అన్నా.. బాగున్నావే..!
పొన్నం, సతీష్ ఆప్యాయంగా
పలకరింపులు
మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎదురుపడ్డారు. అన్నా.. బాగున్నావా అంటూ మంత్రి పొన్నం.. సతీష్కుమార్ను ఆప్యాయంగా పలకరించుకున్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డులో ఈ ఘటన జరిగింది. ఎప్పుడు విమర్శనస్త్రాలను సంధించుకునే వీరు పరస్పరం చేయి చేయి కలిపి కరచాలనం చేసుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఈ సన్నివేశాన్ని చూసి అబ్బురపడ్డారు.
– హుస్నాబాద్:


