breaking news
Siddipet District Latest News
-
తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
● మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనా ● గజ్వేల్ ఎంసీహెచ్లో తల్లిపాల వారోత్సవాలు గజ్వేల్: తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనా పేర్కొన్నారు. గజ్వేల్లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లో శనివారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. తల్లిపాలలోనే శిశువులకు అన్ని రకాల పోషకాలు దొరుకుతాయని, ప్రతీ తల్లి తమ పిల్లలకు ఆరు నెలలపాటు తప్పనిసరిగా తల్లిపాలే తాగించాలన్నారు. గైనకాలిజిస్ట్ డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ..బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకట్టపడుతుందని చెప్పారు. ముర్రుపాలే అమృతం సిద్దిపేటకమాన్: అప్పుడే పుట్టిన శిశువులకు ముర్రుపాలు అమృతంతో సమానమని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ మహేశ్రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 1నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. -
మంచి స్నేహితులను ఎంచుకోవాలి
స్నేహం అంటే మన మనస్సులోని అన్ని రహస్యాలను పంచుకోగల బంధం. నిజమైన స్నేహితుడు సుఖంలోనూ, కష్టంలోనూ ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. నిజమైన స్నేహితులు మన శ్రేయస్సును కోరుకుంటే స్నేహం పేరుతో మనల్ని ముంచేవాళ్లు కూడా ఉంటారు. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వారినే ఎంచుకోవాలి. – సిరివెన్నెల, బీజెడ్సీ, సిద్దిపేట. తోడు నీడగా ఉండాలి స్నేహితులు అంటే ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. స్నేహితులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. అలాంటి స్నేహితులు దొరకడం అదృష్టం. నిస్వార్థమైన స్నేహం కలకాలం నిలుస్తుంది. –అంజలి, డిగ్రీ విద్యారిన్థి, సిద్దిపేట. తేడాలను చూపనిదే స్నేహం కుల, మతం, భాష, సంపద అనే తేడాలను దాటి మనుషులను కలిపే గొప్ప బంధమే స్నేహం. జీవితంలో సంపదకంటే మంచి స్నేహితులు ఉండటం గొప్ప అదృష్టం. –మోహన్ బీకాం, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
బోనం.. ఘనం
దుబ్బాకలో వైభవంగా మహంకాళమ్మకు బోనాలు దుబ్బాక: పోతరాజుల విన్యాసాలు..శివసత్తుల పూనకాలు..డప్పు చప్పు ళ్లు.. యువకుల కేరింతల మధ్యన శనివారం రాత్రి దుబ్బాక పట్టణంలో మహంకాళమ్మకు బోనాల ఊరేగింపు వైభవంగా జరిగింది. పట్టణంలోని రెడ్డి సంఘాలు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు తీశారు. సాయంత్రం 6 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన బోనాలు పట్టణంలోని ప్రధానవీధుల గుండా మహంకాళమ్మ ఆలయంకు రాత్రి 8.30 వరకు చేరుకున్నాయి. మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మహంకాళమ్మ బోనాల ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. అదేవిధంగా పట్టణంలో పోచమ్మ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఎంపీ రఘునందన్రావు, శ్రీనివాస్రెడ్డి పూజలు ఉత్సవాల్లో ఎంపీ మాధవనేని రఘునందన్రావు, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీతతోపాటు కౌన్సిలర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
స్నేహోత్సవం
స్నేహితులే మన ధైర్యం, ఆత్మవిశ్వాసం స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థినీ, విద్యార్థులుడబ్బుతో కొనలేనిది కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులు జీవితంలో గొప్ప సంపద. డబ్బుతో కొనలేని అమూల్యమైన బంధం. నిజమైన స్నేహం నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవంపై నిలబడుతుంది. స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం కాకుండా ప్రేమ, ఆప్యాయతతో కొనసాగించాలి. –సుష్మ, డిగ్రీ విద్యార్థిని, సిద్దిపేట. మంచి స్నేహితులు మార్గదర్శకులు మంచి స్నేహితులు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకులు. నమ్మకంగా ఉండి మన విజయాలను చూసి సంతోషించే స్నేహితుడు ఉంటే జీవితంలో ఎంతటి విజయాలనైనా అలవోకగా సాధించేందుకు వీలుంటుంది. –సంతోష్, డిగ్రీ, ఎంపీసీఎస్, సిద్దిపేట. -
6న గద్దర్ వర్ధంతి సభ
గజ్వేల్రూరల్: ప్రజాయుద్ధనౌక గద్దర్ 3వ వర్ధంతి సభను ఈ నెల 6న హైద్రాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. ఈ సభకు ప్రజలందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు సంజీవ్, వేణు, యాదగిరి, శ్రీనివాస్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. మాలల రోస్టర్ను సవరించాలిగజ్వేల్రూరల్: ఎస్సీ మాలల రోస్టర్ను సవరించి న్యాయం చేయాలని ఎంసీఎఫ్ (మాలల కో ఆర్డినేషన్ ఫోరం) రాష్ట్ర నాయకురాలు బండ శకుంతల డిమాండ్ చేశారు. గజ్వేల్లోని అంబేడ్కర్ భవన్లో శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ..ఎస్సీ మాలలకు రోస్టర్ పాయింట్లు 22 కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. మాలల రోస్టర్ పాయింట్ను 22 నుంచి 12కు తగ్గించాలని డిమాండ్ చేశారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేసి దళితుల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మాధవి, విశాలక్ష్మి, సతీశ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక పటం ఆవిష్కృతం వ్యవసాయ విద్యార్థుల రావెప్ కార్యక్రమం వర్గల్(గజ్వేల్): గ్రామీణ పటం ఆవిష్కృతమైంది. గ్రామ భౌగోళిక నమూనా, సాగు భూములు, నీటి వనరులు, బడి, గుడి, ఆస్పత్రి, ఇళ్లు, రోడ్లు తదితర దృశ్యాలు ప్రతిబింబించే సామాజిక మ్యాపింగ్ ఆకట్టుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ నాలుగో సంవత్సర విద్యార్థులు క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా శనివారం వర్గల్ మండలం గౌరారం, శేరిపల్లిలో రైతులతో కలిసి మ్యాపింగ్ చేసి ప్రదర్శించారు. పంట దిగుబడుల పెంపు, చీడపీడల నివారణ, ఆధునిక సాగు పద్ధతులపై రైతులతో ముఖాముఖి నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు కనకరాజుగౌడ్, పావని మోహన్రెడ్డి, రావెప్ ఇన్చార్జి, సీనియర్ సైంటిస్టు డాక్టర్ పల్లవి, ప్రియదర్శిని, విద్యార్థినులు పూజ, డోనా మరియా, ఇషిక, రైతులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే గుణాత్మకమైన విద్య రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం జిరాక్స్ మెషీన్, వాటర్ ప్యూరిఫయర్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ...పాఠశాల విద్యాభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరిస్తేనే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. పీఎస్బీతో నేలకు జీవం నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులకు బదులు పీఎస్బీతో మంచి దిగుబడులు సాధించవచ్చని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అవంచలో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా పీఎస్బీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూములు పాడవుతాయని వివరించారు. -
పారదర్శకంగా పథకాలు అమలు చేయాలి
సిద్దిపేటరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా, కొన్ని పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్నాయన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరేలా అధికారులు ఆయా పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ను సద్వినియోగం చేసుకోవాలి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ నెల 10 వరకు ఎన్నికల సంఘం పొడిగించినందున ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత ఆగస్టు 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తామని, దీనిపై సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 16 నాటికి వాటిని పరిష్కరిస్తుందని తెలిపారు. అక్టోబర్ 19న కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తుందన్నారు. ఈ ప్రక్రియలో చనిపోయిన ఓటర్లు, డబుల్ ఓటరు, పూర్తిగా షిఫ్ట్ అయిన ఓటర్లను తీసివేయగా జిల్లాలో 99.75% ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. 1,200 మంది ఓటర్ల సంఖ్య దాటిన పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ గురించి చర్చించారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అందరూ ఒకేలా ఉండరు
ఆన్లైన్ ఫ్రెండ్షిప్తో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలేర్పడి నూతన విషయాలు నేర్చుకునే అవకాశముంది. దూరంలో ఉన్న స్నేహితులతో కూడా ఎప్పటికప్పుడు సులభంగా మాట్లాడుకునే వీలుంటుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. –రమ్య, డిగ్రీ, విద్యార్థిని, సిద్దిపేట. నిజమైన స్నేహమే నిలబడుతుంది నిజమైన స్నేహాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. నమ్మకం, నిజాయితీ, గౌరవం ఉన్నచోట నిజమైన స్నేహం పది కాలాలపాటు నిలబడుతు ంది. అలాంటి నిజమైన స్నేహితుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసి బాధను సగానికి తగ్గిస్తాడు. –గురుచరణ్, బీఎస్సీ, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.బాధను మర్చిపోతాం స్నేహానికి అధిక ప్రాధా న్యతనిస్తాను. స్నేహితులు మనకు కావాల్సినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ ఎలాంటి సమయంలోనైనా మనతో నిలబడి మన విజయంలో పాలు పంచుకుంటారు. స్నేహం మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి విలువను నేర్పిదిలా ఉండాలి. –మల్లికార్జునచారి, ఎంబీపీటీఎస్, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట. -
అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం
సిద్దిపేటకమాన్: ఇటీవల కమిషనరేట్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తితో ఆన్ఆర్ఐ అంటూ ఆన్లైన్లో పరిచయం పెంచుకుని వలపు వలలోకి దించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఉన్నత చదువులు చదివిన ఓ అమ్మాయి నుంచి డబ్బులు కాజేసి ఆన్లైన్ మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రజలు ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయకూడదని, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు వారి వ్యక్తిగత, కుటుంబ వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలు పోస్ట్ చేయకూడదని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్తో ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు -
డెలివర్రీస్
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా శస్త్రచికిత్స ప్రసవాలు ● కరువైన వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలు ● సిజేరియన్లు తగ్గించాలని డీడీఆర్సీ సమావేశంలో చెప్పినా పట్టింపేదీ?బిడ్డ అడ్డం తిరిగిందంటారు..ఉమ్మనీరు తగ్గిందంటారు..బిడ్డ బరువు ఎక్కువగా ఉందంటారు. ఆలస్యం చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదమని హడలెత్తిస్తారు. చివరకు కడుపు కోసి బిడ్డను బయటకు తీస్తారు. వేలాది రూపాయలు డబ్బులు దండుకుంటారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే జరుగుతోంది. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యమైంది. సాక్షి, సిద్దిపేట: జిల్లాలో సర్కారు దవాఖానాల కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా అవుతున్నాయి. సిజేరియన్లను నియంత్రించాలని జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యేలు చెప్పినా జిల్లా వైద్యారోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. ఈ శాఖ నుంచి ఆదేశాలు వస్తే తప్ప అధికార యంత్రాంగం కాలు కదపడం లేదు. అది కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి తప్పుడు నివేదికలు పంపి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. 15 నెలల్లో సిజేరియన్ ప్రసవాల విలువ రూ.21.21కోట్లు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో 15 నెలల కాలంలో సిజేరియన్ల కోసం గర్బిణీల నుంచి ప్రసవాల కోసం రూ 21.21కోట్లను ముక్కు పిండి వసూలు చేశారు. 2025–26 ఆర్థిక ఏడాదిలో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్ల విలువ రూ17.48కోట్లు. అంటే...సిజేరియన్ పేరిట ప్రైవేట్ వైద్యులు ఏటా రూ.17కోట్ల మేరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 2026 నుంచి జూన్ 2026 వరకు ఈ మూడు నెలల్లోనే రూ 3.73కోట్లను పిండుకున్నారు. 11 శాతమే సాధారణ ప్రసవాలు 2025–26లో మొత్తంగా 11,868 ప్రసవాలు కాగా అందులో ప్రభుత్వాస్పత్రుల్లో 6,902, ప్రైవేట్లో 4,966 డెలివరీలు అయ్యాయి. అందులో ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు 3,009, సిజేరియన్లు 3,893, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4,966 డెలివరీలు కాగా అందులో నార్మల్ డెలివరీలు 595 మాత్రమే. సిజేరియన్లు 4,371 చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేవలం 11.98% సాధారణ ప్రసవాలు, 89.02శాతం సిజేరియన్ ప్రసవాలు అయ్యాయి. ప్రైవేట్లో సిజేరియన్కు రూ.40వేలు ప్రతీ మహిళకు మాతృత్వం వరం లాంటిదంటారు. కానీ...ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు, డాక్టర్లకు మాత్రమే అది వరంలా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడబిడ్డలకు గర్భం వచ్చిందన్న సంతోషం కంటే ప్రసవ ఖర్చుల భయమే వెంటాడుతోంది. నార్మల్ డెలివరీకి రూ.20వేలు, సిజేరియన్ రూ.40వేలు ప్యాకేజీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీ అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సిజేరియన్ ప్రసవాల వల్ల మహిళలకు భవిష్యత్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి కట్టడి చేయాలని, అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ తనిఖీలు పెంచి సిజేరియన్లు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.ఏప్రిల్ 2026 నుంచి జూన్ 2026 వరకు డెలివరీ ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం సాధారణ 615 95 710 సిజేరియన్ 870 934 1,804 మొత్తం 1,485 1,029 2,514 -
అంగన్వాడీల్లో తొలిముద్ద
● చిన్నారులకు ఉదయం అల్పాహారం ● పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం ● 55,200 మంది చిన్నారులకు లబ్ధి సిద్దిపేటరూరల్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా శైశవ దశ నుంచే చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం తొలిముద్ద పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న ఈ పథకాన్ని ఈ నెల నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం అల్పాహారాన్ని అందించనున్నారు. 55,200 మంది చిన్నారులకు ప్రయోజనం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,150 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వారిలో ఏడాది వయస్సులోపు చిన్నారులు 10,712మంది ఉన్నారు. మూడేళ్లలోపు వయస్సున్న పిల్లలు 22,633మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న పిల్లలు 21,855మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న తొలిముద్ద పథకం కింద జిల్లాలో 55,200 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా తొలిముద్ద పథకం ద్వారా మరింత ఆరోగ్యవంతు లుగా అయ్యేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం చేపడుతున్న తొలిముద్ద పథకాన్ని ఈ నెల నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే జిల్లాకు ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. –శారద, జిల్లా సంక్షేమశాఖ అధికారి -
ఇటు చకచక
అటు చతికిల..● ప్రభుత్వ గ్రాంట్ల పనులు సాగని వైనం ● నగరాభివృద్ధి నిధులకు కరువైన మోక్షం ● యూఐడీఎఫ్ పనుల ప్రారంభంలో జాప్యం ● స్థానిక నిధులతో చేపట్టే పనుల్లో మాత్రం వేగం ● సమస్యలు తీరక జనం ఇక్కట్లు గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట తర్వాత రెండో ప్రధాన మున్సిపాలిటీ అయిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ నేడు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో ఆదర్శ మున్సిపాలిటీగా ఊదరగొట్టిన ఈ పట్టణం నేడు...ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను సకాలంలో వినియోగించుకోలేక చతికిల పడుతోంది. గతేడాది జూలై ఈ మున్సిపాలిటీకి యూఐడీఎఫ్(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) రూ.15.7కోట్లు వచ్చాయి. అదేవిధంగా నగరాభివృద్ధి కింద రూ.3కోట్లు వచ్చాయి. ఇదేవిధంగా సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా ఈ నిధులు రాగా ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. కానీ గజ్వేల్ –ప్రజ్ఞాపూర్ బల్దియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వివిధ రకాల కారణాలను సాకుగా చూపి...పనులను ప్రారంభించడంలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం యూఐడీఎఫ్ పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా ఈ మున్సిపాలిటీకి ఏఈ లేకపోవడం, ఇతర రాజకీయ కారణాల సాకుతో పనులు ఇంకా పెండింగ్ పెట్టారు. నగరాభివృద్ధి నిధులకు క్లియరెన్స్ ఎప్పుడు..? మున్సిపాలిటీకి మంజూరైన రూ.3కోట్ల నగరాభివృద్ధి నిధుల విషయంలో జాప్యం నెలకొంది. ఈ పనులకు సంబంధించి టెండర్ను పూర్తిచేసి పనులను ప్రారంభించాల్సి ఉండగా...ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం అలుముకుంది. ఈ పరిస్థితి వల్ల పట్టణంలో సమస్యలు తీరక జనం అవస్థలపాలవుతున్నారు. మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారటం ఆందోళనకరంగా మారింది. చిరుజల్లులకే రోడ్లన్నీ చిత్తడిగా మారి నరకం చూపుతున్నాయి. ప్రధానంగా లక్ష్మీప్రసన్న కాలనీ, ప్రజ్ఞాపూర్, పట్టణంలోని ఇతర కొత్త కాలనీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏడాది కాలంగా ఊరిస్తున్న ఈ పనులను ప్రారంభించి ఉంటే ప్రస్తుత వానాకాలంలో కొంతమేర ఇక్కట్లు తప్పేవి. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నంగా మారింది. ఇవేకాకుండా పట్టణంలో ప్రధాన రోడ్డుపై వరద నియత్రణకు రూ.1.2కోట్లతో తూప్రాన్ రోడ్డు వైపున ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద నిర్మించనున్న బ్రిడ్జి పనులు, ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.1కోటి, చిల్డ్రన్స్ పార్కు సుందరీకరణకు రూ.1కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం 1.5కోట్ల పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. స్థానిక పనులపైనే ఆసక్తి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోలేక చతికిల పడుతున్న మున్సిపల్ పాలకవర్గం, స్థానిక మున్సిపల్ నిధులతో చేపట్టే పనుల్లో మాత్రం ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ పనులపై సమగ్రమైన చర్చలు జరపకుండానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయ కింద భాగంలో అదనపు గదుల నిర్మాణం, ఇతర పనులే ఇందుకు నిదర్శనం. కానీ, కీలకమైన ప్రభుత్వ పనులను నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితి స్థానికంగా ఉన్న నిధులను వేగంగా వినియోగించుకుంటున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం...ప్రభుత్వ పథకాల పనులను పట్టాలెక్కించడంలో విఫలమవుతోంది. ఏడాది కిందట మంజూరైన పనులను ఇప్పటికీ ప్రారంభించలేకపోతున్నారు. మిగతా మున్సిపాలిటీల్లో పనులు చకచకా సాగుతుండగా, ఇక్కడ మాత్రం వివిధ కారణాలతో ముందుకుసాగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్ ఇది. మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా చూస్తాం. రూ.3కోట్లతో చేపట్టాల్సిన నగరాభివృద్ధి పనులను టెండర్ పూర్తి చేయించి పనులు ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తాం. పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే మా లక్ష్యం. –గణేశ్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ -
15 నాటికి ఒక జత స్కూల్ డ్రెస్లు
● ఆ దిశగా పనులు వేగవంతం చేయాలి ● ఏపీఎంలకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● వర్గల్ మహిళా సమాఖ్యకార్యాలయ సందర్శన వర్గల్(గజ్వేల్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్ను ఆగస్టు15 రోజున తప్పనిసరిగా అందించాలని ఏపీఎంలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. వర్గల్ మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. స్కూల్ డ్రెస్ తయారీ క్లాత్ను, స్వయం సహాయక సంఘాల మహిళలు కటింగ్, కుట్టుపని ప్రక్రియను పరిశీలించారు. ఏపీఎం కిరణ్కుమార్, సమాఖ్య కార్యదర్శి లావణ్య, ఎస్హెచ్జీ మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. క్లాత్ వృథా కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక జత స్కూల్ డ్రెస్సు ఆగస్టు 15నాటికి అందించాలని, ఆ దిశగా పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం వర్గల్ ప్రభుత్వాస్పత్రి సందర్శించారు. -
అవగాహన కల్పిస్తున్నాం
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 20 వార్డుల్లో వారానికి రెండుసార్లు వార్డు అధికారులు, ఎన్ఎన్ఎం, ఆశ కార్యకర్తలతో ‘ఫ్రైడే–డ్రై డే’కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వార్డుల్లో సైతం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. నిల్వ నీటిని తొలగించేలా, డెంగీ వ్యాప్తి, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. –మహేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. నిల్వ నీటిలో లార్వా ద్వారా ఏడిస్(టైగర్) దోమ వ్యాప్తి చెందుతుంది. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించండి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హత లేని డాక్టర్లను సంప్రదించి వ్యాధి తీవ్రతను పెంచుకోవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ, ఇతర జ్వరాలకు మందులు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ ధన్రాజ్, డీఎంహెచ్ఓ, సిద్ధిపేట -
విజృంభిస్తోన్న డెంగీ
● జిల్లాలో 4 కేసులు నమోదు ● దుబ్బాక నియోజకవర్గంలోనే 3 ● మూలనపడ్డ ఫాగింగ్ మెషీన్లు దుబ్బాకలో ఇంటి పరిసరాలలో చేరిన మురికి నీరుదుబ్బాకటౌన్: జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ ప్రారంభమయ్యాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దోమల వ్యాప్తి సైతం తీవ్రంగా పెరిగింది. దీంతో సీజనల్ వ్యాధులు తాండవమాడుతున్నాయి. ప్రజలు పలు రకాల జ్వరాలతో వైద్యం కోసం వస్తుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నాలుగు డెంగీ కేసులు నమోదు సిద్ధిపేట జిల్లాలో ఇప్పటివరకు 4 డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోనే మూడు కేసులు నమోదయ్యాయి. దౌల్తాబాద్ తాండలో 2, దుబ్బాక ఒకటి, మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి డెంగీతో జిల్లా ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం దుబ్బాకలో యువకుడికి డెంగీ పాజిటివ్ రావడంతో మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్, చైర్మన్ సంగీత ఇంటి పరిసరాలలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. పారిశుద్ధ్యంపై పట్టింపేది ప్రజా పాలనలో పారిశుద్ధ్యం కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు, వర్షాకాలంలో పెరగిన పిచ్చి మొక్కలు తొలగించడం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వినికిడి. దీంతో దోమలు, ఈగలు తీవ్రస్థాయిలో వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులకు దారి తీస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. పెంట కుప్పలపై, గడ్డి పొదల్లో, మురికి కాలువల్లో దోమల వ్యాప్తి పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫాగింగ్ మెషీన్లు పని చేయక మూలనపడుతున్న వాటిని కనీసం మరమ్మతులు చేయించడం లేదని ప్రజలు అంటున్నారు. -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
డీఈవో రమేశ్ మద్దూరు(హుస్నాబాద్): ఉత్తమ సేవలతోనే ఉద్యోగులకు ప్రజలల్లో మంచి గుర్తింపు లభిస్తుందని డీఈవో రమేశ్ పేర్కొన్నారు. మద్దూరు మండల కేంద్రంలో దూల్మిట్ట విద్యాశాఖ అధికారి(ఎంఈవో) ,బైరాన్పల్లి హెచ్ఎం మాడిశెట్టి మీనాంజనేయులు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయ వృత్తికి మీనాంజనేయులు వన్నె తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మద్దూరు, చేర్యాల ఎంఈవోలు వరదరాజు,నరేందర్,రిటైర్డు ఏసీపీ తుమ్మలపల్లి నారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారం, విద్య అందుతోందా? మద్దూరు(హుస్నాబాద్): పాఠశాల, హాస్టల్లో అన్ని మౌలిక సౌకర్యాలు బాగున్నాయా? రుచికరమైన ఆహారం, నాణ్యమైన విద్యా బోధన అందుతోందా అని జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రమేశ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డెన్తో మాట్లాడుతూ..క్రమం తప్పకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్,ఎంఈవో వరదరాజు,వార్డెన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
83 మంది చిన్నారులకు విముక్తి
సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడి సిద్దిపేటకమాన్: బాలకార్మికులను గుర్తించి 83 మంది చిన్నారులకు పని నుంచి విముక్తి కల్పించినట్లు సీపీ రష్మీపెరుమాళ్ వెల్లడించారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జూలై 1నుంచి 31 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, బాలల పరిరక్షణ యూనిట్ సమన్వయంతో పలు హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 83మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సిలింగ్ అందించి పునరావాసానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 17మంది యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వర్చువల్గా ప్రధాని మోదీ సందేశం సిద్దిపేటజోన్: ‘నశా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఈనెల 2న నశా ముక్త ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతతో వర్చువల్గా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వర్గల్ కావేరి యూనివర్సిటీలో యువతతో ప్రధాని సంభాషించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో కోటిమంది యువత, మైభారత్ వలంటీర్లు, యువజన సంఘాలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి, విజేతలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆగస్టు14న ఢిల్లీలో జాతీయ నశా ముక్త యువ సదస్సులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సన్మానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మద్దూరు(హుస్నాబాద్): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి గోపాలకృష్ణమూర్తి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అందుబాటులో ఉన్న మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి పశువైద్యాధికారి సాజిద్ అలీ,సిబ్బంది ఉన్నారు. జెండర్ స్పెషలిస్ట్ లావణ్య గజ్వేల్రూరల్: ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని జెండర్ స్పెషలిస్ట్ లావణ్య పేర్కొన్నారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవాన్ని శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లావణ్య మాట్లాడుతూ...మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆడపిల్లలు, మహిళలను మోసం చేయడం, బెదిరించడం, బలవంతం లేదా మాయమాటలతో మోసం చేయడం, అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘దోస్త్’ అడ్మిషన్ల వారికి హాస్టల్ సౌకర్యం
● కలెక్టర్ హైమావతి ● గజ్వేల్ బాలికల ఎడ్యుకేషన్ సందర్శన గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ‘దోస్త్’ ద్వారా అడ్మిషన్లు పొందిన విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. గజ్వేల్లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాలలో సమస్యలను తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాల వెనుకభాగంలో ఉన్న భవనాలను హాస్టల్ కోసం సిద్ధం చేయాలని, అందులో ముందుగా ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కోసం కొన్ని గదులను కేటాయించాలన్నారు. విద్యార్థినులు ఉండటం కోసం బెడ్స్, వాష్రూమ్లు, కిచెన్ ఏర్పాటు చేయాలని ఈడబ్ల్యూడీసీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, ఈడబ్ల్యూడీసీ ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీడబ్ల్యూ శారద, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సీసీ కెమెరా నెట్వర్క్ గ్రిడ్ మా లక్ష్యం
సీపీ రష్మీ పెరుమాళ్హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాను సీసీ కెమెరా నెట్వర్క్ గ్రిడ్గా తయారు చేయాలనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీస్స్టేషన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (ట్రాఫిక్ అవుట్ పోస్ట్)ను గురువారం ఆమె ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ శాఖ నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. ఈ సందర్బంగా సీపీ రష్మీ పెరుమా ళ్ మాట్లాడుతూ... గతంలో ట్రాఫిక్ విభాగం కోసం ప్రత్యేక స్థలం లేకపోవడం వల్ల సిబ్బందికి ఇబ్బంది ఉండేదన్నారు. పట్టణంలోని ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడానికి, ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల అనుబంధంగా సిద్దిపేట సురక్ష నేత్రను ప్రారంభించామని చెప్పారు. పోలీస్ ఉద్యోగమిత్ర పోర్టల్పై అవగాహన సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర పోర్టల్ గురించి అన్ని గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన సీపీకి పోలీస్లు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అన్ని రకాల రికార్డులు, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను నిశితంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీ సదానందం, హుస్నాబాద్ సీఐ శ్రీధర్, చేర్యాల సీఐ రమేశ్, ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్రెడి పాల్గొన్నారు. -
డిప్యూటేషన్ రద్దు చేయాలి
ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్తుల ఆగ్రహంనంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వర్గ పోరుతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని గురువారం నంగునూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణిత ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాలమాకుల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమణారెడ్డిని బద్దిపడగకు, అక్కడ పని చేస్తున్న యాదయ్యను పాలమాకులకు డిప్యూటేషన్ వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చక్కగా పాఠాలు బోధించే రమణారెడ్డిని రిలీవ్ చేయవద్దని విద్యార్థులు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులకు తెలిపారు. సర్పంచ్ ఓజాలు ఆధ్వర్యంలో యువకులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎం ప్రభాకర్రావుని నిలదీశారు. ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదంతో నచ్చని వారిని డిప్యూటేషన్పై పంపుతున్నారని హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల కోరిక మేరకు డిప్యూటేషన్ రద్దు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ఎం ప్రభాకర్రావు ఉపాధ్యాయులపై వివక్ష చూపుతున్నారని గతంలోనే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వగా కొందరు నచ్చ చెప్పడంతో ఫిర్యాదు చేయలేదని యువకులు తెలిపారు. రాజగోపాల్పేట పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యపై డీఈఓకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. -
పీఎంశ్రీలకు బతుకమ్మ నిధులు
● ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పీఎంశ్రీ స్కూల్స్ ● గతేడాది పండుగ ముగిసిన తర్వాత... ఈసారి ముందుగానే నిధులు సాక్షి, సిద్దిపేట: పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాలల్లో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 పాఠశాలలకు రూ.10.80 లక్షలు మంజూరు చేసింది. బతుకమ్మ పండుగ చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యంపై విద్యార్థుల్లో అవగాహనను కల్పించాలి. బతుకమ్మకు సంబంధించిన జానపద పాటలు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలి. పర్యావరణహితంగా కార్యక్రమం చేపట్టాలి. గతేడాది పీఎం శ్రీ స్కూళ్లకు బతుకమ్మ వేడుకలకు నిధులను ఆలస్యంగా మంజూరు చేయడంతో కొన్ని పాఠశాలలల్లోనే నిర్వహించారు. మరికొన్ని పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించకుండానే బిల్లులు పెట్టి డబ్బులను హెచ్ఎంలు డ్రా చేశారు. ఈసారి అందుకే ముందుగానే నిధులు విడుదల చేసింది. జిల్లా పాఠశాలల సంఖ్య కేటాయింపు సిద్దిపేట 33 రూ.3.30 లక్షలు సంగారెడ్డి 44 రూ.4.4 లక్షలు మెదక్ 31 రూ. 3.10 లక్షలు -
తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు
● తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రతాప్రెడ్డి ● టీజీబీ మెగా రుణమేళాలో వ్యవసాయ యంత్రాలు అందజేత సిద్దిపేటకమాన్: తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు టీజీబీ చైర్మన్ ప్రతాప్రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మెగా రుణమేళా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ ప్రతాప్రెడ్డి సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన రైతులకు 20ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రెండు జేసీబీలు, మహిళా సంఘాలకు 50పశువుల యూనిట్లను రుణాలు పొందిన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా అందిస్తున్న ప్రభుత్వ పథకాలైన ఎఐఎఫ్, సోలార్ కుసుమ్ వంటివి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వాహనాలు యాంత్రీకరణను ప్రోత్సహించడంలో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, కూలీల కొరతను అధిగమించడంలో కీలక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
స్నేహం అమూల్యం
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: సమాజంలో స్నేహానికున్న విలువ వెలకట్టలేనిదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గేయ రచయిత రాయారావు విశ్వేశ్వరరావు రూపొందించిన ప్రత్యేక పాటను గజ్వేల్ పట్టణంలో గురువారం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్నేహితుల మధ్య ఉండే అభిమానం, ఆప్యాయతను పాట రూపంలో చక్కగా వర్ణించారని ప్రశంసించారు. మనము నమ్మే...మనల్ని నమ్మే స్నేహితుడు జీవితంలో ఎన్నటికీ విడిచిపోడని, కష్టాలు ఎన్ని ఎదురైనా అండగా ఉంటాడని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, నాయకులు గోపాల్రెడ్డి, గోలి సంతోష్, ఆపన్నహస్త మిత్రబృందం, లయన్స క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం తపస్ ఉపాధ్యాయ సంఘం నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయుల సమస్యలను కలసికట్టుగా పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తపస్ ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మండలశాఖ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ...ఎన్నో ఏళ్లు సమస్యలపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ఆరు డీఏలు పెండింగ్లో పెట్టి పీఆర్సీ ఊసే ఎత్తడంలేదని తెలిపారు. సీపీఎస్ రద్దు, బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు రామిరెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశం, రాములు, మురళిధర్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షుడు చిలుముల మురళీధర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపరచటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఆగస్టు 1న తపస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ నియామకంప్రశాంత్నగర్(సిద్దిపేట): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా కమిటీని గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రకటించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షు డిగా మల్లన్నగారి భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా బడెకోల్ నర్సింహులు, కంకణాల నర్సింహులు, కొండి శంకర్, ప్రధాన కార్యదర్శులుగా మా మిండ్ల నాగులు, బొడ్డు నర్సింహులు, కార్యదర్శులుగా దేవుని ఉపేందర్, నిమ్మల శ్రీనివాస్, సందొబోయిన కుమారస్వామి, కార్యవర్గ సభ్యులుగా చెన్నగోని వెంకటేశ్గౌడ్, పున్న రమేశ్, రంగనబోయిన కుమార్ తదితరులను నియమించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. నేటి నుంచి సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలుసిద్దిపేటఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రంలో సైన్స్ విద్యార్థులకు ఈ నెల 31 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరం మూడవ సంవత్సరం 6వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఆగస్ట్ 6వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయిని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలకు విద్యార్థులు కళాశాల గుర్తింపు కార్డు, హాల్టికెట్ను వెంట తెచ్చుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7382929615 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
భారీ మత్స్యం.. వలకు చిక్కి
ఆసక్తిగా తిలకించిన గాగిళ్లాపూర్ గ్రామస్తులు బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్ శివారులోని గొల్లకుంట కాలువలో గురువారం చేపలు పడుతున్న నేరెళ్ల పర్శయ్య వలలో సుమారు 15 కేజీల భారీ చేప(వాలు) చిక్కింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటకు నీరుచేరుతుండటంతో పర్శయ్య చేపలు పట్టేందుకు వెళ్లాడు. తోటపల్లి పెద్ద చెరువు నుంచి చేపలు ఎదురెక్కి వస్తుండగా అందులోని ఈ భారీ చేప లభించింది. కాగా, భారీగా ఉన్న చేపను తిలకించి గ్రామస్తులు అబ్బుర పడుతున్నారు. -
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
మహావృక్షాలు.. ముచ్చట్లకు అడ్డాలుగ్రామాల్లో కొన్నేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారి గ్రామస్తులను కనువిందు చేస్తున్నాయి. జిల్లా పరిధిలోని కమ్మర్లపల్లి, అల్లీపూర్, రాఘవపూర్, బస్వాపూర్, కోహెడ తదితర గ్రామల మధ్యలో రావి,వేప,మర్రి చెట్లు రచ్చబండల్లా మారాయి. పల్లెలోని ప్రతీ ఒక్కరు వారికి దొరికిన తీరిక సమయంలో అక్కడకూర్చొని మంచిచెడ్లలను చర్చించుకుంటున్నారని పలుగ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. –సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్,సిద్దిపేట -
భోజనం సరే.. మంచినీళ్లెలా?
● చెట్ల కిందే భోజనాలు చేస్తున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు ● మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గజ్వేల్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో మాత్రం విస్మరించింది. దీంతో తమ పిల్లలు భోజనాలు ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థినులుండగా, బాలుర ఎడ్యుకేషన్ హబ్లోని ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అందిస్తున్నప్పటికీ కూర్చుని తినేందుకు సరైన వసతి(డైనింగ్ హాల్) లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనాన్ని నేలపైనే కూర్చోని తింటున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో వర్షం వస్తే ప్లేట్లను పట్టుకుని పాఠశాలల్లోకి పరుగులు పెడుతున్నారు. తాగునీటికీ తిప్పలు విద్యార్థులు భోజనం చేసే ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో తాము వెంట తెచ్చుకున్న వాటర్ బాటిళ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. బాలికల హబ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తాము ఇంటి నుంచి తెచ్చుకున్న మంచినీరు అయిపోతే పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ నీటిని వాడుకుంటుండగా, బాలుర హబ్లోని ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈ రెండు పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో చొరవ చూపి విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ప్రాంతం వద్ద విద్యార్థులందరికీ సరిపడ డైనింగ్ హాల్తోపాటు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చొరవ చూపాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్లను నిర్మించి 8 ఏళ్లు పూర్తవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. –రమణకార్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి -
ఉపాధి అక్రమాలకు ఏఐ చెక్
పనిచేయకుండా ఫొటోలు దిగి వెళ్తే అంతే.. ఇక నుంచి ఉపాధి పనుల్లో అక్రమాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో చెక్ పడనుంది. ఏఐ వినియోగంతో.. పనులు చేయకుండా తప్పుడు బిల్లులు పెట్టడం, పనికి వచ్చినా పనిచేయకుండానే ఫొటోలు దిగి వెళ్లే వారి ఆటలు ఇక సాగవు. వీబీజీరాంజీ పథకంలో ఏఐ వినియోగాన్ని ఇప్పటికే తీసుకురావడంతో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట జిల్లా చిన్నకోడూురు మండలంలో ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. పలుచోట్ల పనులు చేయకున్నా చేసినట్లుగా నమోదు, తప్పుడు బిల్లులు పెట్టడం, పనులు ఎక్కువగా నమోదు చేయడాన్ని తనిఖీ బృందం గుర్తించింది. రూ.90 వేలు రికవరీ చేయాలని, రూ.44వేలు జరిమానాను విధించారు. అలాగే ఉపాధి పనులు చేయకుండానే చేశామని ఫొటోలు దిగి వెళ్లే వారికి, బోగస్ పనులకు బ్రేక్లు పడుతున్నాయి. ఉపాధి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ఏడాది పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పుగా నమోదు చేసిన తర్వాత తనిఖీల్లో గుర్తించడం కంటే వెంటనే గుర్తించేందుకు సాంకేతికను వినియోగిస్తున్నారు. జూలై 1 నుంచి వీబీజీరాంజీ పథకంలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బోగస్ పనులను నిరోధించి, నిజాయితీగా చేసిన కూలీలనే గుర్తించేలా ఏఐను ప్రవేశపెట్టారు. దీంతో ఉపాధి పనులు పారదర్శకంగా జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 5.7లక్షల జాబ్ కార్డులుండగా 10.93లక్షల మంది కార్మికులున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్పాండ్స్ను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో కొందరు కూలీలు, మేస్త్రులు కలిసి చేసే తప్పులను అధికారులు గుర్తించారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం, మధ్యలో అసలు పనే ముట్టకపోవడం వంటి మోసాలు జరిగేవి. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన వ్యవస్థతో పని జరగకపోతే ఏఐ ఆటోరిజెక్ట్ చేస్తుంది. ప్రతీ ఒక్కరు నాలుగు గంటల పాటు పని చేయాలి. దీని ప్రకారం ఉదయం, మధ్యాహ్నం తీసిన ఫొటోలను క్లౌడ్ సర్వర్లోని ఏఐ సాఫ్ట్వేర్ సెక్షన్లలో పోల్చి చూస్తుంది. ఉదయం ఉన్న మట్టి కుప్ప లేదా కాల్వ మధ్యాహ్నం ఫొటోలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉంటే పనిలో పురోగతి లేదని, అక్కడ పని జరగలేదని గుర్తించి ఆ రోజు హాజరును ఆటోమేటిక్గా నిలిపివేస్తుంది. జిల్లా జాబ్ కార్డులు కార్మికులు సిద్దిపేట 1.96 3.87 మెదక్ 1.64 3.27 సంగారెడ్డి 2.1 3.79 డిజిటల్ కొలతలు, ఏఐ రిపోర్టులకు భిన్నంగా ఎంబుక్ రాసే అధికారులపై నేరుగా విచారణ జరగనుంది. ఇస్రో భువన్ పోర్టల్ శాటిలైట్ చిత్రాలతోపాటు ప్రతీ జిల్లా అంబుడ్స్మెన్కు డ్రోన్ నిఘా వ్యవస్థను కేటాయించారు. సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని తప్పుడు బిల్లులు రాస్తే శాటిలైట్, డ్రోన్ డేటాలోని వాస్తవ కొలతలతో సరితూగదు. తేడా వస్తే సదరు సిబ్బంది ఐడీలు నిలిచిపోవడమే కాకుండా రికవరీకి క్రిమినల్ కేసులు నమోదవుతాయి. కూలీలు రాకపోయినా వారి పాత ఫొటోలను వేరే మొబైల్ స్క్రీన్పై చూపిస్తూ రీ ఫొటోలు తీసి మోసం చేసే ఫీల్డ్ ట్రిక్స్ను ఏఐ పట్టేస్తుంది. 4 గంటలు తప్పక పనిచేయాల్సిందే ఉపాధి కార్మికులు ప్రతీ ఒక్కరు నాలుగు గంటలు పని చేయాలి. ఆ నాలుగు గంటల పాటు చేసే పని పురోగతి ఉండాలి. ఉదయం రాగానే చేసే పని దగ్గర ఫొటో దిగాలి. తర్వాత చేసిన పని దగ్గర ఫొటో దిగాలి. అలాగే చేసిన పనికి సంబంధించిన ఫొటో సైతం తీసి అప్లోడ్ చేయాలి. వీబీజీరాంజీ సర్వర్ ద్వారా పనులను ఏఐ పరిశీలిస్తుంది. అన్ని సక్రమంగా ఉంటేనే హాజరు వేస్తుంది. –జయదేవ్ ఆర్యా, డీఆర్డీఏ, సిద్దిపేట -
బలమైన పోరాటాలు నిర్మించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు చేర్యాల(సిద్దిపేట): అమరజీవి, మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి ఆశయ సాధనకు బలమైన శ్రామిక వర్గ, ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అభిప్రాయపడ్డారు. పట్టణంలోని వాసవిగార్డెన్లో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏసీరెడ్డి 35వ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏసీరెడ్డి నైజాం రజాకార్లు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన త్యాగం నేటితరానికి ఆదర్శమని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్ల ద్వారా కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల దరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం, పేదరికం పెరగడానికి కేంద్ర ఆర్థిక విధానాలే కారణమని ఆరోపించారు. అనంతరం ఏసీరెడ్డి పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు గోపాలస్వామి, శశిధర్, సత్తిరెడ్డి, వెంకట్మావో, లావణ్య, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన గజ్వేల్: ప్రస్తుత వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశం ఆమె పాల్గొని మాట్లాడారు. పట్టణంలో చెత్త సేకరణ వంద శాతం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. పట్టణంలో గ్రామ కంఠంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇంటినంబర్ కేటాయించాలని కౌన్సిలర్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ చందన, కమీషనర్ గణేశ్రెడ్డి, వైస్ చైర్పర్సన్ పద్మబాయిలకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో మున్సిపల్లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతిలో లభించేదే ఆరోగ్యకరంట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతిలో లభించే ప్రతీ చెట్టు ఆరోగ్యకరమేనని ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ పాఠశాలలో మంగళవారం ఆషాఢమాస గోరింటాకు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు గోరింటాకును తయా రు చేసి, ఒకరికి ఒకరు పంచుకుని సంతోష పడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ...మన సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులకు చాటి చెప్పాలన్నారు. సహజమైన గోరింటాకుతో ఆరోగ్యానికి ఆహ్లాదం, చల్లదనాన్ని పొందవచ్చని తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని, పిల్లలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. -
ప్రతీ నీటి బొట్టునూ ఒడిసి పడదాం
● నీటి సంరక్షణతో విపత్తును ఎదుర్కొందాం ● కలెక్టర్ హైమావతి నంగునూరు(సిద్దిపేట): ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి విపత్తును ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. రైతునేస్తం 100వ ఎపిసోడ్లో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ను కలెక్టర్ హైమావతి రైతులతో కలసి నర్మేటలో వీక్షించారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ పరిస్థితు లు, భూగర్భ జలాల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ఫామ్ సాగుపై మంత్రి రైతులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో లోటు వర్షపాతం నమోద వుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వరికి ప్రత్యామ్నా యంగా కంది,రాగులు, సజ్జలు, కొర్రలు, ఆముద పంటలు వేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పరిశీలించిన కలెక్టర్ పాలమాకుల ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం తక్కువగా ఉండటంతో 108 మంది విద్యార్థులకు భోజనం సరిపో తుందా అని నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మెనూ పాటిస్తూ రుచికరంగా వండాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పిస్తూ యాక్టివిటీ బేసిక్స్ ద్వారా పాఠాలు బోధించాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోవడం, ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు. మధ్యాహ్న సమయంలో ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకుండా ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డీఈవో రమేశ్ను ఫోన్లో ఆదేశించారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్గజ్వేల్రూరల్: విధి నిర్వహణలో పోలీసు అధికారులు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లోని పరిసరాలను పరిశీలించి, ప్రహరీగోడపై ప్రజలకు అవగాహన కల్పించేలా వేసిన చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్టేషన్కు వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే పోలీసు శాఖకు మంచిపేరు వస్తుందన్నారు. బీట్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతీ గ్రామంలో సీసీకెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం రికార్డులను, దర్యాప్తులో ఉన్న కేసులను పరిశీలించి, స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలనిన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇటుక బట్టీలకు కలప
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నినాదం గోడమీద రాతలుగానే మిగిలిపోతోంది. అధికారులకు ఆమ్యామ్యాల ఎరజూపి యథేచ్ఛగా వృక్ష సంపదను అక్రమార్కులు అనుమతుల్లేని ఇటుకబట్టీలకు తరలించేస్తున్నారు. మిరుదొడ్డితోపాటు దుబ్బాక, తొగుట, దొమ్మాట రాయపోలు మండలాలల్లో చీకటి మాటున అక్రమంగా కలప తరలిపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అమాయక రైతులను ఆసరా చేసుకుని అక్రమార్కులు పట్టా భూముల్లో ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వృక్ష సంపదను నరికించి రాత్రివేళల్లో లారీల్లో, ట్రాక్టర్లలో యథేచ్ఛగా అక్రమంగా కలప జోరుగా తరలిపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానరాని కమిటీలు సహజ వనరులను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీస్, గ్రామ కమిటీ, వీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలు కూడా కలప తరలింపుపై చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే కలపను యథేచ్ఛగా నరికేస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్న కలప వాహనాలను పట్టుకున్న అధికారులు తూతూమంత్రంగా జరిమానాలు విధించి విడిచిపెట్టేస్తున్నారన్న ఆరోపణలు సైతం విపిపిస్తున్నాయి. అక్రమంగా చెట్లను నరికి కలపను తరలిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి కలప దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా తరలిపోతున్న వృక్ష సంపదపై అధికారులు దృష్టి సారించాలి. అక్రమార్కుల చేతిలో పచ్చని చెట్లు నేలవాలుతున్నాయి. విలువైన వృక్ష సంపద అక్రమార్కుల చేతిలో గొడ్డలి వేటుకు బలైతే పర్యావరణానికే ముప్పు వాటిల్లుతుంది. మొక్కలు నాటడంలో ఉన్న శ్రద్ధ అక్రమార్కుల చేతిలో తరలిపోయే కలప రవాణాకు అడ్డుకట్టపై ఉండటం లేదు. అనుమతుల్లేని ఇటుకబట్టీలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికై నా పర్యావరణ కమిటీలు మేలుకుని ప్రకృతి ఒడిలోని పర్యావరణాన్ని కాపాడేలా పాటు పడాలి. – పి.శంకర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి నియోజకవర్గంలో అక్రమార్కులు అమాయక రైతులను ఆసరాగా చేసుకుని పంట పొలాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టిని తరలిస్తూ, ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో పర్యావరణం మరింత దెబ్బ తింటోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తుండటంతోపాటు, బట్టీలను కాల్చడానికి కలపను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ప్ర భుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. -
నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్ అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్, జెడ్పీ సీఈఓ రమేశ్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో బుధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ గ్రామానికి ఊట కుంట నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజన తండాలు, మారుమూల పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బెజ్జంకి బంద్ విజయవంతంబెజ్జంకి(సిద్దిపేట): మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బెజ్జంకిలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వర్షంలో సైతం జేఏసీ నాయకులు ప్రధాన వీధుల్లో ర్యాలీలు నిర్వహించి ఇథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. వాణిజ్య, విద్యా సంస్థలు, బ్యాంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీల వలన మండల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని పలుమార్లు విన్నవించి నా అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదన్నారు. 45 రోజులలో ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాష్ట్రాలకే అప్పగించాలి: చాడహుస్నాబాద్: నీట్ పరీక్షల నిర్వాహణ రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఐ భవన్లో బుధవారం ఆ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ... జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్ధులపై జరిగిన లాఠీచార్జీ అమానుషమన్నారు. ‘దేశంలో మార్పు రావాలి. బీజేపీ గద్దె దిగిపోవాలి’అనే నినాదంతో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు పల్లె పల్లెకు సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఏ మంత్రి పదవి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సీపీఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, నాయకులు శ్రీనివాస్, కనుకుంట్ల శంకర్, అశోక్, లక్ష్మి, రాములు తదితరులున్నారు. -
చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉంది
● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మంత్రిని కలిసిన దుబ్బాక చేనేత సహకార సంఘం నాయకులు దుబ్బాక/ములుగు(గజ్వేల్): చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధుతోపాటు పాలకవర్గ సభ్యులు బుధవారం మంత్రి తుమ్మలను కలసి చేనేత సొసైటీ కోసం గతంలో ఏపీస్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ.1.67 కోట్లను రుణమాఫీ చేయాలని కోరారు. కార్మికులకు చేతినిండా పనికల్పించాలని ఇందుకు చేనేత సహకార సంఘానికి కావాల్సిన ముడిసరుకు నిమిత్తం వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ..రుణమాఫీతోపాటు వర్కింగ్ క్యాపిటల్ను ఇస్తామని హామీనిచ్చారు. మంత్రికి ఉద్యాన విద్యార్థుల వినతి పత్రం ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి కళాశాలకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ కోర్సు, ఉద్యాన కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యాన విద్య కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోనే కొనసాగించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యాన విస్తరణాధికారులు(హెచ్ఈఓ), ఉద్యాన అధికారుల(హెచ్ఓ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో ఉద్యాన విద్యార్థి నాయకులు సంగారెడ్డి, సాయికిరణ్, చంటి తదితరులున్నారు. -
విధుల్ల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే..
నంగునూరు(సిద్దిపేట): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుతప్పవని సీపీడీఓ శారద హెచ్చరించారు. ఆంక్షాపూర్ అంగన్వాడీ కేంద్రంలో ఫోర్జరీ సంతకాలతో సరుకులు పక్కదారి పడుతున్నాయని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బుధవారం సీడీపీఓ శారద విచారణ చేపట్టారు. గ్రామంలో బాలింతలు, చిన్నారులు, గర్భిణీల వివరాలు సేకరించి వారికి సరుకులు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. టీచర్ సమయ పాలన పాటించడంలేదని, సెలవు దినాల్లో సరుకులు అందిస్తున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల సంతకం తీసుకుని సరుకులు ఇవ్వాలని, వారికి బదులుగా వేరే వారికి ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దుబ్బాక అభివృద్ధికి సహకరించండి
● తీరు మారకుంటే కలెక్టరేట్ ముట్టడి ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుబ్బాక అభివృద్ధి విషయంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని..అధికారుల తీరు మారకుంటే కలెక్టరేట్ ముట్టడికై నా వెనుకాడబోమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులతో మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టి స్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయం, విద్యు త్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్య, హౌసింగ్, వైద్య శాఖల తీరుతెన్నులపై ప్రభాకర్రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా శాఖల పనితీరును శాఖల వారీగా సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హేమరాజ్సింగ్ను సన్మానించిన ఎమ్మెల్యే వైద్యరత్న నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.హేమరాజ్సింగ్ను కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సన్మానించారు. భవిష్యత్త్లో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కొంగ రి రవి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసం, తహసీల్దార్ మోతీసింగ్, ఇన్చార్జి ఎంపీడీవో సోమిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు తదితరులు ఉన్నారు. -
తాగునీరు, విద్యుత్ సమస్యలు రానివ్వద్దు
హుస్నాబాద్రూరల్/హుస్నాబాద్: పల్లెలో తాగు నీరు, విద్యుత్ సమస్యలు రాకుండా అధికారులు, సర్పంచ్లు కలిసి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్లతో కలిసి గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. తాగునీటికి మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలేర్పడితే స్థానిక నీటి వనరులను సృష్టించుకోవాలన్నారు. ఆయిల్పామ్ సాగు చేసిన గ్రామాలకు రూ.5లక్షలు, ప్రైవేటు పాఠశాల బస్సులను బంద్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచిన గ్రామాలకు రూ.5లక్షలు, ఇంకుడు గుంతలు, బోరు బావుల రీ చార్జి, నీటి కుంటల తవ్వకం చేపట్టి మండలంలో మొదటి మూడు గ్రామాలకు రూ. 15 లక్షల అభివృద్ధి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆగష్టు 15 వరకు టెండర్లు అయిన పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్ల లైసెన్స్ను బ్లాక్ లిస్టులో పెట్టి టెండర్లు రద్దు చేయించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ఏఈలు ఇద్దరు గైర్హాజరు కావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయంలో చంఢీ హోమం గురు పౌర్ణమి సందర్బంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన చంఢీ హోమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ప్రతీ పౌర్ణమికి నిర్వహించే మహా గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి
గజ్వేల్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సూచించారు. గజ్వేల్లో బుధవారం జరిగిన మండల పరిషత్ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. గజ్వేల్ మండల ప్రత్యేకాధికారి సువర్ణ మాట్లాడుతూ..ప్రభుత్వ ఆశయాలకనుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. -
ఆల్ ఇండియా సేవల్లో మన పాత్ర ఉండాలి
● ఉద్యోగం పొందడం కాదు ఇచ్చే స్థాయికి రావాలి ● మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటజోన్: అఖిల భారతస్థాయి సేవల్లో మన పాత్ర ఉండాలని విద్యార్థులనుద్దేశించి మాజీ మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేఆర్ ఉచిత ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్ ఆధ్వర్యంలో ఇటీవల ఐఐటీ, నీట్, ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించిన విద్యార్థులకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పిల్లలు జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఒక్క సీటుతో ఆ విద్యార్థి జీవితంతోపాటు వారి కుటుంబ ఆర్థికస్థితిగతులు పూర్తిగా మారిపోతాయన్నారు.ఐఐటీ, ఎన్ఐటీ పూర్తి కాగానే విద్యార్థులు ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిపోవడం కాకుండా సివిల్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ తదితర ఆల్ఇండియా సర్వీసెస్ వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలను అడిగే వారిగా కాకుండా మీరే పదిమందికి ఉద్యోగాలను ఇచ్చే స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఏఐ వచ్చాక ప్రపంచం మొత్తం యువత చేతుల్లో ఉందని, వినూత్న ఆలోచనలతో గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలను ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు. సిద్దిపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం సిద్దిపేటలో త్వరలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి తరహా లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయను న్నట్టు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో హైదరాబాద్కు చెందిన సింధు క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా వ్యాధిని జయించవచ్చన్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే మిగిలిన ఐదు శాతం పనుల కోసం నిధులు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సింధు ఆస్పత్రి వైస్ చైర్మన్ గోపాలకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశం, డాక్టర్ త్రిష తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ.. దూకుడేదీ?
● రెండేళ్లుగా నమోదు కాని ఆదాయానికి మించి ఆస్తుల కేసు ● జిల్లాలో పలుశాఖల్లో భారీ అవినీతి తిమింగలాలు ● రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులకే పరిమితం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఉమ్మడి జిల్లాలో మాత్రం సాధారణ కేసులకే పరిమితమవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసు గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేవలం లంచం తీసుకుంటుండగా.. పట్టుబడుతున్న కేసులే అడపాదడపా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏసీబీ నమోదు చేస్తున్న ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసుల్లో కట్టల పాములు బయటకు వస్తున్నాయి. రూ. వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోల కొద్ది బంగారం, ఖరీదైన వాహనాలు.. ఇలా కళ్లు బైర్లు కమ్మె స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏసీబీ పనితీరు ఉంది. రూ. పది వేలు లంచం తీసుకుంటుంగా పంచాయతీ సెక్రటరీని పట్టుకోవడం, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. మున్సి పాలిటీ బిల్లు కలెక్టర్ను ట్రాప్ చేయడం వంటి కేసులతో సరిపెడుతున్నారు. డివిజన్ స్థాయి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులు మరో నాలుగు నమోదయ్యాయి. పెద్ద తిమింగలాలపై నజరేదీ? ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి ఉన్నతాధికారుల అక్రమార్జన రూ.కోట్లలో ఉంటోంది. రూ.వందల కోట్లలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రూ.కోట్లు విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు కొందరు భారీగా అక్రమాస్తులను కూడ గట్టారు. ఎన్నికల నిబంధనల కారణంగానో, ఇతర సాధారణ బదిలీల్లో వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేసినా వారు తిరిగి ఉమ్మడి జిల్లాకే వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పి రెవెన్యూలో మరింత కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నాయి. విద్యుత్శాఖలోని కొందరు ఇంజనీరింగ్ అధికారుల అక్రమార్జన అంతా ఇంత కాదు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు రోజువారీ అక్రమార్జనే రూ.లక్ష వరకు ఉంటోంది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలతో మున్సిపల్ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఒకేచోట పనిచేసి బదిలీ అయిన నీటిపారుదలశాఖలోని ఓ అధికారి చెరువులకు ఎన్ఓసీల జారీలో చేసిన వసూళ్లు రూ.కోట్లలో ఉంటుందనేది ఆశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుశాఖలోనూ కొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవల రూ.వందల కోట్లు అక్రమాస్తులు బయటపడిన బీంరెడ్డి గతంలో పటాన్చెరు డీఎస్పీగా పనిచేసిన విషయం విధితమే. ఇలా జిల్లాలో అవినీతి తిమింగలాలను వదిలేసి.. చిన్నా.. చితక కేసులతో ఏసీబీ సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏసీబీ ఉమ్మడి జిల్లాలో కేవలం ఆరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన వారిలో కొమురవెల్లి మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి, సదాశివపేట మున్సిపాలిటిలో బిల్లు కలెక్టర్ వంటి కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. మిగిలిన నలుగురిలో కొల్లూరు ఎస్ఐ, విద్యుత్శాఖ నర్సాపూర్ ఏడీఈ, ఐడీఏ బొల్లారం ఏఈఈ, చేర్యాల తహసీల్దారులు ఉన్నారు. ఈ ఆరుగురిలో చేర్యాల తహసీల్దార్ మినహా మిగిలిన వారంతా రూ.పది వేలు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారే. అక్రమాస్తుల కేసులు నమోదు చేయాలంటే సరైన ఆధారాలు లభించాలని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఈ ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. -
శాకాంబరీదేవిగా శ్రీవిద్యాసరస్వతి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకాంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
మూడెకరాలకే సరిపోతుంది..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన పుట్ట వెంకటేశం. ఇతనికి ఆరెకరాల పొలం ఉంది. బోర్ ఉంది..ప్రతీ సంవత్సరం ఆరెకరాలు సాగు చేస్తున్నారు. గతేడాది విద్యుత్తు అంతరాయం లేకుండా రావడంతో ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సారి విద్యుత్తు సరఫరా 11 నుంచి 12 గంటలే వస్తుండటంతో మూడెకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఓ వైపు వర్షాలు కురవకపోవడం...మరోవైపు విద్యుత్ సరఫరా 24గంటలు వ్యవసాయంకు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలని వెంకటేశం కోరుతున్నారు. -
విఫలమైన విత్తన మేళా!!
● 26 మండల కేంద్రాల్లో కార్యక్రమాలకు స్పందన కరువు ● తొలిరోజు కొనుగోళ్లు 10క్వింటాళ్లలోపే ● జిల్లాలో పరిస్థితిపై పరిశీలన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ తొలిరోజు సోమవారం చేపట్టిన ‘విత్తన మేళా’లు విఫలమయ్యాయి. జిల్లాలోని 26మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు 154మంది మాత్రమే రైతులు హాజరయ్యారు. అన్ని రకాల విత్తనాలు కలుపుకొని 10క్వింటాళ్లలోపు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’పరిశీలన. గజ్వేల్: జిల్లాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఫలితంగా వర్షపాతం గణనీయంగా పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 272.4మి.మీలు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 185.9మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.7% లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగు ముందుకుసాగటం లేదు. 5.41లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని భావిస్తే ఇప్పటివరకు 50% కూడా పంటలు సాగులోకి రాలేదు. ప్రధానంగా వరి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పత్తి ఇప్పటివరకు 1,03,461ఎకరాలు, కందులు 6,549, మొక్కజొన్న 26,969, స్వీట్కార్న్ 909, సజ్జలు 55, పెసర్లు 158, చెరుకు 25, ఇతర పంటల 2,483ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుందని భావించిన వరి కేవలం 1,10,637 ఎకరాలకే పరిమితమైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటలు 2,51,372ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చాయి. దీనిబట్టి సాగు అంచనా 50%కూడా దాటలేదు. రైతుల నుంచి స్పందన కరువు ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 26 మండల కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద విత్తన మేళాలను నిర్వహించడానికి నిర్ణయించగా తొలిరోజు సోమవారం నిర్వహించిన శిబిరాలకు కనీస స్పందన కరువైంది. 25 మంది రైతులు 3.72క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనం, అయిదుగురు రైతులు 20కిలోల స్వీట్కార్న్, 80మంది 4క్వింటాళ్ల కంది, 37మంది 1.5క్వింటాళ్ల కురగాయల విత్తనాలు, నలుగురు 20కిలోల పెసర్లు, ఇద్దరు 8కిలోల మినుమలు, మరొకరు 4కిలోల నువ్వుల విత్తనాలను కొనుగోలు చేశారు. మొత్తమ్మీద 10క్వింటాళ్లలోపు విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయగా...వీటిని కూడా వ్యవసాయాధికారులు అతికష్టమ్మీద రైతులచేత కొనుగోలు చేయించారు. సబ్సీడీ లేకపోవడమే కారణం! రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాలకు సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే విత్తన మేళాలకు స్పందన కరువైందని స్పష్టమవుతోంది. బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలనే యథాతథంగా మేళాల్లో అందజేయడం ఏంటని, దీనికోసం ప్రత్యేకంగా హడావిడి చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
విత్తన మేళాలతో ఏం లాభం?
విత్తన మేళాలతో ఒరిగేదేమీలేదు. విత్తనాలకు సబ్సిడీ వర్తింపజేయపోగా, బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలనే అదే ధరపై అందిస్తున్నారు. పప్పుధాన్యాలు పండిద్దామనుకుంటే...కోతుల బెడదతో ఆ పంటలకు నష్టం జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి...? –నరేందర్రెడ్డి,రైతు, ధర్మారెడ్డిపల్లి–గజ్వేల్ మండలంవిత్తన మేళాలో అందజేస్తున్న విత్తనాలకు సబ్సీడీ వర్తించదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మేళాలో రైతులు ఎక్కువమంది పాల్గొనేలా చూస్తాం. – మల్లయ్య, జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి -
సంక్షోభంలో గురుకులాలు
● నాణ్యమైన విద్య, ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం ● బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేసీఆర్ హయాంలో సంక్షేమంగా ఉన్న గురుకులాలు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల ఎదుట సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ..బీసీ గురుకులంలో అనేక సమస్యలున్నాయన్నారు. గురుకులంలో నెలకొన్న సమస్యలకు తోడుగా ఉపాధ్యాయులు వ్యవహారం సక్రమంగా లేదని ఆరోపించారు. విద్యార్థులకు వసతులు కల్పించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, మౌలిక సౌకర్యాలు కల్పించిందని, నేటి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. -
కరెంట్ కట్కట్
● ఓ వైపు సహకరించని ప్రకృతి... మరోవైపు కరెంట్ కోతలు ● బోర్లు, బావులున్నా సాగు చేద్దామంటే..అడ్డంకిగా విద్యుత్ ● కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు ● వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాపై ‘సాక్షి’పరిశీలన వ్యవసాయ సీజన్ పూర్తిస్థాయిలో జోరందుకోక ముందే విద్యుత్తు సరఫరాలో కోతలు పెడుతున్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. 24గంటల విద్యుత్తు సరఫరా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. అందులో సగం అంటే 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి, సిద్దిపేట: ఓ పక్క వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బంది పడుతుండగా..బోర్లు, బావులు అందుబాటులో ఉన్న వారు కొంతభాగం సాగు చేస్తున్న రైతులను విద్యుత్తు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వచ్చే విద్యుత్తులోనూ మధ్య మధ్యలో కోతలు పెడుతుండటంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. సహకరించని ప్రకృతి జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉండటంతో బోర్లు, బావులు ఉన్న వారే సాగు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.60లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి. వరి పంటలు సాగు చేసేందుకు నార్లు పోసి రైతులు దిక్కులు చూస్తున్నారు. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 31% లోటు వర్షపాతం నమోదైంది. బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు సాగుచేయాలనుకునే వారు విద్యుత్తు కోతలను చూసి రైతులు ముందుకురావడం లేదు. ఓ వైపు ప్రకృతి సహకరించడం లేదు. మరోవైపు విద్యుత్ అధికారులు 24గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. దీంతో సాగు చేస్తున్న వారు...సాగు చేయాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 10 నుంచి 12 గంటలే క్షేత్రస్థాయిలో విద్యుత్తు సరఫరాను సోమవారం ‘సాక్షి’పరిశీలించింది. పలు మండలాల్లోని సబ్స్టేషన్లవారీగా పరిస్థితి ఎలా ఉందని రైతులు, ప్రజలను ఆరా తీసింది. ఈ పరిశీలనలో చాలాచోట్ల 10 నుంచి 12గంటలు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు స్పష్టమైంది. దీనికితోడు లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే వస్తున్న కరెంటు కూడా పదేపదే ట్రిప్, విద్యుత్తు మరమ్మతుల కోసం ఎల్సీ తీసుకుంటున్నారు. ఈసారి వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడి సాగుకు సిద్ధపడ్డారు. సరఫరా అంతంతమాత్రమే ● హుస్నాబాద్ మండలం తోటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయానికి 13గంటల త్రీఫేస్ విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. సబ్స్టేషన్లో సోమవారం లాంబో పగిలిపోవడంతో మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. దీంతో తోటపల్లి పరిధిలో 9:30గంటలే విద్యుత్తు సరఫరా అయింది. ● కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్స్టేషన్లో ప్రతీ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రెండుసార్లు ఎల్సీ తీసుకుని విద్యుత్తు వైర్ల మరమత్తులు చేశారు. చేర్యాల మండలంలో సైతం ఉదయం 5 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్తు సరఫరా అందించగా రెండుసార్లు ఎల్సీ తీసుకున్నారు. ● మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ సబ్స్టేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్ను అందిస్తున్నారు. ఖాజీపూర్లో ట్రాన్స్ఫార్మర్లో కార్బన్ రావడంతో విద్యుత్ దాదాపు గంట పాటు వివిద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● కోహెడ మండలంలో సైతం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మండలంలో పలు చోట్ల రెండు నుంచి మూడుసార్లు ఎల్సీ తీసుకోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. -
కొమురవెల్లిలో ఘనంగా వరుణయాగం
కొమురవెల్లి (సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు సోమవారం ఘనంగా వరుణయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి పూజ, గౌరీపూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశ రుద్ర, పంచాచార్య కలశ స్థాపన, ఆరాధన, మహాగణపతి హోమం, ఆవాహిక మండపా దేవత ఆవాహనం, రుద్రహోమం, వరుణ మూల మంత్ర, జయాధి హోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 ఘటాలతో మహాస్వప్నం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుడ్డి శ్రీనివాస్, పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షపు నీటిని ఒడిసి పట్టాలి
సిద్దిపేటరూరల్: ఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గ్రామాల్లో పనులు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ హైమావతి ఎల్నినో ప్రభావంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రెండు రోజులలో మండల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులను, మండల స్థాయి అధికారులను ఆహ్వానించి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. రైతులకు వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు పండించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ భూమి ఖాళీగా ఉంచకుండా ప్రతీ రైతు ఏదో ఒక మెట్ట పంట పండించేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు తాగునీటికి సరిపోతాయని, బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు త్రాగునీరు సరఫరాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా ముందస్తుగా పర్యవేక్షించాలన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 100 ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. వీటితోపాటు పెరుక్యులేషన్ పాండ్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ, పర్సనల్ సోక్ పిట్స్, ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో రూప్టాప్ వాటర్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతులు, సమస్యలను క్షేత్రస్థాయిలో సమీ క్షించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేశ్రామ్, ఇరిగేషన్ ఈఈ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంపై అధికారుల సమీక్షలో కలెక్టర్ హైమావతి -
29న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్
ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే భయపడకుండా ముందస్తుగా వ్యాధి నిర్ధారణతో మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చని అందుకే ఈ నెల 29న సిద్దిపేట ప్రజల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. 40ఏండ్లు నిండిన ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సింధూ క్యాన్సర్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత నిర్ధారణ శిబిరాన్ని స్థానిక విపంచి ఆడిటోరియంలో ఈ నెల 29న ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభ దశలో లక్షణాలు కన్పించవని, కానీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా లక్షణాలు బయట పడతాయన్నారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు చనిపోతున్నారని, దీనికి కారణం లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడమేనన్నారు. గతంలో కొన్ని స్క్రీనింగ్ టెస్టు శిబిరాలు ఏర్పాటు చేసి, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సకాలంలో చికిత్స ఇవ్వడంతో ప్రస్తుతం వారు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. మహిళలకు అవసరం మేరకే పాప్ స్మియర్ టెస్ట్, రక్త పరీక్షలు, ఎక్స్ రే లాంటివి చేస్తారన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకటౌన్: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం అత్యంత అవసరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్ను కొత్త ప్రభాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతీ రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఫిట్నెస్తోపాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక ఫిట్నెస్ కేంద్రాలు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పీఆర్టీయూ నాయకుల డిమాండ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): వేసవి సెలవుల్లో జనగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, శశిధర్శర్మ డిమాండ్ చేశారు. సోమ వారం జిల్లా విద్యాశాఖ ఇన్చార్జి అధికారి రమేశ్ కు పీఆర్టీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. భారత ప్రభుత్వం ప్రతీ పదేళ్లకు ఒక సారి నిర్వహించే జనగణనలో వేసవికాలాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలో ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. ఆర్డీఓ సదానందం సిద్దిపేటజోన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆర్డీఓ సదానందం ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అర్జీలు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ఐదు దరఖాస్తులను స్వీకరించారు. -
భక్తుల కల నెరవేర్చిన మోదీ
●కొమురవెల్లిపుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు ●హర్షం వ్యక్తం చేసిన భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొమురవెల్లి మల్లికార్జున ఆలయ సమీపంలో కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లిపుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్తో కలసి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ...గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్తో నడుస్తున్న ఈ లైన్ను తర్వలోనే రూ.300కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోధీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరబాద్ రైల్వే పనులు పూర్తవుతాయని, తెలంగాణ అభివృద్ది పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం మరింత ప్రాముఖ్యత సాధించాలని, దానికోసం ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో చేర్చాలని కోరారు. కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ మల్టిపుల్ లైన్స్ ఏర్పాటు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో హజరయ్యారు. అనంతరం నాయకులు రైలును స్టేషన్ జెండా ఊపి ప్రారంభించి రైలులో ప్రయాణించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్రావు, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి తగిన ప్రాధాన్యతనివ్వడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. జై పల్లా అంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు కల్పించుకుని వారిని శాంతింపజేశారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్ హైమావతి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఆమేరకు రైల్వే అధికారులు ప్రొటోకాల్ ఇవ్వలేదని వెంటనే వెనుదిరిగారు. -
చేసిన సేవలకే జాతీయ పురస్కారం
మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. -
బడి చేరని వస్త్రం
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 40 రోజులు కావొస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందలేదు. దీంతో విద్యార్థులు గతేడాదిలో వాడిన యూనిఫాంలనే ధరించి బడులకు వస్తున్నారు. కనీసం జెండా పండుగ నాటికై నా కొత్త యూనిఫాంలు అందుతాయేమోనని పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలల పరిధిలో 73 వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వీరికి ప్రతీ ఏటా 4.09లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉంటుంది. అయిన నేటివరకు జిల్లాకు వస్త్రం చేరుకోలేదు. దీంతో విద్యార్థులు పాత యూనిఫాంలతో బడికి వస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాలలకు యూనిఫాంలతో రావడం తప్పనిసరి కావడంతో విద్యార్థులు చినుగుల్ని కుట్టుకుని పాఠశాలలకు వస్తున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నాడు విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. రెండు జతల చొప్పున మొత్తం విద్యార్థులకు 1.46లక్షలు యూనిఫాంలు అవసరమవుతాయి. మార్పులతోనే ఆలస్యమా? ప్రతీ విద్యాసంవత్సరం ఒకే విధమైన యూనిఫాం ఉండటంతో విద్యార్థులకు సరిపడా వస్త్రాన్ని త్వరగా పంపించే వారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు వివిధ రంగులతో కూడిన యూనిఫాంలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోనే నూతన వస్త్రం వచ్చేందుకు సమయం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కనీసం నెల రోజుల సమయం జిల్లాకు ఇప్పుడు వస్త్రం వచ్చిన మహిళ సంఘాలకు కుట్టడం కోసం ఇస్తారు. మహిళ సంఘాల సభ్యులు యూనిఫాంలు కుట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. దీంతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవానికి విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠఽశాలలకు రావాల్సిందే. ఇబ్బందులు పడుతున్న 73వేల మంది విద్యార్థులు జెండా పండుగకై నా అందేనా? 4.09లక్షల మీటర్లు అవసరం -
టీజీసీజీటీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్(టీజీసీజీటీఏ) సిద్దిపేట జిల్లా కార్యవర్గం ఎన్నికలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా డాక్టర్ శ్యాంసుందర్, ప్రధానకార్యదర్శిగా డాక్టర్ పిట్లదాసు, కోశాధికారిగా డాక్టర్ సీహెచ్.మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ శ్రీలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ...అధ్యాపకుల సమస్యలను పరిష్కారానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా అధ్యాపకులకు అనుసంధానకర్తలుగా ఉండి అధ్యాపకుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు. తమను ఎన్నుకున్న జిల్లాలోని అధ్యాపకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల యూనిట్ బాధ్యులు ఉమామహేశ్వరీ, పవన్కుమార్, సత్యనారాయణరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ప్రొఫెసర్ అయోధ్యరెడ్డి, మట్టా సంపత్కుమార్రెడ్డి, స్రవంతి, శ్రీలత, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీని అమలు చేయాలిటీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజేందర్రెడ్డి, కనకయ్య పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటలో ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తారు వర్షం కురిసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్లో వివిధ కోర్సుల్లో ఉన్న ఖాళీలకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 15, బైపీసీలో 15 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఖాళీ సీట్లను జోనల్ అధికారి ఉత్తర్వుల మేరకు నేరుగా భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
● ఘనంగా మహంకాళీ అమ్మవారి బోనోత్సవం ● అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్రావు గజ్వేల్రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటామని, ఆషాఢమాసంలో భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఆషాఢమాసంలో నిర్వహించే మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహంకాళీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిత్యపూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి చాడ నందబాలశర్మ, పూజారి విఠాల సాయికృష్ణశర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతోపాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు భాస్కర్, రాజమౌళి తదితరులు మహంకాళీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ... ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. పట్టణంలోని మహిళలు, ఆడపడుచులు బోనాలను అందంగా అలంకరించి నెత్తిన పెట్టుకుని పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల మధ్య దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళీ దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
గజ్వేల్: తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడూ జరగలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఆదివారం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడి నుంచి గజ్వేల్ స్టేషన్ వరకు మెదక్ ఎంపీ రఘునందన్రావుతో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర, ఇతర అంశాల ఆధారంగా రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతీ రైల్వేలైన్ను విద్యుదీకరించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ముంబై వయా పుణే, హైదాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–అమరావతి–చైన్నె మూడు బుల్లెట్ ట్రైన్లు, 5 వందేభారత్, మరో ఆరు అమృత్ రైళ్లను నడపడానికి నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధిపైనా దృష్టి పెట్టామన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ను మరో రూ.40కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నుంచి వచ్చే భక్తులకు ఈ రైలులో అతిచౌకగా రూ.25తో ప్రయాణించి కొమురవెల్లి మల్లన్నను దర్శనం చేసుకోవచ్చున్నారు. రూ.100కే నెల పాస్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేలైన్ల విద్యుదీకరణ, ఇతర సదుపాయాల కల్పన కొత్తగా మరిన్ని బుల్లెట్, వందేభారత్, అమృత్ రైళ్లు యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి కొమురవెల్లి నుంచి గజ్వేల్ వరకు రైలులో ప్రయాణం -
ఆగమశాస్త్రం ప్రకారమే దేవాలయాల నిర్మాణం
● దేవదాయశాఖ స్థపతి వల్లి నాయకం ● పోచమ్మ ఆలయంలో శిలాయంత్ర ప్రతిష్ఠ దుబ్బాక: దేవాలయాల నిర్మాణంతోపాటు విగ్రహాల యంత్ర ప్రతిష్ఠ ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ స్థపతి వల్లినాయకం స్పష్టం చేశారు. దుబ్బాకలో పోచమ్మ ఆలయం పునరుద్ధరణలో భాగంగా ఆదివారం శిలా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు ఉండటం చాలా శ్రేష్టమన్నారు. అమ్మవార్ల దయతో పచ్చని పంటలతో ఆయా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయంలో అన్ని దేవతల విగ్రహాలను శాస్త్రప్రకారం ప్రతిష్ఠించాలని సూచించారు. నూతన ఆలయాలు నిర్మించడంతోపాటు ఆలయాలు ధూప, దీప,నైవేద్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. -
సమీకృత స్కూల్ పనులు వేగిరం
కలెక్టర్ హైమావతి కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. కోహెడ మండలంలో జిల్లా కలెక్టర్ హైమావతి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మొదట తంగళ్లపల్లి శివారులో దాదాపు 23 ఎకారల విస్తీర్ణంలో జరుగుతున్న భారీ విద్యాసంస్థ నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియతిరిగి పనుల పురోగతిని చూసిన ఆమె రాష్ట్రంలోనే నిర్మాణ వేగంలో ఖమ్మం జిల్లాతో సమానంగా సిద్దిపేట అగ్రస్థానంలో కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఇటుకలు వాడకుండా ఆధునాతన మైవాన్ టెక్నాలజీతో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం కోహెడలోని బాలుర కళాశాలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అక్కడి వండిన అన్నం,క్యాజేజీ కూర, పప్పు రసం, పెరుగును రుచి చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్మెనూను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసిన కలెక్టర్ రికార్డులను సక్రమంగా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందికి సరుకులు అందించే ముందు మెస్ కమిటీ సమక్షంలో కొలతల ప్రకారం పారద్శకంగా ఇవ్వాలని అలా కాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వంట సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. రికార్డులు రాకయపోవడంపై తక్షణమే విచారణ జరపాలని డీసీఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. -
పొదుపు రుణం పక్కదారి
ఒక సభ్యురాలికి రెండు బ్యాంకుల్లో రుణం● రూ.2 కోట్ల రుణాలు దారిమళ్లింపు ● పల్లెలో నిలిచిన శ్రీనిధి రుణాలు ● క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చర్యలు తీసుకోలే మా ఊరిలో రెండు గ్రామైక్య సంఘాలు ఉంటే రూ.50 లక్షల వరకు బకాయిలు ఉండటంతో కొత్త వారికి రుణాలు ఇవ్వడంలేదు. బోగస్ సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఒకరే రుణాలను వాడుకోవడం వల్ల రూ.2 కోట్ల రుణాలు పక్కదారి పట్టాయి. వీటిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి దారి మళ్లిన రుణాలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలి. –బొమ్మగాని రాజ్కుమార్, ఉపసర్పంచ్, పోతారం మా దృష్టికి ఫిర్యాదు రాలేదు ఒక సంఘం మూడు నెలలు వాయిదాలు క్రమంగా చెల్లించకపోతేనే ఆ సంఘం గురించి బ్యాంకు అధికారులు మా దృష్టికి తీసుకొస్తారు. రుణాలు పక్కదారి పట్టిన విషయంలో మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –సుధీర్, ఏపీడీ, సిద్దిపేట మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలు జిల్లాలో కొన్ని చోట్ల పక్కదారిపడుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను కొంతమంది దుర్వినియోగం చేయడంతోపాటుగా వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతో అవి మొండి బకాయిలుగా మారిపోతున్నాయి. దీంతో కొంతమంది మహిళలకు కొత్త రుణాలు అందడం లేదు. హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండలంలో 590 సంఘాల్లో 5,740 మంది సభ్యులు బ్యాంకు లింకేజీతో పాటు శ్రీనిధి రుణాలను తీసుకున్నారు. చాలామంది రుణాలు చెల్లించిన కొన్ని గ్రామాల్లో శ్రీనిధిలో మొండి బకాయిలు దాదాపు రూ.95 లక్షల చేరగా జిల్లెలగడ్డ, పోతారం(ఎస్) గ్రామాల్లో రూ.60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో కొత్తవారికి శ్రీనిధి రుణాలు నిలిపి వేసినట్లు సంఘ సభ్యులు వాపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు, పాడి పశువుల కొనుగోలుకు అవసరపడతాయని భావించిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. మొండి బకాయిలను వసూలు చేసిన తర్వాతే కొత్త రుణాలు ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేయడంతో సభ్యులకు కొత్త రుణాలు అందడం లేదు. ఒకరికి రెండు బ్యాంకుల్లో రుణం జిల్లాలో 19,897 సంఘాలు ఉండగా అందులో 1,96,623 మంది సభ్యులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. బ్యాంకుల రుణాలకు తోడు స్వయం ఉపాధి, పాడి పరిశ్రమ ఏర్పాటుకు శ్రీనిధి బ్యాంకు ద్వారా కూడా రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీల ద్వారా ఉపాధి పొందాలని అధికారులు ఎలాంటి తాకట్టు లేకుండా ఒక్కొక్క సంఘానికి రూ.20లక్షల వరకు బ్యాంకు లింకేజీలు ఇప్పిస్తున్నారు. కొందరు అధికారుల మంచితనం ఆసరా చేసుకుని ఒక బ్యాంకులో లింకేజీ తీసుకున్న గ్రూపు సభ్యులు రుణం చెల్లించకపోవడంతో ఆ గ్రూపులను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. గ్రామాల్లోని సీఏల సహకారంతో అదే సభ్యులతో లీడర్లను మార్చి కొత్తగ్రూపు ఏర్పాటు చేసి మరో బ్యాంకులో లింకేజీ ఇప్పించారు. ఇందులో కెనరా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో బోగస్ మహిళా గ్రూపు సభ్యులు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు రూ.2 కోట్ల బ్యాంకు లింకేజీ బోగస్ గ్రూపుల పేరుతో తీసుకుని మరొక్కరు రుణాలను సొంతానికి వాడుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్ ఏపీఎం దగ్గరకు పోతారం(ఎస్) మహిళలు వచ్చి మాకు ఒక బ్యాంకు రుణమే తెలుసు రెండో బ్యాంకు రుణం మాకు తెలియదని ఫిర్యాదు చేయడంతో ఏపీఎం గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు చేసి రుణం పొందిన వారి వివరాలను వెల్లడించారు. గ్రామైక్య సంఘం అధ్యక్షులను, సీఏలను అధికారులు వారికి అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని నడిపించడం వల్ల ఇలాంటి అక్రమాలు బయటకు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్కొక్కరితో పనులెలా సాగేది?
● తాగునీటి ట్యాంక్ పనులు త్వరితగతిన జరగాలి ● వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి ● మున్సిపల్ అధికారులతో మాజీమంత్రి హరీశ్రావు సమీక్ష సిద్దిపేటజోన్: జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ఒక్క అసిస్టెంట్ ఇంజనీరు, ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్తో పనులు ఎలా జరిగేది? రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్రావు మున్సిపల్ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ పనుల స్థితిగతులు గురించి ఆరా తీశారు. నలుగురు అసిస్టెంట్ ఇంజనీర్లకుగాను ఒక్కరే విధుల్లో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీల వల్ల మున్సిపాలిటీ పనులెలా నడుస్తాయని ప్రశ్నించారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఎన్సీకి ఫోన్ చేసి ఇంజనీరింగ్ పనుల వేగవంతం కోసం అసిస్టెంట్ ఇంజనీర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో మిగిలిన యూజీడీ పనులను వెంటనే ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం చెరువుల పనులను వేగవంతం చేయాలని, వివిధ కూడళ్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు సూచించారు. పట్టణంలో నిర్మిస్తున్న నీటిట్యాంక్ల పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీలో సేవలు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈ ప్రేరణ పాల్గొన్నారు. -
పుణ్య తీరం.. దోపిడీ తీర్థం
ఏడుపాయల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేలా.. దోపిడీకి అడ్డాగా మారింది. రూ.300 విలువ చేసే కోడి కోయాలంటే రూ.200 వసూలు చేస్తున్నారు. మేక, గొర్రెలకై తే బరువును బట్టి కాకుండా కాంట్రాక్టర్ చెప్పిందే ధర. ఇక కొబ్బరికాయల విక్రయాల్లో సైతం నేతి దీపాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కులు మొక్కి, మూట గట్టుకొని తెచ్చిన ఒడి బియ్యం సమర్పణలో సైతం కాంట్రాక్టర్ బలవంతపు కట్నాలు వసూలు చేస్తున్నాడని భక్తులు చెబుతున్నారు. దుర్గమ్మ సాక్షిగా భక్తుల నిలువు దోపిడీ కొనసాగుతున్నా.. ఆలయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. – పాపన్నపేట(మెదక్)దుర్గమ్మసాక్షిగాబరితెగింపునిబంధనలకువిరుద్ధంగాకబేలా నిర్వహణతెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయలకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. మందు, విందు అక్కడ నిత్యకృత్యం. అయితే ఇక్కడ జంతు బలి నిషేధం. గతంలో భక్తులు ఎక్కడ బడితే అక్కడే మేకలు, గొర్రెలు కోసే వారు. దీంతో 2019లో అనధికారికంగా అప్పటి పాలకవర్గం కబేలా కోసం ఒక పర్మనెంట్ షాప్ నిర్మించి, ఐదేళ్ల పాటు ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించుకోవాలని తీర్మానం చేసింది. మేకకు 10 కిలోల లోపు రూ.400, 10–20 కిలోల లోపు రూ.500, 20 కిలోలపై రూ.600 వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో మూగ జీవిపై రూ.25 దేవస్థానానికి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు మెదక్కు చెందిన కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకొని 2024 వరకు నిర్వహించాడు. నిర్ణయించిన సమయం పూర్తి కావడంతో అతడిని తొలగించాలని కోరుతూ నాగ్సాన్పల్లి గ్రామస్తులు కబేలా ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆలయ అధికారులు కబేలా సీజ్ చేసి, స్థానిక వ్యాపారులకు అవకాశం కల్పించారు. అయితే తాను కరోనా సమయంలో నష్టపోయినందున, తనకు సమయం పెంచాలని కోరుతూ అతడు కోర్టుకు వెళ్లాడు. కాగా, ఇటీవల ఆలయ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడి కోర్టు కేసు విత్ డ్రా చేయించారు. రెండు నెలల క్రితం తిరిగి కబేలా నిర్వహణ అతడికే అప్పగించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మేకలు, గొర్రెలకు బరువును బట్టి కాకుండా, తనకు ఇష్టమొచ్చిన రీతిలో రూ.700 నుంచి 1,000 వరకు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇక రూ.300 కోడిని, కట్ చేయడానికి రూ.200 తీసుకుంటున్నారు. దేవస్థానానికి మాత్రం మేకకు రూ.50 టికెట్ తీసుకోవాల్సి ఉంది. ఒడి బియ్యం సమర్పణలోనూకట్నాల వసూలు ఏడుపాయల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఇక ఇదే కాంట్రాక్టర్కు కొబ్బరికాయల కాంట్రాక్ట్ సైతం ఉంది. కొబ్బరికాయను నెయ్యి దీపంతో కలిపి రూ.50కి విక్రయించాలి. కానీ నెయ్యి దీపం లేకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో ఒడి బియ్యం కాంట్రాక్టర్ సైతం భక్తుల నుంచి కట్నం పేరిట రూ.100 నుంచి 200 బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చేతికి కట్టే దారానికి రూ.10 నుంచి 20 వరకు దండుకుంటున్నారని భక్తులు అంటున్నారు. ధర్మ సత్రాలు కేటాయించడంలో కూడా ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా దుర్గమ్మ సాక్షిగా ఏడుపాయలకు వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయమై ఈఓ వీరేశంకు ఫోన్లో వివరణ కోరగా స్పందించలేరు. -
వేతన బకాయిలివ్వండి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు గజ్వేల్: గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను శుక్రవారం సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్మికులకు ఇప్పటికే అతి తక్కువ వేతనాలు అమలు చేస్తున్నారన్నారు. అవీ కూడా సకాలంలో అందజేయడం లేదని ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఇబ్బందులను తెలుసుకున్న గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ జిల్లా రమేశ్ ఆధ్వర్యలో నిత్యావసరాలను అందజేయడానికి ముందుకురాగా...ఆ ప్యాకెట్లను ప్రసాదరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరాఠి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు పేర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోనమ్ వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా.. గజ్వేల్రూరల్: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా గజ్వేల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి, ఉపాధ్యా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, నీట్ పేపర్ లీకేజీతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ భగవంత్రావు సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పా టు చేశారు. ఈ మేరకు జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భగవంత్రావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకానికి సంబంధించిన అర్హతలు, ధ్రువపత్రాల సమర్పణ, చెల్లింపులు, ఇళ్ల నిర్మా ణం, సాంకేతిక అంశాలు, ఇతర సందేహాల నివృతి కోసం హెల్ప్డెస్క్ సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5991కు కాల్ చేయవచ్చని, 08457–224753 ద్వారా ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. అవసరమైతే సమీప హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని కూడా సంప్రదించి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చన్నారు. చేర్యాల(సిద్దిపేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీలో డిగ్రీ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత, అధ్యయన కేంద్రం సమన్వయకర్త రజిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 37 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.4.06 లక్షలు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందికి రూ.1.55 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఆస్పత్రి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ హైమావతిహుస్నాబాద్: ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందిస్తున్నామనే భరోసా కల్పించాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయ వేళలు పాటిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో పలు విభాగాలకు సంబంధించి వైద్య సిబ్బంది కావాలని కోరగా స్పందిస్తూ...దగ్గరలోని ఆస్పత్రి నుంచి వైద్యులు, సిబ్బందిని హుస్నాబాద్ ఆస్పత్రికి కేటాయించాలని డీఎంహెచ్ఓకు ఫోన్ చేసి ఆదేశించారు. ఆస్పత్రి ఎదుట రూ.82 కోట్లతో కొత్తగా చేపడుతున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. -
ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనా!
హుస్నాబాద్: కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా పని కోసం రీజినల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలంటే కేవలం 40 కి.మీ దూరం ఉండేది. ప్రస్తుతం మెదక్ వెళ్లాలంటే దాదాపు 100 కి.మీ. దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ నెల ఆడిట్, ఏదైనా కేసుల విషయంలో అప్పీలు చేయాలన్నా, కార్మికుల సమస్యలు, డిపో మెయింటనెన్స్ ఇలా ప్రతీ విషయంలో ఆర్ఎం ఆఫీస్కు వెళ్లాల్సి ఉంటుంది. బస్సులకు సంబంధించి నట్లు, బోల్టులు ఇతరత్రా సామగ్రి ఇండెంట్ కోసం మెదక్ వెళ్లాలంటే సమయం వృథా అవుతుంది. పని కాకుంటే అక్కడే మరో రోజు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పాలనాసౌలభ్యం కోసం ఆర్టీసీ డిపోలను ఒకే జిల్లా, ఒకే రీజియన్ పరిధిలో చేరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో తప్ప, అన్ని శాఖల కార్యకలాపాలు సిద్దిపేట జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెదక్ రీజియన్ పరిధిలోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను విలీనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ డిపోను మెదక్ రీజియన్లో కలపవద్దని, యథావిధిగా కరీంనగర్లోనే ఉంచాలని ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ విలీనం అంశంపై ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్ పరిధిలోనే ఉంచాలని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజల డిమాండ్ ఉంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్కు వచ్చిన అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నినాదంతోనే పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా, మంత్రి అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్లో విలీనం చేశారనే ప్రచారంతో హుస్నాబాద్ విలీన ప్రక్రియ మళ్లీ చర్చకు దారితీస్తోంది. కరీంనగర్లో ఉన్న డిపోను మెదక్ రీజియన్లో కలుపుతారనే ప్రచారంతో, విలీన ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మెదక్ రీజియన్లోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపో! జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లాలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ (సంగారెడ్డి) రీజియన్లోకి మార్చారు. ఇక్కడి ఉద్యోగులు, కార్మికులు ప్రతీ పనికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఆర్ఎం ఆఫీస్కు వెళ్లి రావాలంటే ఒక్క రోజు సమయం పట్టేది. కార్మికుల ఒత్తిడి మేరకు మళ్లీ హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్లోకి మార్చారు. కరీంనగర్లోకి మార్చారనే సంతోషం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మళ్లీ హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్లోకి మార్చారనే ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో 44 ఆర్టీసీ బస్సులు, 22 అద్దె బస్సులున్నాయి. 233 మంది ఉద్యోగులు, 25 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. డిపోలోని బస్సులు ప్రతీ రోజు 26 వేల కిలో మీటర్లు, రూ.15లక్షల కలెక్షన్ వస్తోందని అంచనా.అధికారికంగా ఉత్తర్వులు రాలేదు హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్లోకి విలీనం చేసినట్లుగా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. విలీన ప్రక్రియపై సమాచారం లేదు. ప్రస్తుతం డిపో కరీంనగర్ రీజియన్లోనే కొనసాగుతుంది. విలీనం అయినట్లు జరుగుతున్న ప్రచారం ఎవరు నమ్మొద్దు. –వెంకన్న, ఆర్టీసీ డిపో మేనేజర్, హుస్నాబాద్ -
ఆరుతడి పంటలే సాగు చేయండి
మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ హుస్నాబాద్రూరల్/హుస్నాబాద్: రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలే సాగు చేయాల ని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో వచ్చే జూన్ వరకు వర్షాలు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నా రైతు లు వినడం లేదని మంత్రి ఆందోళ న వ్యక్తం చేశారు. హుస్నాబాద్ డివిజన్ ఇంటి గ్రేటెడ్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్ట ర్లు, అధికారులతో ఎల్నినో ప్రభావం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. వందెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రభుత్వం రూ.5లక్షల ప్రోత్సా హం అందిస్తోందని చెప్పారు. ఆయిల్పామ్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు నర్మెటలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నీటి వనరులను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూ సేకరణకు రూ.250 కోట్లు మంజూ రయ్యాయని, ఆ పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జలసిరి పెంచడానికి వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ ఇంకుడు గుంతలు తవ్వించి భూ గర్భ జలాలను పెంచాలని సూచించారు. ఎల్ని నోను జాతీయ విపత్తుగా గుర్తించడానికి ప్రభు త్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. -
గోదావరి జలాలు విడుదల చేయాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): గోదావరి నీటిని విడుదల చేసి రంగనాయక సాగర్ రిజర్వాయర్ నింపాలని గ్రామ సభల్లో గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. చిన్నకోడూరు, పెద్దకోడూరు, గంగాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో గ్రామస్తులు, వార్డు సభ్యులు, సర్పంచ్లు రంగనాయక సాగర్కు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఏక గ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్, ఎంపీడీఓలకు సదరు పత్రాలు అందజేశారు. కళ్ల ముందు నారుమడులు ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని, నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. -
పీఆర్సీని 55% ఫిట్మెంట్తో ఇవ్వాలి
వంగ మహేందర్రెడ్డి సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 55% ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్, గుర్రాలగోంది, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, గోపులాపూర్, ఏదుల్లవాడ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ మహేందర్రెడ్డి మాట్లాడుతూ..పీఆర్సీని తక్షణమే ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. -
రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ పనుల పరిశీలన
కొమురవెల్లి(సిద్దిపేట): కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేమార్గంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన రైల్వేస్టేషన్ను ఈ నెల 26న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్టేషన్లో బుకింగ్ కౌంటర్, ప్లాట్ఫాం, ప్రయాణికులకు అవసరమైన వసతులు, ప్రా రంభోత్సవ సమయంలో నాయకులు ఏర్పాటు చేసే సమావేశం, పార్కింగ్ కోసం స్థల పరిశీలన, భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సీపీఆర్ఓ శ్రీధర్, ఏడీఆర్ఎం రామారావు, సీనియర్ డెన్ ప్రసాద్, సీనియర్ సీసీఎం అనిరుధ్, ఏఎస్సీ రవిశర్మ, సీనియర్ డీఓఎం విద్యాధర్, సృజనకుమార్, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచాలిమల్లంపల్లి పాఠశాలను సందర్శించిన డీఈఓ అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ రోజూ పిల్లలు వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను డీఈఓ రమేశ్ ఆదేశించారు. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాగి జావా, కోడిగుడ్లు ప్రోటీన్ను అందజేస్తాయని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...పాఠశాలలకు రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను వెంట పెట్టుకుని బడులకు తీసుకురావాలన్నారు. అలాగే తరగతి గదిలో విద్యార్థులను వివిధ సబ్జెక్ట్లలో సామర్థ్యాలపై ప్రశ్నలు అడుగుతూ వారి ప్రతిభను గమనించారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, ఉపాధ్యాయులు సర్వన్నాయక్తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమీకృత భవనం పూర్తి చేయండి: బీఆర్ఎస్హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ స్థలంలో పెండింగ్లో ఉన్న శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం ఎదుట చేపల వ్యాపారులతో కలిసి గురువారం బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. చేపలు అమ్ముకునే వ్యాపారులకు మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఈ భవనం పూర్తిచేస్తే చేపల వ్యాపారులకు కొంత వరకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్రెడ్డి, చిత్తారి శ్రీనివాస్, వికాస్యాదవ్, యాస శ్రీనివాస్ తదితరులున్నారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న రాహుల్బీజేపీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ మిరుదొడ్డి(దుబ్బాక): కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని బీజేపీ జిల్లా సీనియర్ నేత కానుగంటి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో కలిసి మిరుదొడ్డిలో గురువారం రాహుల్గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఔనత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వంపై విద్యార్థులను ఉసిగొల్పి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు లింగాల సదానందరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బీజేపీ నాయకులు రమేశ్, స్వామి, ఎల్లం పాల్గొన్నారు. -
పడని వర్షం..
రైతు నేస్తాలను కాపాడుదాంమితిమీరిన రసాయన మందులవినియోగంతో మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. వివరాలు 8లో uప్రత్యామ్నాయ పంటల వైపు మరలేనా? వీడని భయంసాక్షి, సిద్దిపేట: జిల్లాలో సాధారణంగా ఖరీఫ్లో 5.40 లక్షల పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 3.60 లక్షల ఎకరాలు, పత్తి 1.18 లక్షలు, మిగతా పంటలు 62వేలలో సాగయ్యే అవకాశాలున్నాయని ముందుగా ప్రకటించింది. ఎల్నినో ప్రభావంతో సాగు అనుకున్నంతస్థాయిలో కావడం లేదు. లోటువర్షపాతం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇప్పటివరకు కేవలం 34 శాతమే జిల్లాలో ఇప్పటివరకు 1,83,710 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో పత్తి అత్యధికంగా 1,01,009 ఎకరాల్లో వేయగా, 57,093 ఎకరాల్లో వరి, 24,509 ఎకరాల్లో మొక్కజొన్న, మిగతా పంటలు 1,099 మాత్రమే సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనా వేసిన దాంట్లో కేవలం 34% మాత్రమే పంటలు వేశారు. వరి పంటల సాగు నుంచి రైతులను ఆరుతడి పంటల వైపు కొత్తగా 1.25లక్షల ఎకరాలు మళ్లీంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 41 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు ప్రస్తుతం 41వేల ఎకరాల్లో సాగవుతుండగా మరో 11,970 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేవలం ఆయిల్పామ్కు సంబంధించిన మొక్కలు మాత్రమే అందుబాటులో ఉండగా మిగతా పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలను రైతులే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విత్తనాలు అందుబాటులో ఉంచితే కూరగాయ పంటలు సాగయ్యేవని రైతులు అభిప్రాయపడుతున్నారు.ఓ వైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ఆరుతడి పంటలను వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదననే భయాందోళనలు రైతులను వెన్నాడుతున్నాయి.ప్రస్తుతం అన్నదాతల చూపంతా ఆకాశం వైపే ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితి లేకపోవడంతో ఆరుతడి పంటలే వేయాలని జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తారా? వరి సాగుకే మొగ్గుచూపుతారా? లేక ఏ పంటలు వేయకుండా వదిలేస్తారా? అనేది చూడాలి. -
సీజేపీకి భయపడి కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిగజ్వేల్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భయపడి...కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. గజ్వేల్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత 21రోజులుగా విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో ప్రజల్లో కాక్రోచ్ జనతాపార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు. రాష్ట్రంలోనూ పోటాపోటీగా ఈ రెండు పార్టీలు ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారాని కి బీఆర్ఎస్ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కోటబాబు, నాయకులు బొగ్గుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అరెస్ట్లు అప్రజాస్వామికం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ములుగు(గజ్వేల్): విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల అరెస్ట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్లను ఖండిస్తూ ములుగు అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలసి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘భేటీ పడావో’నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సర్కార్ ఢిల్లీలో విద్యార్థినుల పట్ల జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పేపర్ లీక్పై విద్యార్థులు ఉద్యమిస్తే అరెస్ట్లు చేసి ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజీవ్రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కడపల్ల కృష్ణారెడ్డి, చక్రాల రఘు, పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు సలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, సర్పంచ్లు ముత్యంరెడ్డి, లహరి, మమత, పోచయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యోగా టీచర్ నియామకం ఎప్పుడు?
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 33 పీఎంశ్రీ స్కూళ్లకు యోగా టీచర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నుంచి పీఎం శ్రీ స్కూళ్లలో యోగాను నేర్పిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యోగా టీచర్లను నియమించలేదు. దీంతో విద్యార్థు లు యోగాకు దూరమవుతున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల లో యోగా టీచర్ నియామకం కోసం నెలకు రూ. 10 వేల బడ్జెట్ను కేటాయిస్తోంది. గతేడాది నెలకు రూ.8వేల చొప్పున రూ.80వేలను జమ చేశారు. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యంతో చివరి నాలుగు నెలలు మాత్రమే యోగా టీచర్ను నియమించారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి యోగా టీచర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
ఎంఈఓ రాజగోపాల్రెడ్డి దుబ్బాకటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని అందకుక డిజిటల్ స్కిల్స్ దోహదపడతాయని రాయ పోల్ మండల విద్యాధికారి రాజగోపాల్రెడ్డి సూచించారు. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు భాస్కర్రెడ్డి రూ.1.50లక్షల విలువచేసే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ను సైన్స్ ల్యాబ్ను స్వంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఎంఈఓ రాజగోపాల్రెడ్డి గురువారం ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని దానికి అనుగుణంగా విద్యార్థులలో డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల కోసం ఈ ప్యానల్ను అందించిన ఉపాధ్యాయుడు భాస్కర్రెడ్డిని ఎంఈఓ అభినందించారు. -
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: కలెక్టర్
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి తహసీల్దార్కు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కిష్టాపూర్ రోడ్డులో అనంతగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే నిర్వహించి హద్దులు వేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనతంగిరి రిజర్వాయర్ పక్కన గల నీటి పారుదల శాఖకు చెందిన భూమిని పరిశీలించారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సలీమ్ తదితరులు ఉన్నారు. -
మంత్రి ధరేంద్ర రాజీనామా చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నీట్ పరీక్షలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర ముఖ్యనేతల అరెస్ట్కు నిరసనగా మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల అంశంలో పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్పై ప్రధాని, హోమ్ మంత్రి అమిత్షా సమాధానం చెప్పాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయవాదులుగా నిరసన తెలిపారన్నారు. నీట్ పరీక్షల లీక్తో ఆత్మహత్యకు పాల్పడ్పిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ధర్మేంద్రను బర్త్రఫ్ చేయాలి
గజ్వేల్: నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖమంత్రి ధరేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఆయనను బర్తరఫ్ చేయాలని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకంట ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్గాంధీతో ఇతర అగ్రనేతలను అక్రమంగా నిర్బంధించి ఈడ్చుకెళ్లిన ఘటనకు వ్యతిరేకంగా గజ్వేల్లో కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రలు ధర్మేంద్రప్రధాన్, అమిత్షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యుడైన ధరేంద్రప్రధాన్కు ప్రధాని నరేంద్రమోదీ వత్తాసు పలకడం సరికాదన్నారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్న నరేంద్రమోదీ, అమిత్షాలకు ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్, వంటిమామిడి, కుకునూర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, విజయామోహన్, శ్రీనివాస్రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్థార్ఖాన్, ఆత్మ కమీటీ చైర్మన్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాచగిరి.. భక్తజన గిరి
వర్గల్(గజ్వేల్): శ్రీవారి జన్మనక్షత్రం..‘స్వాతి’నక్షత్ర మహోత్సవ వేళ నాచగిరి భక్తజన సందోహమైంది. నృసింహనామంతో శ్వేతగిరి మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బుధవారం ఉదయం పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి ఉత్తరద్వారం వద్ద శ్రీలక్ష్మీనృసింహునికి హారతి సమర్పించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారిని అనుసరిస్తూ ఆలయ ఈఓ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ చైర్మన్ రవీందర్గుప్తా, వేలాదిగా భక్తజన పరివారం ముందుకుసాగారు. గోవిందుని స్మరిస్తూ, గిరిని చుడుతూ, హరిద్రతీరం మీదుగా గిరిని చుట్టి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని పునీతులయ్యారు. వరుణయాగం సంపూర్ణం నాచగిరి సందర్శించిన పీఠాధిపతికి ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వరుణయాగంలో పాల్గొన్నారు. మూడురోజులపాటు కొనసాగిన వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది. వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. -
నవోదయలో ఫుట్బాల్ సెలెక్షన్స్ మీట్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా ఫుట్బాల్ రీజినల్ సెలెక్షన్స్ మీట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్ టోర్నమెంట్ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్ మీట్ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్ సక్సెస్కు అందరూ సహకరించాలని కోరారు. వైస్ప్రిన్సిపాల్ మోహన్రాథోర్, సెలెక్షన్ కోచ్లు, ఎస్కార్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భయపెట్టిన వర్షం.. మూడు గంటలు ఆలస్యం సెలెక్షన్ మీట్ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్ నిర్వహించారు. రీజియన్ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫోకస్గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి. -
యూరియా రవాణ చార్జీలు రద్దు
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, సిద్దిపేట/మెదక్ జోన్/సంగారెడ్డి జోన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల రైతాంగంపై ఎరువుల ధరల పెంపు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. వానాకాలం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపుతో పాటు, యూరియాపై ఉచిత రవాణ సదుపాయాన్ని ఎత్తివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. కాంప్లెక్స్ ఎరువుల ధరల భారం ఖరీఫ్ ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం డీఏపీ/కాంప్లెక్స్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచింది. యూరియా రవాణ చార్జీల మోత గతంలో రేక్ పాయింట్ల నుంచి పీఏసీఎస్లు, డీసీఎంఎస్లు, హాకా, ప్రైవేట్ డీలర్లకు యూరియా రవాణ చేసేందుకు మార్క్ఫెడ్ ఉచిత రవాణ సదుపాయాన్ని అందించేది. కానీ, ఇటీవల ఈ నిర్ణయాన్ని మార్చుకుని రవాణ ఖర్చులను విక్రయదారులే/రైతులే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. విక్రయ కేంద్రాల్లో ‘నో స్టాక్’బోర్డులు ఈ కొత్త నిర్ణయంతో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొంది. యూరియా ఎంఆర్పీ బస్తాపై రూ.266 అని ముద్రించి ఉండటంతో, రవాణ చార్జీలు కలిపి రూ.320కి అమ్మితే రైతులు బిల్లుల గురించి ప్రశ్నిస్తే వారికి ఏం సమాధానం చెప్పాలనే సంశయంతో పీఏసీఎస్ సిబ్బంది, ప్రైవేట్ డీలర్లు స్టాక్ తెప్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్ రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల పంపిణీకి మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంది. రైతులకు సకాలంలో యూరియా అందడంతో పాటు నిర్ణయించిన ధరకు లభించేలా మార్క్ఫెడ్ నుంచి పీఏసీఎస్, ఏఆర్ఎస్, డీసీఎంస్, హాకా కేంద్రాలకు ప్రభుత్వమే రవాణ చార్జీలు భరించి పంపించేవారు. ఇటీవల రవాణ చార్జీలను విక్రయించే వారే భరించాలని నిర్ణయించింది. బస్తాపై రూ.50 పెంపు ‘నో స్టాక్’బోర్డుల దర్శనం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగానికి చెందిన విక్రయ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ‘నో స్టాక్’బోర్డులు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు, ఆరుతడి పంటల సాగు వేగవంతమైన నేపథ్యంలో పైరుకు యూరియా వేయాల్సిన సరైన సమయంలో ఎరువుల ధరలు పెరిగిపోవడం, డీలర్లు సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్నినో భయాలు, డీజిల్ ధరల పెంపు, దుక్కి ఖర్చులతో అల్లాడుతున్న రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రద్దు చేసిన ఉచిత యూరియా రవాణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, అలాగే కాంప్లెక్స్, యూరియా ఎరువుల ధరలను తగ్గించి పంట సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించాలని ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. -
నేడు మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: ఎల్నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.చిత్రలేఖనంలో పంచతంత్ర విద్యార్థి ప్రతిభ చేర్యాల(సిద్దిపేట): స్థానిక పంచతంత్ర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి భారతీశర్మ చిత్రలేఖన పోటీల్లో ప్రథమబహుమతి సాధించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విజబాలోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగిన చిత్రలేఖన పోటీల్లో భారతీశర్మ ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానం కై వసం చేసుకోగా...హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్రెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలుడు బహుమతి అందుకున్నట్లు తెలిపారు. భారతీశర్మను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. పార్లమెంట్లో ప్రశ్నించండి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు గజ్వేల్: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా సభలో సమస్యలను ప్రశ్నించాల్సిన రాహుల్గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసనల పేరుతో డ్రామాలకు దిగడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. గజ్వేల్లోని అంబేడ్కర్ చౌరస్తాలో రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేల చిత్రపటాలను బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ..నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా...మాట్లాడలేక పార్లమెంట్ను వదిలేసి రోడ్లపై నాటకాలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు కనపడుతోందని ఆరోపించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలిచేర్యాల(సిద్దిపేట): దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాకుండా మన ఉత్పత్తులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్మావో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను బుధవారం దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ..దేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన రైతులను నష్టపరిచే విధంగా ఉందన్నారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజు, మైసయ్య, సిద్ధులు, నర్సింహ్మారెడ్డి, యాదగిరి, తిరుపతి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై దాడి అమానుషం
సిద్దిపేట కాంగ్రెస్ ర్యాలీలో పార్టీ నాయకులుసిద్దిపేటకమాన్: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాహుల్ గాంధీని అరెస్ట్ను నిరసిస్తూ, కేంద్ర శాఖ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ జిల్లా కేంద్రం సిద్దిపేట రైతుబజార్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకపోతే బీజేపీ నాయకుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పిల్లలు లేని మోదీకి విద్యార్థుల విలువ తెలియదని చురకలంటించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ గోపీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్, మార్క సతీశ్, బొమ్మల యాదగిరి, మీసం నాగరాజు, మహేందర్, అంజయ్య, ప్రవీణ్, ప్రభాకర్, సంతోషి, తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాకలో పోటాపోటీ
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్..బీజేపీ నాయకుల పోటాపోటీ ఆందోళనలతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో రాహుల్గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అడ్డుకుని అక్కడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పోటాపోటీగా ఆందోళనలతో పోలీసులకు వారిని కట్టడి చేయడం ఇబ్బందిగా మారింది. ఆందోళనలో కాంగ్రెస్ దుబ్బాక పట్టణ, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి,నరేందర్రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి,పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, నాయకులు మచ్చ శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, కౌన్సిలర్లు తునికి సురేశ్ పాల్గొనగా బీజేపీ ఆందోళనలో రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్గౌడ్, సుభాష్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, ప్రవీణ్,రమణారెడ్డి,రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు రండి
● మంత్రి కొండా సురేఖను కలిసిన దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ ● మంత్రి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ దుబ్బాక: వచ్చే నెల 20 నుంచి జరిగే దుబ్బాక బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు రావాలని దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ కమిటీ బాధ్యలు ఆహ్వానించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను మంగళవారం హైదరాబాద్లో కలిసి బ్రహ్మోత్సవాల పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆమెకు పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...దుబ్బాక బాలాజీ ఆలయం అనతి కాలంలోనే రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందడం సంతోషకరమన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాను తప్పకుండా వస్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింత రాజు, బాధ్యులు కూర వేణుగోపాల్, చింత నాగేందర్ ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీనర్సింహచార్యులు తదితరులు ఉన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి
జెడ్పీ సీఈఓ రమేశ్ సిద్దిపేటరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉన్న క్రమంలో రైతులు అధిక నీరు అవసరమున్న వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జెడ్పీ సీఈఓ రమేశ్ రైతులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి జిల్లా విద్యాధికారి రమేశ్ మాట్లాడుతూ...తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవచ్చన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతాంగం ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహారం అందించనున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్, ఎంఈఓ రాజిరెడ్డి, ఎంపీడీఓ రామరాజు, ఏఓ నరేశ్, పీఆర్ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పూర్వ వైభవం తీసుకువస్తాంగ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం బెజ్జంకి(సిద్దిపేట)/ప్రశాంత్నగర్(సిద్దిపేట): గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం అన్నారు. బెజ్జంకితో పాటు మండలంలోని తోటపల్లిలోని గ్రంథాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల పరిస్థితిని పరిశీలించి వాటి అభివృద్ధి కోసం రాష్ట్ర చైర్మన్కు, ప్రభుత్వానికి వివరించనున్నట్లు తెలిపారు. సిబ్బంది హరిప్రసాద్, మాజీ సర్పంచ్ నర్సయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్, రవితేజ, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్ మాట్లాడుతు బీసీల సంక్షేమం కోసం దరిపల్లి చంద్రం చేస్తున్న కృషి విలువైందన్నారు. వాసురి ఎల్లం, రవికుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వైద్య సేవలందించాలిడీఎంహెచ్ఓ ధన్రాజ్ కొండపాక(గజ్వేల్): సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందేలా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ సూచించారు. కుకునూరుపల్లిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను వైద్యం కోసం వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కలియ తిరుగుతూ ల్యాబ్, మెడికల్ గదిని, లేబర్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ధన్రాజ్ మాట్లాడుతూ...సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై విస్త్రృతంగా ప్రచారం చేయాలన్నారు. గర్భిణుల నమోదు నుంచి ప్రసవమయ్యేంత వరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించేలా అవగాహన సదస్సులను నిర్వహించుకోవాలన్నారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్కుమార్, నర్సింగ్ ఆఫీసర్ లలిత, హెచ్ఎస్ సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ బాలమణి, ఫార్మాసిస్టు సోమిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే
దుబ్బాక: భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి రీసర్వే చేపడుతుందని జిల్లా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు సుదర్శన్ రాథోడ్ పేర్కొన్నారు. దుబ్బాకలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై రైతులకు మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం,భూముల రీసర్వే, డిజిటల్ మ్యాపింగ్, కొత్త రికార్డుల తయారీ, రైతులకు భూ హక్కుల కల్పనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా మ్యాప్లేని 21 గ్రామాల్లో భూభారతి రీసర్వే చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే, కొత్త మ్యాపుల తయారీ చేపట్టినట్లు తెలిపారు. రైతులు భూముల రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మోతీసింగ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సులోచన, చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, బండి శ్రీలేఖ, అనంతుల భాగ్యమ్మ, ఐరేని అఖిల తదితరులు పాల్గొన్నారు. -
అయిననూ లోటే!
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు అబ్బసాని మల్లయ్య. ఈయనది మర్కూక్ మండలం గంగాపూర్ గ్రామం. తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం నారు కూడా సిద్ధంగా ఉంది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో తన బోరుబావిలో నీటిమట్టం పడిపోయింది. కొండపోచమ్మసాగర్ కాల్వలోకి నీరు ఇంకా వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయాలా...? వద్దా...? అనే సందిగ్ధంలో ఉన్నాడు. ఇది ఒక్క అబ్బసాని మల్లయ్యదే కాదు. జిల్లాలోని రైతులందరూ దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ప్రధానంగా వరిసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. మిగతా పంటల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈ వ్యవహారంపై కథనం.. గజ్వేల్: జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 227.8మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..162.8మి.మీల మాత్రమే నమోదైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 28.5% లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడున్న 26 మండలాల్లోని అక్బర్పేట–భూంపల్లిలో ఇప్పటివరకు 243.2మి.మీల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 245.మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ ఒక్క మండలం మినహా మిగతా 25మండలాల్లో మైనస్ వర్షపాతమే ఉన్నది. వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైంది. వర్గల్ మండలంలో జూన్ 1నుంచి ఇప్పటివరకు 210.5మి.మీల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 71.9మి.మీలు మాత్రమే కురిసింది. ఫలితంగా ఈ మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 65.8% లోటు వర్షపాతం నమోదైంది. ములుగు మండలంలో 223.3 మి.మీలు కురవాల్సి ఉండగా..ఇప్పటివరకు 77.8మి.మీలు మాత్రమే కురవగా ఈ లెక్కన 65.2% మైనస్ వర్షపాతం నమోదైంది. రైతుల్లో మొదలైన కలవరం జిల్లాలో ఈసారి 5.41లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఇందులో ప్రధానంగా వరి అత్యధికంగా 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తే...ఇప్పటివరకు సాగులోకి వచ్చింది 49,646ఎకరాల్లో మాత్రమే. కాగా, పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 24,509ఎకరాల్లో, కంది 5,046 ఎకరాల్లో, స్వీట్ కార్న్ 907, పెసర్లు 119, చెరుకు 25ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమేకాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ, ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు ఎలా ముందుకుసాగాలో సలహాలు, సూచనలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతం -
కాంగ్రెస్ చేసిందేమీ లేదు
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపోల్ రైతువేదికలో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులు, సర్పంచ్లతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామాల్లో ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్షాపుల అంశంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రెండు మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో ఉన్నాయని, వాటి వల్ల ట్రాఫిక్కు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని ఇతర ప్రదేశాలకు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఉప్పరపల్లి కెనాల్, కిష్టాపూర్ కెనాల్, రామాయంపేట కెనాల్ పనులను పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి, డీఏఓ సురేశ్, కుమార్, కరుణ్కుమార్, డీఈలు విజయ్ ప్రకాశ్, వెంకటేశ్, బుచ్చయ్య, నరసింహారావు, రాజేంద్రప్రసాద్, స్రవంతి, ఏడీఏ బాబునాయక్, డీఎల్పీఓ లత తదితరులు పాల్గొన్నారు. -
కఠిన చర్యలు తప్పవు
విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు. టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. ఉపాధ్యాయులు విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బెజ్జంకి ఘటనలో పీడీ కనకారెడ్డిని రిమూవల్, ప్రిన్సిపాల్ సంగీతలను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. పూర్తిస్థాయి నివేదిక కోసం నలుగురితో కమిటీని జిల్లా కలెక్టర్ నియమించారు. రమేశ్, ఇన్చార్జి డీఈఓ గుడ్, బ్యాడ్ టచ్లపై అవగాహన విద్యార్థినులు అందరూ గుడ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగి ఉండాలి. అసభ్యంగా ప్రవర్తించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు పాఠశాలలో మూడు టీంలు పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 8712667434 ఫోన్ నంబర్కు సమాచారం అందించాలి. – దుర్గ, సీఐ, షీ టీమ్స్ -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
నంగునూరు(సిద్దిపేట): ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని, కాబట్టి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని డీఆర్డీఓ రవీందర్ రైతులకు సూచించారు. నర్మేట, అప్పలాయిచెర్వు, మైసంపల్లి, అంక్షాపూర్, ఖానాపూర్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటకుండా బోర్లు, బావుల్లో నీరు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కరువు పరిస్థితులపై అప్రమత్తం బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్లు, మండల స్థాయి అధికారులకు ఆర్డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ ఎల్ నినో పరిస్థితులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు నిర్మిచుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, ఆరుతడి పంటలు సేద్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ, ఎంపీఓ పాల్గొన్నారు. -
ప్రతీ కుటుంబం పొదుపు చేయాలి
ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ సిద్దిపేటకమాన్: ప్రతీ కుటుంబం క్రమం తప్పకుండా డబ్బులు పొదుపు చేయడం ఎంతో అవసరమని ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ సూచించారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాల గ్రూప్ లీడర్లకు ఆర్థిక అక్ష్యరాస్యత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేతన్ గోరేకర్ మాట్లాడుతూ..బ్యాంకులలో లభించే వివిధ పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు తమ పొదుపులను సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంచడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చని సూచించారు. జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం పిన్, ఓటీపీ, బ్యాంక్ పాస్వర్డ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడద న్నారు. -
మై భారత్ పోర్టల్పై విస్తృత ప్రచారం
సిద్దిపేటరూరల్: మై భారత్ పోర్టల్పై జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదే శించారు. జిల్లాలోని యువతకు మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా వివిధ జాతీ య, రాష్ట్రస్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు, అవగాహన డ్రైవ్ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని, పాఠశాలలు, కళాశాలలు,క్రీడాకారులు యువజన సంఘాల, భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ జిల్లాలో సీ్త్రనిధి రుణాల కింది మహిళలు తీసుకున్న రుణాల చెల్లింపులు వచ్చే అక్టోబర్ నెల చివరికల్లా రికవరీ చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఐకేపీ, సీ్త్రనిధి, మెప్మా సిబ్బందితో రుణాల రికవరీపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి ఫండ్స్ను తప్పుగా వినియోగించిన వీవోఏలు వారం రోజుల్లోగా చెల్లించకపోతే వారిని తొలగిస్తామన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి తొగుట(దుబ్బాక): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. పాఠశాలను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. బాలికలతో మాట్లాడి బోధన, ఆహారం గురించి ఆరాతీశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కలెక్టర్ను కోరారు. డీపీఓతో ఫోన్లో మాట్లాడి పాఠశాల ఆవరణతో పాటు రోడ్డుకు రెండు వైపులా లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలను తరచూ పర్యవేక్షించాలని తొగుట ఎస్ఐ నవీన్కు సూచించారు. -
సమాంతర వ్యవస్థ అవసరం
టీఆర్టీఎఫ్ రాష్ట్ర నాయకులుప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ‘సమాంతర వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సర్వీస్ రూల్స్ వివాదం కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీఈఓ, ఎంఈఓ, డిప్యుటీ ఈఓ స్థాయి పోస్టులను సమాంతర వ్యవస్థ ద్వారా భర్తీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అదనపు భారం పడదన్నారు. సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2004 పూర్వపు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని, 51 శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను నెలాఖరుకల్లా విడుదల చేయాలని కోరారు. జీఓ 317 బాధితులకు జీఓ 190 ద్వారా సొంత జిల్లాలకు బదిలీలు కల్పించి స్పౌజ్ బదిలీల హామీని నెరవేర్చాలని, 5,700 కొత్త పీఎస్హెచ్ఎం పోస్టుల మంజూరు, భాషా పండితులు, మిగిలిన పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చీఫ్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు కావలి అశోక్కుమార్, విష్ణుమూర్తి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భైతి ఐలయ్య, సుంకిశీల ప్రభాకర్రావు, మహేందర్, సుశాంత్, రాజు నాయక్, గోవర్ధన్, శ్రీనివాస్రెడ్డి, తరాల పరమేశ్, ప్రనీద్, తుంగూరి సురేశ్, గుర్రం శ్రీనివాస్గౌడ్, అశోక్రావు పాల్గొన్నారు. -
ఇలా అయితే ఎలా సర్?
సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ బల్దియాల్లో మందకొడిగా నెమ్మదిగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ నమోదు శాతం చాలా తక్కువ. సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నాటికి 9,92,917 ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించి 8,22,164 పత్రాలను డిజిటలైజేషన్ చేయగా 82 శాతం నమోదు పూర్తయింది. మున్సిపాలిటీలకు సంబంధించి 64,402 పత్రాలు ఉండడం గమనార్హం. అత్యధికంగా సిద్దిపేట బల్దియాలో 36,849 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా, అత్యల్పంగా హుస్నాబాద్లో 4,267 మిగిలి ఉన్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో 2,61,217ఓటర్లకుగాను 1,96, 815ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 64,402 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ గడువును ఆగస్టు 3వ తేదీ నాటికి పొడిగించడంతో బల్దియాల్లో ఒక్క అడుగు ముందుకు పడితే వంద శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. విస్తృతంగా సమీక్షలు ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం విస్తృతంగా సమావేశాలు, సమీక్షలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలు ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకు అధికారులు సమీక్షించి బూత్ లెవల్ ఆఫీసర్లకు దిశానిర్ధేశం చేశారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేసి శత శాతం డిజిటలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్య పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కారణాలు అనేకం ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ తక్కువగా కావడానికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రధానంగా చనిపోయిన వారి సంఖ్య, ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు ఉన్నవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, స్వగ్రామంలో మ్యాపింగ్ చేసుకోవడం, జాబితాలో ఉన్న ఓటర్ల ఆచూకీ సమాచారం లేకపోవడం లాంటి కారణాలతో పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ వంద శాతంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఆగస్టు 3 గడువు ముంచుకు వస్తున్న నేపధ్యంలో బల్దియాల్లో మిగిలిపోయిన 64,402 ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ అనేది అధికార యంత్రాంగానికి సవాల్గా మారిందనే చెప్పాలి. బల్దియాల్లో మందకొడిగా ప్రక్రియ నాలుగు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో శనివారం నాటికి 1,96,815 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. సిద్దిపేట మున్సిపాలిటీలో 1,12,975 ఓటర్లకుగాను 76,126 డిజిటలైజేషన్ కాగా ఇంకా 36,849 చేయాల్సి ఉంది. అదేవిధంగా దుబ్బాకలో 49,272 ఓటర్లకు గాను 43,959 పత్రాలు డిజిటలైజేషన్ కాగా ఇంకా 5,313 చేయాల్సి ఉంది. మరోవైపు గజ్వేల్లో 79,811 ఓటర్లకు గాను 61,838 పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. మిగతా 17,973 చేయాల్సి ఉంది. అదేవిధంగా హుస్నాబాద్లో 19,159కిగాను 14,892 డిజిటలైజేషన్ కాగా 4,267 చేయాల్సి ఉంది. అత్యధికంగా దుబ్బాక మున్సిపాలిటీలో 89.22 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా అత్యల్పంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 67.38 శాతం నమోదు కావడం విశేషం. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభ
సిద్దిపేటజోన్: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. అండర్18 విభాగం బాలికల 1500 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి వెండి పతకం, అండర్ 20 బాలుర 5 కిలోమీటర్ల పరుగు పందెంలో యస్వంత్ వెండి పతకం, అండర్ 16 విభాగం కిలోమీటర్ పరుగు పందెంలో విష్ణు కాంస్య పతకం, అండర్ 20 విభాగం 800 మీటర్ల పరుగు పందెంలో హరి కాంస్య పతకం, అండర్ 18 విభాగంలో1500 మీటర్ల పరుగు పందెంలో అభిరామ్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వామి వారిని అభినందించారు. ఎన్జీవో భవన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికసిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని ప్రముఖ పబ్లిక్ సర్వెంట్స్ హోం(ఎన్జీవో భవన్) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాదుల నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా గ్యాదరి పరమేశ్వర్, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పోచయ్య, రాజేందర్, సంయుక్త కార్యదర్శులుగా మధుసూదన్, శ్రీనివాస రాజు, ఆడిట్ మెంబర్లుగా రామ్మోహన్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, కృష్ణ, గణేశ్, ఉపేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఎన్జీవో భవన్ పేరు ప్రఖ్యాతులను మరింత ఇనుమడింప చేస్తామని తెలిపారు. నాలుగు సంఘాల ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పటాన్చెరు టౌన్: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారానికి చెందిన నవీన్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో అన్ని కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి: నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బీఎల్ఏలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 282 బీఎల్ఏలతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్గౌడ్ పాల్గొన్నారు. -
మింగలేక.. కక్కలేక..
గజ్వేల్: మున్సిపల్ ఏఈ బదిలీ అంశం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులను ఇరకాటంలో పడేసింది. జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ ఇటీవల ఇక్కడికి బదిలీ అయ్యారు. అయితే రెండు నెలలు కావస్తున్నా.. ఆయనను అక్కడి ఉన్నతాధికారులు రిలీవ్ చేయడం లేదు. జీహెచ్ఎంసీకి ఉండే స్వయంప్రతిపత్తి, అధికారాల వల్ల వారిని ప్రశ్నించలేక, ఇక్కడ అభివృద్ధి పనులను వెళ్లదీసుకోలేక ఇక్కడి అధికారులు మింగలేక.. కక్కలేక అన్నట్టు నానాఇబ్బందులు పడుతున్నారు. నెలలు కావస్తున్నా.. గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపాలిటీలో ఏఈ బదిలీ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. కీలకమైన ఈ పోస్టు చాలా కాలంగా ఖాళీగానే ఉంది. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. లైట్ తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు తమ మున్సిపాలిటీకి బదిలీచేసిన ఏఈని రిలీవ్ చేయాలని అక్కడి అధికారులను అడగలేక గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు నానాయాతన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఇక్కడి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు ఏఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ‘‘మీది లక్షలోపు జనాభా ఉన్నా మున్సిపాలిటీయే కదా.. ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోండి’’ అని సమాధానం దాటవేసినట్లు సమాచారం. ఇప్పుడు ఒక్కరు కూడా లేరని విన్న వించుకున్న వారు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి పనులకు ఆటంకం స్థానిక మున్సిపాలిటీలో ఏఈ లేకపోవడం అభివృద్ధి పనులు ముందుకుసాగటం లేదు. ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఏఈ ఒకరు డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారంలో ఒకటి రెండు రోజులు రావడమే గగనం. ఇక్కడ రూ.28కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం మున్సిపాలిటీకి ఇటీవల టెండర్లు పూర్తయిన రూ.18.7 కోట్ల యూఐడీఎఫ్(స్టేట్ అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పనులు ప్రారంభం కావా ల్సి ఉండగా.. ఏఈ లేక ఆటంకం కలుగుతోంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి, హౌసింగ్ బోర్డు మైదానంలో చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి పనులు, సంగాపూర్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ పనులు, వరద కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ పనులు ఏఈ వస్తేకాని ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో పట్టణ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఏఈ బదిలీ వ్యవహారంలో ఇరకాటం ఇబ్బందులు పడుతున్నది నిజమే జీహెచ్ఎంసీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చి ఏఈ ఇంకా విధుల్లో చేరకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. మున్సిపల్ ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని చెప్పారు. వేచి చూస్తున్నాం. – గణేశ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
నీళ్లు వదిలి.. కన్నీళ్లు తుడవండి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం సాంకేతిక కారణాలతో కన్నేపల్లి పంపుహౌస్ నుంచి మోటార్ల ద్వారా నీటిని సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ వరకు చేపట్టిన రైతు పాదయత్రకు భారీ స్పందన వచ్చింది. రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఉదయం 8 గంటలకు అల్లీపూర్ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్కు చేరుకున్నారు. డప్పు కళాకారులు, మహిళల నృత్యాలు, ఆటపాటలతో రైతుల పాదయాత్ర 16 కిలో మీటర్లు సాగింది. దారిపొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరువు సమయాల్లో ఆదుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో నీళ్లు ఉన్నా, మోటార్లు ఆన్ చేయకపోవండతో సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఖరీఫ్ పంట భవిష్యత్ ఆందోళన కలిగిస్తోందని, కన్నేపల్లి వద్ద ఉన్న నీళ్లను సిద్దిపేట ప్రాజెక్టులకు తరలించాలని నినదించారు. లేకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన పాదయత్ర మధ్యాహ్నం 3 గంటలకు రంగనాయకసాగర్కు చేరుకుంది. పాదయత్రలో అన్నదాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ దేశపలి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితోపాటు యాత్రలో కలిసి నడిశారు. నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి – ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాగునీరు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రైతు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పడింది ప్రకృతి కరువు కాదని, రేవంత్రెడ్డి వికృత నిర్ణయం తీసుకువచ్చిన కరువు అని యద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డీ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా? లేదా ఎత్తి పారేయ్య మంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సీనియర్ నాయకులు పాల సాయిరాం, పాపయ్య, కనకరాజు, ఉమేశ్ చంద్ర, జంగిటి శ్రీనివాస్, సదానందం, సర్పంచ్లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.కర్షక బిడ్డ కేసీఆర్.. రైతుద్రోహి రేవంత్: హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నేపల్లి పంప్హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా సాగునీరు ఇవ్వకుండా రేవంత్రెడ్డి రైతుద్రోహిగా మారారని ఎమ్మెల్యే హరీవ్రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతుపాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.35 వేలకోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతలను మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించి రూ.19 వేల కోట్ల రైతుబంధును ఎగనామం పెట్టారని, కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతుల కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్పాలనకు విసిగిపోయి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కదం తొక్కిన కర్షకులు -
26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సుమారు రూ.5కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేసిన ఈ రైల్వేస్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఈనెల 26 కిషన్రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ఇతరప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతగా మారనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు ప్రతీ రోజు రెండు రైళ్లు రైల్వేశాఖ నడిపిస్తుంది. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలనుంచి కొమురవెల్లికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కా నుంది. భక్తుల రద్దీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా రైల్వేశాఖ పరిశీలించనుంది. కోడ్ కేటాయింపు కొమురవెల్లి రైల్వేస్టేషన్కు భారతీయ రైల్వేశాఖ కేఐపీకే 0943 6626 అనే కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచార సేవలతో పాటు రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వేస్టేషన్కు గుర్తింపు లభించింది. కోడ్ కేటాయించడంతో రైల్వేస్టేషన్ ప్రారంభానికి మార్గం సులువైంది. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైతే రోడ్డుమార్గంతోపాటు రైలుమార్గంలో సులువుగా చేరుకునే అవకాశమేర్పడుతుంది.● ప్రారంభించనున్నకేంద్రమంత్రి కిషన్రెడ్డి ● తప్పనున్న మల్లన్న భక్తుల తిప్పలు -
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంతుల సుధాకర్ సహాయంతో రూ.40 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, సమావేశ మందిరం, కిషన్ షెడ్లను వివేక్ ప్రారంభించారు. పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్ను నిర్మించిన దాత దొంతుల సుధాకర్, వారి కుటుంబ సభ్యులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన చూస్తే పాఠశాల పనితీరు కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 50 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాలలద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక నైపుణ్యాల కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలిసిద్దిపేటరూరల్: ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశమున్నందున రైతులను తక్కువ నీరు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు సాగేలా ప్రోత్సహించాలని మంత్రి వివేక్ సూచించారు. కలెక్టరేట్లో వానాకాలం–2026 ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కంటెజెన్సీ ప్రణాళికపై కలెక్టర్తో కలిసి వ్యవసాయశాఖ, అనుంబంధ శాఖల ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎల్నినో ప్రభావం దృష్ట్యా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయిల్పామ్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి, సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న మంత్రి వివేక్కు కలెక్టర్ హైమావతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు, ఏఎంసీ చైర్మన్లు, ఆత్మకమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.జక్కాపూర్లో డైనింగ్ హాల్నుప్రారంభించిన మంత్రి వివేక్ -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు
హుస్నాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఖాళీల భర్తీకి పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 12 లెక్చరర్ పోస్టులు మంజూరయ్యాయని, వీటి కోసం అర్హుల నుంచి ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్–4, కంప్యూటర్ ఇంజనీరింగ్–2, ఈఈఈ–3తోపాటు, గణితం–1, భౌతికశాస్త్రం–1, రసాయనశాస్త్రం–1 పోస్టులున్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 22 వరకు హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న సర్టిఫికెట్లు పరిశీలించి ఉదయం 10 గంటలకు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ప్రిన్సిపాల్ పి.శ్రీదేవి -
రాజీతో రాజమార్గం
జిల్లా అదనపు న్యాయమూర్తి వై.జయప్రసాద్ సిద్దిపేటకమాన్: రాజీయే రాజమార్గమని, పెండింగ్లో ఉన్న నెగిషీయబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్ఐ) కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదికని అదనపు జిల్లా న్యాయమూర్తి వై.జయప్రసాద్ తెలిపారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పలు చెక్బౌన్స్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ..సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు ఇరు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. స్పెషల్ లోక్ అదాలత్లో జిల్లాలో 09 బెంచెస్ ఏర్పాటు చేయగా..రూ.2,78,61,790 విలువైన 46 ఎన్ఐ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ‘గౌరవెల్లి’ కట్టపై ప్రత్యేక నిఘా అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టును సీపీ రష్మీ పెరుమాళ్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు సామర్థ్యంతో పాటు ఎన్జీటీ కేసు తదితర వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో కూడా ప్రాజెక్టు కట్టపై ప్రత్యేక నిఘా ఉంచుతూ గస్తీ నిర్వహించాలని సూచించారు. సరదా కోసం ఎవరైనా ఈత కొట్టడానికి వస్తే రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆకతాయిలు ధ్వంసం చేయకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు. కాళేశ్వరంపై రాజకీయం వద్దుసీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర ప్రజలకు సాగు, తాగు నీరు అందించి కరువు నుంచి ప్రజలను కాపాడటానికి బదులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న రాజకీయాలను మానుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య సూచించారు. సిద్దిపేటలో శనివారం జరిగిన సిద్దిపేట, మెదక్ జిల్లాల నిర్మాణ వర్క్షాప్కు హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చాయని, ఆనకట్ట దెబ్బతిన్నదని విమర్శలు చేసే బదులు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీరు నిల్వ చేయడం కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించకుండా విమర్శలు చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించండియూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ గజ్వేల్: కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ డిమాండ్ చేశారు. గజ్వేల్లో శనివారం వారి సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వలీ అహ్మద్ మాట్లాడుతూ..దశాబ్దాలుగా శ్రమదోపీడీకి గురవుతున్న కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష టీచర్లకు కనీస వేతన విధానాన్ని వర్తింపజేయాలన్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే వీరికి హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లల్లో కేర్ టేకర్లను నియమించి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంఆర్పీ ఉద్యోగుల ఎంఐఎస్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతగా పనిచేయాలి
సిద్దిపేటకమాన్: ప్రతీ ఒక్కరూ మెరుగైన సమాజం కోసం బాధ్యత పనిచేయాలని మన పోలీస్ బలగమే మన గర్వం మన సమాజమే మన బాధ్యతని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో ‘‘సీపీ కనెక్ట్’’అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను శనివారం అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు సిబ్బందిలో ఉత్తమ సేవలను గుర్తించే సంస్కృతి, మనోధైర్యం పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సిబ్బందికి మరింత ఉత్సాహం, బాధ్యత కలగడంతోపాటు ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సీఐ కిరణ్, ఆర్ఎస్ఐ సాయిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీ రష్మీ పెరుమాళ్ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత సీపీ కనెక్ట్ వినూత్న కార్యక్రమం ప్రారంభం -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
● కన్నీళ్లు ఎరుగరే.. కన్నోళ్లు తుడవరే బడి బాట పట్టాల్సిన పసి వయస్సు బాధ్యత వైపు అడుగేసింది. కుటుంబపోషణలో తన వంతు బాధ్యత అనుకున్నాడో..కాలం కలిసిరాలేదో తెలియదు కానీ బడి బాట పట్టాల్సిన పిల్లాడు గొర్రెలమందవైపు అడుగేశాడు. వందలకుపైగా ఉన్న గొర్రెలమంద వెనుక పరుగుతీస్తూ..వాటిని మేపేందుకు వెళ్తున్న ఓ బాలుడిని ‘సాక్షి’కెమెరా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామసమీపంలో‘క్లిక్’మనిపించింది. – సాక్షి,స్టాఫ్ఫొటోగ్రాఫర్,సిద్దిపేట -
జలసాధనకు మహాపాదయాత్ర
చిన్నకోడూరు(సిద్దిపేట): కళ్ల ముందు నారు మడులు ఎండుతుంటే గుండె మండుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ జలసాధన పోరుకు శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు సుమారు 16 కి.మీటర్ల రెండు వేల మంది రైతులతో మహాపాదయాత్రకు పూనుకుంది. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరంకు గోదావరి జలాలు భారీగా వస్తున్నప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు మళ్లించకుండా జాప్యం చేస్తుండటం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కు ఇక్కడి నీళ్లను అక్కడికి తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మెడలు వంచి కాళేశ్వరం నీళ్లను తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు మళ్లించడమే లక్ష్యంగా ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నారు. మాజీమంత్రి హరీశ్రావుతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ శ్రేణులు వివిధ ప్రాంతాల నుంచి రైతులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నారు. ఉదయం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ప్రారంభమై మహాపాదయాత్ర సాయంత్రం రంగనాయక సాగర్ వద్దకు చేరేవిధంగా ప్రణాళిక రూపొందించారు. చివరగా రంగనాయసాగర్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జలసాధన పోరును ప్రారంభిస్తున్నారు. కరువుకు ప్రధాన కారకుడు సీఎంబీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రస్తుత కరువుకు ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశమున్నా సాగునీరివ్వకుండా సీఎం రైతు ద్రోహిగా మారారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఆరోపించారు. రైతు మహాపాదయాత్ర సందర్భంగా మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్లతో కలసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను సందర్శించి రైతు మహాపాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గోదావరి జలాలతో రిజర్వాయర్లు నింపాలని చేపట్టిన రైతు మహాపాదయత్రకు భారీగా రైతులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మేడిగడ్డ వద్ద భారీగా నీళ్లు సముద్రం పాలవుతుంటే ఆంధ్రా ప్రాంతానికి లబ్ధి చేకూరేవిధంగా సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. కన్నేపల్లి వద్ద పంప్హౌస్లో మోటార్లు ఆన్చేసే అవకాశమున్నా ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు.● అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచిరంగనాయక సాగర్ వరకు పాదయాత్ర ● కాళేశ్వరం నీటి కోసం నేడు రైతులతో కలిసి బీఆర్ఎస్ నిరసన యాత్ర సాగుతుందిలా అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఉదయం 8 గంటలకు రైతు మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అల్లీపూర్ మీదుగా మైలారం, కమ్మర్లపల్లి, సలెంద్రి గ్రామాల మీదుగా చిన్నకోడూరుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పెద్దకోడూరుకు చేరుకుంటుంది. గ్రామంలోని రేణుకా మాత ఫంక్షన్ హాల్లో పాదయాత్రలో పాల్గొన్న వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెట్టుబండలు మీదుగా రంగనాయక సాగర్కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేశారు. -
దుబ్బాక టాప్ ‘సర్’
దుబ్బాక: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో దుబ్బాక నియోజకవర్గం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే దుబ్బాక నియోజకవర్గం చాలా ముందంజలో ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 2,04,664 ఓటర్లకు గాను 1,69,202 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. కేవలం 35,462 మంది 17.33% మాత్రమే మిగిలి ఉంది. దీంతో 82.67% పనులు పూర్తి చేసుకుని జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. మిగతా వరుసలో హుస్నాబాద్ నియోజకవర్గం 79.32%తో 2 వ స్థానంలో నిలవగా మొత్తం 2,54,543 మంది ఓటర్లకు గాను 2,01,911 డిజిటలైజ్ కాగా ఇంకా 52,632 మంది 20.68% కావాల్సి ఉంది. గజ్వేల్ నియోజకవర్గం 2,89,253 మంది ఓటర్లకు గాను 2,13,920 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజ్ పూర్తి కావడంతో 73.96%తో 3వ స్థానంలో ఉంది. ఇంకా 75,333 మంది 26.04% కావాల్సి ఉంది. సిద్దిపేట నియోజకవర్గం కేవలం 72.28%తో జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,44,507మందికి గాను 1,76,721 కాగా ఇంకా 67,786 మంది 27.72% మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 9,92,967 ఓటర్లకు గాను 7,61,754 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయి సగటున 76.71 % ఉండగా ఇంకా 2,31,213 ఓటర్లు 23.29% కావాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో టాప్ దుబ్బాకనే.. సర్ ప్రక్రియ లో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం దుబ్బాకనే అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సర్ ప్రక్రియ గడువు ఆగష్టు 3 వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.82.67శాతం ఎన్యూమరేషన్తో జిల్లాలో అగ్రస్థానం -
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
● సెర్ప్,ఎస్ఆర్డీఎస్ సిబ్బందికి వైద్య పరీక్షలు ● శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ హైమావతిసిద్దిపేటఅర్బన్/నంగునూరు(సిద్దిపేట): మహిళా సంఘాల్లోని సభ్యులు, ఈజీఎస్ వంటి పనుల్లో విశ్రాంతి లేకుండా ఉండే సిబ్బంది తమ ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని ఎల్లుపల్లి శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో సెర్ప్, ఎస్ఆర్డీఎస్ సిబ్బందికి నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ హైమావతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్లు అందించే మెడిసిన్తో పాటు సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. డాక్టర్లు సూచించిన విధంగా రోజు గంట సేపు వ్యాయామం చేయాలని, మంచి ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడం వంటివి చేయాలని సూచించారు. వెల్కటూరు పాఠశాల సందర్శన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పదవ తరగతి అనేది జీవితానికి ఒక పునాది వంటిదని, విద్యార్థులు బాగా చదువుకుని అందరూ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. అన్ని తరగతులు అవుతున్నాయా? మధ్యాహ్న భోజనం బాగుంటుందా? అని విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంతో పాటు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని రాజగోపాల్పేట పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, మందులు, అటెండెన్స్ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వైద్యులు సూచించిన విదంగా మందులు వేసుకోవాలని సూచించారు. -
చదువు భలే.. వసతి బాలే
● పెరుగుతున్న ప్రవేశాల సంఖ్య ● భోజనం రుచి లేక తినలేక పోతున్నాం ● కలెక్టర్కు విద్యార్థుల గోడుహాస్టల్లో వసతుల కరువు హుస్నాబాద్: ‘‘ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు బాగుందనే ఒక్క కారణంతో హాస్టల్ వసతులు ఏలా ఉన్నా సర్దుకుంటున్నాం. రెండో ఏడాదిలో కూడా మార్పు రాకుంటే ఎలా సార్’’అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధ్యాపకులు, అధికారుల ముందు ఏకరువు పెడుతున్నారు. శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హాస్టల్ వసతి ఉన్నందును రెండో సంవత్సరంలో ఎక్కువమంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన అద్యాపకులచే నాణ్యమైన విధ్యాబోధన, ఆధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ తరగతులు పలు సౌకర్యాలతో విద్యా బోధన చేస్తున్నారు. కళాశాలకు సంబంధించి హాస్టళ్లను హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో అబ్బాయిలు, బస్ డిపో ఎదుట ఉన్న ప్రభుత్వ షెడ్యూల్డు కులాల బాలికలు, కళాశాల వసతి గృహంలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించారు. వసతి గృహంలో ఉండలేం ప్రత్యేక హాస్టల్ వసతి ఉందని తెలిసే తల్లిందండ్రులు ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో తమకు అడ్మిషన్లు తీసుకున్నారని ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ అంటే సకల సౌకర్యాలతో సొంత ఇంటిలో ఉండే రుచికరమైన భోజనం ఉంటుందని ఊహించి మమ్ములను ఇక్కడి కళాశాలలో చేర్పించారని తీరా ఇక్కడ చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉందని అమ్మాయిలు వాపోతున్నారు. నాణ్యమైన భోజనం ఉండటం లేదని, నీళ్ల చారుతో భోజనం చేయలేక చాలాసార్లు పస్తులుండి రోజులు గడిపామని వాపోతున్నారు. ఇదే విషయాన్ని బుధవారం హాస్టల్ను సందర్శించిన కలెక్టర్ హైమావతికి వివరించారు. అబ్బాయిల పరిస్థితి అలానే స్థానిక టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఇంజనీరింగ్ కళాశాల యువకులకు హాస్టల్ వసతి కల్పించారు. చదివేది ఇంజనీరింగ్ కళాశాలలో, భోజనం చేసేది ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో.. హాస్టల్ వసతి టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో. హాస్టల్ నుంచి యువకులు సైకిళ్లపై కిలోమీటర్ దూరంలో ఉన్న బాలుర వసతి గృహనికి వెళ్లి భోజనం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా భోజనం సరిగా లేదంటూ కళాశాల అధ్యాపకులకు చెప్పుకున్న ఫలితం లేకుండా పోతుంది. వసతులు కల్పిస్తాంహాస్టల్లో భోజనం బాగా లేదని విద్యార్థులు మా దృష్టికి తెచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శాతవాహన యూ నివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లాం. దాదాపుగా 200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం, హాస్టల్ వసతి కల్పించేలా ముందస్తుగానే మరో భవనాన్ని పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం. –తిరుపతిరెడ్డి, ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ కళాశాల, హుస్నాబాద్ -
19న జగన్నాథ రథయాత్ర
సిద్దిపేటకమాన్: పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర స్ఫూర్తితో సిద్దిపేటలో ఈ నెల 19న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని శ్రీనివాస ధ్యాన మందిరం నుంచి ప్రారంభమై గాంధీచౌక్, సుభాష్రోడ్డు, పాత బస్టాండ్, విక్టరీ చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. రథయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు బుచ్చిబాబు, మశ్చేందర్, వేణు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులుజిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్ పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ బంజారాహిల్స్లోని టీజీఎస్సీస్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు గాను అర్హత కలిగిన ఎస్సీ,బీసీ,ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న పరీక్ష నిర్వహించి, రాణించిన వారికి ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక విద్యార్థులుసిద్దిపేటరూరల్: సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింత మడక కేవీఆర్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తరాజిరెడ్డి గురువారం తెలిపా రు. అండర్ 14 బాలికల విభాగంలో ట్రైయాథలాన్ పోటీలో పావని వెండి పతకం సాధించగా, అండర్ 14 బాలుర విభాగంలో 8వ తరగతికి చెందిన రిషి కుమార్ వెండి పతకం సాధించారు. ఈనెల 18న మెదక్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన పీడీ వెంకట స్వామిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయబృందం అభినందించారు. పీఆర్సీ ప్రకటించకపోతే ఆందోళనే : పీఆర్టీయూగజ్వేల్: దసరాలోపు పీఆర్సీ ప్రకటించకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మూడేళ్లుగా పీఆర్సీ పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన పాలకులు నేడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్త చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నా...ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్శర్మ, లింగం తదితరులు పాల్గొన్నారు. -
18 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి
మిరుదొడ్డి(దుబ్బాక): వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల ఉచిత విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నా రు. కనీసం రోజుకు 8 గంటల నిరంతరంగా కరెంటు అందించలేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో నారు మడులను కూడా వేసుకోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ ఎస్ఈ, ఏడీఏ, ఏఈలతో ఫోన్లో పోలీసులు మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో రైతులు ఆందోళనను విరమించారు. నీళ్లివ్వాలని చేయి కోసుకున్న రైతు దుబ్బాకరూరల్: వర్షాలు కురువక పోవడంతో రైతులు వరి తుకాలు పోసి వదిలేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని ఆవేదన చెందిన దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన రుద్రారం ప్రశాంత్ అనే యువకుడు తన పొలంలో నిలబడి ‘‘సీఎం రేవంత్రెడ్డి మా పొలాలు ఎండి పోతున్నాయి. మల్లన్నసాగర్ కాలువల ద్వారా మా పొలాలకు నీళ్లివ్వండి’’అంటూ బ్లేడ్తో చేయి కోసుకుని తన పొలంలో భూమికి రక్తం బొట్టు పెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ధర్మారెడ్డి సబ్స్టేషన్ వద్ద ... గజ్వేల్రూరల్: ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ 4 గంటలు సైతం సరిగ్గా రావడం లేదని గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో గురువారం అన్నదాతలు సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ జేజేల వెంకటేశంగౌడ్లు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలతో అన్నదాతలను మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పంటల సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు సత్తయ్య, నవీన్, నరేందర్, శ్యామ్రెడ్డి, రాంచంద్రారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో తాగునీటి ఇక్కట్లు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల కసూర్భా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో తాగునీరు ఇక్కట్లు నెలకొన్నాయి. మంచినీళ్ల కోసం పడరానీ పాట్లు పడుతున్నారు. ఆ విద్యాలయంలో శాశ్వత బోరుబావి లేకపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం అరిగోస తప్పడం లేదు. ఈ కేజీబీవీలో 220మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యాలయం ఆవరణంలో మిషన్ భగీరథ సంపు నిర్మించుకుని దాని ద్వారా నీరు ఉపయోగించుకుంటున్నారు. కాగా, మిషన్ భగీరథ నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మిషన్ భగీరథలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతే స్నానాలు కూడా చేయకుండా రోజుల తరబడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా తాగేందుకు రోజు రెండు ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ రూ.800 నుంచి రూ.1000 వరకు వెచ్చించి నీటిని సరఫరా చేయిస్తున్నారు. అయితే, గతంలో రెండు, మూడు చోట్ల బోరు వేయించేందుకు ప్రయత్నంచినా చుక్కనీరు రాలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. బోరుబావి ఉంటే తప్ప శాశ్వత తాగునీరు సమస్యను పరిష్కరించలేమని, ప్రతీరోజు నీళ్లకోసం గోస పడవల్సి వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.సరిపోని మిషన్ భగీరథ నీళ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ ద్వారా నీళ్లను తెప్పించుకుంటున్నాం. బోరు వేయించాలని చెబుతున్నాం. ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం సమయం వరకు నూతనంగా బోరు వేయించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –సరిత, కేజీబీవీ ప్రత్యేకాధికారి -
రైతుల ఏకరువు
ఎల్నినో తీవ్రరూపం దాల్చిన వేళ...‘సాగు’ముందుకు సాగక ఆందోళనలో ఉన్న రైతులు కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోగా ప్రస్తుతం నింపుతారా...? లేదా...? అనే ఆందోళన సర్వత్రా మొదలైంది. జిల్లా వ్యవసాయానికి ప్రాణధారమైన ఈ రిజర్వాయర్లను నింపకపోతే పరిస్థితేమిటనే కలవరం వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్ ఇది. గజ్వేల్: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్, 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్, మరో 15 టీఎంసీ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు జిల్లా సాగు, తాగునీటి అవవసరాలకు ప్రధాన ఆధారంగా మారాయి. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసే గోదావరి జలాలు సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా జిల్లాలోని రంగనాయకసాగర్కు వస్తుంటాయి. ఈ రిజర్వాయర్కు జిల్లాలో 1.10 లక్షల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 2.2కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, మరో 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా మల్లన్నసాగర్కు గోదావరి జలాలు వస్తాయి. మల్లన్నసాగర్ వల్ల సిద్దిపేట, మెదక్ జిల్లాలే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 15.71 లక్షల ఆయకట్టుకు మేలు చేకూరనుంది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మసాగర్ను చేరుతాయి. మల్లన్నసాగర్ పంపుహౌజ్ నుంచి 23 కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వల్ల సిద్దిపేటతోపాటు మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతోపాటు పరోక్షంగా మరెన్నో లక్షల ఎకరాల భూముల్లో భూగర్భ జలమట్టం పెరిగి భారీ ప్రయోజనం కలుగుతుంది. కానీ, మేడిగడ్డ ఘటన తర్వాత నీటి ఎత్తిపోతలకు తరచూ అంతరాయం కలుగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లను నింపే విషయంలో స్పష్టతలేకపోవడం వల్ల రంగనాయకసాగర్ రిజర్వాయర్లో నీటిమట్టం 1 టీఎంసీకి పడిపోగా, మల్లన్నసాగర్లో కేవలం 16టీఎంసీల లోపు, కొండపోచమ్మసాగర్లో 6.3 టీఎంసీలలోపు మాత్రమే నీరు ఉన్నది. ప్రస్తుతం ఎల్నినో తీవ్రరూపం దాల్చి వేళ...తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో సమృద్ధిగా ఉండి ఉంటే కాల్వల ద్వారా నేరుగా పొలాలకు నీరందే అవకాశంతోపాటు లక్షలాది ఎకరాల్లో భూగర్భజలమట్టం పడిపోకుండా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో సాగు, తాగునీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఒకవేళ...ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కాల్వలకు వదిలితే ఈ సీజన్లో రైతులు గట్టెక్కే అవకాశముంది. ఆ దిశగా చర్యలు ఉంటాయా...? అనే విషయంలోనూ స్పష్టత లేదు. రైతుల్లో కలవరం జిల్లాలో జూన్కు సంబంధించి 105.6 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 53.9 మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 48.9 మి.మీల లోటు వర్షపాతం నమోదైంది. జూలైకు సంబంధించి 184.7 సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు కేవలం 62.8 మి.మీల వర్షపాతం మాత్రమే కురిసింది. ఈ పరిస్థితి వల్ల సాగు ముందుకు సాగటం లేదు. ఈ సీజన్కు సంబంధించి 5.41 లక్షల ఎకరాలకుపైగా సాగు అంచనాలో వరి సింహాభాగం 3.85 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే... ఇప్పటివరకు కేవలం 38,500 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 20,804 ఎకరాల్లో, కందులు 4,189 ఎకరాల్లో, పెసర్లు 64 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లా రైతులకు ప్రధాన పంట అయిన వరికి జలాశయాలకు నీళ్లు వదిలితేనే ముందుకు సాగే అవకాశమున్నది. లేదంటే గడ్డు కాలం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
● ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు ● కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ధర్నాప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని కేసీఆర్నగర్ డబుల్బెడ్రూం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కోట్ల రూపాయలతో భవనాలు నిర్మిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. కలెక్టర్ హైమావతి తక్షణమే స్పందించి కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించాలని, శాశ్వత పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతే ధ్యేయం
మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిహుస్నాబాద్: పారిశుద్ధ్య, వ్యర్థాల సేకరణ కార్మికుల ఆరోగ్య భద్రతే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యర్థాల సేకరణ కార్మికులకు మంగళవారం ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నమస్తే పథకం ద్వారా వ్యర్థాల సేకరణ కార్మికుల సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం, వృత్తి పరమైన రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దపేటలో.. సిద్దిపేటజోన్: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచనల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ అన్వేష్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీటీ కిట్లు పంపిణీ చేశారు. వారు మాట్లా డుతూ విధుల నిర్వహణలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలన్నారు. చెత్త సేకరణ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మత్తు పదార్థాలపై అవగాహన అవసరం
రాజన్న జోన్–3 డీఐజీ సున్ప్రీత్సింగ్సిద్దిపేటకమాన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగంపై యువత, ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాజన్న జోన్ 3 డీఐజీ సున్ప్రీత్సింగ్ ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ను మంగళవారం ఆయన సందర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, కమిషనర్ కార్యాలయ ఆవరణలో సీపీతో కలిసి మొక్కను నాటారు. శాంతిభద్రతలు, నేరాలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. షీ టీమ్స్ పనితీరుపై మహిళలు, విద్యార్థినులకు మరింత అవగాహన కల్పించాలని, ఎస్హెచ్ఓలు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏబీవీపీ నాయకుల డిమాండ్సిద్దిపేటఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) మంగళవారం కళాశాలల బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సావుల ఆదిత్య, జిల్లెల ఫణీందర్ తదితరులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి వివరించి బయటకు పంపించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారన్నారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు తరుణ్, లోకేశ్, శ్రావణ్, శ్రీకాంత్, అశ్వల్, పవన్, సాత్విక్, చరణ్, ఆదిత్య, శ్రీషన్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తి వేసేందుకు కుట్ర బెజ్జంకి(సిద్దిపేట): విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సాయిరాం ఆరోపించారు. బెజ్జంకిలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. బకాయిల కారణంగా కళాశాలల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్, రవి, వీరేశం, సాయిలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కు హుస్నాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వ భిక్ష కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణను చేపడతామన్నారు. నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు రాజేశ్, చరణ్, అంజి, రంజిత్ తదితరులు ఉన్నారు. బంద్ విజయవంతం నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నంగునూరులో జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ బంద్ నిర్వహించారు. -
సుల్తానా ఉమర్కు జాతీయ సేవారత్న అవార్డు
దుబ్బాకటౌన్: సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. జనసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేబీరాజు, జనసాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పాముల రమణ ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో పేదలు, మహిళలు, అనాథలు, సంచార జాతుల సంక్షేమం కోసం సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నారు. అనంత రం సుల్తానా ఉమర్ తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన జనసాహిత్య అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
తొలకరి చినుకు.. జీవాలు బెరుకు
● చిటుకు వ్యాధితో మొదటికే మోసం ● అప్రమత్తతతోనే రక్షణ సాధ్యం ● పశు సంవర్థకశాఖ డాక్టర్ నిహారిక దుబ్బాకటౌన్: వర్షాకాలంలో తొలకరి చినుకులు మూగజీవాల పాలిటి శాపాలు. వాటి వల్ల జీవాల పెంపకందారులు తరచూ నష్టాలకు గురవుతారు. తొలకరి చినుకులకు మొలిసిన గడ్డిని గొర్రెలు, మేకలు తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. దీనిని పలురకాల పేర్లతో పిలుస్తుంటారు. నెత్తిపిడుగు, గడ్డిరోగం, పాటురోగం అనే పేర్లు కూడా ఉన్నాయి. బలిష్టంగా ఉన్న గొర్రెలకే.. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని తిమ్మాపూర్ పశు సంవర్థకశాఖ వైద్యురాలు డాక్టర్ నిహారిక సూచించారు. బలిష్టంగా పెరిగిన గొర్రెలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఆమె తెలిపిన కొన్ని సూచనలు, సలహాలు. అకస్మాత్తుగా మరణిస్తాయి ఈ వ్యాధి సోకిన గొర్రెలు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. చనిపోయే ముందు చాలా నీరసంగా ఉంటాయి. ఎగిరి కిందపడి కాళ్లు కింద కొట్టుకుంటూ, పళ్లు కొరకుతూ.. బిగుసుకుని కొన్ని క్షణాల్లో చనిపోతాయి. ఈ వ్యాధి సోకిన మరికొన్ని గొర్రెలు చొంగ కారుస్తుంటాయి. శ్వాస అధికంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి మందకు చికిత్స చేయించాలి. నివారణే ముఖ్యం చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం. ఏటా ఏప్రిల్, మే నెల మధ్యలో మందలో ఉన్న జీవాలన్నింటికీ వ్యాధి నిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పకుండా వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశువైద్యాధికారికి తెలియజేసి చికిత్స, జాగ్రత్తలు పాటించాలి. తొలకరి వర్షాలకు మొలిసి వాడిపోయిన గడ్డిని మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో జీవాలను మేపకూడదు. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరుచేయాలి. జాగ్రత్తలు పాటిస్తే చిటుకు వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చు. నిహారిక, పశు సంవర్థకశాఖ డాక్టర్, తిమ్మాపూర్ ఇలా సోకుతుంది మేత కోసం వలస వెళ్లే గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల ప్రేవుల్లో అభివృద్ధి చెందుతాయి. అవి వదిలిన విషపదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. తొలకరి చినుకులకు పెరిగిన లేతగడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. దీనివల్ల వాటి ప్రేవుల్లో గాలిలేని వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడినప్పటి నుంచి జూలై నెలాఖరు మధ్య ఎక్కువగా సంభవిస్తుంది. -
ఘనంగా శీత్లాభవానీ పండుగ
అక్కన్నపేట(హుస్నాబాద్): గిరిజనులు ప్రతియేటా నిర్వహించుకునే శీత్లాభవాని పండుగను మండలంలోని కెప్టన్చౌడుతండా గ్రామంలో మంగళవారం సర్పంచ్ గుగులోతు స్వరూపరాజు నేతృత్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజలు పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన మహిళలు, యువతులు శీత్లా భవానీకి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళ లు తమ సంప్రదాయ దుస్తులు ధరించి డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేసుకుంటూ తరలివెళ్లా రు. గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం
ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ హైస్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కల్లెపల్లి శ్రీనివాస్కు హెచ్ఎంగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీనివాస్కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన భైరయ్య 30న పదవీవిరమణ పొందారు. అనంతరం సీనియారిటీ ప్రకారం హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ సీనియారిటీ ఉన్న వ్యక్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా జాప్యం జరిగింది. దాడులను అరికట్టాలని కోరుతూ సీఎంకు వినతి మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించినట్టు డీబీఎఫ్(దళితబహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అత్యాచా రాల నిరోధక చట్టాలపై హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. అత్యాచారాలు, దాడులపై చర్చించి వాటిని అరికట్టా లని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంకు వినతిపత్రం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్పన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై అవగాహన హుస్నాబాద్రూరల్: ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు జ్యోతిరావ్ఫూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీణాచందన చెప్పారు. పోతారం(ఎస్)లో గురుకుల పాఠశాల విద్యార్థి కౌన్సిల్, హెడ్ గర్ల్ ఎంపికకు మంగళవారం ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ స్వేచ్ఛ, పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవు వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఒడ్డెర, యాదవ కులస్తుల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో మంగళవారం ఆయన వర్గల్ శివారులోని సర్వే నంబర్ 1045 ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట గిర్ధావర్ ప్రవీణ్, భగత్ తదితరులున్నారు. ఓపీ సేవల సమయం పెంచండి సిద్దిపేటకమాన్: ప్రభుత్వాసుపత్రిలో ఓపీ సేవల సమయాన్ని పెంచి, సకాలంలో వైద్య సేవలందించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ప్రభు త్వ ఆస్పత్రి సందర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్దుబ్బాకటౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తసేకరణ వాహనాలకు అందించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎ.మహేశ్కుమార్ సూచించారు. 16వ వార్డులోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవుని రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సిబ్బందితో చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా చేపట్టే సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాలి చేర్యాల(సిద్దిపేట): వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమ పిలుపునిచ్చారు. డ్రై డే కార్యక్రమంలలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిలిచిన నీటిని తొలగించడం, పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా, వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
డీఎస్ఓ తనూజదుబ్బాక: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్ఓ) తనూజ అన్నారు. మంగళవారం కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం హబ్షీపూర్లో పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలతోపాటు పలు కాలనీల్లో సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలంలోని 21 గ్రామాలలో పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీడీవో సోమిరెడ్డి, ఎంపీఓ మురళి, కార్యదర్శి వజ్ర తదితరులు ఉన్నారు. -
జల సంరక్షణ అందరి బాధ్యత
మున్సిపల్ చైర్ పర్సన్ అరుణచేర్యాల(సిద్దిపేట): నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు. జాతీయ జల మిషన్లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో కలిసి జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటిని సేకరించడం, ప్రతి నీటి చుక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత రాకుండా చూడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల శక్తి అభియాన్ – క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భూ గర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలి హుస్నాబాద్రూరల్: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీఓ సతీశ్ అన్నారు. బంజేరుపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లో ఆయన పర్యటించి బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. బంజేరుపల్లి బోరుబావి వద్ద ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. రైతులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించి ఉపాధి హామీ పథకంలో పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ మనీల, సర్పంచ్లు చంద్రకళ, లత తదితరులు ఉన్నారు. -
చర్యలు తీసుకోవాలని వినతి
హుస్నాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిప్యుటీ ఇంజనీర్ శ్రీనివాస్కు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. అలాగే కుంటలోని కొంత భూమిని ఆక్రమించారని, అధికారులు హద్దులు నిర్ణయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రహదారుల పేరిట గుట్టలను తవ్వి మట్టిని తరలించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి కుంటను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, విజయభాస్కర్, తిరుపతి నాయక్, రమేశ్ పాల్గొన్నారు. ‘జబర్దస్త్’ నటి ఫైమా సందడి దుబ్బాకటౌన్: జబర్దస్త్ హాస్యనటి ఫైమా దుబ్బాక మైనారిటీ గురుకులంలో మంగళవారం సందడి చేశారు. ఈ గురుకులం ప్రత్యేకత తెలుసుకొని తన అక్క కొడుకుని చేర్పించారు. అనంతరం విద్యార్థులకు జోకులు చెప్పి నవ్వించారు. ఈ మైనారిటీ గురుకులాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సన్మానించారు. విద్యార్థులకు షూస్ అందజేత గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండలంలోని అహ్మదీపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం సుగుణాకర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గజ్వేల్కు చెందిన ఎర్ర సత్యం మంగళవారం షూస్ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియో గం చేసుకుంటూ ఉన్నతులుగా ఎదగాలన్నా రు. కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆ పాపం బీఆర్ఎస్దే.. బెజ్జంకి(సిద్దిపేట): ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతినిచ్చి పాపం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షుడు శ్రీకాంత్తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధన లు పట్టించుకోకుండా వారి సర్పంచ్లు తీర్మానాలు చేయడం వల్లే మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫ్యాక్ట రీ అనుమతులపై ఎమ్మెల్యేను కానీ, పార్టీని కానీ విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం చిన్నకోడూరు(సిద్దిపేట): పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పద్మశాలి కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, ఆర్టీఏ మెంబర్ డా.సూర్యవర్మ, ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ శంకర్, నాయకులు సాకి ఆనంద్, చంద్రశేఖర్, పరశురాములు, రాజేశ్ పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిగజ్వేల్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఎంఎస్ పనిచేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా.. వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా సాయికిశోర్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్ తదితరులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మరాఠి కృష్ణమూర్తి, తిరుపతిగౌడ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు.. అందని చివరి బిల్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల శోభ. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతోంది. ఇల్లుతో సొంతింటి కల నెరవేరింది కానీ.. అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బిల్లులు సరిపోవడం లేదని, దీంతో అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఫైనల్ బిల్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. అప్పులు తెచ్చిన వాటికి వడ్డీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఫైనల్ బిల్లు త్వరగా ఇప్పించాలని శోభ కోరుతున్నారు. గృహ ప్రవేశమైనా పైసలు అందలే.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.4లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటీవల గృహ ప్రవేశం సైతం పూర్తయింది. అయినప్పటికీ ఫైనల్ బిల్లు రాలే. ప్రభుత్వం అందించిన డబ్బులే సరిపోవడంలేదు.. మరో వైపు బిల్లు ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం. –గీకురు సుమలత, హుస్నాబాద్సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చివరి బిల్లు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పలువురు పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,244 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. ఇందులో 2,567 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిలో 491 వాటికే పూర్తి బిల్లులు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 10,244 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా అందులో బేస్మెంట్ స్థాయిలో 1,489, గోడల నిర్మాణం 821, స్లాబ్ వేసినవి 3,998, నిర్మాణం పూర్తి అయినవి 2,567 ఉన్నాయి. వీటిలో చివరి బిల్లు కేవలం 491 ఇళ్లకు మాత్రమే చెల్లించగా మిగతా 2,076 ఇళ్లకు ఇంకా రూ.33.21కోట్లను లబ్ధిదారులకు చెల్లించాలి. గృహ ప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా.. చివరి బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొందరి ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడంతో అప్పులు చేసి పనులు చేపడుతుండటం గమనార్హం. దీనికి తోడు ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసిన బిల్లులు సైతం ఆలస్యమవుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం మొత్తంగా దాదాపు రూ.12లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం అందించే సాయంలో నిర్మాణం చేసే మేసీ్త్రకే రూ.3.5లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే డబ్బుల్లో మిగిలేది రూ.1.5లక్షలు మాత్రమే. మెటీరియల్, ఇతర ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ వారికి ఇలా దాదాపు మొత్తంగా అదనంగా రూ.7లక్షలు లబ్ధిదారుల మీద డబ్బులు పడుతున్నాయి. వడ్డీల భారం ఓ వైపు బిల్లులు రాకపోవడం.. ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి బిల్డర్లు డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేక లబ్ధిదారుల తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు. మరికొందరు గ్రామాల్లో రూ.2 వడ్డీకి అప్పులు తెస్తూ.. ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన వారికి బిల్లు చెల్లింపుల్లో జాప్యం కారణంగానే అనేక చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఫైనల్ బిల్లు ఆలస్యమవుతోంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఫైనల్ బిల్లు ఆలస్యమయ్యేది వాస్తవమే. త్వరలో ఫైనల్ బిల్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చే యించిన వారికి మిగతా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. – భగవాన్ రావు, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
రాష్ట్ర స్థాయి పతకాలు భేష్
సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: పోలీసు సిబ్బంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్లో ఇటీవల జరిగిన తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని సీపీ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో కమిషనరేట్ నుంచి పాల్గొన్న ఆర్ఎస్ఐ పి.రోహిత్ పవర్లిఫ్టింగ్ 83 కేజీల విభాగంలో బంగారు పతకం, అలాగే ఎస్ఐ అంజయ్య కరాటే 84 కేజీల విభాగంలో బంగారు పతకం, కానిస్టేబుల్ ఎన్.అనిల్కుమార్ కరాటే 75 కేజీల విభాగంలో కాంస్య పతకంసాధించారన్నారు. ఏఆర్ పీసీ భరత్ త్వైకాండో 74కేజీల విభాగంలో కాంస్య పతకం, ఏఆర్ మహిళా కానిస్టేబుల్ డి.శ్రావణి యోగాలో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని గెలు చుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రాజెక్టు సిద్ధి కార్యక్రమంలో యోగా నేర్చుకుని మొదటి ప్రయత్నంలోనే పతకం సాధించడం అభినందనీయమన్నారు. -
నులిపురుగులను నివారిద్దాం
కొండపాక(గజ్వేల్): నట్టల నివారణ కోసం 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని పురస్కరించుకొని కొండపాక మండలంలోని దుద్దెడలో గల హైస్కూల్ల్లో విద్యార్థులకు మాత్ర లు వేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎదిగే వయస్సులో పిల్లలు వ్యాధులకు గురైతే సరైన ఎదుగదల ఉండకపోవడంతో వివిధ రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య విషయంలో పిల్లలు తగు జాగ్రత్తలు తీసు కునేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. కడుపు లో నులిపురుగులు ఉంటే.. ఆకలి మందగించడంతో పాటు ఎప్పుడూ నీరసంగా కనిపించే లక్షణా లుంటాయన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధన్రాజ్, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం లక్ష్మి, సర్పంచ్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
భూనిర్వాసితులకు పరిహారం చెల్లించండి
గజ్వేల్: రాయపోల్ మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోగల టెంకంపేట కొండపోచమ్మసాగర్ కాల్వ భూనిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందెబోయిన ఎల్లయ్య కోరారు. అదేవిధంగా ఆహ్మద్నగర్ నుంచి ముత్యంపేట వరకు కాల్వ నిర్మాణం చేపట్టాలన్నారు. సోమవారం గజ్వేల్లోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ సమస్యపై రైతులతో కలిసి అధికారులకు ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెంకంపేటకు చెందిన 19మంది రైతులకు చెందిన 15ఎకరాల భూమిలో కొండపోచమ్మసాగర్ కాల్వను మూడేళ్ల క్రితం నిర్మించారని, అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆహ్మద్నగర్– ముత్యంపేట వరకు కాల్వను నిర్మించాలని రైతులు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు. -
సర్పై అలసత్వం వద్దు
● యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ● ఒక్క ఓటూ తప్పిపోవద్దు ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: సమగ్ర ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపుని చ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిద్దిపేట పట్టణ పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్ను లు, ప్రస్తుత పరిస్థితులు గూర్చి సమీక్ష నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అధికారులు, సిబ్బందిని కలెక్టర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ శాతం నమోదైన సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఒక్క ఓటు తప్పిపోవద్దని, అదేవిధంగా రెండు చోట్ల ఒకరికి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులను నిర్వహించకపోతే ,అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరి ఇంటింటికి వెళ్లి పూరించిన ఎన్యుమరేషన్ పత్రాలను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఆర్డీఓ సదానందం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహశీల్దార్ హరి కిరణ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.94 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ.94లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 47రోజులలో భక్తుల కానుకల రూపంలో రూ.94,93,627 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. సోమవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.94,93,627, మిశ్రమ బంగారం 56 గ్రాముల 600మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 500గ్రాములు, విదేశీ కరెన్సీనోట్లు 32 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. పరిహారం ఇవ్వకుండానే రోడ్డు పనులా? అడ్డుకున్న గ్రామస్తులు కోహెడరూరల్(హుస్నాబాద్): మండల పరిధి నాగసముద్రాల గ్రామ శివారులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారి (765 డీజీ) మెదక్–ఎల్కతుర్తి విస్తరణ రోడ్డు పనులను సోమవారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఎలా ప్రారంభిస్తారని వారు ప్రశ్నించారు. మా భూములు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ బాధితుల గోడును పట్టించుకోని అధికారులు తీరుపై మండిపడ్డారు. పరిహారం అందే వరకు ఇంచు భూమి కూడా వదలమని బాధితులు తెగేసి చెప్పారు. ‘చేనేత’ సలహా మండలి చైర్మన్గా శ్రీనివాస్హుస్నాబాద్: చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్గా చింతకింది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పద్మ శాలి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో అభినంద సభ ఏర్పాటు చేశారు. చేనేత వృత్తిదారుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతకారుల సమస్యల పరిష్కారంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చేనేత, పద్మశాలి సంఘ నాయకులు భగవాన్, వెంకటరమణ, లక్ష్మీపతి, లక్ష్మయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి నేటి నుంచి 28 వరకు టీకాలు జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి గోపాలకృష్ణమూర్తి ప్రశాంత్నగర్(సిద్దిపేట): గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి (పారుడు రోగం) వ్యాపిస్తోందని, పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. పీపీఆర్ వ్యాధి వైరస్ వలన వ్యాపిస్తోందన్నారు. గొర్రెలు, మేకలలో తీవ్ర జ్వరం, నోటిలో పొక్కులు రావడం, పల్చటి విరేచనాలు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, ముక్కు, కళ్ల నుంచి స్రవాలు కారడం, డీ హైడ్రేషన్కు గురి అవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వలన 4 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు మరణిస్తాయన్నారు. ఈ వ్యాధి నివారణకు గాను పీపీఆర్ టీకాలు వేయాలన్నారు. వ్యాధిని గమనించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి, చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధి నివారణకు మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. -
‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’
సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’ అంటూ రక్తదానం చేశారు. సేకరించిన రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి పంపిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం నాయకులు మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు. – సిద్దిపేటజోన్ -
శాలివాహన సంఘాల అభివృద్ధికి కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): శాలివాహన సంఘాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో హుస్నాబాద్, చిన్నకోడూరు మండలాలకు చెందిన శాలివాహన కుల సంఘాల నాయకులు దరిపల్లి చంద్రాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాలివాహనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ శాలివాన సంఘం అధ్యక్షుడు బెక్కంటి భీమయ్య, ఇటికాల స్వామి, నాంపల్లి సమ్మయ్య, నమిలి కొండ ఐలయ్య, తిరుపతి, భూపతి, ప్రదీప్, పరశురాములు, శ్రీధర్, కుంటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై నోటీసుల పిడుగు
యూరియా కష్టాలు వీడేనా మీసేవలో యూరియా బుకింగ్ ఉపయోగకరంగా ఉండదని రైతులు వాపోతున్నారు. వివరాలు 8లో uపారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. వివరాలు 9లో uసోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026పంట రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రోజూ ఇంటికి వస్తుండ్రు. నోటీసులు కూడా ఇచ్చారు. గత యాసంగిలో కడదామంటే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈసారైనా పంటలు పండుతాయనుకుంటే.. వానలు కురుస్తలేవు. ఈ కరువు కాలంలో రుణం ఎలా కట్టేది?.. ఎలా బతికేది? – ఎల్లవ్వ, మహిళ, రైతు దుబ్బాకరూరల్: పంట రుణాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడం.. మరోవైపు కరువు కమ్ముకొస్తున్న ఈ తరుణంలో రుణాలు ఎలా చెల్లించేది అంటూ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రైతుల రుణాలను మాఫీ చేసింది. అందరికీ మాఫీ చేస్తారని గంపెడాశతో ఎదురు చూసినా చివరకు కొందరికి నిరాశే మిగిలింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం రైతు ఇంటికి వచ్చి రుణం చెల్లించాల్సిందేనని నోటీసులు ఇచ్చి వెళ్తున్నారు. రుణం మాఫీ చేస్తారనుకుంటే బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి ఫొటోలు, నోటీసులు ఇవ్వడంతో రైతులు కంగుతింటున్నారు. యాసంగిలో దెబ్బతిన్న పంటలు యాసంగిలో వేసిన పంటలు అకాల వర్షాలు.. వడగళ్లవానలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు నేల మట్టమయ్యాయి. మరి కొన్ని చోట్ల మొక్కజొన్న పంటలు, వరి పంటలు అగ్నికి దగ్ధమయ్యాయి. దీంతో పంట రాబడి రాకుండా పోయింది. సాగుకు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే.. చేతి కొచ్చిన పంట రైతు కళ్లెదుటే దెబ్బతినడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల హుకుం అయోమయంలో అన్నదాతలు మరోవైపు కమ్ముకొస్తున్న కరువు -
నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు పంపిణీ చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల వారు 2,12,569మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 2,461 పంపిణీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నేడు మాత్రలు తీసుకోలేని పిల్లలకు ఈ నెల 20న నిర్వహించే మాప్ అప్ డే కార్యక్రమంలో భాగంగా మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సూచించారు. -
కేవైసీ.. పరేషన్!
ప్రహసనంగా ఐడెంటిటీజిల్లా పౌర సరఫరాల శాఖలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. రేషన్ కార్డుదారుల కేవైసీ ప్రక్రియకు రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరంగా ఉండటంతో నిర్దేశించిన వందశాతంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేవైసీ చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయాల్సి వస్తుందని సంబంధించిన శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ లబ్ధిదారుల్లో స్పందన కనబడకపోవడంతో రేషన్ డీలర్లు, శాఖ అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – సిద్దిపేటజోన్ జిల్లాలోని 688 రేషన్ షాప్ల ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 3,36,976 రేషన్ కార్డులు ఉండగా వీటి ద్వారా 1,04,9021 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ క్రమంలో రేషన్ పక్కదారి పట్టకుండా అర్హులైన వారిని గుర్తింపు నేపథ్యంలో కేవైసీ అంశం తెర మీదకి వచ్చింది. రేషన్ షాప్ వారీగా లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ చేపట్టి వారి ఐడెంటిటీ నిర్దారణ మొదలుపెట్టారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటివరకు 3,23,100 రేషన్ కార్డులకు సంబంధించి 8,48,106మంది లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ సేకరణ జరిగింది. ఇంకా 13,876కార్డులకు చెందిన 2,00,915మంది బయోమెట్రిక్, ఐరిష్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం కొన్ని నెలలుగా రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నా వారిలో స్పందన నామమాత్రంగా ఉందని చెప్పాలి. వందశాతంపై ప్రభావం.. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరి కేవైసీ వందశాతం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలక్ష కారణాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కార్డుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ సమస్యగా మారుతోంది. అదేవిధంగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో లబ్ధిదారులు చనిపోయారు. అయినప్పటికీ వారి పేర్లను కార్డుల నుంచి తొలగింపు ప్రక్రియ లేకపోవడం, అలాగే వన్ నేషన్.. వన్ రేషన్ నినాదంతో లబ్ధిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు అంతే ఆసక్తిగా గుర్తింపు ప్రక్రియకు రావడం లేదు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం కేవైసీ నిర్దేశించిన లక్ష్యం పై ప్రభావం పడుతోంది. ఐడెంటిటీ ప్రక్రియకు రాకుండా రికార్డులలో పెండింగ్ అంశంగా ఉన్న లబ్ధిదారుల ఆచూకీ కోసం రేషన్ డీలర్లు నెలల కొద్దీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంకా రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరం నెలలు గడిచినా స్పందన కరువు కష్టతరంగా వందశాతం ప్రక్రియ వెతుకులాటలో రేషన్ డీలర్లు 20శాతం మిగిలింది.. జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ నిరంతరం.. ఇప్పటివరకు 80శాతం పూర్తి అయింది. ఇంకా 20శాతం మిగిలి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ చేయించుకోవాలి. –తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆత్యాపాత్యా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముకేష్, చైర్మన్ జంగిటి శ్రీనివాస్లు అన్నారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆత్యా పాత్యా క్రీడలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఆత్యా పాత్యా లక్ష్యమన్నారు. క్రీడల ద్వారా యువతలో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు మహేశ్, వెంకట్రెడ్డి, రాజు, కనకారెడ్డి, రజిత, రజినీ, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. గజ్వేల్రూరల్: కౌలు రైతులను గుర్తించే వరకు సంఘటితంగా ఉద్యమిస్తామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కౌలు రైతులను గుర్తిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కౌలు రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, యూరియా సరఫరాకు ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వేణు, మండల అధ్యక్షుడు చంద్రం, కౌలు రైతులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. ఆదివారం పట్టణంలో హెల్ప్ డెస్క్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందుబాటులో ఉండని సూపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరి విధులకు హాజరుకావాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సర్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ, ఆన్లైన్ ప్రక్రియ గూర్చి సమీక్షించారు. మాజీ మంత్రి హరీశ్రావు పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీమంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు మీ వైపు చూసేలా చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. -
మరో ముందడుగు
స్వచ్ఛ దిశగా● మున్సిపాలిటీకో వార్డు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక ● పూర్తిస్థాయిలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలు ● విజయవంతం కాగానే అన్ని వార్డుల్లో అమలు ● త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో శ్రీకారంకొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు మున్సిపాలిటీల్లో కొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్ఐఆర్ కార్యక్రమం పూర్తవగానే ఓ వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జీరోవేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నాం. పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా అందుబాటులో వారితో కార్యక్రమాలు జరిగేలా ప్రయత్నిస్తాం. – గణేశ్రెడ్డి, కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ గజ్వేల్: మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ తీరు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ శాసీ్త్రయంగా జరగకపోవడం వల్ల ఈ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త పంథాలో చెత్త సేకరణ చేపట్టడమే కాకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల 9న గజ్వేల్లోని డంపు యార్డు వద్ద జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతోపాటు అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట కమీషనర్లు, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త తరహా పద్ధతులపై దిశానిర్వేశం చేశారు. సిబ్బంది కొరతే శాపమా? పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కొరత ఆయా మున్సిపాలిటీలకు శాపంగా మారాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. ఇక్కడ ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 60మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పది వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టింట్, ఏఈల పోస్టులు కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలకు సవాలుగా మారిన వ్యర్థాల నిర్వహణ కొంత పుంతలు తొక్కనుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి కొత్త తరహాలో స్వచ్ఛత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయనున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మిగతా వార్డుల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం త్వరలో అమలు కానుంది. వ్యర్థాల నిర్వహణలో కొత్త పంథాఈ సదస్సులో మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. వార్డులో పూర్తిస్థాయిలో జీరోవేస్ట్ మేనేజ్మెంట్, అక్కడ ఉత్పత్తయిన తడి, పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరు చేసి కంపోస్ట్ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని అనుకున్నారు. ఇలా చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా స్వచ్ఛతకు బాటలు పడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల చెత్తను ప్రత్యేకంగా వేరు చేసి.. కులియబెట్టడం ద్వారా కంపోస్ట్ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డంపు యార్డుల్లో అగ్గి రాజుకోకుండా తీసుకోవాల్సిన శాసీ్త్రయ చర్యలపైనా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ కార్యక్రమాలు కొంత పరిచయమున్నా.. మిగతా మున్సిపాలిటీల్లో సాగడం లేదు. ఇక అన్నీ మున్సిపాలిటీల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు. -
కొత్త పంట
ఎల్నినో తంట..ఆయిల్పామ్ వైపు రైతుల మొగ్గు ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యం ఊపందుకున్న ప్లాంటేషన్ఇప్పటికే 710ఎకరాల్లో పూర్తి.. గతంతో పోలిస్తే రికార్డే.. జిల్లాలో 2021–22లో ప్రారంభమైన ఆయిల్పామ్ సాగు ప్రస్తుతం 15వేల ఎకరాలపైచిలుకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 7 టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయిల్ఫెడ్ సంస్థ నుంచి జిల్లా రైతులకు రూ.18కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని నర్మెటలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం, ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్కు అవకాశముంది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లే అవకాశం కలిగింది. వర్షపాతం తగ్గడంతో.. ఆయిల్పామ్ సాగుకు సంబంధించి ఈసారి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షపాతం తగ్గడం, గత సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా యాతన పడటం వల్ల ఈసారి రైతులు ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే.. గతంలో రూ.17,500 ఉన్న ఆయిల్పామ్ గెలల టన్ను ధర ఆరునెలలుగా అమాంతంగా రూ.23వేల పైచిలుకు పలుకుతుండటం.. ప్రస్తుతం రూ.23,837కు చేరుకోవడం కూడా కలిసి వస్తున్నది. జోరుగా ప్లాంటేషన్.. సహజంగా ఏటా ఆయిల్పామ్కు సంబంధించి అధికారులు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. అది అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈసారి 4వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రైతులు 500ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశారు. తాజాగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్లో మరో 210ఎకరాల్లో సాగు కొత్తగా చేరింది. దీంతో ఈ సీజన్లో 710ఎకరాల్లో ఇప్పటివరకు సాగులోకి వచ్చింది. నిజానికి ఏటా ప్రతి సీజన్లో ఈ సమయానికి 100ఎకరాల్లోపు ప్లాంటేషన్ అవడమే గగనం. కానీ ఈసారి ప్లాంటేషన్ రికార్డు స్థాయిలో ఊపందుకున్నది. అంతేకాకుండా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకురావడం వల్ల మరో 2,631ఎకరాల్లో ప్లాంటేషన్కు అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నారు. త్వరలోనే ప్లాంటేషన్ను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఆయిల్ఫామ్ రైతుల అవసరాల కోసం 1200ఎకరాల్లో డ్రిప్ ఇవ్వడానికి సైతం కార్యాచరణ సిద్ధం చేశారు. ఎల్నినో ఎఫెక్ట్.. జిల్లాలో రైతుల ఆలోచన విధానాన్ని మార్చింది. ఆయిల్పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా చేసింది. ఈ ఏడాది అధికారులు 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్లాంటేషన్ ఊపందుకుంది. 710 ఎకరాల్లో పూర్తికాగా, మరో 2,631 ఎకరాలకుపైగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే ఇది రికార్డు. ప్రస్తుతం జిల్లాలో సాగు 15వేల ఎకరాల పైచిలుకు చేరుకున్నది. – గజ్వేల్మారుతున్న ఆలోచన విధానం జిల్లాలో సాధారణంగా వానాకాలం సీజన్లో 5.50లక్షల ఎకరాల్లో, మరో 2.50లక్షల ఎకరాల్లో యాసంగిలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. మూస పద్ధతుల్లో సాగు కొనసాగటం వల్ల రైతులకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్పామ్ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. దీంతో రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది.రైతుల్లో మార్పు.. ఎల్నినో పరిస్థితులు, వరి సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి రైతులు ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. 4వేల ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటికే 710ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశాం. మరో 2,631ఎకరాల్లో సాగు చేపట్టబోతున్నాం. – సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
సర్ను సమర్థంగా నిర్వహించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో నిర్వహిస్తున్న సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డిజిటలైజేషన్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం నేరమన్నారు. మరణించిన ఓటర్లు, నకిలీ ఓట్లు, రెండు ఓట్లు కలిగి ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. బీఎల్ఓ వారిగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభు త్వ భూమిని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల తహసీ ల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన -
సర్వర్ డౌన్
మొరాయిస్తున్న భూ భారతి సైట్ మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్లో సర్వర్ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనేది అంచనా వేసుకోవచ్చు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి భూభారతి పోర్టల్ సర్వర్ సమస్య కారణంగా రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులుగా రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు తమ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. దీంతో మిగతావారు రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఇదే సమస్య నెలకొంది. మెయింటెనెన్స్ పేరుతో... భూభారతి పోర్టల్ను యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట జూన్ 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు రెవెన్యూశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ 12 రోజులవుతున్నా..ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. సాఫ్ట్వేర్ను అప్గ్రేడేషన్ జరుగుతోందని, సర్వర్ సామర్థ్యం కూడా పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక..రానున్న రోజుల్లో పోర్టల్ మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సమస్య లేదు భూభారతిలో పోర్టల్లో ట్రాన్సక్షనల్ సర్వీస్ మాత్రమే సమస్య కొనసాగుతోంది. సాధారణ ప్రజలు సెర్చ్ చేసే సమాచార సేవలకు మాత్రం ఎ లాంటి సమస్య రావడం లేదు. మార్కెట్ వ్యాల్యూ, భూమి వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఈసీ వివరాలు (ధరణికి ముందు), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు వంటి సేవలుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. కేవలం భూలావాదేవీలకు సంబంధించిన లాగిన్లోనే సమస్య కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు -
వ్రత నాచగిరి.. సేవలతో తరించి
యువతరం ప్రైవేటు ఉద్యోగాలు వదిలి.. సాగుకు జైకొట్టి.. సిరులు రాబడుతున్నారు. సరికొత్త పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వినూత్న ఎవుసం చేస్తూ నాణ్యత గల ఉత్పత్తులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురి యువరైతుల వ్యవసాయంపై.. ఈ వారం ప్రత్యేక కథనాలు. భక్తులతో కిటకిటలాడినపుణ్యక్షేత్రంసుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలతో అలరారింది. సేవలు, కల్యాణాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారి కల్యాణం, సేవలు నిర్వహించి తరించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. –వర్గల్(గజ్వేల్) -
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శంకర్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తప్పెట శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణలు శనివారం నియామక పత్రాన్ని ఢిల్లీలో అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వర్గల్(గజ్వేల్): ప్రభుత్వం 50% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. శనివారం వర్గల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, నర్సింహారెడ్డితో కలిసి పలుపాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు నెలలలోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులు తీరుస్తాం గజ్వేల్: చేనేత కార్మికుల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని గజ్వేల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం అన్నారు. శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రామచంద్రం డైరెక్టర్లు భాగ్యలక్ష్మి, అమృతమ్మ, ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
గోదారిలో నీళ్లున్నా.. మోటార్లు ఆన్ చేయని సర్కార్
నంగునూరు(సిద్దిపేట): గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లున్నా కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయించడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. తిమ్మాయిపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో శనివారం హరీశ్రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంతటి కరువు వచ్చినా రైతాంగానికి సాగునీరు ఇచ్చేలా కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించారన్నారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి సిద్దిపేట నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రేవంత్రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా అధిక లాభాలు వస్తున్నందున రైతులు ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం పడితే ఆయిల్పామ్ రైతులకు 20 రోజులకో మారు ఏడాదిలో 15 సార్లు డబ్బులు పడుతున్నాయని చెప్పారు. ప్రతీ ఓటరును కలవండి సిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజంట్లు అత్యంత కీలకమని, ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతీ ఓటరును క్షేత్ర స్థాయిలో కలవాలని, ఎన్యూమరేషన్ పత్రాలు నింపేలా బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును బూత్ లెవల్ ఏజెంట్లు కలిసి ఓటుహక్కు విలువ గూర్చి వివరించి చైతన్యం చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేది రాజ్యాంగ సూత్రమని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసు మాజీ మంత్రి హరీశ్రావు -
వాన లేకపాయె.. స్ప్రింక్లర్లే దిక్కాయె
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు మాత్రం కురవడంలేదు. ఇటీవల కురిసిన కొద్ది పాటి జల్లులకు దుక్కులు దున్ని మొక్కజొన్న విత్తనాలు విత్తుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్నను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నీటి వసతి లేని రైతులు ఆకాశంలోని మేఘాలవైపు చూస్తున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
ఎక్స్పో అదుర్స్..
సిద్దిపేటజోన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ఢిల్లీ సౌజన్యంతో శనివారం జిల్లా కేంద్రంలోని మెరీడియన్ పాఠశాలలో నిర్వహించిన ఎక్స్పో అండ్ గైడెన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న 58 సీబీఎస్ఈ విద్యాసంస్థలు ఈ ఎక్స్పోలో పాల్గొని వందకు పైగా నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాలపై ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, సోలార్ వ్యవస్థ, పర్యావరణ, పారిశ్రామిక విధానం, పర్యాటక, గ్రామీణాభివృద్ధి, తదితర అంశాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, సాంకేతిక నమూనాలు ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమంలో సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్, తిరువనంతపురం ప్రాంతీయ డైరెక్టర్ విగ్నేష్, మెరీడియన్ విద్యాసంస్థల డైరెక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్
సిద్దిపేటరూరల్: జిల్లాలో శుక్రవారం చేపట్టనున్న ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలోనీ వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓ లతో కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమాల పనితీరు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల్లో గుర్తించిన వ్యవసాయ క్షేత్రాలలో ఆయిల్పామ్ మొక్కలను నాటాలన్నారు. ఎల్నీనో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి లభ్యత ఉన్న రైతులే వరి పండించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఎకరానికి 2 బ్యాగులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా అక్రమంగా అమ్మినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సైతం వేగవంతం చేయాలని, ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్షం వహించవద్దన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో మందకొడిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సెలవులు తీసుకోకుండా వచ్చే మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఏఈఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ స్వరూప రాణి, డిహెచ్ఓ సువర్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. డ్రైవ్ను సక్సెస్ చేయాలి కలెక్టర్ హైమావతి -
దేశంలోనే చేనేతకు దుబ్బాక ప్రసిద్ధి
దుబ్బాక: దేశంలోనే చేనేత పరిశ్రమకు దుబ్బాక ప్రసిద్ధి చెందిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న దుబ్బాక చేనేత సహకార సంఘం పాలక మండలిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలన్నారు. గొల్లభామ చీరలతో పాటు చాలా రకాల వస్త్రాలు నేయడంలో అందెవేసిన కార్మికులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే పెద్ద చేనేత సొసైటీలో ఒకటైన దుబ్బాక పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం కొత్త పాలకవర్గం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, చేనేత సొసైటీ అధ్యక్షులు అంకం మధు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
హుస్నాబాద్లో నేడు మంత్రుల పర్యటన
కేసీఆర్ను కలిసిన డీసీసీబీ డైరెక్టర్ ములుగు(గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్ను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్కు పూల మొక్కను అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన ములుగులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి మొక్కలు నాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మిట్టపల్లి విద్యార్థిని సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర స్థాయి అత్యా పాత్యా పోటీలకు అర్బన్ మండలం మిట్టపల్లి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.ప్రణీత ఎంపికయ్యారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో ప్రణీత ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11, 12 తేదీలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు. ఉన్ని సహకార ఎన్నికలు ఏకగ్రీవంమిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ధర్మారంలో ఉన్ని సహకార ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కంతుల కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా గుట్టయ్య, కార్యదర్శిగా బీరయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, లక్ష్మి, మల్లవ్వ, స్వామి, శ్రీనివాస్, మల్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి రవి నియామక పత్రాలను సంఘం సభ్యులకు అందించారు. -
చెత్త నుంచి కంపోస్ట్ తయారీపై గజ్వేల్లో ప్రాంతీయ సదస్సు
మున్సిపల్ శాఖ సీడీఓ హేమలత స్వచ్ఛతకు బాటలు గజ్వేల్: ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛతకు బాటలు వేస్తాయని మున్సిపల్ శాఖ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత అన్నారు. గురువారం గజ్వేల్లోని డంపు యార్డు వద్ద ‘వేస్ట్ టూ కంపోస్ట్ విండ్రో’(వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ) అంశంపై మున్సిపాలిటీల ప్రాంతీయస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హేమలత మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి కంపోస్ట్ తయారీ అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, కమిషనర్ గణేశ్రెడ్డితోపాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, ముడిచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కమీషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే..
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్, పాపయ్య, వెంకట్రెడ్డి, కనకరాజు, దుర్గారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా రైతులకే ప్రాధాన్యత.. జిల్లా రైతులకు సరిపడా ఆయిల్ పామ్ మొక్కలు అందాక ఇతర జిల్లాల రైతులకు మొక్కలు అందజేయాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి బాస్కర్ రెడ్డికి సూచించారు. రంగనాయక సాగర్ కట్ట వద్ద ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డితో ఫాన్లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. ముందు జిల్లాలో రైతులకు మొక్కలు అందించాలన్నారు. నర్సరీ నిర్వహణ సరిగా లేదని, మొక్కల్లో ఇసుక ఉందని, నీళ్లు కూడా సరిగా పట్టడం లేదని చెప్పారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు. సర్లో భాగస్వామ్యం కావాలిసిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తప్పనిసరి ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా బూత్ లెవల్ ఆఫీసర్ నుంచి ఎన్యుమరేషన్ పత్రం తీసుకుని దాన్ని పూరించి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ పత్రం నింపాలని సూచించారు. ఇప్పుడు నింపితేనే మీ ఓటుహక్కు జాబితాలో భద్రంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఇండ్లకు వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్లకు, బూత్ లెవల్ ఏజెంట్లకు సహకరించాలని సూచించారు. ఇందిరానగర్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం సీలింగ్ ఎత్తివేసి సరిపడాయూరియా అందజేయాలి మాజీ మంత్రి హరీశ్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఐప్యాడ్లను గురువారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాలు సాధించిన 31 మందికి ఐప్యాడ్లు అందించానని, 2026–27 విద్యాసంవత్సరంలో 50 మందికి ఐప్యాడ్లు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా, కేవలం స్టడీ మెటీరియల్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేలా ఈ ఐప్యాడ్లను రూపకల్పన చేశామన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ ఐప్యాడ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే 1234మంది విద్యార్థులతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందిరానగర్ పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటడానికి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు. -
సెపరేటు!
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026రూటు..రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. గతుకుల రోడ్లు గాలికి వదిలేసి.. మెరుగ్గా ఉన్న రోడ్లనే మళ్లీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారు. ఇది హ్యామ్ రోడ్ల ఎంపికలో మన ఇంజనీరింగ్ అధికారుల తీరు. ఓ పక్క ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇవేమి పట్టించుకోకుండా కమీషన్ల కోసమే ఇలా ప్రతిపాదించారన్న చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే హ్యామ్ రోడ్లను ప్రతిపాదించారని ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపించడం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట పల్లెల్లో రోడ్డు మార్గాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో భాగంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా రూ.711.36కోట్ల వ్యయంతో 146 రోడ్లు 659.09 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ(ఆర్అండ్బీ) 17 రోడ్లు 195.75కిలో మీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 129 రోడ్లు 463.34కిలో మీటర్లు నిర్మాణం చేయనున్నారు.. డీడీఆర్సీ సమావేశంలో.. ఇంజనీరింగ్ అధికారులు గతుకుల రోడ్లను కాకుండా మరో ఐదేళ్ల వరకు ఢోకా లేని రోడ్లను హ్యామ్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెల 3న ఇన్చార్జి మంత్రి వివేక్ నిర్వహించిన డీడీఆర్సీ సమావేశంలో రోడ్ల విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రస్తావించారు. హ్యామ్ రోడ్లను ఎవరిని అడిగి ప్రతిపాదించారని అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించకుండా అక్రమ మార్గానికి తరలించేందుకే మెరుగైన రోడ్లనే తిరిగి ప్రతిపాదించారని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేసినట్లు చూపించి కాంట్రాక్టర్ల లాభం కోసమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి హ్యామ్ రోడ్ల నిర్మాణం చేసే రోడ్లను పునఃపరిశీలించి, అవసరం ఉన్న చోట్ల తప్పక నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. మర్కుక్ మండలం ఎర్రవల్లి నుంచి గంగాపూర్ రోడ్డును 2020లో రూ.5.5కోట్ల వ్యయంతో డబుల్ రోడ్గా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మెరుగ్గా ఉన్నప్పటికీ తిరిగి హ్యామ్ రోడ్ కింద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంపిక చేశారు. 2.55 కిలో మీటర్ల రోడ్ను నిర్మించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి నుంచి మర్రిముచ్యాల రోడ్ నిర్మాణంను 2020లో చేశారు. ఇటీవల మంజూరైన హ్యామ్ రోడ్లలో ఇదే రోడ్ను 5.70 కిలోమీటర్ల రోడ్ను తిరిగి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డులో ఎలాంటి గుంతలు లేకున్నా తిరిగి నిర్మాణం చేయాలని నిర్ణయించడంతో పలువురు విమర్శిస్తున్నారు.టెండర్ దశలో ఉన్నవిఎంపిక చేయలేదు గతంలో మంజూరై టెండర్ దశలో ఉన్న రోడ్లను ఎంపిక చేయలేదు. నిర్మించి ఐదు సంవత్సరాలు దాటిన వాటిని హ్యమ్ రోడ్ల కింద ఎంపిక చేశాం. రెండో ఫేస్లో మరి కొన్ని హ్యామ్ రోడ్లు మంజూరు కానున్నాయి. – దీపక్, ఎస్ ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ ఫొటోలో కనిపిస్తున్నది గౌరారం నుంచి తూప్రాన్ వెళ్లే రహదారి. ఇది దాదాపు 16 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో వర్గల్ మండల కేంద్రం ఎల్లమ్మ దేవాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల గ్రామ ప్రజలు, సర్పంచ్ ఒక రోజు దీక్షను చేపట్టి నిరసన తెలిపారు. -
దుబ్బాక చేనేత పాలకవర్గం ఏకగ్రీవం
దుబ్బాక: చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గం ఎన్నికలో.. చైర్మన్గా అంకం మధు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయనను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్గా గాజుల భాస్కర్, జనరల్ సెక్రటరీగా బోడ చంద్రమోహన్, కోశాధికారిగా కారంపురి గురుచరణ్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్, పాలకవర్గంతో పాటు డైరెక్టర్లు సిరిగాధ నర్సింలు, మెత్కు కవిత, చెలిమెల రాజేశం, రాపెల్లి నాగరాజు, గడ్డం రాజమణి లతో ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పాలకవర్గం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. పలువురు అభినందనలు.. పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, నందాల శ్రీకాంత్, బడుగు రాజుతో పాటు రామక్కపేట సర్పంచ్ విఠోభ, పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య, నీలకంఠ సంఘం అధ్యక్షులు బోడ శ్రీహరి,నాయకులు, పలువురు సన్మానించి అభినందించారు.సిద్దిపేట చేనేత సహకార సంఘం సైతం.. సిద్దిపేటజోన్: సిద్దిపేట చేనేత సహకార సంఘం పాలకవర్గం సైతం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా రాధా కిషన్, ఉపాధ్యక్షుడిగా సుధాకర్, కోశాధికారిగా ప్రభాకర్తో పాటు డైరెక్టర్లుగా దత్తాత్రేయ, నగేష్, శ్రీనివాస్, భాగ్య, సరళ నియమితులయ్యారు. అమృతసేనా రెడ్డి ఎన్నికల అధికారి, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రాజెక్టు ఎన్నికల్లో 11మంది అభ్యర్థులకు ఏడుగురు ఉపసంహరణ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చేనేత జౌళి శాఖ ఏడీఓ రమ్య ధ్రువీకరించారు. సహకార సంఘం చైర్మన్గా అంకం మధు ప్రమాణస్వీకారం చేయించినఎన్నికల అధికారి -
ప్రభుత్వ భూములు కాపాడాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ డంపింగ్ యార్డు వద్ద భూమిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల రికార్డులు పరిశీలించి, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎంత? ఆక్రమణకు గురైన పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణకు గురికావొద్దుకొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కలెక్టర్ హైమవతి తహసీల్దార్ దివ్యను ఆదేశించారు. సోమవారం కొమురవెల్లి పాత కమాన్, కేజీబీవీ పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం ఆమె మట్లాడుతూ ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా ఆక్రమించడం చట్టవిరుద్ధమన్నారు. హౌసింగ్ పీడీగా భగవంతరావు సిద్దిపేటజోన్: జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా భగవంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పీడీ శ్రీనివాస్ పదవీ విరమణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పీడీగా పనిచేస్తున్న భగవంతరావును ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ హైమావతి పలు ప్రాంతాల్లో పరిశీలన -
నాణ్యమైన విద్య అందించండి
సిద్దిపేటఎడ్యుకేషన్: కళాశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకు లంతా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్టియర్లో 500లకు పైగా విద్యార్థులను చేర్చుకుని జిల్లాలో నంబర్వన్గా నిలిచారని ప్రశంసించారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కోర్సులన్నీ మంచివేనని అన్నింటిలో విద్యార్థులు చేరేలా పోత్సహించాలని సూచించారు. అధ్యాపకులు సమయ పాలన పాటిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో అధికశాతం పేదలేనని వారందరికీ స్కాలర్షిప్లు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కళాశాలకు నాలుగు తరగతి గదులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రమీల మాట్లాడుతూ కళాశాలలో సుధీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులున్నారని వారిని సేవలను ఉపయోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధిస్తామన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పా టు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని పరిశీలించారు. డ్రై డేలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి పరిసరాల పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనకచంద్రం, డిసిప్లీన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలల్లో ఉత్తమ ఫలితాలుసాధించాలి డీఐఈఓ రవీందర్రెడ్డి


