Siddipet
-
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
హుస్నాబాద్: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పురోగతి, ఎల్లమ్మ చెరువు, పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బస్టాండ్ను ఆధునీకరిస్తాంహుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరిస్తామని, వర్షాకాలంలో తలెత్తుతున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి పొన్నం అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులను ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షం వస్తే బస్టాండ్లోకి వరద రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ, వరద ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ చుట్టూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రయాణికుల రద్దీ, రెవెన్యూ సోర్స్ అధికంగా ఉన్న బస్టాండ్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద షాపింగ్ మాల్తో.. వర్షం వస్తే మునిగిపోతున్న బస్టాండ్ ఏరియాను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. రోజు బస్టాండ్ నుంచి 35 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. రెవెన్యూ పరంగా అత్యధిక ఆధాయం వచ్చే ఏ క్లాస్ కమర్షియల్ బస్ స్టేషన్ల్లో హుస్నాబాద్ ఒకటన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వారు సహకరిస్తే, మౌలిక సదుపాయాలతో పెద్ద షాపింగ్ మాల్ బస్టాండ్ను పునర్నిర్మిస్తామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన
కోహెడరూరల్(హుస్నాబాద్): తంగళపల్లి శివారులో రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న విద్యాసంస్థ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండల నడుమ పచ్చని ప్రకృతి మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలుస్తుందని అన్నారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. పనులన్నింటినీ నిర్దేశిత కాల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. -
ఎరువు దోపిడీ
ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే అన్నదాతలను దోపిడీ చేయడం షురూవైంది. కొందరు వ్యాపారులు, డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ (గరిష్ట చిల్లర ధర) కంటే ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బస్తాపై ఎమ్మార్పీ కంటే సుమారు రూ. 200 వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలుప్రధానంగా పత్తి సాగు చేసే రైతులు విత్తనాలతో పాటు పంటకు బలాన్ని ఇచ్చే 20:20 ఎరువును కూడా వేస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20: 20 ఎరువుల బస్తాను డీలర్లు కొందరు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఎరువును 1,500 బస్తా చొప్పున అమ్మాలి. కానీ ఒక్కో బస్తాపై రూ.1700 వరకు విక్రయిస్తున్నారు. ఎవరైనా రైతులు ఇదేమని ప్రశ్నిస్తే అసలు స్టాక్ లేదంటూ బుకాయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక డీలర్లు చెప్పిన ధరకే ఎరువును కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ధరలు పెరుగుతున్నాయంటూ.. కొందరు వ్యాపారులు వారం రోజుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయంటూ కూడా రైతులను మభ్య పెడుతున్నారు. అయితే కొన్ని ఎరువుల ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం పాత స్టాక్ను బస్తాపై ఉన్న ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలి. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీలు లేదు. అయితే చాలా మంది డీలర్ల వద్ద పాత స్టాక్ ఉంది. ఈ స్టాక్ మొత్తాన్ని పాత ధరలకే విక్రయించాలి. కానీ ఈ పాత స్టాక్ను కొందరు డీలర్లు పెరిగిన కొత్త స్టాక్ ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. -
కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆగ్రహం
సిద్దిపేటఅర్బన్: వానాకాలం సాగు పనులు ప్రారంభమైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలో రైతులు రాస్తారోకో చేశారు. రోడ్డుపై సుమారు గంటన్నర పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధానయం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. స్థానిక అధికారులు స్పందించి లారీలు త్వరగా వచ్చేలా చూసి ధాన్యాన్ని తరలించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు మండిపడ్డారు. అర్బన్ తహసీల్దార్ అక్కడికి చేరుకొని లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించరూ.. మంత్రి దామోదరను కలిసిన నిర్వాసితులు గజ్వేల్: పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదరను కలిశారు. అర్హులైన ఎంతోమందికి ఇళ్ల స్థలాలు, ఆర్అండ్ఆర్, ఒంటరి మహిళలకు ప్యాకేజీలు పెండింగ్లో ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలో చర్యలు చేపట్టాలని కలెక్టర్కు ఫోన్ ద్వారా సూచించారు. మంత్రిని కలిసినవారిలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన హయతోద్దీన్, శ్రీనివాస్రెడ్డితోపాటు కొండపోచమ్మసాగర్ నిర్వాసిత కాలనీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాశ్ మిరుదొడ్డి(దుబ్బాక): దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఐబీ ప్రకాష్ తెలిపారు. గురువారం మిరుదొడ్డిలోని వికలాంగుల పునరావాస కేంద్రంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల మాదిరిగా దివ్యాంగుల సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఏపీఎం డాకయ్య, మండల ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు గౌతమి, సహారా ఎన్జీఓ ప్రతినిధులు, సీసీలు, నైబర్ హుడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రోడ్డుకు మరమ్మతులు గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దెబ్బతిన్న ప్రధాన రోడ్డు మరమ్మతులపై మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించింది. కొంతకాలంగా ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులకు నరకం చూపుతున్నాయి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మబాయి, కౌన్సిలర్లు స్వప్న, మన్నె రూప పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో జిల్లా ప్రతిభ సిద్దిపేటజోన్: ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న సీనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ప్రతిభ చూపారు. తొలిరోజు రెండు పతకాలు దక్కాయి. ట్రిపుల్ జంప్ విభాగంలో రాహుల్ బంగారు పతకం, 100 మీటర్ల పరుగులో జ్ఞానేశ్వర్ వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్స్వామి తదితరులు అభినందించారు. -
త్వరలోనే కొత్త పింఛన్లు
దుబ్బాక: త్వరలోనే అర్హులైన పేదలందరికీ కొత్త పింఛన్లు అందించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. గురువారం భూంపల్లి– అక్బర్పేట మండలం నగరం రామలింగేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 594 మంది లబ్ధిదారులకు రూ.5.94 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని 10 వేల ఇళ్లు మంజూరు కాగా 80 శాతం గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జిల్లాలో కొత్తగా 45 వేల రేషన్ కార్డులు అందించామన్నారు. స్కూల్ పిల్లలకు కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకంతో పాటు ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నభోజనం అందించనున్నామన్నారు. రైతులు ఏమాత్రం అధైర్యపడవద్దని ధాన్యం చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.కోర్టు భవన నిర్మాణ స్థలం పరిశీలన దుబ్బాక పట్టణంలో కొత్తగా కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి వివేక్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాత ఆస్పత్రి ఆవరణలోనే కోర్టు భవనం నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మంత్రికి విన్న వించారు. గ్యారంటీలన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ -
ఎనిమిదేళ్లుగా సా..గుతున్న 50 గదుల నిర్మాణం
పూర్తి స్థాయి ఈఓలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం బండ్ల గుట్టపై 50 గదుల నిర్మాణం చేపట్టారు. అది ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ అధికారులు సైతం ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పూర్తి స్థాయిలో అధికారి ఉండి పర్యవేక్షిస్తే ఎప్పుడో పూర్తి అయ్యేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. గదుల కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవాలయానికి సమీపంలో దాసరి గుట్టపైన కాటేజీల నిర్మాణం కోసం రూ.6కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు సైతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్యూ కాంప్లెక్స్ పనులు సైతం పూర్తి కాలేదు. అదే విధంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై సరైన మానిటరింగ్ లేకపోవడంతో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నత అధికారులు స్పందించి పూర్తి స్థాయి ఈఓను నియమించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. -
రుణ లక్ష్యాలు సాధించాలి
సిద్దిపేటరూరల్: జిల్లాలో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు మరింతగా అందించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సబ్సిడీ ఆధారిత పథకాల రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని బ్యాంకులు మొత్తం రూ.9,450 కోట్ల రుణాలు పంపిణీ చేసి 87.60 శాతం లక్ష్యాన్ని సాధించాయన్నారు. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ముందుండాలన్నారు. ముద్ర, విద్య, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో గణనీయమైన సేవలు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే రైతులకు సత్వర సేవలందించేలా కలెక్టరేట్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతరించిపోతున్న గొల్లభామ చీరలు నేసే కళను ప్రోత్సహించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వినూత్న వ్యాపార ప్రణాళికలు రూపొందించాలని, టెక్స్టైల్స్ పార్క్తో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులకు తగిన సలహాలు, ఆర్థిక సహకారం అందించి పంట దిగుబడులు తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఎల్డీఎం హరిబాబు మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి జిల్లాకు మొత్తం రూ.11,829 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికనును కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం హేమలత, యూబీఐ ఆర్ఎం మకరంద్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎంలు, డీసీసీబీ డీజీఎం విశ్వేశ్వర్, నాబార్డ్ డీడీఎం నిఖిల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వ్యవసాయ, డీఆర్డీఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ హైమావతి కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష -
సాగు భారమే..
వానాకాలం సీజన్కు సన్నద్ధమవుతున్న రైతులకు సాగు భారంగా మారింది. విత్తన సబ్సిడీ గతంలో మాదిరిగానే జనుము, జీలుగలాంటి పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితమైంది. యాంత్రీకరణ నామమాత్రంగా మిగిలిపోయింది. మరోవైపు కాంప్లెక్స్ ధరల పెరుగుదల కలవరాన్ని సృష్టిస్తోంది. – గజ్వేల్ జిల్లాలో ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్కు సంబంధించి 5.41లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇందులో వరి భారీగా 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వచ్చే అవకాశమున్నది. ఇందుకోసం జిల్లాకు వివిధ రకాల వరి విత్తనాలు 60వేల క్వింటాళ్లకుపైగా అవసరముంటాయి. కాగా కంది ఈసారి 7,431 ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా ఉండగా.. సుమారు 800 క్వింటాళ్లకుపైగా విత్తనాలు అవసరముంటాయి. మొక్కజొ న్న 28వేల ఎకరాలకుపైగా, మరో 14వేల ఎకరాల్లో పెసర్లు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నది. విత్తనాలకు సబ్సిడీ లేక.. ప్రభుత్వం గతంలో వరి, మొక్కజొన్న, పెసర్లు, మినుమలు, కందులు, పొద్దు తిరుగుడు, శనగలు తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేది. వీటిపై రైతులకు 33నుంచి 50శాతం సబ్సిడీ వర్తించేది. ప్రస్తుతం జనుము, జీలుగ లాంటి పచ్చిరొట్ట విత్తనాలకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుండగా, మిగతా వాటికి పూర్తిగా ఎత్తేశారు. జిల్లా రైతులకు ప్రధానంగా 60వేల క్వింటాళ్ల మేర వరి విత్తనాల అవసరముంటాయి. వీటి ధర తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.6500 రూ.9000 వరకు లెక్కిస్తే రైతులు రూ.39–54కోట్ల మేర విత్తనాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై కనీసం 25శాతం సబ్సిడీ అందించినా రైతులపై కోట్లల్లో భారం తప్పేది. కానీ సబ్సిడీని పునరుద్ధరించే అవకాశమే కనిపించడం లేదు. ఇదే తరహాలో మొక్కజొన్న, కంది, సోయాబీన్, పెసర్లు, మినుములపై భారం తప్పని పరిస్థితి నెలకొన్నది. కానరాని ‘యాంత్రీకరణ’ వానాకాలం సాగుకు మరో కీలకమైన అంశం యాంత్రీకరణ. ఇది కూడా ఈసారి నామమాత్రంగానే మిగిలిపోయింది. గతంలో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేవారు. భారీ వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ఇచ్చేవారు. కానీ ప్రస్తు తం కల్టివేటర్, రొటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, వరి మోపుల మిషన్లు అందిస్తున్నారు. ఇవీ కూడా పరిమితంగా అందజేస్తున్నారు. మొత్తానికి వానాకాలం సాగుకు ప్రతిదీ ఈసారి భారంగా మారిందనడంతో సందేహాం లేదు.పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలుఈ సీజన్లో యూరియా, డీఏీపీ ధరలు పెరగలేదు. కానీ కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం రైతుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నది. జిల్లా రైతులకు 46వేల క్వింటాళ్ల కాంప్లెక్స్ ఎరువులు అవసరముంటాయి. కాంప్లెక్స్ ఎరువుల్లోని వివిధ రకాలపై గతంలో బస్తాకు రూ.1600–1800 ధర ఉండగా, ప్రస్తుతం 200–500పెరిగింది. సాగులో ఈ ఎరువులు కీలకం. లెక్కన రైతులపై తీవ్రమైన భారం పడుతున్నది. వానాకాలం సీజన్కు రైతుల సన్నద్ధం విత్తన సబ్సిడీ.. జనుము, జీలుగకే పరిమితం యాంత్రీకరణ నామమాత్రమే కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదలతో కలవరం -
అధికారుల బాధ్యత కీలకం అధికారుల బాధ్యత చాలా కీలకమైందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్గౌడ్ అన్నారు. వివరాలు 9లో u
అధిక కేసులుపరిష్కరిద్దాం ● లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీపడేటట్లు చూడాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్లో ఉన్నాయని.. ఈ నెల 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో రాజీపడేటట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ప్రధాన న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పూర్తిగా పరిష్కరించాలన్నారు. లోక్అదాలత్లో కేసుల పరిష్కారంలో వేగం పెంచి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండే విధంగా న్యాయ, పోలీసు అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పెండింగ్ కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా పనిచేయాలన్నారు. కక్షిదారులు సైతం ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, కాంతరావు, ఏసీపీలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి
చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు మంగళవారం చిన్నకోడూరు, పెద్దకోడూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, మంచి ల్యాబ్లు, గ్రంథాలయం వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటర్ విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు వివరించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చేరి నాణ్యమైన విద్య పొందాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు. గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలుడీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రిఫరల్ కేసులకు సురక్షిత ప్రసవాల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తల్లి శిశువు ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా 9న వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సేవల ద్వారా మాతా శిశు మరణాల రేటును తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ట్రాక్టర్లు బారులు రైస్మిల్లు వద్ద రైతుల పడిగాపులు మద్దూరు(హుస్నాబాద్): ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకునేందుకు రోజులతరబడి రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి. ధాన్యంతోపాటే రైతులు సైతం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మద్దూరు మండలంలోని వల్లంపట్ల రైస్మిల్లు వద్ద మూడురోజులుగా వందల సంఖ్యలో ధాన్యం బస్తాల ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రోజుల తరబడి క్యూలైన్లలో ఉండటంతో వాహనాల కిరాయి పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు వ్యవసాయ పనులు ముందుకు సాగడంలేదని రైతులు తెలిపారు. సుమారు రెండు నెలలు గడిచినా కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడం లేదని వాపోతున్నారు. రైస్మిల్లుకు తీసుకువచ్చిన వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని రైతులు కోరారు. 13న మహిళలకు సైక్లింగ్ పోటీలుఅక్కన్నపేట(హుస్నాబాద్): అంతక్కపేటలో ఈ నెల 13న మహిళలకు సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి శ్రీనివాసులు, జంగపల్లి వెంకటనర్సయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖేలో ఇండియా మహిళల సిటీ లీగ్ పోటీలు అండర్ 16, 18, 20 విభాగాలలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనే వారు సొంత సైకిల్, హెల్మెట్తో హాజరు కావాలని అన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 9640760193, 9441925763 నంబర్లను సంప్రదించాలన్నారు. -
మొబైల్ సరెండర్ చేయలే..
సాక్షి, సిద్దిపేట: సస్పెండ్కు గురైన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. ప్రభుత్వ మొబైల్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పటివరకు సరెండర్ చేయలేదు. రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో వైఫల్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తదితర అంశాలపై ఆశ్రిత్ కుమార్ను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి సస్పెండ్ చేస్తూ ఈ నెల 5న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చెందిన మొబైల్ నంబర్ను ఇప్పటి వరకు సరెండర్ చేయకపోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్లుగా పని చేసిన వారందరూ మొబైల్ నంబర్ 9505507241 వినియోగించగా ఆశ్రిత్ కుమార్ వచ్చిన తర్వాత పలు సమస్యలపై ప్రజలు ఫోన్లు చేస్తుండటంతో ఈ నంబర్ను సీసీకి అందజేశారు. అదే కార్యాలయంలో గతంలో ఏఈ వినియోగించి సరెండర్ చేసిన మొబైల్ నంబర్ 9640445111ను ఆశ్రిత్ కుమార్ వినియోగించారు. ఆశ్రిత్ కుమార్ వినియోగించిన ప్రభుత్వ నంబర్ను సరెండర్ చేయలేదు. నిలిచిన ప్రొసీడింగ్స్.. ఇందిరమ్మ ఇళ్ల పథకాని సంబంధించిన, ఎన్నికలకు సంబంధించిన, జనన, మరణాల సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఇలా ఓటీపీలన్నీ ఇదే నంబర్కు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి ప్రొసీడింగ్లు ఇవ్వడం నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. అలాగే ఓటర్లకు సంబంధించిన పనులు సైతం నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ల కోసం లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మొబైల్ నంబర్ సిమ్ను తెప్పించి ఓటీపీలతో అమోదం తెలిపేలా చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. దీనిపై మేనేజర్ శ్రీనివాస్ను సంప్రదించగా తనకు తెలియదని, తెలుసుకుంటానని చెప్పడం గమనార్హం. సస్పెన్షన్ అయిన కమిషనర్ నిర్వాకం అదే ఫోన్కు ఓటీపీలు నిలిచిన పలు అప్రూవల్స్ -
చదువులు సాగేదెలా?
జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత పాఠశాలలు 201 ఉన్నాయి. వీటిలో 67,921 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏ పాఠశాల చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వేసవి సెలవుల్లో సమస్యల పరిష్కారానికి ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో ఇరుకు తరగతి గదులు.. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఇబ్బందులు తప్పేలాలేవు. ముందుకుసాగని ‘మన బడి’ పనులు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ పనులు పలు చోట్ల అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 343 ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్స్ కోసం రూ.85కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 52 పాఠశాలలోనే పనులు పూర్తి కాగా మిగతా 291 పాఠశాలలో మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే గతేడాది 846 పాఠశాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.39కోట్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటి వరకు 85 వాటిలో మాత్రమే పూర్తిగా కాగా 636లలో పెండింగ్లో ఉన్నాయి. మరో 79 పాఠశాలలో పనులే ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులు ఉగ్గపట్టాల్సిందే.. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మొత్తం 357 మంది చదువుతున్నారు. ఇందులో 194 బాలికలు, 163 బాలురు ఉన్నారు. వీరందరికి, ఉపాధ్యాయులకు కలిపి నాలుగు మాత్ర మే మూత్రశాలుండగా బాలురు పూర్తిగా బయటకే వెళ్తున్నారు. మరో 8 మూత్రశాలల నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. మధ్యలోనే నిలిచిపోయాయి. గత ఏడాది నుంచి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా మొత్తంగా జిల్లాలోని బాలురులకు 77, బాలికలకు 24 చోట్ల మూత్రశాలలు లేవు. విద్యుత్ సౌకర్యం లేక.. జిల్లాలోని 14 ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని విఠాలపూర్, చల్కపల్లి, చౌడారం, గోనెపల్లి, రామూనిపట్ల, బెజ్జంకి మండలంలోని పోతారం(బెజ్జంకి), దేవేంద్రనగర్(హుస్నాబాద్), హుస్సేన్నగర్(నంగునూరు)లో విద్యుత్ సౌకర్యం లేక తిప్పలు తప్పడంలేదు. అలాగే తడ్కపల్లి(సిద్దిపేట అర్బన్), కొండాపూర్(మిరుదొడ్డి), మాదన్నపేట(అక్బర్పేట భూంపల్లి), మాలపల్లి(వర్గల్), తుర్కకాశానగర్ (కొండపాక), శనిగకుంట(నారయణరావుపేట) పాఠశాలలో విద్యుత్ సౌకర్యం లేదని అధికారులు గుర్తించారు.ప్రభుత్వ బడులు సమస్యలతోసతమతమవుతున్నాయి. వేసవి సెలవుల్లో మౌలిక వసతుల కల్పనపై విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం దృష్టి సారించకపోవడంతో ఈసారి తిప్పలు తప్పేలాలేవు. మరో ఐదు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేటసర్కారు బడి.. సమస్యల ఒడి మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం అర్ధంతరంగా నిలిచిన ‘మన బడి’ పనులు 157 పాఠశాలలకు ప్రహరీలు కరువు 101 చోట్ల మూత్రశాలలు లేక బాలబాలికలకు తిప్పలు వేసవి సెలవుల్లో కానరాని వసతుల కల్పనకిచెన్ షెడ్స్ లేని పాఠశాలలు: 161ప్రహరీలు లేని బడులు: 157బాలురలకు మూత్రశాలలు లేనివి: 77బాలికలకు సైతం లేని స్కూల్స్: 24విద్యుత్ సౌకర్యం లేనివి: 14ప్రహరీ లేక పై ఫొటోలో కనిపిస్తున్నది కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, కుక్కలు ఆవరణలోనే తిరుగుతుంటాయి. దీనితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికులు పలు మార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకవెళ్లారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రహరీ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇలా ఒక్క పాఠశాలే కాదు జిల్లాలో 157 పాఠశాలలకు ప్రహరీ లేనివే ఉన్నాయి. -
పర్యావరణహితం.. గురుకులం
వర్గల్(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణ, సుస్థిర విధానాలు పాటించడం ద్వారా వర్గల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంపాక్ట్ సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026లో సస్టైనబుల్ క్యాంపస్గా ప్లాటినం సర్టి ఫికెట్ అందుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ గ్లోబల్పీస్ ఆడిటోరియంలో ఇటీవల నిర్వహించిన సదస్సులో వర్గల్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు ‘ప్లాటినం సర్టిఫికెట్’ అందజేసినట్లు మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. సదస్సులో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కళాశాలలు పాల్గొన్నట్లు వివరించారు. జయప్రకాశ్ నారాయణ, టీజీహెచ్ఎస్ఈ చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శోభన్బాబు , ప్రముఖ పర్యావరణవేత్త కె.పురుషోత్తంరెడ్డి, నాబార్డ్ చీఫ్జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్ తదితర ప్రముఖుల సమక్షంలో సర్టిఫికేట్ అందుకోవడం ద్వారా గురుకులం రాష్ట్రస్థాయి ఖ్యాతి గడించిందిన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1, 2 ఆఫీసర్లు, విద్యార్థినులతో కలిసి నిర్వహించిన పర్యావరణ హిత కార్యక్రమాలతో ప్లాటినం సర్టిఫికెట్ దక్కిందంటూ వారిని అభినందించారు.వర్గల్ ‘పూలే’కు ప్లాటినం సర్టిఫికెట్ ప్రదానం -
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
చేగుంట(తూప్రాన్): మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. చందాయిపేట గ్రామంలోని దుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. కర్నాల్పల్లి గ్రామంలో బీరప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీర్వాదాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మహేశ్వరీ, ఉత్సవ కమిటీ సభ్యులు సాయిబాబా, నగేష్, యాదగిరి, ఆంజనేయులు, శోభన్, రమేశ్, బూదయ్య, మల్లయ్య పాల్గొన్నారు. వెంకటాపూర్లో బీరప్ప జాతర ఉత్సవాలు రామాయంపేట(మెదక్): మండలంలోని వెంకటాపూర్ (ఆర్)లో సోమవారం బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ సంఘం సభ్యులతోపాటు గ్రామ సర్పంచ్ ఉమ, ఉప సర్పంచ్ అనురాధ, వార్డు సభ్యులు నాగరాణి, రేవతి తదితరులు బోనాలు ఎత్తుకొని గ్రామం నుంచి ఆలయం వద్దకు వెళ్లారు. -
ఏబీవీపీ నగర నూతన కమిటీ ఎన్నిక
గజ్వేల్రూరల్: ఏబీవీపీ నగర కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. స్థానిక సరస్వతి శిశుమందిర్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంల నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఉమ్మడి విభాగ్ కన్వీనర్ ఆదిత్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గజ్వేల్ నగర కార్యదర్శిగా వల్లకాటి గురు, ఉపాధ్యక్షులుగా దావల్, అభిచరణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్యన్, సాయిచరణ్, సుజిత్, మహిళా కన్వీనర్గా అఖిల, ఎస్ఎఫ్డీ కన్వీనర్గా యశ్వంత్, కో కన్వీనర్గా చంటి, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్గా భరత్, కో కన్వీనర్గా రెహాన్, ఖేల్ కన్వీనర్గా భాను, కో కన్వీనర్గా శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్గా కౌశిక్ను ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
తొందరపడి విత్తనాలు వేయొద్దు
● తగిన తేమ లేకపోతే నష్టమే.. ● వ్యవసాయ అధికారి సూచనలు చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. తొలకరి జల్లులు కురువగానే విత్తనాలు వేసేందుకు కొందరు రైతులు సిద్ధమవుతున్నారు. ఇలా తొందరడి విత్తనాలు వేయడం వల్ల రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్ తెలిపారు. భూమిలో తగినంత తేమ లేనప్పుడు విత్తనాలు వేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసేటప్పుడు రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సరైన తేమ లేకుండా విత్తితే మొలక శాతం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో రైతుల శ్రమ, పెట్టుబడి వృథాగా పోతుంది. మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. దీంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలోని ఒక అంగుళం పొర వరకు మాత్రమే తేమ లభిస్తుంది. కాబట్టి కనీసం 60మిమీ వర్షపాతం నమోదై, భూమి లోపలి పొరల వరకు తగినంత తేమ చేరిన తరువాత మాత్రమే విత్తనాలు నాటడం ప్రారంభించాలి. పొడిగా ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనంత తేమ అందదు. దీంతో మొలకెత్తటం కష్టంగా మారుతుంది. కొన్ని విత్తనాలు మొలకెత్తినప్పటికీ అవి ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఎండిపోయే ప్రమాదం ఉంది. విత్తనం పెట్టిన తరువాత ఎండల తీవ్రత పెరిగితే భూమిలోని వేడికి విత్తనం మురిగిపోతుంది. తగినంత తేమ లేకుండా విత్తడం వల్ల మొక్కల ఎదుగుదల కూడా సరిగా ఉండదు. -
మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్
సిద్దిపేటజోన్: సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ సోమవారం తాత్కాలికంగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆశ్రిత్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న మల్లికార్జున్ను తాత్కాలికంగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టి అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్ విజేతలకు సన్మానంవర్గల్(గజ్వేల్): జిల్లాస్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్ పోటీలో ప్రతిభ చాటిన వర్గల్ మండలం నెంటూరు యువకులను సర్పంచ్ బి.నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. పంచాయతీ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి పొందిన దుర్గాప్రసాద్, తృతీయ స్థానం పొందిన రాముయాదవ్, ప్రవీణ్తోపాటు, జిమ్ ట్రెయినర్, మాజీ సైనికోద్యోగి జి.హన్మంతును అభినందిస్తూ మెమెంటోలు అందజేశారు. శాలువాలు కప్పి సన్మానం చేశారు. భారతసైన్యంలో సేవలందించి పదవీవిరమణ పొందిన హన్మంతు చక్కని శిక్షణతో యువతను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ‘ప్రైవేట్’ను అరికట్టాలని వినతి హుస్నాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మండల విద్యావనరుల కేంద్రంలోని సిబ్బందికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ముందుగానే కల్పించాలన్నారు. పైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా పుస్తకాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోయారు. సరైన సదుపాయాలు, ఆట స్థలాలు లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు సంతోష్, అంజి, రంజిత్, చరణ్లు పాల్గొన్నారు. రామంచలో బడిబాట చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రామంచలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలుక నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామని చెప్పారు. తమ పిల్లలను బడికి పంచించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ భవాని, హెచ్ఎం సురేశ్కుమార్, టీచర్లు పాల్గొన్నారు. ఎంపీఓల బాధ్యతల స్వీకరణ మద్దూరు(హుస్నాబాద్): మద్దూరు, దూల్మిట్ట మండలాల పంచాయతీ అధికారులుగా జి.వెంకటేశ్వర్లు, మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మోహన్ను డిప్యుటేషన్పై ఎంపీఓలుగా నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. -
సమగ్ర వ్యవసాయంతోనే అధిక దిగుబడులు
హుస్నాబాద్రూరల్: రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవర్చుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ వీణారెడ్డి చెప్పారు. మీర్జాపూర్ రైతువేదికలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రైతులకు సమగ్ర వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల జూన్ తర్వాత వర్షాలు పడే అవకాశం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకాకుండా ఇతర పంటలవైపు మొగ్గుచూపాలని సూచించారు. పప్పుధాన్యాల సాగును ఎంచుకోవాలని, తక్కువ నీరుతో పంట చేతికి వస్తుందని మార్కెట్లో డిమాండ్ ఉండి గిట్టుబాటు ధరకూడా లభిస్తుందన్నారు. గ్రామాల్లో రైతులకు సేవలందించడానికి పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రైతులకు కావల్సిన సేవలను ఈ కేంద్రాల ద్వారా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సెర్ప్ డీపీఎం మధుసూదన్, ఏపీఎం తిరుపతి, ఏఓ పూజ, సర్పంచ్లు వేల్పుల సంపత్, మామిడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.ఏడీఏ వీణారెడ్డి -
‘చెలిమి’ చేయూత
గజ్వేల్రూరల్: అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ బైక్ మెకానిక్కు చెలిమి ఫౌండేషన్ అండగా నిలిచింది. పట్టణానికి చెందిన మెకానిక్ తూం దేవేందర్ ఇటీవల అనారోగ్యానికి గురైన సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం చేయించేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు స్పందించారు. బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించి రూ.15 వేలు, వారి మిత్రబృందం సహకారంతో మరో రూ.25 వేలు అందించి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గుంటకు శ్రీను, ఆంజనేయులు, శ్రీనివాస్, నర్సింహులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వెంకటరమణకు విశిష్ట సాహిత్య పురస్కారం
బెజ్జంకి(సిద్దిపేట): సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు, విద్యారత్న అవార్డు గ్రహీత నారోజు వెంకటరమణ విశిష్ట సాహిత్య పురస్కారం పొందారు. ఆంద్రప్రదేశ్లోని రాజమండ్రి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పూర్వ కులపతి, ఎంఎల్సీ కేవీవీ సత్యనారాయణ చేతుల మీదుగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకున్నారు. చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదికల ఆధ్వర్యంలో 7, 8వ తేదీలలో జరిగిన మహాసభలకు ఆమె సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పురస్కారం అందుకున్నట్టు వెంకటరమణ మంగళవారం తెలిపారు. -
ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమిస్తాం..
● 12న జిల్లా మహాసభలు ● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత శశిధర్కొమురవెల్లి(సిద్దిపేట): ఉపాధిహామీ కూలీల రక్షణకై ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో ఉల్లంపల్లి సాయిలు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పేరును తొలగించి వీబీజీ రాంజీ చట్టాన్ని అమలుచేసి కార్మికుల పొట్టకొడుతోందన్నారు. పాత చట్టాన్నే అమలుచేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 12న కొమురవెల్లిలో నిర్వహించనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తాడూరి రవీందర్, పాశికంటి బాలరాజు, మ్యాకల మల్లేశం, కానుగుల రాజు, తాడూరి కవిత తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణం, పరిశుభ్రతపై గ్రామసభలు
బెజ్జంకి(సిద్దిపేట): పర్యావరణం, పరిసరాల పరిశుభ్రతపై సోమవారం మండలంలోని దేవక్కపల్లె, ముత్తన్నపేట, దాచారం, నర్సింహులపల్లె, రామసాగరం, తోటపల్లి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలను వేరువేరుగా అందించాలని ఎంపీడీఓ ప్రవీణ్ సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వద్దు.. హుస్నాబాద్రూరల్: వర్షాకాలంలో సీజనలు వ్యాధులు రాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఎంఈఓ మనీల సూచించారు. గాంధీనగర్లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంచేస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ పోలు సంపత్, కార్యదర్శి శ్రేయ, ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి మద్దూరు(హుస్నాబాద్): సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచ్ చెట్కూరి కమలాకర్యాదవ్ అన్నారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన నీరు, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అనంతరం గ్రామంలోని ఊరచెరువు చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ ఫయూంకు వినతిపత్రం అందజేశారు. అచ్చుమాయిపల్లిలో దుబ్బాకరూరల్: మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో సర్పంచ్ దేవరాజ్ మాట్లాడుతూ గ్రామంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదన్నారు. తడిపొడి చెత్తను వేరుచేసి చెత్తను సేకరించే వాహనంలో వేయాలని సూచించారు. -
వరి కొయ్యలే ఊపిరాపె
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని పొలాల్లో సిరుల రాశులను తీయాల్సిన రైతులకు వరి కొయ్యలు మృత్యుపాషాల్లా మారుతున్నాయి. అవగాహన రాహిత్యంతో కాలుస్తున్న వరి కొయ్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటిని కాల్చే క్రమంలో వచ్చే పొగ ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎగసి పడే మంటలు రైతుల ప్రాణాలను తీస్తున్నాయి. వరి కొయ్యలను కాల్చే క్రమంలో పచ్చని చెట్లు, వ్యవసాయ సామగ్రి దగ్ధమవుతుండగా, మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో మిరుదొడ్డి, అందె, దుబ్బాక మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలను కాల్చే క్రమంలో ముగ్గురు రైతులు బలయ్యారు. సిరులు పండాల్సిన పంట పొలాల్లో రైతుల శవాల కమురు ముసురుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరి కొయ్యలను కాల్చడం వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పచ్చని చెట్లు.. బుగ్గిపాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డుకు రెండు వైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు కాలి బూడిదయ్యాయి. మండలంలోని నందారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నందారం స్టేజీ నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు రెండు వైపులా హరితహారంలో భాగంగా మూడేళ్ల కిందట సుమారు 100కుపైగా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెరిగి నీడనిస్తున్నాయి. రెండు రోజుల కిందట రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల రైతులు నిప్పుపెట్టి సుమారు 32 చెట్లను బుగ్గిపాలు చేశారు. దీంతో పంచాయతీ పాలకవర్గం ముగ్గురు రైతులను గుర్తించి జరిమానా విధించింది. అందు లో బొమ్మరాజుకు రూ.4 వేలు, పెర్క ఎల్లయ్యకు రూ.2 వేలు విధించగా, మూడో వ్యక్తి జరిమానా కట్టేందుకు ముందుకు రాకపోవడంతో కేసు నమోదు చేయిస్తామని పంచాయతీ కార్యదర్శి తిరుపతి తెలిపారు. ● నిప్పు పెట్టిన రైతులు ● జరిమానా విధించిన అధికారులు -
మార్వాడీ వ్యాపారులు వద్దంటూ ఆందోళన
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేటలో మార్వాడీ వ్యాపారులు కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయకూడదంటూ స్థానిక వర్తక, వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మార్వాడీ గో బ్యాక్ అంటూ ఆదివారం ర్యాలీ నిర్వహించి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్తక, వ్యాపార సంఘం అధ్యక్షుడు యాదగిరిగౌడ్, ఉపాధ్యక్షులు మురళి, విజయ్, ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడారు. ఇప్పటికే గ్రామంలో నెలకొల్పిన మార్వాడీల దుకాణాల వల్ల స్థానిక వ్యాపారులు ఉపాధి కోల్పోయారన్నారు. కొత్తగా మరికొందరు దుకాణాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. వ్యాపారులు నర్సింహులు, హన్మంత్గుప్తా, రమేశ్గుప్తా, భాస్కర్గుప్తా, సింహంగుప్తా, వెంకటేశ్, నాగరాజు, అంజి, సంతోష్, సంపత్, ప్రభుచారి, సందీప్గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పాతూర్కు ‘జాతీయ’ అందాలు..
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని పాతూర్ మీదుగా కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి ఆ గ్రామానికి సరికొత్త రూపురేఖలను తీసుకొచ్చింది. గతంలో ఇరుకు రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు, ప్రయాణికులకు ఈ హైవే నిర్మాణంతో ఉపశమనం లభించింది. గతంలో గుంతలపై ఇబ్బందులు పడగా.. ప్రస్తుతం ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారి గ్రామానికి సరికొత్త కల తీసుకురావడంతోపాటు చూపరులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాఫీగా సాగుతున్న ప్రయాణం -
స్నేహితుడి కుటుంబానికి భరోసా
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ముస్లిం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు షాజీద్, బాసిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా సయ్యద్ షౌకత్అలీ, అధ్యక్షుడిగా ఫకృద్దీన్, ఉపాధ్యక్షుడిగా గౌస్, సయ్యద్ సందాని, ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్, కార్యదర్శులుగా మిస్బావుద్దీన్, అలం, కోశాధికారి అజీత్ ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపికయ్యారు. కార్యక్రమంలో మేవా సభ్యులు పాల్గొన్నారు. నల్లపోచమ్మదేవీ.. కరుణించుతల్లీ.. కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్, ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్ అమ్మవారికి పంచామృతంతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలకు పూజలు చేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. -
ఓటర్ మ్యాపింగ్ తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోమవారంతో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ముగియనుందని, అర్హులైన ఓటర్లంతా తప్పనిసరిగా ఓటరు మ్యాపింగ్ చేసుకోవాలని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు సూచించారు. పట్టణంలోని జంబికుంట వీధిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అధికా రులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవాలన్నారు. లేదంటే ఓట్లు తొలగింపబడతాయని తెలిపారు. 10వ తేదీ అనంతరం ఇంకా మ్యాపింగ్ చేసుకోని ఓటర్లకు నమోదు పత్రాలు ఇస్తామని, వాటి ద్వారా సరి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు
సాక్షి, సిద్దిపేట: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేదలు త్వరలో కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం నడుస్తుండగానే.. 2026–27 ఏడాదికి సంబంధించి రెండో విడత ఇళ్లను మంజూరు చేసింది. అయితే ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించగా, వీటిలో మొదటగా గుడిసెల్లో ఉండి, నిబంధనల ప్రకారం అర్హులుగా ఉన్న వారికి మంజూరు చేయనున్నారు. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 10,898 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ముగ్గులు పోసి 10,120 గృహాలను ప్రారంభించగా, ఇప్పటివరకు 2,068 నివాసాలు పూర్తయ్యాయి. పలువురు గృహ ప్రవేశాలు సైతం చేశారు. రెండో విడతలో జిల్లాకు దాదాపు మరో 8 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. వారికి 500 ఇళ్ల చొప్పున.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని నిర్ణయించారు. అందులో తొలి విడతలో ప్రత్యేకంగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి 500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పలువురిని గుర్తించి అవతరణ దినోత్సవం సందర్భంగా పలువురికి మంజూరు పత్రాలను అందజేశారు. దీంతో గుడిసెలు కాస్తా బంగ్లాలుగా మారనున్నాయి. గతంలో నిలిచిన ఇళ్లకు సాయం గత ప్రభుత్వంలో మంజూరు చేసిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. గోడలు, స్లాబుల దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇళ్ల కోసం రాజకీయ నాయకుల వద్దకు లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. రెండో విడతలో మంజూరు గుడిసెలో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇప్పటికే పలువురికి మంజూరు పత్రాలు -
తుర్క కాశీలకు అండగా ఉంటాం
రాబోయేది తమ ప్రభుత్వమేనని, తుర్కకాశీలకు జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తామని హరీశ్రావు అన్నారు. శనివారం విపంచి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ అమీర్ ఖాన్ సహకారంతో తుర్కకాశీలకు పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్లో 4వేల కోట్లు పెట్టి 1100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ 5కోట్ల నిధుల కేటాయింపు హామీ విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ 50కోట్లు పెంచి మీ జీవితాల్లో వెలుగులు నిండేలా చూస్తామన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా అమీర్ ఖాన్ సేవ చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనవంతు తుర్కఖాసీలకు 50 రాళ్లు కొట్టే మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ అమీర్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ మాట్లాడుతూ.. హరీశ్ నమ్మకానికి ప్రతీకగా అభివర్ణించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మస్కత్ అలీ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్స్, తుర్క ఖాసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడే సాబ్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
రహదారి.. ఫలాలహారం
హరితంగా మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారిసాక్షి, సిద్దిపేట: భూ భాగంలో 33శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, నూతనంగా రోడ్ల నిర్మాణం, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరిగిపోతున్నాయి. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పర్యావరణ పరిరక్షణ , జీవవైవిధ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రీన్ హైవేస్ పాలసీలో భాగంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పండ్ల, పూల, ఔషధ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెదక్–ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీలో లక్ష పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి 134 కిలో మీటర్లను రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్నారు. దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. దీంతో రోడ్డు నిర్మాణం సమయంలో భారీ వృక్షాలను తొలగించడంతో నీడ, పచ్చదనం కరువైంది. రోజు రోజుకు వాహనాల రాకపోకలు పెరుగుతుండటంతో పొల్యూషన్ ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. దీంతో వాహనాలు పూర్తిస్థాయిలో పెరగకముందే రోడ్డుకు ఇరువైపులా లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించారు. జాతీయ రహదారుల వెంట పచ్చదనాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, కోతులు, వన్యప్రాణులకు ఆహారాన్ని అందించడానకి పండ్ల మొక్కలను నాటనున్నారు.ఇరువైపులా లక్ష పండ్ల మొక్కలు నాటేలా ప్రణాళిక -
ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు!
నారాయణఖేడ్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలైంది. మెదక్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ కార్మిక నాయకులు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన డిమాండ్లతో కార్మికులు ఇటీవల పెద్దఎత్తున ఆందోళన చేపట్టగా..కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల అనంతరం సమ్మె విరమించిన విషయం విదితమే. ఇచ్చిన హామీమేరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో రిటర్నింగ్ అధికారిగా జంట నగరాల కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్దాస్ను నియమించింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, పోలింగ్ తేదీలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. రీజియన్లో కదలిక.. ఎన్నికల్లో గెలుపొందిన సంఘంతో ప్రభుత్వం, కమిటీ చర్చలు జరిపిన తర్వాతనే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరగనుంది. తమను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు చేస్తున్న పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగిరావడం, విలీన ప్రక్రియకు ఎన్నికల నగారాకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. కాగా, మెదక్ రీజియన్ పరిధిలో సైతం కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రీజియన్లో తెలంగాణ మజ్దూర్ యూనియర్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన యూనియన్లుగా ఉండగా వీటితోపాటు మరికొన్ని యూనియన్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనియన్లలోనే సభ్యత్వ నమోదు గతంలో అధికంగా జరిగేది. 1,950 మంది కార్మికులకు ప్రయోజనం మెదక్ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ కండక్టర్లు 1,014, డ్రైవర్లు 508, మెకానిక్లు, ఏడీసీ, సూపర్వైజర్లు, డీఎం ఆఫీస్స్టాఫ్ తదితరులు కలిపి 428 మందిగా మొత్తం రెగ్యులర్ కార్మికులు 1,950 మంది కొనసాగుతున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ జరిగాక ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని గుర్తించనున్నారు. త్వరలోనే షెడ్యూల్ విలీన ప్రక్రియ కోసం మొదలైన చర్యలు -
సైబర్ నేరాలపై అప్రమత్తం
సిద్దిపేటఅర్బన్: డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. సిద్దిపేట షీ టీం ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తు పదార్థాల అనర్థాలపై యువత అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, ఆన్లైన్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలని, ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. వైద్యులు, పోలీసులు 24 గంటలు ప్రజల కోసమే శ్రమిస్తారని, ఏ సమస్య ఎదురైనా తక్షణమే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ, షీ టీం ఇన్స్పెక్టర్ దుర్గ, త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు, కళాశాల ఏఓ అమృత్పాల్సింగ్, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ -
ముందస్తు చర్యలు చేపట్టండి
సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ప్రారంభం కానుందని, ముందస్తు చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈలతో నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులు, స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. చందళపూర్ లిఫ్ట్, ఇర్కోడ్ లిఫ్ట్ పనుల్లో జాప్యం జరుగుతోందని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులపూర్ చెక్ డ్యామ్, కస్తూరి పల్లి చెక్డ్యామ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇటీవల మంజూరైన మిట్టపల్లి, గుండ్ల చెరువు వంతెన పనులు, రాఘవాపూర్ ఇంద్రగూడెం పల్లెకుంట పనులు, ముండ్రాయి మెరుపుకుంట పనులు వేగవంతం చేయాలని సూచించారు. రంగనాయకసాగర్ నుంచి అనంతసాగర్ కాల్వ సర్వే పనులు 6కిలోమీటర్లకు గాను 3 కిలోమీటర్ల సర్వే పూర్తి అయిందని, వచ్చే యాసంగి నాటికి నీళ్లు అందేలా చూడాలన్నారు. అనంత సాగర్ నుంచి అల్లిపూర్ కర్ణాలకుంటకు లిఫ్ట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నారాయణరావుపేట మండలం మల్కాచెరువు వద్ద పైప్ లైన్ వేయాలని, దీని వల్ల కింది గ్రామాలకు నీరు అందుతుం దన్నారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే 4ఆర్ కాల్వలో భాగంగా రాఘవాపూర్ కన్నయ్య కుంటకు శాశ్వతంగా కాల్వ నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. పాలమాకుల ఊర చెరువు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్ఈ కిరణ్ ఈఈ వీర స్వామి, అధికారులు రమేష్ జాదవ్, శంకర్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది కలగొద్దు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఇరిగేషన్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి అధికారులతో ఎమ్మెల్యే హరీశ్రావు సమీక్ష -
పీడ విరిగింది
కమిషనర్ సస్పెండ్ .. బాణసంచా కాల్చిన బాధితుడు సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సస్పెన్షన్ నేపథ్యంలో శనివారం కార్యాలయం ఎదుట వివేకానంద నగర్ కాలనీకి చెందిన కనకయ్య బాణసంచా కాల్చి హల్చల్ చేశాడు. 17వార్డులో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా కమిషనర్ రద్దు చేసినట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాట్లలో విఫలం పేరిట అధికారులు ఇటీవల కమిషనర్ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. -
రేపు డీఏవోతో ఫోన్ఇన్ కార్యక్రమం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారితో నివృత్తి చేసుకునేందుకు సాక్షి ఆధ్వర్యంలో ‘ఫోన్ ఇన్ డీఏవో’కార్యక్రమం నిర్వహిస్తుంది. సాగుకు ఉపయోగనించనున్న విత్తనాలు, యాజమాన్యం పద్ధతి, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతులు అడిగే సందేహాలను డీఏవో నివృత్తి చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫోన్ ద్వారా జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణితో మాట్లాడి రైతులు సలహాలు, సూచనలను పొందవచ్చును. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 98668 98692, 86869 60064. జిల్లా రవాణాశాఖ అధికారిగా జోగేశ్వర్ జాదవ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రవాణాశాఖ అధికారిగా జోగేశ్వర్ జాదవ్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందించారు. ప్రజలకు, వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ నూతన జిల్లా రవాణాశాఖ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళుతున్న ఇన్చార్జి డీటీవో లక్ష్మణ్, సిద్దిపేట ఎంవీఐ శివస్వప్న, తదితరులు పాల్గొన్నారు.‘సంస్కార భారతి’ జిల్లా అధ్యక్షుడిగా బండోజుప్రశాంత్నగర్(సిద్దిపేట): సంస్కార భారతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బండోజు నరసింహచారి, కార్యదర్శిగా దుబ్బాక తిరుమలేశ్ నియామకం అయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమా, రాష్ట్ర సంఘటన మంత్రి నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎంపిక చేశారు. ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలిఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణీందర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లెల ఫణీందర్ అన్నారు. శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు సరిగా లేవని, పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలు పరిశుభ్రంగా లేకపోవడం, కనీసం తాగునీరు సరిగా లేవని ఆరోపించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హాస్టల్స్ కో కన్వీనర్ తరుణ్, లోకేశ్, హర్ష, సంపత్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలపై నిషేధం చేగుంట(తూప్రాన్): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్లో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ పాల్గొని ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చిన్నారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ ను నివారిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం
సిద్దిపేటలో గ్రీన్ ర్యాలీ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో శనివారం గ్రీన్ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘ప్లాస్టిక్ను నిరిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం’అని నినాదంతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు సమన్వయకర్త రవీందర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశా నిర్దేశం సిద్దిపేటరూరల్: బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభు త్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 8,500 విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, యువత, గ్రామస్తులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. మూతపడిన 61 ప్రభుత్వ పాఠశాలలను మళ్లీ తెరిపించేలా విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంభైన వెంటనే పాఠ్యపుస్తకాలను అందించాలన్నారు. జిల్లాలో గల 34 భవిత కేంద్రాలలో 296 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఉండగా శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ ద్వారా మరో 63 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో ఇంటర్ విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ వరగంటి శాస్త్రి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ రఫీక్ పాల్గొన్నారు.వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించండి రైతులు వరి కాకుండా వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జూమ్ సమావేశం ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీసారి వరి సాగు చేయడం ద్వారా భూమిలోని సారం తగ్గిపోతుందని, పంట మార్పిడి వైపు ప్రతీ రైతు ఆలోచన చేయాలన్నారు. వాణిజ్య పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్పాం సాగు వైపు సాగేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాల పంపిణీ కేంద్రాల్లో 50శాతం సన్నవడ్లు అమ్మేలా చూడాలని, సన్నవడ్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. పంట అవశేషాలు కాల్చొద్దు సిద్దిపేటరూరల్: పొలాల్లో పంట అవశేషాలు కాల్చవద్దని, అనేక నష్టాలు వస్తాయని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3 లక్షల 65 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 50 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. ఈ పంటలు కోసిన తర్వాత పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయన్నారు. గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని, కార్బన్ డైఆకై ్సడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయన్నారు. నేలలో సారం తగ్గుతుందన్నారు. అవశేషాలను కంపోస్ట్గా మార్చాలన్నారు. -
భూముల విలువ డబుల్
పెంపు సరికాదు..గజ్వేల్: రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిన తరుణంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను ఇష్టానుసారంగా పెంచడం సరికాదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రేవంత్రెడ్డి పాలనలో రియల్ఎస్టేట్కు గడ్డు రోజులు సంక్రమించాయన్నారు. ఇలాంటి తరుణంలో భూముల విలువలను పెంచడం ఇబ్బందేనన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం నిర్లక్ష్యాన్ని చాటుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మబాయి నర్సింగరావు, బీఆర్ఎస్ గజ్వేల్ పట్ట పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.సాక్షి, సిద్దిపేట: భూముల విలువలు డబుల్ అయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని బస్టాండ్ ఏరియా, సుభాష్ రోడ్లలో నివాస స్థలాల మార్కెట్ విలువ అత్యధికంగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఇది వరకు గజం మార్కెట్ విలువ రూ.23వేలు ఉండగా ప్రస్తుతం రూ.28,800 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూమి మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచింది. మార్కెట్ ధరల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పట్టణ శివారుల్లో గజం రూ.300 ఉండగా దానిని ఇప్పుడు రూ.600 పెంచారు. జిల్లా వ్యాప్తంగా 30శాతం నుంచి 150శాతం వరకు ధరలు పెంచారు. ఈ నెల 4వ తేదీ వరకు కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఒక్కసారిగా శుక్రవారం సందడి తగ్గిపోయింది. గజ్వేల్లో... గజ్వేల్లో అత్యధికంగా గజం భూమికి మార్కెట్ విలువను రూ.10,800 నుంచి రూ.16,200కు పెంచారు. ఇందిరమ్మ విగ్రహం నుంచి పాత కూరగాయల మర్కెట్ రోడ్, ప్రజ్ఞాపూర్ రోడ్, హైదరాబాద్ రోడ్లలో అత్యధికంగా భూమి విలువ పెరిగింది. వాస్తవంగా ప్రధాన రహదారుల్లో గజం భూమి రూ.40వేలకు పైగా పలుకుతోంది. హుస్నాబాద్లో హుస్నాబాద్లో అత్యధికంగా గజం భూమికి రూ.8,800 నుంచి రూ.11వేలుగా ప్రభుత్వ నిర్ణయించింది. హుస్నాబాద్ నుంచి సిద్దిపేట, హన్మకొండ మెయిన్ రోడ్లలో అక్కన్నపేట, కరీంనగర్ రోడ్లలో అత్యధికంగా ధరలు ఉన్నాయి. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారిలో హుస్నాబాద్ ఉండటంతో ధరలు బారీగా పెరిగాయి. అలాగే హుస్నాబాద్ పట్టణం అభివృద్ధి చెందుతుండటంతో సాధారణంగా భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. చేర్యాలలో.. చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో అత్యధికంగా రూ.8,700 ధరగా నిర్ణయించారు. నేతాజీ జంక్షన్, మైసమ్మ రోడ్, జెండా బజార్, కనకదుర్గ పెట్రోల్ పంప్, గుంటూరుపల్లి, గాంధీ చౌరస్తాలలో గతంలో గజం మార్కెట్ విలువ రూ.5,800 ఉండేది ప్రస్తుతం దానిని రూ. 8,700 పెంచారు. దుబ్బాకలో .. దుబ్బాక పట్టణంలోని పలు చోట్ల గజం భూమికి మార్కెట్ ధర రూ.5,400 నుంచి రూ. 8,100 పెరిగింది. దుబ్బాక లోని మెయిన్ రోడ్, తెలంగాణ తల్లి విగ్రహం, మున్సిపల్ కార్యాలయం ఏరియాలలో అత్యధికంగా ఽమార్కెట్ ధరలున్నాయి. అపార్ట్మెంట్లలో ఇలా... అపార్ట్మెంట్లలో గతంలో అంతస్తును బట్టి స్క్వేర్ ఫీట్కు మార్కెట్ విలువ ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనలు తొలగించి అపార్ట్మెంట్లలో ఏ అంతస్తుకై నా ఒకే ధరగా నిర్ణయించారు. సిద్దిపేటలో రూ.1,800, గజ్వేల్లో రూ.1,500 నుంచి రూ. 2,200, హుస్నాబాద్లో రూ.1,500 నుంచి రూ.2,200, దుబ్బాకలో రూ. 1,500, చేర్యాలలో రూ.1,300 నుంచి రూ.1,700లుగా ధర నిర్ణయించారు. ఇప్పటికే భూముల కొనుగోళ్లు అంతంతమాత్రంగా కొనసాగుతుండగా భూముల మార్కెట్ విలువ పెంపుతో మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు.జిల్లా కేంద్రంలో అత్యధికం -
హుస్నాబాద్కు ఉత్తమ అవార్డు
హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వరించింది. బెస్ట్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డును రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రదానం చేశారు. శుక్రవారం హైదరాబా ద్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం అందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్, పర్యావరణ అధికారి రవి కుమార్లు అవార్డును అందుకున్నారు. మంచి పరిణామం మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో పర్యావరణ పనితీరుపై అవార్డు రావడం మంచి పరిణామమని స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో గతంలో అనేక జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులు రావడం వెనుక పాలకవర్గం, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఉందన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అన్నారు. -
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
● అందరూ మొక్కలు నాటాలి, సంరక్షించాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్కొండపాక(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని మర్పడ్గ శివారులోని ఆక్సీజన్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ రఘనందన్రావుతో కలిసి శుక్రవారం మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులను గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. 500 హోటళ్లలో స్టీల్ గ్లాసులు అందజేశామన్నారు. గ్రామాల్లో కోతుల బెడద తగ్గించేందుకు రోడ్ల వెంబడి వివిధ రకాల పండ్ల మొక్కలను నాటించామన్నారు. అలాగే గీత కార్మికుల భృతి కోసం ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతామన్నారు. ప్లాస్టిక్తో క్యాన్సర్ ముప్పు.. ఎంపీ రఘనందన్రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. పెరుగుతున్న జనాభాను అనుగుణంగా విరివిగా చెట్లను పెంచుకోవాలన్నారు. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని ఎంపీ తెలిపారు. అందులో భాగంగాగే భూంపల్లి అక్బర్పేట క్రాస్ రోడ్డు నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఒకేరోజు 20 వేల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినకుండా 33 శాతం పచ్చదనం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతినకుండా ఉంటుందన్నారు.అనంతరం పర్యావరణాన్ని కాపడుదామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీపీ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, అదనపు డీసీపీ సుబాస్ చంద్రబోస్, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ వైద్యుల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా నిర్వహించడమేకాక తమకు సరైన ఆప్షన్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జీవో 38 ప్రకారం బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. లేని పక్షంలో ఓపీ సేవలతో పాటు అత్యవసర సేవలు కూడా నిలిపివేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యుల అసోసియేషన్ నాయకులు వినోద్బాబ్జి, మనోహర్, శ్రీనివాస్, హేమరాజ్సింగ్, సదానందం, వేణుగోపాల్చారి, శృతి తదితరులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మ దహనంహుస్నాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ద్రోహి అని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడుదారుల ఆటలు సాగనివ్వబోమని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, వివిధ పార్టీల నాయకులు గడిపే మల్లేశ్, గాదెపాక రవీందర్, కొయ్యడ కొమురయ్య, లక్ష్మణ్ గౌడ్, నాంపల్లి సమ్మయ్య, తొందూరి ఎల్లయ్య తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జి ఎంపీఓ బాధ్యతలుసిద్దిపేటరూరల్: జిల్లాలోని గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జి ఎంపీఓగా బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం కలెక్టర్ కె. హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సిద్దిపేటఅర్బన్ మండలం పాండవపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్.బాలాజీ ఇన్చార్జీ ఎంపీఓగా అక్బర్పేట భూంపల్లికి, కొండపాక మండలం, దుద్దెడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.శోభ చిన్నకోడూరు మండల ఇన్చార్జీ ఎంపీఓగా బాధ్యతలు అప్పించారు. అలాగే చిన్నకోడూరు ఇన్చార్జి ఎంపీఓగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్రావు నారాయణరావుపేట మండల ఎంపీఓగా, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును మద్దూరు మండల ఇన్చార్జి ఎంపీఓగా, మిరుదొడ్డి మండల ఎంపీఓ అక్బర్పేట భూంపల్లి ఎంపీఓగా బదిలీ అయ్యారు. కాసులాబాద్ పంచాయతీ కార్యదర్శి ఫహీమ్ను ఇన్చార్జీ మిరుదొడ్డి ఎంపీఓగా పదోన్నతి కల్పించారు. రాయపోల్ ఎంపీఓ సీహెచ్. శ్రీనివాస్రెడ్డి ఇన్చార్జి ఎంపీఓగా, ములుగు ఇన్చార్జీ ఎంపీఓగా కె. నరేందర్రెడ్డిని, సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. మోహన్ను ఇన్చార్జి ఎంపీఓగా ధూల్మిట్ట మండలానికి బదిలీ అయ్యారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ పంచాయతీ కార్యదర్శి ఎం. విష్ణువర్ధన్ తోగుట మండల ఇన్చార్జి ఎంపీఓగా బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే విధుల్లో చేరనున్నారు. కురుమల సంఘం రాష్ట్ర యూత్ కార్యదర్శిగా రాజు దుబ్బాకటౌన్: కుమ్మరుల సంఘం రాష్ట్ర యూత్ కార్యదర్శిగా రాయపోల్ ఉపసర్పంచ్ హన్మంతు రాజును నియమిస్తూ రాష్ట్ర కో ఆర్డినేటర్ సారంగపాణి, కన్వీనర్ యాదగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపకుడు ఆకారం మోహన్కు రాజు కృతజ్ఞతలు తెలిపారు. కురుమల సమస్యలపై పోరాడతానని చెప్పారు. -
గుర్తింపు ప్రేరణగా నిలవాలి: పీసీసీ చీఫ్
పర్యావరణ పరిరక్షణలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు దక్కడంతో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లను అభినందించారు. శుక్రవారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైర్పర్సన్ లక్ష్మి వారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ సాధించిన గుర్తింపు మరింత ప్రేరణగా నిలవాలన్నారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని వారు ఆకాక్షించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ హస్సెన్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తరిస్తున్న టెక్స్టైల్ రంగం
● దేశంలోనే రెండో షోలాపూర్గా సిద్దిపేట ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్: భవిష్యత్తులో మన దేశానికి రెండో షోలాపూర్గా సిద్దిపేట మారే అవకాశం ఉందని, ఇప్పటికే వీవర్స్, స్టిచ్చింగ్ రంగం విస్తరించిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రశాంత్నగర్లో దుస్తుల తయారీ పరిశ్రమను ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ తయారీ విధానం తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోడ్లు, బిల్డింగ్లు, కాలేజీలు, దేవాలయాలు కట్టడం మాత్రమే నిజమైన అభివృద్ధి కాదని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి స్వశక్తి మీద నిలబడేలా చేయడమే నిజమైన అభివృద్ధిగా అభివర్ణించారు. గతంలో సిద్దిపేటలో 6వేల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. దేశంలో 60వేల కోట్ల టెక్స్ టైల్ బిజినెస్లో 70శాతం స్టిచ్చింగ్ రంగానిదే ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి నాయకులు పాల్గొన్నారు. -
అధికారుల్లో వణుకు
సిద్దిపేట కమిషనర్ సస్పెన్షన్ఉత్తర్వులు జారీ చేసిన సీడీఎంఏ శ్రీదేవి సిద్దిపేటజోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ గురువారం సీడీఎంఏ శ్రీదేవీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లలో వైఫల్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తదితర అంశాలపై కలెక్టర్ హైమావతి ఈనెల 3న రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీడీఎంఏ శ్రీదేవి తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల మేరకు ఆశ్రిత్కుమార్ను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సాక్షి, సిద్దిపేట: జిల్లా అధికారుల్లో వణుకు మొదలైంది. రాష్ట్ర అవతరణ వేడుకల వేళ నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా ఏర్పాట్లు, స్టాల్స్, లబ్ధిదారులను తరలించకపోవడం.. సమీకృత కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు గైర్హాజరైన 25 మంది అధికారులకు కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న అధికారులు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్కు అధికారులు వివరణ ఇచ్చారు. వాటిని కలెక్టర్ పరిశీలించి ఆయా శాఖల కమిషనర్లకు లేఖలు రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ చర్యల్లో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ను మున్సిపల్ శాఖ సస్పెండ్ చేసింది. దీంతో నోటీసులు అందుకున్న జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమపై చర్యలు తీసుకుంటారా? అని ఆయా శాఖల అధికారులు.. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటేనే విధులు నిబద్ధతతో నిర్వర్తిస్తారని ప్రజలు, పలువురు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. మరో 150 మందికి నోటీసులు రాష్ట్ర అవతరణ వేడుకలకు గైరాజరైన మరో 150 మంది వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరంతా 24 గంటల్లోగా ఆయా శాఖల జిల్లా అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్కు వివరణ పంపించాల్సి ఉంటుంది. ఒకే సారి ఇంత మంది ఉద్యోగులకు నోటీసులు జారీ కావడంతో ఆందోళన చెందుతున్నారు. షోకాజ్నోటీసులు అందుకున్నవారిలో ఆందోళన చర్యలు ప్రారంభించిన కలెక్టర్ హైమావతి -
గౌరవెల్లి కట్టపై మందుతాగితే తాటతీస్తాం
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి రిజర్వాయర్ కట్టపై మద్యం తాగితే తాటతీస్తామని ఈఈ రాములునాయక్, ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ అన్నారు. ఎన్జీటీ కేసులో భాగంగా ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రశాంత్ సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మందుతాగితే చర్యలు చేపడ తామన్నారు. ప్రాజెక్టు కట్టపై నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి వేళ కూడా గస్తీ ఉంటుందన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలను గుర్తుతెలియని వారు ధ్వంసం చేయడంతో నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో గౌరవెల్లి పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందని ఈఈ తెలిపారు. -
ఫ్యూచర్లోకి గజ్వేల్ సర్కిల్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర వాణిజ్య పన్నుల (జీఎస్టీ) శాఖను పునర్ వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి డివిజన్ను ఫ్యూచర్ సిటీ సర్కిల్లో విలీనం చేసింది. అలాగే మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లతోపాటు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్ను కూడా ఫ్యూచర్సిటీ సర్కిల్లో కలిపారు. ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్సిటీ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఫ్యూచర్సిటీని వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించిన కొత్త డివిజన్గా మార్చింది. రీజనల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) లోపల (ప్యూర్ ఏరియా) ఉన్న డివిజన్లన్నింటినీ కూడా ఈ ఫ్యూచర్సిటీ సర్కిల్లో విలీనం చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు సర్కిళ్లు నిజామా బాద్ డివిజన్ పరిధిలో ఉండేవి. ఈ మేరకు ప్రభు త్వం ఇటీవల జీఓ నెంచి 126ను జారీ చేసింది. నిజామాబాద్ డివిజన్లో జహీరాబాద్.. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సర్కిల్ను మాత్రం నిజామాబాద్ డివిజన్లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మెదక్, సిద్దిపేట ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న ఆశాఖ సర్కిళ్లను కూడా నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ప్యూర్ ఏరియా పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్ సర్కిళ్లను మాత్రం శేర్లింగంపల్లి సర్కిల్లో విలీనం చేశారు. ఇలా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన సర్కిల్ కార్యాలయాలన్నీ మూడు భాగాలుగా విడిపోయాయి. ఈ వాణిజ్య పన్నుల శాఖకు అత్యధికంగా జీఎస్టీ చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ను సైతం శేర్లింగంపల్లి డివిజన్లో విలీనం చేశారు. ఇప్పటివరకు ఈ బీహెచ్ఈఎల్ నిజామాబాద్ డివిజన్లో కొనసాగింది. సంగారెడ్డి నుంచే ఖజానాకు కాసుల గలగల.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు అత్యధిక పన్ను రాబడి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలతోపాటు, వ్యాపార సంస్థల నుంచి అత్యధికంగా జీఎస్టీ, ఇతర పన్నుల ఆదాయం లభిస్తుంది. ప్రధానంగా సంగారెడ్డి సర్కిల్ నుంచే రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల ఉంటుంది. ఇందుకు ఇక్కడ వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే ఫార్మా, బల్క్డ్రగ్, ఇంజనీరింగ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ పరిశ్రమలే కారణం. బీహెచ్ఈఎల్తోపాటు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ భారీ పరిశ్రమలు ప్రతినెలా రూ.కోట్లలో జీఎస్టీలు, ఇతర పన్నులు చెల్లిస్తుంటాయి. అలాగే వ్యాపారులు, వ్యాపార సంస్థలు కూడా ప్రతినెలా జీఎస్టీ చెల్లింపులు ఉంటాయి. ఇలా వాణిజ్యపన్నుల రాబడిలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పోటీ పడుతోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ శాఖ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. -
సీజ్ చేస్తాం
అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలనునిబంధనలు పాటించాల్సిందే సాక్షి, సిద్దిపేట: ‘అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేస్తాం. బడుల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తాం. ఈ సారి బ్రేక్ ఫాస్ట్, 12 రకాల కిట్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఈ నెల 12 వరకు బడిబాట కొనసాగనుంది’ అని జిల్లా విద్యా శాఖాధికారి వరగంటి శాస్త్రి అన్నారు. నూతన డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయనను సాక్షి పలకరించింది. వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలను కొనసాగిస్తే వాటిని సీజ్ చేస్తాం. అలాగే పాఠశాలలకు ముందు ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో ఇలా ఆకర్షణీయంగా పేర్లు పెడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ పాఠశాలలు కొనసాగించాలి. ఎలాంటి లాభాలు లేకుండా పుస్తకాలను అందించాలి. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దు. యూనిఫాంలు స్కూళ్లలో విక్రయించవద్దు. పండుగ వాతావరణంలో పిల్లలను స్వాగతిస్తాం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పండుగ వాతావరణంలో పిల్లలను స్వాగతిస్తాం. జిల్లాలో 938 ప్రభుత్వ పాఠశాలలో 81,229 మంది విద్యార్థులుండగా అందులో బాలురు 38,508, బాలికలు 42,721 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరి పాఠశాల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు సిద్ధంగా ఉంచాం. పాఠ్యపుస్తకాలు 5,33,478 మొదటి విడతలో అవసరం ఉండగా 100శాతం వచ్చాయి. ఇప్పటికే ఎమ్మార్సీలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం, పౌష్టికాహార మధ్యాహ్న భోజనం అమలు, నిష్ణాతులైన ఉపాధ్యాయలున్నారు. అలాగే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 12 రకాల వస్తువులతో విద్యార్థులకు కిట్లను అందించనుంది. బడిబాటలో ఇంటింటికీ ఉపాధ్యాయులు జిల్లాలో బడి బాట కార్యక్రమం కొనసాగుతోంది. బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలే తప్ప పనులకు వెళ్లవద్దు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నాం. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి సౌకర్యాల గురించి వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచడంపై దృష్టి సారిస్తున్నాం. విద్యా బోధన సరిగా జరిగేలా కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓలతో పాటు విస్తృతంగా తనిఖీలతో బడుల పర్యవేక్షిస్తాను. సర్కారు బడుల పటిష్టతకు కృషి విద్యార్థుల సంఖ్య పెంచుతాం బడిబాటలో ఇంటింటికీ వెళ్లి సౌకర్యాలు వివరిస్తున్నాం ‘సాక్షి’ తో డీఈఓ వరగంటి శాస్త్రి 86కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఆటపాటలతో కూడిన ఇంగ్లిష్ బోధనతో ఈ సారి కొత్తగా 86ప్రీ ప్రైమరీ స్కూల్స్ను ప్రారంభిస్తున్నాం. ప్రైవేట్కు దీటుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు చర్యలు తీసుకుంటాం. ఆట వస్తువులన్నీ ఏర్పాటు చేశాం. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
డీఎంహెచ్ఓ ధన్రాజ్ మిరుదొడ్డి(దుబ్బాక): వచ్చే వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ ధన్రాజ్ తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదవుతున్న ఓపీని, రికార్డులను, రోగులకు అందిస్తున్న వైద్య విధానాన్ని, ఫార్మసీ ల్యాబ్ను, పీహెచ్సీ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా వంటి జ్వరాలు సోకకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించేలా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ లింగమూర్తి, ఫార్మసిస్టు శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి గజ్వేల్: మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తామని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 5 వార్డుల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పౌర సేవల్లోనూ ఎలాంటి జాప్యానికి తావులేకుండా సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అంతేకాకుండా వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఇంకా ఈ సభల్లో మున్సిపల్ మేనేజర్ బాలకృష్ణ, వార్డు ఇన్చార్జిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ తీర్మానం తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్పల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్ ప్రవీణ్రెడ్డి అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే రూ.10వేలు, బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ. 50వేల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామంలో విచ్చల విడిగా విక్రయాలు జరుగుతుండటంతో చిన్న పిల్లలు సైతం మద్యానికి అలవాటయ్యారన్నారు. ప్రజలు సహకరించి గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్, పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గజ్వేల్: నియోజకవర్గస్థాయి చదరంగం పోటీలను ఈ నెల 6న పట్టణంలోని సెయింట్ జేవీఆర్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫిజికల్ డైరెక్టర్ ఎలియాస్రావు గురువారం తెలిపారు. బాలబాలికలకు అండర్–14, 17 కేటగిరీలుగా విభజించి ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలిచినవారు చెస్బోర్డు, ఆధార్ కార్డుతో ఆ రోజు ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రంలోగా 9989170936 నంబర్కు ఫోన్ చేసి పేర్లు ఎంట్రీ చేసుకోవాలన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ
సిద్దిపేటకమాన్/నంగునూరు(సిద్దిపేట): పెరిగిన భూముల మార్కెట్/రిజిస్ట్రేషన్ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో గురువారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ క్రయవిక్రయదారులతో రద్దీగా మారాయి. సిద్దిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 9.30నుంచి రాత్రి 7.30 పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలపై సుమారు 20నుంచి 30శాతం పెంచనున్నట్లు సమాచారం. దీంతో ప్లాట్ల క్రయ విక్రయదారులు చార్జీలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఆసక్తి చూపారు. గురువారం ఒక్క రోజే సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 52డాక్యుమెంట్లు, రూరల్ లో 45 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మార్కెట్ విలువలు పెరగనున్నందున రిజిస్ట్రేషన్లు చేసుకునే వారు ముందస్తుగా కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యలయం సందడి నెలకొంది. నంగునూరులో రైతుల నిరీక్షణ రిజిస్ట్రేషన్ల కోసం నంగునూరు తహసీల్దార్ కార్యాలయానికి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9.30కే రైతులు చేరుకోగా తహసీల్ధార్, ఆర్ఐ మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దర్గపల్లి, వెంకటాపూర్, మగ్ధుంపూర్, ఘణపూర్, ఖాత గ్రామాల నుంచి సుమారుగా 50 మంది రైతులు భూముల రిజిస్ట్రేషన్ కోసం ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గంటల తరబడి నిరీక్షించినా అధికారులు రాకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలను, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వచ్చిన తహసీల్దార్ రాత్రి వరకు భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
నిధుల మంజూరుకు.. మంత్రికి వినతి
కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట, తిమ్మా రెడ్డిపల్లి, బందారం గ్రామాల సర్పంచ్లు గ్రామాభివృద్ధికి నిధుల మంజూరయ్యేలా చూడాలని కోరుతూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో వివిధ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిధులు మంజూరు కాకపోవడంతో ప్రజల్లో చులకన, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటున్న విషయాన్ని సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో నిధులు మంజూరయ్యేలా చూస్తామంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బూర్గుల మానస, కొయ్యెడ వెంకటేశం, కొలుపుల గంగాధర్, నాయకులు శశిధర్రెడ్డి పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం పురుగుల పాలు!
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో అప్పటికే రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం వాపస్ తీసుకోకుండా.. పంపిణీ చేయకుండా నిలిపి వేయడంతో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పురుగుల పాలవుతోంది. మార్కెట్లో దొడ్డు బియ్యానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని వివిధ రేషన్ షాపుల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పౌరసరఫరా, రెవెన్యూ అధికారులు ఇప్పటికై నా మేలుకొని దొడ్డు బియ్యం సంగతి తేలిస్తే బాగుంటుంది. -
కొనుగోళ్ల జాప్యంపై రైతుల కన్నెర్ర
● జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు ● రహదారులపై బైఠాయించి నిరసనలు దుబ్బాక: ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సైతం జిల్లాలో పలుచోట్ల రహదారులపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. దుబ్బాక–సిద్దిపేట ప్రధాన రహాదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొందరు రైతులు రోడ్డుపైనే పడుకొని వడ్లు కొనేదాక లేచిది లేదంటూ నిరసన తెలిపారు. నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా కాంటా పెడ్తలేరని, వానలు పడతున్నాయని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కీర్తి రాజు వెంటనే అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. రైతుల ఆందోళనతో రోడ్డు కిరువైపులా పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై .. దుబ్బాకటౌన్: రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, వీరనగర్ గ్రామాలకు చెందిన రైతులు గురువారం రోజూ ఆందోళనకు దిగారు. గజ్వేల్–చేగుంట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రాయపోల్ ఎస్ఐ మానస ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వారు వినలేదు. అనంతరం తొగుట సీఐ లతీఫ్ రైతుల వద్దకు చేరుకుని సాయంత్రంలోగా ఐకేపీ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించి ధాన్యం తరలింపు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ ఆందోళనతో గంటల తరబడి గజ్వేల్–చేగుంట రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వడ్లు దిగుమతి చేసుకోండి సారూ.. నంగునూరు(సిద్దిపేట): తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లర్లు దింపుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఘణపూర్ రైతులు ట్రాక్టర్లతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఫోన్ చేసిన తహసీల్దార్కు బస్తాకు 44 కిలోల తూకం వేస్తే కొంటామని సమాధానం ఇవ్వడంతో రైతులు అవాక్కయ్యారు. రైతులు స్థానిక కొనుగోలు కేంద్రంలో వడ్లను అమ్మి ట్రాక్టర్లో లోడ్ చేసుకొని గట్లమల్యాల లోని గోదాంకు తీసుకొచ్చారు. వారు దిగుమతికి నిరాకరించడంతో అధికారులు, నిర్వాహకులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎక్కడ దిగుమతి చేయాలో తెలియక ట్రాక్టర్లతో వచ్చి నంగునూరు తహసీల్దార్ ప్రవీణ్రెడ్డికి మొర పెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని మిల్లర్కు తహసీల్దార్ చెప్పినా వినకపోవడంతో గట్లమల్యాల గిడ్డంగిలో దిగుమతి చేసుకోవాలని నిర్వాహకులను ఆదేశించి అక్కడికి పంపించారు.వర్షంతో ఆగమాగందుబ్బాక: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి పోయింది. దుబ్బాక మార్కెట్తో పాటు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వడ్లకుప్పలపై కవర్లు కప్పినప్పటికీ వరద నీళ్లు కిందకు పోయి మొలకలు వస్తున్నాయంటూ తెలిపారు. వెంటనే కొనుగోలు చేయాలంటూ వారు కోరారు. -
షోకాజ్ నోటీసులు
25 మంది అధికారులకు● వారి పనితీరుపై కలెక్టర్ హైమావతి సీరియస్ ● 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం, సమీక్షలకు గైర్హాజరు వంటి కారణాలపై కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. ఈ మేరకు 25 మంది ఆయా శాఖల జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో, డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అవతరణ వేడుకలకు గైర్హాజరు, వివిధ శాఖలకు సంబంధించిన లబ్ధిదారులను తీసుకురాకపోవడం, గ్రౌండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగం సమయంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డిగ్రీ కళాశాల గ్రౌండ్లో కేటాయించిన శాఖలు స్టాల్స్ సైతం ఏర్పాటు చేయలేదు. అలాగే కలెక్టరేట్లో మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉందని సమాచారం అందించినా పలువురు జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఒకే సారి 25 మంది జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడంతో సర్వత్రా చర్చ సాగుతోంది.జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయా శాఖల ఉద్యోగులు కేవలం 30శాతం మందే హాజరయ్యారు. ఎవరెవరు వేడుకలకు హాజరయ్యారు.. గైర్హాజరైన వారి వివరాలను కలెక్టరేట్ సేకరించింది. త్వరలో వారికి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ అధికారులు డుమ్మా, నిర్లక్ష్యం చూస్తుంటే విధుల పట్ల వారికి ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది. -
చేర్యాల పాఠశాలకు పూర్వవైభవం
చేర్యాల(సిద్దిపేట): ఘనచరిత్ర కలిగిన చేర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో 2019లో మూసివేశారు. దీంతో అక్కడి ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు డిప్యుటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించారు. అయితే మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చేర్యాల ఉన్నత పాఠశాలను పునఃప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా దూల్మిట్ట మండలం కూటిగల్తండా ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కోటయ్యని ఈ పాఠశాలకు(పూర్తి అదనపు బాధ్యతలు) ప్రధానోపాధ్యాయుడిగా నియమించారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుల కృషి హెచ్ఎం కోటయ్య, ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలను తిరిగి ప్రారంభించడానికి దారులు వెతకడం మొదలు పెట్టారు. అందులో భాగంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ, పాలకవర్గ సభ్యులను కలిసి తమకు సహకరించాలని కోరారు. అందుకు చైర్పర్సన్తో పాటు పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. అలాగే పూర్వవిద్యార్థులను కూడా కలిసి తమ వంతు సహకారం అందించాలని కోరారు. పాఠశాలకు పూర్వ వైభవాన్ని సంతరింప చేయడానికి కృషిని ముమ్మరం చేశారు. సర్వం సిద్ధం పాఠశాల నూతన బోర్డు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన రెండు గదులను కేటాయించేలా చూశారు. తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. బడిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించి జాతీయజెండా ఆవిష్కరించారు. 6, 7, 8వ తరగతులు ప్రారంభిస్తాం.. సుమారు ఏడేళ్ల క్రితం మూతబడ్డ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు జిల్లా ఉన్నతాధికారులు సహకారంతో ముందుకు వెళ్తున్నాం. హెచ్ఎంగా నాతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్ నియమించారు. ఇప్పటికే కొంత మంది తల్లిదండ్రులను కలిశాం. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు సహకరించి పిల్లలను చేర్పిస్తే కనీసం మూడు తరగతులైనా ప్రారంభిస్తాం. పాఠశాల సమీప ప్రాంతాలైన బీడీ, గట్టుతోట కాలనీల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. – కోటయ్య, ఇన్చార్జి హెచ్ఎం, చేర్యాల ఉన్నత పాఠశాల -
హరీశ్రావు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి
● ఘనంగా జన్మదిన వేడుకలు ● పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, అభిమానులుసిద్దిపేటజోన్: ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్లు కట్చేసి సంబురాలు జరుపుకొన్నారు. దేవాలయాలు, దర్గాలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వీట్లు పంచుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి, నాయకులు రెడ్డి ప్రభాకర్రెడ్డి, కడవేరుగు సాయికుమార్, సుందర్, సురేశ్, దరిపల్లి శ్రీనివాస్, రవి, సద్ది నాగరాజురెడ్డి, బండల, రాజు, మణిదీప్, చిప్ప ప్రభాకర్, కాటం రఘురాం, నాయకం వెంకట్, అహ్మద్ తదితరులు పాల్గొన్నార -
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరం
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. పలువార్డుల్లో 20 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6.12 లక్షల విలువగల చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లికాని ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, సంపత్ నాయక్, రమేశ్, బత్తుల స్వరూప, రాజు, నాయకులు వెంకటరమణ, పున్న సది తదితరులు పాల్గొన్నారు. మనోధైర్యమే ఆయుధం సిద్దిపేటకమాన్: క్యాన్సర్ నివారణకు మనోధైర్యమే మొదటి ఆయుధమని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి రేడియేషన్ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యాన్సర్ పెషేంట్లకు రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ‘హైపర్సైట్’ అనే నూతన సాంకేతిక పద్ధతి ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతానికి రేడియేషన్ అందించడంతో మిగతా శరీర భాగాలపై దుష్ప్రభావాలు తక్కువగా ఉంటా యని చెప్పారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిసుపత్రి ప్రతినిధులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.5 కోట్ల మొక్కజొన్నల కొనుగోలు తొగుట(దుబ్బాక): పీఏసీఎస్ ద్వారా రూ.5 కోట్లు విలువజేసే మొక్కజొన్నలు కొనుగోలు చేశామని సీఈఓ గంగారెడ్డి తెలిపారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్యార్డులో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సుమారు రెండు నెలలపాటు మొక్కజొన్నలు కొనుగోలు చేశామని చెప్పారు. తొగుట మండల రైతులతో పాటు దౌల్తాబాద్, రాయపోల్ మండలాల రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించారని, 544 మంది రైతుల నుంచి 20,643 క్వింటాళ్లుకొనుగోలు చేశామని తెలిపారు. సుమారు రూ 4,95432ల విలువజేసే ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సహకరించిన అధికారులు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సిబ్బంది శేఖర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. మనోభావాలను కించపరిస్తే సహించం సిద్దిపేటజోన్: తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించబోమని కాంగ్రెస్ నేత శ్రీనివాస్గౌడ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించి హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణపై అనుచిత వ్యాఖ్య లు చేస్తూ ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొట్టద్దన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు మంత్రి పొన్నం ఇంటిపై దాడికి యత్నించడాన్ని ఖండించారు. నాయకులు నాగరాజు, భరత్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని నర్సాయిపల్లి సర్పంచ్ శనిగరం సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు సుంకరి రాజేశం అన్నారు. నరసయ్యపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతారా? గజ్వేల్: అక్రమ నిర్మాణాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ బుధవా రం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాల యం ఎదుట ఫ్లెక్సీ కట్టి పలువురు నిరసన తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపడుతున్న వారికి అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు అక్రమార్కులకు మాత్రం అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అధికారుల వైఖరి మారకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. -
కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అందెలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ యాదగిరి నేతృత్వంలో బుధవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండల నేపథ్యంలో పనిప్రదేశాలల్లో చల్లని నీటితో పాటు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఎక్కువగా తీసుకోవాలని కూలీలకు అవగాహన కలిగించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. సలాఖపూర్ గ్రామంలో.. మద్దూరు(హుస్నాబాద్): ఎమ్మెల్యే హరీశ్రావు జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని సలాఖపూర్ గ్రామంలో ఉపాఽధి హామీ కూలీలకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉప సర్పంచ్ చెట్టె ఐలయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనికా, అనిల్కుమార్, బాల్రెడ్డి, రవీందర్రెడ్డి, కిష్టయ్య, సంతోష, చంద్రశేఖర్, రాకేశ్, ఐల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల వినియోగంపై అవగాహన
నిజాంపేట(మెదక్): మండల పరిధి కల్వకుంట గ్రామంలోని రైతుల వేదికలో బుధవారం కేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాంత్ ఖరీఫ్ సీజన్లో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక మోతాదులో ఎరువుల వాడకం వల్ల జరిగే నష్టాలు, రసాయనిక ఎరువులు బదులు ప్రత్యామ్నాయ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, నానో యూరియా, నానో డీఏపీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల స్వభావం దెబ్బతిని పంట దిగుబడి తగ్గే ఆస్కారం ఉందన్నారు. రైతులు స్వల్ప కాలిక పంటలైన పెసలు, మినుములు, కంది పంటలను సాగు చేయడం శ్రేయస్కరమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయవిస్తరణ అధికారులు శ్రీలత, రమ్య, మౌనిక రైతులు పాల్గొన్నారు. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
● ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనాలు ● పట్టించుకోని అధికారులు కొమురవెల్లి(సిద్దిపేట): గ్రామాలలో నివసించే ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం 2020లో పంచాయతీల పరిధిలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరుచేసి, గ్రామస్తులు ఎంపిక చేసిన ప్రదేశాలలో వివిధ రకాల మొక్కలను నాటించింది. వాటి నిర్వహణకు ప్రత్యేకంగా ఒక ఉపాధి హామీ కూలీని కూడా నియమించారు. నిర్వహణలో నిర్లక్ష్యం ప్రస్తుతం నిర్వహణ లేక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. నిర్వహణకు నిధులు లేకపోవడంతో మొక్కలకు నీరుపట్టని పరిస్థితి నెలకొంది. మండలంలో 11 పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. మొదట్లో నిర్వహణను పంచాయతీలకు అప్పజెప్పడంతో అధికారులు, సిబ్బంది పర్యవేక్షణతో కళకళలాడాయి. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా కూలీలను నియమించక పోవడంతో వాటిని పంచాయతీలు గాలికి వదిలేశాయి. నిధులు, కూలీలు లేక నిర్వహణ దూరమైందని సంబంధిత అధికారులు వాపోతున్నారు. 2024లో నిలిచిన నిధులు 2021 నుంచి 2024 వరకు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసేవారు. వాటి ద్వారా వనాలకు అవసరమైయ్యే నీటి తడులు, పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. దీంతో కొన్నేళ్లపాటు పచ్చదనంతో కళకళలాడాయి. రెండెళ్లుగా నిధులు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని 11వ వార్డు మైసమ్మగుడి సమీపంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ కౌన్సిలర్ ఎజాజ్ అహ్మద్తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణంతో పజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వార్డు అభివృద్ధికి అవసరమైన మరిన్ని సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు గీతాంజలి, రాజేశ్వరి, సుప్రజ, దుర్గయ్య, సురేశ్, సదానందం, షరీఫా, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చర్యలు తీసుకుంటాం
హరిత నిధి నిధులు నిలిచిపోవడంతో పల్లె పకృతి వనాల నిర్వహణ భారం పంచాయతీలపై పడింది. ఇటీవల నిధులు విడుదలయ్యాయి. ఎండలు పెరగడంతో పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిర్వహణపై చిన్నచూపు చూసే అధికారులపై చర్యలు తీసుకుంటాం. – ఎంపీడీఓ లక్ష్మప్ప పంచాయతీలే నిర్వహించాలి ఉపాధి హామీ పథకంలో హరితహారం, పల్లె పకృతి వనాల నిర్వహణకు ప్రభుత్వం రెండు సంవత్సరాలే నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత వాటి నిర్వహణను పంచాయతీలే చేపట్టాలి. – ఏపీఓ బాలలింగం -
ఒకే కుర్చీ.. ఇద్దరు అధికారులు!
● నిజాంపేట పశువైద్యశాలలో వింత పరిస్థితి.. ● గందరగోళంలో రైతులునిజాంపేట (మెదక్): మండల పరిధిలోని పశువైద్యశాఖ కార్యాలయంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ఒకే పోస్టుకు ఒకరికి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి, మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మండలంలోని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. పశువులకు అనారోగ్యం వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. రిలీవింగ్ ఇచ్చినా కుర్చీ వదలని వైనం గతంలో ఇక్కడ ఇన్చార్జిగా పనిచేసిన డా.మణికుమార్ (వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ నుంచి నిజాంపేటకు వచ్చారు. అయితే, ఉన్నతాధికారులు గత నెల 15వ తేదీన ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ, ఆయన నిజాంపేట కార్యాలయాన్ని వదలకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తూ తానే అసలైన పశువైద్యాధికారిని అని రైతులకు చెప్పుకుంటుండటం గమనార్హం. రంగంలోకికొత్త ఇన్చార్జి డా. మణికుమార్ స్థానంలో ఉన్నతాధికారులు డా.సుధాకర్ దేశ్ముఖ్ను కొత్త ఇన్చార్జి పశువైద్యాధికారిగా నియమించారు. ప్రస్తుతం ఆయన కూడా బాధ్యతలు చేపట్టడంతో ఒకే కార్యాలయంలో ఇద్దరు అధికారులు చలామణి అవుతున్నారు. ఈ ఇద్దరి ఆధిపత్య పోరుతో కార్యాలయ సిబ్బందితో పాటు, సేవల కోసం వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిజాంపేట పశువైద్య కార్యాలయంశాఖాపరమైన చర్యలు తీసుకుంటాం ‘డా. మణికుమార్ను ఇప్పటికే అధికారికంగా విధుల నుంచి రిలీవ్ చేశాం. ప్రస్తుతం నిజాంపేట ఇన్చార్జి పశువైద్యాధికారిగా డా. సుధాకర్ దేశ్ముఖ్ మాత్రమే బాధ్యతల్లో ఉన్నారు. రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత కూడా మణికుమార్ కార్యాలయానికి వస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటాం.‘ – వెంకటయ్య, జిల్లా పశువైద్యాధికారి -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. గోల్డెన్ ఫ్రేమ్స్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
దేశానికే ఆదర్శంగా జిల్లా అభివృద్ధి
● కలెక్టర్ హైమావతి ● కలెక్టరేట్లో అవతరణ వేడుకలు సిద్దిపేటరూరల్: దేశానికే ఆదర్శంగా అభివృద్ధిలో జిల్లా ముందుకు సాగుతోందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అధికారులు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలలో దేశ స్థాయిలో ఏ అవార్డు ప్రకటించినా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, భవిష్యత్తులో కూడా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతం చేసేలా అధికారులందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం సిద్దిపేటకమాన్: ఎంతోమంది త్యాగాలు, సుదీర్ఘ పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు కమిషనరేట్లో సీపీ మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ..తెలంగా ణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో శాంతిభద్రతలను కాపాడుతూ కీలకపాత్ర పోషించిన పోలీసు వ్యవస్థ సేవలు మరువలేనివన్నారు. సిద్దిపేట ఏసీపీ, వన్టౌన్, టూటౌన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోలీసు అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, సీఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.న్యాయవాదుల పాత్ర మరువలేనిదిసిద్దిపేటకమాన్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించారని జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తి మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం అమరులైన వారిని స్మరించుకుందామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు తరణి, సౌజన్య, కుమారస్వామి, ఏఓ ఇక్బాల్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.‘కేంద్రం మాటలకే పరిమితమైంది’సాక్షి, సిద్దిపేట: వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్ కొనుగోళ్లపై కేంద్రం మాటలకే పరిమితమైందని, రైతులు పండించిన పంటలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభిస్తున్నామని, ఈ పథకం ద్వారా కుటుంబానికి భరోసా ఇస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు, గౌరవం ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే ప్రణాళికను రూపొందించి సన్న వడ్లు సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటే కార్యక్రమంకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం... మరికొన్ని నోటిఫికేషన్లు రాబోతున్నాయని వివరించారు. -
రూ. 887 కోట్ల రుణాలు..
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమాఖ్య సభ్యులను బస్సులకు ఓనర్లను చేశామని మంత్రి వివరించారు. జిల్లా సమాఖ్య, 23 మండల సమాఖ్యలకు కలిపి మొత్తం 24 వాటికి ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం రూ.7కోట్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. సభ్యుల వాటా రూ. 8.64కోట్లతో బస్సులను కొనుగోలు చేశామని, వీటి ద్వారా సమాఖ్యలకు నెలకు దాదాపు రూ.70వేల చొప్పున ఆదాయం వస్తుందని తెలిపారు. 2025–26లో జిల్లాలో 12,396 స్వయం సహాయక సంఘాలకు రూ.887 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించగా, 2026–27 సంవత్సరానికి జిల్లాలో 15,927 స్వయం సహాయక సంఘాలకు రూ.913 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. వివిధ శాఖలకు సంబంధించి స్టాళ్లను మంత్రి పరిశీలించారు.సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రగతి వేగంగా ముందుకు సాగుతోందని, కాళోజీ కలలు కన్న తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి పొన్నం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ అనేది నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ, నేడు అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా, ఆదర్శంగా నిలిచిందన్నారు. పథకాల సద్వినియోగం కోసమే.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం చేపట్టామన్నారు. రోడ్డుభద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 508 రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, 27,336 మందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో 61 వేల మందికి ఉచిత వైద్య సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో 61వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందాయని మంత్రి పొన్నం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 9.24కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుని రూ.358 కోట్లు లబ్ధి పొందారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 61,094 మంది.. రూ. 166 కోట్ల విలువ చేసే ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. జిల్లాలో 10,898 ఇందిరమ్మ ఇళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేయగా, 10,113 ఇళ్లు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,79,883 మంది లబ్ధిదారులకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 7,53,962 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి, రూ.22.82 కోట్ల సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 2,05,499 విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్కు సంబంధించి రూ.163 కోట్ల సబ్సిడీని అందించినట్లు చెప్పారు. ఖాళీ కుర్చీలే దర్శనం ఉదయం 8గంటలకు జాతీయ పతాకావిష్కరణ కావడంతో జిల్లా ప్రజలు ఎవరూ చేరుకోలేదు. దీంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంత్రి ప్రసంగం సమయంలో పలువురు జిల్లా అధికారులు, విలేకరులు, పోలీసులు తప్ప మిగతా వారు కన్పించలేదు. మంత్రి ప్రసంగం సైతం జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను పొందు పరచలేదని పలువురు చర్చించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తున్న మంత్రి పొన్నం, కలెక్టర్, సీపీ తదితరులు అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యం -
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
● ప్రత్యేక గుర్తింపు వచ్చేలా పనిచేయండి ● అధికారులతో మంత్రి పొన్నం సమీక్షసిద్దిపేటరూరల్: ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్తో కలిసి జిల్లా అధికారులతో సాధారణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పేద ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అదేవిధంగా పంట వైవిధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, వరికి బదులుగా పప్పు దినుసులు, నూనె గింజలు ఇతర వాణిజ్య పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమని కానీ 50వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మాత్రమే పండిస్తున్నారన్నారు. అవసరమైన సన్న రకం వరి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని అన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పంట భూములలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కొత్త మండలాలలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని, తాగునీరు సరఫరాకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అటవీ శాఖ అధికారి, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
వడ్లు కొనాలంటూ రైతుల ఆందోళన
చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోలు చేయాలంటూ రామంచ వద్ద సిద్దిపేట– సిరిసిల్ల రహదారిపై మంగళవారం రైతు లు ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా ధాన్యం ట్రాక్టర్లను పెట్టి ఆందోళన చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎస్ఐ చంద్రమోహన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి మండుటెండల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లారీల కోసం రాస్తారోకో.. తొగుట(దుబ్బాక): కొనుగోలు కేంద్రంలో తూకంవేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు వారం రోజులుగా లారీలు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మంగళవారం రాస్తారోకో చేపట్టారు. వీరికి ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాగాల రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఏఎంసీ పాలకవర్గం సైతం అడ్రస్ లేదన్నారు. వారం రోజుల క్రితం 4వేల బస్తాలు తూకం వేసి తరలించేందుకు సిద్ధంచేసినా లారీలు రావడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎఎస్ఐ రైతులకు సర్దిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
ఉద్యమకారులకు ‘గుర్తింపు’ నివ్వండి
హుస్నాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో అందరికీ అవకాశం కల్పించాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మంత్రి క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పోలీసులకు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడంతో మంత్రి పీఏకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను గుర్తించి న్యాయం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. జీవన భృతి కోసం రూ.25వేల గౌరవ పెన్షన్ మంజూరు చేయాలన్నారు. సంక్షేమ పథకాల పర్యవేక్షణకు ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో ఆర్డినేటర్ వీరన్న యాదవ్, వివిధ పార్టీల నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, గాదెపాక రవీందర్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులశాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. ఆదివారం గజ్వేల్లోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో గజ్వేల్ నియోజకవర్గంలోని 1109మంది లబ్ధిదారులకు రూ.11.9కోట్ల విలువైన ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’ చెక్కుల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయ డంలో భాగంగానే ఇంటర్ కళాశాలల్లోనూ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గానికో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి రూ.200కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. యాసంగి సీజన్లో అనుకున్న దానికంటే 30శాతం ధాన్యం దిగుబడులు అధికంగా రావడం వల్ల కొనుగోళ్ల ల్లో ఇబ్బందులు వస్తున్నాయని, అయినా సమస్యలను పరిష్కరించి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ‘ఇందిరమ్మ’ ఇండ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని చెప్పారు. చెక్కుల పంపిణీలో జాప్యాన్ని నివారించండి ‘కల్యాణలక్ష్మి’ చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొనడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారని, ఈ పరిస్థితి రాకుండా ప్రతి ఆరు నెలలకోసారి పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. అదేవిధంగా పథకంలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. కాగా రూ.2.56కోట్ల వ్యయంతో గజ్వేల్ పట్టణంలో నిర్మించిన బస్బేను మంత్రి వివేక్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం మద్దూరు(హుస్నాబాద్): భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని హైకోర్టు న్యాయవాది కదిరె కృష్ణ అన్నారు. ఆదివారం దూల్మిట్ట మండలం జాలపల్లిలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని కదిరె కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. జాంబవ యూత్ అధ్యక్షులు నాగుపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థను నిర్మూలించి, సమసమాజ స్థాపన కోసం అంబేడ్కర్ ఎంతగానో కృషి చేశారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో దళితులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, సర్పంచ్ చెట్కూరి కమలాకర్యాదవ్, కొమ్ము రవి,ఇట్టబోయిన కనుకచంద్రం, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బూర గంగాధర్, ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్, నాగులపల్లి రాములు, ఎమ్మార్పిఎస్ నాయకులు సుందరగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు పూర్తయ్యేదెన్నడో?
● వానలు పడితే ఆగమే ● 1.20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ● ఆందోళన చెందుతున్న రైతాంగం దుబ్బాక మార్కెట్ యార్డులో ధాన్యం రాశులుఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల్లోనే నెలల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో చలనంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటం చూస్తుంటే కొనుగోళ్లు ఎంత నత్తనడకన సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు కురిస్తే ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. – దుబ్బాక జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర రోజులకుపైగా అవుతోంది. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటమే ఇందుకు కారణం. జిల్లా వ్యాప్తంగా 427 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3.80 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 45,782 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.716 కోట్లు జమ చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తీరా రోహిణి కార్తె ప్రవేశించి వారం రోజులు కావస్తున్నా ఇంకా 3.80 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు కావడం శోచనీయం. దీన్ని బట్టి చూస్తే ఇంకా 1.20 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం కొనుగోలు ప్రక్రియ దగ్గర పడిందని, పొంతన లేని లెక్కలు చెబుతుండడం గమనార్హం. నిత్యం ఆందోళనలు.. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోజూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. ఏ మండలంలో చూసినా ధర్నాలు, రాస్తారోకో చేస్తుండటం కనిపిస్తోంది. వానకాలం ప్రారంభమై వానలు పడితే మా పరిస్థితి ఏమిటీ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలే.. ఎప్పుడు కొనుగోళ్లు పూర్తి చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం మేల్కొని యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చేతికాడి కూడు నేలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. -
నెల రోజులకు పైగా ఇక్కడే..
వడ్లు తెచ్చి నెల రోజులకుపైగా అవుతోంది. వాన పడితే ఆగమే. కాంటా పెట్టిన బస్తాలు సైతం లిఫ్ట్ చేయడంలేదు. నా వడ్లు కాంటా అయినా బస్తాలు మార్కెట్లోనే ఉన్నాయి. ఎప్పుడు వడ్లు పోతాయో ఏమో నిద్ర పడతలేదు. –పాతూరి పెద్ద లక్ష్మారెడ్డి, రైతు, దుబ్బాక ఇంకా కాంటా పెట్టలే.. వడ్లు తెచ్చి 25 రోజులు అవుతుంది. ఇంకా కాంటా పెట్టలే. సంచులు ఎప్పుడు ఇస్తరో తెలియడంలేదు. వాన పడితే కష్టమే. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తొందరగా వడ్లు కొనేటట్లు చూడాలి. – లక్ష్మణ్,రైతు త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తాం జిల్లాలో ఇప్పటి వరకు 427 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 45,782 మంది రైతులకు రూ.713 కోట్ల డబ్బులు చెల్లించాం. ఇంకా సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. త్వరలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం. –గోపాలకృష్ణ, డీఎం సివిల్ సప్లయ్ -
విద్యాధరి సేవలో కలెక్టర్
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన వర్గల్ విద్యాధరి క్షేత్రాన్ని ఆదివారం రాత్రి కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండిత పరివారం ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు పొందారు. వేదపండితులు మహదాశీర్వచనం అందజేసి అమ్మవారి శేషవస్త్రంతో కలెక్టర్ను సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్కౌట్స్–గైడ్స్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి స్కౌట్స్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమిషనర్ ఇస్సారపు రూయల్ రాజ్ ఆదివారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు. స్కాట్స్ మాస్టర్లకు నెలసరి వేతనం రూ.15వేలు ఉంటుందన్నారు. అభ్యర్థుల ఈ నెల 6న సాయంత్రంలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు శివమ్స్ కాలనీ, కుషాల్ నగర్లో ఉన్న జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎడ్ల లక్ష్మీకి పురస్కారంప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ రచయిత ఎడ్ల లక్ష్మీకి ‘షష్టిపూర్తి కలాలకు మాతృమూర్తి వందనం’ పురస్కారం లభించినట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. అక్షరయాన్, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో 70 ఏళ్లు పైబడిన రచయిత్రులకు ఈ పురస్కారాలను హైదరాబాద్ లో అందించినట్లు తెలిపారు. ఎడ్ల లక్ష్మీకి జిల్లా కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. కబడ్డీ లీగ్కు ఎంపిక గజ్వేల్రూరల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్కు చెందిన క్రీడాకారుడు లారెన్ ప్రో కబడ్డీ లీగ్కు ఎంపికయ్యారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో లారెన్ ప్రోను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంతోష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి శివకుమార్ అభినందించారు. అగ్నివీర్కు ఇద్దరు ఎంపికసిద్దిపేటరూరల్: అగ్నివీర్కు రూరల్ మండలం రాఘవాపూర్కు చెందిన ఇద్దరు యువకులు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన జాప రాకేశ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి వెంకటవ్వ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. రాకేశ్.. పెట్రోల్ బంకులో పనిచేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ అగ్నివీర్ ఉద్యోగ సాధనకై సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 2025లో విడుదల చేసిన నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకుని హన్మకొండలో జరిగిన పరీక్షలో పాల్గొన్నారు. అదేవిధంగా సాధారణ కుటుంబానికి చెందిన గ్యార లక్ష్మి, ఎల్లయ్య దంపతుల కుమారుడైన లోకేశ్ సైతం పరీక్ష రాశారు. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్ పరీక్షా ఫలితాల్లో వీరు ఉత్తమ మార్కులు సాధించారు. వీరు భారత సైన్యంలోకి ఎంపిక కావడంతో గ్రామస్తులు అభినందించారు. -
జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపు
దుబ్బాకరూరల్: ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహించిన రైతులు అక్బర్పేట–భూంపల్లి మండలం పోతారెడ్డిపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు కొంత తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను వెంట వెంటనే పంపించి లిఫ్ట్ చేయాలన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళనను వరిమింపజేశారు. గంటకు పైగా ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. -
యాదవుల సంక్షేమం పట్టని సర్కార్
● మాజీమంత్రి హరీశ్రావు ● విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి యాదవుల సంక్షేమం పట్టడంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. చట్టసభల్లో సైతం అవకాశం కల్పించామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో లేదన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలన్నారు. చదువుకు కులం, పేదరికం అడ్డు కాదని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ పురస్కారాలు, అవార్డులు అందజేయడంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్తో ఉత్తమ భవిష్యత్ మంచి భవిష్యత్తుకు ఎడ్యుకేషన్ ఫెయిర్తో ఎంతో లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్లో వివిధ విద్యా సంస్థలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ మొదటి సారిగా సిద్దిపేటలో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంటర్, డిగ్రీ తరువాత ఏ నిర్ణయం తీసుకోలేక విద్యార్థులు సతమతమవుతారని అలాంటి వారికీ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో మేలు చేస్తుందన్నారు. మన జీవితానికి విద్య పునాది అన్నారు. కొత్త సాంకేతికతలు, కొత్త అవకాశాలు వస్తున్నాయ న్నారు. వాటిని అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విజ్ఞానం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అలాంటి అవకాశాలను ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ అందిస్తుందని చెప్పారు.ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు.మరోసారి సమీక్షించుకోవాలికన్వర్ట్ క్రిస్టియన్లకు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అనేక మంది కన్వర్ట్ క్రిస్టియన్లు ఇబ్బందులు పడాల్సి వస్తోందని హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బేతస్థ ప్రార్థన మందిరం వార్షికోత్సవంలో హరీశ్రావు పాల్గొన్నారు. కన్వర్ట్ క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును మరోసారి సమీక్షించుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఏకై క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. -
‘బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది’
సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్ కరెంట్ విషయంలో బడేభాయ్ చెప్పినట్టు సీఎం రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24గంటల విద్యుత్ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.గుజరాత్లో రైతులకు ఏడుగంటలే కరెంట్ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్కు మంగళం పాడింది. టీజీఆర్పీడీసీఎల్ థర్మల్ పవర్ ఇవ్వరట.. సోలార్ పవర్ మాత్రమే ఇస్తారట. బడేభాయ్ చెప్పినట్టు రేవంత్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
కొత్త కమిషనర్గా గణేశ్రెడ్డి
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్గా గణేశ్రెడ్డి నియమితులయ్యారు. తూప్రాన్ నుంచి బదిలీపై వచ్చి ఇక్కడ విధుల్లో చేరనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ వెంకటగోపాల్ బదిలీపై వెళ్లారు. ముగిసిన టీజీపీఎస్సీ పరీక్షలు వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు శనివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం సెషన్లో 71 మందికి 57, మధ్యాహ్నం సెషన్లో 136 మందికి 113 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 170 మంది హాజరైనట్లు కావేరి వైస్ చాన్స్లర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావు పేర్కొన్నారు. -
పదోన్నతితో మరిన్ని బాధ్యతలు
● సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: పదోన్నతులు మరింత బా ధ్యతను పెంచుతాయని సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ పదోన్నతులు పొందిన పలువురు పోలీసు అధికారులను సీపీ కార్యాలయంలో ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన నాగేశ్వర్రావు, జగదీశ్వర్, వెంకటరమణారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన కె.మురళి, రామ్ప్రసాద్, మధుసూదన్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు దుబ్బాకటౌన్: ఎరువుల దుకాణాల డీలర్లు నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ మల్లయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో టాస్క్ఫోర్స్ బృందం పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలకు సంబంధించిన లైసెన్స్లు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు లైసెన్స్ కలిగిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని, దుకాణాల ఎదుట ధరల పట్టికలు, స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీలర్లకు సూచించారు. విక్రయించిన వాటికి రశీదులు ఇచ్చి రైతుల సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెట ఏఓ ప్రియదర్శిని, ఎస్సై కీర్తిరాజు అన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మోక్షం గజ్వేల్: నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పట్టిన రాజకీయ గ్రహణంపై ఈనెల 23న ‘సాక్షి’లో ‘చెక్కులు ఇవ్వరు.. చింత తీర్చరు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు ఆదివారం గజ్వేల్ ఐఓసీలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం జరగనుంది. సమస్యలపై ఆరా సిద్దిపేటజోన్: కేసీఆర్ నగర్ గ్రంథాలయంలో సమస్యలను శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం అడిగి తెలుసుకున్నారు. పాఠకుల కోరిక మేరకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు నాగరాజు తదితరులు ఉన్నారు. -
అన్నిరంగాల్లో ముందుకు సాగాలి
సిద్దిపేటరూరల్: కిశోర బాలికలు చదువుతో పాటుగా అన్న రంగాల్లో ముందుకు సాగేలా ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్యా అన్నారు. శనివారం మహిళా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన కిశోర బాలికల మాక్ పార్లమెంట్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు విద్య, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, సమాజ నిర్మాణంలో తమ పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. బాలికలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బాలల హక్కులు, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలను అధికారులు అభినందించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు అదనపు డీఆర్డీఓ రోనాల్డ్ సుధీర్ కుమార్, డీడబ్ల్యూఓ శారద, డీఎంహెచ్ఓ ధనరాజ్, ఏటీసీ ప్రిన్సిపాల్, ఎన్జీఓ ప్రతినిధులు, సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్యా -
ముగ్గురు సీఐల బదిలీ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలు బదిలీ అయ్యారు. సిద్దిపేట టూటౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ హైదరాబాద్ రైల్వేకు, సిద్దిపేట ట్రాఫిక్ పీఎస్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ వరంగల్కు బదిలీ అయ్యారు. సిద్దిపేట టూటౌన్ నూతన సీఐగా హైదరాబాద్ వెయిటింగ్లో ఉన్న మర్రిపాక మురళి, సిద్దిపేట ట్రాఫిక్ నూతన సీఐగా గజ్వేల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. ముత్యంరాజు నియామకమయ్యారు. సీసీఎస్ నూతన సీఐగా రంగాకృష్ణ నియామకమయ్యారు. ఈ మేరకు నూతన సీఐలు శనివారం బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెలుతున్న సీఐ ఉపేందర్ను పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. -
3న సంగారెడ్డి జిల్లాకు సీఎం రాక
హత్నూర(సంగారెడ్డి): వచ్చేనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. హత్నూర మండలం బోరుపట్ల శివారులోని నూతనంగా నిర్మించిన తెరానియం బయోలాజిక్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానుండటంతో ఏర్పాట్లను శనివారం ఎస్పీ పరితోశ్ పంకజ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే పరిశ్రమను పూర్తిగా జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాలు, సభ ఏర్పాట్లు చేసే హాల్ను, హెలిప్యాడ్ను ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఖాళీ స్థలాన్ని కూడా హెలీప్యాడ్ స్థలం కోసం ఎస్పీ పరిశీలించారు. పరిశ్రమ వెనుకభాగంలోనే ముఖ్యమంత్రి హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవీందర్, ఎస్సై శ్రీధర్రెడ్డి, ఆర్ఐ హరిబాబు అధికారులున్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
సిద్దిపేటరూరల్: సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేసి జూన్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్సుహాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సివిల్ సప్లై, డీఆర్డీఓ, పీఏసీఎస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో అదనపు కలెక్టర్ లకీ్ష్మ్ కిరణ్తో కలిసి శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం ఉంది, పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా గోదాంలను అన్వేషించి అందులో ధాన్యం దిగుమతి చేయించాలని ఏపీఎంలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డిఓ సదానందం, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
రైతు డిస్కం పేరిట ఉరితాడు
మాజీ మంత్రి హరీశ్రావునంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం ఉచిత విద్యుత్కు ఉరితాడులా మారుతుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాత మోటార్లు ఆన్ అయి, సాయంత్రం 5 గంటలకు ఎండపోగానే బంద్ అవతాయని ఆరోపించారు. శనివారం పాలమాకులలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ముండ్రాయిలో రైతులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ పాలనలో చిన్న సమస్య వచ్చినా మెసేజ్ పెట్టగానే పరిష్కారమయ్యేదని, నేడు పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు నేలచూపు చూస్తుండటంతో పిల్లల ఫీజులు కట్టలేక అల్లాడుతున్నారన్నారు. రైతు డిస్కంకు సోలార్ పవర్ మాత్రమే కేటాయించడంతో రోజుకు 7, 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం రైతుబంధుకు ఎగనామం పెట్టి కేవలం రెండెకరాలకే అందజేసిందని ఎద్దేవా చేశారు.ఆరోగ్య సమాజంలో భాగస్వామ్యం కావాలిసిద్దిపేటజోన్: యోగా శిక్షకులుగా ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక టీటీసీ భవన్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా శిక్షకుల, న్యాయ నిర్ణేతల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధునిక జీవన శైలిలో ఏకాగ్రత లోపించి చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని ఏకీకృతం చేసి మన పనిపై ఏకాగ్రత పెంచే అద్భుతమైన సాధనం యోగా అని పేర్కొన్నారు. యోగాను ఒక పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు ర్యాంకుల కోసం ఏసీ గదుల్లో బంధించి బట్టీ పట్టించే విధానం సరికాదన్నారు. జీవితంలో ఏదైనా అపజయం వస్తే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండొద్దని, వాటిని తట్టుకొని దృఢంగా ఉండేలా చిన్నప్పటి నుంచే యోగా ద్వారా నేర్పించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, రాష్ట్ర యోగాసన అసోసియేషన్ ప్రతినిధులు శ్రీధర్ రావు, రాంరెడ్డి, అంజయ్య, అశోక్ పాల్గొన్నారు. -
అన్లోడ్ కావు.. లారీలు రావు
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026రాయపోల్లో..దౌల్తాబాద్లో దారి పొడవునా నిలిచిన ధాన్యం వాహనాలుధాన్యం సేకరణకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు అవుతున్నా.. తీసుకెళ్లిన ధాన్యం మిల్లులు, గోదాంల వద్ద అన్లోడ్ కావడం లేదు. దౌల్తాబాద్ మండలం అహ్మద్నగర్ పత్తి మిల్లు వద్ద శనివారం కిలోమీటర్ మేర లారీలు నిలిచిపోయాయి. అటు రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి వరకు వాహనాలు ధాన్యంతో స్తంభించాయి. ఆయా గ్రామాల సెంటర్ల నుంచి ధాన్యం తీసుకువచ్చి మూడు రోజుల పాటు రైతులు మిల్లుల వద్ద తిండీ తిప్పలు లేక అవస్థలు పడుతున్నారు. దారి పొడవునా వాహనాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. – దుబ్బాకటౌన్ -
బీజేపీకి కార్యకర్తలే బలం
మెదక్జోన్: బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షు డు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కలిసికట్టుగా ముందుకు సాగుదామని, క్షేత్రస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్రెడ్డి, నందారెడ్డి, నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
వడ్లు పూర్తిగా కొనుగోలు చేయాలి
గజ్వేల్: రాబోయే నాలుగు రోజుల్లో వడ్లను పూర్తిగా కొనుగోలు చేయకపోతే రాజీవ్ రహదారిపై 30 ట్రాక్టర్ల వడ్లను పోసి దిగ్బంధిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. శనివారం గజ్వేల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి రైతులపై భారీ కుట్రకు తెరలేపాయని మండిపడ్డారు. వ్యవసాయ బోరు మోటా ర్ల వద్ద మీటర్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి స్పందించి మీటర్ల బిగించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు గంగిశెట్టి రవీందర్, నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు. లేదంటే రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తాం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి -
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
కొనుగోళ్లు మరింత వేగవంతం మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని అల్వాల గోదాంను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్మిల్లుల్లో స్థల కొరతను అధిగమించడానికి గోదాంల రేకుల ఫిట్టింగ్ సరిచేసి వినియోగంలోకి తేవాలని తహసీల్దార్ను ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా, రైతుల ఇబ్బందులను తీరుస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆమె వెంట ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సీసీలు తదితరులు ఉన్నారు.కలెక్టర్ హైమావతి -
మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు మంజూరు చేయండి
సీఎంకు మంత్రి పొన్నం లేఖ హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ ద్వారా బొగ్గు తవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలలో బీటెక్ (మైనింగ్ ఇంజినీరింగ్) చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థుల్లో ఆసక్తి, సామర్థ్యం ఉందన్నారు. ప్రైవేట్ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారని లేఖలో వివరించారు. మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గంప శ్రీనివాస్ నియామకమైనట్లు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి డాక్టర్ మంకాల నవీన్ కుమా ర్ తెలిపారు. హైదరాబాద్లోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు ని యామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తణుకు ఆంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు అయిత రత్నాకర్, మంచాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను బుక్డిపోల ద్వారా విక్రయించాలనుకునే వ్యాపారులకు జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే జూన్ 5వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని డీఈ ఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విక్ర యాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు రూ. 1,000 డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఈ పాఠ్యపుస్తకాల విక్రయాలకు 2026–2027 ఏడాదికి గాను సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్లను విధిగా చెల్లించిన వ్యాపారులు మాత్రమే అర్హులని ఆయన స్పష్టం చేశారు. టీచర్ల సమస్యలు పరిష్కరించాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం సిద్దిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి.. మరణించిన ఉపాధ్యాయులకు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలన్నీ పోరాటాల ద్వారానే సాధించామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కనకయ్య, విజేందర్రెడ్డి, నరేందర్, రామస్వామి, తిరుపతి, మల్లేశం, అజీజ్, సత్యనారాయణ, సత్యక్రిష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
ఆటంకం లేకుండా నెట్వర్క్ సేవలు
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు సమస్య లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్ హాలులో జిల్లా స్థాయి టెలికాం కమ్యూనికేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఇంటర్నెట్ వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నెట్వర్క్ సేవలు అందించాలని ఆయా టెలికాన్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరెడ్డి, జిల్లా ఇండస్ట్రియల్ అధికారి గణేశ్ రామ్, కలెక్టరేట్ ఏవో రాజ్కుమార్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్లు, టెలికాం కంపెనీల ప్రతినిధులు టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్, జియో, ఇండస్ టవర్ ప్రతినిధులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ -
ఉక్కపోత.. జీరో కోత
ఎండలతో తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు సిద్దిపేట పట్టణానికి చెందిన మల్లయ్య రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లు పొందుతున్నారు. మేలో ఎండలు బాగా ఉండటంతో ఉక్కపోతను భరించలేక ఇంట్లో ఫ్యాన్, కూలర్ ఎక్కువగా వినియోగించారు. దీంతో 206 యూనిట్ల విద్యుత్ నమోదైంది. బిల్లు రూ.1,121 వచ్చింది. ఆరు యూనిట్ల విద్యుత్ వినియోగం పెరగడంతో జీరో బిల్లుకు అర్హత సాధించలేక పోయాడు. ఇలా ఒక్క మల్లయ్యనే కాదు, చాలా మంది ఉచిత విద్యుత్కు దూరమవుతున్నారు. – సాక్షి, సిద్దిపేట కొత్త వారికి వర్తించని పథకం ఇలా చేస్తే మేలు కొత్త వారికి వర్తించని పథకం -
విద్యుత్ నకిలీలలు
ట్రాన్స్కోలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేసు.. ● విజిలెన్స్ విచారణలో ఆధారాల గుర్తింపు ● కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లిన అవినీతి సొమ్ము ● సీనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటువిద్యుత్శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు ఆశాఖ విజిలెన్స్ విచారణలో తేలింది. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్ విభాగం ఈ ముడుపుల్లో కొంత మొత్తాన్ని తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఆధారాలతో సహా గుర్తించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఆశాఖ ఉన్నతాధికారులకు పంపడంతో సదరు అధికారిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. జేఎల్ఎంలుగా ఉద్యోగంలో చేరి.. 2020లో నలుగురు ఆర్టిజన్లు నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్లు పెట్టి జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లుగా ఉద్యోగాలు పొందారు. గుట్టుచప్పుడు కాకుండా వీరు దాదాపు నాలుగేళ్లుగా ఉద్యోగాల్లో కొనసాగారు. రూ.వేలల్లో జీతభత్యాలు, ఇతర అన్ని సౌకర్యాలు పొందారు. అలాగే ఐటీఐ కూడా పూర్తి చేశామని చెప్పి అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం)లుగా పదోన్నతి కూడా పొందినట్లు తెలుస్తోంది. పదోన్నతుల సందర్భంగా పెట్టిన ఐటీఐ సర్టిఫికెట్లు ఫేక్ అని టెక్నికల్ బోర్డు ధ్రువీకరించింది. దీంతో విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తే వీరివి ఎస్సెస్సీ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనని తేలింది. మరింత కూపీ లాగడంతో ఈ వ్యవహరంలో మరికొందరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నకిలీగాళ్ల నుంచి ఈ అధికారి రూ.లక్షల్లో ముడుపులను తీసుకున్నట్లు తేలింది. ఇలా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ముడుపుల మళ్లింపు ఆధారాలు లభించాయి. ఎంకై ్వయిరీ పెండింగ్ పెట్టి.. సాధారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలన కోసం పంపుతారు. ఈ సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా? అని తెలుసుకుంటారు. ఎస్సెస్సీ సర్టిఫికెట్లను ఎస్సెస్సీ బోర్డుకు, ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపుతారు. సదరు అధికారి వీరి సర్టిఫికెట్లను ఆయా బోర్డులకు పంపకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. పదోన్నతుల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపగా అవి నకిలీవని తేల్చారు. ఇన్నాళ్లు వెరిఫికేషన్ కోసం పంపకుండా పెండింగ్లో పెట్టి వారిని కాపాడినందుకు సదరు సీనియర్ అసిస్టెంట్ ఒక్కోక్కరి వద్ద రూ.లక్షల్లో ముడుపులు పొందినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు. -
తరుగు పేరిట కోత
● మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కు ● వడ్ల కొనుగోళ్ల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు గజ్వేల్: కొనుగోళ్లు సకాలంలో జరగక, అకాల వర్షాలతో ధాన్యం తడిసి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులకు ‘తరుగు’ పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్లు అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 421 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 58,455 మంది రైతులకు చెందిన 3.14లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు అతికష్టమ్మీద జరిగాయి. ఇక్కడ 3.70లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేసిన సంగతి తెల్సింది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం భారీగా ఉంది. కొనుగోళ్లకు నెల రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులకు మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం.. మరింత కుంగదీసింది. దీంతో రైతులు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకొని, అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నిలువుదోపిడీ.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులను తరుగు పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క నట్టేట ముంచుతున్నారు. 40–50కిలోల బస్తాపై 2–3కిలోలు కట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 5కిలోల వరకు కూడా కోత పెడుతున్నారు. కొనుగోళ్లు సక్రమంగా సాగని ప్రస్తుత తరుణంలో ఇదేంటని ప్రశ్నిస్తే తమ వడ్లను కాంటా పెడతారో? లేదోననే భయంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మిన్నకుండిపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతుల తిరగబడితే అప్పటికప్పుడు తప్పులను సరిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాగైనా ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలనే టార్గెట్ వల్ల ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వ్యవహారాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కొన్ని చోట్ల ఇలా... ● గజ్వేల్ మండలంలోని ఓ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు కొన్ని రోజుల క్రితం సుమారుగా 390క్వింటాళ్లకుపైగా ధాన్యం కాంటా అయినట్లుగా ముందుగా ట్రక్ షీట్ ఇచ్చారు. సరుకు మిల్లుకు తరలించగానే తరుగు పేరిట ఇందులోంచి సుమారుగా 4.5క్వింటాళ్లకుపైగా తగ్గించి మరో ట్రక్ షీట్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న ఆ రైతు కొనుగోలు కేంద్రాలతో వాగ్వాదానికి దిగడంతో...ఆ తప్పును సరిచేశారు. ● ఇదే మండలంలోని మరో గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనూ 40కిలోల బస్తాపై తరుగు పేరిట 4కిలోల కోత పెడుతున్నారు. కొన్ని రోజులుగా ఇది సాగుతూనే ఉంది. ● జిల్లాలోని అన్ని మండలాల్లో ఇది పరిస్థితి కొనసాగుతోంది. ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
దోసె.. పూరీ.. మిల్లెట్ ఇడ్లీ
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రోజుకో రకం టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. జూన్ 12 నుంచి పథకం ప్రారంభించేందుకు ఇంటర్ విద్యాశాఖ సమాయత్తం అవు తోంది. జిల్లాలో 20 జూనియర్ కళాశాలలు ఉండగా, సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆకలి తీరుస్తూ.. నమోదు శాతం పెంచుతూ ‘తెలంగాణ బ్రేక్ఫాస్ట్’ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలన్నీ మండల కేంద్రాల్లో ఉన్నాయి. అయితే సుమారు 90 శాతం విద్యార్థులు సమీప గ్రామాలు, తండాల నుంచి వస్తున్నారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఉదయం విద్యార్థులు సరిగా తినకుండానే కాలేజీకి వస్తున్నారు. సాయంత్రం 4.30 వరకు అర్ధాకలితో గడుపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యేక తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాఠాలు కూడా సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో సమయాను కనుగుణంగా పోషకాహరం లేక, బలహీనంగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని చాలా కాలంగా విద్యారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల నమోదు.. హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ జూన్ 12 నుంచి ప్రారంభం జిల్లాలో 20 కళాశాలలు సుమారు 6వేల మంది విద్యార్థులు రోజుకో రకం టిఫిన్.. పాలు, జావ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో రకం టిఫిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దోశ, చట్నీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు) సాంబారు, బుధవారం పూరీ(రెండు), మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, గురువారం బోండా– చట్నీ, శుక్రవారం ఇడ్లీ–చట్నీ, శనివారం ఉప్మా– చట్నీని మెనూగా నిర్ణయించారు. వీటితో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా మొదట కేంద్రీకృత కిచెన్ల ద్వారా వీటిని అందించనున్నారు. -
ముమ్మాటికీ రాజకీయ కక్షే..
చేర్యాల(సిద్దిపేట): ఈడీ, ఐటీ సోదాల పేరుతో సీపీఎంపై కేంద్రం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలని ఆ పార్టీనాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిపై కేంద్ర ప్రభుత్వం జరిపిన కక్షపూరితమైన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ సవాళ్లు ఎదుర్కోలేకే ఇలాంటి కుయుక్తులు పన్నుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దాడులు తీవ్రం చేసిందని విమర్శించారు. కేంద్రం ప్రశ్నించే గొంతుకులపై నేరుగా దాడులకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసే సీపీఎంపై కక్ష ధోరణి మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు బండకింది అరుణ్, రాళ్లబండి నాగరాజు, నాయకులు నర్సిరెడ్డి, ప్రభాకర్, శోభ, శ్రీహరి, భాస్కర్, మల్లేశం, రాజు, మైసయ్య, సిద్ధులు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొంటాం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొంటామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా 22 మండలాల్లో సుమారు 2,976 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లులో దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. నేటికీ 427 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తంగా 58,455 మంది రైతుల నుంచి 3,14,868 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.457 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ వై్స్ చాన్సలర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావుకు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ చాన్సలర్ జీ.భాస్కర్రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురువారం హర్యానాలోని ఎంపీహెచ్యూ వేదికగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్సింగ్షైనీ చేతుల మీదుగా సీహెచ్ఏఐ(చాయ్) హానరరీఫెలో –2026, అమిత్ కృషి రుషి అవార్డు–2026 లను వీసీ ప్రవీణ్రావు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులు వర్సిటీకి గర్వకారణమన్నారు. వ్యవసాయ, ఉద్యాన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు వరించాయన్నారు. దుబ్బాక: దేశభద్రత, సమగ్ర అభివృద్ధి కోసమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(సర్).. సర్పై ప్రజల్లో సమగ్రంగా అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్గౌడ్ అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు దుబ్బాక మున్సిపాల్టిలో సర్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ గురించి వివరించడంతో పాటు రాబోయే కాలంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దొరగొల్ల శ్రీకాంత్ యాదవ్, సర్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి వంశీకృష్ణాగౌడ్, తిరుమల్రెడ్డి, సుభాష్రెడ్డి, ప్రవీణ్, రమణారెడ్డి, ప్రసాద్, భాస్కర్, రవీందర్, కౌన్సిలర్లు సాయి కుమార్గౌడ్, కనకరాజు తదితరులు ఉన్నారు. దుబ్బాకటౌన్: మాదిగ సామాజిక వర్గం విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ నేత, జిల్లా ఇన్చార్జి మంద పవన్కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక మెడికల్ అసోసియేషన్ భవనంలో మాదిగల్లో అక్షరాస్యతను పెంచేందుకు చేపట్టిన ‘గ్రామాల్లో 40 రోజుల కార్యక్రమాన్ని’ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజుతో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ (ఎస్ఈఈఈపీసీ) సర్వే నివేదికలో అక్షరాస్యతలో మాదిగలు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు విద్య ప్రాముఖ్యతను వివరించి, అక్ష్యరాస్యతను పెంపొందించడం కోసం గ్రామ గ్రామాన చైతన్య సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం, రాజనర్సు, నవీన్, ప్రశాంత్, మహేశ్, తదితరులున్నారు. -
నేరుగా నోట్ బుక్స్..
జిల్లాలో 938 ప్రభుత్వ పాఠశాలల్లో 81,229 మంది విద్యార్థులున్నారు. అందులో బాలురు 38,508, బాలికలు 42,721 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరి కోసం 7,11,894 పుస్తకాలు అవసరం. అందులో పార్ట్–1కింద.. 5,33,478, పార్ట్–2 కింద 1,78,416 పుస్తకాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ భాషలలో ముద్రించారు. రెండు భాషలలో ఉండే పుస్తకాలు రెండు పార్ట్లుగా విభజించారు. అందులో మొదటి పార్ట్తో పాటు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినవి మొత్తంగా 5,33,478 అవసరం ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 4.92లక్షల పుస్తకాలు చేరుకున్నాయి. ఇంకా 41,478 పుస్తకాలు రావాలి. అలాగే పార్ట్–2కు సంబంధించి 1,78,416 పుస్తకాలు రావల్సి ఉంది. మొదటి విడతలో రావాల్సిన వాటిలో ఇంకా ఐదు టైటిల్స్ రావాలి. అందులో 4వ తరగతి ఇంగ్లిష్, 5వ తరగతి తెలుగు, గణితం, ఆరో తరగతి ఇంగ్లిష్, 8వ తరగతి హిందీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. నేటి నుంచి ఎమ్మార్సీలకు.. మోడల్ స్కూల్స్, బీసీ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు 1,04,500 పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 7వ తేదీ వరకు మండల రిసోర్స్సెంటర్లకు పుస్తకాలు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు జూన్ 12వ తేదీలోగా చేరవేస్తారు. దీంతో పాఠశాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. క్రమసంఖ్య, బార్కోడ్ ముద్రించారు. దీని ద్వారా ఏ మండలానికి ఎన్ని పుస్తకాలు పంపాలో స్పష్టంగా లెక్కతేలుంతుంది. ప్రైవేట్ పాఠశాలలకు చేరే అవకాశం ఉండదు.విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్ బుక్స్ నేరుగా పాఠశాలలు, ఎమ్మార్సీలకు చేరుకోనున్నాయి. 1వ, 2వ తరగతి విద్యార్థులకు మూడు చొప్పున నోట్బుక్స్, 3, 4, 5వ తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున , 6 నుంచి 8వ తరగతి వారికి ఆరు చొప్పున , 8వ తరగతి విద్యార్థికి ఏడు నోట్ బుక్లు, 9, 10వ తరగతి విద్యార్థులకు14 చొప్పున నోట్ పుస్తకాలను అందించనున్నారు.పునఃప్రారంభం రోజే అందిస్తాం పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయనున్నాం. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 10శాతం పుస్తకాలు సైతం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గురుకులాలు, మోడల్ స్కూల్స్కు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. 901 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎమ్మార్సీలకు శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నాం. – రామ్ప్రసాద్, జిల్లా మేనేజర్, పాఠ్యపుస్తకాలు -
ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనాలి
మాజీ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం చిన్నకోడూరుతో పాటు ఇబ్రహీంనగర్, గోనెపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఆధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రోహిణి కార్తే నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ ప్రభుత్వం ఆన్లైన్ ట్యాగింగ్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వదిలి రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వారం రోజులు ఇసుక రవాణా ఆపి, ఆ లారీలను ఆర్టీఏ అధికారులు వడ్ల రవాణాకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్యరెడ్డి,శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైతన్న కష్టం..వర్షార్పణం
తడిసిన ధాన్యం కొంటాంవర్షంలోనే రైతుల పాట్లు ఆగం చేసిన వాన● కొనుగోలు కేంద్రాల్లో తడిసిముద్దయిన ధాన్యం ● కాపాడుకునేందుకు అన్నదాత పాట్లుదుబ్బాక/సిద్దిపేటజోన్: గాలి దుమారంతో కూడిన వర్షం రైతులను ఆగం జేసింది. జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఎండిన ధాన్యం సైతం తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దుబ్బాక, సిద్దిపేట, చిన్నకోడూరు, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, నంగునూరు, గజ్వేల్, వర్గల్, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రధానంగా దుబ్బాక, సిద్దిపేట మార్కెట్యార్డుల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడవడమేకాక, కాంటాలు పెట్టిన వడ్లబస్తాలు సైతం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు చాలా వరకు ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది.వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు దుబ్బాక మార్కెట్యార్డుతో పాటు పలుకొనుగోలు కేంద్రాల్లో రాత్రి వేళ వర్షంలోనే రైతులు పడరానిపాట్లు పడ్డారు. కాంటాలు పెట్టించిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. ఏ రైతును కదిలించినా కన్నీరు పెట్టడమే తప్ప వారినోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు. -
ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. స్థానిక నాయకత్వంతో మమేకమై ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమన్వయంతో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు ప్రతీ కార్యకర్తకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించామని, ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. స్పాట్లో లైవ్ ఫొటో తీసుకుని ఓటరు వివరాలు కూడా వెంటనే నమోదవుతాయన్నారు. తద్వారా ఈ సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో పదికి పది చోట్ల విజయం సాధించేలా పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో ఆన్లైన్ సభ్యత్వ నమోదు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, శశిధర్రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మెంబర్షిప్ డ్రైవ్ జిల్లా ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.ప్రతీ కార్యకర్తకు సమయం ఇవ్వండి నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలి సభ్యత్వ నమోదు సన్నాహకసమావేశంలో హరీశ్రావు -
టాస్క్ఫోర్స్ తనిఖీలు
● వెంకటరమణ ట్రేడర్స్లో అవకతవకలు ● రూ.26.83లక్షల విలువైన విత్తనాల విక్రయం నిలిపివేతకు నోటీసు గజ్వేల్: పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్లో జిల్లా టాస్క్ఫోర్స్ టీమ్ బుధవారం తనిఖీలు చేపట్టింది. టాస్క్ఫోర్స్ ప్రత్యేకాధికారి ఏడీఏ మల్లయ్య, సీఐ శ్రీధర్, స్థానిక ఏడీఏ బాబునాయక్లు సంయుక్తంగా ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లను పరిశీలించి అవకతవకలు గుర్తించారు. దీంతో రూ.26.83లక్షల విలువైన విత్తనాల విక్రయాలను నిలిపేస్తూ నోటీసులు (స్టాప్ సేల్ నోటీస్) ఇచ్చారు. ఈ తనిఖీల్లో రాయపోల్ వ్యవసాయాధికారి నరేష్, ఎస్ఐ సురేష్ తదితరులున్నారు. ధాన్యం మొత్తం కొనేవరకు పోరాటం గజ్వేల్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో విఫలమైన రేవంత్ సర్కారు రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. కొనుగోళ్ల వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం గజ్వేల్లోని మార్కెట్ యార్డు ఆవరణలో ‘రైతు దీక్ష’ ‘వంటా వార్పు’ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా కూడా 40శాతానికి మించి కొనుగోళ్లు జరగలేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు సైతం రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజ కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రెండ్రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లను పూర్తిగా తరలించాలని, లేనిపక్షంలో రాజీవ్రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన ‘రైతు దీక్ష’ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ప్రతాప్రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, దేవీరవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వర్గల్లో భారీ వర్షం
వర్గల్(గజ్వేల్): మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయిలో 48.6 మి.మీటర్ల వర్షం కురిసింది. నాచారం, మజీద్పల్లి, నెంటూరు, మైలారం, వర్గల్, వేలూరు, అంబర్పేట, గిర్మాపూర్, అనంతగిరిపల్లి తదితర చోట్ల రోడ్డుపై ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. గాలి తీవ్రతకు కప్పిన కవర్లు సైతం ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ వైర్లు నేలవాలాయి. మజీద్పల్లిలో జనావాసాలపై కరెంటు స్తంభం ఒరిగిపడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. మండలవ్యాప్తంగా 25 కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని, పలుచోట్ల కరెంటు తీగలు తెగిపోయాయని విద్యుత్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగుల్లో బదిలీ గుబులు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. జిల్లాలో ఉద్యోగులెవరిని కదిలించినా బదిలీల చర్చే వినిపిస్తోంది. ఎవరెవరు సీనియర్లు? ఎక్కడికి బదిలీ అయ్యే అవకాశం ఉంది? ఇతరత్రా విషయాలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఈ నెల 30 వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బదిలీల కోసం కొన్ని శాఖల ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వగా, మరికొందరు ఇస్తున్నారు. 40శాతానికే పరిమితం ఉద్యోగుల బదిలీలు 40శాతానికి మించి చేయవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జూనియర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు శాఖలలో సీనియారిటీ జాబితా ప్రకటించారు. బదిలీ ఎక్కడికి అవుతుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కొందరు ఉద్యోగులు జిల్లా ఆవిర్భావం నుంచి ఇక్కడే తిష్ట వేశారు. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు.. వీఆర్ఏ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు ఒకే మండలం, పని చేసిన చుట్టు పక్క మండలాల్లోనే విధులు నిర్వర్తించడం గమనార్హం. పంచాయతీ కార్యదర్శులకు కౌన్సిలింగ్ 132 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. బుధవారం వీరికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ను నిర్వహించారు. వైద్యారోగ్య శాఖలో ఎంపీహెచ్ఏ(ఎఫ్)లు 23 మంది, స్టాఫ్ నర్సులు 11 మందికి, రెవెన్యూ, వ్యవసాయ శాఖలో బదిలీలు కానున్నాయి. వ్యవసాయ శాఖలో 40 ఏఈవోలు, ఇరిగేషన్ శాఖలో బదిలీల కోసం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంకా ఎక్కడికి బదిలీ అయ్యారో ఉత్తర్వులు జారీ చేయలేదు. పెండింగ్లోనే జీఓ 317 బాధితుల సమస్య గత ప్రభుత్వం అమలు చేసిన జీఓ317 కారణంగా పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం కలిగించేందుకు 3 నుంచి నాలుగేళ్ల వరకు డిప్యుటేషన్ ఇవ్వాలని గతంలో 197 జీఓను జారీ చేసింది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. మూడున్నరేళ్ల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ ప్లేస్ ఆధారంగా ఆయా జిల్లాలకు బదిలీలు చేపట్టి తర్వాత సాధారణ బదిలీలు చేయాలని జీఓ317 బాధితులు కోరుతున్నారు.నాలుగు స్థాయిల ఉద్యోగులకు.. నాలుగు స్థాయిల ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. జిల్లా స్థాయిలో అటెండర్ నుంచి రికార్డు అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్లు బదిలీలు అవుతున్నాయి. రాజన్న జోన్ పరిధిలో(జోన్–3) కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు రానున్నాయి. సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రేడ్–1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, హెచ్డబ్ల్యూవో, ఎంపీహెచ్ఏ(ఏఎన్ఎం), స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నిషియన్, వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగులు ఉండనున్నారు. మల్టీ జోన్–1 పరిధిలోకి కాశేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు రానున్నాయి. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, మండల వ్యవసాయాధికారి, ఏఈలు, ఏఎస్డబ్ల్యూవో బదిలీలు కానున్నారు.ఎవరిని కదిలించినా అదే చర్చ రెండు రోజుల్లో కౌన్సిలింగ్ పూర్తి కోరుకున్న జిల్లాకు బదిలీ చేపట్టాలంటున్న జీఓ317 బాధితులుజీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి. వీరిని బదిలీ చేసిన తర్వాతే మిగతా వారిని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ సంఘాలు, బాధితుల పోరాటాల ఫలితంగా డిప్యూటేషన్ల కోసం ప్రభుత్వం 197జీఓను తీసుకవచ్చింది. డిప్యుటేషన్ల కోసం ఆప్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటికై నా మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించాలి. – విక్రంరెడ్డి, టీఎన్జీఓఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ప్రశాంతంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు
వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి యూనివర్సిటీలో టీజీ పీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తుండగా తొలిరోజు ఉదయం సెషన్లో 180 మందికి 141, మధ్యాహ్నం సెషన్లో 180కి 140 మంది హాజరైనట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద గౌరారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రూ.70 వేల విరాళం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గోనెపల్లిలో పోచమ్మ తల్లి ఉత్సవాలకు గాను గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శనివారం రూ.70 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూర మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవడం అభినందనీయమన్నారు. సంఘం నాయకులు కమలాకర్చారి, సంతోష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి నంగునూరు(సిద్దిపేట): గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఇండేన్ గ్యాస్ నంగునూరు డీలర్ జయపాల్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హరిణి గ్యాస్ కార్యాలయంలో వినియోగదారుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ పంపిణీ నిలిచిపోతుందని చెప్పారు. -
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
గజ్వేల్: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలను పెంచు తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం గజ్వేల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్రెడ్డి, కార్మికశాఖామంత్రి వివేక్ చిత్రపటాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డితో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే తూంకుంట -
బస్టాండ్ను ప్రారంభించడంలో నిర్లక్ష్యం
గజ్వేల్: పట్టణంలో బస్టాండ్ నిర్మాణం పూర్తయినా.. ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చందనతో కలిసి శనివారం బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల కిత్రమే బస్టాండ్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి తేవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎండల్లో బస్సుల కోసం నిరీక్షిస్తూ ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. ప్రజ్ఞాపూర్లో నిర్మించిన మరో బస్టాండ్ పనులు సైతం వెంటనే పూర్తిచేయాలని, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ నాయకులు కళ్యన్కర్ నర్సింగరావు, నవాజ్మీరా, ఊడెం కృష్ణారెడ్డి, గోలీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి -
ఎన్సాన్పల్లిలో హై పవర్ ట్రాన్స్ఫార్మర్
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా జైలు, ఎన్సాన్పల్లి గ్రామానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా అదనపు హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్టు డీఈలు రామచంద్రయ్య, పండరి తెలిపారు. మండల పరిధిలోని ఎన్సాన్పల్లిలో వేర్వేరు ఫీడర్ల కోసం ఏర్పాటు చేసిన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ నాగుల స్రవంతి తో కలిసి శనివారం వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎన్సాన్పల్లి గ్రామంతోపాటు వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ కళాశాల, జిల్లా జైలుకు ప్రత్యేకంగా ఫీడర్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీధర్రెడ్డి, ఎస్ఎల్ఐ తానాజీ, ఎల్ఐ శ్రీనివాస్రెడ్డి, లైన్మాన్ వెంకట్, పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, హరికిషన్ పాల్గొన్నారు.ప్రారంభించిన డీఈలు -
● ఐదేళ్లుగా.. అసంపూర్తిగా
కిష్టాపూర్లో అసంపూర్తిగా నిలిచిన ఫంక్షన్ హాల్ నిర్మాణం పేదకుటుంబాల వారు వివాహ, శుభకార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లో విలేజ్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో రూ.30 లక్షలతో ఐదేళ్ల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు చాలక నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఆ నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. త్వరగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
అట్రాసీటీ కేసుపై విచారణ
మద్దూరు(ముస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన నాగులపల్లి సంపత్ అదే గ్రామానికి చెందిన మెతుకు పాపిరెడ్డి, మెతుకు భాస్కర్రెడ్డిపై ఫిర్యాదు చేయగా మద్దూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం గ్రామాన్ని సందర్శించి సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపిరెడ్డి, భాస్కర్రెడ్డి కులం పేరుతో తనను ధూషించారని గత 20న సంపత్ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట మద్దూరు ఎస్ఐ ఆసిఫ్ ఉన్నారు. మంటల్లో తుంగచెట్లు హుస్నాబాద్: సిద్దిపేట రోడ్లోని పెట్రోల్ బంక్ వెనుక ఉన్న తుంగచెట్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడటంతో పెట్రోల్ కోసం వచ్చిన వినియోగదారులు భయంతో పరుగులు పెట్టారు. సమీపంలోని ఇళ్లలోకి పొగ వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గతంలో తుంగ చెట్లను తొలగించాలని మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఎవరైనా నిప్పు పెట్టారా? ఎండ వేడిమికి మంటలు చెలరేగాయా అనేది తెలియరాలేదు. మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం చిన్నకోడూరులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సేవల ద్వారానే గుర్తింపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజలకు చేసే సేవల ద్వారానే మంచి గుర్తింపు లభిస్తుందని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వీరబత్తిని సత్యనారాయణ అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న నందిని శ్రీనివాస్, గణేశ్నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న గడీల శ్రీనివాస్ను ఆలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి కూర శేష్కుమార్, గణేశ్నగర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు రాజేశం, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చైర్మన్ చీకోటి మధు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిపొందే వరకు పోరాటం బెజ్జంకి(సిద్దిపేట): జనాభా దామాషా ప్రకారం అన్నిరంగాలలో లబ్ధిపొందే వరకు పోరాటం చేస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకుడు సదన్ మహరాజ్ అన్నారు. జూన్ 5న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగసభకు చెందిన పోస్టర్లను బెజ్జంకిలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు కులా ల ప్రజలు అన్నిరంగాలలో అన్యాయానికి గుర వుతున్నారన్నారు. జనాభా ప్రకారం లబ్ధిపొందే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాంకాలి సురేశ్, అంజిబాబు, ఉపసర్పంచ్ దూమాల మహేశ్, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, స్వెరోస్ నాయకులు సురేశ్, నాయకులు లింగయ్య, శంకర్, మక్సుద్, రవీందర్, రాజు, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణకే వైద్య పరీక్షలు
దుబ్బాకటౌన్: కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని, తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు బాలికల్లో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలను గమనిస్తుండాలని మున్సిపల్ చైర్పర్సన్ సంగీ త అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌమార బాలికల ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. తిమ్మాపూర్ పీహెచ్సీ సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యకమ్రంలో మున్సిపల్ కమిషనర్ కె.రమేశ్కుమార్ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళా కుటుంబాల్లోని కిషోర బాలికలకు రక్తహీనత, హిమోగ్లోబిన్, షుగర్ స్థాయిని తెలిపే రక్తపరీక్షలు, ఎత్తు, బరువులను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమారదశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్లో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. పోషకాహారం, పరిశుభ్రత, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. కార్యక్రమంలో మెప్మా సీఓ రేణుక, ఎంఎల్హెచ్ పి.స్రవంతి, హెల్త్ అసిస్టెంట్ గణేశ్, ఏఎన్ఎం పుష్ప, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకపోతే చర్యలు
ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ గజ్వేల్రూరల్: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన డ్రంకెన్డైవ్లో 19 మంది పట్టుపడ్డారన్నారు. వారిని న్యాయమూర్తి స్వాతిగౌడ్ ఎదుట హాజరుపర్చగా విచారణ అనంతరం రూ.1.13 లక్షల జరిమానా విధించారని చెప్పారు. వారిలో కొందరికి జైలు శిక్ష విధించారని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన తొమ్మిది మందికి రూ.45 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తాం గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలోని గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ 22 వరకు 74,554 క్వింటాళ్ల వడ్లు, 26,090 క్వింటాళ్ల మొక్కజొన్న, మరో 3,654 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరిగాయన్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సీటీని రద్దుచేస్తామని ఎమ్మెల్యే హరీశ్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సీటీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో వివిధ కంపెనీలు, ప్యాక్టరీలు నెల కొల్పడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే రాబోయే తరాల వారి జీవితాలు అడ్డుకోవడమే అన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు ఆపకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని, సిద్దిపేట అభివృద్ధి జరగలేదని అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్యాదారి మధు, గాయాజొద్దీన్, హర్షద్, విజయ్ డానియల్, రాజిరెడ్డి, నజ్జు, సంతోష్గౌడ్, బాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇమామ్ -
ధాన్యం కొనేదెప్పుడు?
లారీల కోసం రాస్తారోకో కొండపాక(గజ్వేల్): కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించాలంటూ మండలంలోని దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై టోల్ప్లాజా వద్ద రైతులు రాస్తారోకో చేశారు. మర్పడ్గ, సిర్సనగండ్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాల్లో నింపి వారం రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాహకులను సంప్రదించగా పొంత న లేని సమాధానాలు చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు మూడు వేల బస్తాల ధాన్యం సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా రైతులు నర్సింహులు, కనకయ్య, శ్రీనివాస్రెడ్డి, సెల్ బాల్నర్సు, రాము లు తదితరులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వర్షం కురిస్తే ధాన్యం బస్తాలు తడిసిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.గజ్వేల్/గజ్వేల్రూరల్: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలను విక్రయించేందుకు రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. తాము తీసుకువచ్చిన ధాన్యం ఎప్పుడు కొంటారంటూ రైతులు పలుచోట్ల శనివారం రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. గజ్వేల్తో పాటు మండల పరిధిలోని అహ్మదీపూర్, జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామాల్లో అన్నదాతలు రోడ్లపై బైఠాయించి ఆందో ళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 50 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యం పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందిన పంటను విక్రయిద్దామనుకుంటే కొనుగోళ్లలో జాప్యంతో అవస్థలు పడుతున్నామని, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తమవంతు ఎప్పుడొస్తుందా.. అంటూ ఎదురు చూసి నిరాశతో వెనుతిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. దీంతో రోడ్లపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం కొనండి మహాప్రభు! మర్కూక్(గజ్వేల్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం ఎగుమతులు జరగడం లేదు. ఏదోలా రైతులు ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తే కూలీల కొరతతో రోజుల తరబడి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని నర్సన్నపేట సమీపంలోని రైస్మిల్లు వద్ద మూడు రోజులుగా ధాన్యం బస్తాలతో లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని అంగడికిష్టాపూర్ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఐదు రోజుల నుంచి సెంటర్కు లారీలను పంపిచండం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టింకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి కొమురవెల్లి(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గీస భిక్షపతి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, రైతులతో కలసి మండల కేంద్రంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అసమర్ధతవల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, నాయకులు ముత్యం నర్సింహులు, గొల్లపల్లి కిష్టయ్య, కనకచారి తదితరులు పాల్గొన్నారు.వెల్లువెత్తిన నిరసనలు రోడ్లపై బైఠాయించి అన్నదాతల ధర్నా గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు -
పచ్చిరొట్టతో భూసారం వృద్ధి
సిద్దిపేటరూరల్: పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ సూచించారు. మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారవంతంగా మారుతుందన్నారు. తద్వారా దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయ విధానాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నరేశ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు రజిత, జానారెడ్డి, మహేందర్, అశోక్, అజ్మత్, అంజిరెడ్డి, బాబు, కనకయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూసారం మెరుగు మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చిరొట్ట సాగుతో భూసారం మెరుగవుతుందని ఏఎంసీ చైర్పర్సన్ బొమ్మెర సంయుక్త అన్నారు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్రోడ్డులోని డీసీఎంఎస్ రైతుసేవా కేంద్రం, అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో శనివారం రైతులకు పచ్చిరొట్ట విత్తలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల మోతాదును తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సత్యాణ్వేశ్, సర్పంచ్ అంకిత, ఉపసర్పంచ్ కందిబాబు, ఏఈఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమలుకు ప్రాధాన్యం
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా 766.81టన్నుల వ్యర్థాలను తొలగించామని, అలాగే 3,506 కార్యాలయ భవనాలను శుభ్రపరిచి, 2,913 పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసినట్లు తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా 508 రోడ్ సేఫ్టీ కమిటీలు, జిల్లాలో నాలుగు బ్లాక్ స్పాట్లను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. 1,905 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించామని, 330 భూమి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశామని వివరించారు. ప్రైవేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి షీ బాక్స్ పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. ఈ 99రోజుల కార్యక్రమం జూన్12వ తేదీ వరకు జరగనుందన్నారు. తొలుత వివిధ స్టాళ్లను పరిశీలించారు. వివిధ శాఖల కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల అధికారులు వివరించారు. అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసుకున్నారు. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు జరుగుతున్నా మాజీ మంత్రి హరీశ్రావు రైతులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావులు జిల్లాలో ప్రాజెక్ట్లు నిర్మించడం వల్లే గోదావరి జలాలు వచ్చాయన్నారు. దీంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు ఆయిల్పామ్ పంట సాగుకు అనుకూలంగా మారిందన్నారు. కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడవద్దని, సిద్దిపేట అభివృద్ధి, ప్రణాళిక గురించి మాత్రమే మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంక్షేమం మరింత చేరువ కలెక్టర్ హైమావతి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సమావేశం -
కస్తూర్బాలో అడ్మిషన్లు
వర్గల్(గజ్వేల్): స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరం కోసం ఆరు, ఏడు తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఎల్టీ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారి రజిత తెలిపారు. ఆరోతరగతిలో 40, ఏడో తరగతిలో 13, ఎంఎల్టీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన విద్యార్థినులు వచ్చే నెల 22లోగా నేరుగా వర్గల్ విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలుగజ్వేల్: పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో ఏడీఏ బాబునాయక్, ఇన్స్పెక్టర్ రవికుమార్, రాయపోల్ వ్యవసాయాధికారి నరేష్ సభ్యులుగా ఉన్న టాస్క్ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని జ్యోతి ఆగ్రో మార్కెటింగ్, ఆగ్రో రైతు సేవా కేంద్రం, వరలక్ష్మి, శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణాల్లో ఈ తనిఖీలు జరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లు, స్టాక్ రిజిష్టర్లు, బిల్లు బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని, రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే..పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, కాలం చెల్లినవి అమ్మినా చర్యలు తప్పవన్నారు. అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులుహుస్నాబాద్: సరస్వతి మాత అంత్య పుష్కరాలకు హుస్నాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. స్థానిక బస్టాండ్ నుంచి కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వయా కరీంనగర్ మీదుగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. సాగులో మెలకువలు తప్పనిసరి పరిశోధన శాస్త్రవేత్తలు చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో మెలకువలు పాటించాలని పరిశోధన శాస్త్రవేత్తలు లక్ష్మమ్మ, ప్రధుమన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లిలో భారతీయ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. సాగులో సేంద్రియ పద్ధతులను ఉపయోగించాలన్నారు. పంట మార్పిడి చేయాలని సూచించారు. మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ అధికారి నిహారిక, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. డీఆర్ఓగా నాగరాజమ్మసిద్దిపేటరూరల్: జిల్లా రెవెన్యూ అధికారిగా నాగరాజమ్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా భూసేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్ యూనిట్ –2 విధులు నిర్వహిస్తూ ఇన్చార్జి డీఆర్ఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వులతో నూతన డీఆర్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్గా కరుణాకర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్గా మల్కగల్ల కరుణాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కరుణాకర్ గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు. -
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
చేర్యాల(సిద్దిపేట): రోడ్లపై చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సరఫరా, ఇతర సిబ్బంది అందరూ విధుల్లో అశ్రద్ధ చూపవద్దన్నారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా రోడ్లమీద చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత కోసం అందరూ పనిచేయాలి అన్నారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు గీతాంజలి, సుప్రజ, సురేష్, ప్రసాద్, సదానందం, కమిషనర్ నాగేందర్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ అరుణ -
కొనుగోళ్ల ప్రక్రియ వేగిరం: సీపీ రష్మీ
హుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, సాధ్యమైనంత తొందరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు, దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. హుస్నాబాద్ మార్కెట్లో హమాలీల కొరత ఉందని అధికారులు చెబుతున్నారని, హమాలీల సంఖ్యను పెంచి దిగుమతిలో జాప్యం జరగకుండా చూస్తున్నామన్నారు. ఒక ట్రాక్టర్ ధాన్యం అన్లోడింగ్ దిగుమతి కావాలంటే 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఒక్క రోజే దాదాపు 60 ట్రాక్టర్ల ధాన్యం దిగుమతి అయ్యేలా అధికారులు ప్లాన్ చేశారన్నారు. ధాన్యం దిగుమతి విషయంలో లోకల్ పోలీస్లు సహకారం ఉందన్నారు. ఆమె వెంట ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి ఉన్నారు. -
విజయ డెయిరీ పాలు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు బడిలోనే బ్రేక్ఫాస్ట్మెదక్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది. 2,55,059 విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది.జిల్లా పాఠశాలలు విద్యార్థులు మెదక్ 881 68,219 సిద్దిపేట 935 80,541 సంగారెడ్డి 1,222 1,06,299 -
హమాలీల కొరత.. రైతన్న వ్యథ
మార్కెట్ యార్డ్లో ధాన్యం ట్రాక్టర్లతో నిరీక్షణహుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొనడంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలల్లోని ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లోని గోదాంలకు తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తుండటంతో దిగుమతిలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇందుకు హమాలీల కొరతే కారణం. ధాన్యం ట్రాక్టర్లు బారులు మార్కెట్లోని ధాన్యం బస్తాలను కాంటా పెట్టి, గోదాంలలో దిగుమతి చేసేందుకు హమాలీల కొరత ఏర్పడుతోంది. ఉన్న వారితోనే ఒక రోజు కాంటాలు పెట్టడం.. మరో రోజు గోదాంలలో ధాన్యాన్ని దిగుమతి చేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో ధాన్యం దిగుమతి కాకపోవడంతో బయట నుంచి వస్తున్న ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సరిపడా హమాలీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలను కూడా రప్పించి దిగుమతి చేస్తున్నారు. రోజూ వేలాది ధాన్యం బస్తాలు వస్తుంటే, మార్కెట్లో కేవలం 40 మంది హమాలీలే ఉండటంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లోని రెండు గోదాంలలో ఇప్పటి వరకు 26 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలను దిగుమతి చేశారు. ఇప్పటికే మూడు గోదాంలలో రెండు నిండిపోయాయి. నేడో, రేపో అదికూడా నిండిపోతే పరిస్థితి ఏమిటనీ రైతులు దిగాలు చెందుతున్నారు. మాయమవుతున్న ధాన్యం వ్యవసాయ మార్కెట్లో కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు మాయమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ధాన్యం కుప్పల చుట్టూ బస్తాలు అడ్డు పెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చి చూడగా ధాన్యం కనిపించడం లేదని వాపోతున్నారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.గోదాంల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు ధాన్యం దిగుమతిలో తీవ్ర జాప్యం మార్కెట్ యార్డులో వందలాది ట్రాక్టర్లు ఎటు చూసినా వడ్ల బస్తాలే..ప్రతి గింజా కొంటాం రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. హమాలీల కొరత ఉండటంతో బీహార్కు చెందిన హమాలీలను సైతం రప్పించి దిగుమతి చేయిస్తున్నాం. హుస్నాబాద్, అక్కన్నపేటలో 70 శాతం ధాన్యం కొనుగోలు చేశాం. హుస్నాబాద్లోని గోదాంలు సరిపోకపోతే కోహెడ మండల కేంద్రంలోని గోదాంకు తరలిస్తాం. – లక్ష్మారెడ్డి, తహసీల్దార్, హుస్నాబాద్ -
ఆదాయపు పన్ను చట్టం మరింత సరళీకృతం
సిద్దిపేటకమాన్: నూతన ఆదాయపు పన్ను చట్టం ద్వారా పన్ను విధానాలు మరింత సరళీకృతం అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని ఇన్కమ్ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రాకేష్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులకు శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. నూతన ఆదాయపు పన్ను చట్టం కొత్త నిబంధనలు, విధానాలపై వివరించారు. పన్ను చెల్లింపుదారులకు సులభమైన పారదర్శకత, సాంకేతిక ఆధారిత సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
చెక్కులు ఇవ్వరు.. చింత తీర్చరు
‘కల్యాణ లక్ష్మి’ చెక్కులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. పంపిణీ అంశం కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను కలవరపెడుతోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో విసిగిపోయి ఈనెల 1న గజ్వేల్ ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ‘కల్యాణ లక్ష్మి’ కాగితాలకే పరిమితమా’..?, ‘చెక్కులకు మోక్షం ఎప్పుడు’..? పోస్టర్లను అతికించి తమ నిరసన తెలియజేయడం చర్చకు దారితీసింది. అయినా అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. – గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. ‘కల్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీలోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, కుకునూర్పల్లి, జగదేవ్పూర్, మర్కూక్ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి చెక్కులు గజ్వేల్ ఆర్డీఓ పరిధిలో, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన చెక్కులు తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తూప్రాన్ ఆర్డీఓ పరిధిలోని చెక్కుల పంపిణీ ఎప్పటికప్పుడూ సజావుగా సాగుతోంది. గజ్వేల్ ఆర్డీఓ పరిధిలోనే భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నెలల తరబడి పెండింగ్లో ఉండటం లబ్ధిదారులకు ఆందోళన కలిగిస్తున్నది. రెండు నెలల క్రితమే ఇక్కడ వెయ్యి చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ చెక్కుల వాలిడిటీ మూడు నెలలు మాత్రమే. ఒకవేళ పంపిణీ నాటికీ ఎక్స్పైరీ అయితే ఆ చెక్కులను రీవాల్యూ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగక తప్పదు. ఎందుకీ ఈ పరిస్థితి? నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రతి అంశం ఇరు పార్టీల చాలెంజ్గా మారుతోంది. ఇటీవల మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ పనుల అంశం రాజకీయ రంగు పులుముకున్న విషయాన్ని ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. ఇదే రకమైన పరిస్థితి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి అడ్డంకిగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా.. ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే మౌలిక సూత్రాన్ని మరిచిపోవడం విమర్శలకు దారితీస్తున్నది.మంత్రి రాక కోసం..మంత్రి రాక కోసం గజ్వేల్లో చెక్కుల పంపిణీని పెండింగ్లో పెట్టారనే ప్రచారం సాగుతోంది. చెక్కుల పంపిణీలో చోటుచేసుకుంటున్న తీవ్ర జాప్యంపై విసుగు చెందిన లబ్ధిదారులు ఐఓసీలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోస్టర్లు వేసి నిరసన తెలపడం కలకలం రేపింది. తక్షణం అధికారులు స్పందించి చెక్కులు అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా మా కూతురు పెళ్లి తర్వాత 2023లో ‘కల్యాణలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా. చెక్కు కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుడే అవుతుంది. – మహలక్ష్మి (గిరిపల్లి–గజ్వేల్ మండలం) ఇబ్బందులకు గురిచేస్తారా? ‘కల్యాణలక్ష్మి’ చెక్కుల కోసం పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. చెక్కులు సిద్ధంగా ఉన్నా పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. – సందెబోయిన ఎల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడుకల్యాణలక్ష్మికి రాజకీయ గ్రహణం రెండు నెలల క్రితమే చెక్కులు సిద్ధం అయినా పంపిణీ కాని దుస్థితి మరికొన్ని రోజులు గడిస్తే కాలంచెల్లే అవకాశం లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు -
రైతుల గోస పట్టించుకోరా?
● ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● రైస్ మిల్లర్స్తో సమావేశందుబ్బాక: ‘ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.. నెలరోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల కొనుగోలు సక్రమంగా లేక కేంద్రాల్లో ఎక్కడికక్కడా ధాన్యం పేరుకపోయిందన్నారు. ఇప్పటి వరకు కనీసం పది శాతం కూడా కొనుగోలు జరగకపోవడంతో రోడ్లపై, కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. అధికారులు, రైస్మిల్లర్స్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైస్మిల్లర్స్ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మిల్లర్స్కు అవసరమైన అనుమతులు, రవాణా అంశాల్లో క్లియరెన్స్ లేకపోవడం వల్లనే ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు చింత రాజు, వేణు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా మండంలోని రామక్కపేటతో పాటు పలు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. రైతులు ఇబ్బందులను తెలుసుకున్నారు. -
మెడికల్ దుకాణాల బంద్ ప్రశాంతం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ దుకాణాలు బుధవారం బంద్ నిర్వహించాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆలిండి యా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్లు బుధవా రం బంద్ పాటించాయి. మెడిసిన్ కోసం దుకాణాల వద్దకు వచ్చిన వారు విషయం తెలియక నిరాశతో వెనుదిరిగారు. మందులు అవసరమైన వారు ప్రభు త్వాసుపత్రి బాట పట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాప్లు మాత్రం యథావిధిగా విక్రయాలు జరిపాయి. మెడ్ప్లస్ వంటి షాప్లు విక్రయాలు జరిపాయి. మెడికల్ షాప్ల బంద్ నేపథ్యంలో అత్యవసర సమయంలో ఏమైనా మందులు అవసరమైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు వైదాధికారులు తెలిపారు. సిద్దిపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 నుంచి 850 మెడికల్ దుకాణాలు బంద్లో పాల్గొన్నాయి.సిద్దిపేట పట్టణంలో మూసి ఉన్న మెడికల్ షాప్ఆన్లైన్లో విక్రయాలు నిలిపివేయాలి గజ్వేల్రూరల్: పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ దుకాణాల నిర్వాహకులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో ఔషధాల విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు జీఎస్ఆర్ 817ను ఉపసంహరించాలన్నారు. అదే విధంగా కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లను నిలిపివేయాలని, జీఎస్ఆర్ 220లను ఉపసంహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ఆరోపించారు. బుధవారం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సలీమ్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రానికి పొద్దుతిరుగుడు పంట తెచ్చి రెండు నెలలవుతున్నా కొనుగోలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం స్పందించి పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, నాయకులు బాపయ్య, నాగరాజు, శ్రీనివాస్, పరుశరాములు తదితరులు ఉన్నారు. -
ఇతర జిల్లాల ధాన్యాన్ని ఆపండి
● అన్లోడింగ్ వేగవంతం చేయండి ● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం వర్గల్(గజ్వేల్): మిల్లుల్లో వరి ధాన్యం అన్లోడింగ్(దిగుమతి) ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. బుధవారం వర్గల్ మండల కేంద్రం శివారులోని శ్రీరామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమహాదేవి ఇండస్ట్రీలలో ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యాన్ని రెండు, మూడు రోజులపాటు ఆపేసి, జిల్లా నుంచి వచ్చిన లారీలకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దిగుమతి చేసుకోవాలన్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతమైందని తెలిపారు. అంతే వేగంగా మిల్లులలో అన్లోడింగ్ జరగాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మిల్లులో ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, గోదాంలో ఎక్కువ పాయింట్లలో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి మిల్లర్ యజమానులు సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ తనూజ, డీటీ సుజిత, గౌరారం ఎస్ఐ ఆరోగ్యం, పీఏసీఎస్ అధికారి జితేందర్రెడ్డి, తదితరులున్నారు. జీఎంఆర్ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ సెంటర్ గజ్వేల్రూరల్: పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ ఆదర్శ గురుకుల (జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేనలు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు హెల్ప్లైన్ సెంటర్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్లైన్ సెంటర్ వల్ల పాలిసెట్తో పాటు ఎప్సెట్, ఐ–సెట్, ఈ–సెట్ తదితర కౌన్సెలింగ్ల కోసం, స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్
● జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ● ఒక్కో ఇంటిపై రూ.1.38లక్షల వ్యయం ● 2 కిలో వాట్స్ ఉత్పత్తి చేసే సోలార్ పలకలు హుస్నాబాద్ మండలం రామవరంలో గృహాలపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లుపేదల గృహాల్లో సౌర కాంతులు విరజిమ్మనున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగులు విద్యుత్ విక్రయంతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఇందుకు జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. – సాక్షి, సిద్దిపేట ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకంలో ఎంపికైన కుటుంబాలకు ఉచితంగా వర్తింప జేసి మిగులు విద్యుత్ను టీజీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. హుస్నాబాద్ మండలంలో రామవరం, వర్గల్ మండలం తుంకిఖాల్సా, తొగుట, బుర్గుపల్లిలున్నాయి. అందులో గృహజ్యోతి లబ్ధిదారులు 1,936 లబ్ధిదారులున్నారు. ఒక్కో ఇంటికి 2 కిలో వాట్స్ సామర్థ్యం సోలార్ ప్లేట్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిలో వాట్కు రూ.68వేలు ఖర్చు చేయనున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.1.36లక్షల విలువ చేసే సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు రూ. 26,32,96,000 నిధులతో ఆయా గ్రామాల్లో సోలార్ విలేజీగా తీర్చి దిద్దనున్నారు. గృహం స్లాబ్, రేకులతో ఉన్న వాటిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో తొలి విడతలో హుస్నాబాద్ మండలం రామవరం గ్రామంలో 326 గృహజ్యోతి లబ్ధిదారులుండగా అందులో 255 గృహాలు స్లాబ్, రేకులవి ఉన్నాయని గుర్తించారు. వీటిలో 135 గృహాలలో సోలార్ ప్లేట్లను బిగించడం ప్రారంభించారు. మిగతా మూడు గ్రామాల్లో త్వరలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించనున్నారు. జిల్లాలో వివరాలిలా ఇలా.. నియోజకవర్గం గ్రామం గృహాలు హుస్నాబాద్ రామవరం 326 గజ్వేల్ తుంకిఖాల్సా 624 దుబ్బాక తొగుట 677 సిద్దిపేట బుర్గుపల్లి 309 ఉచితంగానే ఏర్పాటు గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేయనున్నాం. లబ్ధిదారులు ఒక్క రూపాయి సైతం చెల్లించనవసరం లేదు. ఒక్కో కిలో వాట్కు రూ.68వేల చొప్పున రూ.1.36లక్షలను ఖర్చు చేయనున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బును వెచ్చించనున్నాయి. – రవీందర్, మేనేజర్, రెడ్కో -
వీధి కుక్కల నియంత్రణ ఏదీ?
● రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ● సుప్రీంకోర్టు తీర్పుతోనైనా అధికారుల్లో మార్పు వచ్చేనా? ● జిల్లా వ్యాప్తంగా సుమారు 19,238 శునకాలు సాక్షి, సిద్దిపేట: జిల్లాలో వీధి కుక్కల సమస్య తీవ్రమవుతోంది. బాధితుల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉండగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల బెడదను తొలగించాలి. అవసమైతే కారుణ్య మరణం పరిశీలించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం విదితమే. వీధి కుక్కల బెడదను రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇప్పటికై నా పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల బెడద తొలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామాల్లో సుమారు 19,238 వీధి కుక్కలు ఉన్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. సగటున 12 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్క కాటుకు ఇంజక్షన్లు వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వేసవి కాలంలో కుక్కలు క్రూరమైన ప్రవర్తనను కలిగి ఉంటాయని, దీంతో చిన్నారులు, వృద్ధులను టార్గెట్ చేసుకుని కరుస్తాయని పశు వైద్యులు చెబుతున్నారు. 3,700 వాటికి స్టెరిలైజేషన్ వీధి కుక్కలకు సంతాన నియంత్రణ కోసం ఏప్రిల్ 10, 2021న సిద్దిపేట పట్టణంలోని పశు సంవర్ధక ఆస్పత్రి అవరణలో ఏబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,700 కుక్కలకు స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ శస్త్రచికిత్స) చేశారు. ఒక్కో కుక్కకు ఇలా శస్త్ర చికిత్స చేసినందుకు రూ.1,650 కేటాయించాలి. వీటికి సంబంధించి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్, చేర్యాల మున్సిపాలిటీలు ఎంఓయూ చేసుకు న్నాయి. కానీ గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చే ర్యాల మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.నిధులు కేటాయించాలి పల్లెల్లో వీధి కుక్కల సంతాన నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను పల్లెలకు, మున్సిపాలిటీలకు కేటాయించాలి. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం, నిధులు జీతాలు, మౌలిక వసతుల కల్పనకే సరిపోతున్నాయి.మిగతా పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో ముందుకు వెళ్లడం లేదు.వ్యాక్సిన్ సైతం వేస్తున్నాం కుక్కలకు సంతాన నియంత్రణతోపాటు, వ్యాక్సిన్ వేస్తున్నాం. ఊర కుక్కలకు గ్రామ పంచాయతీ, పట్టణాల్లో సిబ్బంది పట్టి తీసుకవస్తే వాటికి సైతం వ్యాక్సిన్ చేస్తాం. వీధి కుక్కల నియంత్రణకు పంచాయతీలు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలి. – గోపాలకృష్ణ మూర్తి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
రోడ్డెక్కిన అక్కన్నపేట రైతులు
హుస్నాబాద్: రైస్ మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడంలో అధికారులు, మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అక్కన్నపేట మండలానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సిద్దిపేట–హనుమకొండ రహదారిపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువస్తే రోజులు గడుస్తున్న దిగుమతి చేసుకోవడం లేదని మండిపడ్డారు. హుస్నాబాద్ కేంద్రానికి చెందిన ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ, అక్కన్నపేట మండలానికి చెందిన ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అన్లోడింగ్ ఆలస్యం కావడంతో ట్రాక్టర్ల అద్దె పెరిగి పోతుందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. అన్లోడింగ్ వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి, మూల్యాంకన కేంద్రం అధికారి రవీందరెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యాపకులు రిపోర్టు చేయాలన్నారు. 21 నుంచి ప్రారంభమయ్యే మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, సివిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన విధులకు హాజరయే అధ్యాపకులను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేయాలని సూచించారు. హాజరు కాని అధ్యాపకులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్ బుధవారం పేర్కొన్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం రంగ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 10న సెలక్షన్ లిస్ట్ను ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. బుధవారం చిన్నకోడూరులోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉన్న సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటు లో ఉంచుతామన్నారు. ఆయన మండల బీసీ సెల్ అధ్యక్షులు చిరంజీవి, నాయకులు సదాశివరెడ్డి, కన్నారెడ్డి, యువకులు ఉన్నారు. పచ్చిరొట్ట ఎరువుల పంపిణీగజ్వేల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల(జనుము, జీలుగ విత్తనాలు)ను పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ భూసారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, నాయకులు పాల్గొన్నారు. అటెండర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం అక్కన్నపేట(హుస్నాబాద్): మండల విద్యావనరుల కేంద్రం(ఎంఆర్సీ)లో ఔట్స్సోరింగ్ విధానంలో అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ గుగులోతు రంగానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి మెమో, స్టడీ, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలు, రెండు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
పొద్దుతిరుగుడు కొనండి
కేంద్రమంత్రికి ఎంపీ రఘునందన్రావు వినతిదుబ్బాక: యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ఎంపీ రఘునందన్రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రిని బుధవారం ఎంపీ కలిశారు. తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21,091 నుంచి 27,675 ఎకరాలకు పెరిగిందని, పంట ఉత్పత్తి సైతం 13,935 మెట్రిక్ టన్నుల నుంచి 19,373 మెట్రిక్ టన్నులకు చేరిందని విన్నవించారు. కనీస మద్దతు ధర రూ.7,721 వచ్చేలా చూడాలని కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. వెంటనే పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా సంబంధిత శాఖకు సూచించాలని ఈ సందర్భంగా మంత్రికి రఘునందన్రావు విన్నవించారు. -
‘పొద్దు’వాలిన ఆశలు
సాక్షి, సిద్దిపేట: వరికి ప్రత్యామ్నాయంగా పొద్దు తిరుగుడు పండించిన రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,900 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పొద్దుతిరుగుడు గింజల కొనుగోలుపై ఊసే ఎత్తడం లేదు. దీంతో 50 రోజులుగా మార్కెట్లలోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.మార్కెట్లలో పొద్దుతిరుగుడు గింజల రాశులురాష్ట్ర వ్యాప్తంగా 19,649 ఎకరాల్లో సన్ఫ్లవర్ను సాగు చేయగా 19 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రం నుంచి కేంద్రం 3,900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కేంద్రం ఇచ్చిన టార్గెట్ స¯న్ఫ్లవర్ గింజల కొనుగోళ్లు పూర్తయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సన్ ఫ్లవర్ గింజల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో 50 రోజులుగా కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర «క్వింటాకు రూ.7,721 చెల్లిస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ. 5,500 నుంచి రూ.6 వేలకే పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే పెట్టుబడి సైతం రాదని, నష్టం వస్తుందని... ప్రభుత్వానికే అమ్మాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.పంట పండించి ఏం లాభం ?పొద్దుతిరుగుడు పంటను 3 ఎకరాల్లో సాగు చేశా. 30 బస్తాల గింజలను తీసుకొచ్చి మార్కెట్లో పోసి 50 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు కొనుగోలు చేస్తామనేది అధికారులు చెప్పడం లేదు. –బీ పరశురాములు, బుస్సాపూర్ఎవరూ పట్టించుకోవడం లేదు35 బస్తాల పొద్దుతిరుగుడు గింజలు మార్కెట్కు తీసుకొచ్చి 40 రోజులు అవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్రం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో ఎవరూ చెప్పడం లేదు. –లక్ష్మారెడ్డి, సిద్దిపేట -
కొనుగోళ్లు గందరగోళం
తీవ్ర జాప్యం.. అక్రమాల మయం మొక్కజొన్న, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్ఫెడ్.. వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ).. ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటివి కొనుగోలు చేసే ఆయిల్ఫెడ్ సంస్థలు తమ శాశ్వత కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. ఈ బాధ్యతను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ పర్యవేక్షణకే పరిమితమయ్యాయి. ఫలితంగా కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడం, అక్రమాలు చోటు చేసుకోవడం సహజపరిణామంగా మారుతోంది. సాక్షి’ పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. – గజ్వేల్ వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు ప్రక్రియ ఏటా సంక్లిష్టంగా మారుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు విశ్లేషిస్తే ఎన్నో అంశాలు బయటపడుతున్నాయి. వడ్లను గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత కేంద్రాలను నడిపేవారు. కానీ నేడు కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సోసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమైంది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు వసతులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతోంది. చేతులెత్తేసిన నాఫెడ్ సంస్థ... పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన నాఫెడ్(నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్)ఈసారి చేతులెత్తిసింది. గత నెల 18వరకు జిల్లాలో కేవలం 1800 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి...ఆ తర్వాత కేంద్రాలను ఎత్తేసింది. ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో నెల రోజులుగా 3000 మెట్రిక్ టన్నులకుపైగా పొద్దుతిరుగుడు ధాన్యంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇకపోతే మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ఫెడ్ సైతం కొనుగోళ్లను ఐకేపీ, సహకార సంఘాలకే వదిలేసింది. గతంలో గజ్వేల్తోపాటు మరికొన్నిచోట్ల మక్కల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అక్రమాలు చోటుచేసుకొని .ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొనుగోళ్ల విధానంలో ప్రభుత్వం ఇప్పటికై నా మార్పులు తెస్తేనే రైతులకు ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.గజ్వేల్ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోళ్లుఇప్పటి వరకు 30 శాతమే కొనుగోళ్లు ఇకపోతే జిల్లాలో యాసంగికి సంబంధించి 3.7లక్షల ఎకరాలకుపైగా వరి సాగులోకి వస్తే...5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ లక్ష్యంలో ఇప్పటివరకు అతికష్టం మీద 30శాతం వరకు కొనుగోళ్లను చేపట్టగలిగారు. ఇంకా 70శాతం కొనుగోళ్లు మిగిలివున్నాయి. జిల్లావ్యాప్తంగా అర్భాటంగా 422కుపైగా సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు అనుకున్నంత వేగంగా సాగటం లేదు. ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేసి.. ప్రభుత్వ రంగ సంస్థలుపర్యవేక్షణకే పరిమితం ఈసారి పరిస్థితి మరింత అధ్వానం ధాన్యం అమ్ముకునేందుకురైతుల అష్టకష్టాలు వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లుఏటా అస్తవ్యస్తం -
ధరల మంట.. పచ్చళ్లు ఎట్ట?
ఊరగాయ ఊరిస్తున్నా.. సరుకుల ధరలతో బెంబేలుఈసారి అవకాయ పచ్చళ్ల తయారీ సామాన్యులకు పెనుభారంగా మారింది. పచ్చళ్ల సరుకుల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఏ సరుకు కొనాలన్నా గుబులుపుట్టిస్తున్నాయి. గత ఏడాది కంటే సుమారు 30 నుంచి 40 శాతం వరకు ధరలు పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ధరలు మండుతుంటే పచ్చళ్లుపెట్టేదెట్టా అంటూ గృహిణులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాకటౌన్: వేసవి కాలంలో ఊరగాయలను తయారు చేసుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వాటిని తయారు చేయడానికి పలు రకాల సరుకులు అవసరం. కానీ పెరిగిన నిత్యావసర ధరల ప్రభావంతో పచ్చళ్లు పెట్టడానికి మహిళలు జంకుతున్నారు. గతంలో ఒక్కో కుటుంబంలో 100 కాయల వరకు పచ్చళ్లు పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం 25– 50 కాయల వరకే పరిమితమవుతున్నారు. అలాగే మార్కెట్లలో పలు రకాల పచ్చళ్లు రెడీమేడ్గా లభిస్తుండటంతో సంప్రదాయంగా వస్తున్న తయారీ ఘననీయంగా తగ్గుతోంది. సైజ్ను బట్టి ధర మామిడి కాయల్లో అనేక రకాలున్నాయి. ఊరగాయలు పెట్టడానికి కొన్ని రకాలు మాత్రమే ఉపయోగిస్తారు. రసపురి, నాటు మామిడి తదితర రకాల కాయలను వినియోగిస్తారు. వేసవిలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. గత సీజన్లో రోజుకు రూ. 2 వేలకు పైగా ఆదాయం పొందే రైతులు నేడు రూ.1200 వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. కాయ సైజ్ మేరకు రూ.15 నుంచి రూ. 25వరకు విక్రయిస్తున్నారు. కాయలు కొడుతూ.. మండుటెండల్లో వృద్ధ మహిళలు పనికి వెళ్లలేని పరిస్థితి. దీంతో పచ్చళ్లకు మామిడి కాయలను ముక్కలుగా కొట్టడం జీవనోపాధిగా చేసుకుని ఉపాధి పొందుతున్నారు. గతంలో రోజుకు రూ. 1500 వరకు సంపాదించిన వారు పచ్చళ్లు పెట్టే వారు తగ్గడంతో రూ.800 వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. కాయల సైజ్లను బట్టి ఒక్కో కాయ కొట్టేందుకు రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ఏం కొనేటట్టులేదు.. మా కుటుంబ సభ్యులకు ఊరగాయ అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏటా పచ్చళ్లు తయారు చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు మండి పోతున్నాయి. దీంతో ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం ప్రకారం పరిమిత కాయలతోనే ఊరగాయ పెట్టుకుంటున్నాం. – లక్ష్మి, గృహిణి చాలా తగ్గింది ప్రతీ వేసవిలో మామిడి కాయలను ముక్కలుగా చేస్తూ జీవనం సాగిస్తుంటా.. రోజుకు రూ.600 నుంచి 800 సంపాదిస్తా. గతంతో పోలిస్తే ఈసారి చాలా తగ్గింది. – కనకవ్వ, బల్వంతాపూర్ -
పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
అడిషనల్ కలెక్టర్ పాండు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదును పెంచాలని అడిషనల్ కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పాఠశాల ప్రవేశాల నమోదు, డ్రా పౌట్ విద్యార్థుల పునః ప్రవేశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 5 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు సమారు 5,903 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. గతేడాది మొదటి తరగతిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందగా.. ఈ ఏడాది అన్ని తరగతులు కలిపి లక్షా 24 వేల మందిని ప్రవేశాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా డ్రా పౌట్, పాఠశాలకు ఎప్పుడు హాజరు కాని పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, యువజన కమిటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, జూన్ 3వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి పాఠశాల ప్రవేశాలపై ప్రచారం చేపట్టాలన్నారు. జూన్ 4న స్కూల్లలో సమావేశాలు, జూన్ 6న గ్రామస్థాయి, నగర స్థాయి విద్యార్థుల గుర్తింపు కార్యక్రమంతో పాటు జూన్ 8న ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే పాఠశాలలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈఓ స్వప్న, మెప్మా పీడీ రామాచారి, ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్, సోషల్ వెల్ఫేర్ అధికారి అఖిలేష్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, డీటీడీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సన్నాలు సాగు చేయాలి
కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్లో సన్న రకం వరి సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ హైమావతి కోరారు. శనివారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములలో ధాన్యం దిగుమతి ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాములలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీలు మిల్లులకు వెళ్లి దిగుమతి చేస్తున్నారని, బయటకు వెళ్లకుండా మార్కెట్లోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ను ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ క్రిష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
ఆక్రమణలపై బల్దియా కొరడా
● పట్టణంలో ఆకస్మిక తనిఖీలు ● ఆక్రమణల తొలగింపు, జరిమానాసిద్దిపేటజోన్: నిబంధనలు అతిక్రమించి ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై బల్దియా అధికారులు కొరడా ఝలిపించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ ఆదేశాల మేరకు శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలో పలు ప్రధానదారుల్లో పాదచారులకు ఇబ్బందిగా ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, టిస్టాల్స్, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలను అధికారులు తొలగించి హెచ్చరించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల విక్రయాల దుకాణాల్లో తనిఖీ చేసి రూ. 5400 జరిమానా విధించారు. పట్టణ పరిధిలోని ఫుట్పాత్లను వ్యాపారం కోసం ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. కేవలం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ మీద ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని, వ్యాపార సంస్థలు తమ సామగ్రిని రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పెట్టవద్దని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కమిషనర్ పరిశీలించారు. యూజీడీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, అన్లోడింగ్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ రద్దీ, వివాదాలు, రవాణాలో జాప్యం తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, సివిల్ సప్లై, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. -
కార్పొరేట్ కళాశాల
సాక్షి, సిద్దిపేట: ఇంటర్మీడియెట్ బోర్డు నూతన కళాశాలలకు గత ఐదేళ్ల నుంచి అనుమతులు నిలిపివేసింది. విద్యారంగాన్ని వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు నూతన కళాశాలలను నెలకొల్పేందుకు కొత్తపంథాను ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా గతంలో అనుమతులు పొందిన కాలేజీలకు తమ పేర్లను తగిలించుకుంటున్నాయి. పైకి కళాశాల పేరు మార్చినా దీని వెనుక క్రయ విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. అయితే కాలేజీలను అమ్మడం గానీ, కొనుగోలు చేయడం కానీ చేయకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా వాటిని ఉల్లంఘించి మరీ కార్పొరేట్ కాలేజీలు జిల్లాలో ఉన్న చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను గుట్టుగా కొనేస్తున్నాయి. ఇటీవలే జిల్లాలో ‘కొత్త తరం’ఇంటర్ కాలేజీ (పేరు మార్చాం)ని కొనుగోలు చేసి ఓ సంఖ్యను సూచించేలా పేరు మార్చారు. అయితే ‘కొత్త తరం’కాలేజీ యాజమాన్యం కూడా గతంలో ఓ కాలేజీని ఇలాగే కొనుగోలు చేసింది. మరో కళాశాల కార్పొరేట్ పేరుతో కోచింగ్ సెంటర్ను సైతం ప్రారంభించింది. ఇలా వరుసగా కళాశాలల పేర్లు, యాజమాన్యాలు మారిపోతున్నాయి. మూతపడే స్థితికి చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలు జిల్లా వ్యాప్తంగా 25 ప్రైవేట్, 83 ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో దాదాపు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల ప్రవేశంతో బడ్జెట్ కళాశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో బడ్జెట్ కళాశాలలను యాజమాన్యాలు నడపలేని, మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న కార్పొరేట్ కళాశాలలు చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను యథేచ్ఛగా కొనేస్తున్నాయి. కార్పొరేట్కు బోర్డు ప్రోత్సాహం! బడ్జెట్ కళాశాలలను డీలా చేసి కార్పొరేట్ కళాశాలను ఇంటర్ బోర్డు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కళాశాలలు సామాన్యులకు అందుబాటులో ఫీజులను వసూలు చేసేవి. కార్పొరేట్ కళాశాలలైతే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికై నా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించి కళాశాలల విక్రయాలను నియంత్రించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు బడ్జెట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుకుంటూ, విక్రయాలు జరుపుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ఫర్మ్ ఎందుకు మార్చుకుంటున్నారని పరిశీలించకుండానే దరఖాస్తు రాగానే ఎలా కావాలంటే అలా బోర్డు అధికారులు చకచకా పనులు చేస్తున్నారు.గుట్టుగా చేతులు మారుతున్న లక్షల రూపాయలు కార్పొరేట్ స్థాయిలో కళాశాలలను స్థాపించాలనుకునే అంతంతమాత్రంగా సాగుతున్న కళాశాలలను సంప్రదించి వాటిని గుట్టుగా కొనుగోలు చేసి పేర్లను మారుస్తున్నాయి. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనల్లో పేరు మార్చుకునే, స్థలం మార్చుకునే అవకాశం ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కళాశాలలు హైదరాబాద్ సైతం షిఫ్ట్ అవుతున్నాయి.కాలేజీల పేరు మార్పు వెనుక జోరుగా క్రయ విక్రయాలు జిల్లా పరిధిలో పేరు మార్పునకు ఓకే ఒకే జిల్లా, మండల పరిధిలో మాత్రమే పేరు మార్పునకు, తరలింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే వాటికి అనుమతులిస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాలలో మాత్రమే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలి. అనుమతి లేకుండా కళాశాలను నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. –రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి -
ధాన్యం అన్లోడింగ్లో జాప్యం చేయొద్దు
దుబ్బాక: ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్మిల్లర్స్ దిగుమతులు వేగంగా చేపట్టి సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం డీఎస్ఓ తనూజతో కలిసి దుబ్బాక, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని రైస్మిల్లుల్లో ధాన్యం దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి పనిచేయించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులను నియమించామన్నారు. వచ్చే ఖరీఫ్లో రైతులు సన్నవడ్లను పండించాలని, సన్నాలకు 500 బోనస్ వస్తుందన్నారు. రేషన్ షాప్లలో సన్నబియ్యం సరిపోక ఇతర జిల్లాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ హైమావతి రైస్మిల్లుల్లో ధాన్యం దించివేత పనుల పరిశీలన -
తాలు పేరుతో కోత.. రైతుల వ్యథ
చేర్యాల(సిద్దిపేట):తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారు. క్వింటాలుకు నాలుగు కిలోల మేర కట్ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి, ఇరవై రోజులుగా పడిగాపులు కాసి, తాలుపట్టి చివరకు కాంటా వేసినా.. మళ్లీ తాలు ఉందంటూ మిల్లర్లు కోత పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. మండల పరిధిలోని నాగపురి ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి గురువారం రామలింగేశ్వర రైస్ మిల్లుకు రెండు లారీల ధాన్యం పంపించారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ చెక్ చేశారు. తాలు ఎక్కువగా ఉందని, క్వింటాలుకు నాలుగున్నర కిలోలు కట్ చేస్తామని కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారు. సదరు నిర్వాహకులు రైతులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైతులు మిల్లు వద్దకు వెళ్లి చెక్ చేయగా 500 గ్రాముల ధాన్యంలో 16 గ్రామల నుంచి 20 గ్రాములు, మరో లారీలో 500 గ్రాములకు 32 గ్రాముల తాలు వచ్చినట్లు గుర్తించారు. తాలు చాలా తక్కువగా ఉన్నా ఎక్కువ ఉందని మిల్లర్ చెబుతున్నారని రైతులు తెలిపారు. చివరగా సదరు మిల్లరు ఒక లారీలో 4 క్వింటాళ్లు, మరో లారీలో 9 క్వింటాళ్ల ధాన్యం కట్ చేస్తామంటూ తెలిపినట్లు రైతులు వాపోయారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంత్రాలతో శుభ్రం చేసినా మళ్లీ తాలు కట్ చేయడం సరికాదన్నారు. మిల్లర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆదాయం పెంపుపై దృష్టేదీ?
ఇంటి పన్నుల అసెస్మెంట్పై కానరాని శ్రద్ధగజ్వేల్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి కరువైంది. ఆయా మున్సిపాటీల్లో ప్రస్తుతం వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులను అసెస్మెంట్ చేయడం ద్వారా ఏటా లక్షల్లో ఆస్తి పన్ను రూపంలో ఆదాయం సమకూరే అవకాశమున్నా.. ఆ దిశగా చర్యలు సాగడం లేదు. ఫలితంగా ఏటా భారీగా రాబడికి గండిపడుతోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకనుణంగా ఆదాయాన్ని పెంచుకొని.. మెరుగైన వసతులను కల్పించాలనే మౌలిక అంశాన్ని మున్సిపాలిటీల్లో యంత్రాంగం మరిచిపోతున్నది. ఫలితంగా పట్టణాల్లో ప్రజలు అరకొర సౌకర్యాల మధ్య కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సిద్దిపేటతోపాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ.18కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రూ.4కోట్లకుపైగా ఆదాయంతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ. 2–3కోట్లలోపు ఆదాయంతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి. వేల సంఖ్యలో పెండింగ్ మున్సిపాలిటీల్లో కొత్తగా ఇంటి నంబర్లు ఇచ్చి ఆస్తి పన్ను జనరేట్ చేయాల్సినవి అన్ని మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సంగుపల్లి, ముట్రాజ్పల్లి, సంగాపూర్, క్యాసారం, రాజిరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. కొత్తగా ఆర్అండ్ఆర్ కాలనీ సుమారుగా 5వేల ఇళ్లతో విలీనమైంది. వీరికి ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. నిజానికి ఈ ఆర్అండ్ఆర్ కాలనీ 2026 జనవరిలో అధికారికంగా విలీనమైతే.. వీరికి 2023కు పూర్వం నుంచే ఇంటి పన్నులు వేశారు. కానీ విలీనమైన తర్వాతే పన్నులు చెల్లిస్తామని...అంతకు పూర్వం భారం మేయలేమని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చి నిర్వాసితులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ శాసీ్త్రయ పద్ధతిలో పన్నులను వసూలు చేయాల్సి ఉన్నది. ఇకపోతే పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో 1200 పైగా ఇళ్లు ఉన్నాయి. సింహభాగం ఇళ్ల కేటాయింపు జరగగా వాటికి సైతం ఇంటి నంబర్లు ఇచ్చి.. మెరుగైన సేవలను అందించాల్సి ఉంది. ఇకపోతే పట్టణంలోని కొత్త కాలనీల్లో మినహా మిగతా చోట్ల వందల సంఖ్యలో వేరుపడిన కుటుంబాలకు కొత్త ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. దీనిపై ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరమున్నది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాల్సిన అధికారులు...మామూళ్ల మత్తులో ఇష్టానుసారంగా చేపట్టి మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేల సంఖ్యలో పెండింగ్ రాబడికి ఏటా భారీగా గండి జిల్లాలోని మున్సిపాలిటీల దుస్థితి -
పాలిసెట్కు 94.56 శాతం హాజరు
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు నంగునూరు/గజ్వేల్ రూరల్(సిద్దిపేట): పాలిసెట్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 3,932 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,722 మంది హాజరు కావడంతో 94.56 శాతం నమోదైంది. సిద్దిపేటలో ఏడు, గజ్వేల్లో మూడు, హుస్నాబాద్లో ఒకటి కలిపి మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులు మాలతి, ఫయీమొద్దీన్, డీవీఆర్ పాటిల్ అన్ని సెంటర్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పది రోజుల్లో ఫలితాలు వెలువడుతాయన్నారు. కౌన్సెలింగ్కు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. -
అన్లోడింగ్లో జాప్యం తగదు
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికఎక్స్–అఫీషియో సభ్యుడిగామంత్రి పొన్నం ● ఏకాభిప్రాయం కుదరకఒక సభ్యుడి ఎన్నిక పెండింగ్ సాక్షి, సిద్దిపేట: ధాన్యం అన్లోడింగ్లో జాప్యం తగదని, మిల్లర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్తో కలిసి సంబంధిత అధికారులతో, మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు. యాసంగిలో అంచనాకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇందు కోసం 427 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిల్లుల వద్ద హమాలీ కార్మికులను ఎక్కువగా నియమించుకుని త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని, లారీలను వెయిటింగ్ చేయించవద్దన్నారు. సీపీ ఆధ్వర్యంలో ఆర్టీఏ, రెవెన్యూ శాఖలు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలనాధికారి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు సన్న బియ్యం పండించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగాలన్నారు. వర్షాకాలంలో 2.5లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 46 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని, ఇప్పటి వరకు 24,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశాన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.విద్యకు అధిక ప్రాధాన్యం హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లకు సర్పంచ్లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లకు సర్పంచ్లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా విధ్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, ఎంఈఓ బండారి మనీల, సర్పంచ్లు పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ -
నాచగిరీశుడి సేవలో ఎమ్మెల్సీలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని బుధవారం ఎమ్మెల్సీలు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, అంజిరెడ్డి సందర్శించారు. వారికి ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులుగజ్వేల్రూరల్: బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, ఆర్ఐ రాజు, పోలీసు సిబ్బందితో కలిసి బుధవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్ బుధవారం తెలిపారు. ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఈ నెల 16 నుంచి జూన్ 6 సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. జూన్ 10న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామస్వామి దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామస్వామి అన్నారు. బుధవారం దుబ్బాక ఐఓసీ సమావేశం మందిరంలో నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యా కార్యక్రమాల వర్క్షాపును మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరాం సంగీత, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసంతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్స్ మధుసూదన్, సాదత్అలీ, ఉమాశంకర్ తదితరులు ఉన్నారు. అక్షరాస్యత పెంచుదాం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటజోన్: అక్షరాస్యతలో నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. బుధవారం విపంచి ఆడిటోరియంలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆర్పీ, ఓబీఎస్లకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని మహిళా సంఘాల్లో 1300 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించినట్టు తెలి పారు. వారికి స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కొక్క ఆర్పీ, ఓబీ పది మంది మహిళలకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారు లు హన్మంతరెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
సిద్దిపేటఅర్బన్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని, ఏఎంసీలలో మాత్రమే మొక్కజొన్న కొనుగోలు జరుగుతోందని అన్నారు. తేమ శాతం వచ్చి లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్న ధాన్యాన్ని లారీలు వచ్చే వరకు ఆగకుండా అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, టెంట్, యంత్రాలు, కవర్లు, సుతిల్ దారాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. యుద్ధప్రాతిపాదికన ధాన్యం తరలించాలి సిద్దిపేటరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఈ పది రోజులు అత్యంత కీలకమని, ప్రత్యేక ప్రణాళికతో వాహనాలతో యుద్ధ ప్రాతిపాదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. హమాలీ, ట్రాన్స్పోర్టు, సమస్య తలెత్తకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాలవర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, డీసీఎస్ఓ తనూజ, డీఎం గోపికృష్ణ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ అధికారి నాగరాజు, డీఏఓ స్వరూపారాణి పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి మిట్టపల్లిలో కొనుగోలు కేంద్రం పరిశీలన -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● క్షేత్రస్థాయిలో పరిశీలన చిన్నకోడూరు(సిద్దిపేట): రైస్ మిల్లర్లు వరి ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని, మిల్లులకు వచ్చిన వాహనాలు 12 గంటల లోపే దిగుమతి చేయాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని రామునిపట్ల, మల్లారం గ్రామాల్లోని రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలంటే మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దిగుమతిలో జాప్యం చేయవద్దన్నారు. ఇందుకు ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోజూ 30 మంది ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే ట్రక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండిగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. దిగుమతిలో జాప్యం రాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు అన్నారు. ఆమె వెంట జిల్లా సవిల్ సప్లై అధికారి తనూజ, జిల్లా తూనికల కొలతల అధికారి శివరంజని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో మంచినీటి తిప్పలు
దూప తీర్చనిభగీరథజిల్లాలోని మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ తెచ్చినా ప్రజల గొంతు తడవడంలేదు. పట్టణ శివార్లకు రెండు, మూడు రోజులకోమారు నీటి సరఫరా చేస్తున్నారు. అదికూడా అరకొరగా జరగుతోంది. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల నీరే దిక్కవుతోంది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. నీటి సరఫరాను పెంచడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రధానంగా నీటి సమస్య చర్చనీయాంశంగా మారింది. శివార్లలో రెండు, మూడురోజులకోసారి సరఫరా దృష్టిసారించని అధికారులు -
డబుల్బెడ్రూం కాలనీల్లో తప్పని గోస
దుబ్బాక: మున్సిపాలిటీలో ప్రధానంగా డబుల్బెడ్రూం కాలనీల్లో నీటిఎద్దడి నెలకొంది. కాలనీల్లో సుమారు 900 కుటుంబాలు నివసిస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నప్పటికీ చాలా కాలనీలకు సరిపడా నీళ్లు రావడం లేదు. జీప్లస్ టూ పద్ధతిలో డబుల్ బెడ్రూంల నిర్మాణం ఉండటంతో పైన ఉన్నవారికి తిప్పలు అన్నీ ఇన్నీకావు. నీటిగోస తీర్చేందుకు ఇటీవలనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోర్లు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 3 వేలకు పైగా జనాభా ఉన్న డబుల్ బెడ్రూం కాలనీల్లో మంచినీటి ఎద్దడి తీర్చాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
ఊరూరా ఇక గ్రంథాలయం
సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. అంతకు ముందు దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సర్వం సిద్ధం చేసిన అధికారులు సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పరీపక్షల నిర్వహణ కోసం సీఎస్, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్ బృందాలను నియామకం చేసి ఇప్పటికే వారికి అవగాహన సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల్లో చేర్చిన ఇంటర్బోర్డునారాయణఖేడ్: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ టీంను సైతం ఏర్పాటు చేశాయి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


