breaking news
Siddipet
-
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
సిద్దిపేటజోన్: బల్దియాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల సూచించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా మున్సిపల్ యంత్రాంగం చొరవ చూపాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. మున్సిపల్ వాహనాలకు చెత్త ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై రూపొందించిన ఏజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ ఆశ్రిత్, కౌన్సిలర్లు సుందర్, యోగి, వినోద్, సాయి, మల్లికార్జున్, విఠోభ, రవి, బ్రహ్మం, రియాజ్, బాల్ లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల -
మక్కకు మొలకలు.. ఆవిరైన ఆశలు
రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన మక్క దిగుబడులతో గట్టెక్కుదామనుకున్న రైతులకు మోంథా తుపాన్ అశని పాతంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మక్క కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కుప్పల్లో మొలకలు వచ్చి రైతుల ఆశలను ఆవిరి చేసింది. నాణ్యత తగ్గడమే కాకుండా తేమ శాతం పెరగడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. వచ్చిన అరకొర దిగుబడులు సైతం తుపాను రూపంలో నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
వరద కాలువల నిర్మాణం కోసం సర్వే
హుస్నాబాద్: పట్టణంలో శాశ్వత వరద కాలువల నిర్మాణం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వరదలు వివిధ కాలనీలు, మెయిన్ రోడ్డును ముంచెత్తుతున్నాయి. వరదలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పట్టణంలో సర్వే చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్ ఏరియాలను పరిశీలించారు. మరో సారి సర్వే చేసి దాని ఆధారంగా డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈలు తిరుపతి, మహేష్, ఎంఏఈలు పృద్విరాజ్, మహేష్లు ఉన్నారు. వైవిధ్యం.. కాంతిమంతం వర్గల్(గజ్వేల్): వైవిధ్యమైన ఆకృతులలో వెలుగులు చిమ్ముతున్న కార్తీక జ్యోతులు నాచగిరిని శోభాయమానం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఈఓ విజయరామారావు పర్యవేక్షణలో అర్చక, సిబ్బంది కార్తీక సామూహిక సహస్ర దీపోత్సవానికి తగు ఏర్పాట్లు చేశారు. భక్తజనులు నక్షత్ర ఆకృతిలో దివ్వెలను వెలిగించి తరించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. 2న మల్లకంబ్ క్రీడాకారుల ఎంపిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా మల్లకంబ్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 2న నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి అండర్–14, 17 విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సతీష్ (99481 10433)ను సంప్రదించాలన్నారు. కుల వివక్ష నేరం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య కొండపాక(గజ్వేల్): కులాల పేరుతో చిన్న చూపు చూడటం చట్టరీత్యా నేరమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య అన్నారు. మండల పరిధిలోని రాంపల్లిలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవ గ్రామ సభ నిర్వహించారు. భవ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా రెండు గ్లాసుల పద్ధతులు పాటిస్తే వెంటనే పోలీస్టేషన్కు సమాచారం అందించాలన్నారు. సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కులాలు, మతాల పేరిట ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, ఆర్ఐ బాలకిషన్, నాయకులు సురేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. మామిడాలకు ‘మహిళా సేవా రత్న’ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సమాజ సేవలో విశేషమైన కృషి చేస్తున్న ఎన్ఎస్యూఐ జిల్లా సోషల్ మీడియా చైర్పర్సన్ మామిడాల స్రవంతికి మహిళ సేవా రత్న అవార్డు వరించింది. శుక్రవారం హైదరాబాద్లోని త్రివేణి సంగమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సేవా రత్న అవార్డులు అందించారని, ఇందులో భాగంగా తనకు మహిళా సేవా రత్న అవార్డును ప్రదానం చేశారని స్రవంతి తెలిపారు. -
అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు
గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే తాను సీఎంగా పనిచేసిన పదేళ్లల్లో నిధుల వరద పారించారు. కానీ అధికారులు అడ్డదిడ్డమైన డిజైన్లతో కీలకమైన పనుల లక్ష్యాన్ని దెబ్బతీశారు. బస్టాండ్ల నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నేళ్ల క్రితం ఎస్డీఎఫ్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్ రోడ్డువైపున మోడ్రన్ బస్టాండ్ నిర్మాణానికి రూ.5.47కోట్లు, గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన మూవింగ్ బస్టాండ్ నిర్మాణానికి రూ.2.86కోట్లు, ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్టాండ్ నిర్మాణానికి రూ.3.81కోట్లు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం తూప్రాన్ రోడ్డు వైపున ఉన్న బస్టాండ్ పూర్తికాగా వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా మారింది. పట్టణానికి దూరంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన నిర్మిస్తున్న బస్టాండ్ పనులు పూర్తికావస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలను నిర్మూలిస్తుందని భావించి నిర్మించిన ఈ బస్టాండ్.. వినియోగంలోకి వస్తే ట్రాఫిక్ సమస్య మరింతగా జఠిలం కాబోతున్నది. అడావుడిగా నిర్మించిన ఈ బస్టాండ్లో బస్సులు నిలిపే అవకాశమే లేదు. ఒకవేళ బస్సులు నిలిపితే తర్వాత వచ్చే బస్సులతో ప్రయాణికులు, బస్సులతో మరింతగా కిక్కిరిసిపోనున్నది. అంతేకాకుండా ఇన్, అవుట్ బస్సులు వెళ్లడానికి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇది తెలిసీ కూడా అధికారులు ఈ బస్టాండ్ను ఎలా డిజైన్ చేశారో అర్థంకానీ పరిస్థితి. మరో ముఖ్యవిషయమేమిటంటే ఆర్టీసీకి చెందిన ఇంజినీర్ల పాత్ర లేకుండా బస్టాండ్ నిర్మాణాలను డిజైన్ చేయడం గమనార్హం. ప్రజ్ఞాపూర్లో ఇలా... ప్రజ్ఞాపూర్లో ఎకరం స్థలంలో నిర్మించిన బస్టాండ్లోనూ డిజైన్ లోపాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.3.81కోట్లతో పనులు సాగుతుండగా, ఈ నిధులు సరిపోక మరో రూ.1కోటి అదనంగా కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ బస్టాండ్ ముందు భాగంలో వరద కాల్వ ఉంది. దీనిపై బస్సులు ఇన్, అవుట్ కోసం కల్వర్టు నిర్మాణం కోసం సరైన డిజైన్ లేదు. అంతేకాకుండా భువనగిరికి వెళ్లే బస్సు ఈ బస్టాండ్లో ఆగితే తిరిగి రాంగ్ రూట్లోనే వెళ్లేలా డిజైన్ ఉంది. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో ఈ బస్టాండ్లు వినియోగంలోకి వస్తే తలెత్తే సమస్యలపై ఆందోళన నెలకొన్నది. గజ్వేల్ మూవింగ్ బస్టాండ్ వద్ద ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అనుమతితో డివైడర్ తగ్గిస్తే.. బస్సులు కొంతమేర తిరిగే అవకాశం ఉంది. ప్రజ్ఞాపూర్ బస్టాండ్లోని లోపాలను సైతం సరిచేస్తే కొంత ఉపయోగకరంగా మారే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో అధికారుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిందే. రాష్ట్రానికే నమూనాగా ఊదరగొట్టిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అధికారుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ రూ.12.14కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు ఆర్టీసీ బస్టాండ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న డిజైన్ లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తప్పిదాల వల్ల రాబోయే రోజుల్లో సమస్యలు మరింత జఠిలం అవుతుండగా, అధికారుల అడ్డదిడ్డమైన పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్ల నిర్మాణాల్లో డిజైన్ లోపాలు -
తడిసిన ధాన్యం కొనుగోలు
హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ కమిషనర్, కలెక్టర్ హైమావతి మార్గదర్శకత్వంలో అధికారులు శుక్రవారం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగొలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా 18 లారీలను ఏర్పాటు చేసి 100 మందికి పైగా హమాలీ కార్మికులను రంగంలోకి దింపారు. 100 మందికి పైగా రైతుల నుంచి సుమారు 526 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగొలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని రైస్ మిల్లులకు ఒక్కో లారీ చొప్పున తరలించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ ఆఫీస్ నుంచి డిప్యూటి కమిషనర్ కొండల రావు, ప్రొక్యూర్మెంట్ జీఎం నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్లో సీఎం ఏరియల్ సర్వే
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025● వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన ● రైతులను ఆదుకోవాలంటూసీఎంకు మంత్రి పొన్నం వినతిహుస్నాబాద్: మోంథా తుపాన్కు దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో 42 సెం.మీ. వర్షపాతం, హుస్నాబాద్ మండలంలో 35 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. భారీ వరదతో వ్యవసాయ మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్లలో వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కల్వర్టర్లు, భారీ వరదలకు వ్యక్తులు గల్లంతైన ప్రదేశాలను సీఎం పరిశీలించారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. -
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
హుస్నాబాద్రూరల్: వర్షాలతో పంటలు దెబ్బతినకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలో పర్యటించి వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నేలవాలిన వరిని కట్టలు కట్టి నీటిలో వరి గొలుసులు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పుద్రావం కలిపి చల్లాలని చెప్పారు. ఏరిన పత్తి పొడి ప్రదేశంలో ఆరబెట్టి నిల్వ చేయాలని సూచించారు. తడిపత్తినే కుప్పవేస్తే బూజు పట్టే ప్రమాదం ఉందన్నారు. అధిక తేమ ఉంటే కాయలు కుళ్లిపోతాయన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి -
Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కన్నీటి వరద
రైతన్నను నట్టేట ముంచిన మోంథా మోంథా తుపాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో నోటికాడి బువ్వను లాక్కున్నట్లయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. కళ్లెదుటే చేతికొచ్చిన పంట నీటిపాలవుతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు. జిల్లాలో అత్యధికంగా హుస్నాబాద్లో 30.04 సెంటీమీటర్లు, అక్కన్నపేట మండలం కట్కూరులో 28.25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. –సాక్షి, సిద్దిపేట నేడు సీఎం ఏరియల్ సర్వే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పంట నష్టంపై శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేను నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రులు సైతం ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,666 మంది రైతులకు చెందిన 2,515 ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వరి 2,214, పత్తి 301 ఎకరాల్లో తీరని నష్టం చోటుచేసుకుంది. అందులో అత్యధికంగా కోహెడ మండలంలో 855, నంగునూరు మండలంలో 706 ఎకరాలు, అక్కన్నపేటలో 530 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ ఏడాది పత్తి రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి. పత్తిపంట పూర్తిగా దెబ్బతిని చేతికి అందకుండా పోతోంది. తరచూ వర్షాలు, మబ్బులకు తోడు సరిపడా ఎండపడక పత్తికాయలు విచ్చుకోవడం లేదు. కొన్ని చోట్ల చెట్ల మీదనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పంటల పరిస్థితి ఏమిటి? తర్వాత కోలుకుంటాయా? లేకపోతే మొత్తం నష్టపోయినట్లేనా? పంట నష్టం ఎంత శాతం జరిగింది? అనే దానిపై మరో మారు వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించనున్నారు. 88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదపాలు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నడుము లోతు వరద నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 23 మంది రైతులకు చెందిన 88 మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిపాలైంది. అలాగే 83 మంది రైతులకు చెందిన 150 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. నిలిచిన రాకపోకలు జిల్లాలో పలు చోట్ల రోడ్లపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముస్త్యాల వద్ద రాగికుంట పొంగిపొర్లడంతో చేర్యాల నుంచి హుస్నాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. కల్వర్టు కొట్టుకుపోయింది. కష్టమంతా నీటిపాలాయె.. ఆరుగాలం పడిన రెక్కల కష్టమంతా నీటిపాలైంది. మార్కెట్కు ఆరు ట్రాక్టర్ల ధాన్యం తెస్తే నాలుగు ట్రాక్టర్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్కు వెళ్తే ఎలాంటి సౌలతులు ఉండవని చెప్పినా మా ఆయన వినలేదు. తడిసిన ధాన్యం తీసుకోకపోతే చనిపోవడమే దిక్కు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – భూక్య లీల, జిల్లెల్లగడ్డ, హుస్నాబాద్ పత్తి తడిసిపోయింది వర్షాలకు పత్తి తడిసి ముద్దయింది. రెండెక రాలలో పత్తి పంట సాగు చేశా. ఎదిగే సమయంలో వర్షం పడటంతో దెబ్బతిన్నది. తడిచిన పత్తిని చూస్తే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదు. ఇప్పటి వరకు రూ.80వేల పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – బునారి భాస్కర్, తిగుల్, జగదేవ్పూర్ మార్కెట్ను ముంచెత్తిన వాన వరదలో కొట్టుకుపొయిన ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. రైతులకు శాపం హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యమంతా నీటిపాలైంది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకుండాపోయింది. ఫ్లాట్ ఫామ్లపై ఆరబోసిన ధాన్యం కూడా తడిసి పోయింది. వర్షం ధాటికి వ్యవసాయ మార్కెట్ అతలాకుతలమైంది. మార్కెట్ను కుంటలో నిర్మించారు. దీంతో పోతారం (ఎస్) గ్రామం నుంచి వచ్చే వరద నీరు మార్కెట్ను ముంచెత్తడం, వరద నీటి కాలువలు సరిగా లేకపోవడంతో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఆరబోసిన ధాన్యానికి తేమ 12 శాతం ఉంటేనే కాంటా పెడతామని అధికారులు కొర్రీలు పెట్టడం రైతులకు శాపంగా మారింది. రాత్రి సమయంలో చిమ్మరి చీకటిలో వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. అధికారులు మార్కెట్ ప్రహారీ గోడను పగుల గొట్టి ఽనీటిని బయటకు వదిలారు. అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది. కొట్టుకుపోయిన 1500 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్లో రైతులు 106 ధాన్యం కుప్పలు పోశారు. ఇందులో 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక, మురికి కాలువల్లో చెత్త పోరుకుపోవంతో నీరంతా ధాన్యం కుప్పలు తడిపి వేస్తున్నాయి. మార్కెట్లో నిర్మించిన గోధాముల్లో ధాన్యం ఆరబెట్టుకునే అవకాశం కల్పిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. ఆరబెట్టిన ధాన్యం మధ్యాహ్నం వరకు ఎండటం, రాత్రి అయిందంటే మంచు కమ్ముకోవడం, అనుకున్న తేమ శాతం రాకపోవడంతో రోజుల తరబడి మార్కెట్లోనే ఉంటున్న పరిస్థితి. మురికి కాలువల నుంచి ధాన్యం ఎత్తి.. ధాన్యమంతా మురికి కాలువల్లోకి కొట్టుకుపోయాయి. దీంతో కాలువల్లో ఉన్న ధాన్యాన్ని జేసీబీ సహాయంతో, తట్టలతో ఎత్తిపోసుకుంటూ రైతులు అరిగోస పడ్డారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ క్షేత్రం వద్ద స్థలం లేదని మార్కెట్కు వస్తే వరుణుడు పగబట్టినట్లు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టుకుపోయిన 10 ట్రాక్టర్ల ధాన్యం కోహెడరూరల్(హుస్నాబాద్): మోంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో వంతెనపై ఆరబోసిన పది ట్రాక్టర్ల ధాన్యం మోయతుమ్మెద వాగు వరదలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు.అక్కన్నపేట మండలం జనగామలో దుస్థితిహుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన ధాన్యం కుప్పలు -
అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
● రైతులకు మంత్రి పొన్నం భరోసా ● వరద ప్రాంతాల్లో పర్యటనకోహెడరూరల్(హుస్నాబాద్): అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి గ్రామాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని, తెగిపోయిన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదలతో మునిగిన వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం కావడం బాధాకరమని అన్నారు. పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొంటాం హుస్నాబాద్రూరల్: ఎన్నడూ లేని విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షం కురిసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు భరోసా కల్పించాలన్నారు. మార్కెట్లో వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని, వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులకు జరిగిన నష్టంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎంకు వివరించినట్లు చెప్పారు.కోహెడ మండలంలో దెబ్బతిన్న రోడ్డును, తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం -
నష్టం వివరాలు సేకరించండి
● కలెక్టర్ హైమావతి ● తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోపరిశీలనహుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్లో తడిసిన, కొట్టుకుపోయిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతారం (ఎస్) గ్రామం నుంచి వరద మార్కెట్లోకి రావడంతో ధాన్యం తడిసిందన్నారు. ఆర్టీఓ రామ్మూర్తి, మా ర్కెట్ అధికారులు అప్రమత్తమై ప్రహరీని కూల్చి నీటిని బయటకు పంపించారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ చేపడతామన్నారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ హైమావతి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ నిండా నీళ్లు ఉన్నాయని, ఎక్కడ ఆరబెట్టుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని దండం పెట్టి వేడుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
30ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు
డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ముప్పై ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్లో పీహెచ్సీల సూపర్వైజర్లతో డీఎంహెచ్ఓ గురువారం సమావేశం నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమిత వ్యాధుల వంటి కార్యక్రమాల అమలును పరిశీలించారు. పలు విభాగాల్లో తక్కువ ప్రగతి నమోదైన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 వారాల్లోపు గర్భిణులను తప్పనిసరిగా నమోదు చేయాలని, హైరిస్క్ వారిని గుర్తించి 102 వాహనం ద్వారా సమగ్ర వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులకు తరలించాలన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వానొస్తే.. బస్టాండ్ మునకే
హుస్నాబాద్: వానొస్తే వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగుతాయి.. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సైతం మునుగుతోంది. భారీ వర్షం కురిసిన ప్రతీసారి ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 35 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించారు. బస్టాండ్ను ఆనుకొని ఉన్న రహదారి అభివృద్ధి కోసం అనేక సార్లు ఎత్తు పెంచి రహదారులను నిర్మించారు. దీంతో రోడ్డు కంటే బస్టాండ్ ఎత్తు తగ్గడంతో ప్రతి వర్షానికి బస్టాండ్ ప్రాంగణం నీటిలో మునుగుతోంది. బస్టాండ్కు వచ్చే నీరు బయటకు వెళ్లే దారి లేదు. జాతీయ రహదారి పేరిట ఈ రోడ్డు ఎత్తును మళ్లీ పెంచారు. బస్టాండ్ ఎత్తును పెంచలేదు. వర్షం కురిసినప్పుడల్లా బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఆర్టీసీ బస్టాండ్ వరద నీటితో తల్లడిల్లుతోంది. ఇటీవల రూ.2 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన బస్టాండ్ను మంత్రి ప్రారంభించారు. బస్టాండ్ ఎత్తు పెంచకుండా ఆధునీకరణ పనులు చేపట్టారు. కొత్తగా ప్లాట్ ఫాంలు, మూత్రశాలలు, ప్రాంగణాన్ని సీసీతో నింపి వేసి చేతులు దులుపుకున్నారు. బస్టాండ్ పై కప్పు నుంచి వర్షం నీరు కారుతోంది. బస్టాండ్ను వరద నీటి నుంచి కాపాడాలని అధికారుల వద్ద ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం శోచనీయం. ఇటీవలనే బస్టాండ్లోకి వచ్చే నీటిని బయటకు పంపించేందుకు పైపు లైన్లు వేసినా ఫలితం శూన్యం. పట్టణంలోని మెయిన్ రోడ్పై ప్రవహించే వరద, నాగారం రోడ్డు నుంచి వచ్చే మురికి కాలువల నీరంతా బస్టాండ్లోకి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంగణమే కాకుండా సైకిల్ స్టాండ్ కూడా మునిగి పోతోంది. ప్రయాణికులకు నరకమే.. ప్రయాణికులు బస్టాండ్కు రావాలన్నా.. బస్సు నుంచి దిగాలన్నా వరద నీటి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో బస్టాండ్ను వరద నీటిలో చిక్కుకుంది. బస్టాండ్ చెరువును తలపించింది. వరద నీరు ప్లాట్ ఫాం దాటి బస్టాండ్ లోపలికి చేరుకుంది. నీటిలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గురువారం కూడా బస్టాండ్ ప్రాంగణం నీటితో నిండి పోయింది. బస్సులు లోపలికి రాకుండా రోడ్డు పైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం గమనార్హం. వరద నీటికి అడ్డుకట్ట వేయకుండా బస్టాండ్కు ఎన్ని రూ.కోట్లు వెచ్చించినా ప్రజా ధనం వృధా అవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు చెబుతున్నారు.మంత్రి ఇలాకాలోప్రయాణికులకు తప్పని తిప్పలు -
గణితంపై ఆసక్తి కలిగేలా బోధించండి
● డీఈఓ శ్రీనివాస్రెడ్డి ● ఉపాధ్యాయులకు దిశానిర్దేశంప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల్లో గణితం అంటే భయం లేకుండా ఆసక్తిని కల్గించేలా బోధించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనే అంశంపై జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన సంపదకు గణితం పునాది వంటిదన్నారు. నేటి ఆధునిక కాలంలో గణిత పరిజ్ఞాన అవసరం అత్యధికంగా పెరుగుతోందన్నారు. మానవుడు తార్కికంగా వేగంగా ఆలోచించడానికి గణితం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థిలో మేధో సంపత్తిని గణిత పరిజ్ఞానంతో కొలమానం వేయవచ్చాన్నారు. విద్యార్థుల్లోని తెలివితేటలను గణితం పదును పెడుతుందన్నారు. ఉపాధ్యాయులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులల్లో గణిత పరిజ్ఞానం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సకాలంలో వైద్య సేవలందించండి
ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ కొండపాక(గజ్వేల్): సకాలంలో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవల రిజిస్టరును, ల్యాబ్ గదిని, ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రాజీవ్ రహదారికి సమీపంలో ఆస్పత్రి ఉండటంతో డ్యూటీల వారీగా వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యం అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేదిలేదన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయా శాఖల సమన్వయంతో నెరవేరేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓ ధన్రాజ్కు ఫోన్ ద్వారా సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన తప్పనిసరి అన్నారు. అలాగే పారిశుద్ధ్యం విషయంలో సూచనలు చేశారు. మంగళవారం రోజు 50 మందికి పైగా వైద్యపరమైన సేవలందించడం, ఆయుష్ కేంద్ర నిర్వహణప సంతృప్తిని వ్యక్త పర్చారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీధర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్కు నేతల పరామర్శ
దుబ్బాక: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దంపతులు మంగళవారం పరామర్శించారు. హరీశ్రావు తండ్రి సత్యనారాయణ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. ‘ఉపకార’ దరఖాస్తుగడువు పెంపుప్రశాంత్నగర్(సిద్దిపేట): పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ అహ్మద్ మంగళవారం తెలిపారు. వివిధ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆత్మగౌరవ ర్యాలీకి తరలిరండి సిద్దిపేటకమాన్: నగరంలో నవంబర్ 1న నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ ర్యాలీకి అందరూ తరలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపైన ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఒకటిన ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజు, యాదగిరి, పర్శరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అధునాతన పరికరాలు హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధునాతమైన వైద్య పరికరాలను మంజూరు చేయించారు. ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్) ద్వారా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి) నుంచి దాదాపు రూ.1.50 కోట్లు విలువైన పరికరాలు వచ్చాయి. ఈసీజీ పరికరం, అల్ట్రాసౌండ్, మల్టీపారా మానిటర్, ఆక్టోక్లేవ్, డయా తెరమీ, ఫెటల్ మానిటర్, జనరల్ సర్జరీ ఎలక్ట్రికల్ ఏటీ టేబుల్, త్రీ సీట్ చైర్స్, ఈఎన్టీ హెడ్ లైట్లు ఇలా మొత్తం 15 రకాల పరికరాలు వచ్చాయి. వివిధ విభాగాల గదుల్లో పరికరాలను బిగించారు. వారం రోజుల్లో వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి తెలిపారు. రుణాలు తిరిగిచెల్లించకపోతే చర్యలుమద్దూరు(హుస్నాబాద్): మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెలించాలని గ్రామీణ వికాస్ బ్యాంక్ రిజనల్ మేనేజర్ రాజయ్య కోరారు. మంగళవారం మర్మాముల గ్రామాన్ని స్థానిక బ్యాంక్ అధికారులతో కలిసి రుణగ్రస్తుల ఇళ్ల వద్దకు వెళ్లి తిరిగి చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ గ్రామంలోని రుద్రమాదేవి గ్రామైక్య సంఘంలోని తొమ్మిది మహిళా సంఘాలు రూ.60లక్షలు బకాయిపడినట్లు తెలిపారు. పెండింగ్ రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు అందుతాయన్నారు. చెల్లించకపోతే బ్యాంక్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో మద్దూరు బ్యాంక్ మేనేజర్ పరుశురాములు, ఫీల్డ్ ఆఫీసర్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల్లో మొంథా కలవరం
మొంథా తుపాన్తో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది. తుపాన్ ప్రభావంతో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వెలువడుతున్న వార్తలు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మూడురోజులుగా పడుతున్న వర్షాలతో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ‘మొంథా’ ప్రభావంతో జిల్లాలో మంగళవారం వర్షపు జల్లులు కురిశాయి. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే కోత దశలో ఉన్న వరిచేన్లు నేలవాలె పరిస్థితి ఏర్పడింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. – దుబ్బాకమొంథా ప్రభావంతో వర్షపు జల్లులు మొదలు కావడంతో ధాన్యం చేతికిరాకుండా పోతుందేమోనన్న బెంగ రైతుల్లో నెలకొంది. జిల్లాలో ఇప్పటికే 407 కోనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఇప్పటివరకు 3,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రధానంగా దుబ్బాక మార్కెట్ యార్డు, సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ మార్కెట్ యార్డులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో 80 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు సమాచారం. అధికారుల అలర్ట్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతాయన్న సూచనలు.. కలెక్టర్ హైమావతి ఆదేశాలతో అధికారులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలు చేయిస్తూ తడవకుండా కవర్లను దగ్గరుండి కప్పిస్తున్నారు. దుబ్బాక మార్కెట్యార్డులో సుమారు 10 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం ఉండటంతో పీఏసీఎస్, ఏఎంసీ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేశారు. వరి కోతలు కోయవద్దని రైతులకు, హార్వెస్టర్ యజమానులకు సూచించారు. ఏదేమైనా మొంథా తుపాన్ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందోనని, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతామోనన్న భయం నెలకొంది.కొనుగోలు కేంద్రాల్లో ఆగమాగం -
రక్తదానం మహాదానం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్సిద్దిపేటకమాన్: పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటారని అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం ఆపద సమయంలో మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.రక్తదానం చేస్తున్న పోలీస్ -
● పురుగు మందు డబ్బాలతోరైతుల నిరసన ● హుస్నాబాద్లో సర్వేకు వచ్చినఅధికారుల అడ్డగింపు
హుస్నాబాద్: ‘కాలువల నిర్మాణం కోసం ఇప్పటికే ఒక దఫా భూములిచ్చాం. మళ్లీ ఇవ్వడానికి సిద్ధంగా లేం. ప్రాణాలు పోయినా ఇవ్వబోమ’ని రైతులు తెగేసి చెప్పారు. హుస్నాబాద్ పట్టణం డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల కోసం స్థల సర్వే చేసేందుకు మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వచ్చారు. ఇరిగేషన్ ఏఈ నె హ్రూ, సర్వేయర్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ రాజయ్యలను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. బలవంతంగా సర్వే చేస్తే ఇక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందుల డబ్బాలతో నిరసన తెలుపుతూ రోడ్డు పై బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్లు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు ససేమిరా అన్నారు. మా భూముల్లో ఎలాంటి ఆయకట్టు లేదని, ఇళ్ల స్థలాలుగా మారాయన్నారు. ఇండ్ల కోసం స్థలాలు తీసుకున్న వారు వీధిన పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎకరం, రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ లేదన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, మరో సారి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమన్నారు. కాలువల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అలైన్మెంట్ మార్చి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాలువలు నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లో ఇరిగేషన్ ఈఈ అధికారితో వచ్చి రైతులతో మాట్లాడుతామంటూ అధికారులు వెళ్లి పోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, రైతులు మర్యాల రాజిరెడ్డి, మర్యాల మహేశ్వర్ రెడ్డి, బురుగు కిష్టస్వామి, కొరిమి చిదంబరం, లాజరస్, సతీష్ తదితరులు ఉన్నారు. -
మా ఊరి సమస్యలు పరిష్కరించరూ..
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025డమిరుదొడ్డి(దుబ్బాక): మా ఊరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల పరిధిలోని అందె గ్రామానికి చెందిన విద్యార్థులు మంగళవారం వినూత్న రీతిలో పోలీస్స్టేషన్లో వినతి పత్రాన్ని అందించారు. పోలీస్ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు అందె విద్యార్థులతో పాటు రైతులు, జేఏసీ కమిటీ సభ్యులు ఏఎస్ఐ శేఖర్కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామానికి మూడు వైపులా ఉన్న రోడ్లన్నీ ధ్వంసమై గుంతలు పడటంతో బస్సులు సైతం రద్దయ్యాయని విద్యార్థులు వాపో యారు. మిరుదొడ్డి, సిద్దిపేట, గజ్వేల్ వంటి పట్టణాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే ధ్వంసమైన రోడ్ల కారణంగా అవస్థలు పడాల్సి వస్తున్నదని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, దేవాలయాల వద్ద మందు బాబులు మద్యం సేవించి అపరిశుభ్రంగా మారుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలకు కళ్ళెం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఊరి సమస్యలను పోలీసుల ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరారు. అందె జేఏసీ కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.పీఎస్లో అందె గ్రామ విద్యార్థుల వినతి -
తాగి నడిపితే తాట తీస్తాం
సిద్దిపేటకమాన్: మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా లేదా ఆరు నెలలపాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు అమల్లోకి వచ్చాయని ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో తొలిసారిగా కఠిన చర్యలు అమలు చేస్తున్నామన్నారు. డ్రంకెన్డ్రైవ్లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమానా విధించనున్నామన్నారు. రెండేళ్ల జైలు శిక్ష, రెండు ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేయనున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. తరుచూ వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. -
పాఠశాలే పానశాలగా..!
సిద్దిపేటరూరల్: మందుబాబులు పాఠశాలలే అడ్డాలుగా మార్చుకుని మందు సేవిస్తున్నారు. మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాథమిక పాఠశాల తరగతి ముందు రాత్రి వేళ మద్యం సేవించి తాగిన సీసాలు, గ్లాసులు అక్కడే వదిలేశారు. పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలను, మరుగుదొడ్ల డోర్లు, తరగతి గదుల కిటికీలను సైతం ఆకతాయిలు ధ్వంసం చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆకతాయిల ఆగడాలకు ఆడ్డు అదుపు లేకుండా పోతోంది. అర్ధరాత్రి వరకు పాఠశాల ప్రాంగణంలో మద్యం తాగుతూ ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
వరి కోతలు వద్దు.. ధాన్యం తడవొద్దు
● ‘మొంథా’ వేళ అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టర్ హైమావతి ● పలు కొనుగోలు కేంద్రాల సందర్శనకొమురవెల్లి(సిద్దిపేట): మొంథా తుపాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల, గౌరాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లను ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలన్నారు. తేమ శాతం రాగానే ధాన్యాన్ని కాంటా చేసి తరలించాలని సూచించారు. ఎవరైనా అశ్రద్ధ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలి సిద్దిపేటఅర్బన్: విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయ డం లేదని, తప్పకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. భోజనం చేసే సమయంలో విద్యార్థులను పర్యవేక్షణ చేస్తేనే క్రమశిక్షణ పాటిస్తారన్నారు. ఇష్టానుసారంగా వదిలేస్తే ఎలా అని గురు కుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ను హెచ్చరించారు. విద్యార్థులు అందరూ తిన్న తర్వాతనే ఉపాధ్యాయులు తినాలని ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులను హెచ్చరించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల భోజన వసతి, చదువు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇంటర్ విద్యలో గుణాత్మక మార్పులు
● ఆన్లైన్లో అటెండెన్స్, టీచింగ్ డైరీలు ● అన్ని కళాశాలల్లోనూ ఎఫ్ఆర్ఎస్ తప్పనిసరి ● ప్రత్యేకాధికారి కిషన్సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యలో ప్రభుత్వం గుణాత్మక మార్పులు తీసుకువస్తున్నదని ప్రత్యేకాధికారి కిషన్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, నిర్వహణకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో సోమవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డితో కలిసి ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు పెంచేందుకు తీసుకు వచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేయడంలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తప్పని సరిగా ప్రతి విద్యార్థిని ఎఫ్ఆర్ఎస్లో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. అధ్యాపకుల టీచింగ్ డైరీలు సైతం ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రతి తరగతి గదిలో సీసీ కెమరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశామన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి డీఐఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నే డిసెంటర్ మొదటి వారంలోగా సిలబస్ పూర్తి చేయాలన్నారు. స్టడీ అవర్లు నిర్వహించి ఇంటర్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 168సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అందిస్తున్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 168 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ బిల్లులు అందించాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి అయిన వారికి రూ.లక్ష జమకాలేదని కోరుతూ లబ్ధిదారులు వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరగా ఇల్లు నిర్మించుకుందామని ఆశపడితే చివరకు డబ్బులు సరిగ్గా రావడం లేదని వాపోయారు. అధికారులను అడిగితే జమ అవుతాయని బదులివ్వడమే తప్ప కావడంలేదన్నారు. మూడు రోజుల పాటు వరి కోతలు వద్దుమొంథా తుపాన్ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు వరి కోతలు చేయరాదని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షల 3వేల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 418 కొనుగోలు కేంద్రాలు గుర్తించి వాటి లో 407 ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 3,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలుకై 10 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులకు తెలిపారు. వరిధాన్యం, మొక్కజొన్న, ప్రత్తి కొనుగోలుకై ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఎండలో అర్జీదారుల పడిగాపులుఅర్జీదారులు ఎండలో పడిగాపులు కాశారు. అర్జీలు కలెక్టర్కు అందించేందుకు వచ్చిన ప్రజలకు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు. ఉదయం 11 గంటలకు ప్రజావాణి ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు టోకెన్స్ సిస్టం ద్వారా లోపలికి పంపించారు. కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులు ఎండలో చాలాసేపు వేచి ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. -
వైభవంగా మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం కార్తీక సోమవారం మూల మహోత్సవ వేడుకలతో శోభిల్లింది. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, కుంకుమార్చన, చతుషష్ట్యోపచార పూజ నిర్వహించారు. అమ్మవారి నామం స్మరిస్తూ భక్తజన సామూహిక లక్షపుష్పార్చన చేశారు. యాగశాలలో చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తజనులు వేడుకలలో పాల్గొని తరించారు. పోటీ పరీక్షలపై యువతకు అవగాహన సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో సోమవారం యువత, విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ కళాశాల గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వంగాల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సమయపాలన, ప్రణాళిక, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సబంధించిన సమాచారంతో పాటు ప్రిపేర్ అయ్యే విధానాలను వివరించారు. గతంలో పోటీ పరీక్షలు రాసి ఉద్యో గాలు సాధించిన వారి అనుభవాలను గూర్చి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ యువత ప్రభు త్వం అదిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పవన్కుమార్, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, మధుసూదన్, వైఎల్ఎన్రెడ్డి, రాధిక, డాక్టర్ దీపిక, సంగీత, రమ్య తదితరులు పాల్గొన్నారు. బస్సు కోసం గ్రామస్తుల ఆందోళన మిరుదొడ్డి(దబ్బాక): గ్రామంలోకి బస్సు రావాలని డిమాండ్ చేస్తూ అందె జేఏసీ నాయకులతో పాటు గ్రామస్తులు సోమవారం రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయా అందె మీదుగా సిద్దిపేట– దౌల్తాబాద్ ఆర్టీసీ బస్సు నడపాల్సి ఉండగా ఇదేమి పట్టకుండా అందె గ్రామంలోకి బస్సు రాకుండా వెళుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి సిద్దిపేట పట్టణానికి విద్యార్థులు, ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారన్నారు. గ్రామంలోకి బస్సు రాకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అందె క్రాస్ రోడ్డు వరకు నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి అందె వయా బస్సును యథావిధిగా నడపాలని గ్రామ జేఏసీ నాయకులు కోరారు. ఆందోళనపై సిద్దిపేట ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ ద్వారా గ్రామస్తులు తెలియజేశారు. కార్యక్రమంలో అందె జేఏసీ నాయకులు లింగం, రాజు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి సిద్దిపేటజోన్: పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆందో ళన చేపట్టారు. స్థానిక క్లాక్ టవర్ నుంచి శివాజీ చౌక్ వరకు సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విడుదల చేయా లని కోరారు. పేద విద్యార్థులకు చదువు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. -
డ్రాలో దక్కించుకున్న 20 మంది మహిళలు
● కలెక్టర్ సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు ● సిద్దిపేట పట్టణం సీసీ గార్డెన్లో సందడి వాతావరణం సిద్దిపేటకమాన్: నూతన మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ల కేటాయింపు ఆసక్తికరంగా సాగింది. లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించారు. లక్కీ డ్రాలో 20 మంది మహిళలు వైన్ షాపులు దక్కించుకోవడం విశేషం. జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్లో సోమవారం మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఎకై ్సజ్ అధికారులు నిర్వహించారు. కలెక్టర్ హైమావతి హాజరై మొదటి దుకాణానికి లక్కీ డ్రా ద్వారా టోకెన్ నంబర్ 16 ఎంపిక చేసి ప్రారంభించారు. లైసెన్స్దారుడు ప్రశాంత్రెడ్డి ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. డివిజన్ వారీగా దరఖాస్తుదారులను హాల్లోనికి అనుమతించారు. ఫంక్షన్ హాల్ ఆవరణలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆశావహులకు లక్కీ డ్రా నిర్వహణ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అధిక సంఖ్యలో రావడంతో ఫంక్షన్హాల్ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. డ్రాలో వైన్ షాప్లు దక్కించుకున్న వారు సంతోషంతో శుభాకాంక్షలు తెలుపుకుని, స్వీట్లు పంపిణీ చేశారు. 20 టోకెన్లు వేస్తే.. 25 మంది సిండికేట్గా ఏర్పడి 20టోకెన్లు వేయగా వరుసగా రెండు దుకాణాలను డ్రాలో దక్కించుకున్నారు. జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు నూతన మద్యం పాలసీలో భాగంగా గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించగా 2,782 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. తీగుల్ నర్సాపూర్లోని 51వ షాప్కు 73 మంది దరఖాస్తు చేసుకోగా డ్రాలో వెంకటేశ్గౌడ్ దక్కించుకున్నారు. 50వ షాప్కు 63 దరఖాస్తులు రాగా డ్రాలో ఉడుత దేవయ్యకు దక్కింది. పది మంది గ్రూప్గా ఏర్పడి 20దుకాణాలకు దరఖాస్తు చేసినా ఒక్క వైన్ షాప్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని 93 వైన్ షాప్లను దక్కించుకున్న వారు మంగళవారం సాయంత్రం లోగా లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు ఫీజు ప్రభుత్వ ఖజానాకు డీడీ రూపంలో చెల్లించాలని తెలిపారు. -
వసతి.. ఇదేం దుస్థితి
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● రేకుల భవనంలో ఎస్సీ బాలికల వసతి భవనం ● అవస్థల మధ్యే విద్యాభ్యాసం ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. విద్యారంగానికి, విద్యార్థుల సంక్షేమానికి రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో చూస్తే అందుకు భిన్నంగా వసతి గృహాలు దర్శనమిస్తున్నాయి. అద్దె భవనాలు, ఇరుకు గదులు, అసౌకర్యాల మధ్యే విద్యార్థులు విద్యాభాస్యం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. – దుబ్బాకటౌన్ దుబ్బాక పట్టణంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహం పాత పెంకుటింట్లో 30 మంది విద్యార్థులతో ఇరుకు గదుల మధ్య కొనసాగుతోంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సాంఘిక, బీసీ సంక్షేమ అధికారులు కనీసం కన్నెత్తి చూడటంలేదని విద్యార్థులు వాపోతు న్నారు. అలాగే పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలోనూ సమస్యలే దర్శనమిస్తున్నాయి. గతంలో వందల మంది బాలికలతో కళకళలాడగా, నేడు శిథిలావస్థలకు చేరిన అద్దె భవనంలో కేవలం 40 మంది విద్యార్థినులతో వెలవెలబోతోంది. మరమ్మతులు, వసతులు చేపట్టక పోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూవస్తోంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ భవనం ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో అధికారులు కొంతకాలం పాటు పక్కనే ఉన్న బీసీ బాలికల వసతి గృహంలోని రెండు గదుల్లో తాత్కాలికంగా వసతి కల్పించారు. గోడలకు పగుళ్లు.. రెండేళ్ల కిందట పట్టణ శివారులోని రేకుల అద్దె భవనంలోకి బాలికల వసతి గృహాన్ని మార్చారు. ప్రస్తుతం ఆరు రేకుల గదులతో కూడిన గదుల్లో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గదుల్లో కొన్ని చోట్ల పైకప్పు రేకులు పగిలిపోవడంతో వాటిపై ప్లాస్టిక్ కవర్లను పరిచారు. గదుల్లో గోడలకు అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. వేడి నీరు లేక.. వేడి నీటిని అందించే గీజర్లు లేక పోవడంతో వర్షాకాలం, చలికాలంలో బాలికలకు చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి. మరుగుదొడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెంకుటింట్లోనే బాలుర వసతి గృహం -
సైక్లింగ్తో ఉజ్వల భవిష్యత్తు
సిద్దిపేటజోన్: సైక్లింగ్తో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలో జరిగిన 20వ జిల్లా స్థాయి సైకిల్ పోటీల ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యం సైకిల్ సాధన చేయడంతో లాభాలు ఉంటాయన్నారు. సైక్లింగ్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈనెల 31, నవంబర్ 1, 2వ తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, పాఠశాల క్రీడా సమాఖ్య మాజీ కార్యదర్శి సుజాత, క్రీడా సంఘాల కార్యదర్శులు ఉప్పలయ్య, ఖేల్ ఇండియా సైక్లింగ్ కోచ్ సంజీవ్, సీనియర్ క్రీడాకారులు విజయ్, రమేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
లిక్కర్ లక్కు ఎవరికో?
మద్యం దుకాణాల దరఖాస్తుదారుల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ లక్కు ఎవరిని వరిస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు. మద్యం నూతన పాలసీ (2025–27) ప్రకారం వైన్ షాపుల నిర్వహణలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతితో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా టెండర్దారుల్లో కొందరు దుకాణాలు తమకే దక్కాలంటూ ఆలయాల్లో పూజలు చేయడం విశేషం. సిద్దిపేటకమాన్: జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2,782 దరఖాస్తులు వచ్చాయి. టెండర్కు ఫీజు (నాన్ రిఫండబుల్) రూ.2 లక్షల నుంచి ఈ సారి రూ.3లక్షలకు పెంచడంతో ఆశించిన మేర అప్లికేషన్లు రాలేదు. ప్రస్తుత పాలసీ ప్రకారం వచ్చిన మొత్తం 2,782 దరఖాస్తులతో రూ.83.46కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీ ప్రకారం 4,166 దరఖాస్తులు రాగా రూ.83.32 కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీ కంటే ఈసారి రూ.14లక్షల ఆదాయం అధికంగా వచ్చింది. అన్ని మద్యం దుకాణాలకు పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రాలో ఎవరికి వైన్ షాప్లు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అత్యధికంగా తీగుల్ నర్సాపూర్లోని ఎస్డీపీ 51వ షాప్నకు 73 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. పాస్ ఉన్న వారికే అనుమతి కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. టెండర్దారులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీ సంఖ్యలో డ్రా నిర్వహించే ప్రదేశానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కరీంనగర్ రోడ్డులోని సీసీ గార్డెన్లో ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్న వారిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతించనున్నారు. ఇప్పటికే టెండర్ దారులకు జారీ చేసిన పాస్లతో ఉదయం 10గంటల్లోపు రావాలని అధికారులు తెలిపారు. లక్కీ డ్రా మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే మద్యం దుకాణాలు డ్రాలో తమకే మద్యం దుకాణాలు దక్కాలని జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కొండపోచమ్మ ఆలయాల్లో దరఖాస్తుదారులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దరఖాస్తుదారుల్లో టెన్షన్ ఏర్పాట్లు పూర్తి సిద్దిపేట పట్టణం సీసీ గార్డెన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నాం. దరఖాస్తుదారులకు జారీ చేసిన పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతిస్తాం. పూర్తి పారదర్శకంగా డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – శ్రీనివాసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సిద్దిపేట -
రాయితీకి రాంరాం!
● సరఫరా కానీ సబ్సిడీ టార్పాలిన్లు ● ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న రైతులు అద్దెకు తీసుకుంటున్నాం.. పంటల సీజన్లో టార్పాలిన్లు అద్దెకు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలి. ప్రవేటులో కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారమవుతోంది. – లక్ష్మణ్, రైతు చిన్నకోడూరుచిన్నకోడూరు(సిద్దిపేట): పండించిన పంటలను వర్షాల నుంచి కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ కవర్లు అందించేది. ఆరేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్లపై సబ్సిడీని నిలిపివేసింది. దీంతో వర్షాలు కురుస్తున్నప్పుడు చేతికి అందివచ్చిన పంటలను నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో రూ.1,250కే.. గతంలో ఉద్యానశాఖ ద్వారా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్ కవర్లను రూ.1,250కి అందజేసింది. తర్వాత ఈ పథకాన్ని వ్యవసాయ శాఖకు బదిలీ చేసింది. కొన్నేళ్లు రైతులకు సబ్సిడీపై కవర్లు పంపిణీ చేశారు. ఆరేళ్లుగా కవర్ల పంపిణీ నిలిపివేశారు. దీంతో చేసేదిలేక రైతులు సొంత ఖర్చులతో ఒక్కో టార్పాలిన్కు రూ.3 వేలు వరకు వెచ్చించి ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా భారం కావడంతో రైతులు అద్దే టార్పాలిన్ కవర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. -
గురుకులాల్లో ‘కామన్ డైట్’ తప్పనిసరి
కలెక్టర్ హైమావతిప్రశాంత్నగర్(సిద్దిపేట): గురుకులాలల్లో తప్పనిసరిగా కామన్ డైట్ను పాటించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందికి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డైట్, హాజరు, వంట సరుకుల రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలతో రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. స్టోర్ రూమ్లో కూరగాయలను, సరుకులను తనిఖీ చేశారు. వంట గది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి (సిద్దిపేట): మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత మంది గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి, ముడుపులు కట్టారు. మరికొంత మంది అభిషేకాలు, కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కుకునూరుపల్లిలో ఆదివారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ గింజకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ గ్రేడ్ క్వింటాల్ ధర రూ.2,389, కామన్ గ్రేడ్ ధర రూ.2,369లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. మార్కెట్కు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు తాలు, తేమ శాతం లేకుండా చూసుకొని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, నాయకులు పాల్గొన్నారు. కోర్టు పరిధిలోనే ఏర్పాటు చేయండి హుస్నాబాద్: కోర్టు పరిధిలోనే సబ్ కోర్టు నిర్మించాలని, కోర్టు తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పునరాలోచన చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్గౌడ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐఓసీ భవనాన్ని పట్టణానికి దూరంగా కిషన్నగర్లో నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సబ్ కోర్టును పందిల్ల, జిల్లెల్లగడ్డలో నిర్మించాలని స్థల పరిశీలన చేశారని, కోర్టు పరిధిలోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు వెల్పుల రాజు, నరేష్ తదితరులు ఉన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించండిసిద్దిపేటఅర్బన్: మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో నవంబర్ ఒకటి నుంచి వంట బంద్ చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి హెచ్చరించారు. ఆదివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా నాలుగవ మహాసభలో పాల్గొని మాట్లాడారు. బిల్లులు పెండింగ్లో ఉండటంతో కార్మికులు అప్పుల పాలయ్యారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్లకు, కూరగాయలకు అదనంగా రేట్లు పెంచి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు రాజమణి, ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లఘు, ఛాయాచిత్రాల పోటీలకు ఆహ్వానం
సిద్దిపేటకమాన్: పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా లఘు చిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్) తీసి పంపించాలని సీపీ విజయ్కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఫొటోలు, వీడియోలు ఈనెల 30వ తేదీలోపు ఆన్లైన్లో పంపించాలని తెలిపారు. ప్రతిభ కనబర్చిన మొదటి మూడు ఫొటోలు, వీడియోలకు బహుమతులు ఉంటాయని వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. గ్రామాల్లో పోలీసుల సందర్శనసిద్దిపేటకమాన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 27, 28వ తేదీల్లో కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శిస్తారని పోలీసు కమిషనర్ వెల్లడించారు. పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించినపుడు ప్రజాసమస్యలేమైనా ఉంటే పోలీసులకు తెలపాలన్నారు. పరిష్కరించగలిగే వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తారని, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యలుంటే సంబంధిత శాఖలకు నివేదిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. వర్షాలకు చీడ పీడలుజిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వరి పంటకు చీడ పీడలు ఆశిస్తాయని, వాటి నివారణకు వరి మడుల్లో కాలువలు చేసి నీటిని నిల్వ లేకుండా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించారు. మండల పరిధిలోని చౌడారం, మేడిపల్లి గ్రామాల్లో శనివారం వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ...పాల దశలో ఉన్నటువంటి వరిని కంకినల్లి ఆశించే అవకాశం ఉన్నందువల్ల స్పైరోమెసిఫెస్ 1 మిల్లీ లీటర్, లీటర్ నీళ్లలో కలిసి పిచికారీ చేయాలన్నారు. రైతులు వరి, మొక్కజొన్న కోసిన తర్వాత కొయ్యకాలు కాల్చవద్దన్నారు. ఆమె వెంట ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు, రైతులున్నారు. సరైన పద్ధతిలో నడిపించేది తల్లేఘనంగా సప్తశక్తి సంఘం–మాతృ సమ్మేళనం ప్రశాంత్నగర్(సిద్దిపేట): మనం ఎంత అభివృద్ధి సాధించిన కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపించే శక్తి ఆ కుటుంబంలోని తల్లికే ఉందని, మాతృమండలి కార్యదర్శి నీరటి నాగమణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో శనివారం ఘనంగా సప్తశక్తి సంఘం–మాతృ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాటలు, మహిళా స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలు, క్విజ్ కాంపిటీషన్, ప్రసంగాలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది. వివిధ పోటీల్లో విజయం సాధించిన మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. కళాప్రదర్శనను విజయవంతం చేయండిగజ్వేల్రూరల్: సంచార జాతుల కళాప్రదర్శనను విజయవంతం చేయాలని సామాజిక సామరస్యతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేశ్బాబు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి, సామాజిక సామరస్యతా వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్లో ఆదివారం సంస్కృతి, విలువలను అందించే సంచార జాతుల కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. సంచార జాతుల కళలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయని, వీటిని భవిష్యత్ తరాలకు తెలిపేవిధంగా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
ఓటర్ జాబితాను సీడీమ్యాపింగ్ చేస్తాం
వీడియో సదస్సులో కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాను బీఎల్ఓ యాప్ ద్వారా సరిచూసుకుని సీడీమ్యాపింగ్ చేసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఎన్నికల కమిషన్ సీఈఓ సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ రెండు పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సూపర్వైజర్లకు శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని అల్లీపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించారు. వంట సరుకులు, సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలో ఎక్కువ వెలుతురు లైట్లు అమర్చాలని విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్లో ఆదేశించారు. అనంతరం చిన్నకోడూరు పీహెచ్సీని సందర్శించారు. అత్యవసర వైద్య సేవలు పరిశీలించారు. -
వసూల్రాజాల ఇష్టారాజ్యం
● దళారులు, పైరవీకారులకు అడ్డాగా తహశీల్దార్ కార్యాలయం ● పని కావాలంటే చేయి తడపాల్సిందేనంటున్న సిబ్బంది ● రిజిస్ట్రేషన్కోసం వెళ్తే 20 రోజులుగా తిప్పుతున్న వైనం ● అవినీతి జలగలపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు పని కావాలంటే పైసలివ్వాల్సిందే కార్యాలయంలో ఏ పని కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. చిన్నస్థాయి నుంచి ఉద్యోగి నుంచి ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్తోపాటు సర్వేయర్, తహసీల్దార్ వరకు వసూల్ రాజాలే. మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకున్నాక నిబంధనల ప్రకారం ఆర్ఐ రిపోర్ట్ రాశాక తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ, రైతుల దగ్గర నుంచి ఎకరాకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు, చిన్న రైతులు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్కు రూ.1000 నుంచి రూ.2వేల వరకు కంప్యూటర్ ఆపరేటర్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోహెడరూరల్(హుస్నాబాద్): కోహెడ తహశీల్దార్ కార్యాలయం దళారులకు, పైరవీకారులకు అడ్డాగా మారింది. పనుల కోసం వచ్చే రైతులను, సామాన్యులను సైతం సిబ్బంది వదలడం లేదు. పనికావాలంటే సిబ్బంది చేయి తడపాల్సిందేనని సిబ్బంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు ఇటీవలే ఇక్కడకు బదిలీపై వచ్చిన తహశీల్దార్ చంద్రశేఖర్ వ్యవహారశైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. కుల, ఆదాయ ధ్రువ పత్రాల నుంచి మొదలై భూమి రిజిస్ట్రేషన్ వరకు డిమాండ్ను బట్టి కోహెడ తహసీల్దార్ కార్యాలయంలో పైసలు వసూలు చేస్తున్నారు. ముడుపులిస్తేనే పనులు సాధ్యం అనే తరహాలో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని మరీ దందాలు నడిపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. భూముల విషయంలో స్థానికంగా ఉన్న భూ భారతి కంప్యూటర్ ఆపరేటర్ తహశీల్దార్కు కీలకంగా మారడంతో ఇక్కడ అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తహశీల్దార్ను కలవడానికి వెళ్లాలంటే ముందు పైరవీకారులను, దళారులను కలిశాకే సాధ్యమవుతోందని సామాన్యులు వాపోతున్నారు. స్లాట్ బుక్ చేసినా... స్లాట్ బుక్ చేస్తే కూడా డబ్బులు తీసుకోనిదే రిజిస్ట్రేషన్ చేయడం లేదు. 15 రోజులుగా సుమారు 20కి పైగా స్లాట్లు బుక్ చేసినా రిజిస్ట్రేషన్, పౌతి చేయకుండా పెండింగ్లో పెట్టారు. ఎందుకని బాధితులు అడిగితే ఏదో కారణం చెప్పి తిప్పి పంపించివేస్తున్నారు. మొదటి నుంచి వివాదాస్పదమే బెజ్జంకి మండలం నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్ మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన వ్యవహార శైలితో కిందిస్థాయి ఉద్యోగులతోపాటు కార్యాలయానికి వచ్చే బాధితులు కూడా విమర్శలు చేసేవారు. మధ్యవర్తులను పెట్టుకుని చేయి తడిపితేనే కార్యాలయంలో పనులు చేసేవారని ఈయనపై ఆరోపణలున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు బెజ్జంకి మండలానికి చెందిన పలువురు ఫిర్యాదు చేయడంతో 20 రోజుల క్రితం బదిలీపై కోహెడకు వచ్చారు. వచ్చిన రోజు నుంచే రోజుల తరబడి పెండింగ్లో పెట్టి తహశీల్దార్ రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేసి కోహెడ నుంచి సదరు అవినీతి అధికారిని తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కాగా, ఈ విషయంపై తహశీల్దార్ చంద్రశేఖర్ను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించేందుకు వారం నుంచి ప్రయత్నిస్తున్నా అస్సలు స్పందించడమే లేదు. దీంతో భూ భారతి ఆపరేటర్ స్వామిని వివరణ కోరగా రిజిస్ట్రేషన్ విషయాలు తహశీల్దార్నే అడగాలని తనకేమీ తెలియదని బదులిచ్చాడు. 18 రోజులుగా తిరుగుతున్నాం మీ సేవాలో ఈ నెల 7న రిజిస్ట్రేషన్ చేసేందుకు స్లాట్ బుక్ చేశాం. ప్రతీ రోజు కార్యాలయంలో సంప్రదిస్తున్నాం. కానీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ కోసం రుసుము కూడా చెల్లించాం. కానీ, కార్యాలయంలో పనులు కావడం లేదు. ప్రతీ రోజు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నాం కానీ పని కావడం లేదు. చిన్న చిన్న కారణాలు చెప్పి పనులు పెండింగ్లో పెడుతున్నారు. –పేర్యల సాగర్రావు, రియల్టర్, కోహెడ మండలం -
రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలకం
● బీఆర్ఎస్ పాలనలోనే అప్పులకుప్పగా మారిన తెలంగాణ ● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట)/సిద్దిపేటఅర్బన్/సిద్దిపేటరూరల్: బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పగా తయారు చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మోహినీపుర శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని శనివారం మంత్రి లక్ష్మణ్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఆలయ ఈవో మారుతి, వేద పండితులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాడు కేంద్రంలో తమ కేబినెట్లో ఉన్న మంత్రులు కృషి చేశారన్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టినా, ఆంధ్రాలో తమ పార్టీ అధికారంలోకి రాదని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కాంగ్రెస్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారని, తమ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారని చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని క్రమశిక్షణతో ఉంటూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆకాంక్షించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ...రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గురుకులాలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందని గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థుల బట్టలు ఆరేసుకోవడానికి ప్లాట్ ఫాం నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కావాలని కోరగా ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే రూ.10 లక్షల విడుదల చేస్తామని, తర్వాత మిగతా నిధులు అందిస్తామన్నారు. అధికారులతో మంత్రి సమీక్ష జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ సదానందం, జిల్లా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పౌరసరఫరాల శాఖల అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాల సమస్యల పూర్తి సమాచారం అందించాలన్నారు. బెస్ట్ అవైలెబుల్ స్కూల్లలో చదువుకునే పిల్లలకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రైసైకిళ్లు, పలు పరికరాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లే
సత్ప్రవర్తనతో ఉండాలిసిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లే పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జైలును శనివారం న్యాయమూర్తి సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖైదీలందరికీ అడ్వొకేట్స్ ఉండాలన్నారు. ఖైదీలకు న్యాయపరమైన సహాయం కోసం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడుసార్లు జైలుని సందర్శిస్తారని, అడ్వొకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, జైలు సిబ్బంది, న్యాయసేవ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం.. దైన్యం
దంచికొట్టిన వాన ● దుబ్బాక మార్కెట్యార్డులో తడిసిన ధాన్యం ● వరదలో కొట్టుకుపోయిన వైనం ● కాపాడుకునేందుకు రైతుల పాట్లు దుబ్బాక: దుబ్బాక పట్టణంతోపాటుగా పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఎండిన ధాన్యంసైతం వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరుపెట్టడం తప్ప ఏం చేయలేని పరిస్థితి దాపురించింది. దుబ్బాక మార్కెట్ యార్డులో వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిముద్దయింది. వర్షం దంచికొట్టడంతో ఆర బెట్టిన ధాన్యంతోపాటు కుప్పల కిందినుంచి వరద పెద్ద ఎత్తున రావడంతో వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు దుబ్బాక మార్కెట్యార్డులో వర్షంలోనే రైతులు పడరానిపాట్లు పడ్డారు. ఎండిన ధాన్యం సైతం వర్షంలో తడిసిపోవడం, కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం ధాన్యం కుప్పలమీద కప్పుకుందామంటే కూడా కవర్లు కూడా లేక పోవడంతో చాలామంది రైతుల ధాన్యం కొట్టుకుపోయింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు సరిపడా కవర్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. -
ఇంటర్ ఉత్తీర్ణత పెంచాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల కళాశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సిలబస్, బోధన తదితర అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమంతప్పకుండా కళాశాలకు హాజరుకావాలని సూచించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ మూడు నెలలు విద్యార్థులకు ఎంతో కీలకమని స్టడీ అవర్లను నిర్వహించాలని సూచించారు. ప్రతీ విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. వెనుకబడిన విద్యారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న యాంకర్ వింధ్య విశాఖ.. రూ. లక్ష సాయం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాణానికి ప్రామాణికమైన కిడ్నీ, లివర్ పనిచేయకపోవండంతో.. ఆపన్నహాస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయమందించి తనమానవత్వాన్ని చాటుకుంది ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, టీవీ యాంకర్ వింధ్య విశాఖ. ఆ బాలుడు ప్రణీత్కు తాను అందించిన లక్ష రూపాయలు సరిపోవని, సోషల్ మీడియాలో సహాకారం అందించాలని కోరుతోంది. జన్యుపరమైన కారణాలతో కిడ్ని, లివర్ రెండూ పనిచేయకుండాపోయిన ప్రణీత్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం తరచుగా వెళుతున్న వింధ్య విశాఖ తమ పక్క బెడ్ పైనే ఉన్న ప్రణీత్ పరిస్థితిని ఆరా తీసి తనవంతు సహాయం అందించింది. ఆరోగ్య శ్రీ వర్తించని బాలుడి కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స కోసం సహాకారం అందించాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో.. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, తన ఫేరెట్ కోహ్లి, తన జెర్సి నెంబర్ 18 అంటూ సాగిన సంభాషన అందరినీ కలచి వేస్తోంది.చికిత్స కోసం ఉన్న ఆస్తి అమ్మేశా..మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామం. తోమ్మిదేళ్ల నా కొడుకును వారంలో 3 రోజులు డయాలసిస్ కోసం నగరంలోని హాస్పిటల్కు రావల్సివస్తుంది. అర్థ ఎకరం భూమి అమ్మి 20 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించాను. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం జీవన్దాన్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు 40 లక్షల రూపాయలు ఖర్చవుతాయంట. నా ఇద్దరు కొడుకులు జెనికల్ డిసార్డర్తోనే పుట్టారు. దాతలు సహాయాన్ని నా 9849520535 నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే చేయవచ్చు. -ఎంకమొల్ల స్వామి, ప్రణీత్ తండ్రి.ప్రణీత్ను కాపాడుకుందాం..డయాలసిస్ వల్ల బీపీ పెరిగిపోయి అవస్థలు పడుతున్న సమయంలో ప్రణీత్ని తన తండ్రి ఒడిలో పెట్టుకున్నప్పుడు మొదటి సారి చూశాను. సహాయంగా నావంతు లక్ష అందించాను, కానీ అది సరిపోదు. దయచేసి ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని కోరుతున్నాను. తనకు మంచి భవిష్యత్ ఉంది, చాలా యాక్టివ్గా, నేర్చుకోవాలనే తపనతో ఉంటాడు. ప్రణీత్ను గత 3 నెలలుగా గమనిస్తున్నాను. డబ్బులు సమకూరితే నిండు ప్రాణాన్ని కాపాడిన వారమౌతాము. -వింధ్య విశాఖ, స్పోర్ట్స్ ప్రజెంటర్. View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) -
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసం దీపాల వెలుగుల్లో శోభిల్లుతోంది. బుధవారం నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో సాయం సంధ్యవేళ ఆకాశదీపోత్సవం, అనంతరం భక్తజన సామూహిక కార్తీక దీపోత్సవం కొనసాగింది. కార్తీకంలో దైవదర్శనం, దీపారాధన శుభకరమని దీపోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ సిబ్బంది, అర్చకులు తగు ఏర్పాట్లు చేశారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోనూ కార్తీక దీపోత్సవం నిర్వహించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు ఆలయ అర్చకులుప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. – వర్గల్(గజ్వేల్) / కొమురవెల్లి(సిద్దిపేట) నేత్రపర్వం.. -
సీపీని కలిసిన ‘బీ స్మాట్’ ప్రతినిధులు
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనర్ విజయ్కుమార్ను సీపీ కార్యాలయంలో బీ స్మాట్ (బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) ప్రతినిధులు కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా విద్యాసంస్థల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, సికిందర్, వెంకటేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతతో పని చేయాలిడీఈఓ శ్రీనివాస్రెడ్డి నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన నంగునూరు మండలంలోని 11 మందిని బుధవారం డీఈఓ సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యా ప్రమాణాలను పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వృత్యాంతర శిక్షణలో నేర్చుకున్న అంశాలు, మెలకువలను విద్యార్థులకు బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం రామస్వామి, సుధాకర్, ప్రిన్సిపాల్ జానయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్లకు టెట్ పరీక్ష రద్దు చేయాలిగజ్వేల్: సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దామెర రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం గజ్వేల్ మండలం జాలిగామ, బెజుగామ, ఆహ్మదీపూర్, సింగాటం, పిడిచెడ్, బూర్గుపల్లి, ఆర్అండ్ఆర్ కాలనీ తదితర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలను ముమ్మరం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, గజ్వేల్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు సురేష్, ధమ్మని మల్లయ్య పాల్గొన్నారు. -
ఎవరికి వారు.. పైరవీల జోరు
డీసీసీ అధ్యక్ష పీఠానికి పోటాపోటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. పదవి కోసం కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా దరఖాస్తు చేశారు. దాదాపు 127 మందికి పైగా దరఖాస్తు చేసినట్లు విశ్వనీయ సమాచారం. దరఖాస్తు దారుల నుంచి అభిప్రాయలను సైతం సేకరించారు. పరిశీలకులు ఈ నెల 26న ముగ్గురి పేర్లను ఏఐసీసీకి అందించే అవకాశం ఉంది. వారిలో సీఎం, పీసీసీ నేతలతో చర్చించి అధ్యక్షుని పేరును ఈ నెల 30 వరకు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో డీసీసీ పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. –సాక్షి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం జిల్లాలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించారు. అందులో భాగంగా డీసీసీ పదవిని ఆశిస్తున్న ఆశావహుల నుంచి దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదీశ్వరరావు, నజీర్ హుస్సేన్లు స్వీకరించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 18,19వ తేదీలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు దరఖాస్తు దారులతో నేరుగా మాట్లాడారు. ‘మీరు డీసీసీ అధ్యక్షుడైతే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీకు అవకాశం ఇవ్వకపోతే ఎవరిని సూచిస్తారు? అని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీ కోసం పని చేస్తున్న నాయకుల గురించి ఆరా తీశారు. అందులో ముందు వరుసలో శ్రావణ్ కుమార్రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ, గిరి కొండల్ రెడ్డి, దరిపల్లి చంద్రం, ఆంక్షారెడ్డి, బండారి శ్రీకాంత్, సూర్య వర్మ, బస్వరాజు శంకర్, శ్రీనివాస్ గుప్తా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరిని సామాజిక వర్గాల వారీగా పేర్లు సైతం పరిశీలించే అవకాశం ఉంది. సీనియారిటీ పరిగణలోకి.. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం సీనియార్టీ సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. కనీసం ఐదేళ్ల పాటు పార్టీలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ప్రకటించింది. దీంతో కొంతమంది నేతలు తర్జన భర్జన పడుతున్నారు. కొందరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మరికొందరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరారు. దీంతో సీనియర్, జూనియర్ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది. ఐదేళ్లు సీనియార్టినే ప్రామాణికంగా తీసుకుంటే పలువురు పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.పదవికి 127 మంది దరఖాస్తు ఆ ముగ్గురు ఎవరు? డీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 127 మంది దరఖాస్తు చేయగా ఏఐసీసీకి పంపే ముగ్గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. డీసీసీ పదవి దక్కకపోయినా ఏదైనా నామినేట్ పదవికై నా సిఫార్సు చేస్తారేమోనని ఆసక్తి నెలకొంది. ఆ ముగ్గురు నేతలు ఎవరన్నది ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. డీసీసీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవిని ఆశిస్తున్న నేతలు పలువురు మంత్రులు, టీపీసీసీలో కీలక నేతలను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొత్తవారికే అధ్యక్ష పీఠం జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పీఠం కొత్తవారినే వరించనుంది. ప్రజాప్రతినిధుల సమీప బంధువులు, ఇప్పటి వరకు పనిచేసిన వారికి రెండోసారి ఎట్టి పరిస్థిల్లోనూ డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోమని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడంతో నూతనోత్తేజం నెలకొంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కాకుండా కొత్త వ్యక్తికి అవకాశం దక్కనుంది. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● తొగుటలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ తొగుట(దుబ్బాక): పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సరిపడా మందులు, ల్యాబ్లో అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయూష్ కేంద్రంలో యునాని వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. మధ్య వయస్సు వారికి, వృద్ధులకు యునాని మందులు శ్రేష్టమైనవన్నారు. అనంతరం కలెక్టర్ కాలి మడమ నొప్పి వస్తుందని తెలపడంతో యునాని వైద్యురాలు అస్రా పరీక్షించి మాత్రలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం వినతి ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బిల్లులు అందక ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని వివరించారు. బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆయన విజ్ఞప్తిచేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించామని త్వరలోనే మంజూరవుతాయని హమీనిచ్చారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు. సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి సిద్దిపేటరూరల్: రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ హైమావతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు మాత్రమే పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్నదని తెలిపారు. గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25వతేదీతో ముగియనున్న సందర్భంగా www.telangana.gov.in/telanganarising అనే వెబ్ సైట్ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కలెక్టర్ తెలిపారు. -
అధికారుల ఇష్టారాజ్యం..
● ఆఫీస్ వేళల్లో బయట బలాదూర్ ● జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఉద్యోగుల తీరు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తీరు ఏ మాత్రం మారడం లేదు. బుధవారం మధ్యాహ్నం 12.25గంటలకు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ‘సాక్షి’ వెళ్లగా అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి ఫీల్డ్ విజిట్లో ఉండగా, కేవలం జూనియర్ అసిస్టెంట్ మాత్రమే కార్యాలయంలో ఉన్నారు. మిగతా అఽధికారులు, సిబ్బంది లేక కార్యాలయం వెలవెలబోయింది. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యాలయం బయటే అధికారుల కోసం వేచి చూస్తున్నారు. వారిని ‘సాక్షి’ పలకరించగా అధికారులు లేరని గంట నుంచి బయటే వేచి చూస్తున్నామన్నారు. అయితే ఈ శాఖలో విధులు నిర్వహించే ఇతర అధికారులు, సిబ్బంది తమ ఇష్ట రాజ్యంగా తమకు నచ్చినపుడు కార్యాలయంలో.. మిగతా సమయంలో బయట బలాదూర్గా తిరుగుతున్నారని, ఇక్కడి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. వర్కింగ్ టైంలో అధికారులు లేకపోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో ఉండే పశుసంవర్ధకశాఖ కార్యాలయంలోనే ఉద్యోగులు, సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, డివిజన్, మండలాల్లోని అధికారులు, సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తారో అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి వివేక్ సభలో నిలిచిన విద్యుత్ సరఫరా
● సెల్ఫోన్ వెలుతురులో చెక్కుల పంపిణీ ● కొద్దిసేపు గందరగోళం గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో మంత్రి వివేక్ చివరకు సెల్ఫోన్ లైట్ల వెలుతురుతో పాటు వీడియో కెమరాల లైటింగ్లోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. సుమారు 10 నిమిషాలకుపైగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత కరెంటు సరఫరా రావడంతో మంత్రి మరోసారి వేదికపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపు ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక విద్యుత్శాఖ ఏఈ మారుతిని అక్కడికి పిలిపించి వివరణ అడిగారు. ఈ సందర్భంగా ముట్రాజ్పల్లిలోని ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేటర్పై బల్లి పడటంతో సరఫరా నిలిచిపోయిందని ఏఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి సభలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చర్చనీయంశంగా మారింది. -
వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి
● త్వరలోనే గత సన్నాల బోనస్ చెల్లిస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభంహుస్నాబాద్: రైతులు వరితో పాటు అధిక దిగుబడి, లాభసాటి వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం పట్టణంలోని గోమాత జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగొలు కేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డులో విశాల పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగొలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్ట మొదటగా హుస్నాబాద్లో సీసీఐ పత్తి కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పత్తి క్వింటాలుకు రూ.8,100 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. 12 రాష్ట్రాల్లో సీసీఐ టపాస్ కిసాన్ మొబైల్ యాప్ కింద ఆన్లైన్లో ద్వారా జిన్నింగ్ మిల్లు కేంద్రాల్లో పత్తి కొనుగొలు చేస్తున్నారని తెలిపారు. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. గడిచిన సీజన్కు సంబంధించి సన్న వడ్ల బోనస్ డబ్బులను ప్రభుత్వం త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగొలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ అవుతాయన్నారు. నర్మేటలో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే ట్రయల్ రన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అద్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సీసీఐ కేంద్ర ఇన్చార్జి పంకజ్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో చేరికలు
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు సిద్దిపేట వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. కానీ నేడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. పట్టణంలో ఆంతర్గత రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అంబరాన్నంటిన దీపావళి సంబురాలుజిల్లా వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం తెల్లవారుజామునుంచే పల్లెల్లో, పట్టణాల్లో పండుగ కోలాహలం నెలకొంది. దీపకాంతులతో ఇళ్లు, దుకాణాలను సుందరంగా అలంకరించారు. గృహాల్లో, వ్యాపార సముదాయాల్లో, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీపూజలు, కేదారేశ్వర వ్రతాలు చేపట్టారు. చిమ్మని చీకట్లలో దీపాలు వెలుగులను విరజిమ్మాయి. వాడవాడలో యువతీయువకులు బాణాసంచా కాల్చారు. తారా జువ్వల మెరుపులు కనువిందు చేశాయి. –ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి
సిద్దిపేటకమాన్: పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని, అమరులైన పోలీస్ కుటుంబాలకు పోలీస్శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని సీపీ విజయ్కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్తూపం వద్ద సీపీ, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్ఎస్ఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో గౌరవ వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు యాదగిరి (సీఐ), జాన్విల్సన్ (ఎస్ఐ), రాజగోపాలచారి (ఎస్ఐ), చంద్రయ్య (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుళ్లు రామ్మూర్తి, ప్రకాశ్సింగ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా నిలుస్తామని తెలిపారు. ప్రజలకు సంక్షేమానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని అన్నారు. ఈ నెల 31వరకు పోలీస్స్టేషన్లలో ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సీపీ అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అమరుడైన ప్రకాశ్సింగ్ భార్య కౌసల్య తన భర్తను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోగా సీపీ.. అతడి సేవలను కొనియాడుతూ ఆమెను ఓదార్చారు. అమరులైన 191 మంది అధికారులు, సిబ్బంది పేర్లను అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ చదివి వినిపించారు. -
కలెక్టర్ ఇంట్లో ఆత్మీయ అతిథులు
● బాలసదనం పిల్లలతో పండుగ సంబరాలు ● స్వయంగా వండి, వడ్డించిన హైమావతిసిద్దిపేటజోన్: కలెక్టర్ ఇంట్లో ఆత్మీయుల సందడి.. పండుగ వేళ కలెక్టరే స్వయంగా వంటలు వండి, వడ్డించారు. వారితో కలిసి పండుగ సంబరాలు నిర్వహించారు. ఇంతకీ వారెవరనే కదా.. మీ సందేహం.. వారేనండి బాల సదనం పిల్లలు.. జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పిల్లల అవాస కేంద్రం బాలసదనం సందర్శించారు. అక్కడి పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగను వారితో కలిసి జరుపుకోవాలని నిర్ణయించారు. వెంటనే వారిని ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు కలెక్టర్ హైమావతి దీపావళి రోజున తన ఇంట్లో బాలసదనం పిల్లలతో సంబురాలను ఆనందంగా నిర్వహించారు. ముందుగా పిల్లలతో కలిసి లక్ష్మీ పూజ నిర్వహించి హారతి అందజేశారు. పిల్లలకు ఇష్టమైన పులిహోర, సేమియా, అన్నం, కూరలు చేసి దగ్గరుండి వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి క్యాంపు కార్యాలయంలో బాణాసంచా కాల్చారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు దీపావళి పండుగ రోజు కలెక్టర్ దేవుడిచ్చిన అమ్మలా ఆదరించారు. దీంతో పిల్లల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ సిద్దిపేటరూరల్: విధులను నిర్లక్ష్యంగా నిర్వర్తిస్తున్న నారాయణరావుపేట మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. రిజిస్టర్లో సంతకం చేసి ఆస్పత్రిలో వైద్యాధికారి బాపురెడ్డి లేకపోవడంతో ఆరా తీశారు. తరుచూ విధులకు గైర్హాజరవుతున్నారని తెలియడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. వృత్తికి న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పొద్దుతిరుగుడుకు అక్కన్నపేట అనుకూలం అక్కన్నపేట(హుస్నాబాద్): నూనె గింజల సాగును పెంపొందించడానికి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాలు గుర్తించారని, అందులో అక్కన్నపేట మండల ప్రాంతం అనువైనదిగా భావించి ఎంపిక చేశారని కలెక్టర్ హైమావతి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జాతీయ నూనె గింజల పథకం పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వంద శాతం సబ్సిడీతో మండలంలో 253మంది రైతులకు 500 ఎకరాలు సాగు చేసేందుకు పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతులు పంట మార్పిడి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఊరూరా ఉపాధి గుర్తింపు
● నవంబర్ 30 వరకు గ్రామసభలు ● 30లక్షల పని దినాలు లక్ష్యం ● జిల్లా యంత్రాంగం చర్యలుసిద్దిపేటరూరల్: ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు, జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కొత్త పనుల గుర్తింపునకు ఆలస్యం ఏర్పడింది. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో గ్రామసభల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహిస్తున్నారు. గ్రామసభల కీలకపాత్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నవంబర్ 30వ తేదీ వరకు పంచాయతీల్లో ఉపాధి గ్రామసభలు నిర్వహించనున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి పనులు చేపట్టేందుకు గ్రామసభలు కీలకపాత్ర వహించనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం 58 రకాల పనులు గుర్తిస్తున్నారు. గ్రామసభలను పూర్తి చేసి అందులో గుర్తించిన పనులను మండల పరిషత్, జిల్లా పరిషత్కు పంపి అనుమతి పొందనున్నారు. జిల్లా ఉన్నతాధికారుల అనుమతుల మేరకు కొత్తగా గుర్తించిన పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తారు. ప్రాధాన్యత మేరకు.. జిల్లాలోని మండలాల వారీగా ఉపాధి హామీ పనులతో పాటు భూగర్భ జలాలవృద్ధి, పాంపాండ్స్, మ్యాజిక్ సోప్ పిట్స్. కమ్యూనిటీ సోక్పిట్స్, నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, చెరువులు, కాల్వల్లో పూడికతీత వివిధ రకాల వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులను నమోదు చేసుకోనున్నారు. ఎక్కువ మొత్తంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులు వారి సమ్మతితోనే గుర్తించి చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. పని కల్పించేందుకు చర్యలు కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామసభలు నిర్వహించి పనులను గుర్తిస్తాం. వచ్చే నెల వరకు గ్రామసభలు నిర్వహిస్తాం. గుర్తించిన పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతాం. కూలీలకు పనితో పాటు నిర్దేశించిన రోజువారి కూలి డబ్బులు అందిస్తాం. జయదేవ్ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
కేర్ నామమాత్రం.. సేవలు తూతూమంత్రం
అస్తవ్యస్తంగా ప్యాలియేటివ్ కేర్ ● క్యాన్సర్ రోగులకు కానరాని సాంత్వన ● వేధిస్తున్న సిబ్బంది కొరత ● గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో దుస్థితిగజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ప్యాలియేటివ్ కేర్ సెంటర్ సేవలు నామమాత్రంగా మారాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులకు సాంత్వన కరువైంది. ఇన్ పేషంట్లకు మొక్కుబడి వైద్యం అందుతోంది. మందుల కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. సిబ్బంది కొరత కారణంగా ‘హోమ్ కేర్’ సేవలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నా పాలకులకు పట్టడంలేదు. –గజ్వేల్ క్యాన్సర్ బాధితులను అక్కున చేర్చుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం 2017లో రాష్ట్రంలోని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ప్యాలియేటివ్ కేర్ సెంటర్ను ప్రారంభించింది. ఆ తర్వాత గజ్వేల్తో పాటు ఆదిలాబాద్, మహబూబ్నగర్, చౌటుప్పల్, వరంగల్, జనగామ, ఖమ్మం ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో వైద్యుడు, ఫిజియోథెరపిస్టు, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్ఎంలు, నలుగురు ఆయాలు, హోమ్కేర్ ట్రీట్మెంట్ వాహనానికి సంబంధించి డ్రైవర్ను నియమించారు. వీరికి అవసరమైన మందులు, ఇతర ఖర్చుల బడ్జెట్ను కేటాయింపులు జరిపారు. ఈ బృందం 2018 మే నెల నుంచి 2019 జనవరి 31వరకు తమతమ కేంద్రాల పరిధిలోని 40 కిలోమీటర్ల వ్యవధిలో ఇంటింటి సర్వే జరిపింది. ఈ విధంగా గుర్తించిన అవసానదశ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను వెంటనే కేంద్రాల్లో చేర్పించుకొని నొప్పి నివారణ, మందులు ఇస్తూ వారు నిత్యం శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేలా కౌన్సెలింగ్ చేస్తూ ఊరటనివ్వాల్సి ఉంది. నిత్యం ఉదయం వేళల్లో పాలు, బ్రెడ్డు, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం, రాత్రి వేళలో భోజనం అందించాలి. ప్యాలియేటివ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరంగా కీమో థెరపి, రేడియో థెరపి అవసరముంటే సమీపంలో ఉండే ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రులకు తరలించాలి. వీరితో పాటు హోమ్కేర్ ట్రీట్మెంట్సైతం నిర్వహించాలి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స చేయించుకోలేక ఇంటి వద్దే ఉంటున్న వారిని తరచూ కలుస్తూ వైద్యం అందిస్తూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలి. కానీ ప్యాలియేటివ్ సెంటర్లలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నా అధికారులు దృష్టిసారించకపోవడం గమనార్హం. -
మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించండి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలను, బిల్లులను చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలుగా బిల్లులు రావడంలేదన్నారన్నారు. కలెక్టర్ పాఠశాలలను సందర్శిస్తూ భోజనాలు నాసిరకంగా వండుతున్నారని చెప్తున్నారని, కానీ వారికి రావాల్సిన బిల్లులను పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికై నా పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే నవంబర్ 1 నుంచి భోజనం వడ్డించడం నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
నేడు నాచగిరిలో గిరి ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రవీందర్గుప్తా, ఈఓ విజయరామారావు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. రేపు జోడో క్రీడాకారుల ఎంపిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి జిల్లా జోడో క్రీడాకారుల ఎంపిక ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరగనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జోడో క్రీడాకారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు భరత్రెడ్డి (924666472), చామంతుల భరత్(9505450223)లను సంప్రదించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించండి హుస్నాబాద్: గిరిజన గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న దినసరి కూలీలకు ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 40 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గెజిట్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. సాగు నీరు అందించండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): మిట్ట ప్రాంత రైతులకు సాగు నీరు అందించాలని చిన్నగుండవెల్లి, రాంపూర్ గ్రామాల రైతులు కోరారు. మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా వచ్చే సాగు నీటిని మిట్ట ప్రాంతాలకు పైపులైన్ ద్వారా అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట నీటిపారుదల కార్యనిర్వహకశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో రాంపూర్, చిన్నగుండవెల్లి గ్రామాలకు చెందిన రైతులు తిరుపతి, క్రాంతికుమార్, మల్లేశం, భూపతి రెడి, ప్రతాప్ రెడ్డి, మహేందర్, కనకరెడి, శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డి, రాజిరెడ్డి, కామలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పూలు అగ్గువ.. కొబ్బరి పిరం
నేడే వెలుగుల దీపావళి ● లక్ష్మీపూజలకు సిద్ధమైన జిల్లా ప్రజలు ● మార్కెట్లలో కొనుగోళ్ల సందడిప్రశాంత్నగర్(సిద్దిపేట): అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఆలయాలు, గృహాలను అందంగా ముస్తాబు చేశారు. లక్ష్మి, కేదారేశ్వరి పూజల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. వివిధ రకాల ప్రమిదల విక్రయాలు మార్కెట్లలో జోరుగా సాగాయి. రూ.1 నుంచి రూ.150 వరకు ప్రమిదల ధరలు పలుకుతున్నాయి. అయితే ఈసారి పూల ధరలు తగ్గాయి. బంతి పూలు కిలోకు రూ.30 నుంచి 50 వరకు పలుకుతున్నాయి. దీంతో భక్తులు పూలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. రైతులే మార్కెట్లో విక్రయాలకు తరలిస్తుండటంతో ధరలు తగ్గాయి. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ముఖ్య పట్టణాలలో బంతిపూల విక్రయాలు జోరుగా సాగాయి. చామంతి పూలు కిలోకు రూ.150 నుంచి రూ.200వరకు విక్రయిస్తున్నారు. అయితే కొబ్బరికాయల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్క టెంకాయ ధర రూ.30 నుంచి 45 వరకు పలుకుతుండటం గమనార్హం. జోరుగా బాణాసంచా విక్రయాలు జిల్లా కేంద్రంతో పాటుగా, ప్రధాన పట్టణాలలో బాణాసంచా విక్రయశాలలు వెలిశాయి. విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి వివిధ జిల్లాలకు టపాసులు హోల్సేల్గా విక్రయిస్తున్నారు. తగ్గిన బంగారం కొనుగోళ్లు -
పార్టీలకతీతంగా ఉదారత్వం
సిద్దిపేటరూరల్: ఆపద వస్తే పార్టీలు చూసేది లేదని, ప్రజలే తనకు ముఖ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దలింగారెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి ఇల్లు ఇటీవల విద్యుత్షాక్తో కాలిపోయింది. విషయం తెలుసుకున్న హరీశ్రావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ. 20వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అపద వస్తే పార్టీలు చూసేది లేదని ప్రజల క్షేమమే ముఖ్యమన్నారు. ప్రభుత్వం నుంచి సాయాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. దీపావళి శుభాకాంక్షలుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే హరీశ్రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగా దీపావళి అన్నారు. దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు.కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే హరీశ్రావు సాయం -
చెక్పోస్టులో ఏసీబీ సోదాలు
● రూ. 42,300 నగదు స్వాధీనం ● రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లిన అధికారులు జహీరాబాద్: మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్పోస్టులో సోదాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తనిఖీల్లో రూ. 42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏ ఎంవీఐ కిరణ్కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
రోల్ మోడల్గా నిలవండి
సిద్దిపేటజోన్: క్రమ శిక్షణతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బాగా చదివి రోల్ మోడల్గా నిలవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం స్థానిక బాలసదనం సందర్శించి దీపావళి పండుగ సందర్భంగా పిల్లలకు ముందస్తుగా స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. రోజూ ధ్యానం, యోగా చేయాలని, ఒత్తిడికి లోనుకాకుండా శారీరకంగా. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం బాలసదనం సిబ్బందితో మాట్లాడారు. తల్లిదండ్రులు లేరనే బాధ వారికి రాకుండా చూసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు మరమ్మతు చేయించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలన్నారు. శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న శిశువుల గురించి అరా తీశారు. నేడు మా ఇంటికి రండి బాలసదనం పిల్లలందరూ మా ఇంటికి రావాలని కలెక్టర్ స్వయంగా ఆహ్వానించారు. ఎవ్వరూ లేరనే భావన రావొద్దన్నారు. దీపావళి పండుగ సందర్భంగా వారికి నేనే స్వయంగా వంట చేసి భోజనం వడ్డిస్తానని కలెక్టర్ హైమావతి అధికారులతో అన్నారు. పిల్లలందరినీ సోమవారం తన క్యాంపు కార్యాలయానికి తీసుకురావాలని, అక్కడే అంతా పండుగ చేనుకుందామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శారదతో కలెక్టర్ అన్నారు. క్రమశిక్షణ, మంచి అలవాట్లు ముఖ్యం ఉన్నత స్థాయే లక్ష్యంగా చదవాలి కలెక్టర్ హైమావతి -
నేటి ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరూ అర్జీల దృష్ట్యా కలెక్టరేట్కు రావద్దని సూచించారు.మల్లన్న ఆలయంలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. 22 నుంచి ప్రత్యేక పూజలు ఆలయంలో కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ఈనెల 22 నుంచి నవంబర్ 2 వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నిత్యం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సామూహిక దీపోత్సవం, కార్తీక సోమవారాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నోములు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, హరికథలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం దరఖాస్తుల గడువు పెంపు సిద్దిపేటకమాన్: మద్యం దుకాణాల నిర్వహణకు చేపడుతున్న దరఖాస్తుల గడువును పెంచినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసమూర్తి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మొదట నిర్ణయించిన ప్రకారం ఈ నెల 18 చివరి తేదీగా నిర్ణయించడంతో ఆఖరి రోజు భారీగా 1,392 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. బీసీ బంద్ నేపథ్యంలో బ్యాంకులు మూసి వేసి ఉండటంతో దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పెంచినట్లు తెలిపారు. డిపాజిట్ ధర రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడం కూడా దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది. అదేవిదంగా ఈ నెల 23న నిర్వహించాల్సిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఈ నెల 27న కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వృథాగా భగీరథ నీరుచేర్యాల(సిద్దిపేట): తాగు నీటి సరఫరా పైపు లైన్ పగిలి మిషన్ భగీరథ నీరు వృథాగా పోయింది. మండల పరిధిలోని గుర్జకుంట క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పగిలింది. దీంతో నీరంతా వృథా అయ్యింది. హోరాహోరీగా పద్మశాలి ఎన్నికలు సంఘం అధ్యక్షుడిగా దేవదాసు విజయం గజ్వేల్: ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘం ఎన్నికల్లో బొల్లిబొత్తుల దేవదాస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్హాల్లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఒక్కరు మినహా దేవదాస్ ప్యానెల్ కార్యవర్గం విజయం సాధించింది. ఉపాధ్యక్షులుగా కోట కిశోర్, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లం రాజు, కోశాధికారిగా హనుమాన్దాస్లు ఎన్నికయ్యారు. సంయక్త కార్యదర్శి మాత్రం ప్రత్యర్థి ప్యానెల్కు చెందిన పాశుకంటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీ. రాజు గెలుపొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
270 కేంద్రాలు ప్రారంభించాం
జిల్లాలో నేటి వరకు 270 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 179 ఐకేపీ, 91 ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మిగతా కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 105 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉంది. ఆందుకు అనుగుణంగా 53 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడం జరిగింది. కొనుగోలుకు ఇబ్బంది కలుగకుండా తేమ శాతం 17 ఉండేలా ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేస్తాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ -
నిధులు రాక.. పనులు సాగక
టీయూఎఫ్ఐడీసీ నిధుల వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రధాన మున్సిపాలిటీలు సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్కు నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. దీంతో ఏళ్లతరబడి నిలిచిన పనులకు మోక్షం కలగడంలేదు. గజ్వేల్: మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ప్రతి మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను గత జూలై నెలలో పంపగా.. ఆమోదించి ఇటీవల విడుదల చేశారు. కానీ జిల్లాలో ఈ నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. పనుల ప్రారంభానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రధాన మున్సిపాలిటీలైన గజ్వేల్– ప్రజ్ఞాపూర్, సిద్దిపేటలకు నిధులు విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది.గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంప్రతిపాదనలు ఇలా.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైన ఆర్అండ్ఆర్ కాలనీతో కలుపుకొని 75వేలకుపైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి 20వార్డులు ఉన్నాయి. ఈ పట్టణ క్రమంగా పెరుగుతుండటంతో త్వరలోనే వార్డుల డీలిమిటేషన్కు కూడా రంగం సిద్ధమైంది. గతంతో పోలిస్తే కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీతోపాటు ఇతర కాలనీల్లో మరిన్ని సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారటం, కొన్ని కాలనీల్లో లైటింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మిషన్ భగీరథ నల్లాల వ్యవస్థ కూడా పూర్తిగా లేకపోవడం, ప్రధాన రోడ్లు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్లో ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత జూలైలో ఇక్కడి నుంచి టీయూఎఫ్ఐడీసీ నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రధానంగా ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధికి రూ.కోటి, ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు సుమారు మరో 1.15కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులు ఉన్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో 1.57లక్షల జనాభా, 43వార్డులు ఉండగా.. ఇక్కడ కూడా అదే తరహాలో పనులను ప్రతిపాదించారు. కానీ ఈ రెండు మున్సిపాలిటీలకు నిధుల విడుదలలో జాప్యం నెలకొనడం చర్చనీయాంశమైంది. ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న ఈ పనులకు ఈ నిధులతోనైనా మోక్షం లభించనుందని ఎదురుచూస్తున్నారు. కానీ భిన్నమైన పరిస్థితి నెలకొనడం కలవరానికి గురిచేస్తోంది.ప్రధాన మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ నిధులేవీ? సిద్దిపేట, గజ్వేల్కు నేటికీ విడుదలకాని వైనం హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలకు మాత్రమే మంజూరు కనీస వసతుల కల్పనకు రూ.15కోట్ల చొప్పున కేటాయింపు జిల్లాలో జోరుగా చర్చనీయాంశంనిధుల కోసం ఎదురుచూపు టీయూఎఫ్ఐడీసీ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ అంశం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందని మున్సిపల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కారణాలపై ఇంకా స్పష్టత లేదు. – బాలకృష్ణ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ -
ధాన్యం కొనుగోలు ఎన్నడో?
దుబ్బాక: రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవిలా తయారైంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను తీరా అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలతో అష్టకష్టాలు పడి కోతకోసి ధాన్యాన్ని అమ్ముకునేందుకు వస్తే కొనుగోలు లేక రైతులు పరేషాన్ అవుతున్నారు. మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ చెప్పడమే తప్పా ఆచరణలో కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చోట్ల ధాన్యం కాంటాలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడం.. ఇంకా చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల జాడనే లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. 105 టన్నుల ధాన్యమే కొనుగోలు వానాకాలంలో 3.60 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయడంతో కొనుగోలు కేంద్రాలకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అఽధికారుల అంచనాగా ఉంది. కాగా కేవలం జిల్లాలోని బెజ్జంకి, కొహెడ, హుస్నాబాద్ కేంద్రాల్లోనే కేవలం 25 మంది రైతుల నుంచి 105 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.ఇప్పటి వరకు 270 కేంద్రాలే.. జిల్లాలో వానాకాలంలో 439 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించగా.. ప్రస్తుతం కేవలం 270 కేంద్రాలే ప్రారంభం కావడం శోచనీయం. ఇంకా 169 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 179 ఐకేపీ, 91 ఫ్యాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక, చెల్లాపూర్, రాజక్కపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్తో పాటు చాలా చోట్ల కేంద్రాల జాడ లేవు.వర్షాల భయంతో.. వర్షాల భయంతో చాలామంది రైతులు ముందస్తుగానే వరికోతలు ప్రారంభించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిండిపోవడంతో గత్యంతరం లేక చాలా మంది రైతులు దొరికిన చోటల్లా కుప్పలు పోసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు అయిన దుబ్బాక యార్డుతో పాటు చాలా కేంద్రాల్లో ధాన్యం కుప్పలతో నిండిపోయాయి.కేంద్రాలకు పోటెత్తిన వడ్లు 270 కేంద్రాలే ప్రారంభం ఇంకా ప్రారంభంకాని 169 కేంద్రాలు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఇబ్బందులు పడుతున్న రైతులు -
93 దుకాణాలకు 2,518 దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు మొత్తం 2,518 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. చివరి రోజైన శనివారం ఆశావాహులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడానికి సిద్దిపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. సర్కిల్స్ వారీగా సిద్దిపేట 747, గజ్వేల్ 706, హుస్నాబాద్ 484, చేర్యాల 371, మిరుదొడ్డి 210 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గత పాలసీలో 4,166 దరఖాస్తులు రాగా ప్రస్తుతం 2,518 మాత్రమే వచ్చాయి. డిపాజిట్ ధర రూ.3 లక్షలకు పెంచడంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడానికి అనాసక్తి చూపినట్టు చెప్తున్నారు. 23న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా వైన్షాపులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. -
‘సాక్షి’ జోలికొస్తే ఖబడ్దార్
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ,అక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటూ తన కలంతో ఎండగడుతున్న సాక్షిపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దారుణం. ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటూ.. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు విధానాలను కూకటివేళ్లతో పెకిలిస్తూ మొదటి నుంచి ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి జోలికొస్తే ఖబడ్దార్. చంద్రబాబు, పవన్కల్యాణ్లు తమ తప్పుడు ధోరణిని మానుకోకుంటే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. సాక్షికి మాలమహానాడు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. – కాల్వ నరేష్, మాలమహానాడు రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులుఅరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారా..? సాక్షిపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రభుత్వాలకు ,ప్రజలకు మధ్యన వారధి పత్రికలు. ఫోర్త్ ఎస్టేట్పై దాడి అంటే ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపైనే దాడి చేసినట్లు. వాస్తవాలు రాస్తే దాడులు, కేసులు పెట్టడడం మంచి పరిణామం కాదు. దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో సాక్షిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామని చూడడమే అవుతుంది. సాక్షికి కూటమి సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. – పల్లె వంశీకృష్ణాగౌడ్, న్యాయవాది -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: గరీమా
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో విషజ్వరాలు, డెంగ్యూపై ఆరాతీశారు. పిల్లకు ఇచ్చే వాక్సిన్ను పరిశీలించారు. ఉద్యోగులు సకాలంలో హాజరై విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకులాల్లో మిగులు సీట్లు కేటాయింపుచేర్యాల(సిద్దిపేట): జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్లకు శనివారం చేర్యాలలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సమక్షంలో విద్యార్థినిలకు మిగులు సీట్లకు కౌనెలింగ్ చేసి అర్హులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ప్రత్యూష, జిల్లా సమన్వయ అధికారి పోలోజు నర్సింహాచారి, ప్రిన్సిపాల్తో పాటు 800 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు. ఎర్రోళ్లకు ఈటల పరామర్శచిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఎర్రోళ్ల తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం గంగాపూర్లోని ఆయన నివాసంలో ఈటల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గంగాపూర్ పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, పరశురాలు, నాగరాజు పాల్గొన్నారు. నియామక పత్రం అందుకున్న మణికంఠేశ్వర్ రెడ్డిహుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుస్నాబాద్కు చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్– 2 నియామక పత్రాన్ని అందుకున్నాడు. మణికంఠేశ్వర్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్ ఏసీటీఓ (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)గా పోస్టింగ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈయన తండ్రి శ్రీనివాస్రెడ్డి శంషాబాద్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి అనిత హుస్నాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్గా పని చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలిప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్ సిద్దిపేటఎడ్యుకేషన్: మన పూర్వీకులు జరుపుకునే సాంప్రదాయ పండుగల్లో శాసీ్త్రయ దృక్పథం దాగి ఉందని, అయితే ప్రస్తుతం ఆధునిక పోకడలతో అశాసీ్త్రయ పద్ధతులతో పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయిందని సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్కుమార్ అన్నారు. శనివారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పర్యావరణరహిత దీపావళి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయంగా నిర్వహించే ప్రతి పండుగకు ఒక శాసీ్త్రయత ఉందన్నారు. ఆధునిక కాలంలో మన జీవన విధానంతో పాటు పండుగలు సైతం పొల్యూట్ అయ్యాయన్నారు. తద్వారా అనేక రకాల అనర్థాలకు సమాజం గురువుతుందని చెప్పారు. తిరిగి పాత సాంప్రదాయ పద్దతుల్లో పండుగలను జరపుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. -
కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం
దుబ్బాక: నిజాలు నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి, మేధావులు తీవ్రంగా ఖండించాయి. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దారుణాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నాయి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు ఏపీలో సాక్షి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ పలువురు డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
నిజాలు రాస్తే దాడులా..?
నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నా సాక్షి పత్రికపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడడం సిగ్గుచేటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వ అరాచకపాలనను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేక పోతోంది. సాక్షిపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతుంది. కక్ష సాధింపు చర్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడొద్దు. మేం సాక్షికి అండగా ఉంటాం. – బి.భాస్కర్, సీపీఎం రాష్ట్ర నాయకులు ‘సాక్షి’పై బాబు సర్కార్ దుర్మార్గం చంద్రబాబు పెద్ద నియంత. మొదటి నుంచీ ప్రజాఉద్యమాలను అణగదొక్కుతూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుండు. అక్రమ మద్యం తయారీని వెలుగులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సాక్షిపై కావాలనే చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై అక్రమ కేసులు మంచి పరిణామం కాదు. చంద్రబాబు సర్కార్ చర్యలను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. -
చకచకా
ఇక భూ సర్వేలునెల రోజులుగా ఎదురుచూపులు● జిల్లాలో 26 మండలాలకు 15 మందే సర్వేయర్లు ● లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంతో తీరనున్న కొరత ● మొదటి బ్యాచ్లో 120 మంది ఉత్తీర్ణత ● నేడు సీఎం చేతుల మీదుగా లైసెన్స్లను అందుకోనున్న సర్వేయర్లులైసెన్స్డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత వీరికి సైతం లైసెన్స్లను జారీ చేయనున్నారు.సాక్షి, సిద్దిపేట: ఇక భూ సర్వేలు చక చకా కానున్నాయి. భూ సమస్య పరిష్కారం కోసం సర్వే చేయించేందుకు నెలల తరబడి ఎదురు చూసేవారు. ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు, సర్వేయర్ల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని నిర్ణయించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. జిల్లా వ్యాప్తంగా 352 మంది దరఖాస్తు చేశారు. అందులో మొదటి విడతలో 175 మందిని ఎంపిక చేయగా 150 మంది 50 రోజుల పాటు శిక్షణ పొందారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 120 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా నుంచి 120 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు పత్రాలను అందుకోనున్నారు. తప్పనున్న ఇబ్బందులు -
జాతీయ క్రీడలకు వేదికగా పటాన్చెరు
పటాన్చెరు: క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని..రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మూడు రోజులుగా పటాన్చెరులోని మైత్రి మైదానం వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ 14 బాలుర, బాలికల కబడ్డీ ,అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగం రాష్ట్రస్థాయి పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ...క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ..కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు. మెదక్ జట్టు ఘన విజయం శనివారం సాయంత్రం అభిమానుల మధ్య జరిగిన అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది..అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు పైన ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్రెడ్డి, ఎంఈవో లు పీపీ రాథోడ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముగిసిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడలు -
వేగంగా సమాధానం ఇవ్వాలి
సిద్దిపేటరూరల్: ప్రజలు వారి అవసరాల కోసం ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇచ్చిన దరఖాస్తులకు వేగంగా సమాచారం రూపంలో సమాధానం ఇవ్వాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో సమాచార హక్కు చట్టం– 2005 గురించి జిల్లాలోని అన్ని శాఖల పబ్లిక్ సమాచార అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాఖల వారీగా ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరితగతిన అర్జిదారులకు అడిగిన సమాచారాన్ని పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించాలని కోరారు. సమాచార హక్కు చట్టం అనేది పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పించే ఒక చట్టమన్నారు. ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ సంస్థలకు జవాబుదారీగా ఉండేలా చేయడం, అవినీతిని అరికట్టడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. జిల్లాలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ సెక్షన్ ద్వారా అర్జిదారులకు జవాబు ఇవ్వాలో ప్రతి అధికారి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టంకు సంబంధించి పీఐఓ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, ఎంసీఎచ్అర్డీ రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ భిక్షపతి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్టీఐ దరఖాస్తులపై సమీక్ష -
తమను పున్నామ నరకం నుంచి తప్పించకపోయినా బతికుండగా వృద్ధాప్యంలో చేరదీసి పట్టెడన్నం పెడతారని బిడ్డలపై ఆశలుపెట్టుకునే తల్లిదండ్రులెందరో. అయితే చాలామంది కొడుకులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారి ఆశల్ని వమ్ము చేస్తూ కనీస మానవత్వాన్ని మరిచిపోతున్నారు. పున్నా
● డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ● వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల మూసివేత ● బంద్లో పాల్గొన్న బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్దిపేటకమాన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన సిద్దిపేట బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. బంద్లో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట వారు బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు యాజమాన్యాలు ఒకరోజు ముందుగానే సెలవు ప్రకటించాయి. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని అన్నారు. -
రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
దుబ్బాక: పార్టీలు, రాజకీయలను పక్కన పెట్టి 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా పోరాటం చేయాలని బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని కుల సంఘాలతో బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు మచ్చ శ్రీనివాస్, పల్లె వంశీకృష్ణాగౌడ్, శ్రీరాం నరేందర్ ఉన్నారు.బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ -
ఎడ్యుకేషన్ హబ్లో ఎంఈఓ విచారణ
గజ్వేల్: ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. శుక్రవారం స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్లోని హైస్కూల్కు ఎంఈఓ వై.కృష్ణ వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులకు గొడ్డు కారం పెట్టిన విషయం నిజమేనని ఎంఈఓ నిర్ధారించారు. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. మెనూ అమలులోనూ నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. విచారణ అంశాలను జిల్లా విద్యాధికారికి నివేదించనున్నట్లు ఎంఈఓ ‘సాక్షి’కి తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
‘సాక్షి’పై దాడులు సరికావు● టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు రంగాచారి ● నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసనసిద్దిపేటకమాన్/సిద్దిపేటజోన్: పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్పై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు, విచారణ పేరుతో నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులపై దాడులను మానుకోవాలన్నారు. ప్రత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికా కార్యాలయాల మీద దాడులు ఆపాలన్నారు. లేదంటే భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు రాజిరెడ్డి, నాగరాజు, రంగధాంపల్లి శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, యాదగిరిగౌడ్, జనార్ధన్, శ్రీనివాస్, మైసారెడ్డి, రవి, నరేష్, సాయి, ఇంద్ర, సంతోష్, మల్లారెడ్డి, రాజబాబు, అరుణ్, శ్రీకాంత్, శ్రీనాథ్, చందు, రాజు, వంశీ, స్వామిగౌడ్, ముంజ గిరి, వెంకట్, నరేష్, కృష్ణ, వెంకట్, గణేష్, గణేష్బాబు, పరశురాములు, దయానంద్, రజనీకాంత్, దర్శన్, దయానంద్, రాజు, సతీష్, ఇంద్రసేనారెడ్డి, సంతోష్, శ్రీకాంత్, వెంకటేష్, కుమారస్వామి, తులసి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.అక్రమ కేసులు సరికాదు కథనాలను ఆధారంగా చూపుతూ సాక్షి పత్రిక ఎడిటర్పై ఏపీ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. అభ్యంతరం ఉంటే చట్టపరమైన, సామరస్యంగా దారులలో వెళ్లాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిదీ. – తిరుపతి రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేసులు ఉపసంహరించాలి సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికలపై వత్తిడి సరికాదు. ఎడిటర్ను లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేసినట్టుగా ఉంది. ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరించేలా చర్యలు ఉండొద్దు – తిరుమల్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
1,250 మద్యం దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు 1,250 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు శుక్రవారం 688 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు మొత్తం 1,250 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సర్కిల్ వారీగా సిద్దిపేట 380, గజ్వేల్ 318, హుస్నాబాద్ 295, చేర్యాల 177, మిరుదొడ్డి 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుకు శనివారం చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఎర్రోళ్లను పరామర్శించిన కేటీఆర్చిన్నకోడూరు(సిద్దిపేట): ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం గంగాపూర్లోని ఆయన నివాసంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండిహుస్నాబాద్రూరల్: ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ మొక్కజోన్న విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. రైతులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొంటే పంటల దిగుబడులు పెరుగుతాయన్నారు. విచ్చల విడిగా రసాయన ఎరువులను వేసి పెట్టుబడుల భారం పెంచుకోవద్దన్నారు. స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించండిసిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచేందుకు స్కావెంజర్లను నియమించారన్నారు. రెండేళ్లలో 9 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ధర్నాలో సహాయ కార్యదర్శి రవికుమార్, రాములు, కవిత, రజిత పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి సిద్దిపేటరూరల్: జిల్లావ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ పత్తి పంట చేతికి అందే దశలో గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 10,075కు పెంచి కొనుగోళ్ళు చేపట్టాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. -
మంచి సంస్కృతి కాదు
సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను సాకుగా చూపి ఏపీ పోలీసులు సాక్షి ఎడిటర్ దనంజయ రెడ్డి, పాత్రికేయుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మంచి సంస్కృతి కాదు. కథనాల మీద అభ్యంతరం, ఆక్షేపణలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. సాక్షి ఎడిటర్ పైన అక్రమ కేసులు నమోదు చేయడం దారుణం. – వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్బందులకు గురిచేయొద్దు నకిలీ మద్యం అంశంపై కథనాలు రాసిన సాక్షిపై తప్పుడు కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమే. విచారణ పేరిట సాక్షి కార్యాలయంలో పోలీసుల హడావిడి సరికాదు. కథనాలపై ఆక్షేపణ ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి. కానీ పత్రిక కార్యాలయంలో సోదాల పేరిట ఇబ్బందులకు గురిచేయద్దు. – అంజయ్య, ప్రెస్ అకాడమీ మాజీ సభ్యుడు -
● చెప్పినట్లు వినకపోతే బెదిరింపులు ● వీరిని బదిలీ చేయాలంటూ స్థానిక నేతల ఫిర్యాదులు ● అధికార పార్టీ నేత దూషణతో పీఎస్లో హౌసింగ్ ఏఈ ఫిర్యాదు ● కలెక్టర్కు మొరపెట్టుకున్న ఓ మండల అధికారి
నేతల పోకడ ఇలా..● ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నంగునూరు మండల అధికార పార్టీ నాయకుడు సంబంధిత హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా ఎంపీడీఓ, కలెక్టర్ను సైతం దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. సదరు నేతపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది. దూషించినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. ● నంగునూరు మండల పరిధిలో తాము చెప్పిన పనులు చేయాలని ఓ అధికార పార్టీ నేత పరిషత్ కార్యాలయ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గత 29న కలెక్టర్ను సదరు అధికారి కలిసి తాము ఇక్కడ పని చేయలేమని మొరపెట్టుకున్నారు. కలెక్టర్ మందలించినా నేతల్లో మాత్రం మార్పురాకపోవడం గమనార్హం. నంగునూరు మండలంలో పని చేయడం ఇబ్బందిగా ఉందని ఎంపీడీఓ, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తన దృష్టికి తీసుకవచ్చారని ఈ నెల 8న విలేకర్లతో చిట్ చాట్లో స్వయంగా సీపీ విజయ్ కుమార్ వెల్లడించిన విషయం విదితమే. ● నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌసొద్దిన్కు చెందిన బైక్ను ఆగస్టు 2న గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామ పంచాయతీ విధుల్లో భాగంగా వైకుంఠధామం వద్ద బైక్ను పార్క్ చేసి, గ్రామ నర్సరీని పరిశీలించేందుకు గౌసొద్దిన్ వెళ్లారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై పెట్రోల్ పోసి దహనం చేశారు. దీంతో రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఎవరన్నది తేలలేదని సమాచారం. -
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● పీహెచ్సీ, కస్తూర్బా పాఠశాల సందర్శనసిద్దిపేటరూరల్: విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులతో ఓపికతో ఉంటూ వైద్యం అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం రాఘవాపూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ మెనూ పాటిస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని, రోజువారీగా వ్యాయామం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం కావాలి
● ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా ● వర్గల్లో కార్యకర్తల అభిప్రాయ సేకరణవర్గల్(గజ్వేల్): కార్యకర్తల అభీష్టం మేరకే నాయకత్వ ఎంపిక జరగాలనే వినూత్న కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. పార్టీ పటిష్టతకు, ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ ఫంక్షన్హాల్లో డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, మర్కూక్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం మెదక్ జిల్లాలో అబిప్రాయ సేకరణ పూర్తి చేశామని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో జరుగుతోందన్నారు. ఈనెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షుల ఎంపికను ప్రకటిస్తామన్నారు. మండల, గ్రామ స్థాయిలో కూడా ఇదే పద్ధతిలో నాయకత్వ ఎంపిక జరుగుతుందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్లు జగదీశ్వర్ రావు, నజీర్ అహ్మద్, వరలక్ష్మి, సంతోష్ గుప్త, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై నిర్లక్ష్యమేలా?
గజ్వేల్రూరల్: విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీజేపీ, బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం’ శీర్షికన ప్రచురితమైన కథనం మేరకు ఆయా పార్టీల నాయకులు పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎడ్యుకేషన్ హబ్లను సందర్శించారు. విద్యార్థులతో మట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మధ్యాహ్న భోజన బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కార్యక్రమాల్లో బీజేపీ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు అశోక్గౌడ్, నాయకులు మన్నె శేఖర్, అరవింద్, శ్రీనివాస్, కుమార్, చంద్రం, రాజు, మహేందర్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మోహన్బాబు, వర్గల్ మండల అధ్యక్షుడు స్వామిగౌడ్, జగదేవ్పూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సంఘటితంగా ఉద్యమిద్దాం
● 18న బంద్ జయప్రదం చేద్దాం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు సిద్దిపేటజోన్: ‘రిజర్వేషన్ల సాధనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ ఏకమై సంఘటితంగా ఉద్యమిద్దాం. 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులోని ఓ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈనెల 18న నిర్వహించనున్న బంద్ విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టగా కోర్టు కేసులతో ఆశలపై సందిగ్ధం నెలకొందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన చివరి దశలో ఉందని, వత్తిడి తెచ్చి సాధించుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు చంద్రం, సర్పంచ్ ఫోరం రాష్ట్ర జేఏసీ సెక్రటరీ సుభాష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా సీపీఐ సెక్రటరీ పవన్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నవీన్ గౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు శ్రీహరి, శ్రీనివాస్,రాజేశం, వెంకట్, ఎల్లయ్య, శ్రీనివాస్,నరేందర్ పాల్గొన్నారు. -
ఆ షాపులపైనే నజర్
జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రక్రియ జోరందుకుంది. 2025–27కి గాను వైన్ షాప్ల కేటాయింపు కోసం ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 26 నుంచి ప్రారంభం కాగా, 18వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో లిక్కర్ వ్యాపారులు 2023–25లో వైన్షాపుల వారీగా జరిగిన మద్యం అమ్మకాలపై దృష్టిసారించారు. ఈ నెల 23న లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 93 వైన్స్ షాపులు ఉండగా, ఐదు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24, గజ్వేల్ పరిధిలో 26, చేర్యాలలో 16, హుస్నాబాద్లో 16, మిరుదొడ్డిలో 11 ఉన్నాయి. రిజర్వేషన్లలో ఎస్సీలకు 9, గౌడలకు 16 షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్1,2023 నుంచి నవంబర్ 30,2024 వరకు రూ.1,415.32 కోట్లు, డిసెంబర్ 1,2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు రూ.959.98కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇలా జిల్లా మొత్తం 2023–25లో ఇప్పటి వరకు రూ.2,375.3కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఒక్కో షాపులో రూ.30కోట్లకు పైగా.. జిల్లా వ్యాప్తంగా 11 వైన్స్ దుకాణాలలో ఒక్కో షాపులో రూ.30కోట్లకుపైగా విక్రయాలు జరగడం విశేషం. సిద్దిపేట పట్టణంలో షాప్ నంబర్–5లో మొత్తంగా రూ.37.76కోట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే జగదేవ్పూర్ మండలంలో తిగుల్ నర్సాపూర్ వైన్ షాప్లో రూ.34.44కోట్లు, మర్కూక్లో రూ.32.7కోట్ల విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో లిక్కర్ వ్యాపారులు ఏ ఏరియా వైన్స్లో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయనేదానిపై ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలో పరిచయం ఉన్న వారితో వ్యాపారులు లిస్టులను తెప్పించుకున్నారు. ఎంత వ్యాపారం జరిగితే ఎంత లాభం ఉంటుందన్న విషయంపై లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూ.55లక్షల చెల్లించే షాపులలో ఎక్కువ విక్రయాలు జరిగే వాటిపై సైతం నజర్ పెట్టారు. మద్యం వ్యాపారులు గ్రూప్ల వారీగా హోటల్స్, లాడ్జీలలో సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్ని షాప్లకు.. ఎక్కడి షాపులకు టెండర్లు వేయాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. రేపటితో ముగియనున్న గడువువైన్స్ షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వతేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 561 దరఖాస్తులే వచ్చాయి. 2023–25లో 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు 300 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్కిల్ వారిగా సిద్దిపేట 163, గజ్వేల్ 159, హుస్నాబాద్ 145, చేర్యాల 76, మిరుదొడ్డి 18 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే జిల్లాలో 9 షాప్లలో ఒక్క దరఖాస్తు రాలేదు. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట–15, 16, గజ్వేల్ పరిధిలోని నంబర్లు 27, 40, 41, మిరుదొడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో 88, 91, 92, 93 నంబర్ షాప్లకు ఇప్పటి వరకు దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం వైన్ షాప్ల కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ నెల 23న డ్రా ద్వారా షాప్లను కేటాయిస్తాం. – శ్రీనివాస మూర్తి, ఈఎస్ 11 వైన్స్ షాపులలో రూ.30 కోట్ల చొప్పున అమ్మకాలు లెక్కలేస్తున్న మద్యం వ్యాపారులు జిల్లాలో 93 దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు 561 -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● కలెక్టర్ హైమావతి ● సివిల్సప్లై, డీఆర్డీఓ అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లు, అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లై శాఖ అందించిన మార్గదర్శకాల మేరకు కొనుగోలు చేయాలన్నారు. ఈ సీజన్లో 6లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 239 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కొనుగోలు చేయగానే గన్నీబాగుల్లో నింపి మిల్లులకు పంపించాలని తెలిపారు. మిల్లులో సైతం తేమ శాతం పరిశీలించాలన్నారు. మిల్లర్లు అగ్రిమెంట్ చేసుకుని బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వరి ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్ ఎంట్రీ చేయాలన్నారు. ఫిజికల్ స్టాక్ , రిజిస్టర్ ఎంట్రీ సమానమవ్వాలన్నారు. లేబర్ కొరత లేకుండా చూసుకుని, ఎక్కడైనా ధాన్యం మళ్లించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ తనూజ, డీఎం సీఎస్ ప్రవీణ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డీటీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టుద్వారా పంపిణీ చేస్తున్నాం నూతనంగా వస్తున్న ఓటర్ కార్డులను పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనీ బీఎల్ఓ లకు ఐడీ కార్డ్ ల పంపిణీ పూర్తి చేశామన్నారు. నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, జిల్లాలో చనిపోయిన వారిని గుర్తించి, మిగతా వారి వయస్సు ధ్రువీకరణను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాల బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రత ఉంటుందని చెప్పారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మృతి చెందిన విషయంపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావదని హెచ్చరించారు. రాత్రి వేళ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. -
మంత్రి వ్యాఖ్యలు సరికావు
విద్యార్థి కుటుంబ సభ్యుల రాస్తారాకోహుస్నాబాద్: జిల్లెల్లగడ్డ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థి వివేక్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేక్ ఆటలాడుతూ ప్రమాదవ శాత్తు మృతి చెందాడని మంత్రి అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ల విచారణ పూర్తి కాకుండానే వ్యాఖ్యానించడంపై కేసు నిర్వీర్యం చేసినట్లేనని అన్నారు. వివేక్ మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివేక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి
సీపీ విజయ్కుమార్ గజ్వేల్రూరల్: పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. గురువారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్, పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ విజయ్కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి, రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గజ్వేల్: మనోధైర్యంతో ముందుకుసాగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రముఖ మానసిక వికాస నిపుణుడు వీరేందర్ అన్నారు. వర్గల్ మండలం వేలూరు గ్రామంలో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత పులి రాజు రచించిన ‘వేలూరు ఆత్మహత్యల గోస’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన వీరేందర్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోయే మనస్తత్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధ వ్యహకర్త కల్నల్ జీజే రావు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు తనవంతుగా సెప్టెంబర్ 10 సినిమా తీశానని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. సమస్యలు ఎదురైనపుడు దాచుకోకుండా, బంధువులకు, సన్నిహితులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పెద్ది రాజు, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటఎడ్యుకేషన్: పర్యావరణాన్ని పరిరక్షించడంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అన్నారు. గురువారం స్థానిక కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎకో బజార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో విద్యార్థులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణహిత స్టాల్స్ ను పరిశీలించి అభినందించారు. అనంతరం విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, వ్యాసరచన తదితర పోటీల నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతుల అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయులను వేయొద్దని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిన్నకోడూరు, అల్లీపూర్, పెద్దకోడూరు, మాచాపూర్, గంగాపూర్ ఉన్నత పాఠశాలల్లో సమస్యల సేకరణ, పభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసి, ఖాళీగా ఉన్న ఎంఈఓ, జిల్లా ఉప విద్యాధికారుల పోస్టులు భర్తీ చేసి వారి ద్వారా పాఠశాలల పర్యవేక్షణ చేయాలన్నారు. పీఆర్సీ వెంటనే అమలు చేసి, ఐదు డీఏలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, కార్యదర్శి దేవ ఋషి, జిల్లా నాయకులు జానికి రాములు, శివాజీ, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం
● అర్ధాకలితో విద్యార్థులు విలవిల ● కలుషిత నీటితో చర్మ రోగాలు ● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలుగజ్వేల్/గజ్వేల్ రూరల్: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధునాతన ప్రమాణాలతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం మెతుకులే దిక్కవుతున్నాయి. మరోవైపు కలుషిత నీటితో చర్మరోగాల బారిన పడి అల్లాడుతున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పట్టణంలోని ‘సాక్షి’ బాలుర ఎడ్యుకేషన్ హబ్ను సందర్శించింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హైస్కూల్కు చెందిన విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తంగా 529 విద్యార్థులు ఉండగా, మధ్యాహ్న భోజన సమయానికి 509మంది ఉన్నారు. వారి భోజనాన్ని పరిశీలించగా పేట్లల్లో గొడ్డుకారం కనిపించింది. కూరలు వండటం లేదా? గొడ్డుకారంతో ఎందుకు తింటున్నారు? అని అడిగితే కూరలు అయిపోయాయని కారం వేస్తున్నారంటూ బదులిచ్చారు. కారాన్ని తినలేకపోతున్నామని అర్ధాకలితోనే ఉంటున్నామని చెప్పారు. ఇదే క్రమంలో వంట గదిలోకి ‘సాక్షి’ వెళ్లి చూడగా ఓ మహిళ విద్యార్థుల ప్లేట్లల్లో కారం పొడి వేస్తూ కనిపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఈ రోజు పిల్లలు ఎక్కువగా రావడం వల్ల కూరలు అయిపోయాయని చెప్పడం గమనార్హం. మరో విషయమేమిటంటే భోజనాన్ని పిల్లలే తమ ప్లేట్లలో వేసుకోవడం కనిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ప్లేట్లను కడగడం, నేలపైనే కూర్చొని తినడం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పిల్లలు ఏం తింటున్నారు? వారికి భోజనం సరిపోయిందా? లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన ఉపాధ్యాయులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆఫీస్ రూమ్లో ఉండటం గమనార్హం. ఇదే హబ్లోని బాలుర జూనియర్ కళాశాలను సైతం ‘సాక్షి’ సందర్శించింది. ఈ కళాశాలలో 571 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా ఇదే ప్రాంగణంలోని హాస్టళ్లల్లో ఉంటున్నారు. కలుషిత నీటితో పిల్లలకు చర్మ రోగాలు వచ్చాయి. ఒళ్లంతా దద్దుర్లు, కురుపులతో అల్లాడుతున్నారు. మరికొందరు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాలికల ఎడ్యుకేషన్ హబ్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణం దృష్టిసారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. -
అందరి అభీష్టంతోనే ఎంపిక
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం ● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ జ్యోతి రౌటేలా ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నచ్చిన వ్యక్తే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికవుతారని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగదీశ్, నజీమ్ అహ్మద్, వరలక్ష్మితో కలిసి జ్యోతి రౌటేలా సిద్దిపేట అర్బన్, పట్టణం, రూరల్, నారాయణరావుపేట మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కష్టపడే నాయకుడ్ని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ప్రజాధరణ ఉన్న నాయకుని నియమించడానికే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉంటుందన్నారు. దళిత, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రధా ని మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్ నియంతృత్వ పాలన చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చే యడమే తమ లక్ష్యం అన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష ఆశావహులు కమిటీకి దరఖాస్తులు అందజేశారు. -
ఇదేం బువ్వ!
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. మధ్యాహ్న భోజనం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉడికీ ఉడకని అన్నం, అరకొర కూర, నీళ్లచారే అందిస్తుండటంతో విద్యార్థులు అర్ధాకలితోనే ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పచ్చిపులుసుతో వడ్డిస్తుండటం చూసి సాక్షాత్తు కలెక్టర్ హెచ్చరించినా సంబంధిత అధికారుల తీరు మారకపోవడం గమనార్హం. బుధవారం సాక్షి పలు పాఠశాలలను సందర్శించగా విద్యార్థులకు మాడిన అన్నం, నీళ్ల చారుతోనే వడ్డిస్తుండటం కనిపించింది. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 80వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజూ 64వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రూ.6.78 కేటాయించగా, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.11.17 కేటాయించారు. దీనికి తోడు కోడి గుడ్డుకు రూ.6 అదనంగా అందిస్తున్నారు. బియ్యం ప్రభుత్వమే అందిస్తోంది. కూరగాయలు, ఇతర వంట సరుకులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీసుకువచ్చి భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే విద్యాశాఖ ఇచ్చిన మోనూ ప్రకారం కూరలు, వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆహారం రుచిగా, శుచిగా ఉండటం లేదని, సగం కడుపే నిండుతోందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో 1,933 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ అధికారులు రోజూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ.. సక్రమంగా అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంలేదని, ప్రధానోపాధ్యాయులు అసలే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులు, ఎంఈఓలు, కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తీరును కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించగా పచ్చి పులుసుతో వడ్డిస్తుండటం.. మోనూ పాటించకపోవడాన్ని గుర్తించారు. దీంతో నంగునూరు మండలం బద్దిపడగ ప్రధానోపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. అలాగే తోర్నాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. గతంలో ఇర్కోడ్ పాఠశాలలో ఇదే దుస్థితి. సాక్షాత్తు కలెక్టర్ ఎదుటనే మధ్యాహ్న భోజనం అమలు ఈ విధంగా ఉంటే, మిగతా సమయాలలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు. మధ్యాహ్న భోజనం నాసిరకం కానరాని మెనూ.. అందని పౌష్టికాహారం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి సాక్షాత్తు కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు సగం గంటెడే కూర మధ్యాహ్న భోజనంలో సగం గంటెడే కూర వేస్తారు. మళ్లీ వేయరు, మిగతా అన్నం చారుతోనే సరిపెట్టుకోవాలి. మోనూ ప్రకారం పాటించడంలేదు. కలెక్టర్, అధికారులు వస్తున్నారని తెలిస్తేనే కూరలు అందిస్తారు. మిగతా రోజుల్లో సగం కడుపుకే తినాల్సి వస్తోంది. –పేరు చెప్పడానికి ఇష్టపడని, ఓ విద్యార్థి ఆవేదన -
లింగనిర్ధారణ చేపడితే చర్యలు
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అడ్వైజరీ కమిటీ సమావేశంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చట్టవిరుద్దంగా అబార్షన్లు చేపడితే చర్యలు చేపడతామన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు డీ ఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ, డాక్టర్ రమ్య మాధురి, డీపీఆర్ఓ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం కావాలి ● ఓట్ల గల్లంతుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్లో ఓట్ చోరీపై భారీ ర్యాలీ హుస్నాబాద్: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగిస్తూ, ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్లో బుధవారం ఓట్ చోరీపై భారీ ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓట్ చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఉంచారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించుకొని ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందన్నారు. చంఢీగఢ్లో పని చేసే హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పురన్ కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదన్నారు. ఆయన భార్య మృత దేహంతో ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారన్నారు. ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తాం.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే కుట్రకు పాల్పడుతున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీశ్రావులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. విద్యార్థి మృతి దురదృష్టకరం హుస్నాబాద్రూరల్: మండల పరిధి పోతారం (ఎస్)లోని గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థి వివేక్ మృతిగల కారణలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆడుతున్న సమయంలో పడిపోయి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మరేదైన కారణలు ఉంటే పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. విద్యార్థి మృతిని రాజకీయం చేయవద్దని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం అందించి బాసటగా ఉంటుందన్నారు. నిత్యం గురుకులాలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు.హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ ఓట్ చోరీపై సంతకాల సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. -
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి
సీపీ విజయ్కుమార్ సిద్దిపేటకమాన్: బాణా సంచా విక్రయాలకు అను మతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకునే యజమానులు సంబంధిత ఏసీపీల అనుమతులు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాణాసంచా దుకాణాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 67100కు ఫోన్ చేయాలని తెలిపారు. దుబ్బాక: పట్టణంలోని జెడ్పీజీహెచ్ఎస్ జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు బి.రజిత రాష్ట్ర ఉత్తమ మెంటర్ –2025 పురస్కారం అందుకున్నారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన మనక్ మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నుంచి రజిత పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా రజితను పాఠశాల హెచ్ఎం భూపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో రామవరంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డు ఎత్తుగా.. ఇళ్లు దిగువకు ఉండటంతో వర్షపు నీరు చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. త్వరగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. సిద్దిపేటకమాన్: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21నుంచి 24వరకు పోలీస్స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నివారణలో పోలీసులు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీ ఉంటుందన్నారు. ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు అభ్యర్థులకు సీపీ కార్యాలయంలో బహుమతుల ప్రదానం చేసి, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. -
అవినీటి అధికారులపై వేటు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకు పోయి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మూకుమ్మడి బదిలీలు జరగనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిల్లో జిల్లాలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇలాంటి అధికారులపై దృష్టిసారించిన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మూడేళ్లకోసారి బదిలీ ఎక్కడ? నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేతల పంచన చేరుతున్న కొందరు అధికారులు ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకేచోట కదలకుండా ఉన్నారంటే ఈ అధికారులు ఏ స్థాయిలో అక్రమార్జన కూడగట్టారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈశాఖలో ఒక చీఫ్ ఇంజనీర్, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 24 డీఈ పోస్టులున్నాయి. అలాగే సుమారు 80కిపైగా ఏఈలు, ఏఈఈలు పనిచేస్తున్నారు. ఖాళీలు పోగా సుమారు 120మందికి పైడా ఇంజనీరింగ్, టెక్నికల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్ద కాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులున్నారంటే ఏ స్థాయిలో వీరి ఆగడాలు సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి కోసమే ప్రత్యేక బదిలీలురాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజనీరింగ్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదుగురు డీఈలకు, 11 మంది ఏఈఈలకు స్థాన చలనం కలిగింది. అయితే ఈ బదిలీలతో సంబంధం లేకుండా సంగారెడ్డి జిల్లా కోసం ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వందల కోట్లు అక్రమార్జనకు మరిగిన ఈశాఖ అధికారులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ బదిలీల విషయం ముందే పసిగట్టిన ఈ అక్రమార్కులు మళ్లీ మంచి పోస్టింగ్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం చెరువుల ఆక్రమణదారులతో చెట్టపట్టాల్ వందల చెరువుల అన్యాక్రాంతానికి పరోక్ష సహకారం కోట్లలో అక్రమాస్తులు కూడగట్టిన ఇంజనీరింగ్ అధికారులు త్వరలో జారీ కానున్న బదిలీల ఉత్తర్వులు!సంగారెడ్డి ప్రాంతంలో సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చెరువుల కబ్జాదారులతో చేతులు కలిపారు. కంచే చేను మేసిన చందంగా చెరువులను కాపాడాల్సిన ఈ అధికారి వీటిని కబ్జా చేస్తూ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా వ్యవహరించారు. చెరువుల్లోంచి మట్టిని అక్రమ రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. పైగా చెరువులను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చాలు.. పెద్ద మొత్తంలో దండుకోవడం, ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంలో సదరు అధికారి ఆరితేరారు. రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారిపై ఇప్పుడు బదిలీ వేటు వేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.పటాన్చెరు ప్రాంతంలో సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న మరో ఇంజనీరింగ్ అధికారి చెరువుల కబ్జా రాయుళ్లతో చెట్టపట్టాలేసుకున్నాడు. సుమారు నాలుగు వందలకు పైగా చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర వాటర్బాడీలకు ఎన్ఓసీలు జారీ చేసి రూ.వందల కోట్లు వెనకేసుకున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పైగా చెరువులను కబ్జా చేసే అక్రమణదారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం అయ్యేందుకు పరోక్షంగా సహకరించాడు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈ అధికారికి స్థానచలనం కల్పించాలని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
సేంద్రియం సాగుతోనే ఆరోగ్యం
సిద్దిపేటరూరల్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా నూతన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ సాగు చేపట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం మండల పరిధిలోని తోర్నాలలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వంగడాలను, కొత్త పద్ధతులను పాటిస్తూ రసాయనాలు వాడకుండా సాగు చేపట్టాలన్నారు. యూరియా అధికమోతాదులో వాడడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు. మేలురకమైన పద్ధతులతో సేంద్రియ సాగుచేపట్టి మంచి ఆహారాన్ని పొందాలన్నారు. తాను వ్యవసాయం చేశానని, అన్ని పంటలు పండించే ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉందన్నారు. అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులే మేలు రైతు వంగ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సాంకేతికత వినియోగం ద్వారానే రైతు ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, సేంద్రియ సాగుతో భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి సంతోష్ కుమార్, ఏడీఏ పద్మ, అసోసియేషన్ డీన్ ఏజీ కాలేజీ సిరిసిల్ల సునీత దేవి, శాస్త్రవేత్తలు పల్లవి, రమాదేవి, మోహన్, ఏఓ నరేశ్, ఏఈఓ గీతా, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కావొద్దు జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యుటేషన్, ఫీల్డ్ ఎంకై ్వరీ, పేరుమార్పు, రకం, విస్తీర్ణం మార్పు, నేషన్ఖాతా, పీఓబీ, సాదాబైనామా వంటి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సాగులో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి కలెక్టర్ హైమావతి తోర్నాల విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు -
అమ్మో..
నకిలీ లెక్చరర్లు!●జిల్లా వ్యాప్తంగా 20 మంది ●తప్పుడు పత్రాలతో కొలువులు ●ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ల గుర్తింపు ●ఇటీవల 172 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు పలువురు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని ఇంటర్ విద్యా శాఖ గుర్తించింది. జిల్లాలో ఇరవై మంది లెక్చరర్లు ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఉన్న ఫేక్ సర్టిఫికెట్లను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు పనిచేస్తున్న 3,800మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను 2023 మేలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా జిల్లా నుంచి 172 మంది ఉన్నారు. సాక్షి, సిద్దిపేట: రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అయిన లెక్చరర్లను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. దీంతో లెక్చరర్లకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లను ఇంటర్మీడియెట్ విద్యాశాఖ పరిశీలన చేసింది. పలువురు ఇతర రాష్ట్రాల్లో ఆయా యూనివర్సిటీలలో సంబంధిత కోర్సులు లేకపోయినా ఆ కోర్సు చదివినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్గా ఉద్యోగం పొందిన వారిలో ఆందోళన మొదలైంది. దాదాపు 20 మంది ఫేక్ సర్టిఫికెట్లు జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పొందిన 172 మంది అధ్యాపకులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వరంగల్ ఆర్జేడీ ఇటీవల పరిశీలించారు. ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతోపాటు బోనఫైడ్ పత్రాలనూ ఆయా యూనివర్సిటీలలో ఇంటర్ విద్యాశాఖ చెక్ చేయించింది. అందులో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దాదాపు 20 మంది చదివినట్లు సర్టిఫికెట్లను అందించారు. పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దూరవిద్య కేంద్రాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించారు. ఆ వర్సిటీకీ యూజీసీ గుర్తింపు ఉందా? ఆ కోర్సు ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు పదోతరగతి సర్టిఫికెట్లపై పుట్టిన తేదీలను మార్చారు. 14 ఏళ్ల పాటు వరుసగా సర్వీసులో ఉన్న వారిని క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకు విరుద్దంగా మధ్యలో సర్వీస్ బ్రేక్ అయిన వారిని సైతం హడావుడిగా క్రమబద్ధీకరించినట్లు తెలిసింది. ●నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అధ్యాపకులుగా క్రమబద్ధీకరణ పొందిన వారిలో గుబులు మొదలైంది. ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. వీరు ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు వివిధ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. డబ్బులు వెచ్చించి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పరిశీలన జరుగుతోంది లెక్చరర్లను ప్రొబేషనరీ పీరియడ్ నుంచి పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆర్జేడీ పరిశీలించారు. మన రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలలో చదివిన వారివి చెక్ చేశారు. ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీలలో పలువురు చదివినట్లు సర్టిఫికెట్లు అందించారు. వాటిని పరిశీలించకుండా పక్కన పెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయలేదు. త్వరలో వాటిపై ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. – రవీందర్ రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ అధికారి, సిద్దిపేట -
టూరిజం ప్రదేశంగా మల్లన్న వనం
కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో మల్లన్న వనం టూరిజం ప్రదేశంగా మారనుందని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ అన్నారు. మల్లన్న సాగర్కు ఆనుకొని కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ శివారులో మల్లన్న వనంలో నిర్మిస్తున్న ముఖ్య అధికారుల, సిబ్బంది గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించేలా.. పనుల్లో పాదర్శకతలు లోపించకుండా పనులు చేపట్టాలన్నారు. మల్లన్న వనం విసీ్త్రర్ణం రూట్ మ్యాప్ను పరిశీలిస్తూ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ మల్లన్న వనం విస్తీర్ణం 4,794 హెక్టార్లకు గాను సుమారు 1,324 హెక్టార్ల భూమి మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వెళ్లగా మిగతా 3400 హెక్టార్ల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. వనంలో అన్ని రకాల ఔషధ, పండ్ల, ఇతరత్రా మొక్కలు పెంచాలన్నారు. వనంలో వన్య ప్రాణుల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీనివాస్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఇక్రమొద్దిన్, ఫారెస్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ -
కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
దుబ్బాక: పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తామని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి రౌటేలా అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్గాంధీ నేతృత్వంలో ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థ పనితీరును ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తున్నామన్నారు. సిద్దిపేట, మెదక్ డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం తనను కాంగ్రెస్ పెద్దలు నియమించారన్నారు. పూర్తిగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, ఆ తరువాతే డీసీసీ అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందన్నారు. ఇందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి, పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక దేశంలో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకువస్తాం ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతిరౌటేలా దుబ్బాకలో కార్యకర్తల సమావేశం -
దేవాదుల కాలువలు పూర్తి చేయండి
మంత్రి ఉత్తమ్కు ఎమ్మెల్యే పల్లా వినతి కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాలువలను పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డి మంత్రి ఉత్తమ్ను కోరారు. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎమ్మెల్యే మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయడానికి, సేకరించిన భూమికి నిధులు విడుదల చేసి కాలువ పనులు పునరుద్ధరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి.. తక్షణ చర్యలు తీసుకుని పనులు వెంటనే మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ సిబ్బందితో డీఎంహెచ్ఓ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నంగునూరు(సిద్దిపేట):విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అందించడంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం పద్మ మంగళవారం సస్పెండ్ అయ్యారు. బద్దిపడగ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం అందించకపోవడం, పాఠశాల పరిశుభ్రంగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఫోన్లో ఆదేశించడంతో ఈ మేరకు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. చేర్యాల(సిద్దిపేట): గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ పోలోజు నర్సింహాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చేర్యాల, వర్గల్, కోహెడ, చిన్నకోడూరు, అల్వాల్, దుబ్బాక, హుస్నాబాద్, బాలికల పాఠశాలలు, ములుగు, జగదేవపూర్, గజ్వేల్, సిద్దిపేట రూరల్, రామక్కపేట, మిట్టపల్లి, తొగుట, బెజ్జంకిలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీజీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 16 లోపు చేర్యాల గురుకుల పాఠశాల, లేదా దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. -
సీజేఐపై దాడి దుర్మార్గం
సిద్దిపేటరూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే భావించాలన్నారు. ఈ ఘటన దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఇన్చార్జి యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో స్తంభం ఎక్కి..
తెగిన కరెంటు తీగలు బిగించి.. వర్గల్(గజ్వేల్): జలాశయాల్లో కరెంటు తీగలు తెగిపడిన సందర్భాల్లో మరమ్మతు పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సాహసమే చేయాల్సివస్తున్నది. సోమవారం ఉదయం నెంటూరు 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని జబ్బాపూర్ 11కేవీ ఫీడర్ బ్రేక్డౌన్ అయింది. దీంతో లైన్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య, క్యాజువల్ లేబర్ సతీష్, మీటర్ రీడర్ ధర్మయ్యలు రంగంలోకి దిగారు. ఫీడర్ లైన్ వెంట తనిఖీలు నిర్వహించారు. మైలారం చింతల చెరువులో స్తంభాల మధ్య కరెంట్ తీగ(కండక్టర్) తెగిపోయినట్లు గుర్తించారు. నడుము లోతు నీటిలో 4, 5 గజాల కొత్త కండక్టర్ తీగను తీసుకొని స్తంభం వద్దకు చేరుకున్నారు. బైండింగ్ చేసి తీగను అతికి విద్యుత్ లైన్ను యథావిధిగా బిగించారు. గంటన్నర వ్యవధిలో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ‘వెల్డన్.. నెంటూర్ స్టాఫ్’ అంటూ అందరి ప్రశంసలు చూరగొన్నారు. సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిని పోలీసు కమిషనర్ విజయ్కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం న్యాయమూర్తి జయప్రసాద్ను కూడా కలిశారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి చర్చించుకున్నారు. -
దుబ్బాక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి
ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి దుబ్బాక: స్థానిక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ మాధవనేని రఘునందన్రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కిలోమీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎంను నియమించి 60 బస్లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. దుబ్బాక డిపో నుంచి నిజామాబాద్, శ్రీశైలం, కరీంగనర్, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర రూట్లలో కొత్త బస్లు ప్రారంభించాలని ఎండీ నాగిరెడ్డిని కోరినట్లు ఎంపీ తెలిపారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించాయి. సోమవారం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పూర్తి స్థాయిలో, మరిన్ని పాక్షికంగా బంద్ చేపట్టాయి. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి వర్గల్(గజ్వేల్): బీసీ బిల్లు అమలుపై అన్ని వర్గాలు కలిసిరావాలని, బిల్లు అడ్డుకునే రాజకీయ శక్తులకు తగిన బుద్ధి చెబుతామని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. సోమవారం వర్గల్ మండలం గౌరారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ అంశంపై అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి, అందుకు కట్టుబడాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని, బీసీ బిడ్డ బండి సంజయ్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం శుభ పరిణామమన్నారు. సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పార్టీలన్నీ చౌకబారు విమర్శలుమానుకుని కలిసిరావాలని సూచించారు. చేర్యాల(సిద్దిపేట): హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో హమాలీ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం రేపాక కుమార్ అధ్యక్షతన పట్టణంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాలస్వామి మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించడంలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పని చేస్తున్న హమాలీలకు లారీ ఓనర్లు ఇచ్చే తాడుకట్టే వేతనం పెంచాలని సూచించారు. వారికి ప్రమాద బీమా, పని భద్రత, కనీసవేతనం, 55 ఏళ్లు దాటిన వారికి పింఛన్ సదుపాయాలను కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ మావో, హమాలీ కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
ఎవరి చేతికో పగ్గాలు!
● ఆశావహుల నుంచి అధిష్టానం దరఖాస్తుల స్వీకరణ ● ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు ● జిల్లా పరిశీలకురాలిగా ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా ● నేటి నుంచి బ్లాక్ల వారీగా సమావేశాలు కాంగ్రెస్లో పదవుల పండుగ మొదలైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)అధ్యక్షులను నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుని ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ పదవికి డిమాండ్ పెరిగింది. పదవిని ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. –సాక్షి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదీశ్వర్ రావు, నజీర్ హుస్సేన్లను నియమించారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పరిశీలకుల బృందం సమావేశాలు నిర్వహించనుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, మండల అధ్యక్షులతో సమావేశమై అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవికి అర్హతలు ఉన్న నేతల పేరును పీసీసీ ద్వారా ఏఐసీసీకి పంపించనున్నారు. నేటి నుంచి సమావేశాలు డీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం పరిశీలకులు నియోజకర్గాలు, బ్లాక్ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం దుబ్బాక బ్లాక్కు సంబంధించి దుబ్బాక పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్, మధ్యాహ్నం దౌల్తాబాద్ బ్లాక్ తొగుటలోని చెరుకు బాలమ్మ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 15న హుస్నాబాద్ పట్టణం, 16న సిద్దిపేట బ్లాక్ ఇర్కోడ్లోని లావణ్య గార్డెన్, మధ్యాహ్నం నంగునూరులో, 17న ఉదయం వర్గల్ మండలం శాకారం, మధ్యాహ్నం గజ్వేల్ పట్టణంలో సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ సైతం తీసుకుంది. తనకే మరోమారు డీసీసీ పదవి ఇవ్వాలని నర్సారెడ్డి కోరుతున్నట్లు సమాచారం. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ కూడా డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో వివిధ పదవులను హరికృష్ణ నిర్వర్తించారు. పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో దరిపల్లి చంద్రం పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ, కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న తనకు డీసీసీ అధ్యక్ష పదవినీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎన్ఆర్ఐ గాడిపెల్లి రఘువర్ధన్ రెడ్డి సైతం డీసీసీ అద్యక్ష పదవి రేస్లో ఉన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్లో వివిధ పదవులతో పాటు గాడిపెల్లి ట్రస్ట్ పేరుతో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి కోరారు. జెడ్పీ మాజీ ఫ్లోర్లీడర్ గిరి కొండల్రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకైక కాంగ్రెస్ జెడ్పీటీసీగా మద్దూరు నుంచి గెలుపొందారు. గజ్వేల్కు చెందిన పార్టీ నాయకుడు బండారు శ్రీకాంత్, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం మెప్పుపొంది అధ్యక్ష పీఠంపై ఆసీనులయ్యేందుకు ఎవరికి వారు మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి పదవి ఎవరిని వరిస్తుందో అని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు అధికం
మిరుదొడ్డి(దుబ్బాక): దీర్ఘకాలికంగా సాగు చేసే ఆయిల్పామ్ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని ఆయిల్ఫెడ్ ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ రాములు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రైతు అంజిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్పామ్ సాగును సోమవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయిల్పామ్ గెలలను ఎలా హార్వెస్టింగ్ చేయాలి? నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్పామ్ గెలలు టన్నుకు రూ.19,400 ధర పలుకుతోందన్నారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్పామ్ తోటల్లో కోకో వంటి అంతర పంటలు సాగు చేస్తే అదనంగా రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎకరానికి నికరంగా ప్రతి సంవత్సరం 10 టన్నుల ఆయిల్పామ్ దిగుబడిని పొందవచ్చని తెలిపారు. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో మర్కెటింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయిల్పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, రైతులు వెంకట్రెడ్డి, రామస్వామి, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానం.. కొత్త ఉత్సాహం
గజ్వేల్: ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈనెల 9న విడుదల చేసిన ‘ఉద్యాన పంటల ప్రణాళిక–2035’పై ఆశలు చిగురించాయి. కొంత కాలంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహంపై స్తబ్ధత నెలకొన్న తరుణంలో తాజాగా ప్రభుత్వ ప్రకటనతో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ సహకారం పెరిగితే ప్రత్యేకించి ఉద్యాన పంటలకు హబ్గా ఉన్న ఉమ్మడి జిల్లాలో సాగు మరింతగా విస్తరించనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యాన పంటల (కూరగాయలు, పండ్లు, పూలు)కు హబ్గా మారింది. 40కిపైగా మండలాల్లో భారీగా ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. పదిహేనేళ్ల కిందట కేవలం 10వేల ఎకరాలకే పరిమితమైన ఉద్యాన పంటలు ప్రస్తుతం 2.5లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం నిత్యం నుంచి వేలాది టన్నులు కూరగాయలు హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చైన్నె, బెంగళూరు, మహారాష్ట్రలోని, చంద్లాపూర్, కలకత్తా తదితర రాష్ట్రీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ సహకారం లేక .. ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో రైతులను నిరాశకు గురిచేస్తున్నది. విత్తన సబ్సిడీ కనుమరుగవటం, పందిరి, ఫాల్హౌస్ పథకాలకు చేయూత లేకపోవడంతోపాటు సలహాలు, సూచనలు అందించేందుకు క్షేత్రస్థాయిలో తగినంతగా ఉద్యానశాఖ సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యూనివర్సిటీ కీలక సూచనలు.. ● ఉద్యాన ప్రణాళికలో ప్రభుత్వానికి హార్టికల్చర్ యూనివర్సిటీ కీలకమైన సూచనలు చేసింది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలేకాకుండా, రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు ఉపయెగపడే సూచనలు ఉన్నాయి. ● ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ములుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసి మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో నిర్వహించేలా చూడాలని సూచనలు చేశారు. ● వంటిమామిడి లాంటి కూరగాయల మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు సక్రమంగా జరిగేలా చూడాలని నిర్దేశించారు. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యాన పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ నిధులు వినియోగించుకోవాలని నిర్ణయించారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదు. అందువల్ల పథకాల అమలు నిలిచిపోయింది. ఇక నుంచి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసి రైతులకు పథకాలను చేరువ చేయాలని ప్రణాళికలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ● ఎంఐడీహెచ్(మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్), ఎన్హెచ్ఎం (నేషనల్ హార్టికల్చర్ మిషన్), హెచ్సీడీపీ (హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం)లను వాడుకోవాలని సూచించారు. ● ప్రతి ఎకరానికి పెట్టుబడి ఖర్చు తగ్గించి, ఉత్పాదకతను పెంచడంతోపాటు.. మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ● ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ యంత్రాల కోసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులకు సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని యూనివర్సిటీ సూచించింది. ఇవే కాకుండా మరెన్నో అంశాలను ప్రభుత్వానికి ప్రణాళికలో సిఫార్సు చేసింది. ఉద్యాన సాగును పెంచుదాం ఉద్యాన పంటల సాగును పెంచడమే లక్ష్యంగా ఉద్యాన ప్రణాళిక– 2035ని రూపొందించాం. ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలుకు సుముఖంగా ఉంది. వచ్చే రోజుల్లో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు ప్రోత్సాహం పెరగనుంది. – రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రణాళిక–2035పై కోటి ఆశలు ఉద్యాన పంటల హబ్గా ఉమ్మడి మెదక్ జిల్లా సహకారం లేక రైతుల్లో నిరాశ ప్రభుత్వం చేయూతనిస్తే సాగు మరింత విస్తరణ -
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి జాప్యం లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 114 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రావొద్దు కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. సోమవారం మండలంలోని శనిగరం గ్రామంలోని ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనుగోలు కేంద్రానికి వచ్చిన ధ్యానాన్ని వెంట వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు. తేమ శాతం రాగానే బస్తాలను అందించాలని అన్నారు. పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి కోహెడ(హుస్నాబాద్): పరిసరాల పరిశుభ్రతపై గ్రామాలలోని ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా కేసులపై ఆరా తీశారు. రోగులకు అన్నిరకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులకు అన్నిరకాల మందులు సరఫరా చేయాలని డీఎంఎచ్ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నంగునూరు(సిద్దిపేట): నాణ్యమైన సరుకులతో మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం బద్దిపడగ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం పద్మ వంట సరుకులు, కూరలను పరిశీలించడంలేదని, స్లాబ్ నుంచి నీరు కారుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్లో ఆదేశించారు. పాఠశాలలో రోజు అందించే మెనూ వివరాలను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలసి అక్కడే భోజనం చేశారు. క్రమశిక్షణ, చక్కని అలవాట్లు అలవర్చుకొని, ఒక లక్ష్యంతో చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు సూచించారు. -
93 షాపులు..
95 దరఖాస్తులుసిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సిద్దిపేట ఎకై ్స జ్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన పట్టణంలోని సీసీ గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా వైన్ షాప్లను కేటా యించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా ఇప్పటి వరకు 95 దరఖాస్తులే రావడంతో ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడ్డారు. ఆసక్తి చూపడం లేదు.. జిల్లాలోని 93 వైన్ షాప్లకు ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సిద్దిపేట సర్కిల్లో 31, గజ్వేల్ సర్కిల్లో 29, హుస్నాబాద్ సర్కిల్లో 17, చేర్యాల సర్కిల్లో 17, మిరుదొడ్డి సర్కిల్లో ఒక దరఖాస్తు చొప్పున వచ్చాయి. దరఖాస్తు డిపాజిట్ రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావాహులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏ షాప్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఏ దుకాణానికి టెండర్ వేయాలని అందరూ కలిసి సమాలోచనలు చేస్తున్నారు. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్లకు 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18వ తేదీ చివరి తేదీ కావడంతో ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో? ఎలా పెంచాలో అని ఎకై ్సజ్ అధికారులు సమాలోచన చేస్తున్నారు. చివరి మూడు రోజులే కీలకం చివరి మూడు రోజుల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపార పెద్దలను సంప్రదించి దరఖాస్తులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. 17 రోజులైనా మందకొడిగా ప్రక్రియ గతేడాది 4,166 దరఖాస్తులు డిపాజిట్ రూ.3లక్షలకుపెంచడంతో అనాసక్తి చివరి మూడు రోజులే కీలకమంటున్న అధికారులు గతేడాది కంటే ఎక్కువ వస్తాయి.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు దారులు ఆలోచనలో పడ్డారు. కానీ ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే రావడంతో ఇప్పుడు దరఖాస్తులు పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. గత మద్యం పాలసీలో 4,166 దరఖాస్తులు వచ్చాయి. అప్పటి లాగానే ఈ సారి కూడా చివరి మూడు రోజుల్లోనే అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం. –శ్రీనివాసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
కౌలు.. కన్నీళ్లు..!
జగదేవ్పూర్(గజ్వేల్): ఎలాంటి జీవనధారం లేని వారు వ్యవసాయంపై మక్కువతో కౌలు రైతులుగా మారుతున్నారు. గ్రామంలోనే వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి కౌలు రైతులకు కన్నీళ్లు, అప్పులు తప్ప ఏమి మిగిలే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ఈ యేడు కౌలు రైతులకు కౌలు..కష్టం..పెట్టుబడి..కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది. జిల్లాలో ఖరీఫ్లో ఈ సారి ఐదు లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలను సాగు చేశారు. వరి అత్యధికంగా 3.40 లక్షల ఎకరాలు, పత్తి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కూరగాయలు 28 వేల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో సుమారు 50 వేలకు పైగా ఎకరాల్లో పంటలు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఎక్కువ శాతం గజ్వేల్ నియోజకవర్గంలోని నల్లరేగడి భూములు ఉండటం వల్ల ఇక్కడి రైతులు పత్తి పంటను సాగు చేశారు. గజ్వేల్, జగదేవ్పూర్లో మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. జగదేవ్పూర్ మండలంలోని 14,200 ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో వరి, 220 ఎకరాల్లో మొక్కజొన్న, మూడు వందల ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేశారు. కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం పంటలను చూస్తుంటే కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. జిల్లాలో 3 లక్షలకు పైగా రైతులు ఉంటే కౌలు రైతులు 50 వేల వరకు ఉన్నారు. భూముల రకాలను బట్టి ఎకరానికి కౌలు రూ.8 వేల నుంచి 15 వేలు చెల్లిస్తున్నారు. అకాల వర్షాలతో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఎకరానికి కనీసం ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేటట్లు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర నెలలో కొంత భాగానే ఉన్నప్పటికి నల్లరేగడి భూముల్లో పంటలు పూర్తిగా నష్టం జరిగిందని కౌలు రైతులు చెబుతున్నారు. ఎకరం భూమిపై సుమారు 15 వేల నుంచి 30 వేల నష్టం జరుగుతుందని చెబుతున్నారు. పత్తి ఏరడానికి కూలీలకు రోజుకు రూ.350 నుంచి 400 వరకు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అయినా కూలీల కొరత తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆగం చేసిన అకాల వర్షాలు అప్పులు తప్ప మిగిలిందేమీ లేదు కౌలు రైతుల అష్టకష్టాలు ఆదుకోవాలని సర్కార్కు వినతి పెట్టుబడి వచ్చేటట్లు లేదుసొంత భూమి ఏమి లేకపోవడంతో కౌలు రైతుగానే జీవనం సాగిస్తున్నా. గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని ఖరీఫ్లో పత్తి పంటను సాగు చేసిన. అకాల వర్షాలు కురవడం, సరైన సమయంలో యూరియా దొరక్కపోవడంతో పంట ఎదగలేదు. దీంతో పాటు పంట అంత ఎర్రబడి కాయ నల్లబడింది. మొత్తం పెట్టుబడి రెండు లక్షలకు పైగా అయింది. ప్రస్తుతం పంటలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. –అశోక్, రైతు, తిగుల్ -
హుస్నాబాద్లో ట్రామా!
● అన్నీ ఎమర్జెన్సీ కేసులు ఇక్కడే.. ● సత్వర వైద్య సేవలు.. ప్రజల ప్రాణాలకు భరోసా హుస్నాబాద్: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు తక్షణమే వైద్య సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే మొదటి విడతలో 30 ట్రామా కేర్ సెంటర్లు మంజూరు చేయగా, రెండో విడత లిస్టులో హుస్నాబాద్ పేరును చేర్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అత్యవసర కేసులను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయకుండా ఎంత క్లిష్టమైన కేసులనైనా ఈ సెంటర్లోనే శస్త్ర చికిత్సలు అందిస్తారు. ఆర్ధోపెడిక్, అనస్తీషియా ఇతర వైద్య నిపుణులు, సిబ్బంది, అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుంది. -
భక్తజన నాచగిరి
పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించిమల్లన్న ఆలయంలో భక్తుల కోలాహ లంగంగిరేణి చెట్టు ప్రాంగణంలో భక్తుల సందడివర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయ పుష్కరిణి, హరిద్రానది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో సర్వాలంకృతులై కొలువుదీరిన శ్రీలక్ష్మీనృసింహుల దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులను దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందికలగకుండా పర్యవేక్షించారు. కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆల యం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్లు పర్యవేక్షించారు. -
ఆర్యవైశ్య సేవలు అమోఘం
● అని రంగాల్లో ముందంజ ● ఎమ్మెల్యే హరీశ్రావు ● విశిష్ట సేవలందించినవారికి అవార్డుల ప్రదానం ప్రశాంత్నగర్(ిసిద్దిపేట): ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్యే హరీఽశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని వైశ్య భవన్లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శోభశ్రీ ప్రాంతీయ సదస్సులో భాగంగా వివిధ సేవల్లో ఎంపికై న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి, వనిత, ఇలా సంస్థ పేరు ఏదైనా సామాజిక సేవే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో గో సేవలు, పేదల వివాహాలకు పుస్తెమట్టెలు, వంట సామగ్రి, దుస్తుల పంపిణీ, తదితర కార్యక్రమాలు గొప్పవన్నారు. మహిళ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, రక్తదాన శిబిరాలు, ఉచిత అన్నదాన సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు గతంలో కేవలం వ్యాపార రంగంపైనే దృష్టి సారించేవారని, నేడు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలల్లోను కీలకంగా మారారన్నారు. అమర్నాథ్, కేదారినాథ్, అయోధ్య ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించిన చరిత్ర మన సిద్దిపేట ఆర్యవైశ్యులకు ఉందని కితాబిచ్చారు. సమయాన్ని కుటుంబానికి, వ్యాపారానికి, సేవా కార్యక్రమాలకు మాత్రమే కేటాయించడం గొప్ప విషయమన్నారు. అందుకే పది మంది మిత్రులు ఉంటే అందులో ఒక ఆర్యవైశ్యుడు ఉండాలనేది మన పెద్దల మాట అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లురి శశాంక్, మాంకాల నవీన్కుమార్, నాగరాణి, పుల్లురి శివకుమార్, గంప శ్రీనివాస్, గంప కృష్ణ, పుల్లురి శ్రీనివాస్, సోమ శివకుమార్, వనజ, తదితరులు పాల్గొన్నారు. -
పత్తికి మద్దతు ఏదీ?
అతివృష్టి కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై పీకల్లోతూ కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కడం లేదు. అవసరాలకు పత్తిని అమ్ముకుందామని వస్తే.. వ్యాపారులు తేమ పేరుతో క్వింటాలుకు రూ.5500మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు ఇది రూ.2610 తక్కువ. సీసీఐ కేంద్రాలు తెరవకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్జిల్లాలో పత్తి ఉత్పత్తులు.. మార్కెట్ బాట పట్టడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురై ఇబ్బందుల్లో రైతులకు మద్దతు ధర దక్కకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది పత్తికి మద్దతు ధర రూ.7,521 ఉండగా, ఈసారి పింజ పెద్దగా ఉండే పత్తికి గరిష్టంగా రూ.8,110 మద్దతు ధరను ప్రకటించారు. జిల్లాలో 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా, 12లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నది. కానీ కొందరు తమ అవసరాల కోసం కొదిపాటి పత్తి ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకోవడానికి వస్తున్నారు. కానీ పత్తి క్వింటాలుకు రూ.5,500కు మించి ధర పలకడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఇతర కారణాలను సాకుగా చూపి అంతకుమించిన ధర చెల్లించడం లేదు. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్లే ఈ దుస్థితి. సీసీఐ నిబంధనలతో.. సీసీఐ కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోగా, ఒకవేళ ఏర్పాటుచేసినా కూడా సవాలక్ష నిబంధనలు పెడుతోంది. సిద్దిపేట, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో ఈ కేంద్రాలకు ఇతర జిల్లాలకు చెందిన రైతులు సైతం వచ్చి పత్తిని అమ్ముకునే వారు. కానీ ఈసారి ఉమ్మడి జిల్లాలోని రైతులు మాత్రమే ఆ జిల్లా పరిధిలోని కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవడానికి అర్హులని సీసీఐ నిబంధనలు విధించింది. ఉదాహరణకు మెదక్ జిల్లాలో 34751 ఎకరాల్లో సాగులోకి రాగా 3.48 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ జిల్లాలో ఒక్క సీసీఐ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ జిల్లాకు సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని సీసీఐ కేంద్రంలో మెదక్ రైతు పత్తిని విక్రయించుకునే వీలు లేదని చెబుతున్నారు. ఈ నిబంధన అమలు చేస్తే...లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.త్వరలోనే సీసీఐ కేంద్రాలు తెరుస్తాం సీసీఐ కేంద్రాలు త్వరలోనే తెరుస్తాం. జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సీసీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. – నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారిరూ.5,500 ధరకే అమ్ముకున్నా.. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశా. వానలతో పంట దెబ్బతిన్నది. రెండ్రోజుల కిందట రెండు క్వింటాళ్ల పత్తి ఏరి గజ్వేల్లోని జిన్నింగ్ మిల్లులు అమ్ముకున్నా. రూ.5500మాత్రమే ధర చెల్లించారు. – బీడ చెన్ను, రైతు తిగుల్ -
వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ
దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
అసలేం జరిగింది?
మెదక్జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విషయం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. గిరిజన మహిళ హత్యాచారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం సంచలనం రేపిన కొల్చారం ఘటన -
ధాన్యం నిల్వకు చోటేది?
మిల్లుల్లో మూలుగుతున్న గత సీజన్ల నిల్వలుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) చేసేందుకు మిల్లుల్లో స్టోరేజీ కొరత వేధిస్తోంది. పెద్ద ఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎక్కడ? అన్నది పెద్ద సమస్యగా మారింది. సకాలంలో రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గత యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుత కొనుగోళ్లపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారులలో ఆందోళన మొదలైంది. 439 కోనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రస్తుత సీజన్లో 5.08లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 130 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 132 రైస్ మిల్లులుండగా అందులో ఇప్పటి వరకు బ్యాంక్ గ్యారంటీలను మిల్లర్లు ప్రభుత్వానికి అందించలేదు. గత సీజన్ పూర్తి చేసిన మిల్లర్లవే కొనసాగనున్నాయి.పై ఫొటోలో కనిపిస్తున్న ధాన్యం బస్తాలు సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ సమీపంలోని ఓ రైస్ మిల్లులోనివి. గత సీజన్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులో స్థలం లేకపోవడంతో ఇలా ఆరుబయట పెట్టి టార్పాలిన్లు కప్పారు. ఇదే సమయంలో కొత్త ధాన్యం వస్తే నిల్వ ఎలా చేస్తారో తెలియని పరిస్థితి. ఇలా ఒక్క మిల్లు కాదు జిల్లాలో చాలా రైస్ మిల్లుల్లో ఇదే దుస్థితి. ఆరు బయటనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి.రైతులకు ఇబ్బందులు రానివ్వం వచ్చే నెల 12వ తేదీ వరకు ధాన్యంను సీఎంఆర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సీఎంఆర్ చేస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ కానుంది. దీంతో ఆ స్థలాల్లో కొత్త ధాన్యం నిల్వ చేయవచ్చు. అలా కాని పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
ములుగు ఉద్యానవర్సిటీవైస్ చాన్సలర్ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): రైతులు అవకాడో, కూరగాయల లాంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ రాజిరెడ్డి సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ధన్–ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా విశ్వవిద్యాలయంలో రైతులు, అధికారులు, విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన పంటల ఉత్పత్తి ఇప్పటికే 350 మిలియన్ టన్నులకు చేరిందని ఇది సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువని రైతులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాల దిశలో ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం రైతులు ఉద్యాన శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కరివేపాకు, మునగ వంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ అధికారులు సురేష్కుమార్, సిందుజ, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐపై దాడి హేయమైన చర్య
● ఘటనపై వెల్లువెత్తిన నిరసన ● గజ్వేల్లో దళిత, ప్రజా,ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నాయకులు పి.ఎల్లయ్య, రాజులు, అటకూరి రాములు, కిష్టయ్య, కృష్ణ, యాదగిరి, పొన్నాల కుమార్, తుమ్మ శ్రీనివాస్ దాసరి ఏగొండ స్వామి, సందెబోయిన ఎల్లయ్య, నీరుడి స్వామి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాడిని వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్
గజ్వేల్రూరల్: బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్న పార్టీలకు గుణపాఠం తప్పదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42శాతం రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆరు నెలలవుతోందని, అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందినప్పటికీ గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంచడం విచారకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని పార్టీలకు పుట్టగతులుండవని, కోర్టులను అడ్డం పెట్టుకొని 42శాతం రిజర్వేషన్ను అడ్డుకుంటున్న పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లబిల్లులు చెల్లించండి సీపీఎం నేత శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆన్లైన్ లోపాలను సవరించి బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి తాడూరి రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 11 గ్రామాలలో 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు పనులు ప్రారంభించారని తెలిపారు. అందులో చాలా వరకు బేస్మెంట్ వరకు పనుల పూర్తి అయినా బిల్లులు చెల్లించడం లేదన్నారు. లబ్ధిదారులు అధికారులను అడిగితే ఆన్లైన్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసిన తర్వాతే చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. బిల్లులు సకాలంలో రాక లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. అధికారులు స్పందించి ఆన్లైన్ లోపాలను సవరించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి మల్లేశం, శారద, నీల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గురుకులాల అభివృద్ధికి కృషి హుస్నాబాద్రూరల్: గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్నారు. శనివారం పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మరణించిన విషయంపై ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు కార్పొరేటు విద్యను అందించడానికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుందన్నారు. నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మించడానికి భూ సేకరణ చేసినట్లు చెప్పారు. గురుకులంలో విద్యార్థి మరణం అందరికీ బాధకలిగించదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు రోజుల్లో హుస్నాబాద్కు వచ్చి విద్యార్థి కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్, రాజు, మహేందర్లు ఉన్నారు. 95 మద్యం దరఖాస్తులు సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 95దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 93మద్యం దుకాణాల నిర్వహణకు శనివారం 43 దరఖాస్తులు వచ్చినట్లు, మొత్తం 95దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. రెండోవ శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. -
అజ్ఞాతం నుంచి జనంలోకి..
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. గ్రామానికి చెందిన కొంకటి లచ్చవ్వ ఓజయ్యల చిన్న కుమారుడు వెంకటయ్య మండల కేంద్రంలో పదో తరగతి వరకు చదువుకున్నారు.1990లో 19 ఏళ్ల వయస్సులో చేర్యాల పీపుల్స్వార్ దళ కమాండర్ బాలన్న ప్రోత్సాహంతో పీపుల్స్వార్లో చేరారు. వెంకటయ్య చేర్యాల దళంలో రమేశ్ అన్నగా, దళసభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహదేవ్పూర్ జిల్లా కమిటీ సభ్యుడిగా ఛతీస్గఢ్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. అక్కడే మవోయిస్టుగా పని చేస్తున్న మంజులను వివాహం చేసుకున్నారు. ఆమె గత సంవత్సరం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వారి కుటుంబ సభ్యులతో నగరంలో ఉంటున్నారు. వెంకటయ్యపై ప్రభుత్వం అప్పట్లో రూ.5లక్షల రివార్డు ప్రకటించింది. వెంకటయ్య తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందిన సమయంలోనూ గ్రామానికి రాలేదు. ప్రస్తుతానికి అతని కుటుంబ సభ్యులు ఎవరూ గ్రామంలో లేరు. చిన్న వయస్సులోనే గ్రామాన్ని విడిచి అడవిలోకి వెళ్లిన వెంకటయ్య 35 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండడంతో ఆయన రాక కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.35 ఏళ్ల తర్వాత గ్రామానికి వస్తున్న వెంకటయ్య -
రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం
బీసీ కుల సంఘాల నాయకులుసిద్దిపేటకమాన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం అన్యాయమని బీసీ కుల సంఘాల నాయకులు అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న మాధవరెడ్డి దిష్టిబొమ్మను పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ కుల సంఘాల నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబాటు తనానికి గురవుతున్న బీసీలకు సముచిత వాటా దక్కుతుంటే అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుని పార్లమెంట్లో పెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నంగునూరు(సిద్దిపేట): బీసీ సంఘాల పిలుపు మేరకు నంగునూరు మండలంలో శుక్రవారం వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాంపూర్ క్రాస్రోడ్డు వద్ద హన్మకొండ రహదారిపై జేపీతండా వాసులు రాస్తారోకో నిర్వహించారు. నంగునూరులో బీసీ సంఘాల ఐఖ్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలో రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు.రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాంప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారాయన్నారు. రాష్ట్రంలో కులగణన గత ప్రభుత్వం చేయకపోవడం శోచనీయమన్నారు. నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా నిలువడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించామన్నారు. జీవో 9 తీసుకురాకముందే సర్వే పూర్తయ్యిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలే రిజర్వేషన్లకు అడ్డుగా నిలుస్తున్నాయని, ఆరోపించారు. ప్రతి విషయాన్ని బీసీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. సమయం రాగానే ద్రోహులకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే నేడు అడ్డంకిగా మారాయి టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం -
వామ్మో.. ఇవేం రోడ్లు
ప్రయాణం ప్రాణసంకటమే..చిత్రంలోని రోడ్లను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ దారులపై ప్రయాణం నరకమే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడపాల్సిన దుస్థితి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సిద్దిపేట నుంచి తొగుటకు వెళ్లే ప్రధాన రహదారి, అలాగే తడకపల్లి నుంచి తోగుట మధ్యలో పెద్ద పెద్దగుంతలు, కంకరతేలి ప్రమాదకరంగా మారాయి. మరోవైపు అక్కడక్కడా మూలమలుపులతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ఉపాధి ఈకేవైసీలో జిల్లా రెండో స్థానం
అక్కన్నపేట(హుస్నాబాద్): ఉపాధి కూలీల ఈకేవైసీలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కూలీలకు ఈకేవైసీ నమోదు చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కూలీలు తమ ఆధార్కార్డులను జాబ్కార్డులతో ఈకేవైసీ చేసుకుంటేనే పని కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,24,300జాబ్కార్డు ఉండగా 2,09,506మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1,54,692మంది కూలీల ఈకేవైసీ పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా రెండోవ స్థానంలో నిలిచింది. 1,79,000కూలీల ఈకేవైసీతో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అక్కన్నపేట మండలంలో ఉపాధి హమీ కూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను యాప్లో అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు జోరుగా నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పని కల్పించడం ఇకనుంచి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. అలాగే కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,54,692మంది కూలీలు యాప్లో జోరుగా ముఖ గుర్తింపు ప్రక్రియ కొత్త విధానంతో మరింత పారదర్శకతమండలాల్లో ఈకేవైసీ ఇలా.. జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందులో గజ్వేల్లో 82శాతం, మద్దురూలో 81, అక్కన్నపేటలో 79, భూంపల్లిలో 69, బెజ్జంకిలో 79, చేర్యాలలో 78, చిన్నకోండూర్లో 75, దూల్మిట్టలో 35శాతం ఈకేవైసీ పూర్తయింది. అలాగే దౌల్తాబాద్లో 67శాతం, దుబ్బకలో 71, హుస్నాబాద్లో 71, జగదేవపూర్లో 72, కోహెడలో 74, కొమురవెల్లిలో 79, కొండపాకలో 76, కుకునూరుపల్లిలో 43, మర్కూక్లో 67, మిరుదొడ్డిలో 76, ములుగులో 73, నంగునూర్లో 85, నారాయణపేటలో 72, రాయిపోల్లో 72, సిద్దిపేట రూరల్లో 66, సిద్దిపేట అర్బన్లో 76, తొగుటలో 78, వర్గల్లో 67శాతం చొప్పున కూలీల ఈకేవైసీలను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 74శాతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీలను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
పాలన చేరువై.. ప్రగతి కరువై
జిల్లా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు సిద్దిపేట జిల్లాగా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ప్రగతిపై కోటి ఆశలతో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి విడిపోయి 23 మండలాలతో 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లా అవతరించింది. నాటి ఎన్నికల నినాదాలైన జిల్లా అవతరణ.. గోదావరి నీళ్లు.. రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చాయి. కలెక్టర్ గంట సమయంలో ఏ గ్రామానికై నా వెళ్లొచ్చు. స్వయంగా ప్రజలే జిల్లా కేంద్రానికి రావొచ్చు. చేరువలోనే పాలన ఉన్నా.. కానరాని ప్రగతే కలవరపెడుతోంది. పల్లెలు, పలు పట్ణణాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఇప్పుడైనా వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని మంత్రులను, పాలకులను ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ మండలాలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన చేర్యాల, మద్దూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. తరువాత ధూళ్మిట్టను మండలంగా ప్రకటించారు. జిల్లాలో మొదట 298 గ్రామ పంచాయతీలు ఉంటే వాటిని 508కి పెంచారు. గతంలో ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలుండేవి. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. తర్వాత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అక్కన్నపేట, కుకునూరుపల్లి, అక్బర్పేట–భూంపల్లి మండలాలను ఏర్పాటు చేసుకుంటూవచ్చారు. అభివృద్ధి అంతంతే జిల్లా ఏర్పాటైన తొలి ఏడేళ్ల వరకు అభివృద్ధి పరుగులు పెట్టినా.. ఆ తరువాత కుంటుపడింది. అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయి. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కోమటి చెరువు సుందరీకరణ, శిల్పారామం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రూ.100 కోట్లతో రంగనాయసాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి పనులు పిల్లర్లకే పరిమితం అయ్యాయి. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల వెనక్కి వెళ్లింది. జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ జంక్షన్లో మార్కెట్ పనులు ఆగిపోయాయి. సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు దాదాపు 90శాతం పూర్తి కాగా మరో 10శాతం పనులకు నిధులు లేని కారణంగా వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో వినియోగంలో లేదు. ఇప్పటికై నా జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేసి ప్రగతిని పరుగులు పెట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కోటి ఆశలతో పదో వసంతంలోకి జిల్లాలో 26 మండలాలు.. 508 పంచాయతీలు అభివృద్ధిపై మంత్రులు దృష్టిసారించాలని కోరుతున్న ప్రజలు -
అధునాతన మార్గం.. ఛిద్రం
ఇటీవల తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అధునాతన హంగులతో నిర్మించిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పలు చోట్ల ఛిద్రమై ప్రయాణికులకు నరకం చూపుతోంది. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకడంతో ఆ వరదంతా ప్రధాన రోడ్డుపైకి చేరి, రోజుల తరబడి రాకపోకలకు ఇబ్బంది కలిగిన విషయం తెల్సిందే. రూ.45కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు.. వరద ఉధృతికి ఇలా మారడం కలవరానికి గురిచేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. – గజ్వేల్ -
పిల్లలకు పచ్చిపులుసా?
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పచ్చిపులుసుతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండటంపై కలెక్టర్ హైమావతి భోజన నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని పందిల్ల స్టేజి దగ్గర ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పచ్చి పులుసు, టమాటా పప్పు ఉండటంతో మండిపడ్డారు. పిల్లలకు నీళ్ల చారు ఇస్తే ఆరోగ్యం ఏంకావాలని ప్రశ్నించారు. కొత్త మెనూను ఎందుకు అమలు చేయడం లేదని హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికే మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, సాకులు చెప్పి తప్పించుకోవద్దని హెచ్చరించారు. పాఠశాల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సైతం కలెక్టర్ తనిఖీ చేసి పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని రుచి చూశారు. బాలింతలకు అందించే బాలమృతాన్ని పరిశీలించారు. పిల్లలకు రోజూ స్నాక్స్ అందించాలని అయాకు సూచించారు. వంద శాతం గ్రౌండింగ్ కావాలిహుస్నాబాద్: ఇందిరమ్మ ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతక ముందు పట్టణంలోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి, సిద్దిపేట నేషనల్హైవే పనులు వేగం పెంచాలన్నారు. అంతకపేట నుంచి కొత్తకొండ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడి కేంద్రాల భవనాల కోసం స్ధల సేకరణ చేయాలన్నారు. ఇది పౌష్టికాహారమా? విద్యార్థుల ఆరోగ్యం పట్టదా.. ‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకులపై కలెక్టర్ హైమావతి ఫైర్ పందిల్ల గ్రామంలో ఆకస్మిక తనిఖీ -
ఉదయం కోలాహలం.. సాయంత్రం నిర్మానుష్యం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు నేపథ్యంలో మిరుదొడ్డిలో గురువారం ఉదయం అభ్యర్థులతో కోలాహలం నెలకొంది. ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో నామినేషన్ కౌంటర్లు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందించడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అభ్యర్థులు, నాయకులతో ప్రభుత్వ కార్యాలయాలు, జీరాక్స్ సెంటర్లు కిటకిటలాడాయి. తీరా సాయంత్రం వేళ హైకోర్టు ఎన్నికలపై ఆరు వారాలు స్టే విధించడంతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అవాక్కయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. -
మక్కకు దిక్కేది?
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి మక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా మక్కతో ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు లేఖ రాసి నెల రోజులు కావొస్తున్నా చడీచప్పుడు కానరావడంలేదు. సిద్దిపేట యార్డులో కొనుగోలు కేంద్రం జాడ లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు తక్కువ ధరతో నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. సిద్దిపేటజోన్: బతుకమ్మ, దసరా పండుగల ఖర్చుల నుంచి బయటపడేందుకు అన్నదాతలు ముందస్తుగా యార్డుకు పెద్ద ఎత్తున మక్కలు తరలించారు. జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున పంట సాగు అయింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 29 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయినట్లు సమాచారం. ఈ లెక్కన 6 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. రూ.300 తక్కువకు.. సిద్దిపేట మార్కెట్ యార్డులో విక్రయానికి మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయని, కొనుగోలు కేంద్ర ఏర్పాటు ఆవశ్యకత వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత నెల 16న రాసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సిద్దిపేట యార్డులో ప్రయివేటు వ్యాపారులు నెల రోజులుగా మక్కలను కొనుగోలు చేస్తున్నారు. తేమ, పొల్లు, గింజ నాణ్యత తదితర కారణాలను సాకుగా చూపి తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేసేదిలేక కొందరు రైతులు ఉత్పత్తులను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. దీంతో రైతు ప్రతి క్వింటాల్కు రూ.350 నుంచి రూ 500 వరకు నష్టపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో ప్రయివేటు వ్యాపారులు 190మంది నుంచి సుమారు 4 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు సమాచారం. తడిసిన మక్కలు సిద్దిపేట మార్కెట్ యార్డులో రోజులతరబడి ఎదురుచూస్తున్న రైతన్నను వరుణుడు కూడా కరుణించడంలేదు. ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతు లబోదిబోమంటూ మళ్లీ ఆరబోసే ప్రయత్నాలు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ఎప్పుడు ప్రారంభిస్తారో.. ఈసారి ఐదు ఎకరాల్లో మక్క వేశాను. రెండు ట్రాక్టర్ల నిండా యార్డుకు తెచ్చాను. ఐదు రోజులుగా ఇక్కడే ఉన్నాం. సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వాళ్లు వచ్చి తక్కువకు అడుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. –మమత, ఎల్లారెడ్డిపేట) పది రోజులుగా పడిగాపులు పదహారు ఎకరాల్లో మక్క పంట వేశా. 12 ట్రాక్టర్లలో యార్డుకు పంట తెచ్చా. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 వస్తుందని ఇక్కడకు వస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వ్యాపారులు రూ.2 వేలకే అడుగుతున్నారు. పది రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలి. –రెడ్డి ఎల్లవ్వ, పెద్దకోడూర్ వర్షానికి తడిసిన మక్కలను ఆరబోస్తున్న రైతు జాడలేని కొనుగోలు కేంద్రాలు -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దుబ్బాక: విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ అన్నారు. గురువారం దుబ్బాకలో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, అధునాతనమైన యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాలన్ని అందిపుచ్చుకొని భవిష్యత్త్లో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలన్నారు. ఏటీసీతో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగి మంచి ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ కనకయ్య తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టుడే..
కొండపాక(గజ్వేల్): హామీలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేలా ప్రజలను సిద్ధం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మండలంలోని దుద్దెడకు చెందిన మాజీ ఎంపీపీ అనంతుల పద్మతో పాటు సుమారు 100 మంది గురువారం హరీశ్రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో అనంతుల పద్మ భర్త నరేందర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పనితీరు నచ్చక అనతి కాలంలోనే మళ్లీ అనుచరులతో యూటర్న్గా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పరిపాలనను గాలికొదిలేసి ప్రతీకార చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వివిధ రకాల పెన్షన్ల పెంపు మాట దేవుడెరుగు.. పాత వాటిలో కోత పెట్టిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనంతుల అశ్విణి, నాయకులు ర్యాగల్ల దుర్గయ్య, జైపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తిరుపతి, అంజయ్య, కోడెల ఐలయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలేవీ?
గజ్వేల్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందించడంలేదని, ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్, టెలికామ్ బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్లు మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు. గతంతో పోలిస్తే ప్రసవాల సంఖ్య సైతం తగ్గిందన్నారు. పరిస్థితి మారకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోస్, నాయకులు రామచంద్రాచారి, నత్తి శివకుమార్, చెప్యాల వెంకటరెడ్డి, నరసింహ, సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏటీసీతో ఆర్థికంగా రాణించాలి
● కలెక్టర్ హైమావతి ● ఇర్కోడ్లో శిక్షణ సంస్థ సందర్శనసిద్దిపేటరూరల్: జీవితంలో ఆర్థికంగా రాణించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) చక్కని వేదిక అని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ శివారులో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రిన్సిపాల్ రామానుజ, ట్రైనింగ్ టీచర్స్తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని కోర్సుల శిక్షణ సరైన పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి అందేలా చూడాలన్నారు. ఉదయం నేర్చుకున్నది సాయంత్రం మూల్యాంకనం చేయించాలన్నారు. ఏటీసీకి కావలసిన మౌలిక వసతులు, స్టాఫ్ గురించి అన్ని వివరాలను తనకు నివేదిక రూపంలో అందించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ట్రైనింగ్ క్లాస్లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. -
ఏమాయె.. గిట్లాయె!
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ సహా ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్, నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే సహచర నాయకులను ఒప్పించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఖరారు చేసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులు కోర్టు తీర్పుతో అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన రాజకీయ పార్టీలకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే జిల్లాలో తొలి విడతలో 15 జెడ్పీటీసీ స్థానాలు, 125 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే తొలిరోజు ఎంపీటీసీకి మూడు, జెడ్పీటీసీకి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. – సాక్షి, సిద్దిపేట స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తొలి విడతలో 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయా మండల పరిషత్తు కార్యాలయాల్లో నోటిఫికేషన్లను జారీ చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు సాగింది. తీరా సాయంత్రం ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నెం.9 పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచి ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను, ప్రతిపాదించే వారిని సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. టిక్కెట్ల రేసులో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. బరిలో నిలిచే అభ్యర్థులు డబ్బులు సైతం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులను సైతం పిలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలను రూపొందించుకున్నారు. తీరా కోర్టు స్టే ఇవ్వడంతో అయోమయానికి లోనయ్యారు. కోర్టులో రిజర్వేషన్ల కేసు విచారణ కొనసాగుతుండటంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. పలువురిలో చిగురిస్తున్న ఆశలు స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో కొత్త రిజర్వేషన్లు.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలించక పలువురు నిరాశ చెందారు. కోర్టు రిజర్వేషన్ల పై స్టే ఇవ్వడంతో జనరల్ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారవచ్చని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వార్డుల పెంపునకు ప్రతిపాదనలు
● కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు పంపిన మున్సిపల్ అధికారులు ● త్వరలోనే కసరత్తు ప్రారంభమయ్యే అవకాశంగజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల పెంపునకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నందువల్ల కొత్తగా గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ అనివార్యమవుతోంది. ఇందులో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్తోపాటు రాష్ట్రంలోని ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ జరుగనుంది. ఇందుకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ద్వారా సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)కు ప్రతిపాదనలు పంపారు. ఈ మున్సిపాలిటీలో ముట్రాజ్పల్లి, సంగాపూర్ల పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్అండ్ఆర్ కాలనీ) విలీనమైన సంగతి తెల్సిందే. ఈ కాలనీ పరిధిలో ప్రస్తుతం 11,601 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో 34,365మంది ఓటర్లు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 45,966కు చేరింది. జనాభా 75వేల పైచిలుకు చేరుకున్నది. మున్సిపాలిటీలో ప్రస్తుతం 20వార్డులు ఉండగా, డీలిమిటేషన్లో భాగంగా 1500మంది ఓటర్లకు ఒక వార్డు లెక్కేసినా.. వార్డుల సంఖ్య 30కి చేరుకోనుంది. ఓటర్ల సంఖ్య, జనాభా, వైశాల్యం, ఆదాయపరంగా చూస్తే మున్సిపాలిటీ గ్రేడ్ వన్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వార్డుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని తెలిపారు. సీడీఎంఏ నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్తోపాటు పలువురు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలతో గ్రామీణ సమాజంలో పరివర్తనకు నాందిపలుకుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా సాగిందన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను వివరిస్తూ ఢోకా కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక పరీక్షలకు సిద్ధంకండి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, విద్యార్థులు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, కళాశాల పరిసరాలు, రికార్డులు, టీచింగ్ డైరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అధ్యాపకులు బోధించే ప్రతీ అంశాన్ని శ్రద్ధగా వినాలని, అర్థం కాకపోతే అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు అవశ్యం హుస్నాబాద్: కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి అన్నారు. అక్కన్నపేట మండలం కుందనవాని పల్లెలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఖేతీ రక్షక్ నెట్ హౌస్లో బుధవారం డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి వ్యవసాయ పంటల పరిరక్షణ ఏ విధంగా చేయవచ్చో అగ్రిదూత్ అనే యాప్ సహ వ్యవస్థాపకుడు శాశ్వత రాజ్ వివరించారు. పంటలకు వచ్చే తెగుళ్లు, తేమ శాతం, శీతోష్ణస్థితి పరిస్థితులు మొదలైనవి ఒక క్లిక్తో తెలుసుకోవచ్చని యాప్ వినియోగాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తస్లీమా, విస్తరణ అధికారి శ్రీలత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో టెన్త్ మార్కులు కీలకం డీఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో 10వ తరగతి పరీక్షల మార్కులే కీలకంగా మారనున్నాయని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కుకునూరుపల్లి హైస్కూల్లో టెన్త్ ప్రత్యేక తరగతుల నిర్వహణను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే మంచి ఫలితాలను సాధిస్తారన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. అంతకు ముందు టెన్త్లోని పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. ఇటీవల జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనులపండువగా బొడ్రాయి ప్రతిష్ఠామహోత్సవాలు దుబ్బాక: పట్టణంలో బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠామహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధాన వీధుల గుండా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విగ్రహాలకు మంగళహారతులతో స్వాగతం పలికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
పొదుపు చేస్తేనే జీవితం మలుపు: ఎమ్మెల్సీ
కొండపాక(గజ్వేల్): పొదుపును జీవన విధానంగా మార్చుకుంటేనే కుటుంబాలు బాగుపడుతాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. కొండపాక మండలంలోని మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఆవరణలో బుధవారం విధాత పొదుపు సంఘం 21వ వార్షిక మహాసభను నిర్వహించారు. ఈసందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మనిషి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తామన్నారు. సంఘం అధ్యక్షులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ 2003లో ప్రారంభమైన పొదుపు సంఘం నేడు రూ. 51లక్షలతో లావాదేవాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వంపై, బ్యాంకులపై ఆధారపడకుండా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నదే పొదుపు లక్ష్యమన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3.70లక్షల లాభం డబ్బులను తిరిగి సభ్యులకు బోనస్ రూపంలో అందించామన్నారు. సంఘంలోని ప్రతీ పైసా జమ, ఖర్చుల విషయమై ఆడిట్ ఉంటుందన్నారు. సంఘం సభ్యులు గడీల కుమార్ మృతి చెందడంతో కుటుంబానికి రూ. 41 వేలు, పిండి మల్లయ్య కుటుంబానికి రూ. 16 వేల పొదుపు, బోనస్ డబ్బులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్, సంఘం కోశాధికారి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించేందుక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపా రు. బుధవారం సీపీ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లతో కలిసి ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది విధులు తదితర అంశాలపై సబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సేవల్లో ముందుండాలి సిద్దిపేటరూరల్: వైద్య సేవల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డ్రైడే పాటించడంతోపాటు, శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లావైద్యాధికారి ధనరాజు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
సెటిల్మెంట్లు జాన్తానై..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ‘ప్రజా కేంద్రిత పోలీసింగ్ వ్యవస్థను పకడ్బందీగా కొనసాగించేందుకు టీం వర్క్తో ముందుకు సాగుతాం. ప్రజల భద్రతకు, రక్షణకు పెద్దపీట వేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. రౌడీలు, గుండాయిజం, సెటిల్మెంట్లు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం’ అని పోలీస్కమిషనర్ ఎస్ఎం విజయ్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. వివాహిత మహిళలపై వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. భరోసా, స్నేహిత సెంటర్లలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం కానీ కేసులను నమోదు చేస్తున్నాం. జిల్లాలో అనేక సమస్యలపై దృష్టి సారించి, ప్రజల రక్షణ, లా అండ్ ఆర్డర్కు అనుగుణంగా పని చేస్తాం. పేకాట, గంజాయి, అక్రమ ఇసుక రవాణ, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. సెటిల్మెంట్లకు తావులేదు.. భూ తగాదాలు, వివిధ గొడవల నేపథ్యంలో పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. అలాంటివి ఇక బంద్ చేయాలి. సెటిల్మెంట్లకు తావులేకుండా పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయాలి. సాక్ష్యాలు సేకరించి చార్జీషీట్ ఫైల్ చేసి చట్టప్రకారం ముందుకు వెళ్లాలి. పోలీసులు పోలీసింగ్ చేయాలి. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవాలి. ఎవరూ పరిధి దాటొద్దు. సెటిల్మెంట్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి. జిల్లాలో ఇప్పటి వరకు 94 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రౌడీయిజం, గుండాయిజం చేసేవాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నంగునూరు మండలంలో రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ను తరిమికొడదాం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డ్రగ్స్కు అలవాటైతే పోలీసులకు సమాచారం అందించాలి. యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నట్లు, మత్తుకు బానిస అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. ‘డ్రగ్స్’పై నిఘా ముమ్మరం చేస్తాం. అందరం సమష్టి కృషితో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి. ఇసుక అక్రమ రావాణాపై దృష్టి ఇసుక, మట్టి రవాణా కోసం రెవెన్యూ, సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా రవాణ చేసే వారిని, సహకరించే వారిని ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. డీజేలకు అనుమతులు లేవు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించవద్దు. అలాగే ఆన్లైన్ లోన్ యాప్ జోలికి వెళ్లవద్దు. సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసానికి గురైతే 1930, సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఇది ఉచితంగా చేయాల్సిన పని. పోస్టుమార్టం కోసం బాదితుల నుంచి పోలీసులు, వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. -
బిడ్డా.. పైలం
హుస్నాబాద్రూరల్: ‘బిడ్డా... పైలం భయపడకు. ఆదివారం బాపును పంపిస్తా’ ఇది హుస్నాబాద్ గురుకుల పాఠశాల గేటు ఎదుట బుధవారం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా ధైర్యం చెప్పారు. మంగళవారం 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం విదితమే. దీంతో తల్లిదండ్రులు పిల్లల బాగోగులు తెలుసుకొనేందుకు గురుకులానికి పరుగులు తీశారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట నుంచే పిల్లలతో మాట్లాడారు. బంగారు భవిష్యత్ ఉంటుందని.. గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువులో ముందుంటారని, పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందని భావించి గురుకులంలో సీట్లు పొందడానికి పోటీపడతారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ప్రమాద ఘటనలు కొన్ని.. పర్యవేక్షణ కరువు గురుకులంలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువులు చీకటి పడగానే ఇంటికి వెళ్తున్నారు. దీంతో రాత్రి వేళ విద్యార్థులను చూసే వారే కరువయ్యారు. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా ఉపాధ్యాయులు స్థానికంగా లేకపోయినా అధికారులు పట్టించుకోవంలేదు. విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాల్సిందే హుస్నాబాద్: సాక్షాత్తు మంత్రి పొన్నం ఇలాకాలోని గురుకులంలోనే విద్యార్థులకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. విద్యార్థి వివేక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీలు నాయక్, సుద్దాల చంద్రయ్య, తిరుపతిరెడ్డి, మల్లికార్జున్రెడ్డి తదితరులు ఉన్నారు. హుస్నాబాద్లోని గురుకుల పాఠశాల గేటు బయటి నుంచే పిల్లలతో మాట్లాడుతున్న తల్లిదండ్రులు కట్టుతప్పిన గురుకులాలు కేటీఆర్ ఆరాహుస్నాబాద్: గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థి ఏ తరగతి చదువుచున్నాడు, మృతికి గల కారణాలపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే గురుకుల పాఠశాల అధికారులు విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.10 వేలు అందజేశారు. -
పరిషత్ సంగ్రామం
పల్లెల్లో ఓట్ల పండుగ షురూ అయ్యింది. స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలో పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరగనున్నాయి. ఈ మేరకు గురువారం తొలి విడతలో జరిగే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. –సాక్షి, సిద్దిపేటజిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలలో జరగనున్నాయి. మొదటి విడతలో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీలు, రెండో విడతలో 11 జెడ్పీటీసీలు, 105 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించనున్నారు. మొదటి విడతకు సంబంధించి ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా, 13వతేదీ వరకు అప్పీల్కు అవకాశం, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న నామినేషన్ల ఉపసంహరణ, మధ్యాహ్నం 3గంటలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలను నియమించి నామినేషన్ల స్వీకరణ, నిబంధనల గురించి శిక్షణ ఇచ్చారు. నేడే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న టెన్షన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహుల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టులో కేసు గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఏమి ప్రకటిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.ముహూర్తాలు చూస్తున్న అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తాలను తెలుసుకుంటున్నారు. ఈ మూడు రోజుల్లో కలిసి వచ్చే రోజును తెలుసుకుని నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగం చేశాయి. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేపనిలో నిమగ్నమయ్యారు. -
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్కలు తప్పనిసరిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు మండలస్థాయిలో సహాయక పరిశీలకులు అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
విజయం.. భవ్యం
సాక్షి, సిద్దిపేట: ‘చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలన్నది లక్ష్యం.. 2024లో సివిల్స్లో క్వాలిఫై కాలేకపోయా.. అదే సమయంలో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. దీంతో దరఖాస్తు చేశా.. రోజుకు 10గంటలు పట్టుదలతో చదివి 9వ ర్యాంక్ సాధించా’ అని సిద్దిపేట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ కుడికాల భవ్య అన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకుని సిద్దిపేటకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం భవ్యను ‘సాక్షి’ పలకరించింది. సివిల్స్ కోసం హైదరాబాద్లో ఉదయం వేళ కోచింగ్కు, తర్వాత 10 గంటల పాటు చదివాను. అలా ఏడాదిన్నర పాటు ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ అనేది 50శాతమే ఉపయోగపడుతుంది. మిగతాది కోచింగ్ సెంటర్లో చెప్పిన అంశాలను ప్రిపేర్ కావాలి. గ్రూప్–1 నోటిపికేషన్ రాగానే మూడు నెలల పాటు రోజూ 10 గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. వారంలో ఆరు రోజులు ఒక సబ్జెక్ట్ చొప్పున చదివాను. నేను చదివిన దానిలో నుంచి ప్రశ్నలు తయారు చేసుకుని వాటిని జవాబులు రాయడం చేశాను. ఇలా చేయడంతో మనం ప్రిపేర్ అయిన దానికి ఎంత రాయగలుగుతున్నామో అర్థమవుతుంది. మాది వరంగల్ జిల్లా ఏకశిలానగర్. మా నాన్న పేరు కుడికాల వెంకటేశ్వర్లు. అమ్మ పేరు చాయా. మా అమ్మానాన్న, అక్క ప్రోత్సాహంతో గ్రూప్–1 సాధించాను. డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ పూర్తి అయ్యాక.. పూర్తి స్థాయిలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అవుతాను. ప్రతీ రికార్డు డిజిటలైజేషన్ ముఖ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు, పాలసీలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవాలి సివిల్స్ అయినా.. గ్రూప్స్, బ్యాంక్ పరీక్షలు ఏవైనా ఏ అంశాలు ఉంటాయో ముందుగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన బుక్స్ తెచ్చుకుని చదవాలి. అలాగే ఒక మెంటర్, గైడ్ను ఏర్పాటు చేసుకోవాలి. చదవడం పోటీ పరీక్షల్లో ఒక వంతు అయితే, దానిని రాయడం మరో ఎత్తు. అందుకోసం ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్మార్ట్గా వర్క్ చేయాలి. చాట్ జీపీటీ, ఏఐ ఇలా వాటిని ఉపయోగించి స్టడీస్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. కొంత మంది పరీక్షల్లో మంచి ర్యాంక్ రాకపోతే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వారు ఎమోషనల్గా పరీక్షను చూస్తారు. అలా చూడటం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కటే జీవితం కాదు. ఒక పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.పట్టుబట్టి.. ఉన్నత కొలువు కొట్టి -
వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం
కలెక్టర్ హైమావతిప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రపంచం ఉన్నంత వరకు వాల్మీకి చరిత్ర ఉంటుందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందన్నారు. ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం అన్నారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారన్నారు. ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు. -
పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే
● ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ ● మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం ● అడ్డుకున్న పోలీసులు హుస్నాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంజం వెంకట్స్వామి మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ చాలా సున్నితమైన, విశాలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. అలాంటి నాయకుడని పరుష పదజాలంతో ధూషించడం పొన్నం దూకుడు స్వభావానికి తార్కాణమని అన్నారు. -
రైల్వేలైన్ పనుల పరిశీలన
చిన్నకోడూర్(సిద్దిపేట): మండల పరిధిలోని గంగాపూర్ శివారులో రైల్వేలైన్ నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైల్వే లైన్ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో రైల్వే లైన్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. పనులను అడ్డుకోవడం సరైందికాదన్నారు. నష్ట పరిహార విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన బాధితులందరికీ తప్పనిసరిగా పరిహారం అందేలా చూస్తామంటూ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ సలీం, రైతులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
జ్వర సర్వేను నిర్వహించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటకమాన్: క్షేత్ర స్థాయిలో జ్వర సర్వేను నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నాసర్పూర అర్బన్ పీహెచ్సీ, అంబేడ్కర్ నగర్ యుపీహెచ్సీని డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలే లక్ష్యం కావాలి
● నూతన సీపీ విజయ్కుమార్ ● బాధ్యతల స్వీకరణసిద్దిపేటకమాన్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలే లక్ష్యంగా సేవలు అందించాలని నూతన పోలీస్ కమిషనర్గా విజయ్కుమార్ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి, పోలీసు అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి టీం వర్క్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.వైద్యం వివరాలు నమోదు చేయండి కొండపాక(గజ్వేల్): రోజువారీ వైద్యం అందించే వివరాలను, మందుల స్టాక్ను రిజిస్టరులో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, పరీక్షల తీరును, మందుల స్టాక్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రాపిడ్ టెస్టులను తప్పనిసరిగా చేయాలన్నారు. టెస్టుల వివరాలను రిజిస్టరులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రహదారి వెంట ఉండే ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 108 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫోన్ ద్వారా సూచించారు. కార్యక్రమంలో వైద్యులు ఫర్విన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలి ప్రశాంత్ నగర్ (సిద్దిపేట): అమ్మవారి దయవల్ల అందరం క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్ని అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం రహదారులు తదితర అభివృద్ధి పనులన్నీ పడకేశాయని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలన్నీ విస్మరించారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మానవ అక్రమ రవాణాను అరికడదాంప్రశాంత్నగర్(సిద్దిపేట): మానవ అక్రమ రవా ణా నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ సెల్ కోఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరై న రమేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవా ణా.. అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ వారికి అవగా హనా కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సురేశ్కుమార్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలి రాజ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన సీపీసిద్దిపేటకమాన్: నూతన పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ సోమవారం కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. -
సీజేఐపై దాడి హేయమైన చర్య
గజ్వేల్: సీజేఐపై దాడి చేయడం హేయమైన చర్య అని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం సాయంత్రం గజ్వేల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పొన్నాల కుమార్, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు పోశయ్య, భిక్షపతి పాల్గొన్నారు. వైన్షాపులకు 9 దరఖాస్తులు సిద్దిపేటకమాన్: జిల్లాలోని వైన్ షాప్ల నిర్వహణ (2025–27)కు ఇప్పటి వరకు తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు సోమవారం రోజే 8 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో హుస్నాబాద్ పరిధిలో 6, చేర్యాల పరిధిలో 1, సిద్దిపేట పరిధిలో 2 దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి గజ్వేల్రూరల్: ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. సమాచార హక్కుచట్టం వచ్చి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 5 నుంచి 12వరకు జరుగుతున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారం డీబీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఏటిగడ్డ కిష్టాపూర్)లో ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటాడన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల పనితీరులో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. అలాగే సులభంగా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల అవినీతిని అరికట్టేందుకు ముఖ్య సాధనమన్నారు. లిఖితపూర్వకంగా సమాచారాన్ని కోరుతూ పౌరులు అభ్యర్థన చేయాలని, సాధారణ సమాచారాన్ని 30రోజుల్లో, అత్యవసర సందర్భాల్లో 48గంటల్లోగా అందించాల్సి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరులు రాజునాయక్, కుమార్, మల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజ రుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి సోమవారం రూ.18,400 జరిమానా, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. గొర్రెలకు టీకాలు దుబ్బాకరూరల్: మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో కొన్ని రోజులుగా వింత వ్యాధి సోకి మూగజీవాలు మరణిస్తుండటంతో పశువైద్యాధికారులు వైద్యశిబిరం నిర్వహించారు. సోమవారం గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ ● ఎన్నికల సిబ్బందికి చివరి విడత శిక్షణ సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు రిటర్నింగ్ అధికారుల బాధ్యత చాలా ముఖ్యమైనదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న చివరి విడత శిక్షణలో అధికారులు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కరదీపికను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను మొదలుకొని కౌంటింగ్ వరకు తప్పులు లేకుండా సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలన్నారు. నామినేషన్ల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో కలిపి ముగ్గురితో పాటు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్ బందోబస్తు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిబంధనలను తెలపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకీదేవి, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


