భారీగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు, ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (GAVI).. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు టీకాలు అందించేందుకు పనిచేస్తుంది. -
పాకిస్తాన్కు అమెరికా బిగ్ షాక్ POK భారత్లో అంతర్భాగమే..
-
మసీదులో ఆత్మాహుతి దాడి.. భారీగా పెరుగుతున్న మరణాలు
-
పాక్కు షాకిచ్చిన అమెరికా..!
దాయాది పాకిస్తాన్.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్ బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో వారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తమతో అమెరికా బంధం శాశ్వతమైనది అన్నంతగా ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అమెరికా చెప్పిన ప్రతీ విషయానికి ఊ కొట్టింది పాక్. అయితే పాకిస్తాన్ను మింగుడు పడని విషయం తాజాగా చోటు చేసుకుంది. ఒకటి భారత్తో అమెరికా డీల్ ఒకటైతే, మరొకటి జమ్మూ-కశ్మీర్ మొత్తం భాగం అనేది ఎప్పటికీ భారత్దే అని ప్రపంచానికి తెలిసేలా అమెరికా ట్వీట్ చేసింది. భారత్-అమెరికాల ట్రేడ్ డీల్ కుదిరిన గంటల వ్యవధిలోనే భారత్ మ్యాప్ను అమెరికా పోస్ట్ చేసింది. ఇందులో కశ్మీర్ను భారత్ మ్యాప్లోనే ఉంచి మరీ పోస్ట్ పెట్టింది. యూఎస్ అధికారిక ‘X ’ హ్యాండిల్లో భారత్ మ్యాప్ పోస్ట్ పెట్టింది. ఆ మ్యాప్లో జమ్మూ & కశ్మీర్, లడఖ్, అలాగే పీఓకే(POK) భారత్లో భాగంగా చూపబడింది. ఫలితంగా భారత్ యొక్క మ్యాప్ను అమెరికా అంగీకరిస్తుందనే సంకేతాలిచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ‘కశ్మీర్పై హక్కు’ అనే వాదనను తిరస్కరిస్తోందని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దాంతో పాకిస్తాన్ గట్టి షాక్ తగిలింది,. From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1— United States Trade Representative (@USTradeRep) February 6, 2026 ఇవీ చదవండి:ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
పాక్లో ఆరని చిచ్చు.. బలూచ్ విముక్తి సాధ్యమయ్యేనా?
బలూచిస్తాన్.. పాక్లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే కాదు, అది వారి అస్తిత్వానికి సంబంధించినది. అంతర్గత కల్లోలాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతానికి నిజంగానే విముక్తి లభిస్తుందా? లేదా ఈ మంట ఇలానే రగులుతుటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.భూభాగంలో 44 శాతం వాటాపాకిస్తాన్లోని మొత్తం భూభాగంలో 44 శాతం వాటా కలిగిన బలూచిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన అశాంతికి గురవుతోంది. ఈ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపులు స్వయంప్రతిపత్తితో పాటు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దాడులను ముమ్మరం చేస్తున్నాయి. అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, తమ ప్రాంతం వెనుకబడి ఉందన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.మహిళలు సైతం తిరుగుబాటు బలూచ్ తిరుగుబాటుదారులు కఠినమైన పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని, ఆధునిక ఆయుధాలతో పాక్ భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ పోరాటంలో మహిళలు ఆత్మహుతి దాడులకు సైతం సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం అక్కడి సామాజిక అసంతృప్తి ఎంతగా ఉందో స్పష్టం చేస్తోంది.కీలక సరిహద్దులతో ప్రత్యేక గుర్తింపుసుమారు 3,47,190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న బలూచిస్తాన్.. విస్తీర్ణంలో భారత్లోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఉమ్మడి వైశాల్యం కంటే పెద్దది. దీనికి పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు ఉన్నాయి. భారత్తో నేరుగా సరిహద్దు లేనప్పటికీ, అరేబియా సముద్ర తీరంలోని 770 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది.చైనా ప్రయోజనాలుబలూచిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా చైనా చేపట్టిన ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ) ప్రాజెక్టు ఇక్కడి నుంచే సాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’కు ఇది సమీపంలో ఉండటంతో, ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా, పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.సామాజిక స్థితిగతులుసుమారు 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రావిన్స్లో 52 శాతం మంది బలూచ్లు. 36 శాతం పష్తూన్లు నివసిస్తున్నారు. రాజధాని క్వెట్టా నగరం ఈ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ బ్రాహుయి, హజారా వంటి మైనారిటీ వర్గాలు వారు కూడా ఉన్నారు. అయితే స్థానిక వనరులపై తమకు అధికారం లేకపోవడంపై ఇక్కడ నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి.పాలకుల తీవ్ర నిర్లక్ష్యంబలూచిస్తాన్ సహజ వనరుల గని. ఇక్కడ భారీ స్థాయిలో సహజ వాయువు, బంగారం, రాగి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఈ వనరుల ద్వారా వచ్చే ఆదాయం తమ అభివృద్ధికి కాకుండా, పాక్ కేంద్ర ప్రభుత్వానికే చేరుతోందని బలూచ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక దోపిడీయే వేర్పాటువాదానికి ప్రధాన కారణంగా మారుతోంది.‘మహా బలూచిస్తాన్’ ఆకాంక్షవేర్పాటువాద గ్రూపులు కేవలం పాకిస్తాన్లోని బలూచిస్తాన్తోనే ఆగకుండా, పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్లోని బలూచ్ ప్రాబల్య ప్రాంతాలను కలిపి ‘మహా బలూచిస్థాన్’ ఏర్పాటు చేయాలని కలలుగంటున్నాయి. అయితే మూడు దేశాల సరిహద్దులతో ముడిపడి ఉండటం వల్ల ఈ లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా, సవాలుతో కూడినదిగా మారింది.ఇదే అతిపెద్ద అవరోధంబలూచ్ నేతలు తమది స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా దీనిని గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై దౌత్యపరమైన మద్దతు లేకపోవడం దేశ స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద అడ్డంకిగా మారింది. చైనా వంటి శక్తులు పాకిస్తాన్కు అండగా నిలుస్తున్నంత కాలం, దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
మ్యాన్హోల్ మూతల దొంగలు.. పదేళ్లు జైలు, రూ.50 లక్షలు ఫైన్!
పొరుగు దేశం పాకిస్థాన్కి మ్యాన్హోల్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా కొత్తవి అమర్చగానే అలా మాయమైపోతున్నాయి. ఈ సమస్య ఎలా అరికట్టాలా అని ఆలోచించిన అక్కడి పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాక్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అందులో భాగంగానే ఈ సమస్య ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.ముఖ్యమంత్రి మరియం నవాజ్ వైరల్ వీడియోలో.. 'ఉదయం మేం మూతలు వేస్తున్నాం. రాత్రి అయ్యేసరికి అవి మాయమవుతున్నాయి. వాటిని దొంగిలించొద్దు. అలా దొంగిలించి అమ్మినా, వాటిని కొన్నా పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. మూతలు లేని మ్యాన్హోల్లో పడి ఎవరైనా చనిపోతే.. అందుకు కారణమైన వాళ్లకు పదేళ్లు జైలుశిక్ష, రూ.50 లక్షల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధిస్తాం' అని ఈమె చెప్పారు.ఒక్కో మ్యాన్హోల్ మూత బరువు 30 కిలోల వరకు ఉంటుంది. వాటిని స్క్రాప్గా అమ్మి రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పాక్లో పరిస్థితి అంత దారుణంగా తయారైంది.అలా ఓ మూత లేకపోవడంతోనే ఓ తల్లికూతురు చనిపోయారు. మరో చోట పడిపోయిన పాపని సహాయక సిబ్బంది కాపాడారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 45శాతం మంది పాక్ ప్రజలు పేదరికంలో.. 16.5 శాతం మంది కటిక పేదరికంలో ఉన్నారు. -
భారత్ని ముక్కలు చేస్తాం.. పాక్ సభలో LET తీవ్రవాది
21వ శతాబ్ధంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశమేదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పుకోవాలి.. బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటిస్తూ ఇటీవల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది.. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్టూ భారత్పై విద్వేశం చిమ్మూతూ ప్రగల్భాలు పలికాడు.కుక్కతోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్థాన్కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, వాళ్లదేశంలో వారిని తరిమినా, కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి ఎంతకీ బుద్ధి రావట్టేదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్లో కశ్మీరీ సోలిడారిటీ డే ను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్ పై మరోసారి తమ ద్వేషాన్ని చిమ్మాడు.నఖ్వీ మాట్లాడుతూ" (అఖండ్ భారత్కో ఖండ్ ఖండ్ కరింగే) భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పుపెడతాం, దక్కన్ని మండిస్తాం,ఢిల్లీని షేక్ చేస్తాం" అని ప్రగల్భాలు పలికారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ, ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృథాపోవన్నారు. అబ్దుల్ రహమాన్ నఖ్వీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్కు అత్యంత సన్నిహితుడు.అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వారి దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. మరోసారి ఉగ్రవాదుల బహిరంగ వేదికలకు ఆహ్వనిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్పై విషం చిమ్మే యత్నం చేస్తుంది. -
పాక్లో ఆత్మాహుతి దాడి
ఇస్లామాబాద్: కల్లోల పాకిస్తాన్లో మరో ఆత్మాహుతి చోటుచేసుకుంది. షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఈ దారుణంలో కనీసం 50 మంది దుర్మరణం పాలయ్యారు. 169 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని ఇస్లామాబాద్ శివార్లలో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కాళ్లూ చేతులూ తెగిపడ్డవారు, తీవ్ర గాయాలతో అల్లాడుతున్న వారికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. మృతులు, క్షతగాత్రుల బంధుమిత్రుల ఆర్తనాదాలు, రోదనలతో ఘటనా స్థలి మారుమోగిపోయింది. వారిలో తమవారు కూడా ఉన్నారేమోనని పలువురు వెదుక్కుంటుండటం కన్పించింది. ‘‘చాలామందిని ఆస్పత్రుల్లో చేరి్పంచాం. వారిలో ఎందరు బతికి బయటపడతారో చెప్పలేం’’అని పోలీసు అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 70 దాటినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మృతుల్లో ఇస్లామాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సోదరుడు, మరో బంధువు కూడా ఉన్నారు. ఆత్మాహుతి బాంబర్ ఒక విదేశీయుడని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అతను ఫిత్నా అల్ ఖ్వరాజీ అలియాస్ తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సభ్యుడని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ లక్ష్యం ఎప్పుడూ పాక్ సైన్యం మాత్రమేనని చెప్పుకొచి్చంది. పాకిస్తాన్ తాలిబాన్గా పిలిచే టీటీపీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు దాడులు చేస్తూ వస్తోంది. దాడిని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని హెహబాజ్ షరీఫ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపంద చర్య. అమాయకులను లక్ష్యం చేసుకోవడం మానవత్వానికే తీరని మచ్చ’’అంటూ మండిపడ్డారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ పాక్లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామాబాద్లో గత ఆర్నెల్లలో ఇది రెండో ఆత్మాహుతి దాడి. గత నవంబర్లో ఒక వ్యక్తి ఏకంగా ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లోనే కారులో తనను తాను పేల్చేసుకున్నాడు! ఆ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. అంతకుముందు 2008 సెప్టెంబర్లో ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడి 63 మందిని బలిగొంది. తొలుత కాల్పులు... ఇస్లామాబాద్లోని హెహజాద్ టౌన్లో తర్లాయ్ ప్రాంతంలో ఉన్న ఖదీజా అల్ కుబ్రా ఇమాంబరాలో షియా వర్గీయులు భారీ సంఖ్యలో శుక్రవారం మధ్యాహ్న వేళ ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ లోనికి దూసుకొచ్చేందుకు ప్రయతి్నంచాడు. గేట్ దగ్గర గార్డులు అడ్డుకోవడంతో అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు. దుండగుడు తొలుత కాల్పులకు తెగబడి తర్వాత పేలుడుకు పాల్పడ్డట్టు వారిని ఉటంకిస్తూ జియో న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. పేలుడు తీవ్రతకు మసీదు ప్రధాన ద్వారం కుప్పకూలడంతో పాటు సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా ఛిన్నాభిన్నమైన మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో రక్తంతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. దాడి తమ పనేనని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. పోలీసులతో పాటు సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. ఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్లోని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పాక్ కొంతకాలంగా ఆత్మాహుతి దాడులతో అతలాకుతలమవుతోంది. స్వతంత్ర బలూచిస్తాన్ డిమాండ్తో ఆ ప్రావిన్స్లో బలూచ్తిఆన్ లిబరేషన్ ఆర్మీ నిరంతరం పాక్ సైనికులపై దాడులకు దిగుతోంది. ఆ క్రమంలో ఇటీవల జరిపిన ఆత్మాహుతి దాడుల్లో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడటం తెలిసిందే. సైన్యం ప్రతీకార దాడుల్లో బలోచీ సాయుధులు కూడా వందల్లో మరణించారు. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
పాక్ ఆర్మీ అరాచకం.. బలూచిస్తానీల ఊచకోత
ఇస్లామాబాద్: కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్లో కనీసం 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్ ఆర్మీ గురువారం తెలిపింది. మరో 22 మంది భద్రతా సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిపి 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారంది.రాద్ ఉల్ ఫిత్నా–1 పేరుతో జనవరి 26వ తేదీన చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని తెలిపింది. ఉగ్రవాద బృందాల నాయకత్వాన్ని, పోరాట పటిమను తీవ్రంగా దెబ్బకొట్టామని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. గత ఐదు రోజులుగా నిలిపివేసిన రైళ్ల రాకపోకలను గురువారం నుంచి తిరిగి అధికారులు మొదలుపెట్టారని వెల్లడించింది. ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులను కలిపే ఈ ప్రావిన్స్లో బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి.ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్ వేర్పాటువాదులు చేతుల్లో పాక్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో రెబల్స్ను ఎదుర్కొనలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని అసిఫ్ తేల్చిచెప్పారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులను చంపుతోన్న ఉగ్రవాదులతో చర్చలు ప్రసక్తేలేదని పాక్ రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. నేరస్థులకు, వేర్పాటువాద గ్రూపులకు మధ్య సంబంధం ఉందని, బీఎల్ఏ బ్యానర్ కింద నేర ముఠాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్తో సరిహద్దులు పంచుకునే బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు. -
కశ్చిరీలకు మద్దతుగా పాక్లో ర్యాలీలు
ఇస్లామాబాద్: కశ్చిరీ ప్రజలకు సంఘీభావంగా గురువారం పాకిస్తాన్ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. జమ్మూకశ్చిర్ సమస్యకు పరిష్కారం కశ్చిర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. కశ్చిర్ సాలిడారిటీ డేను పురస్కరించుకుని ముజఫరాబాద్లోని పీవోకే అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కశ్చిర్ పాకిస్తాన్లో భాగంగా మారనుందన్నారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రకటించిన విధంగానే దేశ విదేశాంగ విధానానికి కశ్చిరే ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు. కశ్చిర్ అంశాన్ని పాలస్తీనాతో ముడిపెట్టిన షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా హతులైన ఉగ్రవాదులు బుర్హాన్ వనీ, సయ్యద్ అలీ జిలానీ వంటి వారి పేర్లను ప్రస్తావించారు. అనంతరం సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్, అధ్యక్షుడు జర్దారీ కూడా కశ్చిర్ ప్రజలకు సంఘీభావం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. సదస్సులు, సమావేశాలతోపాటు ఉదయం 10 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం మౌనం పాటించినట్లు ప్రభుత్వ రేడియో వెల్లడించింది. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. కడుపు మంటలో పాకిస్థాన్
ఇస్లామాబాద్: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు భారత్ గ్లోబల్ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారుట్రంప్ సేవలో అసిమ్ మునీర్ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది. గతేడాది ట్రంప్ను కీర్తిస్తూ పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.ఆర్ధిక ఇబ్బందులతో సతమతంఅయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం పాక్పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికాతో ట్రేడ్డీల్ కుదుర్చుకున్న భారత్పై పాక్ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు. మాజీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్ను మరింత విస్తరించడం. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు. ట్రంప్ను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్ అది సాధించింది. ట్రంప్ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.మొత్తానికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. -
పాక్కు బంగారం దొరికింది.. భూమిలో నుంచి బయటపడేది అప్పుడే..
పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీసం ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది .అయితే, ఇప్పుడు సింధు నదిలో బంగారు నిల్వలు కనుగొనడంతో ఆ దేశానికి గడ్డు రోజులు పోతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ దేశంలో భారీ బంగారు నిల్వలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి. కానీ నదుల్లో బంగారు నిల్వలను కనుగొనడం వల్ల ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నట్లుగా కొత్త సమస్యలు వస్తాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కానీ కథ ఇక్కడితో ముగియదు. గతంలో ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే బంగారు నిల్వలు కనుగొన్నారు.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ లాంటి దేశాల్లో బంగారం బయటపడింది. అయితే ఆ దేశాలు అభివృద్ధి దిశగా వెళ్లక పోగా అక్కడ బంగారం మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీవ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాయి. గత 15ఏళ్ల కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాల్లో బంగారం, విలువైన లోహాల నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. తీవ్రవాద గ్రూపులు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం, నెట్వర్కింగ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాయి. బంగారం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కలలు కంటున్న స్థానిక ప్రజలను బంగారం తవ్వకం పనిలోకి దింపారు. జీతాలు స్థానికులే చెల్లిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం ఉగ్రవాదులకు వెళ్తోంది. అన్ని వనరులను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి యువతను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మన పొరుగుదేశం చైనా కూడా ఇటీవలే భారీ బంగారు నిల్వలను కనుగొంది. అక్కడి పాలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే ఆశతో ఉంది. కానీ బంగారం దొరకడం ఒక్కటే కాదు… వాటిని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనానికి ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి చివరికి ప్రశ్న ఒక్కటే—ఈ బంగారం పాకిస్థాన్కు వరమా? లేక భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ ఆటకు వేదిక అవుతుందా? దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతుందా? లేక అంతర్గత సమస్యలను మరింత పెంచుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.సింధు నదిలో దొరుకుతున్న బంగారం హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి. -
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
క్రికెట్ అభిమానులను ఇది కన్ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఉమ్మె-హాని ఎంపికైంది.ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30) ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00) ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00) అన్ని మ్యాచ్లు బ్యాంకాక్లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్తో, 17న నేపాల్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది. -
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది.ప్రపంచకప్లో పాక్ ఆడే మ్యాచ్లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్కు కూడా వర్తిస్తుంది.ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్దంగా భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.కాగా, భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచకప్ మ్యాచ్లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్తో మ్యాచ్ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి. -
పాక్కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్ఖాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
తన పరువు తానే తీసుకుంటున్న పాక్!
‘‘మిత్రదేశాల్ని అప్పులు అడగాలంటే సిగ్గనిపిస్తోంది. అయినా తప్పడం లేదు. నేను, మన ఆర్మీ చీఫ్ ఇద్దరం జోలె పట్టుకుని వీలైనన్నీ ఎక్కువ దేశాలు తిరిగాం. ఇంకా తిరగడానికి కూడా వెనకాడబోం’’ అంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొన్నీమధ్యే బహిరంగంగా ఒక ప్రకటన చేయడం చూశాం. ఈ క్రమంలో సొంత దేశ పౌరులు తమ గురించి ఏం అనుకున్నా దులిపేసుకుంటాం అనే చందాన ఆయన మాట్లాడారు. ఈ లిస్ట్లో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేరారు.అంతర్జాతీయ సమాజంలో పాక్ తన పరువు తానే తీసుకుంటోంది. మొన్నీమధ్యే అప్పుల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన్ని పాక్ పౌరులు నెట్టింట తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంతు వచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఆయన.. బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం తమ వల్ల కాదనే రీతిలో మాట్లాడడం గమనార్హం. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే అతిపెద్ద రీజియన్. ఇలాంటి చోట.. తక్కువ సంఖ్యలో దాగి ఉన్న బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం మన(పాక్) సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. పైగా బలూచ్ రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉంటున్నాయి. రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్.. ఇలాంటివెన్నో వాళ్లు వాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కూడా ఎక్కువే. పాక్ సైన్యం కూడా మునుపెన్నడూ అలాంటి ఆయుధాల్ని చూసి ఉండదు.. అంటూ ప్రసంగించారాయన. ఈ క్రమంలో అమెరికానే వాటిని సమకూర్చి ఉంటుందని సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఆ అత్యాధునిక ఆయుధాలు అమెరికన్వే. రెబల్స్ నాయకత్వం ఆఫ్గనిస్తాన్లో ఉండి.. అక్కడి నుంచి మద్దతు పొందుతున్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడం.. రెబల్స్ ఆధునిక సాంకేతికత వాడటం వల్ల మన (పాక్) భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. బీఎల్ఏ లాంటి గ్రూపులు క్రిమినల్ గ్యాంగ్స్తో కలసి పనిచేస్తూ, ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. సాధారణ పౌరులను, మహిళలను, పిల్లలను చంపే అలాంటి గ్రూపులతో పాక్ ప్రభుత్వం ఏనాడూ చర్చు జరపబోదు అని ఖ్వాజా జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సాధారణంగా ఒక దేశం తన భద్రతా లోపాలను, సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిరంగంగా ఒప్పుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను దెబ్బతీసుకోవడమే. ఇప్పుడు రక్షణ మంత్రి ఖ్వాజా అదే పని చేశారని అక్కడి జనం తిట్టుకుంటున్నారు. సంపాదించేవారని ఆరోపించారు.ఇటీవల కాలంలో బలూచిస్తాన్లో బలూచిస్తాన్లో రెబల్స్ తిరుగుబాటు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాక్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రెబల్స్ వైవిధ్యమైన దాడులకు తెగపడుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూలేని రీతిలో మహిళలతో పాక్ ఆర్మీపై బలూచ్ రెబల్స్ గ్రూపులు ఆత్మాహుతి దాడులు జరుపుతున్నాయి. గతవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు జరిపి 80 మంది ప్రాణాలు తీశాయి. అదే సమయంలో పాక్ ఆర్మీ ప్రతిఘటనతో.. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. కిందటి ఏడాది.. బలూచిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత అమెరికా ఆ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తిస్తూ.. ఆ రీజియన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా(KBK ప్రాంతాలను "Level 4: Do Not Travel" జాబితాలో చేర్చింది. అంటే అటువైపు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమైనవని చెప్పడమన్నమాట. ఒక్క బీఎల్ఏ మాత్రమే కాదు.. అక్కడి రెబల్స్ గ్రూపుల్లో చాలావాటిని అమెరికా ఉగ్రసంస్థగా ఈపాటికే గుర్తించింది కూడా. ఈ తరుణంలో.. అమెరికన్ అత్యాధునిక ఆయుధాలనే బలూచ్ రెబల్స్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశంగా కనిపించడమే కాదు.. అంతర్జాతీయంగానూ పాక్కు ఇబ్బందులు కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత్ పాక్కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్తో వరల్డ్కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇరాన్–అమెరికా చర్చలకు పాక్
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్కు ఆహ్వానం అందింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇరాన్–అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ఒక ఒప్పందానికి వచ్చేందుకు తటస్థ దేశం తుర్కియే వేదికగా త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయి.శాంతి ప్రయత్నాలకు మరింత విస్తృతమైన గుర్తింపు, మద్దతు లభించేలా ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొనాలంటూ సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ తదితర దేశాలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదానికి ఇదే ప్రధాన అంశంగా మారింది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన పక్షంలో అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాక్పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ను పాక్ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ ఎహసాన్ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను పాక్లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్ హోల్ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్తో మ్యాచ్ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్ను పక్కన పెట్టి పాక్పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. -
ఇండియా, EU డీల్ .. కుప్పకూలనున్న పాక్ ఆర్థిక వ్యవస్థ?
ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు. దీని వల్ల ఆ దేశంలో తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు దాదాపు కోటి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందన్నారు.ఈయూ- భారత్ మధ్య జరిగిన ఒప్పందం పాకిస్థాన్ని పేదరికంలోకి నెట్టేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ నాయకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో పాక్పై పడే ప్రభావం అంచనా వేస్తున్నారు. దీనిపై ఆ దేశ మాజీ వాణిజ్య శాఖ మంత్రి స్పందించారు. "ఇంతకాలం ఈయూతో జరిగిన హానీమూన్ ఒప్పందం ముగిసింది. 10 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు చౌకవిద్యుత్, తక్కువ పన్నులు, సులభమైన రుణాలు అందించాలి అలా అయితే ఇతర దేశాలతో పోటీపడగలం" అని ఆయన అన్నారు.యూరోపియన్ యూనియన్లో ఇంతకాలం పాకిస్తాన్ హావా నడిచింది. ఆ దేశానికి చెందిన దాదాపు 65 శాతం వస్తువులు ఎటువంటి పన్నులు లేకుండా అక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి. ఇప్పుడు భారత్తో ఈయూ డీల్ నేపథ్యంలో ఆ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. భారత్, ఈయూ ఈ ఏడాది జనవరి 27న వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఈ ఒప్పందంలో భాగంగా ప్రభావితమవుతారు. ప్రపంచ జీడీపీలో ఈ ఈయూ-భారత్ మార్కెట్ విలువ దాదాపు 25 శాతం. ఈ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుంది. -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు. -
పాక్ సైన్యానికి చుక్కలు.. మునీర్కు కొత్త టెన్షన్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యానికి బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)కు చెందిన ఇద్దరు మహిళలు చుక్కలు చూపించారు. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా మారి పాకిస్తాన్ సిబ్బంది దాదాపు 200 మందిని హతమర్చారు. మరోవైపు.. బలోచిస్థాన్ అంతటా పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ‘హీరోఫ్’ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు బీఎల్ఏ పేర్కొంది. దీంతో, దాయాది పాక్కు బీఎల్ఏ వెన్నులో వణుకుపుట్టించినట్టు అయ్యింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజులుగా దాయాది దేశం పాకిస్తాన్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్ ప్రావిన్సులో ఉన్న 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు తమదే బాధ్యత అని తాజాగా బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సిబ్బంది సహా వంద మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్ హవా బలోచ్ దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక, ఇద్దరు మహిళలు దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 🚨🔴Balochistan Liberation Army releases photos of two female suicide attackers after deadly Pakistan attack. pic.twitter.com/OuZb2tsyt2— THE UNKNOWN MAN (@Theunk5555) February 2, 2026ఇదిలా ఉండగా.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది.Watch this fearless woman fighter of #Baloch Liberation Army (BLA) while participating in #OperationHerof2 in #Gwadar in #Balochistan.She is Fidayee #HawaBaloch who fought along with fellow Fidayeen. The video released by BLA has her last statement before her ultimate… pic.twitter.com/tSrahHGhAn— Ajay Kaul (@AjayKauljourno) February 1, 2026మీడియా నివేదికల ప్రకారం.. ఆత్మాహుతి చేసుకున్న బలూచ్ యోధురాలు హవా బలోచ్కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె తండ్రి 2021లో పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మరణించినట్టు తెలిసింది. అతడు బీఎల్ఏ యోధుడని సమాచారం. సదరు మహిళ తిరుగుబాటులో చేరడానికి ముందు అధికారికంగా విద్యను కూడా పొందినట్టు నివేదించబడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న బలోచ్ వేర్పాటువాద ఉద్యమం ధోరణిని ప్రతిబింబిస్తుంది.పాక్ ఓవరాక్షన్.. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు. NOSHKI: Baloch Liberation Army fighters patrolling pic.twitter.com/E73PrCJyGj— Shazia Bugti (@Shazia_Bugti079) February 2, 2026 -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్వన్గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్లోనూ ఈ మూవీ నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్లో నెట్ఫ్లిక్స్లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్గా ట్రెండింగ్లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
పాక్ బలగాల పిరికిపంద చర్యలు
పాకిస్తాన్ గడ్డ మీద బెలూచిస్తాన్లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించడం!.. ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ధురందర్ సినిమా చూసిన వాళ్లకు పాక్లో బలూచ్లు ఎదుర్కొనే వివక్ష గురించి ఓ ఐడియా ఉండొచ్చు. అయితే.. వాస్తవంలోనూ బలూచ్ ప్రజలు తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. మహిళా ఫిదాయిన్ల త్యాగం చర్చనీయాంశంగా మారింది. పాక్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్ – ఫేజ్ II’.. దానికి కౌంటర్గా పాక్ ఆర్మీ జరిపిన దాడులు 40 గంటలకుపైనే కొనసాగాయి. ఈ ఆపరేషన్లో పాక్ సైన్యాన్ని, ఫ్రంట్ వారియర్స్ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు మహిళా ఫిదాయీన్లు పాల్గొన్నారని బీఎల్ఏ ప్రకటించింది. ‘‘ఖరాన్, మస్తుంగ్, టంప్, పస్ని ప్రాంతాల్లో మా ఆపరేషన్లు పూర్తయ్యాయి. క్వెట్టా, నోష్కీ ప్రాంతాల్లో కూడా మా యోధులు ఉన్నారు. అక్కడి పాక్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాడుల్లో మొత్తం 200 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచ్ ప్రజల్లారా.. పాక్ సైన్యానికి దూరంగా ఉండండి. మా పోరాటానికి మద్దతు ప్రకటించండి’’ అంటూ బీఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తక్కువగా చేసి చెబుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. మహిళలే ఆత్మాహుతి దాడులు జరిపారని చెబుతూ.. శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది బీఎల్ఏ రెబల్స్ హతమయ్యారని ప్రకటించారు. నోష్కీ, హబ్, చమన్, నసీరాబాద్, గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ.. బీఎల్ఏ రెబల్స్ జరిపిన దాడుల్లో 17 భద్రతా సిబ్బంది, 31 పౌరులు మరణించారన్నారు. పాకిస్తాన్ సైన్యం 40 గంటలపాటు ప్రతిదాడి చేసి 140కి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటిస్తే.. బీఎల్ఏ మాత్రం 18 మంది మాత్రమే తమ యోధులు మరణించారని, ఇందులో 11 మంది ఆత్మాహుతి దాడుల్లోనే వీరమరణం పొందారని ప్రకటించుకుంది. Fidayeen" (ఫిదాయీన్) అనే పదం అరబిక్ మూలం నుంచి వచ్చింది. అర్థం తన ప్రాణాలను త్యాగం చేసే వ్యక్తి లేదంటే ఆత్మాహుతి యోధుడు/యోధురాలు అని..ఇదే మొదటిది కాదు.. !ఈ తరహా మహిళా మానవ బాంబు దాడులకు (fidayeen strike) దిగడం బలూచ్ రెబల్ గ్రూప్స్కు తొలిసారేం కాదు. బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తరఫున జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ అనే సూసైడ్ బాంబర్ ఆ మధ్య చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. తాజా దాడుల్లో.. 24 ఏళ్ల ఆసిఫా మంగళ్ తోపాటు మరో యోధురాలు పాల్గొన్నట్లు బీఎల్ఏ ప్రకటించుకుంది. నోష్కీలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహన బాంబుతో ఆసిఫా, మరో మహిళా యోధురాలు హవా బలోచ్ గ్వాదర్ ఫ్రంట్లో పోరాడి మరణించిందని తెలిపింది. వాళ్ల ఫొటోలు, దాడికి ముందు వాళ్ల ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని కూడా విడుదల చేసింది.#BLA the group behind ongoing coordinated attacks in #Balochistan has released a video showing one of its female fighters “Hawa Baloch” aka Droshum, reportedly filmed during a battle.Reports suggest more female fighters are involved but yet to be identified. pic.twitter.com/8bLY3iJSZ7— Hammad Baloch (@Hammad_Baluch) February 1, 2026మరోవైపు.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది. Hawa Baloch.Woman fighter of #Balochistan fighting the brutal, occupying Pakistan army.The young soldier died just hours later, defending her land, but not before sending dozens of Paki troops to the hoors.As brave as the rebel women of Iran.pic.twitter.com/sMDcExLd1E— Abhijit Majumder (@abhijitmajumder) February 1, 2026పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.బెలూచిస్తాన్లో తిరుగుబాట్ల చరిత్ర👇 మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది. రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు. మూడో దశ తిరుగుబాటు (1963–69): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు.. నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు.. ఐదో దశ తిరుగుబాటు (2003–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బీఎల్ఏ, బీఎల్ఎఫ్ తరహా రెబల్స్ గ్రూపులు వేర్పాటువాద పోరాటాల్లో ప్రముఖంగా పాల్గొంటున్నాయి. అయితే పాక్తో పాటు మరికొన్ని దేశాలు వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. బలూచ్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి 50 లక్షలు. ఇందులో ఇరాన్లోనే 40 లక్షల మంది ఉన్నట్లు 2023 గణాంకాలు చెబుతున్నాయి. అఫ్గనిస్తాన్లో మరో 10 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రధానమైన బలూచిస్తాన్ ప్రావిన్లో మాత్రం వీళ్ల జనాభా తక్కువగా ఉంటోంది. అందుకు అక్కడి ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏదిఏమైనా.. బెలూచిస్తాన్ రీజియన్లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పొచ్చు. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం
భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్తో మ్యాచ్కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్కు కలిగే నష్టాలు- భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైనల్గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ను తొలగించే అవకాశం ఉంది. -
మీకు బాగా అలవాటుగా మారిపోయింది: భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ధ్వజమెత్తారు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తముందనే ఆరోపణలను జైశ్వాల్ ఖండించారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.పాకిస్తాన్కు అసత్య ఆరోపణలు చేయడం తప్పితే వేరే పని లేనట్లు ఉందని చురకలంటించారు. ముందు పాకిస్తాన్ అసత్య ప్రేలాపన వదిలి ఆ దేశ ప్రజల దీర్ఘ కాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితే బాగుంటందన్నారు. పాకిస్తాన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారరహితమైనవి. ఇది పాకిస్తాన్ తరచూ ఉపయోగించే పద్ధతి – తన అంతర్గత వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడమే. ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసంబద్ధమైన ఆరోపణలు చేయడం బదులు, పాకిస్తాన్ తన ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను తీర్చడంపై దృష్టి పెట్టాలి. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, క్రూరత్వం అంతర్జాతీయంగా బాగా తెలిసిన విషయాలు.కాగా, పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా, వాటి బాధ్యతను భారత్పై మోపడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యాఖ్యలు, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఆరోపణలను ఎదుర్కొనే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్ ఏడాది కాలంగా బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు.. పాక్పై దాడికి తిగుతున్నారు. ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్యలను మరింత స్పష్టంగా చూపిస్తోంది.బలోచిస్తాన్లో ఇటీవల జరిగిన దాడుల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఈ దాడులకు భారత్ కారణమని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆరోపించారు. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని భారత్పై నెట్టే యత్నం చేసింది. దీన్ని భారత్ ఖండిస్తూ.. వారి దేశంలో సమస్యలను వేరే దేశంపై మోపడం పాక్కు బాగా అలవాటుగా మారిపోయిందని భారత్ స్ట్రాంగ్గా బదులిచ్చింది. -
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
-
పాక్ పై భారత్ ఘన విజయం
-
పాక్లో 145 మంది ఉగ్రవాదులు హతం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని 40 గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 145 మంది ఉగ్రవాదులు, మరో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. క్వెట్టా, సిబి, మస్తుంగ్, గ్వాదర్, నోష్కి, పాస్ని, పంజ్గుర్, ఖరన్ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్ సీఎం సర్ఫరాజ్ బుగ్తి చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నారన్నారు. మొత్తం 145 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని, గుర్తింపు ప్రక్రియ చేపట్టారని వివరించారు. శనివారం పలు ప్రాంతాల్లో పౌరులతోపాటు భద్రతా సిబ్బందిపై బలూచ్ సాయుధ గ్రూపులు దాడులకు పాల్పడటంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం భద్రతా బలగాలు పంజ్గుర్, షబాన్ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్లలో 41 మంది ఉగ్రవాదులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం ప్రావిన్స్లో అప్రమత్తత ప్రకటించామని చెప్పారు. అఫ్గానిస్తాన్ నుంచి కొందరు అందించే ఆదేశాల ప్రకారం ఇక్కడున్న వారు ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు పథకం పన్నారని బుగ్తి ఆరోపించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తాలిబన్ వంటి గ్రూపులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చాత్తాప భావనతో లొంగిపోవాలనుకునే వారిని మాత్రం స్వాగతిస్తామని చెప్పారు. బలూచిసాŠత్న్లో ఉగ్రవాదుల హింసాత్మక కార్యకలాపాలతో 2024లో 787 మంది చనిపోగా, 2025లో ఈ సంఖ్య 956కు అంటే దాదాపు 22 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.పాక్ ఆరోపణలను ఖండించిన భారత్బలూచిస్తాన్లో అశాంతి వెనుక భారత్ హస్తముందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తి గా నిరాధారాలని పేర్కొంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారీ పాక్ మిలటరీ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ఎత్తుగడల కు పాల్పడుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. బదులుగా అక్కడి ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతలో పాకిస్తాన్కు దారుణమైన రికార్డు ఉందని పేర్కొన్నారు. -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి. -
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్లో పాక్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది. -
మూడో టీ20లోనూ ఆసీస్ను చిత్తు చేసిన పాక్
టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్, సైమ్పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.తిప్పేసిన నవాజ్అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది. -
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
పాకిస్తాన్తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు. -
భారత్తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు. -
పాక్ కల్నల్ ఇమ్రాన్ దారుణ హత్య.. భారత్ హస్తం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో భారత్ వ్యతిరేకులను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంటాడి మరీ చంపుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్ను టెన్షన్కు గురిచేస్తోంది. ఇమ్రాన్ దయాల్ ఐఎస్ఐ చీఫ్ హఫీజ్ సయీద్కు సన్నిహితుడు కావడం విశేషం.వివరాల మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది.BIG BREAKING NEWS 🚨 Pakistani Army Lt Col Imran Dayal shot dead by UNKNOWN MEN in Dera Ismail Khan, Pakistan.As per news reports, he was identified as a handler in the 2025 Pahalgam terror attack.ISI is also clueless. Police have no idea. He was a very close associate of… pic.twitter.com/747JDjA0yb— News Algebra (@NewsAlgebraIND) January 31, 2026కానీ, దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు. ఇక, ఇమ్రాన్ దయాల్.. భారత్లోని పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారకుడు అని తెలుస్తోంది. ఇమ్రాన్ హత్యతో రంగంలోకి దిగిన అధికారులు.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా దాడులతో పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు, ఇలా పాక్తిస్తాన్కు చెందిన కీలక నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో వారంతా భారత్ దురంధర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత్కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని హతమారుస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 🚨 BIG! Pakistani Army Lt Col Imran Dayal, identified as a handler in the 2025 Pahalgam terror attack, was SHOT DEAD by UNIDENTIFIED GUNMEN in Dera Ismail Khan👉 UNKNOWN GUNMEN continue to ELIMINATE terrorists in Pakistan 🔥#Agyat 👍👌👏 pic.twitter.com/lIqgxzBRsg— DR. AMIT MANOHAR (@dramitmanohar) January 31, 2026ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 80 మంది బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. అయితే, బలూచ్ నేతలే ఇమ్రాన్ను హత్య చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.Dera Ismail Khan: Shaheed Lieutenant Colonel Imran Dayal was laid to rest in his ancestral village with full military honors.The funeral prayers were attended by GOC 40 Division, Major General Mudassar, who presented the national flag, which was received by the martyr’s son pic.twitter.com/ggnjdcuIuf— Makhdoom Shahab-ud-Din (@ShahabSpeaks) January 30, 2026 -
"పీవోకే" అధ్యక్షుడి మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు సుల్తాన్ మహమ్ముద్ చౌదరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇస్లామాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడిగా ఉన్న సుల్తాన్ మహమ్ముద్ చౌదరి 2021లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మహమ్మద్ చౌదరి శనివారం చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల పాక్ అధ్యక్షుడు ఆసిప్ ఆలీ జర్దారీ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు ప్రత్యేకంగా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఉన్నప్పటికీ రక్షణ, విదేశాంగం, కరెన్సీ, కీలక విధానాలు అన్నీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంటాయి. ఆ దేశంలోని కశ్మీర్ అపైర్స్ అనే మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. -
పాకిస్తాన్దే సిరీస్
లాహోర్: ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (53; 4 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
భారత్ x పాకిస్తాన్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది. -
పాక్లో విమానాశ్రయాల వేలం.. కారణం అదే?
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న బహుళజాతి కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ప్రకటించింది.ఇటీవల యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో ఆకస్మిక పర్యటన చేశారు. అనంతరం కొద్దిరోజులకే ఆయన పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్పోర్టు నిర్వహించే బాధ్యతనుంచి యూఏఈ తప్పుకుంటుందని ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణకు బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహెర్ విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. గతంలో ఇస్లామాబాద్ విమానాశ్రయం నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని భావించినా ప్రస్తుతం ఆ ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలిపారు.దీనికోసం దేశీయ సంస్థలతో పాటు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సంస్థలు సైతం బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయాల కార్యకలాపాల సామర్థ్యాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర కారణాల రీత్యా వీటికి బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు.కాగా ఈ విషయంలో యుఏఈ టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన సంస్థలతో సానుకూల చర్చలు జరిగాయని అయితే ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని యుఏఈకి లీజ్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు అసత్యమని పాక్ తెలిపింది. అటువంటి ఒప్పందాలు ఏవి జరగలేదని పేర్కొంది. -
పాక్లో 70 మంది మిలిటెంట్లు మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో పాటు 10 మంది భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్లో ఆర్మీకి, బలుచిస్థాన్ తిరుగుబాటు దారులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. బలుచిస్థాన్ ప్రాంతంలోని 12 ప్రాంతాలలో ఆ దేశ భద్రత బలగాలు, పోలీసులు స్థావరాలే టార్గెట్గా ఈ దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి మెుదలైన ఈ కాల్పులు శనివారం ఉదయం వరకూ సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో 70 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లు ప్రాణాలు వదలగా, 10 మంది వరకూ సైనికులు మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.బలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టా, మక్రాన్, హబ్, చమన్, నసీరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో ముష్కరుల దాడిని అప్రమత్తంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. నసీరాబాద్ జిల్లాలో ముష్కరులు రైల్వేట్రాక్పై బాంబు అమర్చగా దానిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. అయితే భద్రతా బలగాలు జరిగిన దాడిలో ఇదివరకూ 70 మంది ఉగ్రవాదులు మరణించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
ఆ టైంలో మేమిద్దరం సిగ్గుతో తలదించుకునేవాళ్లం
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్లో జరిగిన బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్ ప్రసంగించారు. అయితే..రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్ను నిరాశ పరచలేదని షరీఫ్ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్ పరువు పోయిందిగా! -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చికత్స తీసకుంటున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. పైగా ఇమ్రాన్ ఎదుర్కొంటుంది ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, సకాలంలో వైద్యం అందించకపోతే కంటి చూపే పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇమ్రాన్కు వచ్చిన తీవ్రమైన కంటి వ్యాధి ఏంటి..ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ని అక్కడ వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖాన్కు రెటీనా సిర మూసివేత(రెటీనా నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే చిన్న సిరలు మూసివేత) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు కూడా. ఇంతకీ అసలేంటి రెటీనా సిర మూసుకుపోవడం..రెటీనా సిర మూసుకుపోవడం అంటే..రెటీనా సిర మూసుకుపోవడం లేదా ఆవీఓ అనేది రెటీనా నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుపడటం. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న కణజాల పొర, కాంతిని మనం చూడగలిగే చిత్రాలలోకి అనువదిస్తుంది.రెటీనా సిరలో అడ్డంకి రెటీనా నుంచి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది.దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫలితం దృష్టి సమస్యలు లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రోగి కంటి పరిస్థితి దృష్ట్యా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నుంచి శస్త్రచికిత్స వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదంతా రోగి కంటి సమస్యపై ఆధారపడి ఉంటుందట. ఈ పరిస్థితి ఎందువల్ల అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన అధ్యయనాలు ప్రకారం..ఈ పరిస్థితి రెటీనా సిర ద్వారా సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం వల్ల సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.కారణాలు..రక్తం గడ్డకట్టడంరక్త ప్రవాహం మందగించడంరెటీనా సిర, రెటీనా ధమనితో కలిసే చోట కుంచించుకుపోవడం.ఇది ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన యువకులలో, ముఖ్యంగా డయాబెటిస్, గ్లాకోమా లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.రెటీనా సిర మూసుకుపోవడంలో సంకేతాలు, లక్షణాలుఅస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టంనల్ల మచ్చలు లేదా గీతలుకంటిలో నొప్పి, ఒత్తిడిఎలా నిర్ధారిస్తారు..కంటి సంరక్షణ నిపుణులు కంటి పరీక్ష, రెటీనా ఇమేజింగ్ పరీక్షల ద్వారా కనుపాపలను విస్తరించి ఆవీఓని నిర్ధారిస్తారు. చికిత్స..రెటీనా సిరలో అడ్డంకిని తిప్పికొట్టడానికి లేదా నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు. కానీ కంటి సంరక్షణ నిపుణులు యాంటీ-VEGF ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్యాన్రెటినల్ ఫోటోకోగ్యులేషన్తో రెటీనా సిర మూసుకుపోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు.రెటీనా సిర మూసుకుపోయే ప్రమాదాన్ని నివారించడానికి మొదటి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం. ఈ సమస్య బారినపడకూడదంటే..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడం వంటివి చేయాలి. అలాగే ధూమపానం, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులును సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై..) -
ఈయూతో భారత్ దోస్తీ.. పాకిస్తాన్కు కొత్త టెన్షన్!
ఇస్లామాబాద్: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. భారత్, ఈయూ ఒప్పందం పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ దేశ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, యూరోపియన్ యూనియన్కు పాకిస్తాన్ భారీ మొత్తంలో ఎగుమతులు చేస్తోంది. ఈ క్రమంలో వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్తాన్కు ఈయూ ‘జీఎస్పీ+’ హోదాను కూడా ఇచ్చింది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. రెండు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. అయితే, ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది. ఇలాంటి సమయంలో భారత్, ఈయూ మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా తమ ఎగుమతులపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తాహిర్ అంద్రాబీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-ఈయూ ఒప్పందం గురించి మాకు తెలిసింది. అందులోని అంశాలను గమనిస్తున్నాం. ఇప్పటి వరకు ఈయూకి పాకిస్తాన్ భారీగా ఎగుమతులు చేస్తోంది. జీఎస్పీ+ స్కీం.. ఈయూతో ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా నిరూపితమైంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ నుంచి ఈయూ దేశాలకు టెక్స్టైల్స్ ఎగుమతులు అక్కడి మార్కెట్ అవసరాలను సరసమైన ధరల్లోనే తీరుస్తున్నాయి. గత ఏడాది తమ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల సందర్భంగా జీఎస్పీ+ అంశం చర్చకు వచ్చింది. ఈయూతో దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు’ తెలిపారు.భారత్, ఈయూ డీల్.. ఇదిలా ఉండగా.. భారత్, ఈయూ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలూ కుదిరాయి. ఎఫ్టీఏపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్లో చౌకగా లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలవారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ జీడీపీలో 25శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించనుంది. ఎఫ్టీఏతో ఈయూ దేశాలకు భారత్ చేసే 99శాతానికిపైగా ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అలాగే ఈయూ భారత్కు చేసే 97శాతం ఎగుమతులపై సుంకాలు దిగివస్తాయి. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్త కళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు తదితరాలపై సుంకాలు తగ్గుతాయి. -
ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది. మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను జేవియర్ బార్ట్లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు. చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్లెట్ (4-0-26-2), బియర్డ్మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్లో బియర్డ్మన్ రెండు వికెట్లు తీసి పాక్ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది. -
సొంత ప్రజల్నే ఫూల్స్ చేసిన పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది. మొహిసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్లో పాల్గొనే తమ జట్టు కోసం కొలొంబోకు (పాక్ తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఇక్కడే ఆడుతుంది) విమానం టికెట్లు బుక్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకొని పాక్ డ్రామాలు ఆడుతుంది.ప్రపంచకప్లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2ను డెడ్లైన్గా విధించాడని మొహిసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలు ఆడుతూ, లోలోపల ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు అన్నీ సిద్దం చేశాడు. పాక్ జట్టు ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి (మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత) ప్రపంచకప్ కోసం కొలొంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికామ్ ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైరవుతున్నారు.ప్రపంచకప్లో పాల్గొనే అంశం ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్లైన్ విధించారని ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.కాగా, పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకున్నా, భారత్తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ కదలికలు చూస్తే భారత్తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తుంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఎన్డీటీవీ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఎంటరై బంగ్లాదేశ్కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. తదనంతరం పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు కొలొంబోకు టికెట్లు బుక్ చేసుకొని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది. -
ఇమ్రాన్ ఖాన్ కండిషన్ సీరియస్?!
క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఏమైంది? అనే అంశంపై మరోసారి తెర మీదకు వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన్ని రావల్పిండి(పంజాబ్) అడియాలా జైల్లో పెట్టి పాక్ ప్రభుత్వం.. జైల్లో ఆయన పట్ల దారుణంగా వ్యహరిస్తోందన్న విమర్శలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. దీంతో ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఖాన్కు కంటి సమస్య (Central Retinal Vein Occlusion) తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణ చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు.అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే.. ఆయన్ని ఒంటరిగా సెల్లో ఉంచారని.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందిని ఆయనతో మాట్లాడనివ్వడం లేదని.. పైగా ఆయన ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితంగా ఉన్నాయని.. రోజులో కనీసం పట్టుమని పది అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ చేశారాయన. అప్పటి నుంచి 100 రోజులకుపైగా ఆయన్ని ములాఖత్కు కూడా అనుమతించలేదు. దీంతో జైల్లో ఆయనకు ఏదైనా జరిగిందా? అనే చర్చా నడిచింది కూడా. చివరకు.. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందడం కష్టమని.. తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. కోర్టు ఆదేశాలు బేతాఖరుఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుడిని 2024 అక్టోబరులో కలిశారు. అప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు జరగలేదని, ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడంలేదని పీటీఐ విమర్శిస్తోంది. అలాగే 2025 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్న పిటిషన్పై కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఖాన్ సోదరి నూరీన్ ఖానుమ్ మాట్లాడుతూ.. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే సమాచారం ఇవ్వాలి కదా. మేమే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం కదా అని అన్నారు. మరో సోదరి అలీమా ఖానుమ్ మాట్లాడుతూ.. జైలు అధికారులు తమకుగానీ, లీగల్ టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహఫుజ్ ఆయిన్-ఇ-పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.విచారణ ఎప్పుడంటే..ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖత్ను అనుమతించాలని కోరుతున్నారు. పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఖైదీని కలవడం ఒక చట్టబద్ధమైన హక్కు, ఖాన్తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా.. రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. -
పాక్లో "లవు"ని ఆలయం పునఃప్రారంభం
పాకిస్థాన్లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్ కోటలో చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు. -
సరిహద్దుల్లో కలకలం: ‘ఈ-మిత్ర’ ముసుగులో..
జైసల్మేర్: రాజస్థాన్ సరిహద్దు జిల్లా జైసల్మేర్లో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జనవరి 25 అర్థరాత్రి సమయంలో నెహదాన్ గ్రామంలోని నిందితుడి నివాసానికి చేరుకున్న భద్రతా బృందం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.అదుపులోకి తీసుకున్న వ్యక్తిని జబరరామ్ మేఘవాల్గా అధికారులు గుర్తించారు. నిందితుడు గత నాలుగేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో ‘ఈ-మిత్ర’ (ఆన్లైన్ సర్వీస్) కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ముసుగులో అతను పాకిస్తాన్కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అతనికి వ్యాపార రీత్యా ప్రభుత్వ పథకాలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలు ఉండటంతో, అతను ఈ సమాచారాన్ని పొరుగు దేశానికి చేరవేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.సీఐడీ (ఇంటెలిజెన్స్) బృందాలు మేఘవాల్ను తదుపరి విచారణ కోసం జైపూర్కు తరలించాయి. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, కంప్యూటర్ సిస్టమ్లను అధికారులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మేఘవాల్ గత నాలుగేళ్లుగా ఆ గ్రామంలో ‘ఈ-మిత్ర’ కేంద్రం నడుపుతున్నాడని, ఈ నేపధ్యంలో ఏయే డేటాను విదేశీ శక్తులకు చేరవేశాడనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.సోషల్ మీడియా సాయంతో పాక్ హ్యాండ్లర్తో పరిచయం ఏర్పడిన నిందితుడు ‘హనీట్రాప్’కు గురై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మేఘవాల్ కేవలం డబ్బు కోసమే ఈ పనిచేశాడా లేక ఎవరి ఒత్తిడికైనా లొంగి గూఢచర్యానికి పాల్పడ్డాడా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఉదంతంపై భద్రతా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉరిమిన భారత్ -
‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉరిమిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’పై పాక్ ప్రతినిధి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశాన్ని, భారత ప్రజలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై స్వార్థపూరిత కథనాలను అల్లుతోందని హరీష్ పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇస్లామాబాద్కు లేదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. 2025, మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యాన్ని హరీష్ వివరిస్తూ.. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సమాధానంగానే ఈ చర్య తీసుకున్నట్లు హరీష్ గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. #WATCH | Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish, says, "I now respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single-point agenda to harm my country and my people. He has… pic.twitter.com/I8pX4tt1zl— ANI (@ANI) January 27, 2026అనంతరం భారత సైనిక శక్తికి భయపడి మే 10న నేరుగా పాకిస్తాన్.. భారత్కు ఫోన్ చేసి, యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని హరీష్ తెలిపారు. సింధు జలాల ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల క్రితం భారత్ ఈ ఒప్పందాన్ని సద్భావనతో కుదుర్చుకుందని, అయితే పాకిస్తాన్.. మూడు యుద్ధాలతో పాటు, లెక్కలేనన్ని ఉగ్రదాడులతో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కిందని హరీష్ విమర్శించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా వేలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన తీరు మార్చుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన గురించి మాట్లాడే ముందు పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాయబారి చురకలంటించారు. పాక్ సైన్యం రాజ్యాంగ విరుద్ధంగా 27వ సవరణ ద్వారా ఎలా తిరుగుబాటు చేసిందో, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు జీవితకాల రక్షణ ఎలా కల్పించిందో గుర్తెరగాలని హరీష్ అన్నారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితిని వేదికగా వాడుకోవద్దని ఆయన పాకిస్తాన్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా? -
టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్తో టీ20 వరల్డ్కప్లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది. -
హరీస్ రవూఫ్పై వేటు
లాహోర్: వచ్చే నెలలో భారత్–శ్రీలంక వేదికగా జరిగే పురుషుల టి20 ప్రపంచకప్లో పాల్గొనే పాకిస్టాన్ జట్టును ఆదివారం ప్రకటించారు. 15 మంది సభ్యుల పాక్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహిస్తాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ ఆడిన పేసర్ హరీస్ రవూఫ్పై సెలక్టర్లు వేటు వేయడం గమనార్హం. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన బిగ్బాష్ టి20 లీగ్లో హరీస్ రవూఫ్ 20 వికెట్లతో లీగ్ ‘టాపర్’గా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (94 మ్యాచ్ల్లో 133 వికెట్లు) తీసిన పాక్ బౌలర్గానూ గుర్తింపు పొందాడు. ‘పాక్ తరఫున రవూఫ్ చాలా క్రికెట్ ఆడాడు. శ్రీలంకలో పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. మెగా టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అనేది పాక్ ప్రభుత్వం చూసుకుంటుందని జావేద్ అన్నాడు. బంగ్లాదేశ్ను ప్రపంచకప్ నుంచి తప్పించగానే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ తమ దేశ ప్రధానమంత్రి అదేశాల మేరకే నడుచుకుంటామని, ఐసీసీ ప్రకారం కాదని చెప్పారు. పాక్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ మెగా ఈవెంట్లో పాక్ ఆడుతుందని నఖ్వీ తెలిపారు. ఆతిథ్య భారత్ ఉన్న గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ ఉంది. ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఇతర జట్లు. వచ్చేనెల 7 నుంచి జరిగే ప్రపంచకప్లో పాక్, నెదర్లాండ్స్ల మధ్యే తొలి మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్ టి20 జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్ ), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్. -
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
-
టీ20 వరల్డ్కప్కు పాక్ జట్టు ప్రకటన.. కీలక మార్పులు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కెప్టెన్గా సల్మాన్ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరీస్, సుఫియాన్ ముఖీమ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు..సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, పాక్ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్లో పాల్గొనబోమని పాక్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్ జట్టు హెడ్ కోచ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.నెదర్లాండ్స్తో ఢీఅన్నీ కుదిరితే పాక్ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్తో మ్యాచ్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.ఇదిలా ఉంటే, భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.తదనంతర పరిణామాల్లో.. టీ20 వరల్డ్కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.నేపథ్యంభారత్-బంగ్లాదేశ్ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకొని ఓవరాక్షన్ చేస్తుంది. -
టీ20 వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్?
అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
పాక్లో ఘోరం.. ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి
పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తోంది. ఖైబర్ ప్రావిన్స్లో మంచు చరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవ సమాధి అయ్యారు. ఘటన నుంచి ఒక్క బాలుడు మాత్రమే గాయాలతో తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.చిత్రాల్ జిల్లా దామిల్ ప్రాంతంలోని సెరిగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుందన్నారు. ఆ ప్రాంతంలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. పెద్ద మంచు పలక దిగువకు జారుతూ వచ్చి పర్వతప్రాంతంలోని వీరున్న నివాసంపై పడిందని చెప్పారు.మృతదేహాలను వెలికి తీశామని, ప్రాణాలతో ఉన్న 9 ఏళ్ల బాలుడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చామన్నారు. ఖైబర్తోపాటు బలూచిస్తాన్, బల్టిస్తాన్ పీవోకేల్లో దట్టమైన మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. ఉష్ణోగత్రులు కొన్ని చోట్ల మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. మంచు కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
పాకిస్తాన్లో హై అలర్ట్.. ఆత్మాహుతి దాడిలో కీలక నేత మృతి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు దాడిలో పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్లో ఉన్నారని సమాచారం. దీంతో, పాకిస్తాన్లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఖురేషి మోర్ సమీపంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుడు కారణంగా పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. మృతుల్లో శాంతి కమిటీ కమాండర్ జాగ్రీ మెహసూద్ కూడా ఉన్నారు. కాగా, దాడి జరిగిన సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నృత్యం చేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా గది పైకప్పు కూలిపోయింది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.#BREAKING𝐃𝐞𝐫𝐚 𝐈𝐬𝐦𝐚𝐢𝐥 𝐊𝐡𝐚𝐧 𝐒𝐮𝐢𝐜𝐢𝐝𝐞 𝐁𝐥𝐚𝐬𝐭 𝐊𝐢𝐥𝐥𝐬 𝐎𝐯𝐞𝐫 𝐓𝐞𝐧, 𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐏𝐞𝐚𝐜𝐞 𝐂𝐨𝐦𝐦𝐢𝐭𝐭𝐞𝐞 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬A suicide bombing struck a wedding ceremony in the Qureshi Mor area of Dera Ismail Khan district, Khyber Pakhtunkhwa, on… pic.twitter.com/KKvtYRi1rx— نقطةNUQTA (@NUQTA31) January 23, 2026అనంతరం, ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ మాట్లాడుతూ.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏడు అంబులెన్స్లు, ఒక అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి ఇప్పటివరకు ఏ టెర్రరిస్టు బాధ్యత వహించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. -
పాక్ టి20 జట్టులో షాహిన్, బాబర్
కరాచీ: పాకిస్తాన్ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం షాహిన్ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ఆడిన బాబర్ ఆజమ్ కూడా పాక్ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్కు ముందు పాక్, ఆసీస్లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్కు చేరుకుంటుంది. పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెపె్టన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్. -
ఇక అమెరికా-భారత్ బంధానికి బీటలు!
శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత ఒకటి ఉంది. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాంటి శత్రువుతోనే జత కట్టాలని, భుజం తట్టి ప్రొత్సహించాలని అగర్రాజ్యం బలంగా భావిస్తోంది!. ఈ నేపథ్యంలోనే అమెరికా-భారత్ మధ్య స్నేహబంధానికి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు..బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో శాంతి యుతంగా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద సవాలే. అయితే.. అక్కడి జమాత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో వాషింగ్టన్-ఢిల్లీ మధ్య సంబంధాలపై ప్రభావం పడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారట్లు.. వాషింగ్టన్ పోస్ట్ ఓ సమగ్ర కథనం ప్రచురించింది. అందులో..ఇటీవల నిర్వహించిన సర్వేల్లో జమాత్, బీఎన్పీలకు ప్రజాదరణ అధికంగా ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా జమాత్ విద్యార్థి విభాగం ‘‘ఇస్లామీ ఛాత్ర శిబిర్’’ ఆమధ్య నిర్వహించిన వర్సిటీ ఎలక్షన్స్లో ఆధిపత్యం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికలకు జమాత్ బలమైన పునాది వేసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికన్ రాయబారి ఒకరు స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ఇస్లామిక్ వైపు మళ్లింది అని అన్నారు. ఈ తరుణంలో జమాత్ నాయకులతో అమెరికా స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటే మంచిదని సూచించారు కూడా.భారత్ ఆందోళనలు ఏంటంటే..జమాత్-అమెరికా దోస్తానాపై భారత్ ఆందోళనలో అర్థం ఉంది. ఎందుకంటే.. జమాత్-ఎ-ఇస్లామీని భారత్ ఎప్పటినుంచో శత్రువుగానే చూస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1971 యుద్ధంలో ఈ పార్టీ పాకిస్తాన్ పక్షాన నిలిచిన చరిత్ర ఉంది. అలాగే మతోన్మాదంతో ఆ సమయంలో మైనారిటీలను ఊచకోత కోసిందని అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాత్ అధికారంలోకి వస్తే.. హిందువుల సహా ఇతర మైనారిటీలకు భద్రత ఉండబోదని ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య వివాదాలు, వ్యూహాత్మక విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా జమాత్కు మద్దతుగా నిలిస్తే.. భారత్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.జమాత్ బ్యాక్గ్రౌండ్ ఇది.. 1971 విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా.. పాక్కు మద్దతుగా నిలిచింది జమాత్-ఎ-ఇస్లామీ. పార్టీకి చెందిన అనేక నాయకులు, వార్ క్రైమ్స్ (యుద్ధ నేరాలు)లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా హింస, హత్యలతో పాటు మైనారిటీలపై దాడులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఆ పార్టీపై జనాల్లో వ్యతిరేకత ఉండేది.ఒకానొక టైంలో దేశద్రోహి పార్టీ అంటూ అనేకసార్లు నిషేధానికి గురైంది. విమోచన యుద్ధానికి వ్యతిరేకంగా నిలిచినందుకు, మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు.. ఇలా రకరకాల కారణాలు చూపించారు. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తుంటే.. జమాత్ మాత్రం షరియా చట్టం అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం వల్లే.. 2013లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆ పార్టీని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను తీసేసింది. దీంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రధాని హోదాలో షేక్ హసీనానే ఆనాడు ఈ పని చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయాక.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు జమాత్పై నిషేధం ఎత్తేసింది. దీంతో అవినీతి వ్యతిరేకం.. సంక్షేమం.. అంటూ జమాత్ కొత్త నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఆదరణ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.అమెరికా మరోలా.. ప్రస్తుతానికైతే అమెరికా.. జమాత్తో ఫ్రెండ్షిఫ్ను కోరుకోవడం లేదని సమాచారం. ‘‘బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికల్లో మేం ఎవరికీ మద్దతు ఇవ్వబోం’’ అని ఆ దేశ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో మత ఛాందస పార్టీగా పేరున్న జమాత్ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. షరియా చట్టాలను అమలు చేస్తే.. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించింది కూడా.రాజకీయ వాతావరణంహసీనా తొలగింపుతో ఏర్పడిన యూనస్ తాత్కాలిక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య మార్పు పేరుతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే మాజీ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్.. యూనస్ ప్రభుత్వం మత ఛాందస వాదులతో చేతులు కలిపి అవామీలీగ్ కేడర్ను, హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. హసీనా ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉండగా.. జమాత్ సహా ఇస్లామిస్టులు ఆమె ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించారు. -
పాకిస్తాన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్రేట్ను మాత్రమే సూపర్ సిక్స్కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తే పాక్కు రన్రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్రేట్ను ప్రభావితం చేస్తే కెప్టెన్పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
టీ20 వరల్డ్కప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్తో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్కు దూరంగా ఉండి, బిగ్బాష్ లీగ్లో పాల్గొన్నారు. మరో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్కు చోటు దక్కింది.లాహోర్లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాక్ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్కు చేరుకుంటుంది. మ్యాచ్లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్ ఇది. చివరిగా ఆసీస్ 2022లో పాక్లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్ మొదలవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ -
ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ పై ..ఇజ్రాయెల్ విమర్శ
గాజాలో శాంతికోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం గాజాలో శాంతికోసమే మాత్రమే కాదని అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే తాజాగా దీనిపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలు గాజాలో బలగాలను మెహరిస్తాయంటే తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని ఆ దేశ మంత్రి నిర్ బర్కత్ అన్నారు.డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్త రూపం మెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభేదాలను పరిష్కరిస్తానంటూ బోర్డ్ ఆఫ్ పీస్ పేరుతో ఒక అంతర్జాతీయ శాంతిమండలిని ఏర్పాటు చేశారు. నిన్న దావోస్లో జరిగిన మీటింగ్లో దీనిని 35 దేశాలతో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక యుద్ధాలను ఆపడమే తరువాయి అంటున్నారు. అయితే ట్రంప్ క్లోజ్ ఫ్రైండైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ తొలుత దీనిని వ్యతిరేకించారు. అనంతరం అంగీకారం తెలిపాడు. ఇప్పుడు తాజాగా ఆదేశ ఆర్థిక మంత్రి దావోస్లో ఈ అంశంపై మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ "ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాల బలగాలని గాజాలో మెహరించడానికి మేము ఒప్పుకోం. ఖతర్, టర్కీ దేశాల బలగాల్ని మేము ఆమెదించం ఎందుకంటే వారా గాజాలోని జిహాది ఆర్గనైజేషన్లకు మద్దతిస్తారు. వారు అక్కడ కాలుమోపితే మేము నమ్మం వారు ట్రంప్కు చెందిన సంస్థలో ఉన్న మేము పట్టించుకోం" అని బర్కత్ అన్నారు. ప్రస్తుతం ఒక మంచి ప్రతిపాదనతో ముందుకెళ్తున్నారు. అయితే హమాస్ పరిస్థితి ఏంటి దానిని ఖచ్చితంగా నాశనం చేయాల్సిందే అన్నారు. దౌత్య సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఏదైనా దేశం పరస్పరం సహకరించుకుంటాయన్నారు. అందుకే గాజాలో పాకిస్థాన్ బలగాల్ని తాము నమ్మకమైన అంగీకరమైన భాగస్వామిగా చూడడం లేదన్నారు. అయితే నిన్న ( గురువారం) దావోస్లో పాకిస్థాన్ డొనాల్డ్ ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి అంగీకారం తెలిపింది. కాగా ఇదివరకూ జరిగిన ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ గాజాలో శాంతి కోసం తమ బలగాల్ని మెహరించాల్సి ఉంటుంది -
కరాచీ మాల్ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు
కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.ఒకే చోట 30 మంది..సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ షట్టర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.అయితే ఈ విషాధ సంఘటనలో మరణించిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు లభ్యమైన 61 మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించినట్లు సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒకరు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈ భవనంలో భద్రత లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది. -
'నాకు ముగ్గురు కూతుళ్లు.. నన్నెవరూ భయపెట్టలేరు'
‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది. View this post on Instagram A post shared by SYED KAZIM🩶 (@syed_kazimkazmi110)“మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.” అన్నమెసేజ్ . దీంతోపాటు, దీని “M,” “A” “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్నమాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో ఇది నిరూపించింది. ఈ క్లిప్ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్ను సంపాదించింది.నెటిజన్ల రియాక్షన్ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో”, “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం. -
రెచ్చగొట్టిన పాక్.. ఇరుదేశాల మధ్య కాల్పులు
దాయాది పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. నిన్న రాత్రి ( మంగళవారం) నార్త్ కశ్మీర్ ప్రాంతంలోని కేరన్ సెక్టార్ ప్రాంతంలో భద్రతా బలగాలు పహారా చేస్తున్న సమయంలో కాల్పులు జరిపింది. అయితే భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ నిఘావ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. పాకిస్థాన్తో సరిహాద్దు పంచుకుంటున్న సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఆధునాతన సీసీ సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా ఆసమయంలో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది.కెమెరాలు ఏర్పాటును అడ్డుకునేలా రెండు రౌడ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈకాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ప్రమాదంలో రెండువైపులా ఎవరికీ గాయాలుకానట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో చిల్లైకలానే అత్యంత కఠినమైన చలి ఉండే సమయం నడుస్తోంది. ఈ సమయంలో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది. అందుకే సరిహద్దు వెంబడి భద్రతను మరింత కఠినతరం చేశారు. ఎటువంటి చిన్నబొరబాట్లు సైతం దేశంలోకి జరగకుండా ప్రత్యేక నిఘావ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. -
పబ్లిసిటీ పిచ్చి ఎంత పని చేసింది!
పాకిస్థాన్లో విపరీతమైన పబ్లిసిటీ ఉన్న మంత్రిగా రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్కు ఓ పేరుంది. ఏది పడితే ఆ ఈవెంట్కు హాజరవుతూ నిత్యం వార్తల్లో.. సోషల్ మీడియాలో కనిపిస్తూ.. విమర్శలు ఎదుర్కొంటారాయన. ఈ క్రమంలో.. ఆ పబ్లిసిటీ పిచ్చి ఆయన పరువు తీసేసింది.పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తాజాగా సియాల్కోట్లో పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించారు. కొద్దిగంటలకే ఆ కార్యక్రమం ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది షరా మామూలే కదా అనుకున్న నెటిజన్లకు.. కాసేపటికే ఓ పోస్ట్ విపరీతమైన నవ్వు తెప్పించింది.పిజ్జా హట్ బ్రాండ్ సదరు అవుట్లెట్ గురించి ఒక ప్రకటన చేసింది. దాంతో తమకుగానీ.. యమ్ బ్రాండ్స్కుగానీ ఎలాంటి సంబంధం లేదని.. అది ఫేక్ ఔట్లెట్ అని క్లారిటీ ఇచ్చింది. ఈ షాపుపై సంబంధిత విభాగంలోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. దేనికి పడితే దానికి వెళ్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.Defence Minister Khawaja Asif just inaugurated a fake Pizza Hut outlet in Sialkot 😃 pic.twitter.com/sLPnQuBGqi— Adeel Raja (@adeelraja) January 20, 2026 -
లక్షల్లో ‘బిహారీ’ బందీలు.. 50 ఏళ్లుగా..
బంగ్లాదేశ్ 2026 సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరోమారు ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది. గత 50 ఏళ్లుగా ఆ దేశంలో అనామకులుగా మిగిలిపోయిన ‘బిహారీ’ల ప్రస్తావన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం లభించి ఇన్లేళ్లు గడిచినా, వారి జీవితాల్లో ఇసుమంత వెలుగు కూడా కానరాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి వెతలు తీరలేదు. ఇంతకీ ‘బంగ్లా’లో మగ్గిపోతున్న ‘బిహారీ’లు ఎవరు? వారి సమస్య ఏమిటి? పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది?బంగ్లాదేశ్లో అనామక పౌరులు1971 యుద్ధానంతరం బంగ్లాదేశ్లోనే ఉండిపోయిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు లేదా ‘బీహారీ’ (పాక్ అనుకూల వర్గాలు)ల దుస్థితి మరోమారు అందరి నోళ్లలో నానుతోంది. 1971 డిసెంబర్ 16న దేశం విడిపోయిన నాటి నుంచి వారు బంగ్లాదేశ్లో అనామక పౌరులుగా మిగిలిపోయారు. వీరికి ఫలానా దేశానికి చెందినవారనే గుర్తింపు కూడా లేదు. నాడు పాకిస్థాన్ కు సహకరించారన్న ఆరోపణలతో వీరిని తాత్కాలిక శిబిరాల్లో బంధించారు. నేటికీ ఆ శిబిరాలే వారికి శాశ్వత నివాసాలుగా మారాయి. పాకిస్తాన్ తమను తిరిగి తీసుకువెళుతుందని వీరంతా ఆశించినా, కేవలం 1.70 లక్షల మందిని మాత్రమే ఆ దేశం వెనక్కి తీసుకుంది. మిగిలిన లక్షలాది మంది బంగ్లాదేశ్లో పూర్తిగా కలవలేక, పాకిస్తాన్ కు తిరిగి వెళ్లలేక నిరంతర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు.గడచిన ఐదు దశాబ్దాల్లో..వీరి సమస్యకు పరిష్కారంగా 2003, 2008లో వచ్చిన కోర్టు తీర్పులు కొంతమందికి పౌరసత్వం కల్పించినా, 1971 నాటికి వయోజనులుగా ఉన్నవారికి ఇంకా ఓటు హక్కు గానీ, పూర్తి పౌరసత్వం గానీ దక్కలేదు. గడచిన ఐదు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ లో అనేక ప్రభుత్వాలు మారాయి. సైనిక పాలనలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఇలా సుమారు 15 రకాల పాలనా యంత్రాంగాలు మారినప్పటికీ, ‘బీహారీ’ల తలరాత ఏమాత్రం మారలేదు. వారికి పౌరసత్వం అనేది ఒక కలగానే మిగిలిపోయింది తప్ప, నిజ జీవితంలో సమాన హక్కులు దక్కలేదు.మరోమారు వంచన, దోపిడీ?ఇప్పుడు 2026 ఎన్నికల్లో కూడా వీరు మరోమారు రాజకీయ వంచనకు, దోపిడీకి గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. వీరి విషయంలో పాకిస్తాన్ తన బాధ్యతను విస్మరించడం. పాక్ ప్రభుత్వం అప్పుడప్పుడు ఈ అంశంపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వీరిని వెనక్కి రప్పించేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం లేదు. రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు, సంబంధాలు మెరుగుపడినప్పటికీ, స్వదేశానికి రావాలనుకునే వారిని అనుమతించడంలో పాక్ జాప్యం చేస్తోంది. ఇక రెండోది.. బంగ్లాదేశ్లోని రాజకీయాలు చరిత్రను తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఖలీదా జియా వంటి నేతలు సైతం దేశ గత చరిత్రలోని వివాదాలను విస్మరిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో, నాడు పాకిస్తాన్కు విధేయులుగా ఉండిపోయిన సామాన్యుల వెతలు ఎవరికీ పట్టడం లేదు.నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలుఇరు దేశాలు దౌత్య సంబంధాల సాధారణీకరణ పేరుతో చరిత్రను తారుమారు చేయడం లేదా మౌనం వహించడం చేయడం కారణంగా ఈ వర్గాల ప్రజల హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు రెండూ గతంలో చోటుచేసుకున్న నమ్మకద్రోహాలు, సామూహిక శిక్షలు, వ్యవస్థాగత నిర్లక్ష్యాలను నిరంతరం కప్పిపుచ్చుతున్నాయి. పాక్లోని ఇస్లామిక్ పార్టీలు సైతం ఈ అభాగ్యుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దాదాపు 3.24 లక్షల మంది పాకిస్తానీ పౌరులు 54 ఏళ్లుగా విదేశీ గడ్డపై దిక్కులేకుండా పడి ఉంటే, ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.దుర్భర స్థితిలో మూడో తరం ‘బీహారీ’ యువతప్రస్తుతం పాక్, ‘బంగ్లా’ మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం, క్రికెట్, సైనిక సహకారం మొదలైవాటి చుట్టూనే తిరుగుతున్నాయి. 2026 ఎన్నికలు బంగ్లాదేశ్కు ఒక నైతిక పరీక్ష లాంటివి. 1971 నాటి ద్వేషాన్ని, చరిత్రను పక్కనపెట్టి, బంగ్లాదేశ్ తన గొప్పతనాన్ని చాటుకోవాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమయ్యింది. మురికివాడల్లో మగ్గుతున్న మూడో తరం ‘బీహారీ’ యువతను తమ దేశ పౌరులుగా ఆదరించాలి. వచ్చే ఎన్నికల్లో వీరిని కేవలం ఓటర్లుగా లెక్కించడమే కాకుండా, దేశంలో భాగస్వామ్యం చేయాలని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? -
‘పాకిస్తాన్ ఉగ్ర దేశమే.. ఆ సైన్యం 40 మసీదులను కూల్చేసింది’
జమ్మూ–కాశ్మీర్లోని మసీదులను భారత్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. పాకిస్తాన్ సైన్యమే మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఆరోపించారు.పాకిస్తాన్ను ఆయన బహిరంగంగా ‘ఉగ్రవాద దేశం’గా పేర్కొనడం గమనార్హం. భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్లో మసీదులు, ఇమాములు, కమిటీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందనగానే ఈ వ్యాఖ్యలు చేశారు.బలూచిస్తాన్లో 40 మసీదుల ధ్వంసంబలూచ్ జాతీయవాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన మీర్ యార్ బలూచ్ ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో సుమారు 40 మసీదులను ధ్వంసం చేసింది. ఇందులో మసీదులపై నేరుగా బాంబు దాడులు చేయడం, పవిత్ర ఖురాన్ను దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.భారత్కు బలూచిస్తాన్ మద్దతుజమ్మూ–కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకుంటున్న సూత్రప్రాయ వైఖరికి బలూచిస్తాన్ రిపబ్లిక్ పూర్తి మద్దతు ఇస్తోందని మీర్ యార్ పేర్కొన్నారు. మత, జిహాదీ తీవ్రవాద శక్తులను ఉపయోగించి హిందువులు సహా మైనారిటీలను అణచివేస్తున్న పాకిస్తాన్, ఇతర దేశాలకు మానవ హక్కులపై పాఠాలు చెప్పడం విడ్డూరమని ఆయన విమర్శించారు.పాకిస్తాన్కు చెందిన “బాహ్య శక్తులు” బలూచిస్తాన్లో మసీదులపై బాంబు దాడులు చేయడం, ఖురాన్ దహనం చేయడం, మసీదుల అధిపతులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.పాకిస్తాన్ ఆక్రమణ సైన్యం ట్యాంకులతో దాడులు జరిపి పౌరులపై షెల్స్, ఫిరంగులు ప్రయోగించినప్పుడు తొలి బలైంది ఖాన్ ఆఫ్ కలత్ మసీదు అని మీర్ యార్ బలూచ్ తెలిపారు. ఆ మసీదులో ఇప్పటికీ మోర్టార్ షెల్స్ మోగిన శబ్దాలు వినిపిస్తాయని, అది పాకిస్తాన్ క్రూరత్వానికి నిదర్శనమని అన్నారు.మైనారిటీలపై దౌర్జన్యాలుహిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా అనేక మైనారిటీ వర్గాలు పాకిస్తాన్లో నిరంతర హింసకు గురవుతున్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందేనని మీర్ యార్ బలూచ్ వ్యాఖ్యానించారు. అటువంటి దేశానికి భారత్, బలూచిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లకు మానవ హక్కులపై ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత లేదని ఆయన తేల్చిచెప్పారు. -
26కు పెరిగిన పాక్ మాల్ మృతుల సంఖ్య
కరాచీ: పాకిస్తాన్లోకి కరాచీలో జనసమ్మర్థ గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారానికి 26కు పెరిగింది. దాదాపు 60 మంది మంది జాడ గల్లంతైంది. మంటలను ఆదివారం రాత్రి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ హోల్సేల్, రిటైల్ దుకాణాల సముదాయమైన ఈ షాపింగ్ మాల్లోకి సోమవారం ఉదయం అగి్నమాపక సిబ్బంది ప్రవేశించి శిథిలాలను తొలగిస్తున్నారు. మరికొందరి మృతదేహాలు లభ్యమవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా పలువురు ఆచూకీ తెలియాల్సి ఉందని ‘రెస్క్యూ 1122’అధికార ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్ఖాన్ చెప్పారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో కోటి పాకిస్తాన్ రూపాయలను ఆయన ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు. ప్రమాదంలో షాపింగ్మాల్లోని దాదాపు 300 కోట్ల పాక్ రూపాయల సరకు బుగ్గిపాలైందని అంచనావేస్తున్నారు. భవనం చాలా గంటలపాటు కాలిపోవడంతో నిర్మాణం బాగా దెబ్బతిన్నదని, దాదాపు భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాల్సి రావొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. కరాచీలో సరైన రక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అధిక విద్యుత్ లోడు, అక్రమ నిర్మాణాల కారణంగా గతంలో పలు షాపింగ్ మాల్స్ ప్రమాదాల బారిన పడ్డాయి. -
ప్రపంచకప్లో బోణీ కొట్టిన పాక్
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్తో స్కాట్లాండ్ పతనాన్ని శాశించాడు. మొమిన్ కమర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ తలో వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన థామస్ నైట్ టాప్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్ (33), ఓల్లీ జోన్స్ (30), మను సరస్వత్ (25), రోరి గ్రాంట్ (21), ఫిన్లే కార్టర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్కు సరస్వత్, ఫిన్లే జోన్స్ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్ ఖాన్ (75), అహ్మద్ హుసేన్ (47) పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ ఫర్హాన్ (18 నాటౌట్) పాక్ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్ ఇన్నింగ్స్లో అలీ హసన్ బలోచ్ 15, స్టార్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఓల్లీ జోన్స్, సరస్వత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్ సూపర్-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బుల్బులియా, జేసన్ రోల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. -
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్కు వంత పాడుతున్న పాక్
2026 టీ20 ప్రపంచకప్కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్లో జరగబోయే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్ను పరిష్కరించకపోగా, భారత్లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్ ఆడబోమని ఓవరాక్షన్ చేస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్కప్ మ్యాచ్లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.దీన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. -
పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..
-
పాక్ మాజీ ప్రధాని ఇంట పెళ్లి.. భారతీయ దుస్తులపై దుమారం
భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితంగానే ఉంటాయి. దేశ విభజన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్లో పహల్గాం దాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి, రెండు దేశాలు యుద్ధానికి చేరువయ్యాయన్న భావన కూడా నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి కారణం వధువు భారతీయ ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించడం.ఎవరిదీ వివాహం?నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్, లాహోర్లో షాంజే అలీ రోహైల్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ, వధువు దుస్తులు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువయ్యాయి. జునైద్ సఫ్దర్కు ఇది రెండో వివాహం. ఆయన 2021లో అయేషా సైఫ్ ఖాన్ను వివాహం చేసుకోగా, ఇద్దరూ 2023 అక్టోబర్లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఆకర్షణగా నిలిచిన పెళ్లి దుస్తులుమెహెందీ వేడుకలో షాంజే అలీ, భారతీయ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు జరీ వర్క్తో కూడిన ఆకుపచ్చ లెహంగా, డబుల్ దుపట్టాతో మెరిశారు. ప్రధాన వివాహ వేడుకలో ఆమె తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఎరుపు చీరను ధరించారు. తలపై ఎరుపు ముసుగు, జుట్టులో సొగసైన బన్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ఫొటోలను పాకిస్తాన్ సిటిజన్ మీడియా పోర్టల్ ‘డైలాగ్ పాకిస్తాన్’ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన మొదలైంది. పాకిస్తాన్కు చెందిన కొంతమంది నెటిజన్లు, ఇంతటి రాజకీయ కుటుంబానికి చెందిన కోడలు పాకిస్తాన్ డిజైనర్లను పక్కన పెట్టి భారతీయ డిజైన్లను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కొందరు పాకిస్తాన్ నేతలు భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.అయితే మరికొందరు వధువును సమర్థిస్తూ, ఇది వివాహం పూర్తిగా వ్యక్తిగత అంశమని, తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్తాన్ డిజైనర్లు కూడా అంతే స్థాయిలో ప్రతిభావంతులేనని కొందరు అభిప్రాయపడ్డారు. -
‘పాక్లో నన్ను వేధిస్తున్నారు’.. మహిళ ఆడియో వైరల్
ఇస్లామాబాద్: సర్భ్జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్లో వాఘబార్డర్ మీదుగా పాకిస్థాన్లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.అందులో అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్ సర్బ్జిత్ కౌర్కు చెందిందా కాదా అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.అయితే సర్బ్జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్జిత్ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే కౌర్ను ఇది వరకే పాకిస్థాన్ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని అక్కడి అధికారులు అన్నారు. -
పాకిస్తాన్లో ఘోర ప్రమాదాలు.. 24 మంది మృతి
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటన లాహోర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోధా జిల్లాలోని కోట్ మోమిన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రమాదానికి గురైన ట్రక్కులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు తెలిపారు. వీరంతా ఫైసలాబాద్లో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారి మూసివేయడంతో డ్రైవర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తక్కువ దృశ్యమానత కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి గాలాపూర్ వంతెన నుంచి నీరు లేని కాలువలోకి ట్రక్కు పడిపోయింది.ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కోట్ మోమిన్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బలూచిస్థాన్లో బస్సు బోల్తా: 10 మంది మృతిఇదే రోజు బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్ సమీపంలోని మక్రాన్ తీరప్రాంత రహదారిపై ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సంభవిస్తున్న వరుస ప్రమాదాలు పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. -
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్లో సామాన్యులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల లోపం కారణంగా పాకిస్తాన్లో గోధుమ పిండి సంక్షోభం అత్యంత తీవ్రమైంది. ఆ దేశంలోని దక్షిణ పంజాబ్ ప్రాంతంలో మొదలైన ఈ సంక్షోభంతో పేద ప్రజలు రెండు పూటల కూడా తిండి తినలేని పరిస్థితి నెలకొంది.ప్రాంతీయ బహిరంగ మార్కెట్లలో గోధుమ ధరలు 40 కిలోలకు రూ.4,600 (పాకిస్తాన్ రూపాయలు) చేరగా, ఒక్క కేజీ గోధుమ పిండి దాదాపు రూ.130 లకు చేరింది. అంటే, ఒక సామాన్య కుటుంబం 10 కిలోల పిండి కోసం రూ.1,300 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పేదలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది.మరోవైపు అక్కడి ప్రభుత్వం సబ్సిడీతో పిండి అందిస్తున్నా దాంతో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. 10 కిలోల పిండి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.910 కాగా 20 కిలోలకు రూ.1,820. అయితే లాహోర్ వెలుపల ప్రభుత్వ పిండి లభ్యత చాలా తక్కువగా ఉంది. దక్షిణ పంజాబ్ ప్రజలు ఇప్పుడు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడాల్సి వస్తోంది.పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం.. వ్యాపారులు, సామాన్య ప్రజల వద్ద గోధుమ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. సుమారు 50 లక్షల జనాభా ఉన్న రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ గోధుమల స్థిర కోటా అందుబాటులో లేకపోవడం వల్ల సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్లో 80 శాతం పిండి మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయని మిల్లర్లు తెలిపారు.పెరుగుతున్న ఖర్చులు, బలహీన పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ ఉదాసీనత పరిస్థితిని మరింత తీవ్రముగా మార్చాయని మిల్లర్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం తన 1.5 మిలియన్ టన్నుల నిల్వల నుండి జనవరి 20 నుండి మార్చి 20 వరకు రోజుకు 20,000–22,000 టన్నుల గోధుమలు విడుదల చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ సంక్షోభం మరింత తీవ్రం కావచ్చని హెచ్చరించారు. -
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
టొరంటో: పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ కెనడా పౌరుడు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత వీసా పొందినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.సోషల్ మీడియాలో తనను తాను ఫారెక్స్ ట్రేడర్గా పరిచయం చేసుకునే అభయ్కు ఒక నెల కాలపరిమితి కలిగిన సింగిల్ ఎంట్రీ భారత వీసా మంజూరైంది. ఈ సందర్భంగా అతడు వీసా దరఖాస్తు ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో వివరించాడు.“నేను కెనడా పౌరుడిని. ప్రస్తుతం పాకిస్తాన్లో నివసించడం లేదు. అయినప్పటికీ, పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తినన్న కారణంతో భారత వీసా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దానికి గల కారణాలు నాకు పూర్తిగా తెలియవు” అని అభయ్ పేర్కొన్నారు.అయితే, ఎట్టకేలకు వీసా లభించడంతో సంతోషం వ్యక్తం చేసిన అతడు, భారత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు లభించిన ఈ అవకాశం ఎంతో విలువైనదని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s) -
కరాచీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతి
పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది.కరాచీ అంతర్జాతీయ నౌకాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలను తీసుకెళ్తున్న కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం ఇవి వెనువెంటనే వేరే కంటైనర్లకు వ్యాపించడంతో 20 వరకూ కంటైనర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.అయితే మంటలు వ్యాపించిన సమయం మధ్యాహ్నం ఒంటిగంటతో పాటు నిన్న శుక్రవారం కావడంతో కార్మికులంతా నమాజ్ కోసం దగ్గర్లో ఉన్న మసీద్కు వెళ్లారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడంలో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
సుడాన్కు ఆయుధాలు అమ్ముతున్న పాకిస్తాన్
సౌదీ అరేబియా నుంచి సూడాన్, లిబియా వరకు పాకిస్తాన్ సైనిక ఉనికి, ఆయుధాల విక్రయ పరిధి క్రమంగా విస్తరిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సుడాన్కు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.పాకిస్తాన్–సుడాన్ దేశాలు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుడాన్లో సైన్యం, పారామిలిటరీ సంస్థ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత దాదాపు మూడేళ్లుగా తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలను ఆర్ఎస్ఎఫ్ ఎదుర్కొంటోంది.అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా, ఇప్పుడు నేరుగా ఆయుధాలు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది.ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానం. ఇది పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి, బహుళ-పాత్ర యుద్ధ విమానం. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, చైనాకు చెందిన చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ కలిసి దీనిని తయారు చేస్తున్నాయి. తాజా బ్లాక్-3 వెర్షన్లో ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, సుదూర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉన్నాయి.ఒక్కో JF-17 యుద్ధ విమానం ధర సుమారు 25 నుంచి 30 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇది పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, పరిమిత రక్షణ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. -
గుజరాత్ లో పాక్ పడవ.. తొమ్మిది మంది అరెస్ట్
-
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. హై అలర్ట్లో భారత సైన్యం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తొలుత సోమవారం నౌషెరా-రాజౌరీ సెక్టార్లో పలు డ్రోన్లు కనిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తమై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మంగళవారం రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టార్లోనూ డ్రోన్ల కదలికలు కనిపించాయి. మొదటిసారి డ్రోన్లు కనిపించిన వెంటనే భారత్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ తన ఆందోళనను, అభ్యంతరాలను పాక్ అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం రాజస్థాన్లోని జైపూర్లో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, గురువారం రాజౌరీ జిల్లాలో భద్రతా దళాలు భారీ ముప్పును తప్పించాయి. అందిన కచ్చితమైన సమాచారం మేరకు కాకోరా గ్రామంలో నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. -
భారత్లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!
భారత్లో చొరబడేందుకు పాకిస్తానీయులు యత్నించారు. అరేబియా సముద్ర మార్గం ద్వారా తొమ్మిదిమంది పాకిస్తానీయులు.. భారత్లో చొరబాటుకు యత్నించారు. కానీ వారిని భారత సైనికులు పట్టుకున్నారు. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని బంధించి గుజరాత్కు తీసుకువస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పినా వారి కార్యకలాపాల్లో మార్పు రావడం లేదు. మత్స్యకారుల వేషంలో ఓ పడవలొ పయనిస్తూ తొమ్మిదిమంది పాక్ దేశీయలు భారత్లో చొరబడేందుకు పన్నాగం వేశార. నిన్న(బుధవారం, జనవరి 14వ తేదీ) రాత్రి, భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉంది. అయితే . అకస్మాత్తుగా, రాడార్ అనుమానాస్పద కదలికను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. ఇది సాధారణ ఫిషింగ్ నౌకలా కనిపించలేదు, ఎందుకంటే దాని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదే సైనికుల అనుమానాలను రేకెత్తించింది. దాంతో కోస్ట్గార్డ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్లోని పోర్ట్కు తీసుకువస్తున్నారు. इंडियन कोस्ट गार्ड ने 9 पाकिस्तानी नागरिक को अवैध घुसपैठ की कोशिश में पकड़ा है. अरब सागर में 14 जनवरी की रात इंडियन कोस्ट गार्ड पेट्रोलिंग कर रही थी तभी उन्हें मछुवारों के भेस में भारत की सीमा में प्रवेश करते हुए पकितानियों को पकड़ा है. फिलहाल मामले की जांच जारी है. pic.twitter.com/A1lQfhHCBR— Versha Singh (@Vershasingh26) January 15, 2026 -
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్-పాక్ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే ఆసీస్ జట్టే ఈ సిరీస్లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్ కోసం పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్, టీ20 సిరీస్లను ఆసీస్ గెలుచుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్.. టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఉంది. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. -
పాకిస్తాన్ నక్క బుద్ది.. భారత్ టార్గెట్గా భారీ ప్లాన్?
ఇస్లామాబాద్: కుక్క తోక వంకర అనే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం విషయంలో బహిరంగ వేదికలపై తమ దేశం వ్యతిరేకం అంటూనే.. అంతర్గతంగా మాత్రం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైనప్పటికీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం భద్రతా సంస్థలు కలిసి రెండో తరం ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో సీనియర్ ఉగ్రవాద కమాండర్ల కుమారులు, వారి దగ్గరి బంధువులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్ టార్గెట్గా దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా వర్ణించబడిన ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జమ్ముకశ్మీర్లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం, భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడమే ముఖ్య లక్ష్యమని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే, జమ్ముకశ్మీర్లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జెఎమ్) కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.పహల్గాం తరహా ప్లాన్?మరోవైపు.. సీనియర్ లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైష్ కమాండర్ అబ్దుర్ రౌఫ్తో ఇటీవలే బహవల్పూర్కు చేరుకున్నారు. అక్కడే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తో తల్హా సయీద్, సైఫుల్లా కసూరి రహస్య సమావేశం నిర్వహించారని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, పహల్గాం దాడికి ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశం ఇది రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి సీనియర్ ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు ISI ఇప్పుడు దృష్టిని మళ్లిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. నాయకత్వం, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి రెండో తరం ఉగ్రవాద కార్యకర్తలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఇందుకు అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నారు. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్వర్క్లు మరియు అంతర్జాతీయ సంబంధాలలో కూడా అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.అదేవిధంగా, మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్కు ISI మద్దతు, శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, అస్గర్.. జైష్-ఎ-మొహమ్మద్లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, ఉగ్రవాద మాడ్యుల్స్ సిద్ధం చేయడం, సరిహద్దు కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి పెద్ద నాయకత్వ పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రౌఫ్ అస్గర్ గతంలో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే చర్చ మొదలైంది. -
ఇమ్రాన్ను కలవనివ్వండి.. ఖురాన్తో సోదరిల నిరసన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్లో చర్చనీయాంశమైంది.ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. -
పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తాం: ఆర్మీ చీఫ్ హెచ్చరిక
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందన్నారు. దాయాది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్లో ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆర్మీ చీఫ్ ద్వివేది తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్లో త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం. దేశంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్దంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా అది స్పష్టమైంది. జమ్ము కశ్మీర్లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా.. ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉండటం కీలకం. భారత మోహరింపులు బలంగా ఉన్నాయి. భవిష్యత్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఆపరేషన్ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. కవ్వింపు చర్యలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని’ అని అన్నారు.ఇదే సమయంలో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. వారిలో దాదాపు 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారే ఉన్నారు. వీరిలో ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. స్థానికంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు సింగిల్ డిజిట్కు పడిపోయింది. అయితే, ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపుగా లేవు. మా సమాచారం ప్రకారం దాదాపు ఎనిమిది శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. వీటిలో, రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా.. ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. ఈ శిబిరాల్లో కొంత ఉనికి లేదా శిక్షణ కార్యకలాపాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మేము నిశితంగా గమనిస్తూ ఇన్పుట్లను సేకరిస్తున్నాం. అలాంటి కార్యకలాపాలు మళ్ళీ గుర్తించబడితే, అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటాం అని హెచ్చరించారు. -
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది. నిన్న కూడా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు నుంచి వచ్చిన ఒక డ్రోన్, సాంబా సెక్టార్లో ఆయుధాల సరుకును వదిలింది. డ్రోన్లను అడ్డుకోవడానికి సైన్యం మెషిన్ గన్స్ను వినియోగించింది. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి. సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదలికను గమనిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
పాక్-అమెరికా సైనిక విన్యాసం.. ఎందుకో తెలిస్తే షాక్..!
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్కు చెందిన వారేనని పేర్కొంది. అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.అయితే ఈ ఆపరేషన్పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే. -
'ఒకరు కాదు.. వెయ్యి మంది కాదు.. భారత్కు మసూద్ అజార్ హెచ్చరికలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.ఆపరేషన్ సిందూర్లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సిందూర్పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.కాగా, భారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్కోట్లో ఎయిర్బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
"ఇంటర్నెట్ నాకు తెలియదు": అజిత్ దోవల్
అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకునే ఈ ఆఫీసర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారత గూఢచారిగా ఎన్నో సీక్రెట్ మిషన్లలో పాల్గొని దేశ భద్రతలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఇంటర్నెట్ వాడడం లేదని, మెుబైల్కు సైతం చాలావరకూ దూరంగా ఉంటానని తెలిపారు.భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాతృభూమి రక్షణ కోసం అనునిత్యం తపించే ఈ ఆఫీసర్ దేశం కోసం ఎన్నో రిస్కీ ఆపరేషన్లు చేశారు. 1980 దశకంలో పాకిస్థాన్లో ఏడేళ్లపాటు ముస్లిం వ్యాపారిగా, బిచ్చగాడిగా నటిస్తూ భారత్కు ఎంతో కీలక సమాచారాన్ని చేరవేశారు. అంతేకాకుండా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన మిలిటెంట్లను బయిటకి తీసేందుకు అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశారు. ఇలా భారత్ కోసం ఆయన ప్రాణాలు తెగించి చేసిన ఆపరేషన్లు అనేకం. అందుకే ఆయనను అందరూ ఇండియన్ జేమ్స్బాండ్ అని పిలుచుకుంటారు.అయితే శనివారం ఢిల్లీ భరత మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్-2026- కార్యక్రమం జరిగింది. అందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ" నేను అసలు ఇంటర్నెట్ వినియోగించను. ఇది నిజం అంతేకాకుండా మెుబైల్ ఫోన్ అసలు వాడను. కేవలం విదేశాల్లో ఉన్నప్పుడు మా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి తప్ప దానిని వినియోగించను. నాపని అంతా అలానే సాగుతుంది" అని అజిత్ దోవల్ అన్నారు. 1945లో ఉత్తరాఖండ్లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్ సాధించి కేరళ క్యాడర్కు ఎంపికయ్యారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సమయంలో భారత్ తరపున చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో కీర్తి చక్ర అవార్డుకు ఎంపికయిన పోలీసు ఆఫీసర్గా ఆయన రికార్డు సృష్టించారు. అజిత్ దోవల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో దశాబ్దాల కాలం పాటు భారత్కు సేవలందించారు. -
పాకిస్థాన్లో హిందూ రైతు దారుణహత్య
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న ఓ హిందు రైతుని సర్ఫరాజ్ నిజామని అనే భూస్వామి కాల్చిచంపారు. దీంతో అక్కడి మైనార్టీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. భారత్లోమైనార్టీల హక్కులు కాలరాస్తున్నారని అక్కడి విదేశాంగశాఖ మంత్రి ప్రసంగించిన మరుసటి రోజే అక్కడి ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ఇస్లామిక్ అధిపత్యం ఉన్న దేశాలలో హిందువులపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రస్థాయిలో హింస చేలరేగింది. అక్కడి స్టూడెంట్ లీడర్ మృతితో అక్కడి మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. ఇస్లాం వ్యతిరేక ప్రచారాల నెపం మోపి అనేక మందిపై దాడి చేసిం చంపారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే తాజాగా పాకిస్థాన్లో మరోసారి హిందూ రైతుని కాల్చిచంపారు.సింధూ ప్రావిన్సూకు చెందిన సర్ఫరాజ్ నిజమని అనే భూస్వామికి చెందిన భూమిని కైలాస్ కోల్హి అనే హిందూ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు. రెండురోజుల క్రితం కైలాస్ కోల్హి ఛాతిపై సర్ఫరాజ్ కాల్పులు జరిపాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రైతు మృతితో పాకిస్థాన్లోని మైనార్టీలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి" అని ఆయన అన్నారు. కైలాస్ కోల్హిపై ఎందుకు కాల్పులు జరిపారో అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి, నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి." అని ఆయన అన్నారు. కాగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలని తొలగించే పనులలో భాగంగా టర్కీగేట్ వద్ద ఫైజ్-ఇ-ఇలాహి మసీదు సమీపంలోని కట్టడాలను తొలగించారు.దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ భారత్లో మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారంటూ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మైనార్టీలపై తరచుగా దాడులు చేసే దేశానికి ఈ వ్యాఖ్యలు చేసే హక్కులు లేదని విమర్శించింది. Badin SindhThe protest for the arrest of the killers of the martyred Kalash Kolhi is making history.Shiva Kachhi, Chairman of Pakistan Darawar Ittehad @PItehad is leading the historic protest sit-in.This was not just a protest—it was the cry of a wounded conscience.From… pic.twitter.com/uo9io9PAk0— Shiva Kachhi (دراوڙ)🇵🇰 (@FaqirShiva) January 9, 2026 -
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
సొంత దేశంపై బంగ్లాదేశ్ క్రికెటర్ తిరుగుబాటు
భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్పై ఆ దేశ క్రికెటరే తిరుగుబాటు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అయిన తమీమ్ ఇక్బాల్ భారత్తో అనుసరిస్తున్న విధానాలపై సొంత దేశ నాయకులను, క్రికెట్ బోర్డును హెచ్చరించినట్లు సమాచారం. పాక్ అండ చూసుకొని భారత్పై రెచ్చిపోవద్దని తమీమ్ స్వదేశీ క్రికెట్ బోర్డుకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే ఐసీసీతో విరోధం కూడా మంచి కాదని హెచ్చరించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం తమీమ్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో 90 నుంచి 95 శాతం ఐసీసీ నుంచే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీతో విరోధం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదం.టీ20 వరల్డ్కప్ విషయంలో ప్రజల్లో ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం కంటే, బోర్డు లోపల చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలు తీరతాయి.భారత్లో ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్ మార్గాన్ని అనుసరించడం బంగ్లాదేశ్కు హానికరం. వారు చేశారని మనమూ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.ప్రపంచ కప్ నుంచి వైదొలగడం దేశ క్రికెట్ సంస్కృతిని దెబ్బతీస్తుంది.తమీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ నాయకులు, ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలు అనురిస్తున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. తమీమ్ మొదటి నుంచి విధానాల విషయంలో బీసీబీ పెద్దలను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. తాజా పరిణామాలపై అతను మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమీమ్ వ్యాఖ్యల్లో క్రికెట్ ముందు, రాజకీయాలు తర్వాత అన్న విషయం స్పష్టమవుతుంది.భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంషేక్ హసీనా స్థానంలో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కావడంతో భారత్తో సంబంధాలు క్షీణించాయి. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించింది.ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అతిగా స్పందించింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్లో వరల్డ్కప్ మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది. టీ20 వరల్డ్కప్ మ్యాచ్లను భారత్కు బదులుగా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ కోరింది. ఐసీసీ ససేమిరా అంటుండటంతో వాకౌట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతుంది. పాక్ అండ చూసుకొని, ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మొత్తంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ను చూపిస్తూ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. -
ప్రధాని మోడీ హెచ్చరికలతో పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళన
-
పాక్లో హమాస్ - లష్కరే భేటీ.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో ముందు వరుసలో ఉందనే పేరుపొందిన పాకిస్తాన్ గడ్డపై తాజాగా మరో ప్రమాదకర పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హమాస్, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ల మధ్య జరిగిన భేటీ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూపు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే ఉగ్రవాదులు తమ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లోని గుజ్రన్ వాలాలో లష్కరే తోయిబాకు చెందిన ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఉగ్ర ముఠాల మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి. Senior Hamas commander attended Lashkar terrorist function as Chief guest in Gujranwala, PakistanIsrael will be watching this 😎 pic.twitter.com/kuTKF0zHpP— Megh Updates 🚨™ (@MeghUpdates) January 7, 2026హమాస్ నేత నజీ జహీర్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు ఈనాటికి కావు.. 2025, ఫిబ్రవరిలో పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించి, లష్కరే, జైషే మొహమ్మద్ కమాండర్లతో కలిసి భారత వ్యతిరేక ర్యాలీలో ప్రసంగించారు. అంతకుముందు 2024 జనవరిలో కరాచీ ప్రెస్ క్లబ్లో ప్రసంగించారు. ఇస్లామాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి సన్మానం కూడా అందుకున్నారు. ఈ ఉగ్ర ముఠాల ఐక్యత మరింతగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాణించిన బౌలర్లు, ఫర్హాన్.. శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ గెలుపుతో బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 7) జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ రాణించడంతో పాక్ తిరుగులేని విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ 19.2 ఓవర్లలోనే శ్రీలంకను ఆలౌట్ చేసింది. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంకేయులు 128 పరుగులకే చాపచుట్టేశారు. ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లతో చెలరేగగా.. మొహమ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్ తలో 2 వికెట్లు తీసి సత్తా చాటారు. లంక ఇన్నింగ్స్లో మిడిలార్డర్ బ్యాటర్ జనిత్ లియనాగే (40) టాప్ స్కోరర్గా నిలువగా.. మరెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.ఓపెనర్లు పథుమ్ నిస్సంక 12, కమిల్ మిషారా 0, వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ 14, ధనంజయ డిసిల్వ 10, చరిత్ అసలంక 18, వనిందు హసరంగ 18, దసున్ షనక 12, దుష్మంత చమీరా 0, మహీశ్ తీక్షణ 1 పరుగుకు ఔటయ్యారు. శ్రీలంక చివరి 5 వికెట్లు 18 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (51), సైమ్ అయూబ్ (24) శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత కెప్టెన్ సల్మాన్ అఘా (16), ఫకర్ జమాన్ (5) విఫలమైనా, ఉస్మాన్ ఖాన్ (7 నాటౌట్), షాదాబ్ ఖాన్ (18 నాటౌట్) పాక్ను విజయతీరాలకు చేర్చారు. 16.4 ఓవర్లలో పాక్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, ధనంజయ డిసిల్వకు తలో వికెట్ దక్కింది. సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా జనవరి 9న జరుగనుంది. -
ట్రంప్ ముందు మోకరిల్లిన పాక్
ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ ఉద్రిక్తతల్లో తలదూర్చాలని అమెరికాను బతిమాలిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చర్చల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అమెరికాకే చెందిన 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' (FARA) ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు బయటపెట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భావన నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించి కాల్పుల విరమణ పాటించాయి. అయితే ఈ అంశంలో తరుచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నోటివాటం చూపించారు. వీరిద్దరి మధ్య యుద్ధం తానే ఆపానన్నారు. అధిక పన్నులు వేస్తానని హెచ్చరించడంతో రెండు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. అనంతరం పాక్ను అక్కున చేర్చుకొని ఆ దేశానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ భారత్తో డిస్టెన్స్ మెయింటేన్ చేశారు.అయితే తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం అమెరికా మద్ధతు కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించిందని FARA నివేదిక తెలిపింది. అమెరికా తనకు మద్దతిచ్చేలా వ్యవహరించడానికి అనేక లాబీయింగ్ సంస్థలను రంగంలోకి దింపినట్లు ప్రచురించింది. ఈ లాబీయింగ్ సంస్థల ద్వారా పాక్ దౌత్యవేత్తలు, లాబీయిస్టులు.. అమెరికా చట్టసభల ప్రతినిధులతో పాటు పలు విభాగాల అధిపతులను, రక్షణశాఖ అధికారులను భేటీ అయ్యారని పేర్కొంది.పాకిస్థాన్ లాబీయింగ్ కుదుర్చుకున్న ఏజెన్సీలో డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితులైన జార్జ్ సోరియల్, కీత్ షిల్లర్ వంటి వారు ఉన్నారంది. అంతేకాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ పర్యటనను సైతం ఈ లాబీయింగ్ సంస్థలే ఏర్పాటు చేశాయని FARA తెలిపింది. ప్రధాన పత్రికలైన 'వాల్ స్ట్రీట్ జర్నల్', 'న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికల్లో పాకిస్థాన్కు అనుకూలంగా కథనాలు వచ్చేలా మీడియా మేనేజ్మెంట్ చేసిందని పేర్కొంది. దీనికోసం స్వల్పకాలంలో పాక్ ఐదు మిలియన్ డాలర్లు.. భారత్ కరెన్సీలో దాదాపు రూ. 45కోట్లు ఖర్చుచేసినట్లు ప్రచురించింది. దీంతో ట్రంప్, భారత్తో గ్యాప్కు పాక్ సంప్రదింపులు సైతం ఓ కారణమేనా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో భారత్ సైతం అమెరికాతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించిందని 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' ప్రచురించింది. -
ప్రమాదపుటంచుల్లో పాకిస్తాన్..!
-
పాక్ ఎత్తుగడ.. భారత్ ఎలా చిత్తు చేస్తోందంటే?
పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు పంజాబ్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు పాక్ ఎత్తుగడ ఏంటి? దాన్ని భారత్ ఎలా చిత్తుచేస్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.భారతదేశ రహస్యాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేయిస్తోందనే విషయం బహిర్గతం కావడంతో.. మన బలగాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా పంజాబ్ పోలీసులు 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని గూఢచర్య అభియోగాలపై అరెస్టు చేశారు. దాంతో.. ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. మిలటరీ ఎస్టాబ్లిష్మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు? ఏయే సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్కు పంపాడు? అనే వివరాలను అధికారులు గుర్తించారు.తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు. ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో.. పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. అయితే.. జమ్మూకశ్మీర్, పంజాబ్లలో పలువురు బాలలతో పాకిస్థాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.జమ్మూకశ్మీర్, పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి.. ఇక్కడి బాలలను హనీట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. మైనర్ బాలురతో గూఢచర్యం చేయిస్తే.. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో.. మరింత మంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
పాక్లో నెక్ట్స్ జరిగేది ఇదేనా?
పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.పాకిస్తాన్లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్గా చూస్తే.. పాకిస్తాన్లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు. -
పాక్లో షరారత్ క్రేజ్ మామూలుగా లేదుగా, అమ్మాయిల స్టెప్పులు వైరల్
బాలీవుడ్ స్టార్హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్గా కూడా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు. -
టీ20 వరల్డ్కప్కు పాక్ జట్టు ప్రకటన.. ఎట్టకేలకు స్టార్ ప్లేయర్కు చోటు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీని (వైస్ కెప్టెన్) ప్రకటించలేదు.ఫామ్లేమితో సతమతమవుతున్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్నెస్పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్కు బ్యాకప్గా మరో పేసర్ హరీస్ రౌఫ్ ఎంపికయ్యాడు. షాహీన్ తాజాగా బిగ్బాష్ లీగ్లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్కీపర్గా ఎంపికయ్యాడు. మెయిన్ స్క్వాడ్ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు. టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు- సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్) - బాబర్ ఆజమ్ - షాహీన్ అఫ్రిది (ఫిట్నెస్ అనిశ్చితి) - ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్) - షాదాబ్ ఖాన్ - మొహమ్మద్ నవాజ్ - ఫహీమ్ అష్రఫ్ - హారిస్ రౌఫ్ (షాహీన్కు ప్రత్యామ్నాయం) - ఫకర్ జమాన్- మొహమ్మద్ వసీం జూనియర్- నసీం షా- అబ్దుల్ సమద్- సాహిబ్జాదా ఫర్హాన్- సైమ్ అయూబ్- సల్మాన్ మీర్జా- అబ్రార్ అహ్మద్కాగా, టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ గ్రూప్-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్తో పాక్ తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది. -
మోదీజీ పాక్పై అటాక్ చేయండి: అసదుద్దీన్
వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని సూచించారు. అమెరికా ఆ పని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్మైండ్గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్కు ప్రత్యేక బలగాలను పంపండి. 26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు" అని అసదుద్దీన్ అన్నారు.అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే. -
భారత్లో ఆడబోము..! పాక్ బాటలోనే బంగ్లాదేశ్?
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026.. ప్రారంభానికి ముందే హాట్ టాపిక్గా మారింది. భారత్తో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ మ్యాచ్ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమన్ను తమ జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ముస్తఫిజుర్ను ఐపీఎల్లో ఆడించరాదంటూ కొంత కాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బంగ్లా పేస్ బౌలర్ బరిలోకి దిగితే టీమ్ యజమాని షారుఖ్ ఖాన్పై కూడా దాడులు చేస్తామంటూ పలు చోట్ల హెచ్చరికలు జారీ అయ్యాయి.వీటిని దృష్టిలో ఉంచుకుంటూ అతడిని తప్పించాలంటూ స్వయంగా బీసీసీఐ కేకేఆర్ యాజమాన్యానికి సూచించింది. దీంతో బోర్డు ఆదేశాల మేరకు జట్టు నుంచి ముస్తఫిజుర్ను కేకేఆర్ విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బాటలోనే బంగ్లాదేశ్ కూడా పయనించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాదిరిగానే వరల్డ్కప్లో ఆడే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుందంట."ముస్తాఫిజుర్ను విడుదలకు సంబంధించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే అది పూర్తిగా బీసీసీఐ, ఫ్రాంచైజీ అంతర్గత విషయం. టీ20 ప్రపంచకప్లో పాల్గొనే విషయానికి వస్తే, అది ఐసీసీ నిర్వహించే ఈవెంట్. ఈ విషయంపై త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీతో చర్చిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. మేము కూడా మా డిమాండ్లను ఐసీసీ ముందు పెడతాము. ఇందుకు సంబంధించి ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.ఇదే విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పందించాడు. "బీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఒక ఆటగాడు భారత్లో ఆడలేనప్పడు.. మొత్తం బంగ్లాదేశ్ జట్టు అక్కడ సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. అందుకే మా నాలుగు లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని జైషా నేతృత్వంలోని ఐసీసీని కోరమని బోర్డుకు సూచించాను" అని బీసీబీకి రాసిన లేఖలో ఆసిఫ్ పేర్కొన్నాడు.కాగా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్లను భారత్లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్, 17న వాంఖడేలో నేపాల్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: VHT 2025-26: అర్షిన్, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్ -
పాక్ కొంప ముంచిన.. ఛాయ్.. చక్కెర
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.ఇక పాకిస్థాన్లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇక పాకిస్థాన్లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ::: హెచ్.కమలాపతిరావు -
బలూచిస్తాన్పై చైనా కన్నుపడిందా?
విదేశీ భూభాగాలపై కన్నేయడం చైనాకు పరిపాటి. అది పొరుగు దేశమైతే చైనా చర్యలు మరీ అతిగా ఉంటాయి. ఈ క్రమంలోనే వేరే దేశం భూభాగాన్ని తమ మ్యాప్లో కూడా చూపించడానికి చైనా వెనుకాడదు. ముందు ఒక రాయి వేసి.. తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ని పదే పదే చైనా తమ భూభాగంలో చూపించడం ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ భారత్ బలమైన దేశం అనేది ఒకటైతే, ఇప్పుడు చైనాకు భారత్ సాయం అవసరం ఉంది కాబట్టి వారు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు. గత కొన్నేళ్లుగా భారత్పై దూకుడుగా ఉండే విషయంలో చైనా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు వేరే దేశాలపై పడింది. అందులో ఒకటి రష్యా అయితే, మరొకటి పాకిస్తాన్.కొన్ని రోజుల క్రితం రష్యా భూభాగాన్ని తమ మ్యాప్లో చూపించిన చైనా.. ఇప్పుడు పాకిస్తాన్ను టార్గెట్ చేసింది. చైనాకు పాకిస్తాన్ మిత్రదేశమే కానీ, అవకాశం వస్తే తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ ఉండరనే నైజం చైనాది. ఆ క్రమంలోనే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగంపై చైనా కన్నేసినట్లు కనబడుతోంది. ఎప్పుట్నుంచో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్.. సుదీర్ఘ పోరాటం చేస్తుంది. తమ హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని, అందుకు తమకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఎక్కువైంది. పాక్పై ప్రేమా..యురేనియం నిల్వలే టార్గెటా?బలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయనేది కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో చైనా ఆచితూచి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్కు సైనిక సాయం పేరుతో ముందుగా వారి భూభాగంలోకి ప్రవేశించాలని చైనా కుట్ర రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అందిందే జుట్ట.. అందకపోతే స్నేహం అనేది చైనా వైఖరి. ఇప్పడు భారత్ విషయంలో చైనా అదే చేస్తంది. మరి పాకిస్తాన్ విషయంలో చైనా అలా ఎందుకు ఆలోచించదని నిపుణులు చెబుతున్న మాట,. ప్రస్తుతం పాకిస్తాన్క సైనిక సాయం పేరుతో చైనా ఒక అడుగు ముందకేసి, ఆ తర్వాత మిగతాది చూసుకోవచ్చనే దృష్టితో ఉందని అంటున్నారు.బలూచిస్తాన్లో యురేనియం నిల్వల పరిస్థితిబలూచిస్తాన్లో యురేనియం నిల్వలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవి చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులకు కూడా భద్రతా, భౌగోళిక రాజకీయ పరంగా ప్రభావం చూపుతున్నాయి.ప్రపంచ స్థాయి యురేనియం నిల్వల జాబితాలో పాకిస్తాన్ పేరు ఉన్నప్పటికీ, బలూచిస్తాన్లోని నిల్వల ఖచ్చితమైన పరిమాణం అంతర్జాతీయ నివేదికల్లో స్పష్టంగా ఇవ్వబడలేదు. ఈ వనరుల కారణంగా స్థానిక ప్రజల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ అస్థిరత కారణంగా తవ్వకాలు, వినియోగం కష్టతరంగా మారాయి. ఓవరాల్గా చూస్తే ఈ వనరులు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. చైనా పెట్టుబడులు, స్థానిక అసంతృప్తి, మరియు అంతర్జాతీయ ఆసక్తి కారణంగా ఇవి సున్నితమైన అంశంగా మారాయి.బలూచిస్తాన్ నేతల్లో అదే ఆందోళన..ప్రస్తుతం బలూచిస్తాన్ నేతల్లో అదే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు పాకిస్తాన్తో పోరాడటానికే తాము ఆపసోపాల పడుతుంటే, మరొకవైప చైనా గోల ఏమిటో వారికి అంతుపట్టడం లేదు. తమ భూభాగంలోకి చైనా సైనిక దళాలు వస్తాయనే కచ్చితమైన సమాచారంతోనే వారు భారత్ సాయాన్ని అభ్యర్థిస్తున్నారు. అందుకోసమే భారత్ సాయాన్ని పదే పదే కోరుతున్నారు. అయితే బలూచిస్తాన్కు సాయం విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ను కూడా పూర్తిగా నమ్మలేం. అసలే ఉగ్రవాద మూలాలున్న బలూచిస్తాన్కు సాయం చేస్తే తర్వాత భారత్కు విపత్కర పరిస్థితుల ఏర్పడవచ్చు.అందుకోసమేనా ఎదురుచూపులు?తమకు అవకాశం వచ్చినప్పుడల్ల పాకిస్తాన్తో యద్ధానికి కూడా సై అంటోంది బలూచిస్తాన్. అయితే జనాభా పరంగా చూసినా, బలూచిస్తాన్ రెబల్స్ ప్రకారం చూసినా.. ఒక దేశంతో పోరాడాలంటే వారి శక్తి సరిపోదు. ఈ తరుణంలో తమ భూభాగంలోకి చైనా వైమానిక దళాలు త్వరలో రాబోతున్నాయని బలూచిస్తాన్ అగ్రనేత మిర్ బలూచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం భారత్ సాయాన్ని కూడా అభ్యర్థించారు. దశాబ్దాల క్రితం పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ తరహాలో తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ నేతలు కోరుకుంటున్నారు. అప్పుడు ఎలా అయితే భారత్ సాయం చేసిందో ఇప్పుడు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్కు సైతం బలూచిస్తాన్ నుంచి లేఖ వచ్చింది.బలూచిస్తాన్ సాయం విషయంలో భారత్ ఎటువంటి దూకడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్కు సైనిక బలం కావాలి కాబట్టి. భారత్ సాయాన్ని కోరుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ తరుణంలో బలూచిస్తాన్కు భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. కానీ పాకిస్తాన్ నుంచి మరొకసారి ముప్పు ఎదురైన పక్షంలో భారత్ తమ ఉన్న వనురులను ఉపయోగించుకునే ముందుకెళ్తుంది. అది బలూచిస్తాన్కు పరోక్షంగా కలిసి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే త్వరలో ఆపరేషన్ 2.0 అని వార్త ఇప్పుడు మరొక ఆసక్తిని పెంచుతుంది. మార్చి నెలలో పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0ను చేపట్టనుందనే ఇప్పుడు దాయాది దేశం ఉగ్రవాదుల్లో గుబుల పుట్టిస్తోంది. మరొకవైపు భారత్ ఆపరేషన్ సిందూర్ 2.0 చేపడితే, సందట్లో సడేమియా అన్నట్లు తాము కూడా పాకిస్తాన్కు చుక్కలు చూపించాలని బలూచిస్తాన్ రెబల్స్ భావిస్తున్నారు. -
పాక్లో 8 మంది యూట్యూబర్లకు జీవితఖైదు..
ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అనుకూలంగా వీరు యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది. ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం, సైన్యం.. ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. కోర్టు ఏం చెప్పింది?కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని , విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది. దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు. -
చైనా నుంచి మాకు ముప్పు.. మీరు మాతో కలవండి!
బలూచిస్తాన్.. పాకిస్తాన్తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. గతంలో పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్ కూడా పాక్ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. అయితే గతంలో భారత్ సాయం కోరిన బలూచిస్తాన్.. మరొకసారి భారత్ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన పరిణామాల్లో భారత్ సైన్యం తమతో కలిస్తే పాక్ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. బలూచ్ అగ్రనేత మిర్ యార్ బలూచ్.. ఈ మేరకు భారత్కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్పై ప్రశంసలుఅదే సమయంలో పాక్తో యుద్ధంలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై సైతం బలూచిస్తాన్ నేత మీర్ ప్రశంసలు కురిపించారు. . పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్.. పాక్కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్కు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. Open letter to Honorable Foreign Minister of #Bharat Shri @DrSJaishankar ji From, Baloch Representative,Republic of BalochistanState.The Honorable Dr. S. Jaishankar,Minister of External Affairs,Government of Bharat,South Block, Raisina Hill,New Delhi – 110011January… https://t.co/WdjaACsG2V pic.twitter.com/IOEusbUsOB— Mir Yar Baloch (@miryar_baloch) January 1, 2026 -
"చెడగొడితే రిప్లై ఇలానే ఉంటుంది"
సాక్షి,తమిళనాడు: భారత్-పాక్ వివాదంలో అమెరికా-చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికి లేదని పరోక్షంగా హెచ్చరించారు. పాకిస్థాన్ లాంటి చెడ్డ పొరుగుదేశంతో భారత్ సరిహద్దు పంచుకోవాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఐఐటీ మాద్రాస్ క్యాంపస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇండియా ఎయిర్ఫోర్స్ కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పాక్ టెర్రరిస్టులను వారి సొంత దేశంలో భారత్ మట్టి కరిపించింది. అంతే కాకుండా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాల్పులు విరమణ జరిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం తాను చెబితేనే ఆగిందని, పన్నులు పెంచుతానని హెచ్చరించడంతో ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాయని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. భారత్ ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం ఇదే తంతు ఎత్తుకుంది. ఇండియా పాక్ యుద్ధాన్ని తామే నివారించామని ఇటీవల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రగల్భాలు పలికారు.ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " భారత్కు ఏంచేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికీ లేదు తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇండియాకు చాలా క్లియర్గా తెలుసు’ అంటూ పరోక్షంగా ఈ రెండు దేశాలకు కౌంటరిచ్చారు. అనంతరం పాకిస్థాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతిఒక్కరికీ చుట్టుప్రక్కల వారు ఉంటారు. అలాగే భారత్కు ఉన్నారు. అయితే వారు చెడ్డవారు. మన సరిహద్దుకు పశ్చిమ దిక్కునున్న దేశం దిక్కు చూస్తే వారు తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన ప్రజలను టెర్రరిజం నుంచి కాపాడుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది. ప్రస్తుతం అదే చేస్తున్నాం" అని జైశంకర్ అన్నారు.అదేవిధంగా ఆయన సిందూనది జలాల ఒప్పందం అంశంపై మాట్లాడుతూ. "చాలా సంవత్సరాల క్రితం సిందూనది జలాల ఒప్పందం చేసుకున్నాము. కానీ దశాబ్ధాలుగా మనకు సత్సంబంధాలు లేవు. మంచి సంబంధాలు లేనప్పుడు దాని ఫలితాలు అదే విధంగా ఉంటాయి. దయచేసి మీరు మాకు నీరు ఇవ్వండి మేము మాత్రం ఉగ్రవాదులని మీదేశానికి పంపుతాము అంటే ఏలా కుదురుతుంది" అని జైశంకర్ ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఎట్టకేలకు గాడిలో పడిన బాబర్ ఆజమ్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.వాస్తవానికి బాబర్ నుంచి ఇంకా చాలా రావాల్సి ఉన్నా.. ఇటీవలికాలంలో అతని పరిస్థితిని బట్టి చూస్తే ఇది కాస్త బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతగాడు రెండేళ్లకు పైగా అంతర్జాతీయ కెరీర్లో (మూడు ఫార్మాట్లు) శతకం లేకుండా గడిపాడు. అప్పుడెప్పుడో 2023లో పసికూన నేపాల్పై సెంచరీ చేసిన బాబర్.. ఇటీవలే (ఈ ఏడాది నవంబర్) శ్రీలంకపై మళ్లీ సెంచరీ చేశాడు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబర్ నుంచి అర్ద సెంచరీ కూడా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్లో బాబర్ చేసిన అర్ద సెంచరీలకు ఇంత ప్రాధాన్యత లభించడానికి మరో కారణం ఉంది.టీ20 ఫార్మాట్లో ఇటీవలికాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచకప్ జట్టులో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాక్ సెలెక్టర్లు బాబర్ ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో కూడా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అర్ద సెంచరీలు అతని ప్రపంచకప్ బెర్త్ ఆశలను సజీవంగా ఉంచాయి.ఇదే ఫామ్ను బాబర్ మరో ఐదారు మ్యాచ్ల్లో కొనసాగిస్తే ప్రపంచకప్ బెర్త్కు ఢోకా ఉండదు. ఇక్కడ బాబర్కు మరో సమస్య కూడా ఉంది. తాజాగా అతను రెండు అర్ద సెంచరీలు చేసినా, అవి పొట్టి ఫార్మాట్కు కావాల్సిన వేగంతో చేసినవి కావు. సిడ్నీ థండర్పై 42 బంతులు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్పై 46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. రెనెగేడ్స్పై బాధ్యతాయుత అర్ద సెంచరీతో మ్యాచ్ను గెలిపించినా, బాబర్లో మునుపటి వేగం లేదని స్పష్టంగా తెలిసింది.కాగా, బాబర్ హాఫ్ సెంచరీ, సీన్ అబాట్ (4-0-16-3) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా రెనెగేడ్స్పై సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరగులు చేసింది. జోష్ బ్రౌన్ (43), మెక్గుర్క్ (38), హసన్ ఖాన్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సిక్సర్స్ బౌలర్లలో అబాట్తో పాటు జాక్ ఎడ్వర్డ్స్, డ్వార్షుయిస్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో సిక్సర్స్ సైతం ఆదిలోన తడబడినప్పటికీ.. బాబర్-జోయెల్ డేవిడ్ (34 నాటౌట్) జోడీ సిక్సర్స్ను గెలిపించింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కొత్త సంవత్సరం వేళ : ఎల్వోసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని చాటుకుంది. గురువారం పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ప్రమాదకరమైన పదార్థాలతో నిండిన బ్యాగ్ను భారత సైన్యం చ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానవరహిత వైమానిక వాహనం భారత గగనతలంలోకి ప్రవేశించి ఐదు నిమిషాలకు పైగా ఉండి, చక్కన్ దా బాగ్ ప్రాంతంలోని రంగర్ నల్లా, పూంచ్ నది సమీపంలో దాని పేలోడ్ను పడవేసిందని అధికారులు తెలిపారు. ఇందులోఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఇడి), మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాలున్నాయని తెలిపారు.జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఖాదీ కర్మదా ప్రాంతంలో భారత భూభాగంలోకి పాకిస్తాన్కు చెందిన డ్రోన్ కొన్ని అనుమానిత పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను జారవిడిచింది. ఇవి ఈ ప్రాంతంలోని ఉగ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలను లేవనెత్తింది. ఇదీ చదవండి: స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి? A Pakistani drone crossed into Indian territory along the Line of Control (LoC) in Jammu and Kashmir’s Poonch, and dropped suspected explosive material, ammunition and narcotics, prompting massive search operations by security forces.Details.https://t.co/7eLEMRzdVp pic.twitter.com/EWCYJSedMm— Vani Mehrotra (@vani_mehrotra) January 1, 2026ify"> డ్రోన్ కదలికను గుర్తించిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఖాదీ కర్మదా , పరిసర ప్రాంతాలలో విస్తృతమైన కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించారు. అదనంగా, భద్రతా దళాలు పఠాన్కోట్-జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట కథువా, సాంబా, జమ్మూ, ఉధంపూర్ జిల్లాల్లోని వాహన తనిఖీలను ముమ్మరం చేశాయి. నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్మూ ప్రాంతం అంతటా భద్రతను పెంచిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు -
చైనాకు పాక్ ఉప ప్రధాని.. కారణం ఇదే..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్దార్ చైనాలో పర్యటించనున్నారు. ఈ వారం చివర్లో చైనాను సందర్శించనున్న ఆయన చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా, ఏడో దశ ద్వైపాక్షిక చర్చలు జనవరి 4న బీజింగ్లో జరుగుతాయని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆహ్వానం మేరకు దార్ ఈ పర్యటన చేస్తున్నారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఇరు దేశాలు స్మారక కార్యకలాపాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ఈ పర్యటన బలోపేతం చేస్తుందని ప్రకటించింది. -
జింబాబ్వే కెప్టెన్ ఇంట తీవ్ర విషాదం
జింబాబ్వే స్టార్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 39 ఏళ్ల సికందర్ రజా పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రజా ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆల్రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. పాకిస్తాన్లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. అప్పటికి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఆల్రౌండర్గా అవతరించాడు. -
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
పాక్లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు? ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్మౌలానా ఫజలుర్రహ్మన్ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్ భావిస్తే... మరి భారత్ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్పై పాక్ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్... ఆఫ్గనిస్తాన్ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. పాక్లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్లోని తాలిబాన్ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్స్టాప్ పెట్టి ఆసిమ్ మునీర్ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనగరల్ ఆసిమ్ మునీర్లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ గేమ్ చివరి దశకు చేరిందని... ఖేల్ ఖతమ్ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో... ఇప్పుడు మనం చూద్దాం.ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్ మునీర్కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్- ఆఫ్గాన్ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్ మునీర్ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్ పెద్దలు, పాకిస్తాన్ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్ మునీర్ అనవసరంగా ఆఫ్గాన్పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. ఫజలుర్ రహ్మాన్ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్... పాక్ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం నోరు విప్పడం లేదు. -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
ఇండియా-పాక్ వార్.. చైనా అక్కసు
ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత్కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూపించింది. దీంతో భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించిందిఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్కు మద్ధతుగా నిలిచింది. పాక్కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్ జెట్స్ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. -
ఆపరేషన్ సిందూర్.. మరోసారి గెలికిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరాటం అంతా ఇంతా కాదు అందుకోసం ఏదైనా దేశాల మధ్య పంచాయితీ ఉంటే హడావుడిగా వెళ్లి అందులో వేలు పెట్టడం తర్వాత వారి మధ్య పంచాయితీ తానే తెగ్గొట్టానని క్రెడిట్ కొట్టేయడం ట్రంప్కు చాలా కామన్గా మారింది. ఇప్పటి వరకూ తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని అయినా తనను ఎవరూ గుర్తించరని తనకు శాంతి బహుమతి ఇవ్వరని ఆ మధ్య కస్సుబుస్సులాడారు.ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సిందూర్ వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఇండియా-పాక్ల మధ్య తానే ఆపానని వార్ ఆపకుంటే అధిక పన్నులు విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు శాంతించాయని తెలిపారు. ఇలా యుద్ధం ఆపాననే ప్రకటనను ట్రంప్ ఇదివరకూ దాదాపు 70 సార్లు పలికాడంటే ఈ విషయంలో ఆయన భారత్ను ఎంతగా రెచ్చగొట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరోసారి ఆపరేషన్ సిందూర్ అంశం తెరమీదకొచ్చింది.ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రస్థావన తెరమీదకు తెచ్చారు. "ఇదివరకూ నేను ఎనిమిది యుద్ధాలను నియంత్రించాను. ఇండియా, పాకిస్థాన్ విషయంలోనూ అంతే కానీ ఆ క్రెడిట్ నాకు ఇవ్వరూ. . నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో ఆశ్చర్యపోయారు. తాను గత పదేళ్లుగా ప్రయత్నిస్తూన్నా ఇది చేయలేకపోయానన్నారు. నేను మాత్రం ఒక్కరోజులో ఈ యుద్ధాలను ఆపా" అని ట్రంప్ బింకాలు పలికారు.ట్రంప్ మధ్యవర్తిత్వం అంశంపై భారత్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ అంశంలో ఏవరూ మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు ప్రకటించింది. భారత ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో ఈ అంశంపై ప్రకటన చేశారు. ఏ ప్రపంచ నాయకుడు ఆపరేషన్ సిందూర్ను ఆపమని భారత్ను అడగలేదని ఈ నిర్ణయం భారత్ స్వతంత్ర్యంగా తీసుకుందని స్పష్టం చేశారు. పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలను వారి దేశంలోనే ధ్వంసం చేసింది. -
‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్ వసీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉందితన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారుకానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.చట్టపరంగా చర్యలు తీసుకుంటాఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్ వసీం బౌలింగ్ ఆల్రౌండర్.పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడిన ఇమాద్ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఇమాద్ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం.. -
ఆయుధంగా నదీ జలాలు!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నదీ జలాలను ఆయుధంగా మార్చుకోవడం వల్ల మరింతగా పెచ్చరిల్లు తాయని పాకిస్తాన్ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ అయిన షెర్రీ రెహ్మాన్.. చీనాబ్ నదిపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం పయ్రత్నాలు ప్రారంభించిన వేళ పైవిధంగా వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.వాతావరణ మార్పుల కారణంగా అత్యంత ప్రభావితమవుతున్న ఈ ప్రాంతంలో, నీటిని ఒక ఆయుధంగా (water weaponisation) మార్చుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే శత్రుత్వం, అపనమ్మకంతో నిండిపోయి ఉన్న రెండు దేశాల సంబంధాల్లో ఇది ఉద్రిక్తతలను మరింతగా పెంచుతుంది’ అని షెర్రీ రెహ్మాన్ (Sherry Rehman) సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడి నేపథ్యంలో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) నుంచి వైదొలగుతున్నట్లు భారత ప్రభుత్వం ఏప్రిల్ 22న ప్రకటించడం తెల్సిందే. కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజీ–2 జల విద్యుత్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. చదవండి: లాహోర్ లేడీ సింగానికి తప్పని ట్రోలింగ్ -
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) స్వదేశీ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. సూయ్ నార్త్రన్ గ్యాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరిట ఉండేది. ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్పై 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్ ఇంజమామ్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.అయితే, పాకిస్తాన్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉంది. సెహ్వాగ్ 2006లో జరిగిన లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.కాగా, యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు కే కింబర్ పేరిట ఉంది. ఇంగ్లండ్ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్ను సాధించాడు. షిన్వారి, కింబర్ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. హైదరాబాద్కు చెందిన తన్మయ్ అరుణాచల్ ప్రదేశ్పై 119 బంతుల్లో డబుల్ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లోనే డబుల్ పూర్తి చేశాడు. -
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్ ఉమెన్ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్ మీడియా..‘‘మేడమ్.. ఇది స్క్రిప్ట్ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్ టీవీ సిరీస్) కూడా ఇంత ఫాస్ట్గా కేసును సాల్వ్ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. లాహోర్ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్ ప్రింట్ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..ఆవిడను ఇప్పుడు ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్వై న్యూస్ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రాగా లిఫ్ట్ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్ ప్రకటించారు సదరు పాడ్కాస్ట్ వ్యాఖ్యాత.గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్కాస్ట్లో వివరించారు. డిఫెన్స్ ఫేస్ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది..కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్గా వెళ్లి ఎలా కేసును సాల్వ్ చేశారంటూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్(సీఐబీ సిరీస్ క్యారెక్టర్) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు? అని ఒక యూజర్.. కిడ్నీ టచింగ్ యాక్టింగ్.. అని మరో యూజర్ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని.. کسی مہذب معاشرے میں ایک پولیس افسر یہ ناٹک کرتی تو اُسے نا صرف برطرف کیا جاتا بلکہ جیل ہو جاتی ! ایک گھنٹے میں FIR نہیں لکھی جاتی اس نے نا صرف قاتل پکڑ لیا وجہ قتل اور ساری کہانی میڈیا پر بتا دی عدالتیں جس کام میں سالوں لگا دیتی ہیں اس نے ایک گھنٹے میں کر دیا ۔۔ واہ دی دی واہ pic.twitter.com/1loxSxQGWV— AliZai Vlogs (@alizaihere) December 21, 2025 -
భారత్ తరపున ఆడాడు.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
ప్రముఖ పాకిస్తాన్ అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ ఉబేదుల్లా రాజ్పుత్ నిషేధానికి గురయ్యాడు. అతను బహ్రెయిన్లో ఈ నెలారంభంలో జరిగిన ఓ ప్రైవేట్ టోర్నీలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. విదేశీ టోర్నీలో ఇలా ఆడాలంటే పాకిస్తాన్ కబడ్డీ సమాఖ్య (పీకేఎఫ్) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాలి.కానీ ఉబేదుల్లా మాత్రం ఎలాంటి ఎన్ఓసీ లేకుండానే బహ్రెయిన్ ఈవెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పీకేఎఫ్ అతని నిర్వాకంపై కన్నెర్ర జేసింది. ఉబేదుల్లాపై నిరవధిక నిషేధం విధించినట్లు పీకేఎఫ్ కార్యదర్శి రాణా సర్వార్ వెల్లడించారు.అయితే ఈ నిషేధంపై క్రమశిక్షణ కమిటీ ముందు అప్పీల్కు వెళ్లే హక్కు రాజ్పుత్కు ఉందని ఆయన చెప్పారు. ఈ నెలలో బహ్రెయిన్లో జీసీసీ కప్ టోర్నీ జరిగింది. ఇందులో ఉబేదుల్లా రాజ్పుత్ భారత జెర్సీ వేసుకొని, త్రివర్ణ పతాకంతో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీకేఎఫ్ చర్యలు చేపట్టింది.చదవండి: క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం! -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
పాకిస్థాన్ను వీడుతున్న మేథోసంపత్తి
పాకిస్థాన్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.గడిచిన 24 నెలలో పాకిస్థాన్లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది. -
పాక్ గుండెల్లో సిందూర్ 2.0 టెన్షన్
-
పాక్లో ఇంకా 20 లక్షల మంది అఫ్గాన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇప్పటికీ 20 లక్షల మందికి పైగా అఫ్గాన్లు నివసిస్తున్నారని ఐరాస శరణార్ధి విభాగం తెలిపింది. 2025లో 10 లక్షల మంది వరకు ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారంది. ఒక్క నవంబర్లోనే 1.71 లక్షల మంది అఫ్గానిస్తాన్కు వచ్చారని తెలిపింది.పాక్ అధికారులు చమన్, తోర్ఖామ్, బారాబ్చా బోర్డర్ పాయింట్ల మీదుగా మరో 37, 899 మందిని వెనక్కి పంపించి వేశారని పేర్కొంది. నవంబర్లో రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మానవతా సాయం పంపిణీపై ప్రభావం చూపాయని తెలిపింది. తమ దేశంలో పెద్ద సంఖ్యలో ఉంటున్న అఫ్గాన్లను పంపించి వేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2023 సెపె్టంబర్ నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. స్వదేశంలో అస్థిర పరిస్థితులు, అణచివేత చర్యల కారణంగా వీరంతా పొరుగుదేశంలో తలదాచుకుంటున్నారు. -
ఆపరేషన్ సిందూర్ 2.0.. వణికిపోతున్న పాక్!
ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.సరిహద్దులో ప్రత్యేక నిఘాభారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్కు రావల్కోట్ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు. -
పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?.. రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది. అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. -
భారత్ కు మద్దతుగా పాక్ నేత కీలక వ్యాఖ్యలు
-
పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం సరైనదని పాక్ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Maulana Fazlur Rehman to Pakistan’s military regime:“If you justify attacking Afghanistan by claiming you are targeting your enemy there, then why do you object when India targets its enemy in Bahawalpur and Murid (inside Pakistan)?” pic.twitter.com/T91sdps611— Afghanistan Times (@TimesAFg1) December 23, 2025కరాచీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన రెహ్మాన్.. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. ‘భారతదేశం.. పాక్లోని బహవల్పూర్, మురిడ్కేలలో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలపై దాడి చేసినప్పుడు పాక్ ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై అలాంటి ఆరోపణలు చేస్తోంది’ అని ఆయన నిలదీశారు. పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ సారధ్యంలో జరుగుతున్న ఈ సరిహద్దు దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆఫ్ఘనిస్తాన్ పౌరులపై పాకిస్తాన్ జరిపిన దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని భారత్ సమర్థిస్తుందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 2021లో తాలిబాన్ల పాలన వచ్చినప్పటి నుండి పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పాక్ నేతలు తమ దేశ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇది పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేసే పరిణామంగా మారింది.ఇది కూడా చదవండి: భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే..


