21వ శతాబ్ధంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశమేదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పుకోవాలి.. బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటిస్తూ ఇటీవల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది.. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్టూ భారత్పై విద్వేశం చిమ్మూతూ ప్రగల్భాలు పలికాడు.
కుక్కతోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్థాన్కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, వాళ్లదేశంలో వారిని తరిమినా, కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి ఎంతకీ బుద్ధి రావట్టేదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్లో కశ్మీరీ సోలిడారిటీ డే ను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్ పై మరోసారి తమ ద్వేషాన్ని చిమ్మాడు.
నఖ్వీ మాట్లాడుతూ" (అఖండ్ భారత్కో ఖండ్ ఖండ్ కరింగే) భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పుపెడతాం, దక్కన్ని మండిస్తాం,ఢిల్లీని షేక్ చేస్తాం" అని ప్రగల్భాలు పలికారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ, ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృథాపోవన్నారు. అబ్దుల్ రహమాన్ నఖ్వీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్కు అత్యంత సన్నిహితుడు.
అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వారి దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. మరోసారి ఉగ్రవాదుల బహిరంగ వేదికలకు ఆహ్వనిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్పై విషం చిమ్మే యత్నం చేస్తుంది.


