breaking news
Siddipet
-
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావు దుబ్బాకటౌన్: అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం దుబ్బాక, చెల్లాపూర్, దుంపలపల్లి, లచ్చపేట, చేర్వాపూర్ వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకుడు మాజీ మంత్రి హరీశ్రావు అని, గత బీఆర్ఎస్ హయాంలో దుబ్బాక అభివృద్ధిని అడుగడునా అడ్డుకొన్నారన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన కోట్ల రూపాయల నిధులను సిద్దిపేటకు మళ్లించుకున్నారని ఎంపీ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేతాను ముక్కలని, వారికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనన్నారు. పదేళ్ల పాటు మెదక్ ఎంపీగా ఉండి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పేరుతో భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గజ్వేల్: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను, అబద్దాలు చెప్పే బీజేపీనీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న, 14వవార్డు అభ్యర్థి శీరిషలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీరుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. చిన్నకోడూరు(సిద్దిపేట): సమాజంలో మానవ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు. సోమవారం చిన్నకోడూరులో ఎన్హెచ్ఆర్సీ క్యాలెండర్ను ఎస్ఐ చంద్రమోహన్తో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలు వారి హక్కులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు ప్రజలు, ప్రభుత్వ అధికారులు సంస్థ ద్వారా న్యాయం పొందగలుగుతారన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య తొగుట(దుబ్బాక): ఎస్సీ కార్పొరేషన్కు రూ.15వేల కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. మండలంలోని తుక్కాపూర్లో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించిందని ఆరోపించారు. లిడ్క్యాప్ భూములు లీజుపేరుతో అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లిడ్క్యాప్కు రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. లిడ్క్యాప్ సంస్థకు చైర్మన్ను నియమించి మాదిగలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుర్రాల శ్రీనివాస్, మోహన్, వెంకట్, రాజమల్లయ్య పాల్గొన్నారు. -
పొద్దుతిరుగుడు సాగు లాభదాయకం
● ప్రత్యామ్నాయ పంటలే మేలు ● వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి అక్కన్నపేట(హుస్నాబాద్): పొద్దుతిరుగుడు పంట రైతులకు లాభసాటిగా ఉంటుందని, తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హుస్నాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం కట్కూర్లో యాసంగి పొద్దుతిరుగుడు సాగుపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు యాసంగిలో బావులు బోర్లపైనా నీటికోసం ఆధారపడి వరిసాగు చేస్తున్నారన్నారు. కానీ చివరి దశలో నీరు అందకపోవటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అదే కాకుండా వరి పంట తర్వాత మళ్లీ వరి సాగు చేయడంతో భూసారం తగ్గి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టపోతున్నారన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు పంటను పండిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి అయిలయ్య, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ఏఈఓ ఐశ్వర్య, కట్కూర్ సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
● మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హైమావతి సోమవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న 4 మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 4 మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 1069 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం 18 రూట్లను, 22 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని వివరించారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామన్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్లో కేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి147 మంది, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 240 మంది, దుబ్బాక మున్సిపాలిటీకి 246 మంది, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 436 మందిని కేటాయించినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేయండి హుస్నాబాద్: ఎన్నికలు సజావుగా జరిగేందుకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌటింగ్ హాల్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్, పోలీస్ సిబ్బందికి భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. -
నిధుల వరద.. కాసుల వేట
పాపన్నపేట(మెదక్): ‘పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్ నంబర్ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్ టెక్నో సర్వీసెస్’ అనే ఒక ఫర్మ్కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతర వచ్చిందంటే పండుగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్, పోలీస్, ఆర్అండ్బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం. -
గజ్వేల్పైనే అందరి దృష్టి
● అగ్రనేతల ప్రచారంతోపొలిటికల్ హీట్ ● చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలు సీరియస్గా తీసుకొని అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించడం, ప్రచారపర్వంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠం కై వసం చేసుకోవడానికి పార్టీలు పావులు కదుపుతున్నాయి. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రారంభం నుంచి ప్రచారం గడువు ముగిసిన సోమవారం వరకు ఆద్యంతం ఆసక్తికరమైన పరిస్థితి నెలకొన్నది. పట్టు సాధించడానికి పార్టీలు కట్టుదిట్టమైన వ్యుహాలతో ముందుకుసాగటం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర మంత్రులు వివేక్, అజారుద్దీన్తోపాటు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయన కూతురు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్రావు రెండు పర్యాయాలు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. కానీ ఈనెల 7న ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వహించే ప్రచారానికి హరీశ్రావు వస్తారని తెలిసి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాసితులు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, ఉద్రిక్తత నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్లు పాల్గొన్నారు. చిట్టచివరి అవకాశాలపై దృష్టి.. గెలుపు కోసం చిట్టచివరి అవకాశాలపై పార్టీల ప్రధానంగా దృష్టి పెట్టాయి. ప్రచారం పూర్తయి.. ఇక ప్రలోభాల పర్వం మిగిలిపోగా నోట్ల మంత్రాంగంలో నేతలు నిమగ్నమై ఉన్నారు. ఓటరు కు నేరుగా నగదు పంపిణీ చేస్తే..ఇబ్బందులు వస్తున్నాయని, ఫోన్పే, లేదా గూగుల్ పే ద్వారా అభ్యర్థులు డబ్బులు పంపడానికి ప్రయత్నిస్తున్నా రు. ఫోన్ నెంబర్లు దొరకని వారికి ఒక్కో వార్డు లో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ జరుగుతున్నదని తెలిసింది. మొత్తానికి చివరి అంకం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ముందుకుసాగుతున్నాయి. కాంగ్రెస్లో చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకోసం ఓ మహిళ నేత ప్రముఖంగా పోటీపడుతుండగా, మరొకరు సైతం పోటీలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. బీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. నలుగురు మహిళ నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి కల్యాణి పేరును దాదాపుగా ప్రకటించారు. -
చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం హుస్నాబాద్: పాత కాలం వారు మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు సేవలను ఎలా గుర్తు చేసుకుంటున్నారో హుస్నాబాద్లో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి తీరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్కు వచ్చిందన్నారు. భవిష్యత్లో నీటి చుక్క దుకాణాల్లోకి రాకుండా రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్ మున్సిపాలిటిలో కలపడం తథ్యమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బస్స్టేషన్ను అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా చేశామన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో హుస్నాబాద్ను జిల్లా కేంద్రంగా మార్చేలా అభివృద్ధి చేసితీరుతామన్నారు. -
కాంగ్రెస్ది అసమర్థ పాలన
దుబ్బాక: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క పనిచేయని దద్దమ్మ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. సోమవారం దుబ్బాక పట్టణంతో పాటు మున్సిపాలిటీలోని దుంపలపల్లి, చెల్లాపూర్, లచ్చపేట ల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి అన్నడు, రైతు భరోసా, పంట బోనస్, స్కూటీలు, తులం బంగారం అంటు ఇలా 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని రేవంత్ సర్కార్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడడమే తప్పా రేవంత్కు మరోపని లేదన్నారు. ఇంకా రెండున్నరేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రజలు ఏం ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు రుణమాఫీ లేదన్నారు. రైతు బంధు ఎగ్గొడుతున్నారని, యూరియా అందక రైతులు నరకయాతన పడుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. పోరాటాల పురిటిగడ్డ చైతన్యం గల దుబ్బాక ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.బీజేపీ దుబ్బాకలో గెలిచేది లేదు పెద్దగా వారితో ఒరిగేదేంలేదన్నారు. ప్రజలసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. ఓటుతో బుద్ధిచెప్పాలి ‘ఎలుక తోలు ఏడాదంతా ఉతికినా నలుపేగాని తెలుపుకాదు అన్నట్లు.. హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్లినా రేవంత్రెడ్డి తిట్ల దండకం ఆగలేదు.. గుణం మారలేదు.. నోరు తెరిస్తే బూతులే’నని హరీశ్రావు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తానని దేవుళ్లమీద ప్రమాణం చేసి మోసం చేసిన రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోరు తెరిస్తే బూతులు తిడుతున్న రేవంత్కు పోలింగ్ బూత్లో ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్రెడ్డికి ఉమ్మడి మెదక్జిల్లాకు వచ్చేందుకు ముఖంలేదన్నారు. హామీలిచ్చి మోసం చేసిన సర్కార్కు ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. వాడిపోయిన కమలం పువ్వు గురుంచి మాట్లాడటం దండగ అన్నారు. రెండున్నరేళ్లలో ఒక్కపనిచేయని సర్కార్ బీజేపీ గెలిచేది లేదు..వారితో పెద్దగా ఒరిగేదేమీలేదు దుబ్బాకలో మాజీ మంత్రి హరీశ్రావు -
నిర్వాసితులను ఆదుకుంటాం
● త్వరలోనే పెండింగ్ ప్యాకేజీలు అందజేస్తాం ● కార్మికశాఖ మంత్రి వివేక్ గజ్వేల్: సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలను అందజేస్తామని కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఆదివారం గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్రావుల నిర్లక్ష్యంతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్కు గజ్వేల్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రక నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి కూన శ్రీశైలంగౌడ్, గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరితే రెవెవిన్యూ డివిజన్సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక పట్టణంలోని డబుల్బెడ్రూం కాలనీ సముదాయంలో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో 20 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే డబుల్బెడ్రూం కాలనీల్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
వారికి ఓటేస్తే ఐదేళ్లు నరకమే
● ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది ● హుస్నాబాద్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేస్తే ఐదేళ్లు నరకం చూస్తారని, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై బండి సంజయ్ మాట్లాడుతూ... ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు జాతీయ రహదారితో పాటు అమృత్, స్వచ్ఛ భారత్ ఇలా అన్నిరకాలుగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. పదేళ్లు మున్సిపాలిటీని బీఆర్ఎస్ నాయకులు దోచుకొని అభివృద్ధి గూర్చి పట్టించుకోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నన్ను కోసి వండుక తిన్నా ఒక్క పైసా లేదని చెప్పారని, మరీ మీకు పైసలు ఎవరు ఇయ్యాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోయేటోడులాగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్కు నా నిధుల నుంచి కమ్యూనిటి హాల్స్, బడులు, గుడులకు డబ్బులు ఇచ్చానని, వందలాది బోర్లు వేయించానని చెప్పారు. గుణవంతులైన మా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు నరకం చూస్తారన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ సంగప్ప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు దొడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్, నరేశ్ తదితరులు ఉన్నారు. -
దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ఆరు నూరైనా.. దుబ్బాక మున్సిపల్లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపల్లోని పలు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే దుబ్బాక మున్సిపాల్టీలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. వంద పడకల ఆస్పత్రి, ఐఓసీ భవనం, అధునాతన బస్టాండ్తోపాటు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే అన్నిరంగాల్లో మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని, యూరి యా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ఆదేశం ● 10న పోలింగ్ సామగ్రి పంపిణీ చేర్యాల(సిద్దిపేట)/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో, అలాగే.. చేర్యాలలో పోలింగ్ సామగ్రి, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్రూమ్ కేంద్రాలను, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11న జరిగే పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని, 11న పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూమ్లలో భద్రపర్చాలని చెప్పారు. 13న కౌంటింగ్ నేపథ్యంలో ఒకరోజు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి భోజనం, తాగునీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని, పాస్లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ వెబ్ కెమెరాలలో రికార్డు కావాలని సూచించారు. లచ్చపేట మోడల్ స్కూల్లో స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహా రా న్ని అందించాలని కలెక్టర్ హైమావతి అన్నా రు. దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్ట్రార్ సక్రమంగా నిర్వహించాలని కోరారు. పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేటితో పుర ప్రచారానికి తెర
చివరి రోజు ప్రచార సభలు, ర్యాలీలకు ప్లాన్ ●పోటాపోటీగా జన సమీకరణ ●ఐదు రోజులుగా హోరాహోరీగా ప్రచారం 72 వార్డులు.. 326 మంది అభ్యర్థులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో దుబ్బాకలో 20 వార్డులకు 102 మంది అభ్యర్థులు, గజ్వేల్లో 20 వార్డులకు 88 మంది, హుస్నాబాద్ 20 వార్డులలో 92 మంది, చేర్యాలలో 12 వార్డులలో 44 మంది కలిపి మొత్తం 72 వార్డులలో 326 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. దీంతో చివరి రోజు అభ్యర్థులు ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. కీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. – దుబ్బాక జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి నేడు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వివేక్, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు మంత్రులు ప్రచారం చేపట్టనున్నారు. బీజేపీ అభ్యర్థుల కోసం ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రచారం ఇప్పటికే గత ఐదు రోజులుగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా దుబ్బాకలో జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హుస్నాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, గజ్వేల్లో ఎంపీలు, రఘునందన్రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో మంత్రి వివేక్, హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్, చేర్యాలలో సీతక్క, గజ్వేల్లో అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గజ్వేల్లో మాజీ మంత్రి హరీశ్రావు, దుబ్బాకలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీశ్ విస్తృతంగా పర్యటించారు. -
ప్రలోభాల పర్వం ఆరంభం
● బాండ్ పేపర్లపై హామీలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ● కుల సంఘాల భవనాలకు స్థలం కొనిస్తానని బ్యాంక్ చెక్కులు ● ఇంటింటికీ మాంసం, మద్యం పంపిణీ ● పండుగ చేసుకుంటున్న ఓటర్లు హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో అభ్యర్థులు తన సొంత మేనిఫెస్టోతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థుల మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్రావులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారం తుది దశకు చేరుకోగా, అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గత రెండురోజులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. యువకులకు, పెద్దలకు వేర్వేరు విందులు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ వార్డులో ఓ అభ్యర్థి మహిళల కోసం మినీవ్యాన్లో 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిళ్లు, స్టఫ్ పంచగా, మరో అభ్యర్థి సైతం కూల్ డ్రింక్ బాటిళ్లను పంపిణీ చేశాడు. ఓటర్లు దసరా పండుగను మించి ఓట్ల పండును తెగ ఎంజాయి చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మాంసం, మద్యం సీసాలను పంపిణీ చేస్తున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మందు సీసాను ఓటర్ల ముందు పెడుతున్నారు. ఓటర్లు ఏది అడిగినా కాదనకుండా..ఖర్చుకు వెనకాడకుండా అభ్యర్థులు పంచిపెడుతున్నారు. బాండ్ పేపర్లపై హామీలు పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే కుల సంఘాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 2 నుంచి 4 గుంటల స్థలాన్ని సొంత డబ్బులతో కొనిస్తానని బాండ్ పేపర్పై రాసి హామీలను గుప్పిస్తున్నారు. బాండ్ పేపర్తోపాటు బ్యాంక్ చెక్కులు ఇస్తూ ఓటర్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఓ వార్డులో అభ్యర్థి గెలవక ముందే వందలాది గ్యాస్ కనెక్షన్ కిట్లను పంపిణీ చేసినట్లు వినికిడి. ఓ రెబెల్ బీఆర్ఎస్ అభ్యర్థి తన సొంత మేనిఫేస్టోను విడుదల చేసి ప్రచారం చేస్తున్నాడు. తనను గెలిపిస్తే ఆడబిడ్డ పెళ్లికి రూ.5,016 కానుక, ఆడబిడ్డ పుడితే రూ. 3,016 కానుక, వార్డులో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీలిస్తున్నాడు. -
చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
ఫిషర్ మెన్ ఫెడరేషన్ చైర్మన్ సాయికుమార్ చేర్యాల(సిద్దిపేట): చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని తెలంగాణ ఫిషర్ మెన్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. రెండో వార్డు అభ్యర్థి ముస్త్యాల తేజకు మద్దతుగా ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను చూసి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు గుర్తు చేసుకుని, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐదేండ్లలో చేర్యాల మున్సిపాలిటీలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు పోతామని చెప్పారు. ఆయన వెంట రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజ, స్థానిక నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా కేసీఆర్ నిలబెట్టారన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ అభివృద్ధికి మంజూరైన రూ.180 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మర్కంటి వరలక్ష్మి, కల్యాణ్ కర్ పద్మబాయి, మన్నె రూప తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): ఏడుపాయలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. ఆలయ సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వేగంగా జాతర ఏర్పాట్లు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు. మద్యం దుకాణాలు బంద్ రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మున్సిపాటీల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు ఎకై ్సజ్ ఈఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్ అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్ సెటైర్లు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్మార్చి: సాండ్ స్కామ్ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్జూన్: ఫోర్త్ సిటీ స్కామ్జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్అక్టోబర్: పవర్ స్కామ్నవంబర్: సింగరేణి స్కామ్డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు చెప్పి రైతు బంధు వేయించాను’ అని చెప్పుకొచ్చారు. -
పుర పోరులో
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి యువత బరిలోకి దిగింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో 326 మంది పోటీ చేస్తుండగా, అందులో 95 మంది యువత ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. – సాక్షి, సిద్దిపేటఎన్నికల సమయంలో కాలనీలో రోడ్డు నిర్మాణం.. జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తా.. ఆ యువజన సంఘం నూతన భవనం నిర్మాణం చేపిస్తాం.. గెలిచిన తర్వాత టూర్ తీసుకెళ్తానని పోటీలో ఉన్న అభ్యర్థులు యువతకు గాలం వేస్తుంటారు. గెలుపొందిన తర్వాత కొన్ని నెరవేర్చేవారు.. మరి కొన్నింటిని మర్చిపోయేవారు. అభ్యర్థులు ఇచ్చే అఫర్లకు కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత అడుగుపెడుతున్నారు. తాము గెలిస్తే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి, మురుగు కాలువల సమస్యలు పరిష్కరించడంతో పాటు చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దుబ్బాక నుంచి అత్యధికంగా నాలుగు మున్సిపాలిటీల్లో 22 నుంచి 35 సంవత్సరాల వారు 95 మంది (29 శాతం) పోటీ చేస్తున్నారు. అందులో అత్యధికంగా దుబ్బాక నుంచే యువత బరిలో ఉన్నారు. ఇందులో కొంతమంది పార్టీల తరఫున బరిలో ఉండగా.. మరికొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. వీరిలో పీజీ, డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.యువత రాజకీయాల్లో రాణించాలి యువత రాజకీయాల్లో రాణిస్తేనే.. అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకటో వార్డు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నా. అవకాశం ఇస్తే.. వార్డును అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా భర్త ప్రోత్సాహంలో ముందుకు వెళ్తున్నా. – కోటగల్ల రమ్య బీఆర్ఎస్ అభ్యర్థి, దుబ్బాక ప్రజలకు సేవ చేయాలనే.. 2వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ చేస్తున్నా. వార్డులో చాలా మంది పేదలున్నారు. పక్కా ఇల్లు లేనివారు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తా. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. – చెన్నబోయిన అనూష, కాంగ్రెస్ అభ్యర్థి, హుస్నాబాద్మున్సిపాలిటీ వార్డుల బరిలో సంఖ్య ఉన్నవారు యువత చేర్యాల 12 44 11 గజ్వేల్ 20 88 23దుబ్బాక 20 102 41హుస్నాబాద్ 20 92 20వర్షానికి మాఽ వీధి మునిగిపోతుంది గెలిచిన తర్వాత ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మళ్లీ ఐదేళ్లకు కనిపిస్తున్నారు. ప్రతి వర్షాకాలం 9వ వార్డులోని పోచమ్మవీధి జలమయం అవుతుంది. అప్పటి కౌన్సిలర్, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదు. వాటిని పరిష్కరించేందుకు ఈ సారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. – బింగి శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి, చేర్యాల -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే నిధులు
గజ్వేల్: రాష్ట్ర ఖాజానాపై భారం పడుతున్నా.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ అన్నారు. శనివారం గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ను గెలిపిస్తేనే అభివృద్ధికి నిధులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలు కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్లో మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల్లో తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి అజహరుద్దీన్ -
అన్నా.. బాగున్నావే..!
పొన్నం, సతీష్ ఆప్యాయంగా పలకరింపులుమున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎదురుపడ్డారు. అన్నా.. బాగున్నావా అంటూ మంత్రి పొన్నం.. సతీష్కుమార్ను ఆప్యాయంగా పలకరించుకున్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డులో ఈ ఘటన జరిగింది. ఎప్పుడు విమర్శనస్త్రాలను సంధించుకునే వీరు పరస్పరం చేయి చేయి కలిపి కరచాలనం చేసుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఈ సన్నివేశాన్ని చూసి అబ్బురపడ్డారు. – హుస్నాబాద్: -
నేడు మల్లన్న నాల్గొవ వారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గొవ ఆదివారం భక్తులు భారీగా తరలిరానున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో నాల్గవ ఆదివారం కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఓడి బియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగితే చర్యలుసిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: బహిరంగ ప్రదేశంలో మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే ఇప్పటివరకు జరిమానాలు విధించేవారని, కానీ ఇకపై ఈ పెట్టి కేసుల్లో జైలు శిక్ష విధిస్తారన్నారు. మద్యం సేవించి గొడవలు చేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలని సీపీ పేర్కోన్నారు. అంతర పంటతో అధిక ఆదాయం ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్బాషా నంగునూరు(సిద్దిపేట): ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అంతర పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. నర్మేటలో రైతు ఇర్ఫాన్ సాగు చేస్తున్న బ్లూబెర్రీ పంట, షేడ్నెట్ ద్వారా దేవులపల్లి వెంకటేశ్ సాగు చేస్తున్న యూరోపియన్ దోస పంటను పరిశీలించారు. పాలమాకులలో రైతు వీరారెడ్డి ఆయిల్పామ్ తోటలో సాగు చేస్తున్న శ్రీగంధం, అంజీర, అరటి, ఉల్లి సాగును పరిశీలించారు. అనంతరం యాస్మిన్మాట్లాడుతూ.. రైతులు అధిక ఆదాయం లభించే ఆయిల్పామ్ పంటను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సువర్ణ, డీడీఎస్ ఇంద్రసేనారెడ్డి, అధికారులు మౌనిక, బాలాజీ, రమేశ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. పట్టుసాగుకు ప్రోత్సాహం చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకంలో రైతులు మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం మండల పరిధి చంద్లాపూర్లో రైతులు సాగు చేస్తున్న పట్టు సాగును పరిశీలించారు. అధికారులు పట్టుసాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. విజ్ఞానాన్ని కళారూపంగా చెప్పడమే ఒగ్గుకథ ప్రొఫెసర్ కమలాకరశర్మ గజ్వేల్రూరల్: విశిష్టమైన విజ్ఞానాన్ని కళారూపంగా మార్చి చెప్పడమే ఒగ్గుకథ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ అన్నారు. ఒగ్గుకథ–గతం–వర్తమానం–భవిష్యత్ అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ మాట్లాడుతూ తెలంగాణకే ప్రత్యేకమైన ఒగ్గుకథ కళారూపాన్ని పరిరక్షించుకుందామన్నారు. ఒగ్గుకథ కళాకారులు రవికుమార్, మిద్దె వినిత్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబా సీజ్ సిద్దిపేటకమాన్: అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబాను సీజ్ చేసి, నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. పట్టణంలో సీపీ రష్మి, సీఐ ఉపేందర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వేములవాడ కమాన్ సమీపంలోని రాజరాజేశ్వరి దాబాలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు మద్యం సేవించడాన్ని సీపీ గుర్తించారు. దీంతో దాబా యజమాని పోదేన్ల దశరథంతోపాటు మద్యం తాగుతున్న ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. -
అక్కసుతోనే విమర్శలు
హుస్నాబాద్: తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. శనివారం హుస్నాబాద్లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, దాన్ని యుద్ధప్రాతిపదికన, గుండె ధైర్యంతో గాడిన పడేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కంటోన్మెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలు కడిగేందుకే సమయం సరిపోవడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.21 వేల కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తుమ్మల వివరించారు. మార్చిలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్మించిన ఆయిపామ్ ప్యాక్టరీని మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నర్మేటలో నిర్మించిన ప్యాక్టరీని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్ బాషాతో కలసి ఆయన పరిశీలించారు. నర్మేట ప్యాక్టరీకి 120 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెసింగ్ చేయగల సామర్ధ్యం ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆయిల్ తెప్పించి ఇక్కడే ప్యాకింగ్ చేస్తారన్నారు. గెలల నుంచి వచ్చిన పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకుంటామని తెలిపారు. ప్యాక్టరీలో మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహిస్తామన్నారు. ఆయిల్పామ్ సాగు, విస్తీర్ణం పెంచాలన్నారు. కార్యక్రమలో ప్యాక్టరీ ఎండీ శ్రీకాంత్రెడ్డి, హార్టి, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక పొతున్నారు: తుమ్మల మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం -
కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ
గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గజ్వేల్కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్రావు ముందుగా పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా, ఢిల్లీవాలా హోటల్ వద్ద సభల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రచారం పూర్తయ్యాక ఆర్అండ్ఆర్ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్ వద్ద ప్రచార సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు హరీశ్రావును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రచార సభ ప్రదేశానికి వచ్చారు. పెద్ద మొత్తంలో నాయకులు ర్యాలీగా అక్కడికి చేరుకొని హరీశ్రావు డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అప్పటికే హరీశ్రావు ఇక్కడికి రాకుండా తూప్రాన్ వెళ్లిపోయారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు మాత్రం ఇక్కడికి చేరుకొని ప్రచార సభను కొనసాగించారు. అయితే సమీపంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోటీగా కాంగ్రెస్కు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరువర్గాలు ఒకరినొకరు దూర్భాషలాడుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతోపాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాసేపు గందరగోళం నెలకొనడంతో పోలీసులు సముదాయించడానికి ప్రయత్నించగా ఎవరూ వినలేదు. దీంతో ఏసీపీ నర్సింలు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా బీఆర్ఎస్ సభకు కాంగ్రెస్ శ్రేణులు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా రోప్ వేశారు. సభ జరుగుతున్నంత సేపు ఆందోళనకారులను అటువైపు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులు, ఆయా పార్టీల కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎగిరిన చెప్పులు.. హోరెత్తిన నినాదాలు హరీశ్రావు వస్తున్నారని అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు -
కాంగ్రెస్ది మోసపూరిత పాలన
గజ్వేల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి మోసపూరిత పాలన సాగిస్తున్న కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ హయాంలో చేపట్టిన పథకాలు ఆపేశారన్నారు. యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గజ్వేల్ గౌరవాన్ని జాతీయస్థాయిలో పెంచారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లకు గుంతలు పడితే పూడ్చలేని స్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎలాగైనా అక్రమ పద్ధతుల్లో గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి ఇక్కడికి డబ్బు సంచులను పంపుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.5వేల కోట్లతో మిషన్ కాకతీయ పనులు జరిగితే...ఆ పథకంలో రూ.55వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతల తప్పుడు మాటలను నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీశ్రావు -
సాగునీటి కోసం రైతుల ధర్నా
రోడ్డుపై బైఠాయించి నిరసన సిద్దిపేటరూరల్: యాసంగికి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి వద్ద ముస్తాబాద్ ప్రధాన రోడ్డుపై చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల రైతులు మల్లన్నసాగర్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు సైతం ఎండిపోయాయన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికై నా సాగునీటిని వదిలి పంటలను రక్షించాలన్నారు. సీఐ శ్రీను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. సమస్యల ప్రతిబింబమే ఒగ్గుకథ గజ్వేల్రూరల్: సమకాలిన సమాజంలో ఉన్న సమస్యల ప్రతిబింబమే ఒగ్గు కథ అని, కాలానుగుణంగా నిత్యనూతనంగా విరాజిల్లుతోందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఒగ్గుకథ గతం–వర్తమానం–భవిష్యత్ అనే అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు జరిగిన కార్యక్రమానికి హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కళారూపం ఒగ్గు కథ అని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా ఒగ్గు కథ సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టర్ మహేందర్రెడ్డి పరిశోధన చేసిన గ్రంధాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్బాచారి, జరిపల్లి అశోక్, సుదర్శనం, వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రకృతిని పరిరక్షిద్దాం సిద్దిపేటఅర్బన్: గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు గురి కాకుండా ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ అన్నారు. విజ్ఞాన దర్శిని నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని సురభి వైద్య కళాశాలలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్, కవి, గాయకుడు జయరాజ్ ప్రకృతి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గంజి ఈశ్వరలింగం, కళాశాల డీన్ రఫీ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి శైలజ, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ సమతరోషిని, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయండీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. చిన్నకోడూరుకు చెందిన మహేందర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ నియామకపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రూపులకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి మండలంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, నర్సింహులు తదితరులు ఉన్నారు. -
ఎవరి వ్యూహం.. వారిదే
గెలుపే లక్ష్యంగా ముందుకు● ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి ● గజ్వేల్లో జోరందుకున్న ప్రచారం ● ప్రచార గడువు ముంచుకొస్తుండటంతో ఆసక్తికరంగా రాజకీయాలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడం వల్ల ప్రధానంగా బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీలు ఛాలెంజ్గా తీసుకొని ముందుకుసాగుతున్నాయి. ఈ మున్సిపాలిటీపై పట్టు సాధించడానికి అవసరమైన అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార గడువు ఈనెల 9న ముగియనుండటంతో.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడిని పెంచాయి. మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా మారిందని బీఆర్ఎస్ వాదిస్తున్నది. వేలాది కోట్ల నిధులతో ఇక్కడ భారీ అభివృద్ధి పనులు జరిగాయని ప్రచారంలో చెబుతున్నారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కూడా చెబుతూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్అండ్ఆర్ కాలనీ)లో బాధితులు ఎన్నో పెండింగ్ సమస్యలతో కొట్టామిట్టాడుతున్నారని ప్రచారంలో చెబుతున్నారు. పార్టీల ప్రచారం తీరు ఎలా వున్నా.. ఓటర్లు మాత్రం అందరి మాటలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక పరిస్థితుల మేరకు తాము ఏ పార్టీ వైపు ఉండాలనే అంశంలో స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తున్నది. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తున్నది. ప్రధాన పార్టీల నాయకులు సైతం మరో పార్టీ అభ్యర్థికి బాహాటంగా మద్దతు పలుకుతూ.. ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. ఇకపోతే నిన్నటిమొన్నటి వరకు బీఫామ్ల విషయంలో పోటాపోటీ ప్రయత్నాలు చేసిన నాయకులు కొన్ని వార్డుల్లో కలిసిపోయి పనిచేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల మాత్రం బీఫామ్ దక్కని వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్నారు. గతంలో ఒకటిరెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో సానుభూతని వాడుకుంటున్నారు. ప్రచారం సందర్భంలో తాము గతంలో పలుసార్లు ఓడిపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని, ఈసారి గెలవకపోతే తమకు భవిష్యత్తు ఉండదని ఆందోళ వ్యక్తం చేస్తూ.. తమను ఎలాగైనా గట్టెక్కించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మొత్తానికి పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తిగా మారాయనడంలో సందేహం లేదు.మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. విమర్శలకు పదునుపెడుతూ.. వేడిని పెంచుతున్నాయి. ప్రచార గడువు ఈనెల 9తో ముగుస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. – గజ్వేల్ -
పుర పోరులో నేతల బిగ్ ఫైట్
జిల్లాలో హీటెక్కిన రాజకీయాలు ● ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంజిల్లాలో మున్సిపల్ పోరు తీవ్ర స్థాయికి చేరడంతో రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు ఈ ఎన్నికలు ఆయా పార్టీల అగ్రనేతలకు పెను సవాల్గా నిలిచాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండటంతో ప్రచారం ఊపందుకుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్), మాజీ మంత్రి, తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావులు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. – సాక్షి,సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్, హుస్నాబాద్ నుంచి రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నుంచి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుర ఎన్నికల్లో ఆ మూడు మున్సిపాలిటీలు ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకమే కానున్నాయి. ఆయా పార్టీలు ఇన్చార్జిలను నియమించారు. ఏ పార్టీ వారు.. ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. పురిటిగడ్డపై బీఆర్ఎస్కు పట్టు బీఆర్ఎస్ పురిటిగడ్డ సిద్దిపేట. జిల్లాలో బీఆర్ఎస్కు ఎక్కువగా పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్, వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. హరీశ్రావు నిత్యం ఆయా మున్సిపాలిటీల పార్టీ పరిశీలకులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీ హామీల బాకీపై ప్రజలకు వివరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీని తిరిగి దక్కించుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. జోష్తో బీజేపీ.. లోకసభ ఎన్నికల్లో ఎంపీగా రఘునందన్ రావు విజయం సాధించడంతో బీజేపీ నేతలు జోష్తో ముందుకు సాగుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీపై మెదక్ లోకసభ సభ్యుడు రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఒక్క కౌన్సిలర్ మాత్రమే విజయం సాధించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో అదే విదంగా మున్సిపాలిటీని కై వసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.మంత్రికి పెనుసవాల్..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రభాకర్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించి తరగతులు ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పొన్నం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను మంత్రి అయిన తర్వాత పార్టీ గుర్తుతో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి సొంత నియోజకవర్గం గజ్వేల్ కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. -
చేర్యాల చైతన్యానికి అడ్డా..
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డా.. పోరాటాలకు పురిటిగడ్డ అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా గాంధీ సెంటర్ నుంచి అంగడిబజార్ వరకు ఎంపీ చామల కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్రెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పావల వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ సంవత్సరకాలంలో చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు ఇచ్చిననట్లు తెలిపారు. మహిళలందరూ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే చేర్యాల ప్రాంతం నాలుగు ముక్కలుగా చీలి అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు. చేర్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. అంతకు ముందు భువనగిరి ఎంపీ చామల మట్లాడుతూ 1600 మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోయిందని, అది దొరల పాలైందని విమర్శించారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఉద్యమం మొదలు పెట్టిన కేసీఆర్ తానే గద్గెనెక్కారని గుర్తు చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ నియెజికవర్గంలో డబ్బులతో మాయచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెరార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
12 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్షసిద్దిపేటరూరల్: జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు ఈనెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ అమీద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి సీఎం క్రీడా పోటీల నిర్వహించనున్నామన్నారు. ఈ క్రీడల్లో డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికై న దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, యోగా, క్యారం, చెస్, కరాటే, బేస్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హాకీ తదితర 25 క్రీడాంశాలలో పాల్గొననున్నారన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల ను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడలు నిర్వహించే ప్రదేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, క్రీడాకారులకు భోజనం, వసతి, మెడికల్ క్యాంపు, ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటనర్సయ్య, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డీపీఆర్ఓ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కూరలేవీ?.. కొందరికేనా గుడ్డు?
వర్గల్(గజ్వేల్): ‘మెనూ ప్రకారం వంటలు లేవు.. ఇంకో కూర వండలేదు.. కొందరికే గుడ్డు.. ఇలాగేనా మధ్యాహ్న భోజనం.. బడి వంటల తీరు అంటూ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఫోన్ద్వారా డీఈఓను ఆదేశించారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో మధ్యాహ్నభోజన వంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. అన్నం, గుడ్డు, పప్పు చారులను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం మరో కూర చెయ్యలేదని, 336 మంది విద్యార్థుల హాజరుకు బదులు 233 మంది విద్యార్థులకు మాత్రమే గుడ్లు పెట్టారని కలెక్టర్ మండిపడ్డారు. విద్యార్థుల హాజరు ప్రకారం కడుపునిండా భోజనం అందేలా చూడాలని, ఒకే కూరతో, కొంత మందికే భోజనం పెడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. మెనూ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఫోన్ ద్వారా డీఈఓను ఆదేశించారు. చదువు, మధ్యాహ్న భోజనం విషయంలో లోటు లేకుండా జాగ్రత్త వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వర్గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికర భోజనం పెట్టాలన్నారు. పిల్లలకు భోజనం, వసతి, చదువులో రాజీ పడొద్దని, క్రమశిక్షణాయుత విద్యాబుద్ధులు నేర్పించాలని ఎస్ఓ, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు తరచూ పర్యవేక్షిస్తూ అవి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శుక్రవారం వర్గల్ ఎంపీపీ కార్యాలయంలో ఇందిరమ్మ గృహాల పురోగతిని ఎంపీడీఓ దామోదర్రెడ్డి, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటికి గ్రౌండింగ్ కావాలన్నారు. మంజూరైన వారు ఎందుకు కట్టుకోవడం లేదో కారణం తెలుసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాల దశల వారీగా వెంటవెంటనే హౌసింగ్ అధికారులు ఫోటో క్యాప్చర్ చేయాలన్నారు. పే మెంట్ విషయంలో లబ్ధిదారుల అపోహలను తొలగించాలని, వారి ఖాతాలోనే ప్రభుత్వం నిధులు జమ చేస్తుందన్నారు.11న సెలవుసిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 11న సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న అన్ని భవనాలు/సంస్థలకు 10వ తేదీన నుంచే సెలవు ప్రకటించామన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, భవనాలకు 12న, 13న స్థానిక సెలవు వర్తించనున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్తోనే పట్టణాల అభివృద్ధి
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 10, 11, 17, 20వ వార్డుల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఈ రెండేళ్లలో జరిగిందన్నారు. హుస్నాబాద్ను పెద్ద నగరంగా మార్చేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం కుర్చీ వేసుకొని కడతామన్నవారు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయని, ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. హుస్నాబాద్కు గౌరవం పెరగాలంటే, ఇంకా అభివృద్ధి వైపు వెళ్లాలంటే పాలకవర్గం అధికార పార్టీదే ఉండాలన్నారు. చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లెల్లగడ్డలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని మంత్రి కోరారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
‘కాంగ్రెస్ వచ్చాక ఆదాయం పడిపోయింది’
సిద్ధిపేట: కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్.. కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. దొంగ హామీలతో కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణ ఆదాయం పడిపోయిందన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రండి..మరొకవైపు అదే సిద్ధిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 3,15,16,4,వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిలోభాగంగా బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఊరు ముఖం తెలియన వాడు.. ఇక్కడకి వచ్చి మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. పొన్నం ప్రభాకర్ అనే నన్ను ఒకసారి ఎంపీ చేసి పంపితే తెలంగాణ కోసం కొట్లాడి రాష్టం తెచ్చాడని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఈ ఊరు ముఖం తెలియని వ్యక్తి మాత్రం ఏవో మాట్లాడుతున్నారు. నేను శాసన సభ్యుడిని.. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషిస్తే సహించే ప్రసక్తే లేదు. హుస్నాబాద్ అభివృద్ధి మీద చర్చకు రా. సిద్దిపేట, వరంగల్ను మించి హుస్నాబాద్ అభివృద్ధి చేద్దామని ప్రణాళికతో ముందుకు పోతున్న’ అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
ర్యాలీలు.. రోడ్ షోలు
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచార సమయం ఉండటడంతో అభ్యర్థులు వేగం పెంచారు. అభ్యర్థులు వారి కుటుంబాల సమేతంగా పొల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళ్తూ కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కౌన్సిలర్గా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రణాళికలను రూపొందించుకున్నారు. ప్రచారంలోకి మంత్రులు, ఆయా పార్టీల ముఖ్యులు దిగారు. ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ సమావేశాలు, ర్యాలీలు, రోడ్షో జోరుగా నిర్వహిస్తున్నాయి. – సాక్షి, సిద్దిపేట దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంపీ రఘునందన్రావు సైతం జోరు పెంచారు. ‘తమ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. కేంద్రంలో అధికారంలో ఉన్నాం. అక్కడి నుంచి అధికంగా నిధులు కేటాయించేందుకు కృషి చేస్తాం’ అని హామీలు ఇస్తున్నారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేపట్టారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. పట్టణం అభివృద్ధికి ఇంకా అధిక నిధులు కేటాయించి, మరింత అభివృద్ధి చేస్తాం’అని హామీల వర్షం కురిపిస్తున్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని.. ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో వివరిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ ప్రచారం చేపడుతున్నారు. రోజూ 16 గంటలు ఓటర్ల మధ్యే.. ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రోజులో దాదాపు 16 గంటలు ఓటర్ల మధ్యనే ఉంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు పలు వీధుల్లో ఉన్న వారిలో యువజన, మహిళ, కుల సంఘాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి వారి మద్దతును కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇక ప్రచార రథాలు సైతం ఏర్పాటు చేసి కాలనీల్లో తిప్పుతున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో పులువురు ఇంటింటికి ఒక మారు తిరిగి ఓటును అభ్యర్థించారు. ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడు మార్లు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే.. వేగం పెంచిన అభ్యర్థులు రంగంలోకి వివిధ పార్టీల నేతలు దుబ్బాకలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్లో మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారానికి మరో నాలుగు రోజులే గడువు ప్రశాంత్నగర్(సిద్దిపేట): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు కో ఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హుస్నాబాద్కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గజ్వేల్కు కూన శ్రీశైలంగౌడ్, దుబ్బాకకు వనం శ్రీనివాస్ యాదవ్, చేర్యాలకు మెట్టు సాయికుమార్ను కో ఆర్డినేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు. -
బీఆర్ఎస్కు ఓట్లడిగే హక్కే లేదు
● గత ప్రభుత్వంలో అంతా అవినీతే.. ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: పదేళ్లల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే హక్కే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం పట్టణంలోని 5, 6,7వ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఆటో నడుపుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా అవినీతి పాలనే జరిగిందన్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశామన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని స్థానాల్లో గెలిచినప్పుడే హుస్నాబాద్కు మరింత కీర్తి పెరుగుతుంది. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఓటరుపై దృష్టి పెట్టి పని చేయాలని, చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. -
రంగంలోకి సినీనటులు!
● జోరుగా వాయిస్ వీడియోలు ● గజ్వేల్లో ప్రచారం కొత్తపుంతలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన మార్గాలపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇందుకోసం సినీనటుల వాయిస్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయిస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలంగా పట్టణ ప్రముఖులచే వాయిస్ వీడియోలను చేయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. – గజ్వేల్ పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన, గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లు కలుపుకొని మొత్తంగా 88 మంది అభ్యర్థులు మున్సిపల్ బరిలో ఉన్నారు. ప్రచారంలో ఎవరికి వారే తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఓటర్లను ఆలోచింపజేయడానికి కొందరు తమ సన్నిహిత సినీనటులను రంగంలోకి దింపుతున్నారు. పట్టణంలో పోటీలో ఉన్న ఓ అభ్యర్థి గబ్బర్సింగ్ సినిమా నటులతో వాయిస్ వీడియోలు చేయించి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాకుండా జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీడియోలు షేర్ చేస్తూ.. గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖుల వీడియోలు తయారు చేయించి వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రముఖుల మాటలు ఇక్కడి ప్రజలను ప్రభావితం చేస్తాయనే భావనతో ఇలా చేస్తున్నారు. ప్రత్యేకించి పట్టణానికి చెందిన పురోహితులు, ఇతర పండితుల వీడియోల సందేశాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. వీరు ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని నేరుగా చెప్పకపోయినా.. వారు చెప్పే సందేశం తమకే వర్తిస్తుందనే భావనతో ఒకే వార్డులో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు. ఇక పోతే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ మహిళా నాయకురాలి వాయిస్ను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఆ మహిళా నాయకురాలు మున్సిపల్ ఎన్నికల్లో.. ‘ఆపతికి, సంపతికి.. మన వెంటే ఉండే వారిని, సమస్యలను పరిష్కరించే వారిని మాత్రమే ఎన్నుకోండి...’ అంటూ సందేశమిచ్చారు. ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ.. మరికొందరు అభ్యర్థులు తాము గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వాల్పోస్టర్లు, వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలో ఓటర్లను ఆకట్టుకునే పాటలను జతచేసి పర్సనల్గా షేర్ చేస్తున్నారు. మొత్తానికి వివిధ రూపాల ప్రచారపర్వం అందరినీ ఆకట్టుకుంటోంది. -
దుబ్బాకపై కేసీఆర్కు ఉన్న ప్రేమ రేవంత్కు ఏదీ?
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: పుట్టి పెరిగి విద్యా బుద్ధులు నేర్చుకున్న దుబ్బాక గడ్డమీద కేసీఆర్కు ఉన్న ప్రేమ రేవంత్రెడ్డికి ఉంటుందా? ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లాయపల్లి, చెల్లాపూర్ 1, 2, 3 వార్డులతో పాటు దుబ్బాక 13, 14 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పట్టణ, పల్లె వికాసం జరిగితే రేవంత్ పాలనలో వికారంగా మారిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు.కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.బీడీలు ఎంచుతూ.. ఓటు అడుగుతూదుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీడీ కార్ఖానలో పనిచేస్తున్న మహిళలను ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల బాగోగులు తెలుసుకొన్నారు. కార్మికులకు పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మొద్దు
దుబ్బాక: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషితోనే తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దుబ్బాక పట్టణంలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అఽధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా బాగుచేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. మెదక్, సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణం ఎంపీ రఘునందన్రావు కృషితోనే జరుగుతోందన్నారు. డబ్బులు లేవని సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దోచుకున్న డబ్బులను దాచుకునేందుకు కేసీఆర్ కుటుంబం రోడ్డున పడి గొడవలు చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతుంది తప్పా రాష్ట్రప్రభుత్వంతో కాదన్నారు. దుబ్బాకలో రఘునందన్రావు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి చరిత్ర సృష్టించాలన్నారు. కాషాయ జెండా ఎగురవేద్దాం దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాషాయం జెండాను ఎగురవేద్దామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు.కాంగ్రెస్కు దుబ్బాకలో స్థానం లేదని ఆ పార్టీకి ఓట్లువేస్తే గంగలో వేసినట్లవుతుందని ఇక బీఆర్ఎస్కు వేస్తే ఏం లాభం ఉండదన్నారు.బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల సభలో సంఘీభావం చాటుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు, బీజేపీ అభ్యర్థులు మోదీ కృషితోనే జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుబ్బాకలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సభ -
పకడ్బందీగా ప్రభుత్వ భూముల సంరక్షణ
● కలెక్టర్ హైమావతి ● ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం సిద్దిపేటరూరల్: ప్రభుత్వ భూముల సంరక్షణతో పాటు రెవెన్యూ రికార్డుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చాలా ముఖ్యమైనదన్నారు. భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా ఉంటుందన్నారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి, భూ సమస్యలు లేకుండా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. చట్టం ప్రకారం భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. -
గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు
● ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి ● మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ● మాజీ మంత్రి హరీశ్రావు గజ్వేల్: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని, ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు వస్తే ఎక్కడికక్కడా హామీలపై నిలదీ యాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. గజ్వేల్ పట్టణంలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఇప్పటివరకు బాకీపడిన రూ.65 వేలు చెల్లించాలన్నారు. బీజేపీకి ఓటేసినంతమాత్రాన ఒరిగేదేమీలేదన్నారు. ఆ పార్టీకి తగువిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేదీ బీఆర్ఎస్సేనని, తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. హార్వర్డ్ పోయినా.. మారలే.. హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరలాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత ఎట్లయితడని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తుండు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా, ఈ రాష్ట్రానికి నువ్వు సీఎం అయ్యేవారివా? అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. దమ్ముంటే పనిలో పోటీ పడాలని, కేసీఆర్ను తిట్టడంలో కాదని చెప్పారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్రావు -
స్వతంత్రుల.. సత్తా
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రులు సత్తాచాటుతున్నారు. రాజకీయ పార్టీల నడుమ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం అంత సులువు కాదు. అయినా చెమటోడ్చి గట్టి పోటీ ఇస్తూ విజయబావుటా ఎగురవేస్తుండటం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2020లో జరిగిన 15 పురపాలికలు 309 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. పలు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్గా వ్యవహరించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 392 మంది ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట గత మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది విజయం● గతంలో ఇండిపెండెంట్కు దక్కిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ● ఈసారి 19 మున్సిపాలిటీల్లో 392 మంది పోటీ ● ప్రస్తుత పుర బరిపై సర్వత్రా చర్చఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1,658 మంది పోటీ చేస్తుండగా అందులో 392 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ సారి జహీరాబాద్ మున్సిపాలిటీలో 58 మంది, సంగారెడ్డిలో 52, అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువగా ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండిపెండెంట్లు దాదాపు 15శాతం వరకు విజయం సాధిస్తున్నారు. స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో దూసుకపోతున్నారు. సొంత మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు. ప్రచార రథాలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎంత మంది ఇండిపెండెంట్లు గెలుపొందుతారోనన్న చర్చ అన్ని పార్టీల్లో సాగుతోంది. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఎంత మంది స్వతంత్రులకు ఓటర్లు పట్టం కడతారో వేచిచూడాల్సిందే. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారే కీలకంగా మారుతున్నారు. ఇండిపెండెంట్లు వ్యక్తిగతంగా ప్రచారం నిర్వహించి.. ప్రజల మన్ననలు పొంది విజయబావుటా ఎగురవేశారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులుండగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) 5, కాంగ్రెస్ 5 వార్డుల్లో, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇండిపెండెంట్గా గెలుపొందిన నిమ్మ రాజీవ్రెడ్డి బీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గిరిని కై వసం చేసుకుంది. బీఆర్ఎస్కు మద్దతు పలికినందుకు వైస్ చైర్మన్గా రాజీవ్రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 9, బీజేపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారు బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకుంది.మున్సిపాలిటీ గత ఎన్నికల్లో గెలుపొందిన వారు దుబ్బాక 09హుస్నాబాద్ 03గజ్వేల్ 06చేర్యాల 02అమీన్పూర్ 01అందోల్–జోగిపేట్ 01బొల్లారం 0నారాయణఖేడ్ 0సదాశివపేట 01సంగారెడ్డి 03తెల్లాపూర్ 02మెదక్ 01నర్సాపూర్ 03రామాయంపేట్ 01తూప్రాన్ 02జిల్లా మున్సిపాలిటీలు మొత్తం స్వతంత్రులు అభ్యర్థులు సిద్దిపేట 4 326 73 సంగారెడ్డి 11 1,045 276 మెదక్ 4 287 43 -
గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ హైమావతి ● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షదుబ్బాక: జిల్లాలోని అన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా కేవలం 15 మాత్రమే గ్రౌండింగ్కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులతో మాట్లాడి నిర్మించుకోవడానికి సుముఖంగా లేనివారి నుంచి లెటర్ తీసుకొని డిలీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుబ్బాక, భూంపల్లి–అక్బర్పేట మండల కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మండలంలోని హబ్షీపూర్ జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి కూరలు పలుచగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల్లో వంటలు నాణ్యతగా రుచికరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు వండాలని సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. -
పారదర్శకంగా యూరియా పంపిణీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రైతులకు అవసరానికి అనుగుణంగా, పారదర్శకంగా, సమయానికి పంపిణీ జరుగుతోందన్నారు. యాప్లో నమోదైన వివరాల ప్రకారం 9,136 మంది రైతులు 29,732 యూరియా బస్తాలు బుక్ చేయగా, ఇప్పటివరకు 20,829 బస్తాలు పంపిణీ చేశామన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతో పాటు పంట అవసరాలకు అనుగుణంగా సమాన పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు. కౌలుదారుల రైతులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందన్నారు. రైతులు యూరియాను యాప్ ద్వారానే బుకింగ్ చేయాలని, ఫీల్డ్ స్థాయి సిబ్బందితో సహకరిస్తూ డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి -
కర్రు కాల్చివాత పెట్టాలి
నర్సాపూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బంద్ చేసి హామీలన్నీ ఎగ్గొట్టారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి 14 రోజుల పాటు అమెరికాకు పోయినప్పుడు టీవీల్లో శబ్ధ కాలుష్యం తగ్గిందన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ సిగాచీ కార్మిక కుటుంబాలను ఆదుకోలేదని, కంపెనీ ఇచ్చిన డబ్బులే ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ విషయమై ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. రేవంత్రెడ్డివన్నీ తొండి మాటలేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఏపీకి నిధులు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపిందని, ఇక్కడి బీజేపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్కు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలని, ఎగిరిపడితే ప్రజలు రాళ్లతో కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సంగీత, అనుసూయ అశోక్గౌడ్, నయిమోద్దీన్, సత్యనారాయణగౌడ్, సునీతాబాల్రెడ్డి, కండెల రాజు, సమీన బేగం, షేక్హుస్సేన్, కళ్యాణి, హమీద్, శ్రావ్య, మంజుల, మోహిన్అలీ, వినయ్కుమార్, సరిత, లలితలను పరిచయం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు దేవేందర్రెడ్డి, చంద్రాగౌడ్, గోపి, మన్సూర్, శేకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
తాయిలాల ఎర..
● ‘గంపగుత్త’ ఓట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి ● జోరుగా సంప్రదింపులు, సమావేశాలు ● తాయిలాలతో ఆకట్టుకునే యత్నాలు ● గజ్వేల్ పుర పోరు రసవత్తరంగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు సామాజికవర్గాల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఎలాగైనా ‘గంపగుత్త’గా రాబట్టుకోవడానికి తాయిలాల ఎర చూపుతున్నాయి. ఇందుకోసం సమావేశాలు, సంప్రదింపులు ముమ్మరం చేశాయి. – గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మార్గాల్లో కీలకమైన సామాజికవర్గాలపై ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న సంగతి తెల్సిందే. ఒకటిరెండు చోట్ల ఇండిపెండెంట్లు, మరొకచోట ఓ పార్టీ అభ్యర్థి ప్రభావాన్ని చూపే పరిస్థితి కనపడుతోంది. ప్రచారానికి కేవలం మరో నాలుగు రోజులు ఉండటం వల్ల ఈ స్వల్ప వ్యవధిలో ఎక్కువమందిని కలిసి గెలుపు కార్యాచరణ రూపొందించుకోవడమే లక్ష్యంగా పార్టీల ముఖ్యనేతలు ముందుకుసాగుతున్నారు. ఇక్కడ 20 వార్డులు ఉండగా, ఆయా వార్డుల్లో ఏయే సామాజికవర్గాలు ప్రభావం చూపుతున్నాయే పరిశీలించి ఆమేరకు వారిని కలుస్తున్నారు. సామాజికవర్గాలను కలిసేందుకు పట్టణంలో విస్త్రతంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సామాజికవర్గాల పెద్దల ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశాలు, సంప్రదింపుల సందర్భంగా ఓట్లు వేయించుకోవడం, మాట తీసుకోవడం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమావేశాలు, సంప్రదింపులను ఎక్కువగా ఆలయాల్లో నిర్వహిస్తున్నారుగంపగుత్తగా ఓట్లు పడేలా చూస్తే.. భారీగా నగదుతోపాటు ఇంటింటికీ విలువైన వస్తువులను ఆఫర్ చేస్తున్నారు. ఓ అభ్యర్థి పట్టణంలో బలంగా ఓ సామాజికవర్గానికి ఇంటికో ఫ్రిజ్ ఆఫర్ చేయడానికి సిద్ధమవుతున్నారని, మరో అభ్యర్థి ల్యాప్టాప్, ఇంకో అభ్యర్థి గంపగుత్తగా గోవా ట్రిప్ ఆఫర్ చేయడానికి సిద్ధమయ్యారని చర్చించుకుంటున్నారు. ఇవేకాకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇప్పటికే సుక్క, ముక్క పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణంలోని హాట్ సీటుగా చెప్పుకుంటున్న ఓ వార్డులో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటాపోటీగా పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక అభ్యర్థి ఉదయం చికెన్, బాస్మతీ బియ్యం అందజేస్తే.. అదే రోజు మధ్యాహ్నానికల్లా పోటీ అభ్యర్థి ఇంటింటికి హాఫ్ బాటిల్ బ్రాండెడ్ మందు పంపిణీ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇకపోతే మందు పంపిణీ సందర్భంగా ఓటర్లకు స్టఫ్ కింద మొలకలు, మిక్సర్ కూడా అందిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సామాజికవర్గాల సంప్రదింపులు, సమావేశాలు పార్టీల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఒకటిరెండ్రోజుల్లో ఈ వ్యవహారం మరింతగా ఆసక్తికరంగా మారనున్నది. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
హుస్నాబాద్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆర్యవైశ్య భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 20 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో ఎవరూ అసంతృప్తిలో లేరని, నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, 250 పడకల ఆస్పత్రి, ఇండస్ట్రీయల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో హుస్నాబాద్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో నీటిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లును ఇవ్వలేదన్నారు., హుస్నాబాద్ పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో కోతుల బెడద ఉందని, చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
వామపక్షాలు ఒంటరిగానే..
సాక్షి, సిద్దిపేట: పురపాలికల్లో ఒంటరిగానే వామపక్షాలు బరిలోకి దిగాయి. ఒక్క చేర్యాలలో మాత్రమే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు కుదిరింది. హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాకలో సీపీఐ, సీపీఎంలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. తమ సత్తాను చాటుతామని నేతలు ముందుకు సాగుతున్నారు. ఈసారి పురపాలికల్లో జనసేన, బీఎస్పీ సైతం పలు వార్డులో పోటీ చేస్తోంది. కాంగ్రెస్–సీపీఐకి కుదరని పొత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–సీపీఐ పొత్తుతో ముందుకు వెళ్లారు. బల్దియా ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పై చివరి వరకు చర్చలు జరిపారు. కానీ పొత్తు కుదరలేదు. దీంతో హుస్నాబాద్లో సీపీఐ నాలుగు వార్డుల్లో తమ అభ్యర్థులను, గజ్వేల్లో నలుగురు, దుబ్బాక చేర్యాలలో ఒక్కరు చొప్పున పోటీ చేస్తున్నారు. మిగతా వార్డుల్లో ఎవరికి మద్దతు తెలుపుతారో ఇంకా ప్రకటించలేదు. చేర్యాలలో పొత్తు చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్–సీపీఎం పొత్తుతో పోటీ చేస్తున్నారు. 12 వార్డులుండగా అందులో 11 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో సీపీఎం పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 3వ వార్డును కేటాయించగా లావణ్య అనే మహిళ పోటీ చేస్తున్నారు. మిగతా గజ్వేల్, దుబ్బాకలలో చర్చలు జరిపారు. రెండు చోట్ల బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించి... పొత్తుకు ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగానే.. తమకు బలం ఉన్న చోట సీపీఎం పోటీ చేస్తోంది. దుబ్బాకలో 12, 15, 17 వార్డుల్లో, గజ్వేల్లో ఒక చోట పోటీ చేస్తున్నారు. చేర్యాలలోనే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు మిగతా మున్సిపాలిటీల్లో ఒంటరిగా బరిలోకి.. సీపీఐ సైతం 10వార్డుల్లో పోటీ -
చేర్యాలలో 44 మంది అభ్యర్థులు
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపల్ బరిలో 44 మంది నిలిచారు. 12 వార్డులకు మొత్తం 57 మంది 85 నామినేషన్లు వేశారు. వీరిలో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 44 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగెందర్ తెలిపారు. 1, 2, 3, 5, 7, 8, 10, 12 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 4, 9 వార్డుల్లో నలుగురు చొప్పున, 6, 11 వార్డుల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఏఐఎఫ్బీ పార్టీల అభ్యర్థులు తమ బీ ఫాంలను అందజేశారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తులు కేటాయించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్రనగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతికి, అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఖాళీలు ఉన్న సీట్లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల్గిన విద్యార్థులు ఈ నెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్. ఎస్ఐ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి దుబ్బాకటౌన్: ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి, గువ్వలేగి, గోవిందాపూర్, పోసానిపల్లి,గొడుగుపల్లి, మల్లేశంపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషనల్ లీటరసీ స్టడీ జాతీయస్థాయి సర్వేకు సంబంధించిన పరీక్ష కోసం విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. విద్యార్థులతో ఆంగ్లం పాఠాలు చదివించి గణితంలో సమస్యలు చేయించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులందరికీ మాదిరి పరీక్షలు నిర్వహిస్తూ జాతీయస్థాయి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కనకరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్యాన్సర్ను జయిద్దాం ● ప్రారంభ దశలో గుర్తిస్తేనే మేలు ● జిల్లా న్యాయమూర్తి సంతోశ్కుమార్ సిద్దిపేటకమాన్: క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని జయించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోశ్కుమార్ అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్యాన్సర్లో 200 రకాలు ఉంటాయని తెలిపారు. క్యాన్సర్ వచ్చినపుడు మనిషి మానసికంగా, దృఢంగా ఉన్నప్పుడే వ్యాధిని జయించవచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదని, మహిళలు ముందు వారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బావుంటుందన్నారు. గుట్కా, సిగరెట్టు, తంబాకు, వాడే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సదానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇవేం వంటలు?
మర్కూక్ (గజ్వేల్): ‘ఇవేం వంటకాలు.. మీరైతే ఇలానే తింటారా? విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?.. మెనూ ఎందుకు అమలు చేయడంలేదు’ అని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే నూతనంగా నిర్మిస్తున్న గణేశ్పల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మర్కూక్ కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొలత ప్రకారం ఇచ్చిన కూరగాయలు చేసిన వంటకు పొంతనే లేదని ఎస్ఓ భాగ్యలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. రిజిస్టర్లో రాయకుండా ఇష్టానుసారంగా సరుకులు అందిస్తారా? అని మండిపడ్డారు. ఇష్టానుసారంగా పిల్లలకు భోజనం వడ్డిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట చేయలేదని ఎస్ఓ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓ శ్రీనివాస్రెడ్డిని ఫోన్లో ఆదేశించారు. తరుచూ కేజీబీవీని సందర్శించాలని ఏంఈఓ వెంకట్రాములుకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులను సందర్శించారు. మెరుగైన వైద్యం అందించి మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి ఆఫీసర్ వరకు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గణేశ్పల్లిలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా మెనూ ఎందుకు పాటించడంలేదు కలెక్టర్ హైమావతి ఫైర్ ఎస్ఓ భాగ్యలక్ష్మిపై చర్య తీసుకోవాలంటూ ఆదేశాలు -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
దుబ్బాకటౌన్: ‘విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?.. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని’ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకే కూర, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడేలా వంటలు చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మెనూ తప్పక పాటించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లో కలుపు తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందించే సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫార్మసీ స్టోర్, ఇంజక్షన్ గదులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరి గజ్వేల్రూరల్: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని కలెక్టర్ హైమావతి కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలోగల కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. విద్యార్థులందరికీ సరిపడా భోజనాన్ని రుచికరంగా వండి అందించాలని సూచించారు. భోజనం చేసే సమయంలో అన్నం, కూరలను విద్యార్థుల వద్దకే వెళ్లి వడ్డించాలన్నారు. సౌకర్యాల కల్పన, నాణ్యతలో రాజీ వద్దని, విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్పాలని కేజీబీవీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ‘మధ్యాహ్న భోజనం’పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ హైమావతి -
అందరూ మెచ్చే బడ్జెట్పై విమర్శలా?
గజ్వేల్: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చే బడ్జెట్ను ప్రవేశపెడితే.. కేటీఆర్, హరీశ్రావులకు కనపడకపోగా, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిండ్రు, ఇప్పటికై నా ఏదీ పడితే అది మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం ఏడు హై స్పీడ్ రైళ్లు ఇస్తే...అందులో తెలంగాణకు మూడు కేటాయించారని, అదేవిధంగా గతంతో పోలిస్తే రోడ్లకు అత్యధికంగా నిధులు వచ్చాయన్నారు. సిట్ దర్యాపును సమర్థవంతంగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు ఆగ్రహం గజ్వేల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నారని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్, మొబైల్బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్, వీల్చైర్ అటాచ్మెంట్, వీల్చైర్, టాబ్స్, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 10లోపు ఆన్లైన్లో http://http.tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ గజ్వేల్: చైన్నెలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని సైనిక్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న యువికా అనే విద్యార్థిని రెండోస్థానంలో నిలిచి వెండి పతకం దక్కించుకున్నారు. దేశంలోని 16రాష్ట్రాలకు చెందిన 400మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా..యువికా తనదైన ప్రతిభతో పోటీల్లో విజేతగా నిలిచారు. విద్యార్థిని జాతీయస్థాయిలో రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలసంఖ్య పెంచండి గజ్వేల్రూరల్: ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారు ఎక్సర్సైజ్ చేసేందుకు ఒక యోగా టీచర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక తదితరులున్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక డ్రైవ్ అక్కన్నపేట(హుస్నాబాద్): రానున్న వేసవి దృష్టా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని మిషన్ భగీరథ (ఇంట్రా) డీఈ రుహీనా తస్కీన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం అక్కన్నపేట మండలంలోని కట్కూర్, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రీడ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా చాపగానీతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్ని ఆమె మాట్లాడారు గ్రామాల్లో ఉన్న భగీరథ వాటర్ ట్యాంకులు, పైపులైన్ల వ్యవస్థలతో పాటు పంచాయతీ బోరు బావుల వివరాలను నమోదు చేసుకుంటున్నామన్నారు. తాగునీరు సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకోరావాలన్నారు. కార్యక్రమంలో భగీరథ గ్రీడ్ ఏఈ సాయికృష్ణ, సర్పంచ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా జాగృతం కోసమే బాకీ కార్డు సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డుల పేరిట వినూత్న రీతిలో జాగృతం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక 7 వార్డులో బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీల పేరిట ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు విఠోభా, శ్రీనివాస్ యాదవ్, సాయి, నాయకులు బండల రాజు, ప్రభాకర్రెడ్డి, యాదగిరి, నగేష్, రాజు, నర్సింహులు, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సైనిక దుస్తులతో వచ్చి.. బోధించి
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ సైనిక దుస్తులతో వచ్చి బోధించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన ‘హోమ్ దే బ్రౌట్ హర్ వారియర్ డెడ్’ అనే పద్యాన్ని స్కిట్ రూపంలో బోధించారు. (యుద్ధంలో చనిపోయిన భర్త మృతదేహాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోవడం.. తన బిడ్డ కోసం బతకాలనే ఆశతో కన్నీరు పెట్టడం ఈ పద్యం సారాంశం.) పాఠశాలలో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా బోధించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అభ్యాసంపై ఆసక్తి పెంచాలనే ఇలాంటి స్కిట్లను బోధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ను ఎంఈఓ మహతిలక్ష్మి, హెచ్ఎం శ్రీరాములు అభినందించారు. -
దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే..
దుబ్బాకటౌన్: మున్సిపల్లో 16 వార్డులకు పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రకటించారు. 1వ వార్డు కొంపల్లి రచనశ్రీ, 2వ వార్డుకు గంభీర్పూర్ కనకరాజు, 4వ వార్డు నిమ్మ యాదయ్య, 6వ వార్డు రజిత, 7వ వార్డు లోకాని బాలమని, 9వ వార్డు వనం యాదయ్య, 10వ వార్డు కాపరబోయిన శ్రీనివాస్, 11వ వార్డు బుస్స ప్రవీణ్, 13వ వార్డు మోత్కుపల్లి ప్రతిభ, 14వ వార్డు కాల్వ లింగం, 15వ వార్డు సుంకోజు రమ్య ప్రవీణ్, 16వ వార్డు దేవుని పరశురాములు, 17వ వార్డు పెంటం కిషన్, 18వ వార్డు దొరగోల్ల శ్రీకాంత్ యాదవ్, 19వ వార్డు కారంపూరి భవాని, 20వ వార్డు అంబటి మంజుల బాలేష్ గౌడ్ లను ప్రకటించారు. ఈ సందర్భంగా బైరి శంకర్ మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ ఎన్ చారి, బాలేష్గౌడ్, సంతోష్కుమార్, తదితరులు ఉన్నారు. -
గజ్వేల్ బీఆర్ఎస్లో ఉత్కంఠ
గజ్వేల్: మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20వార్డులకుగానూ అభ్యర్థులను ఖరారు చేసి భీ–ఫాంలను సైతం అందజేసింది. ఈ విషయాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ముదిరాజ్ విడుదల చేశారు. 20వార్డులకుగానూ 19మంది అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, 18వార్డు విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో మైస కనకమ్మ(1వవార్డు), గాడిపల్లి కల్యాణి(02), కోట కిశోర్(03), రొట్టెల శ్రీనివాస్(04), అన్నపూర్ణ(05), పేర్ల సిద్దేశ్వరీ(06), మన్నెం శశిధర్రెడ్డి(07), కేతావత్ ఆంజనేయులు(08), లింగంపల్లి హరికుమార్(09), కొమ్ము చంద్రశేఖర్(10), పిట్ల రత్నమ్మ(11), దామరంచ దయాకర్రెడ్డి(12), పల్పునూరి కల్పన(13), మామిండ్ల రేణుక(14), మౌనిక(15), పుష్పలత(16), నాగులపల్లి కవిత(17), నాయిని సందీప్కుమార్(19), ఉప్పల మధుసూదన్ గుప్తా(20వ వార్డు) ఉన్నారు. వీడని సస్పెన్స్ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా.. అధికారికంగా వారి పేర్లను ప్రకటించలేదు. కొన్ని వార్డుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నది. రెబెల్స్ బుజ్జగించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి వారి సమక్షంలోనే అధికారిక అభ్యర్థులకు భీ–ఫాంలను అందజేసి గెలుపునకు వారి సహకారం తీసుకోవాలనే ఆలోచనతో ముందుకుసాగుతున్నట్లు పార్టీ వర్గాల తెలిసింది. ఏదీఏమైనా కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రకటించి భీ–ఫాంలను కూడా అందజేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సంపూర్ణం -
సౌమ్యకు ఘన నివాళి
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్య చిత్రపటానికి సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో సిబ్బంది సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సౌమ్య ఎకై ్సజ్ శాఖకే కాకుండా సమాజానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ అతి నీచమైనది
హుస్నాబాద్: అధికారులపై, రాజకీయ నాయకులపై, వారి కుటుంభ సభ్యులపై ఫోన్ ట్యాపింగ్ చేయడం అతి నీచమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు విచారణకు పిలిస్తే దానిని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లించదన్నారు. మరోవైపు హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొంత మంది జీవితాల్లో, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, కుటుంబాల పరంగా వాళ్ల వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించారని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు, కుట్ర పూరితమైన అంశాలు లేవన్నారు. మీరు తప్పు చేయనట్లయితే విచారణలో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. అంతేకాని డైవర్షన్ పాలిటిక్స్తో రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి సూచించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
కొనుగోలు కేంద్రంలోనే విక్రయించండి
గజ్వేల్రూరల్: కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీఓ (జిల్లా సహకార అధికారి) వరలక్ష్మి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.8వేలను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రఘోత్తంరెడ్డి, ఏఎంసీ సెక్రటరీ జాన్వెస్లీ, అధికారులు బాలయ్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు డీసీఓ వరలక్ష్మి -
కేసీఆర్, హరీశ్రావు దిష్టిబొమ్మల దహనం
గజ్వేల్రూరల్: అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఫోన్ ట్యాపింగ్ అంశంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిష్టిబొమ్మలను అహ్మదీపూర్లో దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, మల్లేశం, అంజాగౌడ్, రామాగౌడ్, బాల్రాజుగౌడ్లు మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలకు అంతేలేదన్నారు. తప్పు చేస్తే ఎవరికై నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం అతి నీచమైనదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సిట్పై బీఆర్ఎస్ భగ్గు
● నోటీసులకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ● రాజీవ్ రహదారిపై గౌరారం వద్ద భారీ ధర్నా వర్గల్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసుల జారీపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం ఉదయం ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్ నందీనగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేతకు గౌరారం వద్ద రాజీవ్రహదారిపై పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. మిరుదొడ్డిలో రాస్తారోకో మిరుదొడ్డి(దుబ్బాక): బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు ధర్మారం కుమార్, ధర్మారం బాబు తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట–భూంపల్లిలో... అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎం చిత్ర పటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు జరిగిన ఆందోళనతో సిద్దిపేట– రామాయంపేట జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటుదామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక కొమ్మూరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు ఒగ్గు వెంకటమ్మ, 2వ వార్డు ముస్త్యాల తేజ, 3వ వార్డు కొమ్ము రాజేశ్వరి, 4వ వార్డు వంగ జయలక్ష్మి, 5వ వార్డు వెలుగల దుర్గయ్య, 6వ వార్డు ముస్త్యాల కృష్ణ, 7వ వార్డు పోతుగంటి ప్రసాద్, 8వ వార్డు సందుల సురేష్, 9వ వార్డు మామిడాల నాగరాజు, 10వ వార్డు తుమ్మలపల్లి లీల, 11వ వార్డు గుస్క వాసంతి, 12వ వార్డు షరీఫాబేగం పేర్లను ప్రకటించారు. ఎంపీ చామల, కొమ్మూరి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. చేర్యాల మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు.గజ్వేల్: ఫోన్ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారణకు పిలిస్తే.. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మలను దహనం చేయడం ఏమిటని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకునే రోజులు వచ్చాయని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు గోపాల్రావు, తీగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాశ్రావు, నాయకులు పాల్గొన్నారు.పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్రావు -
ఈసారీ నిరాశే..
కేంద్రబడ్జెట్పై భిన్నాభిప్రాయాలుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి కేటాయింపులు లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కలేదు. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి మందుల ధరలు కొంత తగ్గనున్నాయి. అలాగే విదేశాలలో విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారికి కొంత ప్రోత్సాహంగా ఉండనుంది. ఇంకా రైల్వేకు సంబంధించి బడ్జెట్ను కేటాయించారు. కానీ రైల్వే ప్రాజెక్ట్లకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదు. – సాక్షి, సిద్దిపేట మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి(కరీంనగర్) వరకు 152 కిలోమీటర్లు ఉండగా సిద్దిపేట(76.5కిలో మీటర్లు) వరకు రైల్వే లైన్ పూర్తయింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 30కిలో మీటర్లు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట వరకు సైతం ఒకటే రైలు. అది స్లోగా వెళ్తుండటంతో ప్రయాణికులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ రైలు స్పీడ్ దాదాపు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్లు స్పీడ్ మాత్రమే వెళ్తుండటంతో సికింద్రాబాద్కు వెళ్లాలంటే దాదాపు 3గంటలకు పైగా పడుతుంది. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. అలాగే మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ చేపడితే రైలు స్పీడ్ పెరగనుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దక్కని ఊరట కేంద్ర బడ్జెట్లో వేతన జీవులు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది. ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్లలో మార్పులు ఉంటాయని అందరూ భావించారు. కానీ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. జిల్లాలో దాదాపు 90వేల మందికి పైగా ఆదాయపు పన్నులు చెల్లిస్తుంటారు. క్యాన్సర్ రోగులకు ఉపశమనం క్యాన్సర్ రోగులకు కొంత ఉపశమనం కలిగింది. 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. జిల్లా వ్యాప్తంగా 600మందికి పైగా రోగులున్నారు. బాలికల హాస్టల్ కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు బాలికల హాస్టల్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. జిల్లాకు బాలికల హాస్టల్ రానుంది. బాలికల హాస్టల్ ఏర్పాటు అయితే విద్యను అభ్యసించే వారి సంఖ్య పెరగనుంది. పల్లెలు, పట్టణాలకు.. కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు జనాభా వారీగా నిధులను ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయిస్తోంది. జిల్లాలో 506 గ్రామపంచాయతీలకు నిధులు రానుండటంతో పల్లెలు అభివృద్ధి చెందనున్నాయి. పట్టణాభివృద్దికి రూ85,522కోట్లను కేటాయించడంతో ఐదు మున్సిపాలిటీలలో 115 మున్సిపల్ వార్డులకు నిధులు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గింపు ఈవీ కార్లు, ద్విచక్రవాహనాల ధరలు తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గటంతో పాటు వాహనదారులకు ఖర్చు నుంచి విముక్తి లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 40వేల మంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు.ఈ వాహనాల ధరలు తగ్గితే వినియోగించే వారి సంఖ్య మరింత పెరగనుంది.ఊసేలేని పర్యాటక ప్రగతి ● వేతన జీవులకు దక్కని ఊరట సిద్దిపేట రైలు స్పీడ్ పెరిగేనా? ● జిల్లాకు బాలికల హాస్టల్అంకెల గారడే.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా ఉంది. అంకెల గారడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. వ్యవసాయంతోపాటు పలు కీలకరంగాలకు కేటాయింపులు సముచితంగా లేవు. తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయమే. – కొత్త ప్రభాకర్రెడ్డి , ఎమ్మెల్యే దుబ్బాక, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వంచించిన కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయలేదు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి జీరామ్జీ పథకం ద్వారా రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని మోపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా కేటాయించారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి. – మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి అన్ని వర్గాలకూ అనుకూలం అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది. దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతాంగం, యువతకు ప్రాధాన్యమిచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. – బాసంగారి వెంకట్, బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడునిరాశపరిచింది.. ఆదాయపు పన్ను చెల్లింపులు శ్లాబులు పెరుగుతాయని భావించాం. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో చాలా బాధాకరం. విద్యారంగానికి బడ్జెట్ మేలు జరిగే విధంగా ఉంది గతంలో కంటే ఈసారి బడ్జెట్ పెంచడం సంతోషదాయకం. – ఇంద్రసేనారెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఎత్తుకు.. పైఎత్తు
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద● గజ్వేల్ మున్సిపల్ పోరు రసవత్తరం ● చైర్మన్ పీఠమే లక్ష్యంగా నేతల పావులుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు ఎత్తుకు.. పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. – గజ్వేల్ నామినేషన్ల పరిశీలన తర్వాత ఇక్కడ 125మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 37, బీజేపీ 28, సీపీఎం, బీఎస్పీ నుంచి ఒకరు చొప్పున, ఇండిపెండెంట్లు 13మంది ఉండగా.. గుర్తింపు పొందిన పార్టీల నుంచి మరో 12మంది బరిలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పుడే.. అసలు కథ మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3 తుది గడువు ఉండగా.. అన్నీ పార్టీల్లోనూ నేతలు రెబెల్స్ను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక పార్టీ కదలికలపై మరో పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఓ ప్రధాన పార్టీలో రెబెల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తుండగా.. వారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నేత మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమచారం. వారిని అలాగే పోటీలో ఉండాలని, అలా ఉంటే సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది గమనించిన సదరు పార్టీ ముఖ్యనేతలు సైతం ఎత్తుకుపై ఎత్తు వేస్తూ..ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తమ పార్టీ రెబెల్ అభ్యర్థులను బుజ్జగించి...అవసరమైతే వారికి అగ్రనేతలతో హామీలు ఇప్పించి పోటీలో నుంచి తప్పుకునేలా శతవిధాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ స్థానాలే లక్ష్యం.. రెబెల్స్ పోటీలో ఉంటే.. సదరు పార్టీ బలహీనపడి తమకు గెలుపు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని వైరి పార్టీల నేతలు వ్యుహాలకు పదునుపెడుతున్నారు. ఓ నేత తాను పోటీ చేసే వార్డులో పోటీ చేయకుండా వేరే వార్డులోకి వెళ్లి పోటీచేస్తే.. సహకారమందిస్తానని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓ నేత చెప్పాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ అభ్యర్థి వేరే వార్డులో నామినేషన్ వేశారని చెప్పుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపల్ ఎన్నికల తీరు వైరి పార్టీల వ్యూహప్రతివ్యూహాలతో మరింత వేడెక్కనుంది.దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తలనొప్పిగా తయారైంది. 20 వార్డులకు 235 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల కంటే ఎక్కువగా దుబ్బాకలో నామినేషన్లు దాఖలు కావడం శోచనీయం. శనివారం నిర్వహించిన పరిశీలనలో అన్ని నామినేషన్లు సరిగ్గానే ఉండటంతో 127 మంది బరిలో ఉన్నారు. కాగా వీటిలో అభ్యర్థులు వివిధ వార్డులకు రెండు, మూడు సెట్లు వేశారు. ఆదివారం 10 వ వార్డు నుంచి నామినేషన్ వేసిన బడుగు మాధవి ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం 126 మంది బరిలో ఉన్నారు. టికెట్ ధీమాతో.. మున్సిపాలిటీలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో చాలా మంది అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం ప్రధాన పార్టీల నాయకులకు తలనొప్పిగా తయారైంది. నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3వ తేది 3 గంటల వరకే గడువు ఉంది. కేవలం రెండు రోజులు మాత్రం గడువు ఉండడంలో బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అలాగే తమకు నష్టం కలగకుండా పలు వార్డులలో స్వతంత్రులను సైతం విత్డ్రా చేయించాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. -
పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆదివారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎస్ఐ లక్ష్మారెడ్డి పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కపకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమంహుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పచ్చిమట్ల రవీందర్గౌడ్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్రావు, అర్చకులు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గురు రవిదాస్ జయంతి గజ్వేల్: పట్టణంలో మోచి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గురు రవిదాస్ మహరాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వేణు, నాయకులు బైరి రవి, ప్రభాకర్, బైరి ప్రభాకర్లు మాట్లాడుతూ కులవ్యవస్థను, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ గురు రవిదాస్ సమతావాదాన్ని బోధించారని కొనియాడారు. -
నేటి నుంచే యూరియా బుకింగ్
ప్రశాంత్నగర్(సిద్ధిపేట): రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన ‘యూరియా బుకింగ్– మొబైల్ యాప్’ను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రైతుల ఖాతా ఆధారంగానే యూరియా బుకింగ్ విధానం అమలు చేస్తామన్నారు. రైతులు కాకుండా ఇతరులు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై రైతులు యాప్లో పంట వివరాలు నమోదు చేసి అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. పాస్బుక్, మొబైల్ నంబర్ నమోదు చేసిన తరువాత ఓటీపీ ద్వారా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. భూమి విస్తీర్ణం మేరకు యూరియా విడతలుగా అందజేస్తామని తెలిపారు. రైతులు డీలర్ వద్దకు వెళ్లే ముందు తప్పనిసరిగా బుకింగ్ నంబర్ తీసుకొని వెళ్లాలన్నారు. బుకింగ్ చేసిన 24 గంటలలోపు యూరియా కొనుగోలు చేయాలని తెలిపారు. యూరియా పంపిణీ పూర్తిగా ఈ–పాస్ విధానంలోనే జరుగుతుందన్నారు. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా యూరియా ఎక్కడ అందుబాటులో ఉందో రైతులకు నేరుగా సమాచారం లభిస్తుందన్నారు. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముందుగానే యూరియా బుక్ చేసుకోవాలని ఆమె కోరారు.జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి -
పాలన చేతకాక.. కేసీఆర్పై కుట్రలు
గజ్వేల్: పాలన చేతకాక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు గజ్వేల్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అక్రమ కేసులు, నోటీసులతో కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు. -
తల్లి, కుమారుడిని చంపి..
బెజ్జంకి(సిద్దిపేట): ఓ వ్యక్తి తల్లి, కుమారుడిని హతమార్చి, ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కని సత్యనారాయణ స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వివిధ కారణాలతో రెండు నెలల కిందట హోటల్ను మూసివేశాడు. తల్లి యశోద (80), భార్య దేవేంద్ర, రెండో కుమారుడు సురేశ్ (36)తో కలసి సత్యనారాయణ గ్రామంలో నివసిస్తున్నాడు. కాగా, దేవేంద్ర శనివారం సిరిసిల్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఓ గదిలో యశోద, సురేశ్ తలలపై బలమైన గాయాలతో శవాలుగా పడి ఉండటాన్ని గుర్తించింది. మరో గదిలో భర్త సత్యనారాయణ ఉరి వేసుకుని మరణించాడు. సత్యనారాయణకు నరేశ్, సురేశ్, రాజు అనే ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు కరీంనగర్లో, చిన్న కుమారుడు సిరిసిల్లలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సురేశ్కు పెళ్లి సంబంధాలు కుదరక ఇంట్లో స్వల్పంగా గొడవలు జరిగాయి. ఆత్మహత్యకు పాల్పడ్డ సత్యనారాయణ వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సౌజన్య తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు సీపీ కుషాల్కర్, ఏసీపీ రవీందర్రెడ్డి పరిశీలించారు. -
టికెట్ల సమన్వయం సరే.. మరి ఎన్నికల్లో?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల పంచాయతీ రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్కు చేరింది. పలు మున్సిపాలిటీల్లో రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పట్టుబట్టారు. దీంతో ఈ టికెట్లలొల్లి ముదిరిపాకాన పడింది. ఈ టికెట్ల పంచాయితీని పరిష్కరించేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. మహేశ్కుమార్గౌడ్తోపాటు, మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏకాభిప్రాయం కుదరని టికెట్ల విషయంలో ఆయా వర్గాల నేతలను సమన్వయం చేసి టికెట్లను ఖరారు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కుదరని సమన్వయం నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని టికెట్ల కోసం ఎంపీ షెట్కార్తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పట్టుబట్టారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయాలని భావించినప్పటికీ..మూడు,నాలుగు వార్డుల టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ టికెట్లలొల్లి గాంధీభవన్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్గా నామినేషన్ కూడా వేశారు. ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు షెట్కార్ అనుచరులకు దక్కినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ కాంగ్రెస్లోనూ టికెట్ల కుదుపు రామాయంపేట మున్సిపాలిటీ టికెట్ల లొల్లి ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. ఈ టికెట్లలొల్లి కారణంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పలువురు కాంగ్రెస్ నాయకులకు పొసగడం లేదు. ఈ క్రమంలో రామాయంపేట బల్దియా చైర్మన్ పదవిని తన కుటుంబసభ్యులకు ఆశించగా, కౌన్సిలర్ టికెట్ ఇచ్చేందుకు మైనంపల్లి నిరాకరించడంతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. ఇలా పలుచోట్ల కాంగ్రెస్ టికెట్లు ఆ పార్టీలో వర్గవిభేదాలను, ఆధిపత్యపోరు, అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేసినట్లైంది. అనుకూలంగా మార్చుకుంటున్న బీఆర్ఎస్ అధికార పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకుంటోంది. ఆ పార్టీలోని కీలక నాయకులకు గులాబీ కండువా కప్పి తగిన ప్రాధాన్యతనిస్తోంది. తద్వారా అధికార పార్టీని నైతికంగా దెబ్బతీయడమే కాకుండా, ఈ ఎన్నిక ఈ మున్సిపల్ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజారిటీ చైర్పర్సన్ స్థానాలపై గురిపెట్టిన బీఆర్ఎస్..కాంగ్రెస్లోని కుమ్ములాటలను అనుకూలంగా మార్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళుతుండటం ఆసక్తికరంగా మారింది.ఆధిపత్య పోరుతో తేలని అభ్యర్థిత్వాలు టికెట్ల కేటాయింపు వరకు టీపీసీసీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలను సమన్వయం చేయగలిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు ఎంతవరకు కలసి పనిచేస్తాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వర్గవిభేదాలు వీడి సమన్వయంతో పనిచేస్తే మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయతీరాలకు చేరుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే. -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● రెండు విడుతలుగా పరీక్షలు ● హాజరు కానున్న 9,710 మంది విద్యార్థులు సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంఽధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈసారి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన ప్రయోగ పరికరాలను ఇప్పటికే అందించింది. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్)లకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అవసరమైన సూచనలు, సలహాలను అందించారు. జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలు జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గాను 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సీఎస్ను నియమించారు. రెండు విడతలుగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు జనరల్ కోర్సులకు సంబంధించి 4,965 మంది విద్యార్థు లు, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం 2,556, ద్వితీ య సంవత్సరం 2,189 మొత్తం 9,710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొద టి విడత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. రెండవ విడత 7 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో 39 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను కేటాయించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు హాల్టికెట్ల పంపిణీ పూర్తయింది. -
గెలిచే అభ్యర్థులకే బీఫాంలు
సంగారెడ్డి: గెలిచే అభ్యర్థులకే బీఫారమ్లు అందజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వారికి బీ ఫారమ్ల పంపిణీపై మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, సంగారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, సీఎం సలహాదారు షబ్బీర్అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్రావు హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల చేతుల మీదుగా బీఫారాలు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.సర్దిచెప్పిన అజారుద్దీన్ జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ టికెట్ల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటకు దారి తీసింది. 19 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించడం గందరగోళానికి కారణమైంది. ఈ ప్రకటనపై సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఏకంగా రాష్ట్రమంత్రి, మున్సిపల్ ఎన్నికల కోసం నియమితులైన ఇన్చార్జి అజారుద్దీన్ కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని అజారుద్దీన్ సర్దిచెప్పాల్సివచ్చింది. గాంధీభవన్లో శనివారం జరిగిన సమావేశంలో ఈ టికెట్ల పంచాయితీని కొలిక్కి తెచ్చారు. ఇక్కడ ఎంపీ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, గిరిధర్రెడ్డి అనుచరులు ఈ టికెట్ల రేసులో ఉన్న విషయం తెలిసిందే. -
మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని శనివారం ఉపలోకాయుక్త జగ్జీవన్కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందించారు, కార్యక్రమంలో ఆలయ ఈఓ టంకశాల వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలిరవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీవాణి పాఠశాలలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు, వ్యాసరచన, క్విజ్పోటీలు, ఉపన్యాస పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ శంకర్నారాయణ, ఎఎంవీఐ శ్రీకాంత్రెడ్డి, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, కోశాధికారి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, సికిందర్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయం సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మయిల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ఆపరేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్లో 70మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. వీరిలో 52మంది బాలురు, 18మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు 49మందిని తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చించినట్లు తెలిపారు. జిల్లాలోని ఇటుకబట్టీలు, బేకరీలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులను గుర్తించామని, వెట్టి చాకిరి నుంచి వారిని విముక్తి చేశామన్నారు. ఇప్పటివరకు 12మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. రేపు ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల విధుల కారణంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె.హైమావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నేడు బీఆర్ఎస్ నిరసన ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి, దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన చర్యని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడిగా, సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తిని దర్యాప్తునకు పిలవడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
పట్టణం, గ్రామీణం కలయిక.. దుబ్బాక
● ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్గా ఆవిర్భావం ● ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం ● రెండోసారి మున్సిపల్ పోరుకు సిద్ధం దుబ్బాక: అటు పట్టణం కాదు... ఇటు పూర్తిగా గ్రామం కాకుండా భిన్నమైన పరిస్థితి దుబ్బాక మున్సిపాలిటీది. భౌగోళికంగా దుబ్బాక మున్సిపాలిటీ సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉండడంతో భిన్నమైన సంస్కృతి పెనవేసుకుంది. వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమనే నమ్ముకొని ప్రజలు జీవనం గడుపుతుండడంతో ఆ వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది. ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్గా.. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దుబ్బాకతో పాటు పట్టణానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని చెల్లాపూర్, లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి, దుంపలపల్లి గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 2012లోనే ఏడు విలీన గ్రామాలతో కలిపి మున్సిపల్గా ఏర్పాటు చేయడంతో కొందరు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు.దీంతో సుమారుగా 12 ఏళ్లుగా మున్సిపల్పై నిర్ణ యం పెండింగ్లోనే ఉండిపోయింది. దీంతో రెండు పర్యాయాలు అంటే పదేళ్లకు పైగా ఈ ఏడు గ్రామా ల్లో అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉండాల్సి వచ్చింది. రెండోసారి మున్సిపల్ పోరుకు.. 2020లో దుబ్బాక మున్సిపాలిటీగా ఆవిర్భవించాక మొదటిసారి ఎన్నికలు జరగగా తాజాగా ఇప్పుడు రెండవ సారి ఎన్నికలకు సిద్ధమైంది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో సుమారుగా 40 వేలకు పైగా జనాభా ఉంది. మొదటిసారి 2020లో జరిగిన ఎన్నికల్లో 19,360 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు రెండు వేలకు పైగా ఓటర్లు పెరగడం విశేషం. -
గజ్వేల్లో రెబల్స్ గోల
పార్టీల నేతలకు తలనొప్పి ● బుజ్జగించేందుకు యత్నం ● మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయంగజ్వేల్: రెబల్స్ లొల్లి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికలో పార్టీలకు గండంలా మారింది. వీరివల్ల గెలిచే స్థానాలను ఓడిపోతామా...? అనే ఆందోళన ముఖ్య నేతలను వెంటాడుతోంది. బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ పార్టీకి 2, 3, 6, 15, 18, 20 వార్డుల్లో రెబెల్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఒకరిని సముదాయించి, పోటీనుంచి తప్పించేలా చేయడం నేతలకు కత్తిమీదసాములా మారింది. ఇప్పటికే పార్టీ నేతలు అధికారిక అభ్యర్థులు ఎవరనే విషయంలో స్పష్టతకు వచ్చారు. ఈ క్రమంలోనే అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు చేసిన వారిని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని కూడా సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకోగా.. వారికి పోటీగా రెబల్స్ కూడా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ..వాటికి కూడా హాజరుకావడం లేదు. కొందరు నేతల వల్లే తాము బీ–ఫాంకు దూరం కావాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. బీజేపీలోనూ 18వ వార్డులో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్లోనూ పలు వార్డుల్లో ఈ పరిస్థితి నేతలకు ఇబ్బందికరంగా మారింది. నామినేషన్ల విత్డ్రా ఈనెల 3లోగా ఈ పరిస్థితిలో మార్పులు ఉంటాయా..? అనేది వేచి చూడాల్సి ఉంది. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు
● కలెక్టర్ కె.హైమావతి హెచ్చరిక ● నాణ్యమైన భోజనం వడ్డించాలి ● మిట్టపల్లి గురుకుల, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలన సిద్దిపేటఅర్బన్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వడ్డించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, గుడ్డు, క్యాలీఫ్లవర్ కూర, పప్పు, రసం, పెరుగు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు డైనింగ్ హాలులో మాత్రమే భోజనం వడ్డించాలని, ఇతర చోట్ల వడ్డించవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం చేసే సమ యంలో క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్.. కూరల నాణ్యత సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్కాంల దృష్టి మరల్చడానికే..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ను ఎదుర్కొనలేకనే సిట్ పేరుతో డ్రామాలను ఆడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. శనివారం సిద్ది పేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారేమోనని భయంతో సిట్ను తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. అలీబాబా 40 దొంగలు, దండుపాళ్యం, లిక్కర్ కుంభకోణాలు, బొగ్గు స్కాం, హైదరాబాద్లో 9,300 ఎకరాల భూమి కబ్జా, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చిల్లర వేషాలు వేయడం తగదన్నారు. నలుగురు ఐపీఎస్లతో సిట్ను ఏర్పాటు చేసి ఇష్టారీతిన ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. రెండేళ్లుగా 350 మందిని, రెండు వారాలుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావులను 160 సీపీఆర్ ప్రకారం ఈ కేసులో సాక్షులుగా 7 నుంచి 9 గంటల పాటుగా సిట్ విచారించిందని పేర్కొన్నారు, అందులో ఏమీ తేలలేదన్నారు. రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. 1885 ఇండియన్ టెలిగ్రాం యాక్ట్ ప్రకారం దేశంలో ఎవరి ఫోన్నైనా కేవలం నిఘా అధికారులు మాత్రమే దేశ భద్రత, తదితర అంశాల కోసమే ట్యాపింగ్ చేస్తాయని, ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. కేసీఆర్ ఉండేది ఎర్రవల్లి ఫాంహౌస్లోనని, నందినగర్లోని నివాసం గోడకు నోటీసులు అంటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అవసరం ఉంటే ఎర్రవల్లిలోనే విచారించాలని, అందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారన్నారు.సిట్ పేరిట సర్కార్ డ్రామాలు -
‘రేవంత్ కక్ష సాధింపు.. తెలంగాణ తేవడమే కేసీఆర్ నేరమా?’
సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్ఎస్పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్పై చట్టం వచ్చింది.ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్కి మాత్రం హైదరాబాద్లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. -
పొద్దుతిరుగుడు.. ఆశలు బోలెడు
ఆలోచన అదిరే.. తొగుట మండలపరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులపై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రోడ్డు పక్కనే పొద్దుతిరుగుడు పంటలు కనుచూపుమేర పసుపు పచ్చనిపూలతో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. అటుగా వెళ్లే వారంతా కొద్దిసేపు ఆగి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటరైతన్న ఆలోచన అదిరింది. తన వరి పంటను జంతువులు, పక్షుల నుంచి రక్షించడానికి పొలం చుట్టూ కంచె(వల)ను ఏర్పాటు చేశారు. అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండాకు చెందిన భూక్యా ధర్మనాయక్ కోళ్లు, పక్షులు తినకుండా ఉండేందుకు వరి పంట చుట్టూ ఇలా వలను ఏర్పాటు చేశారు. తండా సమీపంలోనే పొలం ఉండటంతో కోళ్లు వెళ్లి పంటను తినేస్తున్నాయి. దీంతో వాటి నుంచి రక్షణగా ఇలా వలను ఏర్పాటు చేశానని రైతు తెలిపారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
స్కౌట్స్కు టీచర్లు డుమ్మా
శిక్షణకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు స్కౌట్స్ అండ్ గైడ్స్కు ప్రభుత్వ ఉపాధ్యాయులు మక్కువ చూపడం లేదు. ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లుగా ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కరీంనగర్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతున్నారు. జిల్లా విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. – సాక్షి, సిద్దిపేట విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు.. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడనుంది. ఇప్పటి వరకు జూనియర్ కళాశాలల్లో మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 43 పాఠశాలలు ఎంపిక చేయగా అందులో 23 కేజీబీవీలు, 14 మోడల్ స్కూల్స్, 4 జెడ్పీహెచ్ఎస్లు, ఒకటి ప్రభుత్వ బాలికల పాఠశాల, ఒకటి టీజీఆర్ఈఐఎస్లు ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 44 గైడ్ కెప్టెన్లు, 19 మంది స్కౌట్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్లో శిక్షణ కొనసాగుతుంది. యూనిఫాంల కొనుగోళ్లపైనే శ్రద్ధ మూడు నెలల క్రితం ఆయా పాఠశాలలకు రూ.62వేలను అందించారు. పాఠశాల హెచ్ఎంలు ఎంపికై న విద్యార్థుల కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫాంలను కొనుగోలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్ఎంలకు యూనిపాంల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయులను శిక్షణకు పంపించేందుకు చూపించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సగంమందికి పైగా గైర్హాజరు జిల్లాకు చెందిన 43 పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ను అమలు చేసేందుకు 44 గైడ్ టీచర్లు, 19 మంది స్కౌట్స్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సగం మందికిపైగా గైడ్ టీచర్లు, స్కౌట్స్ మాస్టర్లు గైర్హాజరవుతున్నారు. ఈ శిక్షణకు 25 మంది గైడ్ కెప్టెన్లు, 12 మంది స్కౌట్స్ మాస్టర్లు మాత్రమే శిక్షణకు హాజరవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులకు స్కౌట్స్ అండ్ గైడ్స్పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం కల్పించిన అవకాశానికి మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు హాజరు కాకపోవడంతో విద్యార్థులు శిక్షణకు దూరమయ్యే అవకాశం నెలకొంది.ఉత్తర్వులు ఇచ్చి.. శిక్షణకు హాజరు కావాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకొంది. శిక్షణకు ఉపాధ్యాయులు వెళ్తున్నారా?.. లేదా అని జిల్లా విద్యా శాఖ పట్టించుకోవడం లేదని, అందుకే వెళ్లడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పలువురు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శిక్షణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ హైమావతి, డీఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరై శిక్షణ పొంది విద్యార్థులకు దేశ భక్తిని, సేవ భావాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సాగులో సస్యరక్షణ తప్పనిసరి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించారు. శుక్రవారం చిన్నకోడూరు, రామంచ, గంగాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు ఎకరానికి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాషియం వాడాలన్నారు. వరి నాటే ముందు వేర్లను జీవన ఎరువుల మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నాటు వేసుకోవాలన్నారు. వివిధ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేశారు. అలాగే ఎరువుల షాపులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా వస్తుందని ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. సేవాభావం అలవరుచుకోవాలివర్గల్(గజ్వేల్): విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవాభావం అలవరుచుకోవాలని జాతీయ అవార్డు గ్రహీత, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ డాక్టర్ దేశబోయిని నర్సింహులు అన్నారు. వర్గల్ మండలం రాంసాగర్పల్లిలో శుక్రవారం గజ్వేల్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో సర్పంచ్ నాగరాజుతో కలిసి ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. జట్టుగా నిర్వహించే కార్యక్రమాలు నాయకత్వలక్షణాలు పెంపొందిస్తాయని, జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యువత వ్యసనాల బారిన పడి నిర్వీర్యం కావొద్దని, సన్మార్గంలో ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ప్రదీప్గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఇందూరు’లోక్యాంపస్ ప్లేస్మెంట్స్ టెక్ మహీంద్రాకు 27 మంది ఎంపిక సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో 27 మంది విద్యార్థులు సర్వీస్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు తెలిపారు. హైదరాబాద్కు చెందిన టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 164 మంది పాల్గొన్నారు. వీరికి ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 27 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి సంవత్సరానికి రూ. 3.5 లక్షల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం సిద్దిపేటరూరల్: మాజీముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నారాయణరావుపేట, సిద్దిపేటరూరల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రహదారులపై రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కృషి చేసిన కేసీఆర్పై క్షక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ మేరకు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థిసంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి సిద్దిపేటకమాన్: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, కుమార్, ప్రణయ్ పాల్గొన్నారు. -
మెనూ ప్రకారమే భోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి ● బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ వసతి గృహంలో వంటలను పరిశీలిస్తున్న కలెక్టర్హుస్నాబాద్: విద్యార్థులకు మెనూ ప్రకారం సరిపడా భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో మెనూ పాటించకుండా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించిన ఘటనపై కారణాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు. వంట గదిని పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూ ప్రకారమే భోజనం తయారు చేయాలని ఆదేశించారు. వసతి గృహం లోపల, బయట పరిశుభ్రతను పాటించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల స్ధితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నాపై విద్యార్థుల ద్వారా విచారణ చేపట్టి నివేదిక అందించాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిని కలిసిన కలెక్టర్సిద్దిపేటఅర్బన్: జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్ను కలెక్టర్ హైమావతి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యంలోని హరిత హోటల్లో ఆగిన కమిషన్ కార్యదర్శిని కలెక్టర్ కలిసి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రస్తుత పరిస్థితి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ సునీల్కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అబ్దుల్హమీద్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక అభివృద్ధి
ఎంపీ రఘునందన్రావు దుబ్బాక: బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే దుబ్బాక వెనుకబడిన నియోజకవర్గమని, అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచే నిధులు వస్తాయన్నారు. ప్రజలు ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ప్రాంత బిడ్డగా దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజు, బీజేపీ రాష్ట్రనాయకులు తదితరులు ఉన్నారు. అభివృద్ధికి బాటలువేయండి గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అవగాహనతోనే లెప్రసీ దూరం
కొండపాక(గజ్వేల్): అవగాహనతోనే లెప్రసీ (కుష్ఠు) వ్యాధిని దూరం చేసుకోవచ్చని జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి అన్నారు. మండలంలోని దుద్దెడలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామాల్లో కృష్ఠు వ్యాధి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండీటీ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. లెప్రసీ వ్యాధి నిర్మూలన కోసం గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, మండల వైద్యాధికారి శ్రీధర్, డీపీఎంఓలు పాల్గొన్నారు.జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి -
గెజిటెడ్ సంతకాల కోసం పరుగులు
హుస్నాబాద్: కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హైరానా పడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ఫారంలో తప్పొప్పులను సరిచూసుకున్నారు. ఫారంలో అన్ని అంశాలు పూరించినప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారితో సంతకం తప్పనిసరి అధికారులు సూచించారు. దీంతో అభ్యర్థులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు. హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడంతో వివిధ శాఖల అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
హుస్నాబాద్/చేర్యాల(సిద్దిపేట)/గజ్వేల్/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినే షన్లు వేశారు. హుస్నాబాద్లో మొత్తం 149 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ 39, బీజేపీ 33, బీఆర్ఎస్ 39, సీపీఐ 5, జనసేన 5, బీఎస్పీ 6, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) 1, ఇండిపెండెంట్లు 21 మొత్తం 149 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. అలాగే చేర్యాల మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు 59 నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. చివరి రోజు 85 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజులుగా వచ్చిన నామినేషన్ల వివరాలు పార్టీల వారీగా బీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 31, బీజేపీ 13, సీపీఎం 2, సీపీఐ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, బీఎస్పీ 1, ఇతరులు 9 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లో చివరి రోజు శుక్రవారం 185 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 57, బీజేపీ 40, బీఎస్పీ 1, సీపీఎం నుంచి 1 నామినేషన్లు దాఖలుకాగా, ఇండిపెండెంట్లు 21 మంది, మరో 12 మంది ఇతర రిజిష్టర్డ్ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు వెల్లడించారు. దుబ్బాక మున్సిపాల్టిలో చివరిరోజున 145 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 235 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్ రమేశ్కుమార్ తెలిపారు. -
సీఎం కప్తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. శుక్రవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. 30 మంది క్రీడాకారులకు దుస్తులను అందజేసిన భూంపల్లి 2వ వార్డు సభ్యుడు కొండల్ను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రెహమాన్, ఎంపీడీఓ సోమిరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సంయుక్త, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ రవి, సర్పంచ్లు జెన్నారెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ములుగులో ముగిసిన క్రీడలు ములుగు(గజ్వేల్): ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా సాగిన మండలస్థాయి క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్, కోకో, బాస్కెట్బాల్ క్రీడల్లో విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఎంపీడీఓ స్వర్ణకుమారి ఎంఈఓ ఉదయ్భాస్కర్రెడ్డి, ఎస్ఐ రఘుపతి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాల్రెడ్డి, సర్పంచ్ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం, వికాసం చేర్యాల(సిద్దిపేట): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం, వికాసం కలుగుతాయని ఎంపీడీఓ ప్రణయ్కుమార్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన క్రీడోత్సవాలను ఎంఈఓ నరేందర్, ఎస్ఐ నవీన్తో కలిసి ప్రారంభించారు. పీడీలు రామేశ్వర్రెడ్డి, కిషన్, శ్రీధర్, కవిత, రజిత, రమేశ్, అరుణ, సురేశ్, సంతోష్, ఎంఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నవోదయలో.. వర్గల్(గజ్వేల్): నవోదయ స్టేడియం వేదికగా వర్గల్లో ఆటల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు సత్తాచాటారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్రెడ్డి, తహసీల్దార్ రఘువీర్రెడ్డి, ఎంఈఓ సునీత, ప్రిన్సిపాల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డిలో.. మిరుదొడ్డి(దుబ్బాక): క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ చైన్నె భూపాల్గౌడ్, ఇన్చార్జి ఎంపీఓ ఫహీం, సర్పంచ్ మహేశ్వరి, ఉప సర్పంచ్ కరుణాకర్, భైరయ్య, ఉపాధ్యాయులు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
అగ్నివీర్తో నాయకత్వ లక్షణాలు
● ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి ● ఆర్మీ రిక్రూట్మెంట్ మెడికల్ అధికారి ప్రకాశ్చంద్రరాయ్ సిద్దిపేటఎడ్యుకేషన్: అగ్నివీర్గా దేశానికి సేవచేయడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆర్మీ రిక్రూటింగ్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ప్రకాశ్చంద్రరాయ్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో శుక్రవారం విద్యార్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు అగ్నివీర్ ఒక్క చక్కని అవకాశమన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దళారులను నమ్మవద్దని సూచించారు. భవిష్యత్లో ఇతర ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్గా ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, శారీరక దృఢత్వ ప్రమాణాలు, వైద్యపరీక్షలు, శిక్షణ కాలం, విధులు, బాధ్యతల గురించి వివరించారు. అగ్నివీర్కు లభించే వేతనాలు, అలవెన్స్లు, బీమా, నాలుగేళ్లు పూర్తయ్యాక అందించే సేవానిధి తదితర అంశాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై కళాశాల విద్యార్థులు ఇర్ఫాన్, సునీల్ రూపొందించిన ఉత్తమ షార్ట్ఫిల్మ్కు ట్రాఫిక్ అధికా రులు అందించిన సర్టిఫికెట్లను ఆయన చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దరిపల్లి నగేశ్, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, అధ్యాపకులు రఘురాజ్, వెంకటరమణ, గంగాధర్, రాజ్యలక్ష్మి, రాజశేఖర్, నరేందర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, శ్రీకాంత్ సత్యం, ఫాతిమా, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో విద్యార్థులకు లబ్ధి
3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక ప్రశాంత్నగర్(సిద్దిపేట): సాక్షి దినపత్రికలో ప్రతి రోజు అందిస్తున్న స్టడీ మెటీరియల్తో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకురుస్తుందని 3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక అన్నారు. రంగదాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు ఆమె ఆధ్వర్యంలో సాక్షి స్టడీ మెటీరియల్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ను నిపుణుల సాయంతో రూపొందించారన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ద్వారా రానున్న వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని సూచించారు. రూ.250కే స్టడీ మెటీరియల్ అందించడం ఆహ్వానించదగిన విషయమని, విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పారా అథ్లెటిక్స్లో దివ్యాంగుడి ప్రతిభ
మిరుదొడ్డి(దుబ్బాక): హైదరాబాద్ గచ్చిబౌ లిలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి పారా (వైకల్యం కలిగిన అథ్లెట్లు) అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో మిరుదొడ్డికి చెందిన దివ్యాంగుడు, తెలంగాణ వీల్ చైర్ క్రికెటర్ ఎర్రోళ్ళ పరశురాములు ప్రతిభ చాటారు. చాంపియన్షిప్లో షాట్ఫుట్, జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్, డిస్కస్ త్రోలో బ్రౌంజ్ మెడల్ సాధించారు. పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు దీప్తీ జీవంజి చేతుల మీదుగా మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అథ్లెటిక్ చాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన పరశురాములును గ్రామస్తులు శుక్రవారం అభినందించారు. మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తున్న రాందేవ్ చంద్రశేఖర్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్లో డాక్టరేట్ పట్టా పొందినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన చేసి ఇంగ్లిష్ లిటరేచర్లో పీహెచ్డీ పట్టా పొందారన్నారు. తమ అధ్యాపకుడికి డాక్టరేట్ రావ డం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రశేఖర్ను ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు. సిద్దిపేటకమాన్: గ్రూప్ 3 పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఆడిటర్గా ఎంపికై న కానిస్టేబుల్ ఎర్రవల్లి సందీప్రెడ్డిని టూటౌన్ సీఐ ఉపేందర్ అభినందించారు. కానిస్టేబుల్గా విధులు నిర్వ హిస్తున్న సందీప్రెడ్డి ఇటీవల వెలువడిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఫలితాల్లో ఆడిటర్గా ఎంపికయ్యారు. పోలీసు స్టేషన్లో శుక్రవారం సీఐ, సిబ్బంది సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూనే పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పోలీసు యూనిట్ నుంచి రిలీవ్ చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి సందీప్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మద్దూరు(హుస్నాబాద్): కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష విడనాడాలని, వారితో ప్రేమతో వ్యవహరించాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్య క్షుడు శనిగరం సత్యనారాయణ సూచించారు. మండలంలోని నర్సయపల్లిలో శుక్రవారం కుష్ఠువ్యాధి నిర్మూలనా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠువ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అన్నారు. ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నమయవుతుందని, కుష్ఠు రహిత దేశం కోసం అందరు కృషి చేయాలని కోరారు. అనంతరం కుష్ఠువ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొగుట(దుబ్బాక): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలని సర్పంచ్ పాగాల శోభ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడలను శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రవీందర్, రమేశ్, ఏఎంసీ చైర్మన్ విజయ్రెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, తహసీల్దార్ సమీర్ అహ్మద్ఖాన్, ఎంపీడీఓ నాగేశ్వర్, సీఐ లతీఫ్, మాజీ సర్పంచ్ లు బాల్రెడ్డి, రాంరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్పై అవగాహన అవసరం
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలు మాత్రమే పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరికి డ్రైవింగ్, నిబంధనలపై అవగాహన ఉండా లని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. రోడ్డు భద్రతపై చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీల్లో విజేతలకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, మద్యపానం కలిగే వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై షార్ట్ వీడియోల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకరావడానికి యువత ముందుండాలన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, శ్రీధర్గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబుసిద్దిపేటఅర్బన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయని, ముఖ్యమైన ప్రదేశాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు పిలుపునిచ్చారు. అర్బన్ మండలం పొన్నాలలో సర్పంచ్ అమ్ముల వెంకటయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. అంతకు ముందు గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ కన్వెన్షన్ హాల్, పెట్రోల్ బంక్లకు పంచాయతీ అసెస్మెంట్ చేసి పన్నులు వసూలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్లు అందుబాటులో ఉండాలని, ఇంటి పన్నులు ఎప్పటికప్పుడు సక్రమంగా వసూలు చేయాలని తీర్మానించారు. సర్పంచ్ వెంకటయ్య, కార్యదర్శి నరేశ్, ఉప సర్పంచ్ సృజన, మాజీ స ర్పంచ్ తన్నీరు శ్రీనివాస్, యాదగిరి, బాల్రంగం, సంపత్యాదవ్, శ్రావణ్, ఏఈఓ మీరాబాయి తదితరులు పాల్గొన్నారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు వర్గల్(గజ్వేల్): మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి అన్నారు. మండలంలోని గోవిందాపూర్లో ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్తో కేటీఆర్, జగదీష్రెడ్డి భేటీ
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన తనయుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, జగదీష్రెడ్డిలు సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్ను కోరారు. అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్ను కోరారు. ఈ మేరకు సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. -
పుర పోరు.. నామినేషన్ల జోరు
రెండో రోజు 187.. ● ఇప్పటి వరకు 72 వార్డులకు 222 నామినేషన్ల స్వీకరణ సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు గురువారం నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులలో 187 నామినేషన్లు వచ్చాయి. మొత్తం ఇప్పటి వరకు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వేగం పెంచాయి. ఈ నేపథ్యంలో పురపాలికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ధీమాతో దాఖలు.. టికెట్ దక్కుతుందన్న ధీమాతో కొందరు, పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో మరికొందరు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ముఖ్యనేతల ఆశీస్సులు ఉన్న వారు, అంతర్గతంగా అభయం దక్కిన వారు కేంద్రాలకు వచ్చి దరఖాస్తులను తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఆయా పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. టికెట్ కోసం టెన్షన్ టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పలు చోట్ల పలు వార్డులకు సంబంధించి టికెట్లను ఖరారు చేయగా మరికొన్ని చోట్ల ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో వారితో చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తున్నారు. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోతే బీజేపీ నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు ఇవే.. మున్సిపాలిటీ 28న 29న మొత్తం హుస్నాబాద్ 04 26 30 గజ్వేల్ 08 68 76 దుబ్బాక 18 72 90 చేర్యాల 05 21 26 -
మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన మామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేక్ పాయింట్ ఏర్పాటు చేయండి సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రేక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ సెక్రటరీలతో పలు అంశాలపై అరా తీశారు. రైతు బజార్లో అనేక సమస్యలు ఉన్నాయని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పరిష్కరించాలని సూచించారు. సన్ ప్లవర్ కొనుగోలు మీద ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సన్న వడ్ల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ హైమావతి ● బస్తీ దవాఖాన ఆకస్మిక తనిఖీసిద్దిపేటకమాన్: విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్లోని బస్తీ దవాఖానను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ రెండు చోట్ల విధులు నిర్వహిస్తున్నారని, మధ్యాహ్నం 12గంటలకు మరో పీహెచ్సీ వెళ్లారని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. నర్సింగ్ స్టాఫ్ బాలమణి ఒక్కరే ఉన్నారని, సపోర్టింగ్ స్టాఫ్ రమ్య లేరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ను ఫోన్లో కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు సిద్దిపేటరూరల్: జిల్లాలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సీపీ రష్మీ పెరుమాళ్తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంటిమామిడి నుంచి తొటపల్లి వరకు రాజీవ్ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో సూచికబోర్డులు, ట్రబుల్స్టిక్స్, ఐరన్ బారికేడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొమురవెల్లి కమాన్, దుద్దెడ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా ఉన్నందున వెంటనే భూసేకరణ చేపట్టి రోడ్డును సరిచేయాలన్నారు. కుకునూరుపల్లి వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, నేషనల్ హైవే, ఆర్అండ్బీ, మున్సిపల్, వైద్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సీపి సాధన రశ్మిపెరుమాల్తో కలిసి కలెక్టర్ కె. హైమావతి మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. -
బీఆర్ఎస్ నాయకుల ధర్నా
సిద్దిపేట పట్టణంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులుప్రశాంత్నగర్(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు పంపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్కు సిట్ నోటీసులు పంపడం తగదన్నారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘బంగారం’తో పొన్నం మొక్కులు
హుస్నాబాద్ పట్టణం ఎల్లమ్మ చెరువు వద్ద సమ్మక్క సారలమ్మ దేవతలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రాంతమంతా సమృద్ధిగా వర్షాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే శక్తిని ఇవ్వాలని అమ్మవార్లను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. కాగా సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. – హుస్నాబాద్ -
వన దేవతల ఆగమనం.. పోటెత్తిన భక్తజనం
నంగునూరు మండలం అక్కెనపల్లిలోని సమ్మక్క సారలమ్మ ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో పులిగుండ్ల నుంచి సమ్మక్క ప్రతిమను తెచ్చి పూజారులు గద్దైపె ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సమ్మక్క, సారమ్మకు ఒడి బియ్యం పోసి నైవేద్యం సమర్పించారు. ఎమ్మెల్యే హరీశ్రావు పూజలు చేసి అమ్మవారికి బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. – నంగునూరు(సిద్దిపేట) సమ్మక్క గద్దె వద్ద భక్తజనం -
కాంగ్రెస్ పతనానికి నాంది
గజ్వేల్: కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేవంత్రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సీఎంగా పదేళ్లు పాలించి.. రాష్ట్రం దశాదిశలను మార్చిన కేసీఆర్పై కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకున్న రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
పొత్తు పొడిచేనా?
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ వైపు నామినేషన్ల సందడి నెలకొనగా.. మరోవైపు పొత్తులకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీల నుంచి ఆయా వార్డుల కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారందరూ నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆయా పార్టీలు పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని వార్డులకు అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. – సాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్– సీపీఎం పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా అందులో ఒక వార్డును సీపీఎంకు కేటాయించారు. 3వ వార్డును ముస్త్యాల లావణ్యకు సీపీఎం కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీలలో సీట్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. గజ్వేల్లో ఒకటి, దుబ్బాకలో రెండు వార్డులు అడుగుతున్నతున్నట్లు సమాచారం. ఈ రెండు మున్సిపాలిటీలలో పొత్తు కుదరకపోతే సొంతంగానే బరిలోనే దిగుతామని సీపీఎం నేతలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్–సీపీఐ చర్చలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అప్పటి నుంచి వారి మధ్య దోస్తీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా? ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. పొత్తు కోసం కాంగ్రెస్, సీపీఐ నాయకులు చర్చలు జరుపుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో రెండు నుంచి మూడు వార్డులు అవకాశం ఇవ్వాలని సీపీఐ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్లో పొత్తులో భాగంగా సీసీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండి పడనుంది. సొంతం గా పోటీ చేస్తారా? పొత్తుతో ముందుకు వెళ్తారా? అనేది శుక్రవారం తేలిపోనుంది. వామపక్ష వేదికగా..ఆయా మున్సిపాలిటీలలో సీపీఐ, సీపీఎంలు ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించి చర్చలు ఫలించకపోతే వామపక్ష వేదికగా పోటీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. సీపీఎం, సీపీఐలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని పోటీ చేయాలనుకునే పలువురు అభ్యర్థులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వామపక్షాల తమ ఓటు బ్యాంక్ చాటాలని అనుకున్నట్లు సమాచారం.ఈ ఎన్నికల్లో ఒక్క చేర్యాల మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు కుదరగా మిగతా వాటిలో ఎలా ఉంటుందో చూడాలి. చేర్యాలలో బీఆర్ఎస్కు 11.. సీపీఎంకు 1చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని 12 వార్డుల్లో 11 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఒక వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. 11 వార్డుల్లో ఆరు వార్డులకు ఇదివరకే అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 5 వార్డులకు అభ్యర్థులుగా 2వ వార్డు కమలాపురం గీతాంజలి, 5వ వార్డు తొండెంగల రాజే శ్, 7వ వార్డు మేర్గు లక్ష్మణ్, 11వ వార్డు ఎండీ ఇజాజ్ అహ్మద్, 12వ వార్డు శివగారి భబితలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన 3వ వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొలిక్కిరాని కాంగ్రెస్ – సీపీఐ దోస్తీ -
పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు
● కలెక్టర్ హైమావతి ● దుబ్బాకలో నామినేషన్ ప్రక్రియ పరిశీలనదుబ్బాకటౌన్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతారణంలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 రోజుల పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలోనీ దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాసిరకం మధ్యాన భోజనం అందిస్తే సహించేది లేదని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని, పోటీ చేసే అభ్యర్థులందరూ సహకరించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. పట్టణ కేంద్రంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి సెంటర్కి వచ్చిన సమయం నుంచి నామినేషన్ వేసి బయటికి వెళ్లే వరకు వీడియో తీయించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. -
తపాస్పల్లికి గోదావరి జలాలు
కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్పల్లి రిజర్వాయర్లోకి బుధవారం మాజీ ఎమ్మెల్యే, జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి చొరవతో ఇరిగేషన్ అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. నీటి పంపింగ్ కోసం రెండు పైపు లైన్లు ఉండగా ప్రస్తుతం ఒక లైను నుంచి నీటిని విడుదల చేశారు. ధర్మసాగర్ నుంచి బొమ్మకూరు మీదుగా తపాస్పల్లి రిజర్వాయర్ కు నీరు చేరుతోంది. రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపిన అనంతరం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి యాసంగికి సాగు నీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కార్యాలయం లేక కష్టాలు
● హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ ● చేర్యాల మున్సిపాలిటీలో వింత పరిస్థితి చేర్యాల(సిద్దిపేట): పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా సరైన వసతులు లేక చేర్యాలలో అధికారులకు, పాలకవర్గానికి తిప్పలు తప్పడంలేదు. మున్సిపల్ కార్యాలయం కొన్ని రోజులు పాత గ్రామ పంచాయతీ భవనంలోనే కొనసాగింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పేరుతో కార్యాలయం కూల్చి వేశారు. దీంతో పట్టణ శివారులో ఉన్న ఎస్సీ హాస్టల్లోకి కార్యాలయాన్ని మార్చారు. ఇరుకు గదుల్లోనే ఉంటూ పట్టణ ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుత కార్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో పాత ప్రభుత్వ ఆస్పత్రిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. కొత్తగా కొలువుదీరే పాలవర్గంలోనైనా మున్సిపాలిటీకి సొంత భవనం ఏర్పాటు అయ్యేనా అన్న చర్చ పట్టణంలో జరుగుతోంది. -
బల్దియాలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
హుస్నాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతతో పని చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభిమోగించాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత నాదేనని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పొన్నం ప్రత్యేక దృష్టి గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా గౌరవెల్లి గురించే మాట్లాడుతారని తుమ్మల అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సర్వే ఆధారంగానే టికెట్లు సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. మున్సిపల్ గెలుపుతో, అభివృద్ధి మరింత జరగాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఇరిగేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రుల సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, మాజీ ఎంపీపీ వెంకట్, పలువురు నాయకులు మంత్రులు నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోహెడ మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు ఉన్నారు. -
వచ్చేయ్.. దూకేయ్!
చేరికలపై ప్రధాన పార్టీల నజర్మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు.. చేరికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పట్టణాల్లో కొంచెం పేరున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీలలో అసంతృప్తులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఒక అడుగు ముందుకేసి నామినేటెడ్ పోస్టులు సైతం ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. ఎలాగైనా బల్దియా పీఠం దక్కించుకోవాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ పట్టణాల్లో గోడ దూకుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు అటు ఇటు జంపింగ్ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో కౌన్సిలర్ టికెట్ దక్కని వారు, నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు జంప్ జిలానీల కార్యక్రమం ఊపందుకోనుంది. సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతలు దాకా కండువాలు మార్చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ఆకర్ష్ మంత్రం పఠిస్తున్నాయి. ఉన్న వాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లిన వారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. బీజేపీ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి దుబ్బాక మున్సిపాలిటీలోని 11వ వార్డు టికెట్ ఆశిస్తున్న రఫియుద్దిన్ బీఆర్ఎస్లో చేరారు. ఈ వార్డు టికెట్ రఫియోద్దిన్కే బీఆర్ఎస్ ఖరారు చేసే అవకాశం ఉంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన యువజన నాయకుడు తొండెంగుల రాజేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో చేరారు. రాజేశ్కు ఐదవ వార్డు టికెట్ దక్కె అవకాశాలున్నాయి. అలాగే దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో బీఆర్ఎస్లో చేరికలు ఇంకా అవకాశం ఉంది. ఆయా పార్టీలు కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తుంటే టికెట్ రాని ఆశావహులు వివిధ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉండటంతో టికెట్ దక్కని వారు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజులు చేరికల జోరు మరింత పెరగనుంది. అధికార పార్టీలోకి జోరుగా జంపింగ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుస్నాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, మాజీ వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆకుల వెంకన్నకు ఏదైనా నామినేట్ పోస్టు ఇచ్చే అవకాశాలున్నాయి. చేర్యాల పట్టణానికి చెందిన జెన్కో రిటైర్డ్ ఎస్ఈ కాటం సంజీవయ్య, రిటైర్డ్ టీచర్ తేజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ పదవిని తేజ ఆశిస్తున్నారు. దుబ్బాకలోని దుంపలపల్లిలో ఇద్దరు యువ నాయకులు కాంగ్రెస్లో చేరారు. -
తొలిరోజు 35 నామినేషన్లు
స్వీకరణ షురూ.. ● రేపటితో ముగియనున్న గడువుసాక్షి, సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలలో ఆయా కమిషనర్లు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. రెండు వార్డులకు కలిపి ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు గాను తొలి రోజు 35 నామినేషన్లు వచ్చాయి. దుబ్బాకలో 18, గజ్వేల్లో 8, చేర్యాలలో 5, హుస్నాబాద్లో నాలుగురు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. మంచి ముహూర్తం కోసం.. ఈ రెండు రోజుల్లో ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్కుల దగ్గరికి పోటీ దారులు సంప్రదిస్తున్నారు. దీంతో వారు చెప్పిన సమయంలోనే నామినేషన్లను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. స్పీడ్ పెంచిన పార్టీలు ఆయా వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటికే చేర్యాల మున్సిపాలిటీలో ఆరుగురిని ప్రకటించారు. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేశారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్ను ఆశిస్తున్న చోట్ల అందరిని నామినేషన్లను వేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి సమయంలో బీ ఫామ్లను నేరుగా ఎన్నికల అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ
సిద్దిపేటకమాన్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు స్థానిక పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 లోపు డిపాజి ట్ చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకెళ్లవచ్చన్నారు. డిపాజిట్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ సరిహద్దుల్లో నాలుగు చెక్పోస్టులను ఏర్పాటు చేసి, 24 గంటలూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. అత్యుత్తమ సేవలే గుర్తింపునిస్తాయి మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన అత్యుత్తమ సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట–భూంపల్లి పీహెచ్సీ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అదీభా ఖురేషి సేవలకు జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ మేరకు డాక్టర్ అదీభా ఖురేషిని బుధవారం పీహెచ్సీలో శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తూ పీహెచ్సీకి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భూంపల్లి సర్పంచ్ జెన్నారెడ్డి, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ములుగు(గజ్వేల్): ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి అన్నారు. ములుగు మండలం వంటిమామిడిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్, పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెండింగ్ బిలుల్లు చెల్లించాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధానకార్యదర్శి శశిధర్శర్మ, క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీర్చండి సిద్దిపేటకమాన్: సిద్దిపేట వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీర్చాలని ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు నర్సింహులు కోరారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని పెన్షనర్లు సెంటర్ ఇన్చార్జి వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ వ్యాధులకు అవసరమైన మందులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో తిరుపతి, రవిందర్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల పట్టివేత.. సర్పంచ్పై కేసు దుబ్బాకరూరల్: అక్బర్పేట– భూంపల్లి మండలం బొప్పాపూర్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరగడంతో సర్పంచ్ వాటిని పట్టించారు. కుక్కలను మెటల్ వైరుతో బంధించి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అదులపురం గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
కాలువకు గండి
నీట మునిగిన వరి పంటలు ● నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ తొగుట(దుబ్బాక): మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాకకు వెళ్లే కాలువకు పెద్దమాసాన్పల్లి శివారులో గండిపడింది. దీంతో సుమారు 30 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. నీటి ప్రవాహంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాట్లువేసిన కొద్దిరోజులకే పంట పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో అధికారులు దుబ్బాక కాలువలోకి నీటిని వదిలిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహంతో సుమారు కిలోమీటరు దూరంలో రాత్రి 11గంటల సమయంలో కాలువకు గండిపడింది. పంట పొలాల వద్ద ఉన్న రైతులు పరిస్థితిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే నీటిని నిలిపివేశారు. కాలువలో పేరుకుపోయిన పూడిక తీయకుండా అధికారులు నీటిని వదలడం వల్లే కాలువ తెగిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యంతో బతుకులు ఆగమయ్యాయని రైతులు అన్నారు. పరిహరం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా నీటిపారుదల శాఖ డీఈఈ శిరీష, వ్యవసాయాధికారి మోహన్, ఏఈఓ నారార్జున పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదుచేశారు. ఈ సందర్భంగా డీఈఈ శిరీష మాట్లాడుతూ పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వివరించారు. -
‘జిజ్ఞాస’తో పరిశోధనా పరిజ్ఞానం
● డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● అధ్యాపకులకు అవగాహన కార్యక్రమంసిద్దిపేట ఎడ్యుకేషన్: జిజ్ఞాస ప్రాజెక్టుతో నైపుణ్యం మెరుగవుతుందని, పరిశోధనా పరిజ్ఞానం పెరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, జిజ్ఞాస ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్)లో బుధవారం అధ్యాపకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిజ్ఞాస ప్రాజెక్టు విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమస్యలు విశ్లేషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంతో విద్యార్థులు చిన్న స్థాయి పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వారి అకాడమిక్ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ జిజ్ఞాస, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధ్యాపకులు మెంటర్లుగా వ్యవహరిస్తూ ప్రాజెక్టుల ఎంపిక, అమలు, నివేదిక తయారీలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు, ఉత్తమ విద్యా ఆచరణలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుదర్శనం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గురు చరణ్ దాస్, జిజ్ఞాస కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్నికలు: కలెక్టర్
సిద్దిపేటరూరల్: అందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికలు సైతం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతులలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల గురించి మాస్టర్ ట్రైనర్ అందించే శిక్షణ క్లుప్తంగా నేర్చుకోవాలన్నారు. ఎన్నికల కరదీపికలోని మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ జరపాలన్నారు. ప్రతి అర్ఓ.. ఎలక్షన్ కరదీపికపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ప్రక్రియకు ఎలక్ట్రోరల్ రోల్ అతి ముఖ్యమైనదని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఒక నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హుస్నాబాద్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్లు మల్లికార్జున్, రమేష్, మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి సిద్దిపేటరూరల్: ఎన్నికల మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. నియమితులైన నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్కుమార్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీసీఈఓ రమేశ్, డిపిఆర్ఓ రవికుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన గజ్వేల్రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంక ట గోపాల్కు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, గజ్వే ల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి తదితరులున్నారు. -
నేతల్లో హడావుడి..
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని పార్టీల్లో హడావుడి మొదలైంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుది గుడువుగా విధించడంతో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. వచ్చే నెల 11న పోలింగ్ ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. – గజ్వేల్ నిన్నటిమొన్నటివరకు సాదాసీదాగా ఉన్న మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో సహజంగానే ఇక్కడ గెలిచే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా ముందుకుసాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడి మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలనే సంకల్పంతో సర్వశక్తుల ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు.. తమ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నాయకులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఓ నాయకుడు తనను గెలిపిస్తే.. వార్డుకు చెందిన ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. మరో నాయకుడు తన సతీమణి పోటీ చేసే వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇకపోతే మరికొందరు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొందరైతే ఇప్పటికే రెండేసి, మూడేసి రౌండ్లు తమ వార్డుల్లో ప్రచారం పూర్తి చేశారు. తాయిలాలు ప్రకటిస్తూ ఓటర్లను మచ్చికచేసుకునే పనిలో పడ్డారు. మరొకొందరు నేతలు హామీలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసిచూపిస్తానంటున్నారు. అంతేకాకుండా పార్టీల ముఖ్య నేతలు భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా వార్డుల వారీగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపట్టి క్యాడర్ను కూడగట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వార్డులవారీగా ముఖ్యమైన నేతలను ఇన్చార్జిలుగా నియమించారు.రేపోమాపో కొలిక్కి.. అభ్యర్థుల ఎంపిక వడివడి అన్ని పార్టీల్లోనూ సందడి -
నోడల్ అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణకు 13 విభాగాలుగా విభజించి పది మంది నోడల్ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకానికి అధికారిగా డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల సిబ్బందికి శిక్షణకు డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లకు డీపీఓ రవీందర్, ట్రాన్స్పోర్టుకు డీటీఓ లక్ష్మణ్, మెటీరియల్ మేనేజ్మెంట్ జెడ్పీ సీఈఓ రమేశ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిశీలన డీసీఓ వరలక్ష్మి, నోడల్ అబ్జర్వర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్ భార్గవ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికా రిగా డీఆర్ఓ నాగరాజమ్మ, మీడియా కమ్యూనేషన్కు డీపీఆర్ఓ రవికుమార్, హెల్ప్లైన్ ఫిర్యా దులు ఏవో రాజ్కుమార్లను నియమించారు.1.01 లక్షల మంది ఓటర్లు నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 20 9,873 9,348 06 19,227 దుబ్బాక 20 11.117 10,224 0 21,341 గజ్వేల్ 20 24,001 22,738 01 46,740 చేర్యాల 12 7,119 6,658 0 13,777ఆయా మున్సిపాలిటీలలో బుధవారం కమిషనర్లు ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. 11న ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. 176 పోలింగ్ స్టేషన్లు నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పీఓలు 210, ఏపీఓలు 210, ఓపీవోలు 420 మందిని నియమించారు. బ్యాలెట్ బాక్స్లను 422 సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. అలాగే నాలుగు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు ఎంపిక చేశారు. వాటిలో ఏర్పాట్లు చేయనున్నారు. ప్రచారానికి ఆరు రోజులే.. ఫిబ్రవరి 3న విత్ డ్రాలు, అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో48 గంటలు(రెండు రోజుల) ముందే ప్రచారం బంద్ అవుతుంది. దీంతో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీంతో నాయకుల్లో ఆందోళన నెలకొంది.చేర్యాలలోని హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ చేర్యాల మున్సిపాలిటీ ఇరుకు భవనంలో కొనసాగుతుండటంతో నామినేషన్ల స్వీకరణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో స్థానిక పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీలు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ కార్యాలయాల్లోనే నామినేషన్లను స్వీకరించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు నాలుగు మున్సిపాలిటీలకు ఆర్వోలు 44, ఏఆర్వోలు 44 మందిని నియమించారు. వీరికి శిక్షణ సైతం పూర్తి అయింది. -
రక్షణ చట్టం తేవాల్సిందే
కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన హుస్నాబాద్: దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం విధులు బహిష్కరించి హుస్నాబాద్ కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, రక్షణ కరువైందన్నారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. విద్యుత్ సమస్యలా..? 1912కి ఫోన్ చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యుత్ సమస్యలుంటే విద్యుత్శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని డీఈ రామచంద్రయ్య మంగళవారం తెలిపారు. సిద్దిపేట డివిజన్లో ఎక్కడ సమస్యలున్నా.. కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా వినియోగదారులు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆయిల్పామ్ సాగుతో బోలెడు లాభాలు కొమురవెల్లి(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగుతో బోలెడు లాభాలు పొందవచ్చని, రైతులు సాగుకు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.సువర్ణ సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్లు అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే విధంగా కచ్చితమైన మార్కెట్ సదుపాయం ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డి, మండల ఉద్యాన అధికారిని కౌసల్య తదితరులు పాల్గొన్నారు. సెంట్రింగ్ పనులు బంద్గజ్వేల్రూరల్: సెంట్రింగ్ కార్మికులు తమకు గిట్టుబాటు కూలీ రావడం లేదంటూ ధరలను పెంచే వరకు పనులు బంద్ చేస్తున్నట్లు గజ్వేల్ సెంట్రింగ్ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కూలీ డబ్బులు గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాలను నెట్టుకురాలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సెంట్రింగ్ కార్మికులు హెల్త్ కార్డులు అందించాలని, కార్మికుల హక్కులు అమలయ్యేంతవరకు పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు వివిధ సెంట్రింగ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బృందావనంలో వేడుకలు వర్గల్(గజ్వేల్): నాచగిరి రాఘవేంద్ర బృందావనంలో మంగళవారం మధ్వనవమి వేడుకలు ఘనంగా జరిగా యి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామివారి సన్నిధిలో తెలంగాణ మధ్వమండలి ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు ఉదయం సుప్రభాతం, పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రవచనం, రథోత్సవం వైభవంగా చేపట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గాడిచర్ల మదన్మోహన్రావు, ఉపేందర్రావు, గోవర్ధన్రావు తదితర మధ్వమండలి ప్రతినిధులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బృందావనంలో భక్తిపారవశ్యం నెలకొంది. -
‘పుర’
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026సమరంమోగిన మున్సిపల్ ఎన్నికల నగారాఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. గతేడాది నుంచి ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికలకుసంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, 72 వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఓటరు తుది జాబితాను ఈ నెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూరి చేశారు. – సాక్షి, సిద్దిపేట -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
సిద్దిపేటకమాన్: వారంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని యూనియన్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట రీజినల్ సెక్రట రీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పలు బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కాలంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం వారానికి ఆరు రోజుల పనితో ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్యూలు, ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వారంలో ఐదు రోజుల పని అమల్లో ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇది అమలు కాకపోవడం అసమానత్వానికి నిదర్శనమన్నారు. ఐదు రోజుల పని దినాల అమలుతో ఉద్యోగుల వర్క్, లైఫ్ మెరుగుపడి ఆరోగ్యం, ఒత్తిడి లేకుండా వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందిస్తారన్నారు. వివిధ బ్యాంక్లకు చెందిన సుమారు 200మంది సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలోపాల్గొన్నారు. -
గులాబీ జెండా ఎగరాలి
● ప్రతి కార్యకర్త కష్టపడాలి ● హరీశ్రావు దిశానిర్దేశం ● బీఆర్ఎస్లో చేరిన రామాయంపేట కాంగ్రెస్ నేత సిద్దిపేటజోన్/సిద్దిపేటరూరల్/సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ నేత బాలు జొన్నల సోమవారం సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పిన హరీశ్.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల గూర్చి దిశానిర్దేశం చేశారు. కాగా, స్థానిక 43 వార్డుకు చెందిన యశోధకు రూ.2,75 లక్షలు, చిన్నకోడూర్ మండల కేంద్రానికి చెందిన పూజకు రూ లక్ష విలువైన ఎల్ఓసి అందించారు. అదేవిధంగా వివిధ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ లు ఆవిష్కరించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి తనిఖీ ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్ సేవలు మరింత మెరుగు పడాలని హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఐసీయూ, కేన్సర్ విభాగాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి రోజు అన్నం పెడుతున్నారా? సౌకర్యాలు మంచిగ ఉన్నాయా..? అని రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్రావు మాట్లాడుతూ.. చికిత్స కోసం వచ్చే రోగులకు మందులు బయటకు రాయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ చందర్, సీఎస్ఆర్ఎంఓ జ్యోతి, ఆర్ఎంఓ సదానందం, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హరీశ్రావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. మెడికల్ సీటు సాధిస్తే ఫీజు నేనే భరిస్తా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైద్య కళాశాలలో సీటు సాధిస్తే ఫీజులు తానే సొంతంగా భరిస్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని చింతమడక బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వచ్చే ఏడాదిలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లను 280కి పెంచుతామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన వారికి సొంతంగా ఐ ప్యాడ్ కొనిస్తానన్నారు. కాగా, జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మోత్కు లతా శంకర్, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు. -
గెలుపు గుర్రాల కోసం వేట
సర్వే నిర్వహిస్తున్న పార్టీలు ● చాలా వార్డుల్లో పోటీ తీవ్రం ● తలనొప్పిగా మారిన టికెట్ల కేటాయింపుదుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడటంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. నేడే, రేపో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థుల హడావిడి ఎక్కువైంది. ఇప్పటికే దుబ్బాక మున్సిపల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడమే కాక, గెలుపు గుర్రాల ఎంపికకు జోరుగా సర్వేలు చేపడుతున్నాయి. పార్టీల అధిష్టానాలకు తలనొప్పి దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో పలు వార్డుల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సైతం పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్లోని 20 వార్డులున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి ఇబ్బందిగా తయారైంది. వార్డుల వారీగా ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్న ఆయన... గెలిచే వారికే టికెట్ ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 82, కాంగ్రెస్ 67, బీజేపీ నుంచి 52 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్ బీసీ మహిళ కావడంతోనే.. మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కావడంతో ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు జనరల్ స్థానాల్లో సైతం మహిళలనే పోటీకి దింపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యధిక వార్డులు గెలుచుకొని చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలున్నాయి. మంత్రి వివేక్, చెరుకు శ్రీనివాస్రెడ్డి మున్సిపల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, క్యాడర్తో సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్లో తలనొప్పిగా తయారైన టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీలు ఎలా కేటాయిస్తాయో వేచి చూడాలి. -
● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విలువ చేసే ఉచిత బస్సు ప్రయాణం వినియోగం ● జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ హైమావతి ● పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ హైమావతి అన్నారు. పోలీసు కమిషనరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో రూ 299.78కోట్ల విలువైన ఉచిత ప్రయాణం పథకంలో 7.89 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ 77.56 కోట్లతో 26,481మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. 9 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల సాకా రం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంది రమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 13,057 మంజూరయ్యాని కలెక్టర్ తెలిపారు. వాటిలో 9,079 మంది ఇళ్లు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు 110 ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణం చేసుకున్న వారికి రూ183.39 కోట్లను అందించినట్లు వివరించారు. 1,79,860 మంది లబ్ధిదారులకు 7,53,962 సిలిండర్లను సబ్సిడీపై అందిచామన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ను 2,03,611 గృహాలకు రూ 140 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. రైతు భరోసా జిల్లాలో 2025–26 సంవత్సరం వానాకాలంలో మొత్తం 3.19 లక్షల మంది రైతులకు రూ 355 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేశామని హైమావతి పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద 2025–26 సంవత్సరానికి 275 మంది రైతుల నామినీ ఖాతాలలో రూ13.75 కోట్లను జమ చేశామన్నారు. యాసంగి సీజన్కు 81,787 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఆయిల్పామ్ సాగు విస్తరణ జరుగుతుందని తెలిపారు. నాబార్డు,. రాష్ట్ర ప్రణాళిక సహకారంతో రూ.83.76కోట్లతో 6,520 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా 19 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు. సేంద్రియ ఎరువులతో ఆదాయం పంచాయతీలలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తతో 90,875 కిలోల సేంద్రియ ఎరువును తయా రు చేయగా.. రూ3.26లక్షల ఆదాయం వచ్చి ందని కలెక్టర్ తెలిపారు. అలాగే 1,04,854 కిలోల పొడి చెత్త విక్రయంతో రూ 3,01,866 ఆదాయం గ్రామ పంచాయతీలకు లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 14,909 స్వయం సహాయక సంఘాలకు రూ886 కోట్లను బ్యాంకు రుణాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 10,080 సంఘాలకు రూ 839 కోట్ల రుణాలు అందించామని ఆమె వివరించారు. గ్రామైక్య సంఘాలకు భవనాలు జిల్లావ్యాప్తంగా 111 గ్రామైక్య సంఘ భవనాల నిర్మాణాలకు రూ11.10 కోట్లను మంజూరు చేసిన ట్లు హైమావతి తెలిపారు. 3,31,970 కుటుంబా లకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. వానాకాలంలో 3.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ 670 కోట్లతో 158.45 కి.మీ.ల రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయి. పీఆర్ శాఖ రూ73.66కోట్లతో 793 సీసీ రోడ్లు మంజూరు కాగా 722 పూర్తి కాగా ఇంకా 71 పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.కనువిప్పు కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.పోలీసుల గౌరవ వందనం సిద్దిపేటరూరల్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వ హించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హైమావతి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. అంతకుముందుకలెక్టర్కు పోలీసులు గౌరవ వందనం చేశారు. -
ఆకట్టుకున్న
ప్రదర్శనలు● అలరించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ ● ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాల అందజేతసిద్దిపేటకమాన్: జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరేడ్గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ కె.హైమావతి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు వెంకటాచారి, పద్మను పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్తో కలిసి కలెక్టర్ హైమావతి సన్మానించారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వేడుకల్లో గృహ నిర్మాణ సంస్థ ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్శాఖ గృహజ్యోతి, ఆర్టీసీ మహాలక్ష్మీ పథకం, రవాణశాఖ రోడ్డు భద్రత, వ్యవసాయశాఖ, డీఆర్డీఓ, ఉద్యాన పట్టుపరిశ్రమ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అటవీశాఖ, ఫైర్, ఫుడ్ అండ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ, లీడ్బ్యాంక్, క్రీడా శాఖ శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పరేడ్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు శాఖల స్టాళ్లను సీపీతో కలిసి కలెక్టర్ తిలకించారు. జిల్లాలోని వివిధశాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన 181 మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో ఇబ్బందులు పోలీసు కమిషనరేట్ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో వేడుకల్లో అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. సామన్య ప్రజలు మాత్రం హాజరు కాలేకపోయారు. వేడుకల్లో పాల్గొనడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేట్ ఆటోలలో పరిమితికి మించి తరలించారు. జిల్లా కేంద్రంలోనే వేడుకలు నిర్వ హించాలని పలువురు కోరుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, విద్యాసాగర్, శ్రీధర్గౌడ్, శ్రీను, లతీఫ్, ప్రవీణ్కుమార్, సైదా, రామకృష్ణ, ఆర్డీఓలు, తహాసీల్దార్ హరికిరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును
హుస్నాబాద్ మున్సిపల్పై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఈ ప్రధాన పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని పార్టీలు సీట్లు సర్దుబాటు చేస్తూ గెలిచే అవకాశాలున్న వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. – హుస్నాబాద్ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో ఆశావహులు పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు కలియదిరుగుతున్నారు. ఏ పార్టీ గుర్తు వచ్చినా పోటీ చేయడం ఖాయమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలకు కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్యానెల్ కోసం వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థుల వివరాలను పార్టీ నాయకులు మంత్రికి సమర్పించారు. మార్పులు, చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. మరోవైపు చేరికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు మంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. వారు రేపో మాపో మంచి ముహూర్తం చూసుకుని చేరనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడేవారిని తమ పార్టీల్లోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బండి సంజయ్ ప్రచారం.. హుస్నాబాద్ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. ఈసారి అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు అభ్యర్థుల కోసం ఆయన వేట ప్రారంభించారు. ఇదిలా ఉండగా బీజేపీలో వర్గాల కుంపటిపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వర్గపోరుకు స్వస్తి పలికి కార్యకర్తలను ఏకతాటిపై తేస్తేనే గానీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లను సాధించే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అగ్రనేతల ప్రచారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఏకై క హుస్నాబాద్ మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ, మూడోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. -
జెండావిష్కరణ చేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే, బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ల్లో అధికారులు జెండా వందనం చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఆపరేషన్ సింధూర్లో భాగమైన వివిధ రకాల రాకెట్స్లు, భారత వ్యోమగామిలను శకటాల రూపంలో ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు. బహుమతులు ప్రదానంసిద్దిపేటకమాన్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డేను పురస్కరించుకుని న్యాయ విద్యార్థులకు వ్యాసరచన, రీల్స్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలు నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాధన, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయసేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నేతలతోనే పట్టణాభివృద్ధి సాధ్యం నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణహుస్నాబాద్: గత ఎమ్మెల్యేలు దేశిని చిన్నమల్లయ్య, చాడ వెంకట్రెడ్డిల హయాంలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ అన్నారు. అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, విద్యుత్ సౌకర్యం, ఎస్బీఐ బ్యాంక్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయించిన ఘనత వారికే దక్కిందని గుర్తుచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లోను తమ అభ్యర్థులను నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లేశ్, నాయకులు సంజీవరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జెండా తలకిందులు!
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతిదుబ్బాక: పట్టణంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు, అక్కడున్న వారు గమనించి జెండాను కిందికి దింపి సరిచేశారు. అనంతరం మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సంఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏం చేయడం లేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను వారించి ఎమ్మెల్యేను పంపించారు. జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఓటు.. బ్రహ్మాస్త్రం
జిల్లాలో 9.94లక్షల మంది ఓటర్లు ● నూతనంగా పొందిన వారు 24వేల మంది ● నేడు జాతీయ ఓటరు దినోత్సవం సాక్షి, సిద్దిపేట: ఓటు అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కోరుకున్న పాలనను తెచ్చుకోవచ్చు. మంచి నాయకులను ఎన్నుకోవచ్చు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలు చేపడుతున్నా 90శాతానికి పోలింగ్ చేరడం లేదు. గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ ఓటర్లే వెనుకంజ వేస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం.. అసెంబ్లీలోనే ఎక్కువ గత శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ నమోదును పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో 83.05 శాతం, లోక్సభ ఎన్నికల్లో 78.32శాతం, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.29శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతివలే అధికం జిల్లాలో అతివలే అధికంగా ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9,94,786 ఓటర్లున్నారు. అందులో పురుషులు 4,86,221, మహిళలు 5,08,480, ఇతరులు 85 మంది ఉన్నారు. వీరిలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారు 24,183 ఉండగా అందులో పురుషులు 14,267, మహిళలు 9,915, ఇతరులు ఒకరు ఉన్నారు.కలెక్టర్కు అవార్డు ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. అందులో ఉత్తమ ఎన్నికల సాధన అవార్డుకు కలెక్టర్ హైమావతి, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పని చేసిన గరీమా అగర్వాల్ (ప్రస్తుత సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్), బెస్ట్ బీఎల్ఓగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 185 పోలింగ్ స్టేషన్ బీఎల్ఓ పుష్పలత ఎంపికయ్యారు. వీరు ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 1,25,004 1,30,203 09 2,55216సిద్దిపేట 1,19,001 1,24,226 70 2,43,297దుబ్బాక 99,193 1,05,537 01 2,04,731గజ్వేల్ 1,43,023 1,48,514 05 2,91,542 -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
కలెక్టర్ హైమావతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో 5 రోజుల పాటుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. అనంతరం మహిళా రైతులకు ధ్రువపత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమన్నారు. శిక్షణ కార్యక్రమంలో జీవామృతం, బీజామృతం, దశపర్ణి కషాయం, ఐదు పొరల సాగు నమూనా, వామ్, ట్రైకోడెర్మా తయారీ విధానాలపై కషి సఖిలకు సమగ్ర శిక్షణ అందించామని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ అధికారి మైథిలి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కక్షగట్టి 20 కేసులు పెట్టించిండ్రు
దుబ్బాక: ‘రాజకీయంగా భిక్షపెట్టిన ఈ గడ్డపై నాకున్న ప్రేమ.. ప్రభాకర్రెడ్డికి ఉందా?, దుబ్బాక ఉప ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా గెలిచాక కక్షగట్టి నాపై 20 కేసులు పెట్టించారని, అయినా భయపడలేదని, తెగించి ధైర్యంగా ఎదుర్కొన్నా’నని ఎంపీ మాధవనేని రఘునందన్రావు తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని 15, 16, 19, 20 వార్డులలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి గెలిచి దుబ్బాకకు ఏం చేశారని, ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్లో గెలిస్తే మళ్లీ పరాయి పెత్తనం కింద ఉంటుందని అందుకే ఈ సారి బీజేపీకి పట్టం కట్టలన్నారు. దుబ్బాకపై సిద్దిపేట పెత్తనం ఎందుకని మొదటి నుంచి తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి చెందలేదని, రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను తాను ఛాలెంజ్గా తీసుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆధారాలున్నా అరెస్ట్ చేయరేం ● ఫోన్ ట్యాపింగ్లో స్పష్టమైన ఆధారాలున్నా ప్రభుత్వం, సిట్ ఏం చేస్తుందని, ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ఎంపీ ప్రశ్నించారు. ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క బీఆర్ఎస్ నాయకుడి అవినీతిని వెలికితీసింది లేదు.. అరెస్ట్ చేసింది లేదన్నారు. ● బావ, బామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్కు చేతకాకపోతే వచ్చేది మేమే అప్పుడు తప్పకుండా చూస్తామంటూ రఘునందన్రావు అన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఏసీపీ రవీందర్రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాలల విద్యార్థులు సిద్దిపేట పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదన్నారు. అనంతరం పిల్లలతో రహదారి భద్రత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్రెడ్డి, పోలీసు, రవాణశాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఏసీపీ రవీందర్రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ -
ఢీ
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026మున్సిపాలిటీల్లో పొలిటికల్ స్పీడ్శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కాంగ్రెస్ రాజకీయ వేసాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మున్సిపాలిటీల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుండటంతో బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇలా మూడు పార్టీలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. జోరు పెంచిన కారు మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే హుస్నాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. చేర్యాల పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ బాకీ కార్డులను ప్రజలకు అందిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దుబ్బాక పట్టణంలో సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ప్రతాప్ రెడ్డి, రాధకృష్ణ శర్మలు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విజయసంకల్ప సభలతో.. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో విజయసంకల్ప సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అలాగే దుబ్బాక పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాదవనేని రఘునందన్రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్లు నిర్వహించారు. మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక కోసం త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు.అభివృద్ధి పనులతో.. పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముందస్తుగానే పలు ప్రారంభోత్సవాలను ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్లు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వీబీ జీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. -
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి(సిద్దిపేట): గ్రామాలలో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తోటపల్లి, బెజ్జంకి క్రాసింగ్, పోతారం, రేగులపల్లె తదితర గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంస్థాపన చేశారు. పోతారంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్ల సమస్య పరిష్కారానికి సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మిర్చి సాగు లాభదాయకం చిన్నకోడూరు(సిద్దిపేట): మిర్చి సాగు లాభదాయకమని, రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని గంగాపూర్లో మిర్చి మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటలు కాకుండా కూరగాయలు, మిర్చి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిర్చి మార్కెట్లో విక్రయించాలన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ ిసద్దిపేటరూరల్: చేనేత కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వృత్తిపరమైన పరికరాలు, ముడిసరుకు కొనుగోలు నిమిత్తం వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేశారన్నారు. జిల్లాలోని ఏడుగురి కార్మికులకు చెందిన రూ.5 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నేడు సామూహికసూర్య నమస్కారాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): రథసప్తమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్రోడ్లో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6.15 నుంచి 7.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. -
విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లు
ఎన్నికల నిర్వహణ, ఓటింగ్, కౌంటింగ్పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మాక్ పోలింగ్ చేపట్టారు. విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లుగా పాల్గొని ప్రత్యక్ష అనుభూతిని పొందా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులే అన్ని తామై విజయవంతం చేశారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల ప్రక్రియ లాగే చేపట్టారు. ఎలక్షన్ కమిషనర్, పోలింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్, పోలింగ్ సిబ్బంది విధులను విద్యార్థులే నిర్వర్తించారు. ఎన్సీసీ విద్యార్థులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికలు ఏ విధంగాజరుగుతాయో ఈ మాక్ పోలింగ్ ద్వారా తెలిసిందన్నారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులుబడిలో మాక్ పోలింగ్ భళా -
అభివృద్ధికి బాటలు వేస్తాం
సిద్దిపేటఅర్బన్: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని సర్పంచ్లు అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి దశలో కోహెడ, కొమురవెల్లి, నారాయణరావుపేట, చిన్నకోడూరు, దుబ్బాక మండలాలకు చెందిన 98 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణకు హాజరైన సర్పంచ్లను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారని, గ్రామాన్ని అభివృద్ది చేసుకోవడానికి అవసరమైన నిధులను ఎలా సమీకరించుకోవాలి? నిధులను ఎలా ఖర్చు చేయాలి? అనే అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగిందని వారు అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పరిపాలనలో ఉపయోగించి తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహిళా సాధికారతకు కృషి గ్రామంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తా. గ్రామ సభ ఆదర్శంగా ఉండేలా నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా. వీధి లైట్ల అన్నింటిని సోలార్ విద్యుత్తో నడిచేలా మారుస్తాం. – ఆకుల స్వప్న, సర్పంచ్, గుర్రాలగొందిపాలనపై పట్టు పెరిగింది శిక్షణలో తెలిసిన అంశాలతో గ్రామ పాలనపై పట్టుపెరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తా. – సురగోని శేఖర్, సర్పంచ్, చంద్లాపూర్ -
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
విద్యాధరి.. అక్షర ఝరివర్గల్(గజ్వేల్): స్వర్ణకిరీటాది సర్వాభరణాలతో విద్యాసరస్వతిదేవి దర్శనం.. పోటెత్తిన భక్తజనం.. చిన్నారుల అక్షరాభ్యాసాలు.. అభిషేకాలు, అర్చనలు, పారాయణాలు, పుష్పార్చనలతో వర్గల్ క్షేత్రం వసంతోత్సవ సిరితో అలరారింది. శుక్రవారం వసంత పంచమి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున పుష్పగిరి పీఠాధిపతి అమ్మవారి విశేషాభిషేకం నిర్వహించగా, చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అర్చక పరివారం సరస్వతిమాతకు లక్ష పుష్పార్చన, చెప్పన్భోగ్ మహా నివేదనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సకల విద్యలకు మూలమైన విద్యాసరస్వతి అమ్మవారు స్వర్ణ కిరీటాది విశేషాభరణాలతో దివ్యదర్శనమిచ్చారు. ప్రముఖుల సందర్శన వర్గల్ క్షేత్రాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ హైమావతి, సీపీ రశ్మీ పెరుమాళ్, ఏసీపీ నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దాదాపు 60వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 6వేల వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. రోజంతా క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.కలెక్టర్ ప్రత్యేక పూజలు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. కలెక్టర్ హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో క్షేత్రం మార్మోగింది.వర్గల్ క్షేత్రంలో వసంతోత్సవ సిరి దేవీనామంతో మార్మోగిన శంభుగిరులు వెల్లువగా చిన్నారుల అక్షరాభ్యాసాలు పోటెత్తిన భక్తులు -
రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: రక్తదానంతో అత్యవసర సమయాల్లో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆపన్నహస్త మిత్రబృందం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రక్తాన్ని దానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందన్నారు. శిబిరంలో రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్ సహకారంతో 277 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుస్తక పఠనం ఎంతో మేలుజిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ములుగు(గజ్వేల్): గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకుని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ్భాస్కర్రెడ్డి, సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి, పాఠశాల హెచ్ఎం గీత తదితరులు పాల్గొన్నారు. పంటలు పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు సిద్దిపేటరూరల్: రాజేంద్రనగర్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పలు పంటలను పరిశీలించారు. బుస్సాపూర్లో మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటకు కత్తెర పురుగు ఆశించినందున నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 80గ్రాములు, లీటర్ వేప నూనె కలిపి ఎకరానికి పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తలు చంద్రమోహన్, భద్రు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండిహుస్నాబాద్రూరల్: మహిళా గ్రామైక్య భవనాల పనులను సర్పంచ్లు త్వరగా పూర్తి చేయాలని ఏపీఎం తిరుపతి అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్, రాములపల్లి గ్రామాల్లో గ్రామైక్య సంఘాల భవనాల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని, వ్యాపారంలో ప్రోత్సహించడానికి వడ్డీ లేని రుణాలను సైతం అందిస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొంది పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు తిరుమల, పద్మలు పాల్గొన్నారు. -
ఏర్పాట్ల జోరు
పుర పోరు..జిల్లాలో నాలుగు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే వార్డులు, చైర్మన్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో)లకు శిక్షణ ఇవ్వనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ పత్రాల స్వీకరణ కోసం రెండు వార్డులకు కలిపి ఒక చోట నామినేషన్ స్వీకరణ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 49 ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమించారు. వీటిలోనే 20శాతం అధికారులను రిజర్వులో ఉంచనున్నారు. ఇప్పటికే అధికారులకు ఆర్వో, ఏఆర్వోలకు సంబంధించి ఆర్డర్లను పంపించారు. 176 పోలింగ్ కేంద్రాలు నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 198 బ్యాలెట్ బాక్స్లు అవసరం ఉంటాయని ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే డీపీఓకు లేఖలు అందించారు. దీంతో వాటిని మరమ్మతులు, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు. త్వరలో వాటిని ఆయా మున్సిపాలిటీలు తీసుకవెళ్లనున్నాయి. బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచేందుకు, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. చేర్యాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, హుస్నాబాద్లో తెలంగాణ మోడల్ స్కూల్, దుబ్బాకలో లచ్చపేట మోడల్ స్కూల్, గజ్వేల్లో బాలికల ఎడ్యుకేషన్ హబ్లలో ఏర్పాటు చేయనున్నారు. 13మంది నోడల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13 మంది నోడల్ అధికారుల నియమించారు. మ్యాన్పవర్ మేనేజ్మెంట్, వెబ్క్యాస్టింగ్, కోడ్ అమలు, సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ట్రాన్స్పోర్ట్, శిక్షణ నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఖర్చులు, పరిశీలకులు, మీడియా కమ్యూనికేషన్, నివేదికల తయారీ తదితర సంబంధించి 13 మందిని నియమించారు. వారికి బాధ్యతలను అప్పగించనున్నారు.మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ కేంద్రాల సంఖ్య చేర్యాల 12 24దుబ్బాక 20 41హుస్నాబాద్ 20 40గజ్వేల్ 20 71పకడ్బందీ చర్యలు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. పకడ్బందీ చర్యలు చేపట్టాం. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నాం. హుస్నాబాద్లో మోడల్ స్కూల్ కౌంటింగ్, స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశాం. – మల్లికార్జున్, కమిషనర్, పురపాలక సంఘం, హుస్నాబాద్సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర
గజ్వేల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర సాగిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్ మండలం దాచారంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిలతో కలిసి ఉపాధి హామీ కూలీలు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన 60శాతం నిధుల్లో కోత విధించే కుట్రలో భాగంగానే.. ఈ పథకానికి ‘వీబీ జీరామ్జీ’ పేరును మార్చారని మండిపడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై భారాన్ని మోపాలని చూస్తున్నదని చెప్పారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను సైతం కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. దేశంలో కూలీలు ఉపాధిలేక అల్లాడుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం కామన్ మినీమమ్ ప్రోగ్రామ్లో భాగంగా.. మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి మహత్తర పథకంపై కుట్రలను సహించేదీలేదన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధికూలీలు ఈ పథకం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారి హక్కులను కాపాడటానికి పోరాటాన్ని ముమ్మరం చేస్తామన్నారు. జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాల్సిందే చిన్నకోడూరు(సిద్దిపేట): పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జీ రామ్ జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కూలీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి పేదలపై, గ్రామ పంచాయతీల అభివృద్ధిపై చిత్త శుద్ధిలేదన్నారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వాగ్వాదం.. తోపులాట పార్టీ మండల అధ్యక్షుడికే సమావేశం గురించి సమాచారం ఇవ్వలేదంటూ మీసం మహేందర్ తన అనుచరులతో కలిసి సచిన్ సావత్కు వివరించారు. దీంతో మరో వర్గం నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. -
వార్డులు పెరగకపాయే.. ఖర్చు పెరగవట్టే
● పార్టీల నాయకత్వంలోనూ టెన్షన్ ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నేతల పరిస్థితి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగకపోవడం ఆశావహులను టెన్షన్కు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్కో వార్డులో 1400లోపు మాత్రమే ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 2400కుపైగా చేరుకుంది. ఫలితంగా ప్రచారానికి ఎక్కువగా శ్రమించాల్సిరావడం, ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలు విలీనమైన తర్వాత ఓటర్ల సంఖ్య 46,740కు చేరింది. ఇందులో మహిళలు 24,001 ఉండగా, పురుషులు 22,738మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. నిర్వాసిత గ్రామాలకు చెందిన ఓట్లే 14వేలపైచిలుకు ఓట్లు కొత్తగా కలిశాయి. దీని తర్వాత వార్డుల సంఖ్య 30కిచేరుకుంటాయని అంతా భావించారు. కానీ గతంలో ఉన్న 20వార్డుల్లోనే కొత్త ఓట్లు సర్దుబాటు చేసిన సంగతి తెల్సిందే. దీనివల్ల గత ఎన్నికల సందర్భంగా ఒక్కో వార్డులో 1,400 వరకు ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం ఈ సంఖ్య 2,400కుపైగా చేరుకున్నది. మరోవైపు వార్డుల పరిధి కూడా పెరిగింది. ఒక్కో వార్డును ఒక చోట కాకుండా, భౌగోళికంగా దూరంగా ఉన్నా కాలనీలను కలిపిన సంగతీ తెల్సిందే. దీనివల్ల బరిలో ఉండే అభ్యర్థులకు ప్రచారానికి శ్రమపెరిగే అవకాశం. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే ఖర్చు భారీగా పెరగనున్నది. దీనివల్ల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. నిర్వాసిత గ్రామాల్లో.. ఇకపోతే మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీలో మరో రకమైన పరిస్థితి నెలకొంది. తమకు కొత్తగా పది వార్డులు ఇస్తారనుకుంటే.. వార్డుల్లోనే తమను సర్దుబాటు చేశారనే నిరుత్సాహాంలో నిర్వాసితులు ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వారికి కేటాయించిన 7, 8, 9, 10, 11, 12వార్డుల్లో నిర్వాసిత గ్రా మాలకు చెందిన వారే పోటీలో ఉండాలని, స్థానికేతరులకు మద్దతు పలకవద్దని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితి వల్ల ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వీరి పాత్రే కీలకంగా మార నుంది. కొన్ని వార్డుల్లో ప్రజల్లో పేరున్న ఆశావహులు సైతం ఓటర్ల సంఖ్య పెరగడం, ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో పోటీకి విముఖత చూపుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రధాన పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదు. ఫలితంగా ఆ పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఎవరికై తే వార్డుల్లో మంచి పేరు ఉండి గెలిచే అవకాశాలున్నాయో...వారి ఇళ్ల వద్దకు వెళ్లి పోటీచేయాలంటూ బతిమాలుతున్నారు. ఖర్చు సంగతి మేం చూసుకుంటామంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయకుల మాటలను నమ్మడం లేదు. పోటీ చేయడానికి వెనకంజ వేస్తున్నారు. ముందుగా డబ్బులు సర్దుబాటు చేస్తామని చెప్పి.. తర్వాత తమను ఆగం చేస్తారని భయపడుతున్నారు. ఈ పరిిస్థితి పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీల నాయకత్వం కూడా తలలు పట్టుకుంటున్నది. కొద్ది రోజుల తర్వాత మార్పులు ఏమైనా ఉంటాయా..? అనేది వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒరిగిందేమీలేదన్నారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కొత్త పనులు రాకపోగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.180కోట్ల నిధులను రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ చొరవ వల్లే గజ్వేల్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని చెప్పారు. ప్రత్యేకించి స్థానిక మున్సిపాలిటీ రాష్ట్రానికే నమునాగా మారిందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులను గెలిపిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మెనూ కచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ హైమావతి ● తిమ్మాపూర్లో మధ్యాహ్న భోజనం పరిశీలన గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును గురువారం కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం జగదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ను వేగం చేయాలి కొండపాక(గజ్వేల్): ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగం చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొండపాకలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ తీరును గురువారం పరిశీలించారు. పనుల నత్తనడకపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ త్వరలో 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఆయా వార్డుల వారీగా జీసీఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓల పనితీరును ఎప్పటికప్పుడు తహసిల్దార్ పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు చేసుకోవాలన్నారు. ఏరోజుకారోజు మ్యాపింగ్ వివరాలను అప్లోడ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, ఆర్ఐ బాలకిషన్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
బడిపాట్లు.. సర్కస్ ఫీట్లు
పాఠశాల విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన బస్సు సౌకర్యంలేక నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. అందరూ చదుకోవాలన్నది సర్కారు లక్ష్యం. కానీ అందుకు తగ్గ మౌలిక వసతులు లేక విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించాలంటే బాలబాలికలు నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే వీరి కష్టాలు రెట్టింపవుతుంటాయి. మరోవైపు నలుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 15 మంది చిన్నారులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 82 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ఒకవేళ ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లే వేళ.. ఇంటికి వచ్చే సమయంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. 6 తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు కోవాలంటే నడక కష్టాలు తప్పడంలేదు. ఆటోల్లో నిత్యం 2,710 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండటం గమనార్హం. చాలా రూట్లలో రద్దీ తగ్గట్లు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్బోర్డులపై ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తోంది. నిత్యం బడులకు ఆటోల్లో: 2,560 మంది టాటా మ్యాజిక్: 150 మంది విద్యార్థులు నర్సింహుల పల్లె నుంచి ఆటోలో వెళ్తున్న విద్యార్థులు ఆటోల్లో డ్రైవర్ సీటుకు అటు, ఇటు, లోపల ఖాళీ లేకుండా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నిబంధనలు పాటించడంలేదు. ఏదైన ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే తల్లిదండ్రులు ముందే మేల్కొవాలి. స్కూల్ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు. రోజూ కిలోమీటర్లమేర నడక జిల్లాలో 82 గ్రామాలకు బస్సులే లేవు చాలా చోట్ల ఆటోలే దిక్కు ప్రమాదం అంచున ప్రయాణాలు 2,710 మంది విద్యార్థులు ఆటోల్లోనే స్కూళ్లకు.. వెలుగు చూసిన వాస్తవాలు గజ్వేల్ రూరల్: గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్డు మార్గంలో గల బాలుర ఎడ్యుకేషన్ హబ్ లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ హబ్లో 6 తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారుగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. గజ్వేల్ పట్టణం నుంచి దాదాపు 3 కిలో మీటర్లు ఉంటుంది. చాలా మంది ఆటోలలో వస్తుండగా ఆర్థిక స్తోమతలేని విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంకొందరు ఆ రోడ్డు మార్గం గుండా వచ్చే వాహనాల వారిని లిఫ్ట్ అడుగుతుంటారు. ఇలా ఇబ్బందులు పడు తూ పాఠశాలకు.. ఇంటికి చేరుకుంటున్నారు. ఒకే ఆటోలో 15 మందికిపైగా.. అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో వస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మహారాజ్ తండా, బంజారాహిల్స్ తండా, బొడిగెపల్లిలకు ఆటోలలో విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఒకరి మీద ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్నారు. బెజ్జంకి(సిద్దిపేట): నర్సింహుల పల్లె, వడ్లూరు, తలారివానిపల్లె గ్రామాలకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు లిఫ్ట్ అడగడం, లేక ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. కొందరు సైకిళ్లపై వెళ్లి వస్తున్నారు. తప్పని నడక మిరుదొడ్డి(దుబ్బాక): మోడల్ స్కూల్ విద్యార్థులను సాయంత్రం 4.15 గంటలకు బడి విడిచి పెడితే రాత్రి 7 గంటల వరకు బస్స్టాప్ వద్దనే పడి గాపులు కాయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సరికి రాత్రి 8 గంటలు దాటుతోందని వాపోతున్నారు. బరువున్న పుస్తకాల బ్యాగుతో నడక సాగించాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఆటోలోనే.. గౌరవెల్లి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. మాది బంజారాహిల్స్ తండా. తండాకు బస్సు లేకపోవడంతో రోజూ ఆటోలో వెళ్లి వస్తున్నా. ఉదయం, సాయంత్రం సమయాల్లో మా తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. –నిరంజన్, 6వ తరగతి అన్ని రూట్లలోనూ బస్సులు తిప్పుతాం సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ డిపో పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నాం. కరోనా వేళ రద్దయిన గ్రామాలకు విద్యార్థుల వినతి మేరకు బస్సులను తిప్పుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని అదనపు ట్రిప్పులు కూడా ఏర్పాటు చేస్తాం. – భవభూతి, ఆర్టీసీ డీఎం -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఖజానాకు 23రోజులలో హుండీల ద్వారా రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం హుండీల కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలితసేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,01,24,258 రాగా, విదేశి కరెన్సీ 30, మిశ్రమ బంగారం 050 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రత అందరి బాధ్యత
సీపీ రష్మి పెరుమాళ్ తొగుట(దుబ్బాక): రహదారి భద్రతను ప్రతి ఒక్కరి బాధ్యత అని సీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. మండల పరిధిలోని పెద్దమాసాన్ పల్లిలో గురువారం ‘అరైవ్ అలైవ్’అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్రెడ్డి సౌజన్యంతో 100 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. గ్రామస్తులతో నేరుగా ముచ్చటించారు. రహదారి భద్రతపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటిస్తేనే విలువైన ప్రాణాలు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మార్కండేయుడి కృప అందరిపై ఉండాలి
దుబ్బాక: మార్కండేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో మార్కండేయ జయంతిని పద్మశాలి సమాజం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలి సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి సమాజం అధ్యక్షుడు జిందం గాలయ్య, యువజన సంఘం అధ్యక్షుడు నరేశ్తో పాటు కులపెద్దలు తదితరులు ఉన్నారు. -
వసంత పంచమికి సన్నాహాలు
● విద్యాధరిలో విస్తృత ఏర్పాట్లు ● వర్గల్కు పోటెత్తనున్న భక్తజనం ● ప్రత్యేక క్యూలైన్లు, ప్రాంగణంలో టెంట్లువర్గల్(గజ్వేల్): వసంత పంచమి వేళ సుప్రసిద్ధ వర్గల్ క్షేత్రానికి భక్తులు పోటెత్తనున్నారు. శుక్రవారం ఈ మహోత్సవం సందర్భంగా క్షేత్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా విశాలమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వేడిమికి ఆస్కారం లేకుండా క్యూలైన్ మార్గంలోనూ నీడనిచ్చే ఏర్పాట్లు చేపట్టారు. క్షేత్రానికి దాదాపు 50 వేల మంది భక్తులు వస్తారని, అదే స్థాయిలో 10,000 పైగా చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయనే అంచనాలతో నాలుగు చోట్ల అక్షరాభ్యాస మండపాలు సిద్ధం చేస్తున్నారు. బారికేడ్లు, వాహనాల పార్కింగ్, పర్యవేక్షణకు రెండు చెక్పోస్టులు, క్షేత్రంలో కాంతిమంతంగా లైట్లు, ఆలయానికి రంగురంగుల దీపాల వరుసలు, స్వాగత తోరణాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్గల్ క్షేత్రం సందర్శించిన ఏసీపీ వసంత పంచమి మహోత్సవం పురస్కరించుకుని భక్తుల తాకిడి దృష్ట్య గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, రూరల్ సీఐ రవిరాజు, ఎస్ఐ కరుణాకర్రెడ్డి వర్గల్ క్షేత్రం సందర్శించారు. అక్కడ పార్కింగ్ స్థలం, క్యూలైన్లు, చెక్పోస్టు ఏర్పాటు తదితర అంశాలను ఆలయ వర్గాలతో సమీక్షించారు. కాగా క్షేత్రంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో శ్రీపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి భక్తునికి మహాప్రసాదం (అన్నదానం) అందేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షేత్రానికి ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం శ్రీపంచమి మహోత్సవ వేడుకలు భక్తులు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
నిబంధనలే ముఖ్యం.. సీపీ సందేశం
‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది.. గాలి పటం ఎగురవేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అలాగే వాహనాలు నడిపే వేళ అంతే ఏకాగ్రతతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలి’ అని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ సందేశం ఇచ్చారు. బుధవారం పోలీసు కమిషనరేట్ పరేడ్ మైదానంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కై ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి సీపీ గాలి పటాలను ఎగురవేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కుషాల్కర్, సుభాష్ చంద్రబోస్, అన్ని డివిజన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. – సిద్దిపేటకమాన్ -
ప్రాక్టికల్స్కు హాజరు తప్పనిసరి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలను రాయాలని, గైర్హాజరైతే ఫెయిల్గా పరిగణిస్తారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. బుధవారం ప్రారంభం అయిన ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని దీక్ష కళాశాల, న్యూజనరేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లలో జరుగుతున్న ప్రాక్టికల్స్ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, 23న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుందని, 24న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్కు 9,946 మంది ఫస్టియర్ విద్యార్థులకు 99శాతం మంది హాజరైనట్లు చెప్పారు. డీఐఈఓ రవీందర్రెడ్డి -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్ విద్యార్థులతో బ్యాంక్ అధికారులు, ఉపాధ్యాయ బృందంసిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమ్మూ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేలా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రాణించాలంటే ఆర్థిక అక్షరాస్యత అవసరమన్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో ఫైనాన్షియల్ లిటరసీతో పాటుగా డిజిటల్ లిటరసీపై అవగాహన పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, సర్పంచ్ లతాశంకర్, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
పుల్లూరు జాతరలో వినూత్నం
సాక్షి, సిద్దిపేట: పుల్లూరు జాతరలో భక్తి అఖండం.. ఇక్కడ గురిగీలే ప్రధానం. గురిగిలో నూనె తీసుకెళ్లి అంఖడ దీపం వెలిగించి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆనవాయితీ 800 ఏళ్లుగా వస్తుండటం విశేషం. సాధారణంగా ఏ దేవాలయమైనా అఖండ దీపానికి నూనె పావులతో పోస్తుంటారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో ప్రసిద్ధిచెందిన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో నూనెను చిన్న గురిగిలో తీసుకువచ్చి అఖండ దీపంలో పోస్తుంటారు. పుల్లూరు బండజాతరకు భక్తులు జిల్లా నుంచే కాకుండా సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత చిన్న గురిగిలో నూనె తీసుకవెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అఖండ దీపంలో పోయడం ఏళ్లుగా భక్తులు ఆచరిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన గురిగిని నూనె తో కలిపి రూ.20లకు విక్రయిస్తున్నారు. భక్తు లు కొనుగోలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కాగా బుధవారంతో జాతర ముగిసింది. -
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్రూరల్: గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని వర్గల్ (ప్రజ్ఞాపూర్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యాసంవత్సరానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ స్కూళ్లలో..ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో, 7 నుంచి 10 వరకు మిగిలిన సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు దగ్గరిలోని మోడల్ స్కూల్ను సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయండి: డీఈఓదుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం పధ్మనాభునిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని 110 మంది విద్యార్థులకు హెచ్ఎం పెద్ది మల్లికార్జున్ రూ.40 వేల తన సొంత ఖర్చులతో క్రీడాదుస్తులను డీఈఓ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు ెపేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అలాగే దుబ్బాక మున్సిపల్లోని చేర్వాపూర్ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఇష్టంతో చదవండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి సాంఘిక శాస్త్ర ఫోరం ప్రతినిధులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సాంఘికశాస్త్ర ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్రావు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మల్టిపర్పస్ ఉన్నత పాఠశాలలో జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశాంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్లలో మార్కులు సాధించినపుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినేటర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ కోరారు. ఈ మేరకు బుధవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 26న గణతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు, గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రీ షెడ్యూల్ చేయాలని కోరామన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
గజ్వేల్రూరల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల జీపీపీ ఆర్టీసీ డిపో ఎదుట పోస్టు కార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ 300 మందికిపైగా కార్మికులు గవర్నర్కు పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీపీపీ ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ జక్కుల నర్సింహులు, కన్వీనర్ రాజయ్య, ప్రచార కార్యదర్శి బీఎస్రెడ్డి, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.గవర్నర్కు పోస్టుకార్డులు పంపిన కార్మికులు -
సౌరశక్తితో స్వయం సమృద్ధి సాధ్యం
● టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రవీందర్ చౌహన్ ● మోడల్ సోలార్ గ్రామంగా రామవరం ఎంపికఅక్కన్నపేట(హుస్నాబాద్): సౌరశక్తి వినియోగం ద్వారా గ్రామాలు విద్యుత్ స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో) జిల్లా మేనేజర్ లావుడ్య రవీందర్ చౌహన్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సౌరశక్తి వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముస్త్ బిజిలీ యోజన(పీఎంఎస్ఎంబీవై) పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రామవరం గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్ను నెట్మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తే వినియోగదారులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బానోతు జయరాం, ఎంపీఓ శివనగేష్, సర్పంచ్ బొమ్మ శైశ్రీలం, పంచాయతీ కార్యదర్శి రాము, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
‘పట్నం వారం’ ఆదాయం రూ.75లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నం వారం (మొదటి ఆదివారం) పురస్కరించుకుని మూడు రోజుల ఆదాయం రూ.75,81,241 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం తదితర ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది పట్నం వారానికి రూ.61,81,228 సమకూరగా.. ఈసారి రూ.14లక్షలు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారి మాధవి తెలిపారు. పొట్లపల్లిలో నాగ బోనం శిల్పంహుస్నాబాద్ రూరల్: మండల పరిధి పొట్లపల్లి సమ్మక్కల గద్దెల వద్ద తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ నాగ బోనం శిల్పాన్ని గుర్తించారు. మంగళవారం పొట్లపల్లిలో సమ్మక్క గద్దెల ప్రాంతంలోని శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనం ఎత్తడం పోచమ్మ, కాటమయ్యలకే కాకుండా నాగ బోనాలు కూడా ఉంటాయని ఈ శిల్పాల ద్వారా తెలుస్తోందన్నారు. నాగ శిల్పాలు రాష్ట్రకూటుల కాలం నాటివిగా చర్రిత కారులు చెబుతున్నారని తెలిపారు. -
హుస్నాబాద్కు కొత్త సొబగులు
● సుందరీకరణ దిశగా పట్టణం ● డివైడర్ల మధ్య క్రీడాకారుల విగ్రహాలు ● మరింత వన్నె తెచ్చేలా ఏర్పాట్లుహుస్నాబాద్: సుందరీకరణలో భాగంగా పట్టణానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని నేషనల్ హైవే రోడ్లో మల్లెచెట్టు చౌరస్తా వరకు వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొందరలోనే అంబేడ్కర్ చౌరస్తా నుంచి పోతారం (ఎస్) వరకు సూర్య నమస్కారాలు, యోగాసనాల విగ్రహాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. విగ్రహాలను సిరిసిల్ల నుంచి తెస్తున్నారు. రూ.80 లక్షల వ్యయంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, హాకి, రన్నింగ్ క్రీడాకారుల విగ్రహాలతో పాటు వెల్కమ్ స్టాచ్యూలను పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బీటీ నుంచి మూడు ఫీట్ల ఎత్తు వరకు డివైడర్లను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రధాన కూడళ్లల్లో బ్యూటిఫికేషన్లో భాగంగా 5 ప్రధాన కూడళ్లల్లో వాటర్ ఫౌంటెన్తో జంక్షన్లు ఏర్పాటు చేసి సుందరీకరించారు. పట్టణానికి నాలుగు వై పులా రూ.1.20 కోట్లతో వెల్కమ్ హుస్నాబాద్ ఆర్చీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.5 కోట్లతో మల్లెచెట్టు చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ఎల్లమ్మ చెరువు కట్ట వరకు నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తి కాగానే సెంట్రల్ డివైడర్ నిర్మాణంతో పాటుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి పట్టణ రూపు రేఖలను మార్చనున్నారు. అలాగే ఎల్లమ్మ చెరువును రూ.18 కోట్లతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. కట్ట మధ్యన ఆకర్షించే బొమ్మలు, చెరువు మధ్య గాజు వంతెన హైలెట్గా నిలువనుంది. బతుకమ్మ ఘాట్ పనులు పూర్తి చేశారు. -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
సిద్దిపేటజోన్: లాభదాయకమైన వ్యవసాయ విస్తరణకు శిక్షణ తరగతులు దోహదపడతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి అన్నారు. స్థానిక ఎన్జీఓ భవన్లో మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 క్లస్టర్ పరిధిలోని 30మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పాల్గొన్నారు. -
సీతక్కను కలిసిన కొమ్మూరి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మంగళవారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల ఇన్చార్జిగా నియమితులైన సీతక్కను కలిసి జనగామ, చేర్యాల మున్సిపాలిటీల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆయన వెంట చేర్యాలకు చెందిన సంజీవులున్నారు. తపాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతినంగునూరు(సిద్దిపేట): తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజగోపాల్పేట ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు బి.తిరుపతి నియమితులయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బడుల బలోపేతంలో ఉపాధ్యాయులే కీలకం డీఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. కుకునూరుపల్లిలో, మంగోల్లో ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యాబోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మూడవ తరగతికి నిర్వహించే ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టు రైతులకు రుణాలివ్వాలి పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకు అధికారులు రుణాలు అందజేయాలని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి సూచించారు. జిల్లా నుంచి వచ్చిన యూనియన్ బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం మండలంలోని చంద్లాపూర్లోని పట్టు సాగును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పంటలతో పోలిస్తే పట్టు సాగు లాభదాయకమన్నారు. ఏడాదికి 8 నుంచి 10 పంటలు తీయవచ్చన్నారు. మొదటగా షెడ్ నిర్మాణం, పంట సాగు, పనిముట్లు, ఇతర పరికరాల కోసం పెట్టుబడి భారమవుతున్నందున బ్యాంకు అధికారులు సహకరించి రుణాలు అందజేస్తే ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తారన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో సహకరిస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. యూనియన్ బ్యాంకు జిల్లా మేనేజర్ హరిబాబు, నాబార్డు జిల్లా అధికారి నిఖిల్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రష్మితను అభినందించిన సీపీసిద్దిపేటకమాన్: జూనియర్ నేషనల్ అర్చరీ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన హోంగార్డు కుమార్తె రష్మితరెడ్డిని మంగళవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. తన కార్యాలయంలో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన రస్మిత, కోచ్ రవి శంకర్ను అభినందించారు.


