breaking news
Siddipet District Latest News
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● దిలాల్పూర్లో తెగిపోయిన కొండపోచమ్మసాగర్ కాల్వ పరిశీలన గజ్వేల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం గజ్వేల్ మండలం దిలాల్పూర్లో తెగిపోయిన దౌల్తాబాద్వైపు వెళ్లే కొండపోచమ్మసాగర్ కాల్వను పరిశీలించారు. కాల్వ నీళ్లు పొలాల గుండా కుంటలోకి వెళ్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు వివరించగా వెంటనే కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగి చెరువులు, కుంటలు, కాల్వలు తెగిపోయే ప్రమాదమున్నందువల్ల ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరదలో వాగులను దాటొద్దు మిరుదొడ్డి(దుబ్బాక): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ హైమావతి కోరారు. మంగళవారం అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న లో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ లో లెవల్ బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రత్యేకంగా బారికెడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్య లు చేపట్టాలని అధికారులకు సూచించారు. నర్సరీ పరిశీలన ములుగు(గజ్వేల్): స్థానిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్, రైతు శిక్షణ కేంద్రంలోని నర్సరీలను కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కూరగాయలు, పండ్లు, పూలు ఇతరత్ర మొక్కలు సాంకేతిక పద్ధతి ద్వారా మొలిచే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశీరకం వంగడాలతో కూడిన మొక్కలను నర్సరీలలో పెంచాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
హస్తవ్యస్తం
గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్ రచ్చకెక్కుతోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపైఒకరు కేసులు పెట్టుకునే స్థితికి చేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు మధ్య కొంతకాలంగా పోరు నడుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గం తయారైంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో స్పందించి నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్ను కన్వీనర్గా నియమించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని మల్లు రవి ఆదేశించారు. – సాక్షి, సిద్దిపేట ములుగులో గతేడాది డిసెంబర్ 2న కోకాకోలా కంెపెనీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. లోపలికి శ్రీకాంత్ రావు అనుచరులను అనుమతించారని.. తన అనుచరులను రానివ్వలేదని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నిరసన తెలిపారు. గజ్వేల్ పట్టణంలో ఈ నెల 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ ఎదుటే కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్లు ఘర్షణకు దిగారు. దిష్టిబొమ్మల దహనాలు కేసుల నమోదు వెనకాల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం ఉందని నర్సారెడ్డి వర్గీయులు నిరసనలు చేపడుతున్నారు. కొండపాక మండలం వెలికట్ట క్రాస్ రాజీవ్ రహదారిపై మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు మల్లేశం, రవీందర్ల ఆధ్వర్యంలో ఈ నెల 17న టోల్ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్ రోడ్డు వరకు నర్సారెడ్డి దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకవచ్చి దహనం చేశారు. ఇలా సొంత పార్టీ నేతలే పరస్పర విమర్శలతో రోడ్డెక్కుతూ దిష్టిబొమ్మల దహనానికి పాల్పడుతుండటం గమనార్హం. వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతల మధ్య రోజు రోజుకు కలహాలు ముదురుతున్నాయి. విభేదాలు పరిష్కరించడంలో కాంగ్రెస్ అధిష్టానం జాప్యం చేస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వర్గాలు ఒక్కటయ్యేనా గజ్వేల్ కాంగ్రెస్లో కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతోంది. ఈ విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి పలువురు ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్ను కన్వీనర్గా నియమించారు. 10 రోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కావాలని ఒక వర్గం కుట్రలకు పాల్పడుతోందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గాలను ఒక్కటి చేసి పార్టీని పటిష్ట పరచాలని క్యాడర్ కోరుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇటీవల ఇన్చార్జి మంత్రి ఎదుటే నేతల బాహాబాహీ ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు నర్సారెడ్డి, మైనంపల్లి దిష్టిబొమ్మల దహనాలు నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడి నియామకం కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వంగజ్వేల్: కాంగ్రెస్లో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు పలువురు నేతలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ను కలిసి పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు విజయ్కుమార్పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డితోపాటు పలువురు హైదరాబాద్లో పీసీసీ చీఫ్ను కలిశారు. విజయ్కుమార్పై నర్సారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని వివరించారు. పార్టీలో నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో గజ్వేల్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందనే అంశంపై అధిష్టానం సీరియస్గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వాల వైఫల్యమే కారణం
● సకాలంలో యూరియా సరఫరా చేయాలి ● దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలుకు ముందు చూపు లేకనే యూరియా కొరత ఏర్పడుతోందని విమర్శించారు. రైతులు యూరియా కోసం పస్తులతో పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభత్వుం ఏం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే యూరియా కొరతను తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కమలాకర్రెడ్డి, సోలిపేట సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి, మాజీ కోఅప్షన్ మెంబర్ ఎండీ. అహ్మద్, నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ రాస్తారోకో చిన్నకోడూరు(సిద్దిపేట): యూరియా కొరత నివారించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. గంట పాటు నిర్వహించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేటలో బారులు అక్కన్నపేట(హుస్నాబాద్): వరిసాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రానికి స్టాక్ రావడంతో రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు తమ వంతుకోసం గంటల కొద్దీ నిరీక్షించారు. పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. -
హాట్ స్పాట్లపై నిఘా ముమ్మరం
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: హాట్ స్పాట్లను రోజుకు మూడు, నాలుగు సార్లు సందర్శించి, మరింత నిఘా పెంచాలని సీపీ అనురాధ తెలిపారు. షీ టీమ్, భరోసా సెంటర్ సిబ్బందితో సీపీ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షీ టీమ్.. మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా పనిచేయాలన్నారు. సంబంధిత ఏసీపీలు వారానికి ఒకరోజు షీటీమ్ కార్యక్రమాలపై మానిటర్ చేయాలన్నారు. సమావేశంలో మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ములుగు(గజ్వేల్): ఫర్టిలైజర్ దుకాణ యజమానులు యూరియాను పక్కదారి పట్టించి, కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. వంటిమామిడిలోగల పలు ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా బ్యాగ్లను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. నకిలీ మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఫొటో తీసి ఆన్లైన్లో పొందుపరిచి, లబ్ధిదారులకు వేగంగా చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. వేగంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇంకా ప్రారంభించని చోట త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అధికారులు నగేశ్, స్వామి, తదితర అధికారులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): మంత్రి వివేక్ను పీసీసీ సభ్యుడు, భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం నగరంలో మంగళవారం కలిసినట్లు పార్టీ నాయకుడు రవితేజ తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దరిపల్లి చంద్రం కోరినట్లు తెలిపారు. అదేవిధంగా 50 ఏళ్లు ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్ను అందించాలని విన్నవించినట్లు తెలిపారు. కార్మికుల పిల్లలకు విద్యలో స్కాలర్షిప్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.10 లక్షలు, సాధారణ మరణమైతే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగిన కార్మికులకు రూ. 3 లక్షలను ఇవ్వాలని మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్ను దరిపల్లి చంద్రం కోరారన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ సానుకూలంగా స్పందించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెలిమిల రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నట్లు తెలిపారు. -
అనంతగిరిపల్లి కుంటకు గండి
యుద్ధప్రాతిపదికన పూడ్చివేత వర్గల్(గజ్వేల్): కుండపోత వానతో అతలాకుతలమైన వర్గల్ మండలంలో వరద ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతగిరిపల్లిలోని కిష్టమ్మ కుంటకు భారీ గండి పడింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులతోపాటు ఎంపీడీఓ మచ్చేందర్, ఆర్ఐ రాజు, ఇరిగేషన్ ఏఈ అలీ, అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నీటి వృథాకు అడ్డుకట్ట పడేలా జేసీబీ యంత్రాలతో యుద్ధప్రాతిప్రదికన మరమ్మతులు చేపట్టారు. గండి పూడ్చివేశారు. కాగా వర్గల్ మండలంలో మంగళవారం 3.18 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఇంకా పొలాల్లో వరద వీడలేదు. -
ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిద్దాం
● పరిశోధనలు విస్తృతంగా సాగాలి ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ములుగు(గజ్వేల్): ‘ఉద్యాన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం పరిశోధనలపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి. తద్వార ఇతర రాష్ట్రాలపై ఆధార పడటం తగ్గించాలి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మంగళవారం ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కలెక్టర్ హైమావతి, వర్సిటీ వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు రఘునందన్రావు, రైతు సంక్షేమ కమిషన్ బోర్డు సభ్యురాలు భవానీరెడ్డిలతో కలసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్మించిన సెంట్రల్ డైనింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, ఉద్యాన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు స్వయాన పొలాల్లోకి వెళ్లి రైతుల పని విధానాన్ని పరిశీలించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్నిరంగాల కంటే వ్యవసాయ రంగానికే అధిక ప్రాముఖ్యత ఉంటుందని మంత్రి తెలిపారు. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చినా దేశ ప్రజలను బతికించగలిగే ఏకై క రంగం వ్యవసాయమన్నారు. ఉద్యాన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా క్షేత్ర అనుభవాన్ని పొందాలని, రైతులతో చురుకుగా సంభాషించి సాంకేతిక మార్గ దర్శకం అందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, విజయమోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
గంటలు
సంచులు..82 యూరియా కోసం రైతన్న పాట్లు కౌంటర్ వద్ద తొక్కిసలాటదుబ్బాకటౌన్: రైతులు యూరియా సమస్యతో సతమతమవుతున్నారు. సరిపడా యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో తెలియని గందరగోళ పరిస్థితి. యూరియా వచ్చిందని తెలియగానే పరుగులు పెట్టడం.. పెద్ద క్యూ కట్టి గంటల తరబడి నిరీక్షించినా.. చివరకు సంచి బస్తా దొరుకుతుందో లేదో అన్న ఆందోళన వారిని పట్టిపీడిస్తోంది. ఇది కొంతకాలంగా రైతన్నకు కునుకులేకుండా చేస్తోంది. యువకులు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా వానను సైతం లెక్క చేయకుండా సోమవారం దుబ్బాక పీఏసీఎస్సీకి యూరియా వచ్చిందని తెలియగానే తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచి క్యూ లైన్ కట్టారు. రెండు సంచుల యూరియా కోసం ఏకంగా ఎనిమిది గంటల నిరీక్షణ తప్పడం లేదంటూ రైతన్నలు వాపోతున్నారు. ఏఓతో రైతుల వాగ్వాదం వేకువ జాము నుంచి యూరియా కోసం వేచి చూసినా దొరకకపోవడంతో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్తో రైతులు వాగ్వాదానికి దిగారు. ఏఓ వ్యవహరించే తీరుతోనే తమకు యూరియా దక్కడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఏఓ కనుసైగల్లోనే యూరియా పక్కదారి పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఎస్ఐ కీర్తిరాజు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. వేల మంది రైతుల క్యూ లైన్ దుబ్బాకకు యూరియా వచ్చిందనే తెలియగానే మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు ఉదయాన్నే వచ్చి క్యూలైన్ కట్టారు. వచ్చిన 560 యూరియా బస్తాల కోసం రెండు వేల మందికి పైగా లైన్ కట్టడం విశేషం. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో.. గంటల తరబడి నిరీక్షించినా దొరకని వైనం కొంతమందికి ఇచ్చి మమ అంటున్న అధికారులు -
రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కొమురవెల్లి(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): కొమురవెల్లి మండలంలో పలు చెరువులు నిండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మండలంలోని పోసాన్పల్లి గుండ్ల చెరువుతోపాటు పలు చెరువులను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండలంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చేబర్తి నుండి పాతూరు వెళ్లే రోడ్డును అదనపు కలెక్టర్ పరిశీలించారు. వరద ఉధృతి ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వరద తగ్గిన వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రంలో తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈ శ్రీధర్, ఏఈ అభిలాష్, రైతులు పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన పులికాశీ వంశీకృష్ణ రాష్ట్ర కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యారు. సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. క్రీడలకు పుట్టినిల్లుగా చౌటపల్లి గ్రామంలో అనేక మంది వివిధ క్రీడల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ క్రీడాకారుడు గంగాధరి మల్లేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షు డు జంగపల్లి అయిలయ్య, యూత్ నాయకులు చుంచు రాకేష్, పులికాశీ రమేష్ పాల్గొన్నారు. తొగుట(దుబ్బాక): కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్రావు తెలిపారు. మండలంలోని కూడవెల్లి వాగుతో పాటు గ్రామాల్లో చెరువులను సోమవారం పరిశీలించారు. చేపలు పట్టేవారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండలంలో 142 చెరువులు, కుంటలు ఉన్నాయని అందులో 29 ఇప్పటికే నిండి అలుగు పారుతున్నాయని చెప్పారు. వర్షం కురుస్తుండటంతో వరద పెరిగి వాగులోకి నీరు ప్రవహిస్తుందన్నారు. రైతులు, గొర్లకాపరులు వాగులోకి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈ అస్మజబీన్, సిబ్బంది పాల్గొన్నారు. హుస్నాబాద్: బోధన సామగ్రితో విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల ప్రతి అంశం సులువుగా అర్థమవుతుందని ఎంఈఓ బండారి మనీల అన్నారు. మండల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మండల స్థాయి టీఎల్ఎం (టీచింగ్, లర్నింగ్, మెటీరియల్) మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ ఎగ్జిబిట్లను ప్రదర్శించారని తెలిపారు. 52 మంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా ఎగ్జిబిట్లను తయారు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించారన్నారు. ఇందులో పది ఎగ్జిబిట్లను ఎంపిక చేసి జిల్లా టీఎల్ఎం మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. -
గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల గోల
● రెండు వర్గాలుగా చీలిన వైనం ● పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు గజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపుల గోల తారాస్థాయికి చేరుకున్నది. ఈనెల 3వ తేదీన పట్టణంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని కొండపాకకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు.. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈనెల 15న సిద్దిపేటలోనూ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం గజ్వేల్ కాంగ్రెస్ నర్సారెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేక వర్గీయులుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆదివారం విజయ్కుమార్ సహా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణకు పార్టీ అధిష్టానం ప్రత్యేక కమిటీని నియమిస్తునట్లు వార్తలొచ్చాయి. తాజాగా సోమవారం విజయకుమార్పై నర్సారెడ్డితోపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమోహన్ తదితరులు హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. గత గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం పనిచేశారని, ఎంపీ ఎన్నికల్లో రఘునందన్రావుకు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల్లోనూ విజయ్కుమార్ పాల్గొనలేదని తెలిపారు. అలాగే.. భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మొత్తానికి రెండు వర్గాల ఫిర్యాదుల పర్వం ప్రస్తుతం హాట్టాపిక్ మారింది. గ్రూపుల కట్టడికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. -
కుమ్మేసిన
వర్గల్(గజ్వేల్): భారీ వర్షం అతలాకుతులం చేసింది. మున్నెన్నడులేని అతిభారీ వర్షంతో హల్దీవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడికి ఖాన్చెరువు ఉప్పొంగింది. నాచగిరి వద్ద హరిద్రనది పొంగిపొర్లింది. రోడ్లపై రాకపోకలకు స్తంభించిపోయాయి. చందాపూర్ వద్ద రోడ్డు మీదుగా వరద ఉధృతితో గ్రామానికి వెళ్లే దారి మూతపడింది. వర్గల్ మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షంతో పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపించాయి. వర్గల్ మండలం గౌరారంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండల వ్యాప్తంగా 22.8 సెంటీమీటర్ల వర్షం పడగా.. మొక్కజొన్న, పత్తి, వరి పైర్లు వరదనీటిలో మునకేశాయి. అంబర్పేట–శాకారం రోడ్డుపై భారీగా ఖాన్చెరువు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒక వాహనం నీటి మధ్యలో నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లు, జేసీబీలతో గట్టెక్కించారు. పోలీసులు రాకపోకలను నిలిపేశారు. చందాపూర్–బొర్రగూడెం మార్గంలో లోలెవెల్ కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చందాపూర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గౌరారంలో పలువురి ఇళ్లలో నీరు చేరడంతో ఇబ్బందిపడ్డారు. రాజీవ్రహదారిపైకి వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. కాగా మండలంలో 2,945 ఎకరాల్లో వరి, 237 ఎకరాల పత్తి, 81 ఎకరాల్లో మొక్కజొన్న, 129 ఎకరాలలో కూరగాయ తోటలు నీటిలో మునిగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఏఓ శేషశయన తెలిపారు. వర్షంలోనే కలెక్టర్ పర్యటన వర్గల్ మండలంలో వర్ష తీవ్రత, పంటల స్థితిగతి, జలాశయాలు, రవాణాపరమైన ఇబ్బందులు పరిశీలించేందుకు సోమవారం కలెక్టర్ హైమావతి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళతో కలిసి పర్యటించారు. వర్షం లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు ఎక్కడికక్కడ దిశానిర్దేశం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంబర్పేట ఖాన్చెరువు, వేలూరు రంగం చెరువు, సీతారాంపల్లి తదితర ప్రాంతాలు పర్యటించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ యూరియా, ఎరువల లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం సరాఫరా చేస్తున్న యూరియాను సరిగ్గా చేర్చేందుకు కావాల్సిన ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన యూరియాను త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతిభారీ వర్షం.. రాష్ట్రంలోనే అత్యధికం గౌరారంలో 23.6 సెం.మీ వర్షపాతం నమోదు మునిగిన పంటలు.. ఉప్పొంగిన వాగులు, చెరువులు ముంపు పొలాలు, రోడ్లను పరిశీలించిన కలెక్టర్ నేడు పాఠశాలల బంద్సిద్దిపేటరూరల్: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వర్గల్, మర్కుక్, జగదేవపూర్, గజ్వేల్, కుకునూరుపల్లి, కొమురవెల్లి, మిరుదొడ్డి మండలాల్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించదని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి అవసరానికై నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08457–230000 ను సంప్రదించాలని ఆమె కోరారు. -
అప్రమత్తంగా ఉండండి
సీపీ అనురాధ మిరుదొడ్డి(దుబ్బాక): అకాల వర్షాల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. మండల పరిధిలోని అల్వాల శివారులోని కూడవెల్లి లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదను సోమవారం ఆమె పరిశీలించారు. వాగుకిరువైపులా దారులను మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వాగులను ఎవ రూ దాటే ప్రయత్నం చేయవద్దని సీపీ అన్నారు. ఆమె వెంట సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, దుబ్బాక సీఐ రవీందర్రెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ పోలీస్ అధికారులను ఆదేశించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
గుబులే..
చీకటి పడితే● పట్టణాల్లో అంతంత మాత్రంగానే గస్తీ ● సొత్తు రికవరీ అంతంతే.. ● ఈ ఏడాది ఇప్పటి వరకు 228 చోరీలు సంవత్సరం కేసులు నష్టం రికవరీ (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) 2023 680 2.78 1.80 (65శాతం) 2024 6671.94 1.30 (67శాతం) 2025 228 రూ. 78లక్షలు రూ. 53లక్షలు (68 శాతం) ఇప్పటి వరకుచీకటి పడితే చాలు.. ఎవరి ఇంటికి కన్నం వేస్తారో.. ఎవరి ఇంటిలో దొంగతనం జరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. దొంగల ముఠాలు తాళాలు వేసిన ఇళ్లను, వ్యాపార సముదాయాలను టార్గెట్ పెట్టుకుని అందినకాడికి దోచేస్తున్నారు. పట్టణాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల్లో గల ట్రాన్స్ఫార్మర్లను సైతం ధ్వంసం చేసి కాపర్ వైర్లను, ఆయిల్ను అపహరిస్తున్నారు. కేసులను ఛేదించడంతో పాటు చోరీలను నియంత్రించడంలో పోలీసులు వెనుకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రధాన కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో పోలీసుల నిఘా లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణాల్లో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనం సిద్దిపేటలోని విక్టరీ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ సెంటర్లో చోరీలే. దీంతో పట్టణంలో ఎంత పకడ్బందీగా పెట్రోలింగ్ ఉందో అర్థమవుతోంది. పోలీసులు ప్రధాన కూడళ్లు, వీధుల్లో మాత్రమే రాత్రి 11 గంటల వరకు గస్తీ నిర్వహిస్తూ తర్వాత మిన్నకుండిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గస్తీని పెంచి దొంగతనాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. రికవరీ అరకొరే.. జిల్లాలో అపహరణకు గురైన సొత్తు రికవరీ అంతంతమాత్రంగానే ఉంది. గత మూడేళ్లుగా 70శాతంలోపే రికవరీ ఉంది. పోయిన సొత్తు కోసం పలువురు ఫిర్యాదు దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోయిన సొత్తు వస్తుందా లేదా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఫిర్యాదు దారులు తిరుగుతున్నారు. చోరీ ఘటనలు ● సిద్దిపేట పట్టణం వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సోమవారం అర్ధరాత్రి రెండు మెడికల్ షాప్లలో దొంగలు పడ్డారు. విక్టరీ చౌరస్తా సమీపంలోని మెడికల్ షాప్లో రూ.1,500 నగదు పోగా, బీజేఆర్ చౌరస్తాలోని మెడికల్ షాప్లో ఏమీ పోలేదు. ● గజ్వేల్ పట్టణంలో ఒకే రోజు జూలై 26న అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దాదాపు 20 గ్రామాలు బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ● ఈ నెల 11న జగదేవ్పూర్ మండలం నిర్మల్నగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.5లక్షల నగదు, 12 తులాల వెండి గోలుసులు, అర తులం బంగారు రింగులు దోచుకెళ్లారు. కర్రె మాధవి భర్త రెండేళ్ల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు. కాగా రైతు బీమా ద్వారా రూ.5లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు బంధువులకు అప్పుగా ఇవ్వగా ఇటీవల తిరిగిచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా తల్లిగారి ఇంటికి వెళ్లారు. తాళం పగలగొట్టి ఉండటంతో స్థానికులు మాధవికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చి చూసేసరికి నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరణకుగురైనట్లు గుర్తించారు. ● మే 15న పట్టపగలే బాలాజీనగర్లో రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. మూడు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు. -
పరమాత్ముని సేవలోనే తృప్తి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలే ఉంటాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ సుందర సత్సంగంలో కొనసాగుతున్న కృష్ణాష్టమి వేడకల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పరమాత్ముని సేవలో ఉన్న తృప్తి దేనిలో ఉండదన్నారు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దుఖం ఉండదని, బాధలు తొలగుతాయన్నారు. కృష్ణుని దీవెనలతో అందరికీ మంచే జరుగాలని, ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ నిర్వహకులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల సిద్దిపేటజోన్: హరిత సిద్దిపేట దిశగా అందరం అడుగేద్దామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల సూచించారు. ఆదివారం స్థానిక 24 వార్డులో స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వాటిని కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. చెట్ల ప్రాధాన్యత గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు. వార్డు మహిళలు పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాంసిద్దిపేటరూరల్: యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని రూరల్ సీఐ శ్రీను సూచించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదామన్నారు. ఆదివారం యాంటీ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మండల పరిధిలోని రాఘవాపూర్ , నారాయణరావుపేట మండల కేంద్రాల్లోని యువతకు నిర్వహిస్తున్న క్రికెట్, వాలీబాల్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువతరాన్ని డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడంతో పాటు ఆటలు, మన సంస్కృతి వైపు మళ్లించేందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే డయల్ 100 , టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రాజేష్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డి దిష్టి బొమ్మ దహనం కొండపాక(గజ్వేల్): డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు ఆదివారం దహనం చేశారు. దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్ రోడ్డు వరకు దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసువచ్చి దహనం చేస్తూ నర్సారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏర్పుల మల్లేశం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రవీందర్లు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నర్సారెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రత్నాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే యూరియా కొరత సృష్టించారన్నారు. రైతుల ఇబ్బందులను చూస్తున్న బీజేపీ ఎంపీలు యూరియా ఎందుకు తేవడంలేదని విమర్శించారు. వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. -
అప్రమత్తంగా ఉండాలి
● అఽధికారులకు కలెక్టర్ హైమావతి సూచన ● లో లెవల్ బ్రిడ్జిల సందర్శన చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని సికింద్లాపూర్లో లో లెవల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉన్నాయన్నారు. వర్షాల కురుస్తున్నందున పొంగిపొర్లుతున్న వాగులు, కుంటలు, చెరువులు, కల్వర్టుల ప్రాంతాల వద్ద ప్రజలు వెళ్లకూడదని సూచించారు. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతారు చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆమె వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. లోలెవల్ వంతెనల వద్ద జాగ్రత్త.. కోహెడరూరల్(హుస్నాబాద్): వర్షాకాలంలో లో లెవల్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గుండారెడ్డిపల్లిలోని లో లెవల్ బ్రిడ్జిల వద్ద వరద ప్రవాహాన్ని ఆర్అండ్బీ వెంకటేశ్తో కలిసి పరిశీలించారు. అలాగే తంగళ్లపల్లిలోని పిల్లి వాగు లోలెవల్ వంతెనను పరిశీలించారు. మోయతుమ్మెద వాగు పరిశీలన నంగనూర్(సిద్దిపేట): కలెక్టర్ హైమావతి ఆదివారం నంగనూరు మండలం ఆక్కేనపల్లి వద్ద మోయతుమ్మెద వాగును పరిశీలించారు. అలాగే లోలెవల్ బ్రిడ్జి, బద్దిపడగ ఊర చెరువు, మత్తడి కింద రోడ్డును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి వాగు మీదగా రాకపోకలు లేకుండా చూడాలని సూచించారు. -
మూణ్నాళ్లకే పగుళ్లు
● గోడల నుంచి లీకవుతున్న వర్షం నీరు ● నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ● రూ.17 కోట్లు వెచ్చించినా నిష్ఫలమే.. దుబ్బాకటౌన్: పట్టణంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయ భవనం (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్.. ఐఓసీ)లో మూణ్నాళ్లకే పగుళ్లు ఏర్పడ్డాయి. నాణ్యత లోపించి పెచ్చులూడుతోంది. 2023 అక్టోబర్ నెలలో నాటి ఆర్థిక మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.17కోట్లు వెచ్చించారు. ప్రారంభించిన రెండేళ్లకే పగుళ్లు, పెచ్చులూడుతుండటంతో అందులో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సైతం జంకుతున్నారు. భవన నిర్మాణం వేళ అధికారుల పర్యవేక్షణ కొరవడటంవల్లే నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి పట్టుబట్టి నాటి సీఎం కేసీఆర్తో ఐఓసీ భవన నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింద రూ.17 కోట్లు మంజూరు చేయించారు. ఐఓసీ భవాన నిర్మాణనికి 2018లో శంకుస్థాపన చేయగా పనులు నత్తనడకన సాగుతూ..వచ్చి ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2023లో అక్టోబర్ నెలలో భవనాన్ని ప్రారంభించారు. పునాదులకే రూ.6 కోట్లకు పైగా.. పట్టణంలోని రామసముద్రం వెనుకాల 2018లో 4 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ స్థలం పూర్తిగా చెరువు వెనుకాల ఉండడం, జాలు భూమి కావడంతో కేవలం పునాదులకే రూ.6 కోట్ల నిధులు ఖర్చయ్యాయని అధికారులు చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు సైతం పలుమార్లు భవన నిర్మాణ పనులు పరిశీలించి నత్తనడకన సాగుతున్న పనులను వేగిరం చేయించి రూ.15 కోట్లతో కింది అంతస్తును పూర్తి చేయించారు. ప్రస్తుతం 3 శాఖలు ఐఓసీలో ప్రస్తుతం తహసీల్దార్, అటవీ శాఖ, పీఆర్ ఏఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వివిధ సమస్యలపై, రిజిస్ట్రేషన్లకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కార్యాలయానికి లోపలికే వెళ్లు దారిలో భవనం పెచ్చులూడి వర్షం పడితే నీళ్లు వచ్చి గోడలు తేమ వస్తున్నాయి. బయటే కాకుండా తహసీల్దార్ కార్యాలయం లోపల పలు గదులు బీటలు వారి పగుళ్లు వచ్చాయి. అలాగే అటవీ శాఖ కార్యాలయంలో సైతం బీటలు రావడంతో నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోపించిన నాణ్యత కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించ పోవడంతో పిల్లర్లు, గోడలు బీటలు వారి వర్షానికి నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.17 కోట్లతో మొదటి అంతస్తు మాత్రమే నిర్మిస్తే గోడల పెచ్చులూడడంమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా అధికారులు సదరు కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లిస్తారని ఆరోపిస్తున్నారు. భవనంలో విద్యుత్ సౌకర్యాలు సైతం సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. మరమ్మతులు చేయిస్తాం ఇటీవల నీరు లీకై న ప్రదేశాలను పరిశీలించాం. సదరు కాంట్రాక్టర్ మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం. – మహ్మద్ రిజ్వాన్, ఏఈఈ పీఆర్, దుబ్బాక -
వ్రత వైభవం.. భక్తజన సందోహం
సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం శ్రావణ శోభను సంతరించుకుంది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సత్యదేవుని వ్రతాలు, కల్యాణాలు, అభిషేకాది మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో వ్రతాది మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకున్నది. – వర్గల్(గజ్వేల్) -
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకం
మిరుదొడ్డి(దుబ్బాక): నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్ద చెప్యాలలో గ్రామానికి చెందిన నరేశ్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా ముందస్తు చర్యలు చేపట్టవచ్చన్నారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో క్రైమ్ రేట్లు తగ్గుతాయన్నారు. -
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. మట్టి కుండలో మల్లన్నకు బెల్లంపాయసం నివేదించారు. పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి చల్లంగా చూడాలని వేడుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కాగా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించే కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ప్రారంభించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
జోరు తగ్గని మంజీరా
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు తగ్గలేదు. సింగూరు నీరు పోటెత్తుతుండటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తుతూ మంజీరా పరవళ్లు తొక్కుతుంది. మూడో రోజు శనివారం కూడా రాజగోపురంలోనే దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. వరుస వర్షాలతో ఎగువ నుంచి సింగూరులోకి 31,400 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 43,300 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలకళను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. -
డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు
సిద్దిపేటఅర్బన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల ఇన్చార్జి మంత్రి పర్యటనలో భాగంగా గజ్వేల్లో నర్సారెడ్డి.. సొంత పార్టీ ఎస్సీసెల్ నాయకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సెల్ నాయకులు నర్సారెడ్డి తీరుపై నిరసన తెలుపుతున్నారు. పంద్రాగస్టు రోజు సిద్దిపేట డీసీసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణకు వచ్చిన నర్సారెడ్డికి మరోసారి నిరసన ఎదురైంది. జెండా ఆవిష్కరణ ముగించుకుని తిరిగి వెళ్తున్న సందర్భంలో జిల్లా అధ్యక్షుడి వాహనం ఎదుట పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంలో పార్టీకి చెందిన దళిత మహిళను కులం పేరుతో దూషించాడని ఆమె సిద్దిపేట త్రీ టౌన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనను అడ్డుకున్నారని నర్సారెడ్డి కౌంటర్ ఫిర్యాదు ఇవ్వడంతో నలుగురిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. -
మైనంపల్లి దిష్టి బొమ్మ దహనం
కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట క్రాస్రోడ్డులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టి బొమ్మను దహనం చేశారు. హన్మంతరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై 20 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బాబు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టను పెంచుతున్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై లేనిపోని అంతరాలు సృష్టించి గొడవలకు మైనంపల్లి కారణమవుతున్నారంటూ ఆరోపించారు. కులాల పేరుతో రాజకీయం చేయడం తగదన్నారు. చిల్లర రాజీకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ప్రతి పక్ష పార్టీల నేతలు సొంత పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న తరుణంలో అండగా ఉండాల్సిన మైనంపల్లి ఇలా వ్యవహరించడమేమిటన్నారు. మైనంపల్లి ప్రవర్తనలో మార్పు రావాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, రాజశేఖర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా కాంగ్రెస్ మార్పు?
నంగునూరు(సిద్దిపేట): పదేళ్లుగా కనబడని రైతుల క్యూలైన్లు మళ్లీ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నాయని, ఇదేనా కాంగ్రెస్ మార్పు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం పాలమాకుల పీఏసీఎస్ను సందర్శించి ఎరువుల కోరతపై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను వివరించారు. పొద్దంతా నిలబడినా ఒకటి, రెండు బస్తాలే ఇసున్నారని అన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే సాగు విస్తీర్ణం తగ్గినా ఎరువుల కొరత ఎందుకు ఉందో చెప్పాలన్నారు. సబ్సిడీలను ఎత్తివేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాసిద్దిపేటజోన్: చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం ఇందిరానగర్ పద్మశాలి సమాజ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన స్థలంలో సొంత నిధులతో భవనం నిర్మాణం సంతోషంగా ఉందన్నారు. భవనం చుట్టూ మంచి ప్రహరీ నిర్మాణానికి తన సహకారం ఉంటుందన్నారు. పట్టణంలో చేనేత మగ్గం విగ్రహాన్ని ఏర్పాటుకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తానన్నారు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట అభివృద్ధిలో పరుగులు పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పిడికెడు మట్టి తీయలేదని, అంగుళం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతుల క్యూలైన్లు, కాలిన మోటార్లు మళ్లీ దర్శనం ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా -
యూరియా కోసం అరిగోస
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం పొద్దు పొడవక ముందే యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీఏసీఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలో ఒక్కో రైతు ఆధార్పై రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ పంపిణీ చేశారు. దీంతో కొందరికి అర కొరగా యూరియా బస్తాలు లభించగా చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో నిరాశగా వెనుదిగిరిగి వెళ్ళిపోయారు. యూరియా కొరత ఏర్పడుతుండటంతో ప్రభుత్వంతో పాటు, అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళన యూరియా కొరత ఏర్పడటంతో రైతులు చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చే స్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు, పోలీసులు ఆందోళన వద్ధకు చేరుకుని సకాలంలో యూరియా పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు అందోళన విరమించారు. ఆందోళనకు దిగిన రైతులకు ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే తొగుట(దుబ్బాక): రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని వెంకట్రావుపేటలో యూరియా కోసం శుక్రవారం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడి యూరియా కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా అందక పోతే పంటల దిగుబడి ఎలా వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు లేక పోవడం సిగ్గుచేటన్నారు.చెప్యాల చౌరస్తా వద్ద రైతుల ఆందోళన -
సమాజాభివృద్ధికి పాటుపడాలి
వేడుకల్లో అధికారుల డ్యాన్సులుసిద్దిపేటరూరల్: స్వాతంత్య్రాన్ని సాధించేందుకు ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రాన్ని సాధించందేకు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. త్యాగదనుల ఆశయాలకు అనుగుణంగా దేశ సేవలో మనందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.చేర్యాల(సిద్దిపేట): స్వాతంత్య్ర దినోత్సవం వేళ అధికారులు డ్యాన్సులు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం వేడుకలు ముగిసిన అనంతరం సినిమా పాటలకు పురుష, మహిళాధికారులు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఓ అధికారి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గౌరవప్రదంగా నిర్వహించుకునే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారులు చిందులు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ -
త్యాగధనుల పుణ్యఫలం
ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్ సిద్దిపేటకమాన్: ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగంతో స్వాతంత్య్రం సిద్ధించిందని ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవిందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్, టాస్క్ఫోర్స్ ఏసీపీ రవిందర్, సీఐలు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లో విష జ్వరాలు జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వారం క్రితం ఓ యువకుడికి డెంగీ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదారు రోజులుగా వర్షాలు కురవడంతో గ్రామంలో చాలా మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లన్నీ బురదమాయంగా మారాయి. వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లకు ఇరు వైపులా అండర్ డ్రైనేజీ లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలుస్తోందన్నారు. గ్రామంలో సుమారు పది మందికి పైగా విష జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కొంతమంది గజ్వేల్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎక్కువగా చిన్నారులు జ్వరాలు బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. వైద్య సిబ్బంది ఇటువైపు దృష్టి సారించడంలేదని, మురికి కాల్వల వెంట, మురుగు గుంతల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సంక్షేమమే ధ్యేయం
సాక్షి, సిద్దిపేట: ప్రజా పాలనలలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జరిగిన 79వ పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రోడ్లు, మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచుతామన్నారు. ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం.. ప్రజా ప్రభుత్వంలో పేదలందరూ తింటున్నారన్నారు. జిల్లాలో కొత్తగా 35,681 రేషన్ కార్డులు మంజూరు చేసి 1.10లక్షల మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,633 ఇళ్లు మంజూరు కాగా 6,509 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరిన్ని త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఉచిత ప్రయాణంతో రూ.527 కోట్ల లబ్ధి జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద రూ. 527 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లోనే రూ.355కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2025–26 వానాకాలంలో రూ.2.22కోట్ల సబ్సిడీతో 3,110 క్వింటాళ్ల జనుము విత్తనాలు, రూ 4.56కోట్లతో 727 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందించినట్లు తెలిపారు. గృహజ్యోతితో నెలకు రూ.7.22కోట్ల లబ్ధి గృహజ్యోతి పథకం ద్వారా 2,00,981 వినియోగదారులకు నెలకు రూ 7.22కోట్ల మేర లబ్ధి కలిగిందని మంత్రి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్లో జీపీ, అంగన్ వాడీ భవనాల నిర్మాణాలు జరగనున్నాయన్నారు. 2025– 26లో 14,909 మహిళా సంఘాలకు రూ.886కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,077 సంఘాలకు రూ.260కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించామని తెలిపారు. గౌరవెల్లి ప్రధాన కాలువల పనులు 55శాతం పూర్తయ్యాన్నారు. త్వరలో హుస్నాబాద్కు కబడ్డీ అకాడమీని తీసుకవస్తామన్నారు. పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సెట్విన్ ద్వారా నిరుద్యోగ మహి ళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాంలను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. 20 ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ 2.61కోట్లును మంజూరు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా.. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేయడానికి కృషి జరుగుతోందన్నారు. వన మహోత్సవం 22.47లక్షల మొక్కలు టార్గెట్ కాగా ఇప్పటి వరకు 18.80లక్షల మొక్కలను నాటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.అభివృద్ధే లక్ష్యం జిల్లాలో కొత్తగా 35వేల రేషన్ కార్డులు పేదలందరికీ సన్న బియ్యం సొంతింటి కల సాకారం త్వరలో హుస్నాబాద్కు కబడ్డీ అకాడమి పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ -
జేఏసీ బైక్ ర్యాలీ
చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ చేర్యాలలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్యపంతులు మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఎనిమిదేళ్లుగా అనేక రకాల పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించడంలేదన్నారు. ఈక్రమంలోనే ఈ నెల 25న అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామనారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు మండలంలోని ముస్త్యాల, వీరన్నపేట, చుంచనకోట, కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట, నాగపూరి, శబాష్ గూడెం గ్రామాల్లో బైక్ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు ఇంటింటికి జాతీయ రహదారి ముట్టడి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు బాల్నర్సయ్య, మల్లారెడ్డి, సంజీవులు, నారాయణరెడ్డి, రాజేందర్, నాగేశ్వర్రావు, కరుణాకర్, వెంకట్మావో, తిరుపతిరెడ్డి, మల్లేశం, ఎల్లారెడ్డి, సత్తిరెడ్డి, గురువయ్యగౌడ్, సంతోష్, కిషన్, సిద్దప్ప, పాండు, కొండయ్య, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, టీఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తీజ్.. జోష్
జిల్లా కేంద్రంలో గురువారం తీజ్ సంబురం అంబరాన్నంటింది. గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన తీజ్ నిమజ్జన కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. మొదట భవానిదేవి, సంత్ సేవాలాల్ చిత్ర పటాల వద్ద తీజ్ (గోధుమ నారు)లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలతో సందడి చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వేషధారణ, మన కట్టుబొట్టు, మన భాషే మన అస్థిత్వమన్నారు. ఎస్టీలకు అనేక ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మనం ఇతరులను గౌరవించడంతో పాటుగా మనం గౌవింపబడే విధంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించి కోమటి చెరువులో తీజ్లను నిమజ్జనం చేశారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో దుబ్బాక: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. హబ్షీపూర్ చౌరస్తాలో గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఎల్కతుర్తి–మెదక్ జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కీర్తిరాజులు బలవంతంగా రైతులను అక్కడినుంచి పంపించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. రైతులు మాట్లాడుతూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరీక్షణ నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల పీఏసీఎస్కు గురువారం యూరియా వస్తోందని ప్రచారం జరగడంతో తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చాల సేపటి నుంచి నిరీక్షించిన యూరియా రావడం ఆలస్యం కావడంతో చెప్పులు క్యూలైన్లో పెట్టారు. యూరియా ఇవ్వడం ప్రారంభించగానే ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని రావడంతో గందరగోళం ఏర్పడింది. కొరత తీరేవరకు పోరాటం గజ్వేల్: యూరియా కొరత తీర్చేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేపట్టగా వారి ఆందోళనకు ప్రతాప్రెడ్డి మద్దతు పలికి బైఠాయించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. -
ఘనంగా తిరంగా ర్యాలీ
గజ్వేల్రూరల్: పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి బసవేశ్వర విగ్రహం వరకు 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ప్రధాని నరేంద్రమోదీకి అండగా నిలుద్దామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రాంరెడ్డి, నందన్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదరికమే అతి పెద్ద సమస్య
దరిచేరని స్వేచ్ఛ, సమానత్వం ● అధికార యంత్రాంగం నీతిగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు ● ‘సాక్షి’ సర్వేలో ఉమ్మడి జిల్లా ప్రజల మనోగతంసాక్షి, నెట్వర్క్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పేదరికమే అతి పెద్ద సమస్య అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అర్హులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం ఎంత మందికి దరిచేరింది? స్వాతంత్య్ర ఫలాలు అందరికి దక్కాలంటే ఏ రంగం నీతి, నిజాయితీగా పనిచేయాలి? ఇలా మూడు ప్రధాన మైన అంశాలపై సర్వే చేపట్టింది. ఈ అంశాలపై సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 90 మంది అభిప్రాయాలను సేకరించింది. పేదరికం తర్వాత అతిపెద్ద సమస్య వైద్యమే అని సర్వేలో పేర్కొన్నారు. కుల వివక్ష కూడా ఎక్కువగానే ఉందని, అవినీతి కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని తేలింది. అందని స్వేచ్ఛ–సమానత్వం.. స్వేచ్ఛ – సమానత్వం ఇంకా ప్రజలందరికి చేరువకాలేదని సాక్షి చేపట్టిన సర్వేలో వ్యక్తమైంది. 60 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 28 శాతం మంది కొద్ది మందికే చేరువైందని చెప్పారు. 12 శాతం మంది అందరికీ స్వేచ్చ – సమానత్వం చేరువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అధికార యంత్రాంగం నీతి నిజాయితీగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయాన్ని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. చట్టసభలు, న్యాయస్థానాలు మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చాలా మంది చెప్పారు.ఈ సర్వే ఫలితాలు ఇలా..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వాతంత్య్ర ఫలాలుఅందరికీ దక్కాలంటేమరింత నీతి, నిజాయితీగాపనిచేయాల్సిన రంగం? స్వేచ్ఛ – సమానత్వం నిజంగానే అందరికీచేరుతోందా?మీడియా620చట్టసభలు4510అధికార యంత్రాంగంన్యాయ స్థానాలునాణ్యమైన విద్య -
కొలువులు రావాలి.. సంపద పెరగాలి
పేదరికం తగ్గాలి.. నాణ్యమైన విద్య అందించాలి ● స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలి ● పరిమిత రంగాలలోనే రిజర్వేషన్లు వర్తింపజేయాలి ● ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి ● ‘వందేళ్ల భారతం’పై విద్యార్థుల మనోభావాలు బానిస సంకెళ్లు తెంచుకొని పరాయి పాలన నుంచి విముక్తి పొందిన మన దేశం.. 78 ఏళ్లల్లో ఎంతో పురోగతి చెందింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందా? పరిపాలన ఎలా సాగుతోంది? ఇంకా ఎలా ఉండాలి? టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, నిరుద్యోగం వంటి అంశాలపై గురువారం పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను పంచుకున్నారు. సిద్దిపేటఅర్బన్ ఆర్థికంగా బలపడితేనే.. దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. చదువుకు తగిన ఉద్యోగాలు లేకపోవడంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందిస్తే ఆటోమేటిక్గా అన్ని రంగాలలో మెరుగవుతాం. ఆర్థికంగా బలపడితే పేదరికం తగ్గి దేశ సంపద పెరుగుతుంది. – సత్యనారాయణ, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి రాజకీయ పదవులకు అర్హత ఉండాలి ఏ ఉద్యోగానికి అయినా కనీస విద్యార్హత, నైపుణ్యాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. కానీ పరిపాలన అందించే వారికి, రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతలు లేకపోవడం వల్ల ఇంకా వెనకబడి పోతున్నాం. రాజకీయ పదవులకు కూడా కనీస అర్హతలు పెట్టాలి. ఉన్నత చదువులలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. దీని వల్ల మైగ్రేషన్ పెరిగి దేశాభివృద్ధికి సాయపడే వారు తగ్గిపోతున్నారు. –నవ్య, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థిని స్టడీస్లో అడ్వాన్స్ టెక్నాలజీని చేర్చాలి ప్రస్తుతం ఉన్న సిలబస్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీని సిలబస్లో చేర్చాలి. హెల్త్ కేర్ రంగాలలో ప్రైవేట్ వారిదే ఆధిపత్యంగా ఉంది. వైద్య రంగంలో ప్రభుత్వం ఆధిపత్యం సాధించాలి. ప్రకృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని విస్త్ర ృత పరచుకోవాలి. –సాయిప్రవర్షిణి, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థిని ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలి. ప్రభుత్వం ఇండస్ట్రీల ఏర్పాటుకు సబ్సిడీలు ఇచ్చి కంపెనీలు నెలకొల్పేలా చేయూత ఇవ్వాలి. మత ఘర్షణ లు ఆపి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి. అనవసరమైన వాటి కోసం ఉచితాలు ఇవ్వకుండా దేశాభివృద్ధికి దోహదపడే వాటికే ఉచితాలు ఇచ్చే విధంగా నాయకులు ఆలోచన చేయాలి. –ఖాజా హుస్సేన్, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి కొన్ని రంగాల వాటికే.. ప్రతి రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల క్వాలిటీ, కంటెంట్ ఉన్న వారు ప్రైవేట్ రంగంలో స్థిరపడిపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడిపోతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఉద్యోగాలలో ఇవ్వడం వల్ల దేశానికి నష్టం జరుగుతోంది. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీస్ పెరగాలి. ఉద్యోగాల కల్పన ఎక్కువ మొత్తంలో కల్పించే విధంగా మార్పు రావాలి. –అఖిల్, సీఎస్ఈ ఫైనలియర్ విద్యార్థి -
అత్యాధునిక బోధనే లక్ష్యం కావాలి
● ఇంజనీరింగ్ కళాశాల ఆదర్శంగా నిలవాలి ● ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ● మొదటి ఏడాది తరగతులు ప్రారంభం హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా బోధన అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో రాజీ పడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ శివారు కిషన్ నగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం హైదరాబాద్ నుంచి ఫోన్లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హుస్నాబాద్ నాలుగు జిల్లాల పరిధిలో ఉందని, ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాల స్ధాపనకు తనతో పాటు కలెక్టర్, వైస్ చాన్స్లర్ ఎంతో కృషి చేశారన్నారు. కళాశాలలో అధునాతనమైన వసతులు కల్పించడం నా బాధ్యత అన్నారు. కళాశాలలో అధ్యాపకులు, స్టాఫ్ నియామకంలో రాజకీయ జోక్యం లేకుండా అంతా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కే అప్పగించామన్నారు. కళాశాల నిర్మాణం కోసం 35 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అకాడమిక్ విద్యా ప్రమాణాలతో ఇతర కళాశాలతో పోటీ పడి చదువు చెప్పాలని అద్యాపకులకు సూచించారు. మొదటి బ్యాచ్ విద్యార్ధులే ఈ కళాశాలకు అంబాసిడర్లు అని మంత్రి అన్నారు. ఆధునిక వసతులు కల్పిస్తాం: కలెక్టర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆధునిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా పరిపాలన తరపున అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే హుస్నాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాల కోసం స్థలం పరిశీలించాలని మంత్రి కోరారని తెలిపారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలి విద్యార్థులు ఇష్టపడి చదివి రాష్ట్రంలోనే నంబర్ వన్ కళాశాలగా పేరు తేవాలని వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ప్రాక్టికల్ గదులు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునికమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులు జాబ్తోపాటే బయటకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
యాంటీ డ్రగ్స్ వారియర్లుగా కదలాలి ● మాదక ద్రవ్యాలను అరికట్టాలి ● మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు హుస్నాబాద్: ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. నాషాయుక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే ప్రాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు. భవిష్యత్తు ముఖ్యమని, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఆచూకి తెలిస్తే తక్షణం అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సీపీ అనురాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎంఈఓ బండారి మనీల, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.చేర్యాల(సిద్దిపేట): ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం ముస్త్యాల పీహెచ్సీ, మోడల్ స్కూల్ను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఓపి రిజిస్టర్ చూసిన ఆమె ఎక్కువ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఎంత మంది వస్తున్నారు? అనే విషయాలను ఆరా తీశారు. అలాగే మందులు అందుబాటులో ఉన్నాయా, సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్ను సందర్శించారు. స్కూల్ వాతావరణం చాలా బాగుందన్నారు. ప్రణాళిక ప్రకారం సెలబస్ పూర్తి చేయాలని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ దిలీప్నాయక్, ఆర్ఐ తదితరులు ఉన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్ హైమావతి -
సమాజ శ్రేయస్సే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటజోన్: సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణం ప్రశాంత్నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సమాజ శ్రేయస్సుకు కలిసి కట్టుగా కృషి చేయాలని, ప్రశాంత్ నగర్ రెడ్డి సంఘం ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
గోస ఎన్నాళ్లు..
దుబ్బాక: యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించారు. బుధవారం పట్టణంలో రెండు షాపులకు కలిసి 500 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఆ దుకాణాల ఎదుట బారులు తీరారు. వేల సంఖ్యలో రైతులు వస్తే కేవలం కొద్దిమందికి మాత్రమే 2 బ్యాగుల చొప్పున పంపిణీ చేశారు. రోజు ఇలాగే లైన్లో నిల్చున్నా దొరకడం లేదంటూ చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం తిప్పలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ గోస పడాలని రైతులు ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సంచి దొరకలే.. ‘వారం నుంచి లైన్లో నిలబడుతున్నా.. ఒక్క సంచీ దొరకలేదు’ అని మహిళా రైతు లక్ష్మి వాపోయారు. నాట్లు వేసి నెల రోజులైందన్నారు. యూరియా దొరకకపోవడంతో పంట పరిస్థితి ఏందో అంటూ కన్నీరు పెట్టారు. త్వరగా అందేలా చూడాలంటూ వేడుకున్నారు. -
డ్రగ్స్, మత్తు పదార్థాలపై నిఘా
పోలీస్ కమిషనర్ అనురాధ చిన్నకోడూరు(సిద్దిపేట): గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మాచాపూర్లోని బయో మెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో 21.017 కిలో గ్రామ్స్ గంజాయిని కాల్చి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక డాగ్స్తో బ్లాక్ స్పాట్స్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మత్తు రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీపీ అనురాధ పోలీసు అధికారులకు సూచించారు. పరేడ్ గ్రౌండ్లో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. -
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 27 వరకు ఆన్లైన్లో స్వీకరణ వర్గల్(గజ్వేల్): స్థానిక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి గడువు పొడిగించారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 27 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ఆదేశాలు జారీచేసింది. బుధవారంతో గడువుతేదీ ముగియాల్సి ఉండగా, పాలనాపరమైన కారణాలు, విద్యార్థుల సౌలభ్యం కోసం నవోదయ విద్యాలయ సమితి గడువు పొడిగించిందని ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక సిద్దిపేటజోన్: స్కూల్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం అండర్ 15 బాలబాలికల వాలీబాల్ జట్ల సభ్యులను ఎంపిక చేశారు. స్థానిక గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సెలెక్షన్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 150మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ఎనిమిది మందిని బాలికల జట్టుకు, అదేవిధంగా మరో ఎనిమిది మందిని బాలుర జట్లకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 18,19 తేదీల్లో ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియ ఎస్జీఎఫ్ కార్యదర్శి సౌందర్య పర్యవేక్షించారు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా వెంకట్మావో చేర్యాల(సిద్దిపేట): రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ముస్త్యాల గ్రామానికి చెందిన కొంగరి వెంకట్మావో ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో చల్లారపు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వెంకట్మావోను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్మావో మాట్లాడుతూ జిల్లాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దుండగులను శిక్షించాలి గజ్వేల్: పట్టణంలో భగత్సింగ్ విగ్రహ గద్దెను కూల్చేసిన దుండగులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విగ్రహ గద్దెను కూల్చేసిన ప్రదేశాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాంచంద్రం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ తదితరులు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్సింగ్ విగ్రహా ఏర్పాటుపై కుట్రలు సహించేదిలేదన్నారు. అనంతరం వారు ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్, టీపీటీఎఫ్ జోన్ కన్వీనర్ శ్రీనివాస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిట్టాపూర్లో విషజ్వరాలు.. దుబ్బాకరూరల్: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులు భూంపల్లి ప్రాథమిక ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో వారికి జ్వరం తగ్గక పోవడంతో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది గ్రామంలో జ్వర సర్వే నిర్వహించి, శానిటేషన్ చేశారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పేరుకు పోవడంతోనే విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగు కాలువలను శుభ్రం చేయడంలేదని అన్నారు. -
యూరియా.. నో స్టాక్
జిల్లాలో కొరత తీవ్రరూపం● పలుచోట్ల బారులు తీరిన రైతులు ● పొంతనలేని కేటాయింపులే కారణం గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 4.47లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి 2.86లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. ఇంకా నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వరి సాగు 3లక్షలపైచిలుకు ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇకపోతే పత్తి 1.06లక్షల ఎకరాలు, మొక్కజొన్న 28502 ఎకరాలు, కంది మరో 6449ఎకరాల్లో సాగులోకి రాగా మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వచ్చాయి. వర్షపాతం సక్రమంగా లేక నానా ఇబ్బందులు పడుతూ రైతులు సాగు చేసుకుంటున్న క్రమంలో యూరియా కొరత శాపంగా పరిణమించింది. అరకొర కేటాయింపులే.. పొంతన కేటాయింపుల వల్లే యూరియా కొరత తీవ్రమవుతోంది. నిజానికి వానాకాలం సీజన్ ఆరంభం ఆగస్టు నెలాఖరు వరకు 31,939 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు సగం కేటాయింపులు మాత్రమే వచ్చాయి. దీంతో జిల్లాలో ఎక్కడా కూడా సరిపడా స్టాకు లేక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం చాలా చోట్ల వరినాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ముందుగా వేసిన వరి క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వరికి తప్పనిసరిగా యూరియా వేయాలి. యూరియా వాడకం పెరిగిన సమయంలో కొరత తలెత్తడం శాపంగా మారింది. ఈ క్రమంలోనే నో–స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. తాజాగా బుధవారం గజ్వేల్లోని సహకార కేంద్రం వద్ద అధికారులు నో–స్టాక్ బోర్డు వేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. జిల్లా రైతాంగానికి కంటికి కునుకులేకుండా చేస్తోంది. ఎక్కడ చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించినా చివరకు స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. తాజాగా బుధవారం ప్రధాన మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. నిల్వలు తక్కువే.. వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా దేశానికి రావాల్సిన యూరియా, ఇతర ఎరువులకు బ్రేక్ పడిందని చెబుతున్నారు. ఇకపోతే ప్రభుత్వానికి చెందిన ఆర్ఎఫ్సీఎల్(రామగుండం ఫర్జిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్), సీఐఎల్, ఎన్ఎఫ్ఎల్ ఇతర కంపెనీల నుంచి యూరియా నిల్వలు తక్కువగా వస్తున్నాయి. దీనివల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం కష్టసాధ్యంగానే మారింది. రాబోవు రోజుల్లో కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.ఇబ్బందులు తీరుస్తాం యూరియా నిల్వలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే రైతుల ఇబ్బందులు తీరుస్తాం. సాధారణ యూరియా స్థానంలో నానో యూరియా వాడకంపై దృష్టి సారించాలి. ఆ దిశగా రైతులు ఆలోచించాలి. – స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి -
ఇళ్ల గ్రౌండింగ్ వేగిరం చేయండి
● పనులు ముమ్మరంగా సాగాలి ● కలెక్టర్ హైమావతి ● ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం వ్యాధుల వేళ అప్రమత్తత అవసరండాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశాం సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై ఏంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్ మెంట్ లెవెల్ వరకు రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలని సూచించారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యాక ఇంజనీర్ అధికారులు సందర్శించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సుముఖంగా లేని వారితో లేటర్ తీసుకుని మరొక లబ్ధిదారునికి అందజేయాలన్నారు. రోజు గ్రామాలకు వెళ్లి పంచాయతీ కార్యదర్శి ల పనితీరును పర్యవేక్షించాలన్నారు. మండలాల్లో ఇసుక కొరత లేకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ లో సైతం ఇందిరమ్మ ఇళ్లు వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. జిల్లా కేంద్రంలోని నాసర్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరానగర్ బస్తీ దవాఖానను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్లోని సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాలపై ఆరా తీశారు. సెంటర్కు వచ్చిన రోగులతో మాట్లాడారు. అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. రోజూ పది నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నంగునూరు(సిద్దిపేట): డాక్టర్ల డిప్యుటేషన్లు రద్దు చేశామని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, అవుట్ పేషంట్ రికార్డులను పరిశీలించారు. ఓపీ రిజిష్టర్ను వైద్యులు మాత్రమే రాయాలని, స్టాఫ్నర్సు రాస్తూ మందులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల వేళ ముందస్తు చర్యలు రాబోవు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మైనర్, మేజర్ రిజర్వాయర్లలో నీటీ నిల్వలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని మోయతుమ్మెద, హల్దీ వాగులు పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. పిడుగుపాటుకు గురై పశువులు మృతిచెందితే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. -
బోనస్ ఏమాయో?
ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు గడిచినా ఇంత వరకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదు. వానాకాలం సీజన్లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం పంటల సాగు పెట్టుబడి పెరిగింది. దీనికి తోడు ఎరువుల ధరలు పెరగడంతో తిప్పలు తప్పడంలేదు. బోనస్ త్వరగా చెల్లించి సహకరించాలని రైతులు కోరుతున్నారు.సాక్షి, సిద్దిపేట: యాసంగిలో 92,954 మంది రైతుల నుంచి 3,81,402 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు రూ. 884.53కోట్లను చెల్లించారు. వాటిలో 13,682.320 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉన్నాయి. యాసంగి నుంచి ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాల్కు రూ.500లు బోనస్ అందజేస్తోంది. 3,162 మంది రైతులకు రూ.6,84,11,600 బోనస్ చెల్లించాలి. సన్నరకం వైపు మొగ్గు చూపిన రైతులకు సకాలంలో బోనస్ డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.రైతులకు భారంఇప్పటికీ బోనస్ డబ్బులు రాకపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్ ఇస్తారా? ఇవ్వరా? అన్న సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మాట విని బోనస్కు ఆశపడి సన్నాలు సాగుచేస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, బోనస్ పైసలు ఆలస్యం కావడంతో వడ్డీల భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజుల్లోనే ధాన్యం పైసలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూడు నెలలైనా బోనస్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.ఆలస్యంతో వెనుకడుగు!ప్రభుత్వం బోనస్ వెంటనే చెల్లించకపోవడంతో రైతులు సన్నాల సాగుకు వెనుకంజ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో తప్పనిసరిగా సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కానీ బోనస్ చెల్లించడం ఆలస్యం అవుతుండటంతో ఈ సారి వానాకాలంలో పలువురు సన్నాల సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.బోనస్ జాడలేదుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు రాచబోయిన అంజగౌడ్, ఇతనిది వర్గల్ మండలం మైలారం గ్రామం. 1.5 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. 34 బస్తాల వడ్లు దిగుబడి వచ్చింది. జూనన్ 2న మైలారం కొనుగోలు కేంద్రంలో తూకం వేయగా 13.6 క్వింటాళ్లు ఉన్నట్లు తక్ పట్టి ఇచ్చారు. క్వింటాల్కు రూ.500 బోనస్ లెక్కన రూ.7వేలు రావాలి. రెండు నెలలు దాటినా రాలేదు. డబ్బులు వస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయని, వెంటనే చెల్లించాలని అంజగౌడ్ కోరుతున్నారు.ఎవరిని అడిగినా..యాసంగిలో 90 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో విక్రయించాను. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారని తెలిసి సన్నాలు సాగు చేశా. ఇప్పటికీ బోనస్ డబ్బులు రాలేదు. ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడంలేదు. బోనస్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. –నరేందర్, రాంనగర్, జగదేవ్ పూర్వివరాలు పంపించాందొడ్డు ధాన్యానికి సంబంధించిన డబ్బులు అన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. సన్న ధాన్యం ఎంత వచ్చాయో ఆ వివరాలు సైతం పంపించాం. రైతులకు బోనస్ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి.– ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
యూరియా పక్కదారి పట్టొద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణికొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని జిల్లావ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు మర్రిముచ్చాల, గౌరయపల్లి, అయినాపూర్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ఎరువులు విక్రయిస్తూ ఏరోజుకు ఆరోజు స్టాక్ రాయాలని సూచించారు. అందుకు భిన్నంగా వ్యవహరించినా, నకిలీ మందులు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ తదితరులు పాల్గొన్నారు. తొగుటలో బారులు తొగుట(దుబ్బాక): మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులుతీరారు. స్థానిక ఫర్టిలైజర్ దుకాణానికి మంగళవారం యూరియా లారీ వచ్చింది. సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. అధికారుల సమక్షంలో రైతుకు రెండు బ్యాగుల చొప్పున అందజేశారు. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా వేసుకుంటారు. మొక్కజొన్న కంకులు వేసే దశకు, పత్తి పూత దశకు వచ్చాయి. ఈ క్రమంలోనూ యూరియాతో పాటు పోటాష్ కలిపి వేస్తారు. అదనుతప్పితే పంటలకు ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదని రైతులు అభిప్రాయం వ్యక్తంచేశారు. -
మల్లన్నా.. మహాసత్రం కలేనా?
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో వంద గదుల (మహా సత్రం) నిర్మాణానికి అడుగులు ముందుకు పడటంలేదు. భారీగా విరాళాలు రాకపోవడంతో పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఆలయంలో ఇప్పటి వరకు 120 వరకు దాతల సహకారంతో నిర్మించిన వసతి గదులు ఉన్నాయి. బండ గుట్టపై ప్రభుత్వం, ఆలయ నిధులతో 50 గదుల నిర్మాణం చేపడుతున్నారు. స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరో 100 గదులు దాతల సహకారంతో నిర్మించేందుకు ఆలయ అధికారులు రెండేళ్ల క్రితం ప్రణాళికలు రూపొందించారు. వీటి నిర్మాణం కోసం రూ.17 కోట్లు అవసరమని అంచనా వేశారు. వంద గదులలో 20 గదులు ఆలయం తరుపున నిర్మించనుండగా.. మిగతా 80 గదులు దాతల సహకారంతో నిర్మాణం చేపట్టాలని ఆనాటి ఆలయ ఈఓ బాలాజీ ప్రణాళిక రూపొందించి దేవాదాయ శాఖ అనుమతికి పంపించారు. దీంతో ఆలయ అధికారులు దాతలనుంచి విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. భక్తుల్లో అసహనం ఇంత వరకు ఆరుగురు దాతలు విరాళం అందించారు. ఒక్కొక్కరు రూ.15 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఆలయ అధికారులు మాత్రం గదులు నిర్మాణ పనులు ప్రారంభం రోజు సుమారు మరో 40 భక్తులు విరాళాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు కేవలం ప్లాను మాత్రమే పంపించారు. ఇప్పటి వరకు దానికి కావాల్సిన ఎస్టిమేషన్ను ఆలయంలో ఏఈ లేక పోవడంతో పంపించ లేక పోయారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో భక్తుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సుమారు 74 మంది దాతలు ముందుకు వస్తేనే పనులు ప్రారంభం అయ్యేలా లేవు. ఆలయ ఈఓ అన్నపూర్ణ ఈనెలలో పదవీ విరమణ చేయనుండటంతో పనుల ప్రారంభంపై సందేహం వ్యక్తం అవుతోంది. ఆలయ అధికారులు స్పందించి వసతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించి భక్తుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. వంద గదుల నిర్మాణం జరిగేనా? ముందుకు రాని దాతలు ఇప్పటి వరకు ఆరుగురే విరాళాలు అందజేత అనుమతులు రాగానే ప్రారంభిస్తాం దాతల సహకారంతో 100 గదుల సత్రాన్ని నిర్మిస్తాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. సుమారు 40 మంది దాతలు విరాళాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు అందిన విరాళాలు ప్రత్యేక అకౌంట్లో భద్రంగా ఉన్నాయి. –అన్నపూర్ణ, ఆలయ ఈఓ -
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
పోలీస్ కమిషనర్ అనురాధ చిన్నకోడూరు(సిద్దిపేట): క్రమశిక్షణకు మారు పేరు పోలీస్ శాఖ అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సీపీ అనురాధ సూచించారు. మంగళవారం చిన్నకోడూరు పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డు, రైటర్ రూమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నమోదవుతున్న కేసుల విషయంలో పరిశోధన పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేయాలన్నారు. ఆమె వెంట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సైఫ్ అలీ, సిబ్బంది ఉన్నారు. నేడు జిల్లా స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా స్థాయి వాలీబాల్ అండర్–15 బాలురు, బాలికల విభాగంలో జట్ల ఎంపిక బుధవారం సిద్దిపేటలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి సౌందర్య తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతందని, 1, జనవరి 2010 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారు ఒరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. సామాజిక సేవలతోనే గుర్తింపుడీఈఓ శ్రీనివాస్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): సామాజిక సేవలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం అక్బర్పేట –భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సిద్దిపేట వారి సహకారంతో స్పోర్ట్స్ యూనిఫామ్స్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ను అందించడం అభినందనీయమన్నారు. అనంతనం మధ్యాహ్న భోజనం, స్కూల్ రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, సందీప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రతినిధి మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలుడీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక ప్రణాళికతో ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహించాలని సూచించారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయ పాలన పాటించాలని సూచించారు. ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణుల నమోదు, ఏఎన్సీ ప్రొఫైల్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
హుస్నాబాద్రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని క్వాలిటీ కంట్రోలర్ ఈఈ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కూచనపెల్లి– మాలపల్లి బీటీ రోడ్డు, మహ్మదాపూర్లో సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కువ కాలం ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. రోడ్డు పనులు చేసే సమయంలో ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ చేయాలన్నారు. వీరి వెంట పీఆర్ డీఈ మహేశ్వర్ తదితరులు ఉన్నారు. -
చెత్త బండ్లకు తుప్పు
● లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు ● నిర్వహణ లేక మూడేళ్లకే మూలకు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులుచేర్యాల(సిద్దిపేట): లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన చెత్త బండ్లు.. నిర్వహణ లేక మూడేళ్లకే మూలన పడ్డాయి. బాగుచేయించేందుకు షెడ్కు పంపిన అధికారులు యేళ్లు గడుస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పుపట్టిన స్థితిలో జిల్లా కేంద్రంలోని మారుతి షోరూంలో ఉంది చేర్యాలలో చెత్త సేకరించాల్సిన వాహనం. రూ. 92 లక్షలు వెచ్చించి.. 2018లో చేర్యాల పట్టణం మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. కొద్ది రోజుల పాటు ప్రత్యేక అధికారి పాలన అనంతరం 2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. కొత్త పాలకవర్గం కొలువైన కొద్ది రోజులకు పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెత్త సేకరణ కోసం నాలుగు ఆటోలు కొనుగోలు చేశారు. అనంతరం 2021లో మరో రెండు ఆటోలు, 2022లో ఆరు ఆటోలు మొత్తం 12 ఆటోలు రూ.92లక్షల ఖర్చు చేసి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో నిర్వహణ సరిగా లేక రెండు ఆటోలు రిపేర్కు వచ్చాయి. వాటిని సుమారు మూడేళ్ల క్రితం జిల్లాకేంద్రంలోని రిపేర్ కేంద్రాలకు పంపించారు. అయితే అధికారులు వాటి సంగతే మర్చి పోయారు. మారుతీ సుజికీ కంపెనీకి చెందిన ఆటో మారుతీ షోరూంలో ఉండగా మరో ఆటో ప్రైవేటు మెకానిక్ వద్ద ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే చెత్త సేకరణ బండ్ల నిర్వహణ కోసం కాంట్రాక్టర్ను నియమించారు. కానీ కాంట్రాక్టర్ చేత నిర్వహణ చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనడానికి షెడ్డులో ఉన్న చెత్త బండ్లే నిదర్శనం. చెత్త బండ్ల నిర్వహణే ఇలా ఉంటే.. చేర్యాలలో చెత్త సేకరణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి (అదనపు కలెక్టర్) స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ముగ్గురు కమిషనర్లు మారినా.. ఈ మూడేళ్లలో ముగ్గురు కమిషనర్లు మారినా మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఎన్ని పనిచేస్తున్నాయి? పని చేయని ఆటోలపై ఆరా తీసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ వచ్చి యేడాది దాటింది. ఇప్పటికీ ఆ రెండు ఆటోలు ఏమయ్యాయన్న విచారణ చేసిందీ లేదు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● సీఎం సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష పరిశుభ్రతతోనే నులి పురుగులు దూరం ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ అమలు చేయండి నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు త్వరగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలం నర్మేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సోమవారం కలెక్టర్ సందర్శించి నిర్మాణం పనులపై ఆరా తీశారు. వీఐపీలు వస్తున్నందున ప్రారంభోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బీటీ రోడ్డు పనులు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. పార్కింగ్, సభా స్థలం, తాత్కాలిక హెలీప్యాడ్ సిద్ధం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, ఆయిల్ఫెడ్ మేనేజర్ సుధాకర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, పీఆర్ ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండపాక(గజ్వేల్): పరిశుభ్రతతోనే నులి పురుగులను దూరం చేయవచ్చని కలెక్టర్ హైమావతి అన్నారు. కొండపాకలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడటానికి ఆల్బెండజోల్ మాత్రలు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ శాతంగా ఇలాంటి నులిపురుగులు ఉత్పత్తి అవుతాయన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా ఉపాధ్యాయులు చొరవచూపాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధన్రాజ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 91శాతం పంపిణీ పూర్తి సిద్దిపేటకమాన్: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సోమవారం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 91.2శాతం పూర్తయినట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. జిల్లాలో 2.,29,361 మంది చిన్నారులు ఉండగా 2,09,370మందికి మాత్రలు వేయించినట్లు ఆయన తెలిపారు. పిల్లలందరికీ వేయించాలని ఆయన సిబ్బందికి సూచించారు. సిద్దిపేటరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ ద్వారా హాజరు అమలు చేయాలని కలెక్టర్ హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజావాణి అర్జీలపై పురోగతి, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టి నిర్ణీత సమయం ప్రకారం వైద్యులు , వైద్య సిబ్బంది విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. 22 లక్షల మొక్కలు నాటాలి వన మహోత్సవంలో జిల్లాకు నిర్దేశించిన 22 లక్షల మొక్కలను నాటేందుకు శాఖల వారిగా కేటాయించిన లక్ష్యాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్స్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. -
ఆర్టీసీకి కాసుల గలగల
అదిరిన గి‘రాఖీ’ ● రెండు రోజుల్లో రూ.1.98 కోట్ల ఆదాయం ● అధిక సంఖ్యలో ప్రయాణించిన ప్రయాణికులు ● గతేడాదితో పోలిస్తే పెరిగిన రాబడి ● సద్వినియోగం చేసుకున్న ‘మహాలక్ష్మి’లు సిద్దిపేటకమాన్: రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగ, ఆదివారం వరుస సెలవులు రావడంతో ఆర్టీసీబస్సులు కిటకిటలాడాయి. దీంతో రెండు రోజుల్లో ఆర్టీసీకి రూ.కోటి 98లక్షల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఇది అధికం. నాలుగు డిపోల పరిధిలో రాఖీ పండగ వేళ ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. సిద్దిపేట డిపోలో 53 ఆర్టీసీ, 53అద్దె బస్సులు కలిపి మొత్తం 106 బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా 40 ట్రిప్పులు అదనంగా నడపడంతో 1,22,400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో సిద్దిపేట డిపోకు రెండు రోజుల్లో రూ.81లక్షల ఆదాయం సమకూరింది. వీరిలో 70శాతం మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుబ్బాక డిపోలోని బస్సులు 21వేల కిలోమీటర్లు తిరగడంతో 25వేల మంది ప్రయాణించారు. దీంతో రూ.33లక్షల ఆదాయం సమకూరింది. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలోని బస్సులు 32వేల కిలోమీటర్లు తిరగాయి. 52వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీంతో రూ.61లక్షల ఆదాయం లభించింది. అదేవిదంగా హుస్నాబాద్ డిపోకు సుమారు రూ.23లక్షల ఆదాయం లభించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది నాలుగు డిపోల పరిధిలో రూ.కోటి ఆదాయం లభిస్తే ఈ ఏడాది రూ.1.98లక్షల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదనపు చార్జీల వసూలు రాఖీ పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేసింది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ జేబీఎస్కు మాములు రోజుల్లో రూ. 140 చార్జీ చేస్తే పండుగ రోజు రూ.210 వసూలు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, నిబంధనల మేరకు చార్జీ వసూలు చేశామని అధికారులు తెలిపారు.అదనపు ట్రిప్పులు నడిపాం రాఖీ పండగ, వరుస సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ ద్వారా ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో జేబీఎస్, కరీంనగర్, వేములవాడ, ఇతర రూట్లలో అదనపు ట్రిప్పులు నడిపాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనపు ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికులు అధికంగా ప్రయాణించారు. – రఘు ఆర్టీసీ డిపో మేనేజర్ సిద్దిపేట -
‘ఆధార్’ లేక అవస్థలు
● సెంటర్ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు ● ఇతర ప్రాంతాలకు పరుగులు ● పట్టించుకోని అధికారులుఅక్కన్నపేట(హుస్నాబాద్): మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ అంశం ఆధార్తో ముడిపడి ఉంది. సంక్షేమ పథకాలు, పంట విక్రయాలు, పాఠశాలల అడ్మిషన్లు వంటి వాటికీ ఆధార్కార్డు తప్పనిసరి. ఆధార్లో చిరునామా మార్పులకు, చిన్నారులకు కొత్తగా ఆధార్ తీసుకునేందుకు, వేలిముద్రలు అప్డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు తీయాల్సిందే. అక్కన్నపేట మండల కేంద్రంగా ఏర్పాటై దాదాపుగా తొమ్మిదేళ్లు కావస్తున్నా ఆధార్ సెంటర్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మండల వ్యాప్తంగా మొత్తం 38గ్రామాలుగా ఉండగా సుమారుగా 65కుపైగా గిరిజనతండాలతో పాటు మారుమూల పల్లెలు ఉన్నాయి. దాదాపుగా 35వేలకుపైగా జనాభా ఉంటుంది. సెంటర్ మంజూరుకు డిమాండ్ ప్రభుత్వం ప్రవేశపట్టే ఏ పథకం అమలు చేయాలన్నా లబ్ధిదారుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడో పదేళ్ల కిందట తీయించుకున్న ఆధార్ కార్డును అధికారులకు సమర్పిస్తుంటే ఆన్లైన్లో అప్డేట్ కాలేదంటూ పంపించివేస్తున్నారు. అలాగే చిన్నారులకు ఆధార్ తీయించాలన్నా, తప్పుల సవరణ కోసం వెళ్లాలంటే దాదాపుగా 15నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా కావడంతో పాటు ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి తక్షణమే ఆధార్ సెంటర్ మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఏర్పాటు చేయాలిమండల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. అన్ని పనులకు ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి. – మహేందర్రెడ్డి, బీజేపీ నేత, అక్కన్నపేట -
కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల గుండెల్లో నిలిచేది గులాబీ జెండా అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నారన్నా రు. అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నిదానాల్లో అన్నదానం గొప్పది సిద్దిపేటజోన్: అమర్నాథ్, కేదారినాథ్ యాత్రలు చాలా పవిత్రమైనవని, అలాంటి ప్రాంతాల్లో యాత్రికులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. 35 రోజుల పాటు అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన సేవా సమి తి సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట పేరును దశదిశలా వ్యాప్తి చేసిందని అన్నారు. అన్నదాన సేవా సమితి సొంత డబ్బుల తో దక్షిణాది యాత్రికులకు సాయంగా నిలవడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధితో ఏ పని చేసి నా విజయం చేకూరుతుందన్నారు. 2010లో సిద్దిపే ట నుంచి 45 కుటుంబాలు అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ అనుభవించిన ఇబ్బందులను చూసి సేవా సమితి ఏర్పాటు అయిందన్నారు. యాత్రలో ప్రజలకు సరైన భోజనం లేక ఇబ్బందు లు పడే పరిస్థితి ఒక సేవా ప్రక్రియకు నాంది అయిందన్నారు. 21 మందితో మొదలైన సమితి నేడు 190 మందికి చేరడం సంతోషంగా ఉందన్నారు.ఎమ్మెల్యే హరీశ్రావు -
నులిమేద్దాం
● నులిపురుగులతో పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం ● రక్తహీనత, పోషకాహారలోపాలు జగదేవ్పూర్(గజ్వేల్): నులి పురుగుల సంక్రమణ ప్రధానంగా అపరిశుభ్రతతోనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆరుబయట అపరిశుభ్ర వాతావరణంలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా అన్నం తినడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల పిల్లల కడుపులో నులి పురుగులు తయారయ్యే అవకాశం ఉంది. ఈ పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందుతాయి. నులిపురుగుల బారిన పిల్లలు పడకుండా ఆరోగ్యశాఖ నివారణ చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో, కళాశాలల్లో నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చేందుకు జిల్లా వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఏడాదిలో రెండు సార్లు పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలను వేస్తారు. సాధారణంగా అయితే ఫిబ్రవరి 10న జాతీయ నులి పురుగుల దినోత్సవం. కానీ వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కనుక ఆగస్టు 11న సైతం మరోసారి పిల్లలను నులి పురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వరకు 2,29,720 మంది బాలబాలికలు ఉన్నారు. నులి పురుగులతో ఆరోగ్య సమస్యలు పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నులి పురుగులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. వీటి ద్వారా రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. నులి పురుగుల నివారణ మాత్రతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటికి దూరంగా ఉంటే మంచిది పిల్లలు నులి పురుగుల బారిన పడకుండా ఉండాలంటే చాక్లెట్లు, ఇతర తీపి పదార్థాలు ఎక్కువగా తీనిపించకూడదని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్, జిగురు పదార్థాలు తినిపిస్తే నులిపురుగులు ఏర్పడేందుకు అవకాశం ఉందని, నిర్లక్ష్యం చేస్తే కడుపులో తయారైన పురుగులు మెదడుకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ సిద్దిపేటకమాన్: నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లు, సిబ్బందితో డీఎంహెచ్ఓ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక కేజీబీవీ పాఠశాలలో కలెక్టర్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య, వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక ఏడాది నుంచి 19ఏళ్లలోపు వారికి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం ప్లిలలకు వయసు ఆధారంగా మాత్రలు వేయించాలన్నారు. సోమవారం మాత్రలు వేసుకోని పిల్లలకు ఈ నెల 18న ఆరోగ్య సిబ్బందిచే మాత్రలు పంపిణీ చేయడం చేస్తామన్నారు. -
మంత్రులకు క్షమాపణ చెప్పాల్సిందే
కాంగ్రెస్ నాయకుల డిమాండ్ దుబ్బాక: దళిత మంత్రులంటే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి చిన్నచూపు తగదని.. వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి దిష్టిబొమ్మతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంగర రవి మాట్లాడుతూ మంత్రులు దామోదర, వివేక్లపై ఎమ్మెల్యే అనుచిత వాఖ్యలు చేయడం దారుణమన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మాటతప్పిన కేసీఆర్ బాటలోనే ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి నడుస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకపోతే ఎక్కడా తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పద్మయ్య, కూడవెల్లి ఆలయం చైర్మన్ రాజిరెడ్డి, శంకర్, యేసురెడ్డి, భరత్ తదితరులు ఉన్నారు. -
గిట్టుబాటు ఏదీ?
క్రమంగా తగ్గుతున్న ఆయిల్పామ్ ధర ● గతంలో టన్నుకు రూ.21వేలకుపైనే ● నేడు రూ.17,500కు పడిపోయిన దైన్యం ● దిగాలు చెందుతున్న రైతులు ● జిల్లాలో 13వేల ఎకరాలకుపైగా సాగు ఆయిల్పామ్ ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో టన్నుకు రూ. 21వేలకుపైగా పలికిన ధర నేడు రూ.17,500కు పడిపోయింది. 13వేల ఎకరాలకుపైగా ఆయిల్పామ్ సాగుతో జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇప్పుడిప్పుడే జిల్లాలో ఉత్పత్తులు రావడం ఊపందుకోగా.. గిట్టుబాటు లభించక రైతులు దిగాలు చెందుతున్నారు. గజ్వేల్: జిల్లాలో ఆయిల్పామ్ సాగు క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021– 22లో ఈ ప్రయత్నం మొదలవ్వగా.. ప్రస్తుతం 13వేల ఎకరాల పైచిలుకు చేరుకుంది. ఆయిల్పామ్పై రైతులను ప్రోత్సహిస్తూ వివిధ రకాల సబ్సిడీలను అందిస్తూ సాగును పెంచుతున్నారు. గతంలో ఆయిల్పామ్ టన్నుకు రూ.21వేలకుపైగా పలికితే నేడు రూ.17,500కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఆయిల్పామ్ సాగుతో పెద్దగా మేలు చేకూరిందేమీలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తులను నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నుంచి అశ్వరావుపేటకు తరలిస్తున్నారు. గజ్వేల్ ప్రాంతం నుంచి ఉత్పత్తులను తరలించాలంటే రెండు టన్నులకు కూలీల ఖర్చు, ట్రాక్టర్ రవాణా ఖర్చులు కలుపుకొని రూ.9వేలపైచిలుకు వ్యయం అవుతోంది. రెండు టన్నులకు రైతులకు టన్నుకు రూ.17500చొప్పున లెక్కిస్తే రూ.35వేల వరకు వస్తున్నాయి. ఇందులో ఖర్చులుపోనూ రూ.26వేలు మిగలడం గగనమవుతోంది. ఒకవేళ నాణ్యతలేని గెలలు ఉంటే రైతుకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది.అంతేకాకుండా.. నాలుగేళ్లుగా రైతు శ్రమ, పెట్టుబడితో పోలిస్తే వస్తున్న ఆదాయానికి పెద్దగా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఎందుకీ ఈ పరిస్థితి? ధరలు తగ్గడానికి పలు అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా దిగుమతులపై మన దేశం సుంకం తగ్గించడంతో ధరలు క్రమంగా పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ పరిస్థితి నుంచి రైతులను గట్టించడానికి రవాణా ఖర్చులివ్వాలి. అలాగే అడవి పందుల బెడద ఉన్నందు వల్ల సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి. త్వరలోనే క్రషింగ్ ప్రారంభం ఆయిల్పామ్ పండించిన రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను సులభతరం చేయడానికి నర్మెటలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించిన సంగతి తెల్సిందే. త్వరలోనే ఇక్కడ క్రషింగ్ ప్రారంభించడానికి సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.22 వేలకుపైగా పలికితేనే మేలు నాలుగు ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశాను. ఇప్పటివరకు నాలుగు కోతలు వచ్చాయి. ధర సక్రమంగా లేకపోవడం నిరాశ పరుస్తోంది. టన్ను ధర రూ.22వేల పైచిలుకు పలికితే మేలు జరుగుతుంది. – రైతు మద్ది రాజిరెడ్డి, ఆహ్మదీపూర్ -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం కావాలి: కలెక్టర్
గజ్వేల్: రోగులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని అహ్మదీపూర్ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్, ఓపీ, ఫార్మా రిజిష్టర్లను పరిశీలించారు. రోగులకు సేవలందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సైతం తనిఖీ చేశారు. భోజన ప్రక్రియను పరిశీలించి విద్యార్థులకు తప్పనిసరిగా కామన్ డైట్ను అందించాలన్నారు. గురుకులంలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
డెంగీ.. డేంజర్ బెల్స్
జిల్లాలో 18 కేసులు నమోదు ●● విజృంభిస్తున్న విషజ్వరాలు ● గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం ● దోమల నివారణకు చర్యలు శూన్యం జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వర్షాలు జోరుగా కురుస్తుండటంతో దోమల వ్యాప్తి సైతం తీవ్రంగాపెరిగింది. దీంతో సీజనల్ వ్యాధులు తాండవం చేస్తున్నాయి. దుబ్బాకటౌన్: జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తుండగా మరోవైపు డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చేర్యాల మండలం కడవేర్గు, దౌల్తాబాద్ మండలం లింగరాజ్పల్లి సంక్షేమ హాస్టల్లో, జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్, మర్కూర్, దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్లో, దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గజ్వేల్లో పిడిచెడ్, తదితర మండలాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా 18 కేసులు నమోదైనా అనధికారికంగా కేసులు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. నిధుల కొరత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పంచాయతీల్లో నిధులు లేక కార్యదర్శులు సైతం దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. జిల్లాలో అక్కడక్కడా తమ సొంత ఖర్చులతో అరకొర నివారణ చర్యలు చేపడుతున్నారు. దోమల నివారణ, పారిశుద్ధ్య పనులకు జిల్లాలో ఉన్న 508 గ్రామ పంచాయతీలకు, 5 మున్సిపాలిటీలకు నిధులు కేటాయించేందుకు పాలకులు చర్యలు చేపట్టాలన్న డిమాండ్ పెరుడుతోంది. లోపించిన పారిశుద్ధ్యం గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురికి కాలువలు శుభ్రం చేయడంలో, పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దోమలు, ఈగలు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులకు దారి తీస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. విజృంభిస్తున్న దోమలు పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పెంట కుప్పలపై, గడ్డి పొదల్లో, మురికి కాలువల్లో దోమల వ్యాప్తి పెరుగుతోంది. కొన్ని చోట్ల ఫాగింగ్ మిషన్లు సైతం పనిచేయడంలేదు. దీంతో వాటిని మూలాన పడేశారు. వాటికి మరమ్మతులు చేయించేందుకు నిధుల కొరత అడ్డంకిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. జ్వరం వస్తే ఆలస్యం చేయొద్దు దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. నిల్వ నీటిని ఉంచకండి. నిల్వ నీటిలో లార్వా ద్వారా ఏడిస్(టైగర్) దోమ వాప్తి చెందుతుంది. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ అస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాలి. ఆస్పత్రుల్లో డెంగీ, ఇతర విష జ్వరాలకు మందులు అందుబాటులో ఉన్నాయి. – ధనరాజ్, డీఎంహెచ్ఓ అప్రమత్తతే శ్రీరామ రక్ష జిల్లాలో ఉన్న 508 గ్రామ పంచాయతీల్లో వారానికి రెండు సార్లు గ్రామ కార్యదర్శులు, ఎన్ఎన్ఎం, ఆశ కార్యకర్తలతో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిల్వ నీటిని తొలగించేలా, డెంగ్యూ వ్యాప్తి, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అప్రమత్తతతోనే వ్యాధిని దూరం చేయవచ్చు. –దేవకీదేవి, జిల్లా పంచాయతీ అధికారి -
జోరందుకునే అడ్‘మిషన్లు’!
● హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ షురూ ● వసతుల కల్పనకు నడుం బిగించిన అధికారులు ● 14న కళాశాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి!హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ పరిధి లోని ఇంజనీరింగ్ కళాశాలకు కేటాయించిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి కళాశాలలో ప్రవేశం పొందాక మరో కళాశాలకు వెళ్లకుండా అన్ని వసతు లు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలోనే తొలి శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను హుస్నాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉండటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఉమ్మా పూర్ గుట్టల సమీపంలో 30 ఎకరాలు కేటాయించా రు. కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 44.12 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టణ శివారులోని గాంధీనగర్ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల పైఅంతస్తులో తాత్కాలికంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు. హాస్టల్ వసతి కల్పిస్తే పెరగనున్న ప్రవేశాలు ప్రస్తుతం మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్లలో 91 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 3వ విడత కౌన్సెలింగ్లో హాస్టల్ వసతి కల్పిస్తే అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంటుందని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. ఇటీవల ఇంజనీరింగ్ కళాశాలను కలెక్టర్ హైమావతి సందర్శించి సీట్ల భర్తీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు. హాస్టల్ వసతి కల్పిస్తే అడ్మిషన్లు అధికంగా వస్తాయని కళాశాల ప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టి తీసుకురాగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నుంచి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు వరంలాంటిది ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు మరో కళాశాలకు వెళ్లకుండా హుస్నాబాద్ పట్టణంలో హాస్టల్ వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే హుస్నాబాద్ నుంచి కళాశాల వరకు బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నాం. ఈ ఇంజనీరింగ్ కళాశాల పేద విద్యార్థులకు వరంలాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –ఉమేశ్ కుమార్, ఉపకులపతి, శాతవాహన యూనివర్సిటీ నాలుగు కోర్సులతో 240 సీట్లు కళాశాలలో సీఎస్ఏ, సీఎస్ఈ, ఈసీఈ, ఐఎన్ఎఫ్ నాలుగు కోర్సులు ప్రవేశపెట్టారు. ఒక్కో బ్రాంచ్కు 60 సీట్ల చొప్పున 240 సీట్లు కేటాయించారు. వీటితోపాటుగా ఈడబ్ల్యూఎస్ కింద మరో 24 మందికి అడ్మిషన్లు కల్పించనున్నారు. అలాగే కళాశాలకు 54 మంది బోధన, 33 మంది బోధనేతర రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్లో పెద్దఎత్తున సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో 160 మంది విద్యార్థులు చేరారు. అయితే కళాశాలకు హాస్టల్ సౌకర్యం లేని కారణంగా చాలామంది విద్యార్థులు 2వ విడత కౌన్సెలింగ్లో వేరే కళాశాలను ఎంచుకుంటున్నారు.14న సీఎం రేవంత్రెడ్డి రాక శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను ఈ నెల 14న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐఓసీ ప్రధాన రోడ్డు నుంచి కళాశాల వరకు సీసీ రోడ్ల పనులు వేగవంతం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీటి కోసం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. -
పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం తెలిపారు. సివిల్ బ్రాంచ్లో మిగులు సీట్లకు విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 11న సోమవారం పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2025– పాలీసెట్కు హాజరుకాని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీదుబ్బాకటౌన్: పండుగ పూట ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులపై చార్జీల పిడుగు పడింది. పండుగ స్పెషలంటూ బస్సులు నడుపుతూ అదనపు చార్జి వసూల్ చేయడం ప్రారంభించింది. దీంతో పండుగ పూట ప్రయాణికులపై పెను భారం పడింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూనే అదనపు చార్జీల పేరుతో మగవారి జేబుకు చిల్లుపెట్టింది. దుబ్బాక నుంచి సిద్దిపేటకు మామూలు రోజుల్లో ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.40 టికెట్ ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏకంగా రూ.70 వసూలు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. రూ.70 పెట్టిన కనీసం బస్సుల్లో సీటు దొరకపోవడం గమనార్హం. ఎక్స్ప్రెస్ పేరు పెట్టి గ్రామ గ్రామాన బస్సు ఆపడంతో ప్రయాణికులు విసుగు చెందారు. రైతు బీమా నమోదు చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతుబీమాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. 2025 రైతు బీమా పాలసీ సంవత్సరం 14 ఆగస్టు 2025 నుంచి 13 ఆగస్టు 2026 వరకు అమలులో ఉంటుందని శనివారం మీడియాకు తెలిపారు. రైతు బీమాకు 18 ఏళ్ల కంటే ఎక్కువ, 59 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల రైతులు మాత్రమే అర్హులన్నారు. బీమా నమోదు కోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, రైతు, రైతు జీవిత భాగస్వామి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలతో తమ వ్యవసాయ విస్తరణ అధికారులను స్వయంగా సంప్రదించాలని తెలిపారు. యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలిహుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 65వ భారత యువజన కాంగ్రెస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతాల శివారెడ్డి మాట్లాడుతూ...యువజన కాంగ్రెస్ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీనవేని రాకేశ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు అఖిల్, చైతన్య, అనిల్, మండల అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయండి: సీపీఎం దుబ్బాకటౌన్: రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ శనివారం దుబ్బాక బస్టాండ్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై బీజేపీ ఎంపీలు ఒత్తిడి పెంచాలని కోరారు. లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
రాఖీ..ఓ ఆత్మీయాభరణమై...
కొమురవెల్లి(సిద్దిపేట)/అక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్: అన్నా చెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆప్యాయతను చాటారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామికి హైదరాబాద్కు చెందిన జోగిని శ్యామల బంగారు రాఖీని సమర్పించారు. జవాన్ విగ్రహానికి.. అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు లింగయ్య, సత్తవ్వల కుమారుడైన నరసింహనాయక్ సీఆర్పీఎఫ్ జవాన్గా చేరి 2014లో చత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి చనిపోగా అతడి జ్ఞాపకార్థం నెలకొల్పిన విగ్రహానికి ఆ ఇంటి ఆడపడుచులు ముగ్గురూ రాఖీ కట్టారు. పంచపాండవుల పువ్వుతో రాఖీ... హుస్నాబాద్ పట్టణంలోని అరపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య అలియాస్ కూరగాయల అయిలయ్యకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతీ ఏడాది చెల్లెల్లు, కుమార్తెలు రాఖీలు కడతారు. అయిలయ్యకున్న పూలతోటలో విరబూసిన పంచపాండవుల పువ్వుతో రాఖీగా కట్టి తన సోదరుడిపై ఆప్యాయతను చాటుకున్నారు. దాదాపు 22 సంవత్సరాల నుంచి వీరు ఇవే పంచపాండవుల పువ్వును రాఖీగా కడుతుండటం విశేషం. -
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025● బీఆర్ఎస్–కాంగ్రెస్ మాటల యుద్ధం ● ఉద్రిక్తతల నేపథ్యంలోనే మంత్రి వివేక్ పర్యటన రద్దు దుబ్బాక: కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజుకుంటోంది. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండ్రోజులక్రితం మెదక్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కాంగ్రెస్ మంత్రుల పనితీరుపై తీవ్రస్థాయిలో దనుమాడారు. దీనికి కౌంటర్గా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి అంతేస్థాయిలో ధ్వజమెత్తడంతో దుబ్బాక రాజకీయం ఉప్పు నిప్పుగా మారింది. దీనికి ఆజ్యం పోసేట్లు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటుండటంతో దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన సైతం రద్దయింది. ఇంటెలిజెన్స్ సూచన మేరకే... ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన రద్దు అయింది. వాస్తవానికి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్పేట, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు సైతం అధికారులు సిద్ధం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు శనివారం సాయంత్రం మంత్రి వివేక్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.న్యూస్రీల్గతంలో సైతం... జూన్ 21న దుబ్బాకలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశానికి హాజరైన మంత్రి వివేక్ పర్యటనలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రొటోకాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్–కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసి మధ్యలోనే మంత్రి వివేక్, కలెక్టర్ తదితరులు వెళ్లిపోయారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే మంత్రి తాజా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటే చేశారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ సమాచారంతో మంత్రి పర్యటనను రద్దు చేసుకోవడం విశేషం. ఏదేమైనా దుబ్బాకలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగోడ్(మెదక్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండల కేంద్రంలో శనివారం మంత్రి పర్యటించారు. కార్యకర్తలతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహాన్ని పరిశీలించి, మండలానికి మంజూరైన ఇళ్లు, నిర్మాణ పనులు ఎలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో విద్యుత్ తీగలు వేలాడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు మంజూరవుతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. స మస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూనే.. మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు మంత్రి దామోదరకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, మాజీ జెడ్పీటీసీలు యాదగిరి, రాజేందర్ పాటిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ సర్పంచ్ విజయభాస్కర్, మాజీ ఎంపీటీసీ నరేందర్, కో అప్షన్ మాజీ సభ్యు డు చోటుమియా, వట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్గుప్తా తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: భవిష్యత్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం క్విట్ ఇండియా డే సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ‘నప్రత్ చోడో...భారత్ జోడో’అని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ చెబుతున్నారన్నారు. భావితరాలకు జీవించే హక్కు, స్వేచ్ఛ అన్ని రకాల హక్కులు పొందాలంటే ప్రజాస్వామిక రాజ్యాంగ రక్షణ కొనసాగాలని చెప్పారు. అప్రజాస్వామిక వాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు మంత్రి పొన్నం ప్రభాకర్కు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. -
సోలార్ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్ కె.హైమావతిసిద్దిపేటరూరల్: జిల్లాలో సోలార్ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నవీన్మిట్టల్ పలువురు అధికారులతో కలిసి సోలార్ సిస్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను నిర్ణీత నమూనాలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలిదుబ్బాకరూరల్/మిరుదొడ్డి(దుబ్బాక): మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను, అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీని శనివారం కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. -
హుందాతనం అలవరుచుకో,,
కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డికి బక్కి హితవు దుబ్బాక: ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న శ్రీనివాస్రెడ్డి ముందు హుందాతనాన్ని అలవరుచుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హితవు పలికారు. తాము బాగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే తనకు కితాబునిచ్చారని...కానీ, కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డికి తమ పనితీరు కనిపించకపోవడం దురదృష్టకరమని వెంకటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సామాన్యుడినైన నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటాన్ని శ్రీనివాస్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తనపై పనిగట్టుకుని విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. -
వరాల తల్లీ.. వందనం
ఘనంగా వరలక్ష్మి వ్రతాలు..ఆలయాల్లో భక్తుల సందడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీ దేవి, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, తదితర ఆలయాల్లో అభిషేకాలు, హోమాలు, సామూహిక వ్రతాలు చేపట్టారు. అమ్మవార్ల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఇళ్లల్లోనూ వరలక్ష్మి వ్రతాలను మహిళలు నిర్వహించారు. పూజల అనంతరం వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మద్దూరు(హుస్నాబాద్): వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. లద్నూరు ఆస్పత్రిలో ఫైలేరియాకు సంబంధించిన మందులు లేవని పలువురు రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న ముగ్గురు డాక్టర్లకు కేవలం ఒక్కరే హాజరు కావడంపై కలెక్టర్ ప్రశ్నించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేత్ర వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేయాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాయాలని సందర్శించి భూ భారతి ఫైళ్లను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు పనితీరు మార్చుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ రహీం,ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి కలెక్టర్ హైమావతి -
మోదీ దిష్టి బొమ్మ దహనం
సీపీఎం ఆధ్వర్యంలో నిరసనచేర్యాల(సిద్దిపేట): బీహార్ ఓటర్ల జాబితా నుంచి 65లక్షల ఓట్లను తొలగించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం సీపీఎం మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో నిరసన తెలిపి ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ బీహార్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఆర్ఎస్ఎస్ మతతత్వ సిద్ధాంతాల అమలు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో మరోసారి కుట్రకు తెరలేపిందని, ఈ కుట్ర రానున్న రోజుల్లో దేశం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదానంగా బీహార్లో ఎస్సీ నియోజకవర్గాల్లో అధికంగా ఓట్లుతొలగించారన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో బడుగులకు కలుగుతున్న కొద్దిపాటి ప్రయోజనం కూడా అందకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతాలతో బడుగు, బలహీన వర్గాలు ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడనుందన్నారు. -
లక్ష్యం చేరేనా?
● జిల్లాలో 5.60 లక్షలఎకరాల సాగు అంచనా ● ఇప్పటివరకు 3.75లక్షల ఎకరాల్లోపే.. ● పలుచోట్ల లోటు వర్షపాతం నమోదు గజ్వేల్: జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరి నాట్లు ఆగుతూ.. సాగుతున్నాయి. 5.60లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 3.60లక్షల ఎకరాల్లోపే వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం వరి సాగు పెరిగితేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు బోటాబోటీ వర్షపాతమే ఈ పరిస్థితికి కారణంగా మారింది. జిల్లాలో ఇప్పటివరకు వరి 23,0393 ఎకరాల్లో సాగైంది. అదేవిధంగా పత్తి 10,6170ఎకరాల్లో, మొక్కజొన్న 25,972, కంది 6,028, పెసర్లు 216, స్వీట్కార్న్ 1,352, మినుములు 19ఎకరాల్లో సాగులోకి రాగా ఇతర పంటలు మరో 46ఎకరాల్లో సాగయ్యాయి. అంతంతమాత్రమే వర్షపాతం నమో దు కావడం ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తోంది. మొదట్లో వర్షాలు లేక.. సీజన్ ఆరంభం నుంచి 45రోజులకుపైగా వర్షాలు కురవలేదు. ఆ తర్వాత జూలై రెండు, మూడోవారాల్లో, ఆగస్టు నెలలో వర్షాలు కురిశాయి. పంటలకు కీలకమైన సమయంలో వర్షాల్లేకపోవడంవల్ల పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. మరోవైపు సమృద్ధిగా వర్షాల్లేక వరి సాగు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. భారీ వర్షాలు కురవడంతోపాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల నుంచి సాగునీటిని వదిలితేనే సాగు స్వరూపం మారి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది.ఆరు మండలాల్లో లోటు వర్షపాతమే జిల్లాలోని ఆరు మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదయ్యింది. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలంలో జూన్ 1నుంచి ఇప్పటివరకు 322.7మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 256.6మి.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. ఈ లెక్కన 20.5శాతం మైనస్ వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా మిరుదొడ్డి మండలంలో 336.2 మి.మీ.లకు గాను 295.4 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. దీంతో 12.1శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. రాయపోల్ మండలంలో 289.1మి.మీ.ల సాధారణ వర్షపాతానికి కేవలం 265.5 శాతం వర్షపాతం నెలకొంది. దీని ప్రకారం 8.2శాతం మైనస్ నమోదైంది. కుకునూర్పల్లి మండలంలో 310.8మి.మీ.ల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 287.6మి.మీల వర్షపాతం ఏర్పడింది. ఈ లెక్కన 7.5మైనస్ వర్షపాతం నమోదయ్యింది. చేర్యాల మండలంలో 313.6మి.మీ.లకు గాను.. ఇప్పటివరకు 303.6మి.మీల వర్షపాతం నమోదుకాగా 3.2శాతం వర్షపాతం లోటుగా ఉంది. ములుగు మండలంలో 327.3మి.మీ.లకు గాను.. ఇప్పటివరకు 326.9మి.మీల వర్షపాతం నమోదయ్యింది. దీని ప్రకారం 0.1శాతం మైనస్ నమోదయ్యింది. మిగిలిన 20మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయినట్లు తెలుస్తోంది. -
యాంత్రీకరణకు మోక్షం
వ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం లభించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వ్యవసాయ పరికరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. పంటల సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణ దోహదపడనుంది. 2025–26 సంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు 16,275 యూనిట్లకు రూ.4.96కోట్లు మంజూరు చేశారు. త్వరలో రైతులకు పరికరాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 12లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు అందించే వ్యవసాయ పరికరాలను మహిళా రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం రాయితీపై ఇవ్వనున్నారు. మిగతా వారికి 40శాతంతో అందించనున్నారు. ఐదు ఎకరాలకంటే తక్కువ భూములు ఉన్న రైతులకు సబ్సిడీ పై వివిధ రకాల పరికరాలు అందిస్తారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్తో నడిచే వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రు, కలుపు తీసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రం తదితర వాటిని అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు, అత్యల్పంగా మెదక్ జిల్లాకు నిధులు కేటాయించారు. ఎంపిక బాధ్యత కమిటీలదే.. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, డీఏఓ, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నారు. ఏడేళ్ల తర్వాత.. 2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది నిధులను మంజూరు చేశారు. గతంలో ట్రాక్టర్లు అందించే వారు. ఈ ఏడాది కేవలం యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు. గతంలో మాదిరిగా ట్రాక్టర్లు సైతం అందిస్తే రైతులు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.ఎట్టకేలకు రాయితీపై సాగు పరికరాలు ఏడేళ్ల తర్వాత నిధుల కేటాయింపు ఉమ్మడి జిల్లాకు 16వేల యూనిట్లు రూ.4.96కోట్లు మంజూరు మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కమిటీలు త్వరలో యాక్షన్ ప్లాన్ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాకు కేటాయించిన నిధులు, యూనిట్లకు అనుగుణంగా త్వరలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. మండలాల వారీగా నిధులు, యూనిట్లను కేటాయించనున్నాం. వ్యవసాయ అధికారులకు సమాచారం అందించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పరికరాలను అందజేస్తాం. – స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ అధికారినిధుల కేటాయింపు ఇలా..జిల్లా నిధులు(రూ.) యూనిట్లు మెదక్ 1,08,40,408 2,713 సంగారెడ్డి 2,23,45,603 7,883 సిద్దిపేట 1,64,79,528 5,679 -
పనులు వేగవంతం చేయాలి
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: పట్టణంలో ఆయా వార్డుల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద బస్తీ దవాఖాన పరిశీలించారు. వానాకాలంలో ఇబ్బందులు లేకుండా భవనంలో మరమ్మతు లు చేయాలని సూచించారు. అనంతరం ఎన్జీఓ కాలనీలో నూతన బస్తీ దవాఖాన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గదుల నిర్మాణం, స్లాబ్ పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ కాలనీ బస్తి దవాఖాన పరిశీలించి మరమ్మతుల గురించి ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ డీఈ ప్రేరణ, అధికారులు ఉన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి బెజ్జంకి(సిద్దిపేట): ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించినా, విక్రయించినా జరిమానా విధిస్తామని డీపీఓ దేవకీదేవి అన్నారు. బెజ్జంకి క్రాసింగ్లో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న డీపీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు వినియోగించే వారికి జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీఓ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం సిద్దిపేటఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం వృక్షాబంధన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు నాటి కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. మొక్కలు నాటి అవి వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాలన్నారు. వృక్ష సంపద జీవకోటికి ఆధారమన్నారు. -
భలే గిరాఖీ
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025నేడే రక్షాబంధన్మార్కెట్లలో కొనుగోళ్ల సందడిఅన్నాచెల్లెళ్ల ప్రేమబంధం.. సోదర ప్రేమకు సంకేతం.. రాఖీ పౌర్ణమి. తోబుట్టువులు ఎక్కడ ఉన్నా ఒక చోట చేర్చేది రక్షాబంధన్. శనివారం పండుగ జరుపుకోనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రాఖీలు, పండ్లు, మిఠాయిల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది. మరోవైపు తల్లివారి ఇంటికి వెళ్లేందుకు మహిళలు శుక్రవారమే బయలుదేరారు. దీంతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. హిందు సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ఆయిల్పామ్ యంత్రాల ట్రయల్ రన్
నంగునూరు(సిద్దిపేట): మండలం నర్మేటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో మలేషియా కన్సల్టెన్సీ బృందం సభ్యులు శుక్రవారం యంత్రాల ట్రయల్ రన్ నిర్వహించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పనులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా నుంచి అంతర్జాతీయ కన్సల్టెంట్ హజ్మాన్ ఫ్యాక్టరీ లోని అన్ని యంత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీజీ ఆయిల్ఫెడ్ మెనేజింగ్ డైరెక్టర్ శంకరయ్య, ఓఎస్డీ కిరణ్కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం నిరీక్షణ
యూరియా కోసం చెప్పులను క్యూలైన్లో పెట్టిన రైతులునంగునూరు(సిద్దిపేట): పాలమాకుల పీఏసీఎస్కు శుక్రవారం యూరియా రావడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. లారీలో 560 బస్తాల యూరియా రావడం.. అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ఎకరా భూమి ఉన్న రైతులకు ఒక బస్తా, రెండు అంతకు మించి భూమి ఉన్న రైతులకు రెండు బస్తాలే ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతుల పాసుబుక్కు, ఆధార్కార్డు, భూమి వివరాలను పీఓఎస్ మిషన్లో నమోదు చేయడం, వేలిముద్ర, ఓటీపీ ఎంట్రీ చేయడంలో తీవ్ర జాప్యం జరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోకెన్ అభించడం ఆలస్యం కావడంతో రైతులు తమ చెప్పలను క్యూలైన్లో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. ఈ విషయమై సీఈఓ రాజేందర్ మాట్లాడుతూ యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని, నాలుగు రోజులకోమారు యూరియా వస్తుందన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ చిన్నకోడూరు (సిద్దిపేట): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. గురువారం చిన్నకోడూరు పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. అనంతరం చిన్నకోడూరు, రామంచ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణం ప్రారంభించని ఇళ్లను త్వరగా మొదలు పెట్టి పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఇష్టంగా చదవండి ఉన్నతంగా ఎదగండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్రెడ్డి కోహెడ(హుస్నాబాద్): విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నతంగా ఎదగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సౌజన్యంతో ప్రధాని మోదీ కానుకగా పాఠశాల విద్యార్థులకు 61 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న టెన్త్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైతం బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకొని తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశం, మండలాధ్యక్షుడు జాలిగం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లోని తన నివాసంలో రూ.15.73లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ఖాజానాపై తీవ్రమైన భారం పడుతున్న పేదల అభ్యున్నతే లక్ష్యంగా సాహాసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, కాంగ్రెస్ పట్టణ నాయకులు మొనగారి రాజు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గొల్లభామ మెరవాలి.. చేనేత మురవాలి
సిద్దిపేటరూరల్: గొల్లభామ ఉత్పత్తులకు బ్రాండ్ సిద్దిపేటగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని కలెక్టర్ హైమావతి నేత కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మొదటగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి మీటింగ్ హా ల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన నాగరికతకు ఆనవాళ్లు మనం వేసుకునే వస్త్రాలేనని అన్నారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి అందరూ కలిసి సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రతి సోమవారం తాను కాటన్ వస్త్రాలను ధరిస్తానని, జిల్లా యంత్రాంగంతోపాటు అందరూ కాటన్ దుస్తులు ధరించాలన్నారు. చేనేత వస్త్రాల తయారీలో మహిళలు సంఘంగా ఏర్పడితే వారందరికీ స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక తోడ్పాటు కోసం బ్యాంకర్ల ద్వారా సహకారం అందిస్తామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ సిద్దిపేట చేనేతకు ప్రాధాన్యం ఇవ్వాడానికి కృషి చేస్తానని తెలిపారు. సిద్దిపేట గొల్లభామకు ప్రాచుర్యం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురి నేత కార్మికులను సన్మానించారు. అనంతరం పలు పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులను సత్కరించారు. నేతన్న పొదుపు పథకం కింద 550 మంది లబ్ధిదారులకు రూ.15లక్షల 84 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అధికారి సాగర్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఉద్యాన శాఖ అధికారి, జెడ్పీ సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మెడలు వంచుతాం
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాకు వచ్చిన రైతుల్లో ఎంతమందికి రుణమాఫీ కాలేదో చేతులు ఎత్తాలని కోరగా, 30 శాతం మంది చేతులు ఎత్తారు. అలాగే బోనస్ రాని రైతులు ఎంతమంది అని పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. ఇదీ కాంగ్రెస్ సర్కారు తీరని ఎద్దేవా చేశారు. కాగా ధర్నా మధ్యలో హరీశ్రావుకు ఫోన్ రావడంతో మళ్లీ వచ్చి జాయిన్ అవుతానంటూ వెళ్లిపోయారు. అనంతరం నాయకులు కలెక్టరేట్కు వెళ్లి డీఆర్ఓ భుజంగరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్– బీజేపీ మిలాఖత్: మాజీ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్లు మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మోదీ, రేవంత్ కేసీఆర్ మీదికి ఒంటికాలిపై లేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి, మహేశ్వర్రెడ్డి తప్ప, మిగితా వారంతా రేవంత్రెడ్డికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని వాపోయారు. ప్రాజెక్టుల గేట్లు బద్దలు కొడతాం జిల్లాకు సాగు నీరు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్ల గేట్లు బద్దలు కొట్టి రైతుల పొలాలకు నీళ్లు వదులుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాకు నీరందించే ప్రాజెక్టులపై ఒక్కసారి కూడా సమీక్ష జరిపిన పాపానపోలేదని ఎమ్మెల్యే అన్నారు.హామీలు అమలు చేయిస్తాం సగం మందికే రుణమాఫీ.. సన్న వడ్లకు బోనస్ అందలేదు రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్రావు -
చెట్టుకు బొట్టుపెట్టి.. రాఖీ కట్టి
ప్రకృతి ప్రేమికులు వినూత్న రీతిలో రక్షాబంధన్ జరుపుకొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వృక్షాలే కీలకమంటూ.. వృక్షాబంధన్ పేరుతో వేడుకలు చేశారు. చేర్యాల మండలం రాంపూర్, అక్బర్పేట–భూంపల్లి మండలం కూడవెల్లి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ప్రాణవాయువునిచ్చే చెట్లకు బొట్టు పెట్టి రాఖీ కట్టారు. ‘మనం చెట్లకు రక్షణ–చెట్లు మనకు రక్షణ‘ అంటూ గులాబీ పూలతో అల్లిన రాఖీలను చెట్లకు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ అందరం మొక్కలు నాటి పరిరక్షిస్తామంటూ ప్రతిజ్ఙ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. – చేర్యాల(సిద్దిపేట)/మిరుదొడ్డి(దుబ్బాక) -
ఆలస్యమైతే.. ఆబ్సెంటే
● కొత్త విధానంతో చక్కటి సత్ఫలితాలు ● విధులు పూర్తయ్యే వరకుపాఠశాలల్లోనే.. ● ఆలస్యం, డుమ్మాలకు చెక్ ఉపాధ్యాయుల సమయపాలనకు ఎఫ్ఆర్ఎస్ అమలుహుస్నాబాద్: ఆలస్యం అనే పదం మరిచిపోవాల్సిందే.. సమయ పాలన పాటించాల్సిందే.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త విధానంతో చక్కటి సత్ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది సరైన సమయంలో హాజరు నమోదుకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. ఈ నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్) ద్వారా కొత్త హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో కొంత మంది ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం, ఉదయం, సాయంత్రం హాజరు వేసుకొని ఏదో పని ఉందని మధ్యాహ్నం డుమ్మా కొట్టిన దాఖలాలు ఉన్నాయి. సమయం ముగిసే వరకు పాఠశాలలోనే.. ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్తో ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం సమయం పూర్తి అయ్యే వరకు పాఠశాలలోనే విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రార్థన సమయానికి ముందుగానే పాఠశాలకు చేరుకోవాలి. ఉదయం 9.05 గంటలకు ప్రత్యేక రూపొందించిన ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా సెల్ఫోన్లో ఫొటో దిగి అటెండెన్స్ను రికార్డు చేసుకోవాలి. తిరిగి విధులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం 4.10 సమయంలో మళ్లీ ఫొటో దిగి హాజరు నమోదు చేసుకోవాలి. ఈ విధానంతో ఉపాధ్యాయులు పాఠశాలకు ఏ సమయంలో వస్తున్నారు? ఏ సమయంలో వెళుతున్నారు? అనేది స్పష్టంగా తెలుస్తోంది. పాఠశాలలోనే ఈ ఫొటో దిగాల్సి ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా తెలిసి పోతుంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యాభోదన పై సర్కార్ పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయుల సెలవులు కూడా ఆన్లైన్లో నమోదు అవుతాయి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తే విద్యార్థులు కూడా సమయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంతో విద్యాబోధన సాఫీగా సాగనుంది. మంచి ఫలితాలు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్తో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారు. ప్రార్థనకు ముందే ఉపాధ్యాయులు వచ్చి ఫొటో దిగి అటెండెన్స్ వేసుకోవాలి. గతంలో ఉపాధ్యాయులు ప్రార్థన వేళకు వస్తున్నారా? లేదా అనేది తెలిసేది కాదు. ఈ కొత్త విధానంతో సమయ పాలన పాటిస్తున్నారు. – బండారి మనీల, ఎంఈఓ, హుస్నాబాద్ -
మాయం
బియ్యం..మిల్లర్ల మాయాజాలంమిల్లులో సీఎంఆర్ చేస్తున్న బియ్యంధాన్యాన్ని సీఎంఆర్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని పలువురు మిల్లర్లు మింగేశారు. సివిల్ సప్లయ్ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. కేసు నమోదై ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సదరు మిల్లుల యజమానుల నుంచి రికవరీ చేయలేదు. రికవరీ జాప్యంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు స్పందించి బియ్యాన్ని రికవరీ చేయాలన్న డిమాండ్ సర్వత్రా పెరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట యాసంగి(2023–24)కి కేటాయించిన ధాన్యం నుంచి 2,19,757 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా 2,15,212 మెట్రిక్ టన్నులే అందించారు. ఇంకా 4,545 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల దగ్గరే ఉన్నాయి. అందులో రాయపోలు మండలం వడ్డెపల్లికి చెందిన సాయి వీరభద్ర రైస్ మిల్లు 4,040 మెట్రిక్ టన్నులు, కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన శ్రీనివా స రైస్మిల్లు 293 మెట్రిక్ టన్నులు, సిద్దిపేటలో నర్సాపూర్లో హిమజా రైస్ మిల్లు 30 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. సాయి వీరభద్ర, శ్రీనివాస మిల్లులపై సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఖరీఫ్ సీఎంఆర్ పెండింగ్ మిల్లులకు 2024–25లో 2,84,755 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. దీంతో 1,91,768 టన్ను ల బియ్యాన్ని సీఎంఆర్ చేసి అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,25,030 మెట్రిక్ టన్నులు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ బియ్యం మే 31వ తేదీ వరకే సివిల్ సప్లయ్కి అందించాలి. గడువు ముగిసి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు అందించలేదు. అసలు ధాన్యం ఉందా? లేదా? అనే విషయంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీఎంఆర్ బియ్యం మాయం చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. కానరాని తనిఖీలు మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిత్యం అధికారులు తనిఖీలు చేయకపోవడంతోనే బియ్యం మాయమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్లో ఎంత ధాన్యం కేటాయించారు? ఎంత బియ్యం అందించారు? ఇంకా ఎంత బకాయి ఉంది? అనే విషయాలు పరిశీలించాలి. మిల్లులో ఎంత ధాన్యం స్టాక్ ఉందో పరిశీలిస్తే మొదటనే మిల్లర్ల మోసంను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఇలా నిత్యం తనిఖీలు చేయడం వల్ల బియ్యం గోల్మాల్ జరగకుండా అరికట్టవచ్చు. రివకరీలో జాప్యం బకాయిపడిన బియ్యం అందించకపోవడంతో సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో ఫిబ్రవరిలో ఆయా మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయాలని ఆయా తహసీల్దార్లకు అదేశాలిచ్చారు. అలాగే ఆయా మిల్లుల యజమానుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని, ఆస్తుల మార్పిడి జరగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. సీఎంఆర్కు సంబంధించిన బియ్యం ఇవ్వకుండా వాడేసుకున్న మిల్లర్ల నుంచి రికవరీలో ఎందుకు జాప్యం చేస్తున్నారో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువు ముగిసినా అప్పగించని వైనం రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు సాయి వీరభద్ర రైస్ మిల్లు4వేల మెట్రిక్ టన్నులు బకాయి తనిఖీలు లేకపోవడం వల్లే గోల్మాల్రివకరీ చేస్తాం సీఎంఆర్ బియ్యం అందించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మిల్లు యజమానులకు సంబంధించిన ఆస్తులను మార్పిడి చేయకుండా చర్యలు తీసుకున్నాం. ఆర్ఆర్ యాక్ట్ కింద మిల్లుల యజమానుల నుంచి త్వరలో రికవరీ చేస్తాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
లద్నూర్ రిజర్వాయర్ను నింపండి
● బీజేవైఎం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేశ్గౌడ్ ● మద్దూరులో రాస్తారోకోమద్దూరు(హుస్నాబాద్): లద్నూర్ రిజర్వాయర్ను నీటితో నింపి, ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్గౌడ్ మాట్లాడుతూ కాలువల ద్వారా చెరువులన్నింటినీ నింపి రైతులను ఆదుకోవాలన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు కిరణ్ కుమార్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు రైతుల సమస్యలు పట్టడంలేదన్నారు. తహసీల్దార్ అక్కడికి వచ్చి నీటి విడుదలకు హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బియ్య రమేష్, ఊట్ల రాంచంద్రారెడ్డి, సాయి కిరణ్, యాచారేణి శ్రీకాంత్, పైసా బాలకృష్ణ, మ్యాక సుదర్మ, చింతల చందు, శ్రీకాంత్, మెతుకు శివారెడ్డి, అల్డా భీరయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా మూల మహోత్సవం
శుభకర శ్రావణ మాసం వేళ.. సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం బుధవారం మూల మహోత్సవ వేడుకలతో అలరారింది. అర్చనలు, చిన్నారుల అక్షరస్వీకార పూజలతో శోభిల్లింది. సరస్వతి మాత మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, సర్వాభరణాలు, నిండుగా పూలమాలలతో అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి నామం స్మరిస్తూ భక్తులు సామూహిక లక్షపుష్పార్చన చేశారు. యాగశాలలో చండీ హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సరస్వతి సన్నిధిలో భారీగా చిన్నారులు అక్షరాభ్యాసాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. – వర్గల్ (గజ్వేల్) -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీపీఓ దేవకీదేవి నంగునూరు(సిద్దిపేట): దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అర్జీలను పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి అన్నారు. బుధవారం నంగునూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేశామన్నారు. మొదటి విడత జాబితాలో ఉన్న లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కాపీలను అందజేశామన్నారు. ఇళ్లు మంజూరైన వారికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందజేస్తామని చెప్పారు. స్థానికంగా ఇసుక రీచ్లు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్ది పేట నియోజకవర్గ లబ్ధిదారులకు నంగునూరు నుంచే తహసీల్దార్ ద్వారా టోకెన్ అందజేస్తారన్నారు. నంగునూరు మండలంలో మొదటి విడతలో 512 ఇళ్లు మంజూరు కాగా అందరికీ ప్రొసిడింగ్ కాపీలు అందజేశామని తెలిపారు. విడతల వారీగా అర్హులకు ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని, అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప, హౌసింగ్ ఏఈ వివేక్ పాల్గొన్నారు. ఎరువుల కోసం ఆందోళన వద్దు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చిన్న చిన్న పరిశ్రమలు, పౌల్ట్రీ ఫామ్లు తదితర వాటిపై పోలీసులతో కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియాను పరిశ్రమలకు అక్రమంగా సరఫరా చేసినా, అక్రమంగా నిల్వలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు ఈ పాస్ విధానంలోనే విక్రయించాలన్నారు. శిశువుకు తల్లిపాలే దివ్యౌషధం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి శిశువుకు తల్లిపాలే దివ్యౌషధమని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సురభి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ చేపట్టారు. బీజేఆర్ చౌరస్తాలో తల్లిపాల అవగాహన ర్యాలీని సీఐ జెండా ఊపి ప్రారంభించారు. సురభి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బతాయి మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సోలిపేట జీవితం స్ఫూర్తిదాయకం
దుబ్బాక: పేదలకోసమే జీవించిన గొప్ప నేత సోలిపేట రామలింగారెడ్డి అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా సతీమణి సుజాతక్క, కుమారుడు సతీష్రెడ్డితో కలిసి దుబ్బాకలోని డబుల్బెడ్రూం కాలనీ, ఆయన స్వగ్రామం చిట్టాపూర్లోని రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్సలైట్గా, జర్నలిస్టుగా, శాసనసభ్యుడిగా తన జీవితమంతా పేదల కోసమే పనిచేశారన్నారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా ఉన్నా అత్యంత సాధారణ జీవితం గడిపిన గొప్పనేత అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
‘మైనంపల్లి’ తీరువల్లే కాంగ్రెస్లో గ్రూపులు
● దళిత సంఘాల నాయకుల మండిపాటు ● గజ్వేల్లో నర్సారెడ్డికి మద్దతుగా ర్యాలీ గజ్వేల్: మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరువల్లే గజ్వేల్ కాంగ్రెస్లో గ్రూపులు ఏర్పడ్డాయని వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం గజ్వేల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్, హరీశ్రావులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలకు నర్సారెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. పదవుల్లోనూ దళితులకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. నర్సారెడ్డికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై నమోదైన అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింహు లు, వీరేశం, అండాలమ్మ, శివులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, నాయకులు మహేందర్, శ్రీనివాస్, వెంకటేష్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి కాంగ్రెస్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్కుమార్ను కులం పేరుతో దూషించి దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బుధవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులుకు దళిత సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉబ్బని ఆంజనేయులు, సీనియర్ నాయకులు మైస రాములు, పొన్నాల కుమార్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ప్రజలకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ హైమావతికొండపాక(గజ్వేల్): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. కొండపాకలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రి పనితీరు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టరును పరిశీలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు, పరికరాలు ఉన్నాయా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ఆసనాలపై ప్రజలకు ఆసక్తి కలిగేలా ఆయుష్ వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నరు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యలు శ్రీధర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దిక్సూచి.. ప్రొఫెసర్ జయశంకర్ సిద్దిపేటరూరల్: ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధననే శ్వాసగా, ఆశయంగా తన జీవితాంతం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. మేధావులు, యువకులు, ప్రజలతో నిరంతరం సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాగృతం చేశారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రేరణగా నిలిచి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథం తదితరులు పాల్గొన్నారు. -
చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య పేర్కొన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకోసం మండలంలోని అన్నిగ్రామాల్లో మంగళవారం బైక్ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలో తహసీల్దార్ దివ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కొంతకాలంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్గా ప్రకటించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మెట్ట మండలాల ప్రజలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లారెడ్డి, సత్తిరెడ్డి, బూర్గు సురేశ్, ముస్త్యాల బాల్నర్సయ్య, శ్రీధర్రెడ్డి, గీస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య -
త్వరలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
● సీఎం చేతుల మీదుగా... ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ నంగునూరు(సిద్దిపేట)/సిద్దిపేటకమాన్/హుస్నాబాద్: నంగునూరు మండలం నర్మేటలో రూ.300 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని మంగళవారం కలెక్టర్ సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. ఉద్యానవనశాఖ, ఆయిల్ఫెడ్, విద్యుత్శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖల అఽధికారులతో ఫ్యాక్టరీ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సిద్దిపేటలోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు. ఉదయం 9.45 గంటలైనా డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కాలి గాయంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తితో మాట్లాడారు. డాక్టర్ అందుబాటులో ఉంటారా? వైద్యం ఏలా చేస్తున్నారు? వంటి విషయాలు కలెక్టర్ ఆరా తీశారు. తర్వాత హుస్నాబాద్ పట్టణ శివారులోని కిషన్ నగర్లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఐఓసీ రోడ్ నుంచి కళాశాల ప్రాంగణం వరకు సీసీ రోడ్ ఏర్పాటుకు అంచనాలు ప్రతిపాదించాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక హెలీప్యాడ్ను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఉద్యానవనాధికారి సువర్ణ, ఆయిల్ఫెడ్ మేనేజర్ సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా
బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జి నాగరాజమ్మ చిన్నకోడూరు(సిద్దిపేట): బీసీ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి మెరుగైన వసతులు కల్పిస్తామని బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జి నాగరాజమ్మ పేర్కొన్నారు. చిన్నకోడూరులోని బీసీ హాస్టల్ విద్యార్థులు తమకు రుచికరమైన భోజనం అందివ్వడంలేదని కలెక్టర్కు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె బీసీ హాస్టల్ను సందర్శించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా హాస్టల్లో అల్పాహారం, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ఇందులో పని చేసే వర్కర్ రాధ తమపై అకారణంగా దుర్భాషలాడుతుందని విద్యార్థులు వివరించారు. బడిలో ప్రధానోపాధ్యాయుడు మిగతా విద్యార్థులు, హాస్టల్ విద్యార్థులను వేర్వేరుగా చేసి చూస్తున్నారని తమకు అవమానంగా ఉందని వివరించారు. వెంటనే ఆమె పాఠశాలను సందర్శించి హెచ్ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండాచూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బాపురాజు, వార్డెన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలిడీఎంహెచ్ఓ ధనరాజ్ మద్దూరు(హుస్నాబాద్): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి ధనరాజ్ స్పష్టం చేశారు. మండల కేంద్రంతో పాటు లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనీఖీ చేశారు. ఈ సందర్భగా ఆయన రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...వర్షపు నీరు కలుషితం కావడం వల్ల నీళ్ల విరేచనాలు గ్యాస్ట్రో ఎంట్రైటీస్,కీటక జనిత వ్యాధులకు సంబంధించిన నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మంగళ,శుక్రవారాలు డ్రైడేగా పాటించాలని సూచించారు. నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రజిత,సుధీర్రాజ్,అర్జున్,మహేందర్ పాల్గొన్నారు. కేజీబీవీలో కుక్పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంమిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం)లో రెండు సహాయ వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంఈఓ ప్రవీణ్ బాబు తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...7వ తరగతి కనీస విద్యార్హత కలిగిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6, 7 తేదీలల్లో సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులను అందజేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలిపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి దుబ్బాక: ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు సెప్టెంబర్ 1న పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 10 వేల మందితో నిర్వహించనున్న ధర్నాకు ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీఆర్టీయూ దుబ్బాక అర్బన్, రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలల్లో సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానం కోసం పోరాడుతున్నామన్నారు. ఉపాధ్యాయులతోపాటు విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. -
క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుద్దాం
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీమంత్రి హరీశ్రావు చెప్పిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాచైతన్యం ద్వారా అధికార కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే హరీశ్రావు పవర్ ప్రజెంటేషన్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ స్క్రీన్ ద్వారా జిల్లాలోని పార్టీ శ్రేణులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పవర్ ప్రజెంటేషన్ పాలకులకు జ్ఞానోదయం కలిగేలా, ప్రజల్లో ఒక అవగాహన వచ్చేలా ఉందన్నారు. కేసీఆర్, హరీశ్రావుల నిరంతరం కృషి వల్ల గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా తరలించినట్లు వివరించారు. రైతులకు సాగునీరు అంది దేశంలో అత్యధిక సాగు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన మంచిపేరు చూసి ఓర్వలేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్రావుపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం కోసం తాపత్రయపడుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తి చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కుటుంబం మీద కాంగ్రెస్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. పవర్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం విలువ ప్రతి ఒక్కరికి తెలిసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలను కై వసం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి -
ఆహార శుద్ధి యంత్రాల ప్రదర్శన
హుస్నాబాద్: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ(పీఎంఎఫ్ఎంఈ) పఽథకం కింద స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఆహార శుద్ధి యంత్రాల ప్రదర్శన నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ప్రతీ యూనిట్ రూ.1లక్ష నుంచి రూ.30 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ప్రతీ యూనిట్కు 35% రాయితీ అందించనున్నారు. ఆహారశుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బృహత్తర పఽథకాన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. -
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
దుబ్బాక బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కనులపండువగా జరిగింది. ఆలయంలో వేదపండితులు నిత్యహోమం, సుదర్శన హోమం,మూలమంత్ర జపహోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి కల్యాణం బుధవారం జరుగనుంది. ఈ సందర్భంగా పట్టణంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు,పుస్తె, మెట్టెలు సమర్పించారు. కాగా, స్వామివారి దర్శనానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. దుబ్బాక: న్యూస్రీల్కనులపండువగా బాలాజీ బ్రహ్మోత్సవాలు -
అపార్కు ఆధార్ అవస్థలు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు తప్పనిసరి చేశారు. అయితే ఆధార్ కార్డు నంబర్తో పాఠశాలల్లో అపార్ను నమోదు చేస్తున్నారు. ఆధార్ లేని విద్యార్థులకు అపార్ నమోదు చేయడం లేదు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట అపార్ అందజేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వివరాలను యూడైస్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,316 పాఠశాలలుండగా అందులో 1,68,381 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు 1,35లక్షల మంది అపార్ నమోదు చేసుకున్నారు. వివరాలు ఒకేలా ఉంటేనే నమోదు జిల్లావ్యాప్తంగా 1,35,848 మంది విద్యార్థుల సంబంధించిన వివరాలు ఆధార్లోనూ పాఠశాలలోనూ ఒకే రకంగా ఉన్నాయి. 26,367 మంది విద్యార్థుల వివరాలు మాత్రం సరిపోలడంలేదు. దీంతో అపార్లో నమోదు కావడం లేదు. ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే నమోదు కానున్నాయి. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో మార్పులు ఉండటంతో అపార్ నమోదులో సమస్యలు వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలో 26,367 విద్యార్థుల ఆధార్ కార్డులు అప్డేట్ చేయాల్సి ఉండగా ఏకంగా 6,166 మంది పిల్లలకు ఆధార్ కార్డులే లేవని విద్యాశాఖ గుర్తించింది. దీంతో వారి కోసం 16 చోట్ల ప్రత్యేక ఆధార్ కేంద్రాలను పాఠశాలలో ఏర్పాటు చేసి నమోదు చేయిస్తున్నారు. విద్యార్థి వివరాలు నిక్షిప్తం అపార్ కార్డు ద్వారా విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబర్ కేంద్ర రాష్ట్ర విద్యాశాఖల వెబ్సైట్లో నమోదు చేస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ఎక్కడ చదివారన్న వివరాలు ఇట్టే ప్రత్యక్షమవుతాయి. అపార్ గుర్తింపుతో డీజీలాకర్కు అనుసంధానం అవుతారు. దీంతో అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యార్థి సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. పాఠశాల మారినా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు, వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయంలో, ఇతర అంశాల్లో అపార్ కార్డు ఆధారంగా సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్ కార్డు లేని6 వేలమంది విద్యార్థులు 26వేలమంది పిల్లలకుఅవసరమైన అప్డేట్ జిల్లాలో కొనసాగుతున్న అపార్ రిజిస్ట్రేషన్ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం విద్యార్థులందరికీ ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ ఆధారంగానే అపార్లో నమోదుకు వీలుంటుంది. జిల్లాలో ఆధార్ కార్డు లేకుండా 6వేల మంది విద్యార్థులున్నట్లు గుర్తించాం. పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ను చేపట్టాం. మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – శ్రీనివాస్ రెడ్డి, డీఈవో, సిద్దిపేట -
చేనేతకు గౌరవం
జిల్లా కార్మికులకు కొండా లక్ష్మణ్ అవార్డులు .. 7న మంత్రి చేతుల మీదుగా ప్రదానం సిద్దిపేటజోన్: జిల్లా చేనేత కార్మికులకు గౌరవం దక్కింది. చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ముగ్గురు చేనేత కార్మికులను కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డులతో ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన అవార్డుల జాబితాలో సిద్దిపేట పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు బైరి శ్రీనివాస్ నేసిన గొల్లభామ సిల్క్, అండ్ కాటన్ చీరకు అవార్డు దక్కింది. మరో కార్మికుడు మంతురు వెంకటేశం నేసిన ముత్యం పేట సిల్క్ చీరకు అవార్డు లభించింది. అదేవిధంగా దుబ్బాక పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు జిందం రాజేశం నేసిన ఆర్ముర్ సిల్క్ చీరకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. వీరికి ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేనేత దినోత్సవం రోజున అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించనుంది. -
యూరియా కోసం బారులు
● పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ ● క్యూలో ఉన్నా చాలామందిరైతులకు అందని వైనం దుబ్బాక: ప్రభుత్వం, అధికారులు యూరియాకు కొరత లేదని రైతులకు సరిపడా నిల్వలున్నాయని గప్పాలు చెప్పుకోవడం తప్పా ఆచరణలో మాత్రం కానరావడంలేదు. దుబ్బాక పట్టణంలో సోమవారం యూరియా బస్తాల లారీ రావడంతో తెల్లవారక ముందే దుకాణం వద్దకు వందలాది మంది రైతులు తరలివచ్చి లైన్ కట్టారు. వందల సంఖ్యలో రైతులు ఉండడంతో ఒక్కో రైతుకు ఆధార్కార్డు, పాస్బుక్ తీసుకుని 2 బస్తాల చొప్పున పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. దొరకని రైతుల ఆందోళన క్యూలో వేచి ఉన్నా చాలామంది రైతులకు యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా లేక తమ పంటలు పాడైతున్నాయని ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలు పడాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను తెప్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్, సబ్ జూనియర్ అండర్–15 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మిరుదొడ్డిలో సోమవారం ఆయన మాట్లా డుతూ..సీనియర్ జట్టుకు శశికుమార్, శ్రీనివాస్, చైతన్య, భరత్, కృష్ణసాయి, రవి, కిరణ్, రవితేజ, నవీన్, స్టాండ్ బాయ్స్గా మునీరొద్దీన్, రామ కోటి ఎంపికయ్యారన్నారు. బాలికల సబ్ జూనియర్ జట్టుకు శ్రావణి, నిహారిక, నందిత, లలిత, శరణ్య, సఫియా, సోహ, జెస్సీ, మనోవర్ధిని, శ్రీతేజ, తన్విలు ఎంపిక కాగా, సబ్ జూనియర్ బాయ్స్ జట్టులో చైతన్య, కృష్ణసాయి, సిద్విక్, మనికంఠ, సాకేత్, మోయిన్, భవన్, అక్షిత్, లలిత్, కౌశిక్, ఆర్యలు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలో సీనియర్ జట్లు పాల్గొంటాయని తెలిపారు. -
సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యం
● రెండేళ్లుగడుస్తున్నా ముందుకు సాగని పనులు ● ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి తొగుట(దుబ్బాక): సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్ అనుబంధంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట వద్ద నిర్మిస్తున్న మినీ పంప్హౌజ్, పైప్లైన్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుసేన్ మనవలు ఎండీ కరీమోద్దిన్,యాసీనుద్దిన్, మనవరాలు అయేషా సుల్తానాల పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఘనపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ఉప కాలువలు నిర్మించాలని పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్కోడ్ పైపు లైన్ పనులు 90% బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసిందన్నారు. మిగిలిపోయిన పనులు రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మల్లన్న సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప కాలువ పనులు వేంటనే పూర్తిచేయాలని లేకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.విద్య, వైద్యం ఉచితం చేయాలి పేదలకు విద్య, వైద్యం అందనిద్రాక్షలా మారిందని, ఆ రెండింటినీ ఉచితంగా అందించాలని ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. నేడు ప్రతీ ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యవస్థల్లో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు తొగుటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరిని పరామర్శించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రయాణం సులువే!
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఎక్స్ప్రెస్వే..తెరపైకి కొత్త ప్రతిపాదనసిద్దిపేట జిల్లాలో రాజీవ్రహదారిగజ్వేల్: మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మీదుగా మంచిర్యాల, రామగుండం ప్రాంతం వరకు 207కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. 15ఏళ్ల క్రితం ఈ రోడ్డు విస్తరణకు రూ.1,450కోట్లకుపైగా వెచ్చించారు. బీఓటీ(బిల్ట్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్) విధానంలో ఈ పనులు పూర్తి చేశారు. ఉత్తర తెలంగాణలోని మేడ్చల్, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను కలిపే ఈ దారి అత్యంత కీలకమైనది. ప్రత్యేకించి హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు, వరంగల్ హైవే, నేషనల్ హైవే–44 తదితర హైవేలతోపాటు కొత్తగా నిర్మించనున్న ట్రిపుల్ఆర్తోనూ ఈ రహదారి అనుసంధానం కానుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారి మలుపులు సరిచేయకుండానే విస్తరణ పనులు చేపట్టిన కారణంగా తరుచూ ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలివేటెడ్ కారిడార్తో అనుసంధానం.. రాజీవ్ రహదారిపై మలుపులు సరిచేయడం, ఆరు లేన్లుగా విస్తరించే అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ క్రమంలో రాజీవ్రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వేను నిర్మించాలని భావిస్తోంది. ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా ఉంటుందని చెబుతున్నారు. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 18కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కారిడార్తో ఎక్స్ప్రెస్వేను అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.4వేలకోట్లకుపైగా వ్యయం అవుతుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు ప్రతిపాదనలు పంపింది.న్యూస్రీల్సిద్దిపేట జిల్లాలో 90 కి.మీటర్లపైనే! ఆర్ఆర్కు ప్రత్యామ్నాయంగాకొత్త రహదారి శామీర్పేట నుంచి రామగుండం వరకు 207కిలోమీటర్లు సిద్దిపేటతోపాటు ఉత్తర తెలంగాణకు ప్రయోజనం!రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ పెరిగి ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ... ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వే తీసుకురావాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సిద్దిపేటతోపాటు ఇతర ఉత్తర తెలంగాణ జిల్లాల రాకపోకలకు రాజీవ్రహదారి కీలకం. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎక్స్ప్రెస్వే కార్యరూపంలోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లాలో ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు సుమారుగా 90కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. రాజీవ్రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే ఈ జిల్లాలోనే సింహభాగం విస్తరించే అవకాశముంది. దీంతో ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలోని ప్రాంతాలకు ఎక్స్ప్రెస్వే ద్వారా ప్రయాణం ట్రాఫిక్ చిక్కుల్లేకుండా మరింత సులువుగా మారనుంది. ప్రత్యేకించి గజ్వేల్ ప్రాంతానికి హైదరాబాద్ మరింతగా చేరువగా మారనుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ములుగు, మర్కూక్, వర్గల్, గజ్వేల్ మండలాలు మెగా హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్తున్నాయి. ఈ ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన ఈ ప్రాంతానికి కలిసిరానున్నది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఇతర జిల్లాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. -
తెలవారే.. తొలి దర్శనం
దుబ్బాక: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన దుబ్బాక బాలాజీ ఆలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు పుణ్యాహవచనంతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధిగొల్ల(యాదవులు) ఆల యం తెరిచే ఆచారాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిసారి దుబ్బాక బాలాజీ ఆలయంలో చేపట్టారు. సోమవారం తెల్లవారుఝామునే యాదవులు కుటుంబసమేతంగా పట్టణంలో పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి స్వామివారి తొలిదర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం సంతానం కోసం నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమానికి 2వేలకు పైగా దంపతులు హాజరై గరుడ ప్రసాదాలను స్వీకరించారు. కాగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్లతో కలిసి కలెక్టర్ కె.హైమావతి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలు నమ్మకంతో ప్రజావాణికి వస్తున్న క్రమంలో వారికి న్యాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని ఆదేశించారు.వివిధ పరిశ్రమల స్థాపనకు టీజీఐపాస్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ విభాగాల వారీగా పరిశీలన చేసి అనుమతులి వ్వాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రజావాణిలో 157 దరఖాస్తులు వచ్చాయి. కుక్ సతీశ్ను బదిలీ చేయవద్దు మేము చిన్నకోడూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులం. హాస్టల్లో కుక్గా పనిచేస్తున్న సతీశ్ను బదిలీ చేశారు. తమకు చాలా రోజులుగా వంటలు వండుతూ సాయంత్రం సమయంలో ట్యూషన్ నిర్వహిస్తూ ఎంతో సహాయకారిగా ఉండేవాడు. ఎలాగైనా కలెక్టర్ స్పందించి సతీశ్ను బదిలీ చేయకుండా మళ్లీ తమ హాస్టల్కు వచ్చేలా చూడాలన్నారు. అంతకుముందు విద్యార్థులు కొద్దిసేపు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.157 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హైమావతి -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ అనురాధ సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సైబర్ వారియర్స్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వచ్చిన టీషర్ట్స్ను సీపీ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సైబర్ వారియర్స్కు వచ్చే ఫోన్ కాల్స్కు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సైబర్ కేసుల్లో పూర్తి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడం, నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడమనేది సైబర్ వారియర్స్ చాలెంజ్గా స్వీకరించాలని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లాలోని సైబర్ వారియర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూడీఐడీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ఆర్యా సిద్దిపేటరూరల్: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యూడీఐడీ దివ్యాంగుల శిబిరానికి హాజరై గుర్తింపు కార్డును పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి జయదేవ్ ఆర్యా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నడవలేని వారికి ఆగస్టు 14, 28వ తేదీల్లో, మానసిక, కంటిచూపు, వినికిడి సమస్యలున్న వారికి 07,21,28వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు అనంతరం వారికి కేటాయించిన సమయానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు దగ్గరలో గల ప్రభుత్వాస్పత్రికి ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. నకిలీ ఎరువుల దందాను అరికట్టాలిరైతు సంఘం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోన్న నకిలీ ఎరువుల దందాను వ్యవసాయ అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతు సంఘం కార్యాలయంలో సంఘం నాయకులతో కలసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేరున్న కంపెనీల ఎరువుల బస్తాలకు కృతిమ కొరత సృష్టించి ,అధిక లాభాల కోసం నాసిరకం ఎరువులు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కొంతకాలంగా నాసిరకం విక్రయాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వుల్లంపల్లి సాయిలు, తాడూరి మల్లేశం, నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జ్వర పరీక్షలు నిర్వహించాలిడీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ఆరోగ్య కేంద్రానికి జ్వర లక్షణాలతో వచ్చే వారి నుంచి రక్త నమూనాలను సేకరించి టీహబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సబ్ యూనిట్ అధికారులు, ఎల్టీలు, సూపర్వైజర్లతో సోమవారం డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెంగ్యూ, మలేరియా నిర్థారణ పరీక్ష కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సోఫాన్ రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సీపీఎస్ రద్దు చేయాలి
పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మహేందర్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి వంగ మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో సోమవారం సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నానో యూరియా డాప్తో అధిక దిగుబడులుజిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి కొండపాక(గజ్వేల్): నానో యూరియా డాప్ వినియోగంతో అధిక దిగుబడులు పొంద వచ్చని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పేర్కొన్నారు. మండల పరిధిలోని బందారం గ్రామంలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ, వ్యవసా య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా డాప్ల వినియోగంపై సోమ వారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ...నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల కాలుష్యం తగ్గించడంతో పాటు సమర్థవంతంగా పంటలకు ఉపయోగపడుతుందన్నా రు. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. -
క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఫాల్గుణసిద్దిపేటజోన్: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో అద్భుతమైన ఫుట్బాల్ మైదానం ఉందని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ మైదానంలో అష్మిత లీగ్ నాకౌట్ 2025 ఫుట్బాల్ టోర్నీ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆటకు తగ్గట్టుగా వసతులున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకూ చెందిన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాంలు మాట్లాడుతూ..క్రీడాహబ్గా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన కృషి విస్మరించలేనిదన్నారు. సిద్దిపేట నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు వచ్చారని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు. రసవత్తరంగా పోటీలు అష్మిత ఫుట్బాల్ లీగ్ టోర్నీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఖేల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, ఫైనల్ మ్యాచ్ నిజామాబాద్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగింది. 2–0గోల్స్తో నిజామాబాద్ విజయం సాధించింది. రన్నర్గా ఆదిలాబాద్, విజేతగా నిజామాబాద్ బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్రెడ్డి, ఫుట్ బాల్ కోచ్ అక్బర్, అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రెటరీ సాజిద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నీళ్లివ్వండి సారూ!
మర్కూక్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో నీటి ఎద్దడి నెలకొంది. గత 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం నర్సన్నపేట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టింకుని మిషన్ భగీరథ నీరు వచ్చేలా చేయాలని కోరారు. కేసీఆర్ దత్తత గ్రామంలో 20 రోజులుగా రాని తాగు నీరు రోడ్డుపై మహిళల నిరసన -
స్నేహితుల దినోత్సవ వేడుకల్లో మహిళల సందడి
పచ్చని చెట్లు... చుట్టూ గుట్టలు, మధ్య నీటి సెలయేరు.. స్వచ్ఛమైన, ప్రకృతి రమణీయమైన వాతావరణంలో మహిళలు స్నేహితుల దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని ఉమ్మాపూర్ మహాసముద్రం గండి వద్ద ఆదివారం హుస్నాబాద్ పట్టణానికి చెందిన పద్మావతి గ్రూప్ మహిళా సభ్యులు కలిసి స్నేహితుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుని కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడుతూ. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. –హుస్నాబాద్ప్రకృతి ఒడిలో పచ్చని స్నేహం -
గజ్వేల్లో గందరగోళం
గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లిలోని ఎస్ఎమ్ గార్డెన్స్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని వ్యతిరేకిస్తూ గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపైకి వెళ్లగా..అక్కడే ఉన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గీయులు మల్లారెడ్డిని దిగిపోవాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు, నర్సారెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మల్లారెడ్డి కిందకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి వర్గీయులకు, మల్లారెడ్డితోపాటు అక్కడే ఉన్న నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు అసమ్మతి నేతలు సీనియర్ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్కుమార్ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పలువురు నాయకుల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఇంతలోనే కలెక్టర్ హైమావతి లేచి సభ నిర్వహణకు సహకరించాలని కోరినా ఎవ్వరూ తగ్గలేదు. దీంతో అసహనానికి గురైన మంత్రి వివేక్ జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఆ తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. -
ఆదాయ మార్గాల వైపు నజర్
అనుమతులు గృహాలకు... నడుస్తున్నది కమర్షియల్ ● గ్రౌండ్ ఫ్లోర్కే పన్ను చెల్లింపులు.. పైఅంతస్తులకు ఎగవేత ● అక్రమ నిర్మాణాలకే పెనాల్టీ అంటున్న అధికారులు హుస్నాబాద్: మున్సిపల్ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. హుస్నాబాద్ పట్టణంలో ఇళ్లు 6,039, కమర్షియల్ 579, మిక్స్డ్ 684 మొత్తం కలిపి 7,302 ఉన్నాయి. గత కొంత కాలంగా పట్టణంలో అక్రమ నిర్మాణాలు, గృహ నిర్మాణం పేరిట వాణిజ్య సముదాయాలు నడుపుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. గతంలోనే పట్టణాన్ని నాలుగు డివిజన్లుగా విభజించి ఇంటి పన్నులు విధించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రతి ఇంటిని భువన్ సర్వే చేసి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేసి ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. పాత ఇంటి పన్నుల ఆధారంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇంటి పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఆదాయం ఏరియల్స్తో కలుపుకొని రూ.1.70 కోట్లు కాగా, దాన్ని మరింత పెంచుకునే మార్గాలను మున్సిపల్ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రతీఏటా రివిజన్ నిర్వహించాల్సి ఉంటుంది. పదేళ్లుగా ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఇంటి రివిజన్ చేస్తుండటంతో ఇంటి పన్నులు పదింతలు పెరుగుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గృహ నిర్మాణం పేరిట వాణిజ్యం పట్టణంలోని మెయిన్రోడ్డు, అక్కన్నపేట రోడ్, నాగారం రోడ్లో కమర్షియల్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలావరకు అక్రమ నిర్మాణాలు చేశారని అధికారుల నిర్ధారించుకున్నారు. ఇంటి (గృహ) నిర్మాణం కోసం అనుమతి తీసుకుని అందులో వాణిజ్య వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్కు గృహ నిర్మాణ పన్ను మాత్రమే చెల్లిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్కు గృహ నిర్మాణం అనుమతి తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్తోపాటు పైన మరో రెండు అంతస్తులు వేసి వాణిజ్య పరమైన వ్యాపారాలు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రమే ఇంటి పన్ను చెల్లిస్తూ, పైన అక్రమంగా నిర్మించిన ఫ్లోర్లకు పన్నులు చెల్లించకుండా ఎగ్గోడుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రూ.లక్షల పన్నులు మున్సిపల్కు చెల్లించకుండా భారీగా గండికొడుతున్నారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కొన్నేళ్లుగా అనుమతులు సరిగా తీసుకోకుండా పన్నులు చెల్లించని వ్యాపారులపై జరిమానాలు వేస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 827 ఇండ్లకు రివిజన్ చేయగా, పన్నుల రూపంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి పన్నులు పెంచలేదు సీడీఎంఏ ఆదేశాల మేరకే రివిజన్ నిర్వహిస్తున్నాం. పాత ఇంటి పన్నులే తప్ప కొత్తగా పన్నులు పెంచలేదు. అక్రమ నిర్మాణాలు, ఇంటి పర్పస్ అనుమతి తీసుకొని వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్న వారికి పెనాల్టీ వేస్తున్నాం. పన్నులు అధికంగా వేశారని అనుకుంటే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ రివ్యూ చేస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ -
రేషన్ కార్డుల పంపిణీ రసాభాస
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి చేపడుతున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం గజ్వేల్లో రసాభాసగా మారింది. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల చొక్కాలు చిరిగిపోయాయి. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మరోసారి కాంగ్రెస్ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి వివేక్ సమక్షంలో మరోసారి బయటపడ్డ విభేదాలు గజ్వేల్/వర్గల్(గజ్వేల్)/ములుగు (గజ్వేల్)/జగదేవ్పూర్ (గజ్వేల్): ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ గార్డెన్స్ వేదికగా జిల్లా కలెక్టర్ హైమావతి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిలతో కలిసి ఆయన నూతన రేషన్కార్డుల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ...ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల్ల మంజూరు ద్వారా పేదల సొంతింటి కలసాకారం చేస్తున్నామన్నారు. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. మెగా కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని ఆరోపించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు తమపై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారని అసమ్మతి నేతలు విజయ్కుమార్, మల్లారెడ్డి, నాయిని యాదగిరిలు వేర్వేరుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తానికి మంత్రి పర్యటనలో కాంగ్రెస్ విభేధాలు మరోసారి రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది. నర్సారెడ్డివి ఒంటెద్దు పోకడలు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఒంటెద్దు పోకడలకు పాల్పడుతున్నారని అసమ్మతి నేతలు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్కుమార్ ఆరోపించారు. గజ్వేల్లో ఉద్రిక్తత, మంత్రి అసహనం ప్రజాసంక్షేమమే పరమావధి: మంత్రి వివేక్ -
నీట్ పీజీ పరీక్షకు 48 మంది హాజరు
సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ విధానంలో ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 48 మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. డాక్టర్ నౌషీన్, డాక్టర్ స్రవంతి, టీసీఎస్ ఆఫీసర్ అఫ్సర్, పీఆర్వో బొడ్డు రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా, కరీముద్దీన్ పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు. పొన్నాల బాలయ్యకు సినారె పురస్కారంప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట చెందిన ప్రముఖ కవి రచయిత పొన్నాల బాలయ్య ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఉత్సవంలో మహాకవి సినారె సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు మంజీర రచయితల సంస్థ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాదులో సినారె కళాపీఠం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఉత్సవంలో ఈ పురస్కారాన్ని బాలయ్యకు ప్రదానం చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి: సీఐటీయూనంగునూరు(సిద్దిపేట): పంచాయతీ కార్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. నంగునూరులో ఆదివారం పంచా యతీ కార్మికుల ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవులపల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శిగా కనకయ్య, కోశాధికారిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా కనకవ్వ, రేణుక, కనకయ్య, సహాయ కార్యదర్శులుగా బాలయ్య, నర్సవ్వ, యాదవ్వ ఎన్నికయ్యారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంచేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్–2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్–3, సివిల్ ఇంజినీరింగ్–4, ఫిజిక్స్–1, మ్యాథ్స్–1, కెమిస్ట్రీ–1 పోస్టుల కోసం అర్హతగల అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 5 వరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెక్నికల్ విభాగాల కోసం బీఈ, బీటెక్లో ఫస్టు క్లాసులో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఎంటెక్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ మోసకారిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ గజ్వేల్: అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా... దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు పెంచకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే మోసకారి ముఖ్యమంత్రిగా ఖ్యాతిని గడించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆరోపించారు. హైదరాబాద్లో దివ్యాంగులు, వృద్ధులు ఫించన్ల పెంపును డిమాండ్ చేస్తూ ఈనెల 13న నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం గజ్వేల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచుతానని చెప్పిన సీఎం..20నెలలుగా రూ. 20వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ నిధులను రుణమాఫీకి మళ్లించారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు భూమయ్యయాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘బంధీ’తో స్నేహ బంధం
ప్రాణస్నేహితులను చేసిన కిడ్నాప్ ఘటన.. దుబ్బాక: ఓ కిడ్నాప్ ఘటన ముగ్గురిని ప్రాణస్నేహితులను చేసింది. 34 ఏళ్ల క్రితం కిడ్నాప్ ఘటన జరిగినా ఆ ముగ్గురి మధ్య ప్రేమ నేటికీ చెక్కుచెదరలేదు. ఆ నాటి సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. 1991 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా నెదురుమల్లి జనార్దన్రెడ్డి ఉన్నారు. పీపుల్స్వార్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ రోజుల్లో ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఓ రోజు ఫారూఖ్ తన చిన్ననాటి స్నేహితుడు సికిందర్ తో కలిసి స్కూటర్పై దుబ్బాకకు వస్తున్న క్రమంలో అప్పటి దుబ్బాక పీపుల్స్ వార్ దళం కమాండర్గా ఉన్న రామన్న ఫారూఖ్, సికిందర్లను కిడ్నాప్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న ఉద్యమ రీత్యా దుబ్బాక ప్రాంతంలో పనిచేస్తుండగా అప్పటి వరకు వీరికి ఎలాంటి పరిచయంలేదు. కిడ్నాప్ అయినప్పుడే వీరికి రామన్న పరిచయం అయ్యాడు. ఆతర్వాత రామన్న పీపుల్స్వార్ పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్సీ ఫారూక్, సికిందర్, రామన్నలు ప్రాణస్నేహితులయ్యారు. రామన్న ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అ కుటుంబానికి ఫారూఖ్ హుస్సేన్ చాలా సార్లు అండగా నిలిచారు. వీరు ముగ్గురు తరుచూ కలుస్తూ తమ కష్ట సుఖాలు పంచుకుంటూ ఆదర్శ స్నేహితులుగా నిలిచారు. ఏదేమైనా బంధీ లో పరిచయంలో ఈ ముగ్గురిని ప్రాణస్నేహితులను చేయడం విశేషం. -
ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి
● సాగు విస్తీర్ణం మేరకే ఎరువులు ● కలెక్టర్ హైమావతివిద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాసవర్మతో కలిసి నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం , ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గొర్రెలకు ఇచ్చే బ్లూటాంగ్ వ్యాక్సిన్ ప్రకియను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ సెలవులో ఉన్నాడని డ్యూటీ నర్సు తెలుపడంతో జిల్లా వైద్యాధికారికి ఫోన్చేసి సెలవు మంజూరుపై ఆరా తీశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పప్పు ఉడకకపోవడంతో వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ను పరిశీలించి రైతులకు విస్తీర్ణం ప్రకార మే ఎరువులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి హరీశ్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాను ఆదర్శంగా నిలపాలి సిద్దిపేటరూరల్: జిల్లాలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్ ఫెడ్ శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగు, ఫార్మర్ రిజిస్ట్రీ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుపై ఉత్సాహం చూపుతున్న రైతులను ప్రోత్సహించడంతోపాటు మండల వ్యవసాయ అధికారులకు నిర్దేశించిన మేర సాగు జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, టీజీ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): గురుకుల విద్యార్థులకు నాణ్యమైన, బలవర్థకమైన అహారం అందించాలని, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిపూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, స్టోర్ రూమ్ గల సరుకులను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు కచ్చితంగా మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం కాలనీలోని గ్రంఽథాలయంను పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మున్సిపల్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. -
గ్రూపులుంటేనే మజా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15% కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తలతో ముందుకు సాగుతున్నామన్నారు. సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే కేటాయింపు ఉంటుందని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రాజిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ -
నకిలీ ఎరువుల కలకలం
● ఇష్టారాజ్యంగా విక్రయాలు ● పట్టించుకోని అధికారులు ● ఆందోళన చెందుతున్న రైతులుఈ ఎరువును ఎప్పుడు చూడలేదు వరినాటులో ఎరువు చల్లేందుకు డీఏపీ బస్తా కోసం ఎరువుల దుకాణానికి వెళితే అది అందుబాటులో లేదని భూమిలాబ్ 19.19.19 అనే ఎరువును అంటగట్టాడు. దానిని పొలంలో చల్లితే పని చేయలేదు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. అధికారులు స్పందించి నకిలీ ఎరువుల బెడదను అరికట్టాలి. –కిష్టారెడ్డి, రైతు, మర్రిముచ్చాల కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగు చేస్తున్న రైతులకు ఎరువుల దుకాణదారులు నకిలీ ఎరువులను అంటగడుతున్నారు. మనుగడలో లేని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువుల బస్తాలు, దంటు గుళికలు , పురుగుమందులు విక్రయిస్తూ రైతులకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు. ఇంత జరిగినా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం శాపంగా మారింది. గ్రోమోర్ 20.20.0.13, గోదావరి డీఏపీ , 14.35.14, 19.19.19, 17.17.17 ఇట్లాంటి పేరున్న కంపెనీ ఎరువులు అమ్మితే దుకాణదారులకు తక్కువ లాభాలొస్తాయి. కానీ, పంటలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఇందుకు భిన్నంగా మండలంలో ఎక్కడ కనబడని కంపెనీ పేర్లతో ఉన్న ఎరువులు అంటగడుతున్నారు. కారణం వీటిపై ఎక్కువ లాభాలు వస్తుండటంతో వాటినే విక్రయిస్తున్నారు. ఈ నాసిరకం ఎరువులు వాడిన అన్నదాతలు చేను ఎదకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నకిలీ ఎరువులు విక్రయిస్తే చర్యలు మండలంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి ఇంత వరకు రాలేదు. మా పరిశీలనలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –వెంకట్రావమ్మ, మండల వ్యవసాయ అధికారి -
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు
హుస్నాబాద్: విద్యార్థుల్లో చదవాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం శంషాబాద్ డిప్యూటీ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అయిలేని శ్రీనివాస్ రెడ్డి శనివారం గ్రంథాలయానికి పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించిన వారు తమ వద్ద ఉన్న పుస్తకాలను గ్రంథాలయానికి ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. చదువు ఉంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ వెంకట్, సత్యనారాయణ, అశోక్, రిటైర్డు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రంగనాయక సాగర్పై హెచ్చరిక బోర్డు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్పై నిఘా లేకపోవడంతో పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారని రంగనాయకా.. రక్షణ ఏది? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీ సులు శనివారం రిజర్వాయర్పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. ఎస్ఐ సైఫ్ అలీ మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం సాగర్ కట్టపై పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలపై నిఘా ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, కట్టపై బైక్ రైడింగ్ నిషేధించామని పేర్కొన్నారు. ‘భగీరథ’మరమ్మతులు ప్రారంభం వర్గల్(గజ్వేల్): ‘భగీరథ లీకై ంది..తోట చెరువైంది’ శీర్షికతో శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మండలంలోని గౌరారం వద్ద లీకేజీకి గురైన పైపులైన్ వద్ద మరమ్మతు పనులు ప్రారంభించారు. జేసీబీ యంత్రంతో తవ్వకాలు జరిపి లీకేజీని గుర్తించారు. చీకటిపడే వరకు పనులు కొనసాగించారు. ఆదివారం మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కాగా కూరగాయల తోట, పొలాల్లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అలాగే నిలిచిపోయింది. గడువు ముగిసిన మందులు ఉండొద్దు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: గడువు ముగిసిన మందులు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీ హబ్ను, సెంట్రల్ డ్రగ్ స్టోర్ను డీఎంహెచ్ఓ శనివారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన బ్లడ్ శాంపిల్స్ను పరీక్షలు నిర్వహించి ఫలితాలను అదే రోజు పంపించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి, టీహబ్ మేనేజర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో.. మహిళల నిరసన
మిరుదొడ్డిలో నిలిచిన భగీరథ తాగునీటి సరఫరామిరుదొడ్డి(దుబ్బాక): మూడు రోజులుగా మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పలు వార్డుల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని స్థానిక మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చాలా రోజులుగా అరకొరగా నీరు సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో నీటి కోసం నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
మల్లన్నసాగర్ పైపులైన్ పూర్తవడంతో సంబరాలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా జలాభిషేకాలు గజ్వేల్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ...గజ్వేల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ముందుకుసాగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గజ్వేల్కు రూ.210కోట్లతో చేపట్టిన ప్రత్యేక మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తయి మంచినీటి సరఫరా ప్రారంభమైంది. శనివారం రెండు పార్టీలు జలాభిషేకాలు నిర్వహించాయి. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై ఉన్న మిషన్ భగీరథ హెడ్వర్క్స్ వద్ద సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ తీసుకొని రూ.210కోట్లు మంజూరు చేయడం వల్లే గజ్వేల్కు మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథ ప్రత్యేక పైపులైన్ వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కృషివల్లే గజ్వేల్కు మిషన్ భగీరథ నీరు వచ్చిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. -
అసభ్యంగా మాట్లాడటంతోనే హత్య
● ఐకేపీ ఉద్యోగి కేసులో నలుగురు నిందితులు అరెస్టు ● వివరాలు వెల్లడించిన పోలీసులుములుగు(గజ్వేల్): అదృశ్యమై హత్యకు గురైన ఐకేపీ ఉద్యోగి కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం ములుగు పోలీస్స్టేషన్లో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ విజయ్కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ములుగుకు చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుళ్ల నెహ్రూ(35) గతనెల 28న అదృశ్యమైనట్టు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. నెహ్రూ, మజీద్పల్లి గ్రామానికి చెందిన గామిలిపురం మహేశ్ కలిసి చిట్ఫండ్ లావాదేవీలు నిర్వహించేవారు. మహేశ్కు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు చెందిన బంగారాన్ని వర్గల్లోని ఓ మైక్రో ఫైనాన్స్లో పెట్టి ఆ డబ్బును చిట్ఫండ్కు వినియోగించనున్నట్లు మహేశ్ జూలై 28న ఆమెతో చెప్పాడు. నిషారాణి హామీదారుగా నెహ్రూను తీసుకురావాలని చెప్పింది. దీంతో మహేశ్ ములుగు నుంచి నెహ్రూను కారులో తీసుకుని నిషారాణి ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో నిషారాణిపై నెహ్రూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మహేశ్ అతడిపై దాడిచేశాడు. అపస్మారక స్థితిలోకెళ్లిన నెహ్రూను ఒక వైర్తో గొంతునులిమి హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని నిషారాణితోపాటు ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో కారులో తీసుకువెళ్లి గాగిళ్లాపూర్ సమీపంలోని ఓ చెరువులో పడేశారు. అనంతరం మహేశ్ రూ.15 వేల చిట్ఫండ్ డబ్బును నెహ్రూ భార్యకు అందించి అతను బాగానే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. నెహ్రూ ఫోన్ను ములుగు కొండపోచమ్మ కాలువలో పడేశాడు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు గామిలిపురం మహేశ్, అతడికి సహకరించిన నిషారాణి, ఉబ్బని వినయ్, నారదాసు కొమురయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు, టీవీఎస్ ఎక్సెల్ వాహనం, మైక్రో ఫైనాన్స్లోని బంగారం రుణానికి సంబంధించిన రశీదును స్వాధీనం చేసుకున్నారు. -
మన కోసం నిలబడే వాళ్లే..
సంగారెడ్డి టౌన్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మనకోసం నిలబడే వాళ్లే నిజమైన స్నేహితులు. కష్టాలు, బాధలు, సంతోషాలను పంచుకుంటూ అందరితో కలిసిపోతూ ఉండాలి. నా చిన్న నాటి నుంచి ముగ్గురు స్నేహితులం. వారు వృత్తిరీత్యా ఇతర దేశాలో స్థిర పడినప్పటికీ సమయం దొరికినప్పుడు కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఉండాలి. ‘నేను ఉన్నాను’ అనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ విజ్ఞాన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. – సౌజన్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆనాటి స్మృతులు మధురం ప్రశాంత్నగర్(సిద్దిపేట): స్నేహితులతో కలిసి మట్టిలో ఆడిన ఆటలు.. చెట్టు కొమ్మల్లో దాగిన రోజులు నేటికీ గుర్తుకువస్తే ఎంతో సంతోషంగా ఉంటోంది. మళ్లీ ఆరోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. నాడు ఎక్కడికి వెళ్లినా ఒక జట్టుగా వెళ్లేవాళ్లం. ఒకరింటికి మరొకరం వెళ్తూ సందడి చేసే వాళ్లం. వినాయక చవితి, దసరా, దీపావళి, బోనాలు, బతుకమ్మ, హోలీ పండుగలను మిత్రులతో సంతోషంగా జరుపుకొనేది. చాలా మంది మిత్రులు నేడు ఉపాధ్యాయ వృత్తితో పాటు ఇతర వృత్తుల్లో ఉన్నారు. ఏ హోదాలో ఉన్నా కలుసుకున్నపుడు అనుభూతి ఏర్పడుతోంది. – శ్రీనివాస్రెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి బాల్య స్నేహితుడికి బాసట శివ్వంపేట(నర్సాపూర్): బాల్య స్నేహితుడు అనార్యోగంతో మృతిచెందగా తోటి స్నేహితులు మేమున్నామంటూ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. శివ్వంపేటకు చెందిన శేరిపల్లి గోపాల్ అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. ఇతనికి భార్య ఇద్దరు కుతూళ్లు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన గోపాల్.. వర్గల్లోని నవోదయ విద్యాలయంలో 1992–93లో పదో తరగతి పూర్తి చేశాడు. అప్పటి నవోదయ స్నేహితులు గోపాల్ కుటుంబాన్ని ఆదుకున్నారు. స్నేహితులందరూ రూ.3 లక్షలు పోగుచేసి గోపాల్ కుమార్తెలు చందన, అక్షయ పేరిట బ్యాంకులో డిపాజిట్ చేశారు. -
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
ఎమ్మెల్యే హరీశ్ రావుసిద్దిపేటజోన్: యోగాతో మానసిక ఒత్తిడిని దూరం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో అస్మితా యోగాసనా సిటీ లీగ్ – 2025 మహిళల యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తెచ్చిందని, కరోనా తర్వాత యోగా ప్రాముఖ్యత పెరిగిపోయిందన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఆస్పత్రుల్లో నయం చేసుకునే కంటే ముందుగానే స్వీయ రక్షణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా, వాకింగ్ లాంటి తప్పనిసరి చేయాలన్నారు. యువతులు, బాలికలు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, వైస్ చైర్మన్ కనకరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్రెడ్డి, సాయిరాం, డాక్టర్ అరవింద్, నిర్వాహకులు సతీశ్, సంధ్య, అంజయ్య, అశోక్ శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, విజయ పాల్గొన్నారు. -
నిజమైన మిత్రులు.. ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వారే అధికం
స్నేహానికి కన్న మిన్న.. లోకాన లేదురా.. అనేది ఒకప్పటి సినిమా పాట. ఇది నిజమేనంటున్నారు ఇప్పటి యువత, విద్యార్థులు, ఉద్యోగులు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ బృందం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. మొత్తం వంద మందితో ఈ సర్వే చేసింది. యువత, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారు, వృత్తి నిపుణులు.. వివిధ వర్గాలకు చెందిన వారి ఒపీనియన్లను సేకరించింది. తమ అభిప్రాయలు వెలుబుచ్చిన వారిలో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ సర్వే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కల్మషం లేనిదే నిజమైన స్నేహమని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, నిజమైన స్నేహంలో స్వార్థానికి తావులేద ని చెప్పారు. అవసరాలు తీర్చేదే స్నేహమని తక్కువ మంది తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. స్నేహం కలుషితమవుతోంది.. ప్రస్తుత రోజుల్లో ఫ్రెండ్ షిప్ కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద మందిలో 57 మంది ఇదే అబిప్రాయాన్ని చెప్పారు. ఎలాంటి కలుషిత కాలేదని 47 శాతం మంది చెప్పారు. ప్రస్తుత రోజుల్లో స్నేహితులు ఎంతో మంది ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు పరిమితంగానే ఉంటారు. మీకు నిజమైన స్నేహితులు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఇద్దరి కంటే ఎక్కువ మంది నిజమైన స్నేహితులు ఉన్నారని చెప్పిన వారే అధికంగా ఉన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది స్నేహితులున్నారని 61 మంది చెప్పగా, ఒక్కరే నిజమైన స్నేహితుడు ఉన్నాడని 39 మంది అన్నారు. మొదటగా కన్నవారే.. కన్న వారి తర్వాతే మిత్రుడికి స్థానమని ఎక్కువ మంది చెప్పారు. 67 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలిపారు. 27 శాతం మంది ఫ్రెండ్ తర్వాతే అమ్మానాన్న అని చెప్పిన వారు కూడా ఉన్నారు. నాన్న, అమ్మ, ఫ్రెండ్ అని చెప్పిన వారు 16 మంది ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి, సంగారెడ్డి జోన్/మెదక్ జోన్/సిద్దిపేట3) మీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు?4) మీ ఫ్రెండ్కు మీరు ఇచ్చే స్థానం?2) ఫ్రెండ్షిప్ కూడా కలుషితం అయ్యిందా?నాన్న, అమ్మ, ఫ్రెండ్అమ్మ, నాన్న, ఫ్రెండ్ అని చెప్పిన వారుఒకరులేదు394357అవును61ఫ్రెండ్, అమ్మ, నాన్నఇద్దరికి మించిఉమ్మడి జిల్లాలో సర్వే వివరాలు..1) ఫ్రెండ్ షిప్ అంటే మీ దృష్టిలో..7426 కన్నవారి తర్వాతే మిత్రుడు.. ప్రస్తుత స్నేహ బంధాలు కలుషితం అవుతున్నాయి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సాక్షి సర్వే ఆసక్తి కరమైన అంశాలు వెలుగులోకి..అవసరాలు తీర్చేది అని..కల్మషం లేనిది అని చెప్పిన వారు -
100 అడుగుల దూరం
గజ్వేల్: మున్సిపాలిటీలను సమగ్ర పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది. తాజాగా శనివారం నాటికి ఈ కార్యక్రమం 62వ రోజుకు చేరుకుంది. పారిశుద్ధ్యం మొదలుకొని ఆస్తి పన్నుల అసెస్మెంట్, భువన్సర్వే, ట్రేడ్ లైసెన్స్లు తదితర అంశాలపై కార్యాచరణ కొనసాగుతున్నది. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఈ కార్యక్రమాలను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. కానీ సిబ్బంది కొరత, ఇతర సమస్యలు కార్యక్రమం లక్ష్యానికి అవరోధంగా మారుతున్నాయి. జిల్లాలో సిద్దిపేట మినహా గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పట్టణాలు 2012లో మేజర్ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా చేశారు. చేర్యాలను ఆరేళ్లక్రితం మున్సిపాలిటీగా మార్చారు. అప్గ్రేడ్ అయిన తర్వాత ఆయా పట్టణాల్లో మెరుగైన పాలన అందుతుందని ప్రజలు భావించారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. పారిశుద్ధ్యం మొదలుకొని అన్ని అంశాల్లోనూ సమస్యలున్నా యి. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమా లు సక్రమంగా సాగటం లేదు. అంతేకాదు.. ఇంటి పన్నుల అసెస్మెంట్, ఇళ్ల అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపు, నల్లాల ఆన్లైన్, ట్రేడ్ లైసెన్స్లు, భువన్ సర్వే తదితర అంశాల్లో మెరుగైన సేవలు అందటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘100 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం కొనసాగుతున్నది. సెప్టెంబర్ 10 వరకు.. తాజాగా శనివారం నాటికి వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ 62వ రోజుకు చేరుకున్నది. సెప్టెంబర్ 10వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో మున్సిపల్ ఉన్నతాధికారులు రోజువారీగా విశ్లేషిస్తున్నారు. రోజువారీగా చేపట్టే అంశాలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల పనితీరును మదింపు చేస్తున్నారు. వెనుకబడుతున్న వాటికి తగు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ఈ కార్యక్రమం ఫలితాలు కనిపించడం లేదు. సాధారణ స్థాయిలోనే కార్యాచరణ కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, ఇతర సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ప్రహసనంగా వంద రోజుల ప్రణాళిక సిబ్బంది కొరతతో ఇబ్బందులు జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితిపై పరిశీలన -
ఆప్తులున్నవారే అసలైన అదృష్టవంతులు
మెదక్ మున్సిపాలిటీ: వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా.. ఎన్ని ఆస్తులున్నా.. ఆప్తులను సంపాదించుకున్న వారే అదృష్టవంతులు. ఎవరి సమక్షంలో మన బాధలు సగం అవుతాయో.. ఎవరి కారణంగా మన ఆనందం రెట్టింపు అవుతుందో వారే అసలైన ఆప్త మిత్రులు. మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడుతున్న ఈ ఆధునిక యుగంలో స్వచ్ఛమైన స్నేహం కోసం తాపత్రయపడే వాళ్లెందరో ఉన్నారు. నేను డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా.. రోజూ స్నేహితులతో పది నిమిషాలు మాట్లాడతా. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ కలుస్తాను. వారితో మాట్లాడి, ఊరు విషయాలు, కుటుంబ విషయాలు, ఇతర విషయాల గురించి చర్చించుకుంటాం. స్నేహితులతో కలిసి మాట్లాడటం వల్ల ఎంతో రిలీఫ్ ఉంటుంది. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ, మెదక్ జిల్లా -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మలేరియా యూనిట్, బస్తీ దవాఖానను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సరిత, డాక్టర్ దివ్యశ్రీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచండినంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ అన్నారు. రాజగోపాల్పేట ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసి ల్యాబ్, మెడికల్ స్టోర్, ఓపీ, సిబ్బంది వివరాలు సేకరించి రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించాలి డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ -
పట్టు పెంచుదాం..
పట్టు ఉత్పత్తిలో జిల్లాకు మరోసారి గుర్తింపు వచ్చింది. 2030 నాటికి ప్రపంచంలోనే మన దేశం నంబర్ వన్ స్థానానికి చేరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘నా పట్టు... నా గర్వం’ (మేరా రేషమ్.. మేరా అభిమాన్) అనే వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు దేశ వ్యాప్తంగా 128 జిల్లాలను ఎంపిక చేయగా అందులో సిద్దిపేట జిల్లా ఉండటం విశేషం. – సాక్షి, సిద్దిపేట పట్టు ఉత్పత్తిలో దేశం రెండో స్థానంలో ఉన్నా.. వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లాలో పట్టు అధికంగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో బనారస్, కశ్మీరీ వస్త్రాలు, బలుచారి కంజీవరం, మైసూర్, గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి లాంటి చీరలకు వాడేది మన జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టుదారమే. మన పట్టు.. నాణ్యమైంది రాష్ట్రం భౌగోళికంగా సమశీతోష్ణ స్థితి ప్రాంతంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు పట్టు ఉత్పత్తికి అనుకూలం. 2019–20కి గాను దేశంలోనే అత్యంత నాణ్యమైన బైవోల్టన్ పట్టు ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణకు కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది. మొదట పట్టు పురుగుల పెంపకం ఐదు దశలుగా ఉండేవి. వీటిని మొత్తం రైతులే నిర్వహించేవారు. ఇప్పుడు మొదటి రెండు దశలను చాకీ కేంద్రం పెంచుతోంది. మరో మూడు దశలు రైతులే పెంచుతున్నారు. దీని వలన పంట నాణ్యత పెరగడమే కాకుండా పంటకాలం కూడా తగ్గింది. గతంలో క్రాస్ బ్రీడ్ రకం పెంచేవారు. కానీ ఇప్పుడు జన్యు మార్పిడి చెందిన బైవోల్టన్ రకం వచ్చింది. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇవే కాకుండా మల్బరీ సాగు రకాలు కూడా జన్యు మార్పిడి ఆధునికతతో అత్యధిక ఆకుల దిగుబడి వస్తుంది. దీంతో గతంతో పోలిస్తే పట్టుసాగులో చాలా మార్పులు వచ్చి లాభదాయకంగా మారింది. ప్రత్యేక యాప్లో వివరాల సేకరణ జూలైలో వివిధ కార్యక్రమాలు చేపట్టగా, ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో బేస్లైన్ సర్వేలో రైతులను కలిసి వివరాలను సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టు పరిశ్రమ శాఖకు చెందిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. రైతులు ఎలాంటి సాయం కోరుతున్నారు? మార్కెట్ ధరలు, సాగులో ఇంకా టెక్నాలజీ కావాలంటున్నారా? అనేది తెలుసుకుంటున్నారు. ఈ వివరాలతో దేశ వ్యాప్తంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. కొత్త రైతులు పట్టు ఉత్పత్తి వైపు మళ్లించేందుకు అవగాహన కల్పించనున్నారు. ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ మల్బరీ సాగు పెంచేందుకు కృషి చేయనున్నారు. త్వరలో అవగాహన సదస్సులు కేంద్ర ప్రభుత్వం ‘నా పట్టు.... నా గర్వం’ అనే నినాదంతో పట్టు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. త్వరలో జిల్లాలో అవగాహన సదస్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పట్టు ఉత్పత్తితో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. – వినోద్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త,ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రందేశంలోనే కీర్తి సాధిద్దాం ‘నా పట్టు.. నా గర్వం’ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం దేశ వ్యాప్తంగా సిద్దిపేటకు ప్రత్యేక స్థానం సెప్టెంబర్ వరకు కొనసాగనున్నకార్యక్రమాలు జిల్లాలో 1,500 ఎకరాల్లోమల్బరీ సాగు లక్ష్యంజిల్లాలో వంద టన్నుల ఉత్పత్తి రాష్ట్రంలో 17వేల ఎకరాల్లో సాగు అవుతుండగా అధికంగా మన జిల్లాలోనే సాగవుతోంది. జిల్లాలో 1,216 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తుండగా 100 టన్నుల పట్టుల ఉత్పత్తి అవుతోంది. చిన్నకోడూరు, బెజ్జంకి, కొండపాక, తొగుట, సిద్దిపేట అర్బన్, రూరల్, కొమురవెల్లి హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, మద్దూరు, చేర్యాల, జగదేవ్పూర్, గజ్వేల్, మర్కూక్, మిరుదొడ్డి, దౌల్తాబాద్, దుబ్బాక, నారాయణరావుపేట్ మండలాల్లో రైతులు పట్టు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 1,216 ఎకరాల నుంచి 1,500లకు పెంచేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సిద్దిపేటకు ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వినోద్ కుమార్ను ఇన్చార్జీలుగా నియమించారు. -
‘భగీరథ’ లీకై ంది.. తోట చెరువైంది
● రైతులకు తీరని నష్టం ● గౌరారం వద్ద ఘటన..వర్గల్(గజ్వేల్): భగీరథ పైపులైన్ లీకై ంది. నీరు వరదలా ప్రవహించింది. పంట చేన్లు చెరువులా మారింది. వర్గల్ మండలం గౌరారం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ ఘటనతో పొలంలో మోకాలు లోతు నీరు నిలిచి కాత దశలో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి గౌరారం రాజీవ్ రహదారి వ్యవసాయ క్షేత్రాల సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ అయింది. నీరంతా పక్కనే ఉన్న కూరగాయ పందిరి తోటల్లోకి, పంట పొలాల్లోకి చేరింది. రైతులు వెళ్లి చూడగా పంట చేన్లలో మోకాలు లోతు నీరు ఉన్నట్లు గురించారు. పొలం లీజుకు తీసుకుని రూ.లక్షకు పైగా పెట్టుబడితో రెండెకరాల పొట్లకాయ తోటను, 10 గుంటల్లో మొక్కజొన్న స్వీట్కార్న్ సాగుచేసినట్లు బాధిత రైతు చిందం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాయ దిగుబడి మొదలైన తరుణంలో ఊహించని వరద నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు పంటపొలాలు సైతం నీట మునగడంతో పలువురికి నష్టం జరిగింది. కాగా మల్లన్న సాగర్ నీటి మళ్లింపు నేపథ్యంలో పైపులైన్ లీకేజీ ఏర్పడిందని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని గజ్వేల్ మిషన్ భగీరథ డీఈ రాజు పేర్కొన్నారు. -
విధులు నిర్వర్తించని డాక్టర్లపై చర్యలు
● సమయపాలన తప్పనిసరి ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: విధులు నిర్వర్తించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామ కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా, మండల, వైద్యారోగ్య శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయానికి ఆస్పత్రికి రావాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాలు మరింతగా మెరుగు పరచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా కేసులు వస్తే ఆ ప్రాంతం చుట్టూ ఫాగింగ్ చేయాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే వివరాలను సేకరించాలన్నారు. ఆస్పత్రుల్లో సీసీకెమెరా, బయోమెట్రిక్ అమలు చేసేలా చూడాలని డీఎంహెచ్ఓకు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధనరాజ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ భారతి పక్కాగా చేపట్టాలి కొండపాక(గజ్వేల్): భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతిని పక్కాగా చేపట్టాలని, పారదర్శకత లోపించవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాకలోని సమీకృత మండల సముదాయ కార్యాలయ సముదాయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయాల పనితీరును పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలుపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల్లో ప్రత్యేక దృష్టి సారించి వేగిరం చేయాలన్నారు. బెజ్జంకిలో ఆకస్మిక తనిఖీలు బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి, గుండారం గ్రామాలలో కలెక్టర్ హైమావతి శుక్రవారం ఆకస్మిక పర్యటించారు. బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా స్టాఫ్ నర్స్తో పాటు అటెండర్ మాత్రమే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో రాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంహెచ్ఓను ఆదేశించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేసినా, పరిశుభ్రంగా లేకపోయినా సహించేది లేదని హెచ్చరించారు. ఆగ్రోస్ కేంద్రంలో తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుండారంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం: సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గత నెలలో 94 మంది చిన్నారులను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ను పోలీసు అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న 27 మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. చదువుతోనే గుర్తింపు ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని, చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, కళాశాల పరిసరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నిర్వహిస్తున్న తరగతులపై, కళాశాలలో వసతుల గురించి, ఎంసెట్, నీట్ ఆన్లైన్ క్లాసులు జరుగుతన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితకు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి షోకాజ్ నోటీసు అందించారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో దేవకీదేవి ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి అనితకు షోకాజ్ జారీ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె, భూంపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ జానకి రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు ర్యాకం మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజీ పాల్గొన్నారు. రన్నింగ్ పోటీలకు గజ్వేల్ విద్యార్థి ఎంపిక గజ్వేల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి జ్ఞానేశ్వర్ రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3న ఈ పోటీలు హనుమకొండలో జరగనున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబరిచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. శుక్రవారం స్థానిక కళాశాలలో ప్రిన్సిపాల్ నిఖత్, స్పోర్ట్స్ ఇన్చార్జి డాక్టర్ మహేందర్రెడ్డిలు జ్ఞానేశ్వర్కు అభినందనలు తెలిపారు. -
పూర్తయిన భగీరథ పైప్లైన్ పనులు
గజ్వేల్: మల్లన్నసాగర్ నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన సంబంధిత అధికార యంత్రాంగం పనులను పూర్తి చేయించింది. గురువారం ట్రయల్ రన్ నిర్వహించి నీటి సరఫరా ను ప్రారంభించారు. పైప్లైన్లు కొత్తవి కావడం వల్ల మంచినీటిని కొద్దిరోజుల వరకు కాచి వడపోసి వాడుకోవాలని మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి తెలిపారు. పూర్త యిన పనులను పర్యవేక్షించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విష యాన్ని తెలిపారు. పనులు పూర్తి కావడంతో ప్రజ్ఞాపూర్ వద్ద హెచ్ఎండబ్ల్యూఎస్(హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్) మిషన్ భగీరథ ట్యాపింగ్ పాయింట్ను మూసేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు స్వయం ప్రతిపత్తి లభించినట్లయింది. సరిపడా నీటి సరఫరా జరగనుంది. -
పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం
● డిమాండ్లు పరిష్కరించాలి ● టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మార్గం జగదీశ్వర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకుడు మధుసూదన్రెడ్డి పదవీ వీరమణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని 56 డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తే 16 డిమాండ్లను పరిష్కరించడానికి ఆగస్టు 15 వరకు గడువు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కారించకపోతే ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మరో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. లెక్చరర్ల సర్వీసును 65 ఏళ్లకు పెంచడానికి సీఎం సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆచరణలోకి వస్తుందని చెప్పారు. ఉద్యోగులు సైతం చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో పుల్లయ్య, ప్రిన్సిపాల్ శ్రీదేవి, అభినవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
పట్టు పరిశ్రమ శాఖ జేడీ లత చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టును విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా పట్టు ఉత్పత్తి పెరగాలని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మా పట్టు మా అభిమాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్లాపూర్లో పట్టు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ స్థాయిలో రైతులు పట్టు సాగు చేయడానికి ముందుకు రావాలన్నారు. పట్టు సాగుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోట సాగు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేందర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి రేణు శర్మ, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కొనలేం.. కొట్టలేం
బెంబేలెత్తిస్తున్న టెంకాయ ధరలు● రూ.45 పలుకుతున్న కొబ్బరికాయ ● పండుగల నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న ధరలు ● ఏపీలో ఉత్పత్తి తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు ● నారికేళం బాటలోనే కొబ్బరి బోండాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పవిత్ర కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పూజ కార్యక్రమాలలో కొబ్బరి కాయలను విరివిగా వినియోగిస్తారు. ఎన్నో పవిత్రమైన విశిష్టతలు కల్గిన టెంకాయ ధర రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం.. ప్రతి ఇంటిలో, ఆలయాలలోని పూజ కార్యక్రమాలలో కొబ్బరికాయల వినియోగం మరింత పెరిగింది. గతేడాది ఇదే సమయంలో టెంకాయ ధర రూ. 30 వరకు ఉండగా, నేడు రూ.45 వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరికాయలు వస్తుంటాయి. జిల్లాలో యాభై వరకు కొబ్బరికాయల హోల్సెల్ విక్రయాల దుకాణాలు ఉన్నాయి. రోజూ లారీలతో పాటు ఇతర చిన్న వాహనాలలో కొబ్బరి కాయలు వస్తుంటాయి. ఈ హోల్సెల్ దుకాణాలను అధికంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి తగ్గడమే కారణం వాతావరణం, అక్కడి పంటల సాగులో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఏపీలో కొబ్బరికాయల ఉత్పతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగమతి చేసుకుంటున్నారు. సరుకు వాహనాల కిరాయి, హమాలీల కూలీలు కలుపుకుని కొబ్బరికాయల విక్రయాల ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. కొబ్బరి బోండాలు సైతం.. కొబ్బరి కాయల బాటలోనే కొబ్బరి బోండాల ధరలు పరుగులు తీస్తున్నాయి. కొబ్బరిబోండాలు ధరలు రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. అదేవిధంగా కొబ్బరి నీరు లీటరుకు రూ.150 నుంచి ఆ పైన ధర పలుకుతుంది. కొబ్బరి నీరు రోగులతో పాటుగా, వృద్ధులు, చిన్నారులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది. ధరలు బాగా పెరిగాయి కొబ్బరి కాయల ధరలు బాగా పెరిగాయి. ఒక్కొక్కటి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. శ్రావణమాసం పూర్తయ్యే వరకు రోజు పూజలలో కొబ్బరికాయాల వినియోగం అధికంగా ఉంటాయి. రానున్న రోజుల్లో పెద్ద పండుగలు ఉన్నాయి. ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. – మహిళ, సిద్దిపేట ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. కొబ్బరి కాయల ఉత్పత్తి గతంలో కంటే బాగా తగ్గింది. ముఖ్యంగా ఏపీ నుంచి దిగుమతి అవుతాయి. కానీ అక్కడ వివిధ కారణాలతో ఉత్పత్తి తగ్గడంతో తమిళనాడు, కేరళ నుంచి కొబ్బరికాయలను దిగుమతి చేసుకుంటున్నాం. అందువలన రవాణా, కూలీల చార్జీలు పెరగడంతో ధరలు పెరిగాయి. –శ్రీనివాస్, కొబ్బరికాయల హోల్సేల్ వ్యాపారి, సిద్దిపేట -
డైట్ మెనూ తప్పనిసరి
● పాటించకుంటే కఠిన చర్యలు ● కలెక్టర్ హైమావతి ● పుల్లూరు జెడ్పీ స్కూల్ సందర్శన సిద్దిపేటరూరల్: ప్రభుత్వ బడుల్లో డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డైట్ ప్రకారం గురువారం బగారా అన్నం, మిక్స్డ్ వెజిటేబుల్ కూరను వండాల్సి ఉండగా సాధారణ అన్నం మిల్మేకర్ కూర, చింతపులుపు చారు వండడాన్ని గమనించారు. 95 మంది విద్యార్థులకు ఏడు కిలోల కూరగాయలు బదులు, తక్కువ శాతం కూరగాయలతో వండటంతో కలెక్టర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని ఇన్చార్జి హెచ్ఎంను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు చిన్నకోడూరు(సిద్దిపేట): వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదని, వైద్య సిబ్బంది అంకిత భావంతో సేవలందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం చిన్నకోడూరు పీహెచ్సీని, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ల్యాబ్లో ఎక్కువగా ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాల ప్రగతిపై ఎంపీడీఓతో సమీక్ష నిర్వహించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఎరువుల సరఫరా రికార్డులు పరిశీలించారు. సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ సదానందం, ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ సలీమ్, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వాహనదారుల భద్రత ముఖ్యం సిద్దిపేటరూరల్: వాహనదారుల భద్రత ఎంతో ముఖ్యమని, ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత కమిటీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించి, నివా రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కావాల్సిన వాటికి ఎస్టిమేట్ వేసి డాక్యుమెంట్లను తన వద్దకు తీసుకురావాలని ఆర్అండ్బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనవసర మలుపులను మూసివేయాలని, సురక్షిత రవాణాకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు, అర్అండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విధులకు ఎగనామం
పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరు ●● ముఖ హాజరుతో మాయాజాలం ● విధులకు రాకుండానే హాజరైనట్లు నమోదు ● అడ్డంగా దొరికిన 70 మంది ● నోటీసులు జారీచేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు సాక్షి, సిద్దిపేట: కొందరు పంచాయతీ కార్యదర్శులు ముఖహాజరుతో మాయాజాలం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. లొకేషన్లో ఫొటో తీసినట్లు అటెండెన్స్ వేసుకుంటూ గ్రామ పంచాయతీకి వెళ్లకుండానే ఊర్లు.. ఫంక్షన్లకు వెళ్తున్నారు. ఇలా ఫేక్ అటెండెన్స్ వేస్తూ కొందరు అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, గ్రామాల్లో సేవలు అందించేందుకు, డుమ్మాలకు చెక్ పెట్టేందుకు పంచాయతీ శాఖ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రభుత్వాన్నే తప్పుదారి పట్టించి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేశారు. గురువారం వారిని గుర్తించారు. దీంతో వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా లబ్ధిదారులకు అందాలంటే కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టవద్దు. ఉద్యోగులు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వారి నివాసాలు పట్టణాల్లో ఉండటంతో సమయపాలన పాటించడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. విధులకు హాజరుకావడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఫేస్ రికగ్నిషన్ యాప్ను పంచాయతీ శాఖ తీసుకవచ్చింది. 8 నెలలుగా అమలు చేస్తున్నారు. కార్యదర్శులు విధులు నిర్వర్తించే గ్రామంలో లొకేషన్కు వెళ్లి ఫోటో తీసి పంచాయతీ యాప్లో నమోదు చేసి అటెండెన్స్ వేసుకోవాలి. ఫేక్ అటెండెన్స్ జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలుండగా 470 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురు పంచాయతీ కార్యదర్శులకు మరో గ్రామ పంచాయతీ సైతం ఇన్చార్జి కేటాయించారు. వీరు ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు గ్రామ పంచాయతీకి చేరుకుని ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ను ఫొన్లో వేసుకోవాలి. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టి.. గ్రామ పంచాయతీ సిబ్బందికి యాప్ లాగిన్ను ఇచ్చి ఫొటోతో.. ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేశారు. 8 నెలలుగా పలువురు ఇదే విధంగా హజరు వేసుకుంటూ డుమ్మా కొడుతున్నారు. బుధవారం నుంచి డీపీఓలకు ప్రత్యేక లాగిన్ను ఇచ్చారు. దీంతో యాప్లో అప్లోడ్ చేస్తున్న ఫొటో వ్యక్తిదేనా.. నేరుగా దిగి అప్లోడ్ చేశారా.. ఫొటోను ఫొటో తీసి అప్లోడ్ చేశారా? అని పరిశీలించాలని డీపీఓలకు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా డీపీఓ నేతృత్వంలో పరిశీలించగా ఫేక్ అటెండెన్స్ వేస్తురని తేటతెల్లమైంది. 70 మంది పంచాయతీ కార్యదర్శులను గుర్తించారు. ఆ పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ ఆమోదంతో నోటీసులను గురువారం రాత్రి డీపీఓ జారీ చేశారు. నోటీసులు జారీ చేస్తున్నాం విధులకు హాజరు కాకుండా నకిలీ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేసి 70 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను గుర్తించాం. వారికి కలెక్టర్ అనుమతితో నోటీసులు జారీ చేస్తున్నాం. ఉన్నత అధికారుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. –దేవకి దేవి, డీపీఓ -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటరూరల్: ప్రస్తుతం వానాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని పుల్లూరు, నారాయణరావుపేట, చింతమడక గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పకుండా సమయ పాలన పాటించి అంకిత భావంతో సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు బాపురెడ్డి, వినోద్, భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఛీ.. ఇదేం తీరు
రోడ్లపైనే మాంసం విక్రయాలుఅధికారుల చర్యలేవి మాంసాన్ని రోడ్లపై విక్రయిస్తున్నా.. అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.50 లక్షల నిధులతో నిర్మించిన షట్టర్లను ఖాళీగా ఉంచి.. రోడ్లపై మాంసం విక్రయించడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని షట్టర్లలోనే మాంసం విక్రయాలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.దుబ్బాకటౌన్: పట్టణంలో రోడ్లపైనే మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసి రోడ్లంతా చిత్తడిగా మారినా.. పైగా కుక్కలు మలమూత్రాలు విసర్జించిన ప్రాంతాల్లోనే విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాన్ వెజ్ మార్కెట్ నిర్మించి, వివిధ హంగులతో తీర్చి దిద్దినా మాంసం విక్రయదారుల తీరు మారడం లేదు. అసలే వానాకాలం.. ఆపై సీజనల్ వ్యాధులతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు రోడ్లపైనే మాంసం విక్రయిస్తుండటంతో జంకుతున్నారు. పట్టణంలో నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులతో 10 షట్టర్లను నిర్మించి విక్రయదారులకు కేటాయించారు. కానీ విక్రయదారులు రోడ్డుపైనే విక్రయిస్తున్నారు. అన్ని వసతులతో షట్టర్లు ఉన్నా రోడ్లపైనే విక్రయించడం చర్చనీయంశంగా మారింది. కుక్కల వీరవిహారం రోడ్లపై మాంసం విక్రయిస్తుండటంతో కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. వ్యర్థాలు తినడానికి పోటీ పడుతున్నాయి. అక్కడే మలమూత్రాలు విసర్జి స్తున్నాయి. అదే ప్రాంతంలో మాంసం అమ్మడంతో మాంసాహార ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తున్నా.. మాంసం విక్రయించడం చూస్తుంటే వారు వ్యవహరించే తీరు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా కనిపిస్తోంది. కుక్కలు మలమూత్రాలు విసర్జించిన ప్రాంతాల్లో అమ్మకాలు మార్కెట్ ఉన్నా బయటే విక్రయాలు మారని విక్రయదారుల తీరు సీజనల్ వ్యాధులతో పొంచి ఉన్న ముప్పు ప్రజల ప్రాణాలతో చెలగాటం రోడ్లపై, అపరిశుభ్రమైన పరిసరాలలో మాంసం విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. షట్టర్లలో దుకాణాలను నడపడానికి ఏమైనా ఇబ్బందులుంటే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలి. కానీ ఎక్కడపడితే అక్కడ మాంసం విక్రయించడం తగదు. – మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక విక్రయాలు చేస్తే చర్యలు బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై మాంసం విక్రయాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. మొదటి హెచ్చరికగా నోటీసులు పంపిస్తాం. తీరు మారకుంటే చర్యలు తప్పవు. – రమేశ్కుమార్ మున్సిపల్ కమిషనర్ -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● అధికారులకు కలెక్టర్ హైమావతి హెచ్చరిక ● లక్ష్మీనగర్, మిరుదొడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై ఏదీ? మిరుదొడ్డి(దుబ్బాక): విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లక్ష్మీనగర్లో, మిరుదొడ్డిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శరవేగంగా నిర్మాణాలను చేపట్టాని లబ్ధిదారులకు సూచించారు. త్వరగా పూర్తి చేసిన ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా నిధులు జమ అవుతాయని తెలిపారు. అనంతరం మిరుదొడ్డిలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య పరీక్షలను, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో ధ్వంసమైన గ్రౌండ్ ఫ్లోర్ను బాగు చేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి పీఏసీఎస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాగు విస్తీర్ణం మేరకు రైతులకు యూరియా పంపిణీ చేయాలన్నారు. ఎరువు లను అక్రమంగా విక్రయించినా, యూరియా కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళను సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ లింగాల వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వేడి చేసిన నీటినే తాగాలన్నారు. అనంతరం అదే గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. కుకునూరుపల్లిలో ఆకస్మిక తనిఖీ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24 గంటల వైద్య సేవలందించే ఆస్పత్రిలో రాత్రి వేళ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఆస్పత్రి ఉందని 24 గంటల పాటు వైద్యం అందేలా చూసుకోవాలన్నారు. సీజన్ వ్యాదులు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.దుబ్బాక: లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరధిలోని దుంపలపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారించడమేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. లిక్కర్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారే తప్ప పాఠశాలలను పట్టించుకోవడంలేదని అన్నారు. పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. గతంలో దుబ్బాక మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద 20 కోట్లు మంజూరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ‘కూడవెల్లి’ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాదుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిపై బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
జానపద కళలను పరిరక్షిద్దాం
కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): నానాటికి కనుమరుగవుతున్న జానపద కళారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జానపద వృత్తి కాళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. వండర్ బుక్ఆఫ్ రిక్డార్డులో స్థానం దక్కించుకున్న మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని సీతారామచంద్ర స్వామి అలయ భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ చైర్మన్ తోట కమలాకర్రెడ్డి నేతృత్వంలో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఆధ్యాత్మిక భజన మహోత్సవం నిర్వహించిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కిందన్నారు. అందులో మిరుదొడ్డికి చెందిన సీతారామాంజనేయ భజన మండలి కళాకారులు 30 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ళ మల్లేశం, బీజేపీ జిల్లా నాయకుడు కాన్గంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, నాయకులు సూకూరి లింగం, మొగుళ్ల ఐలయ్య, కాస కిష్టయ్య, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక కేజీబీవీలో ఇంటర్మీడియెట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఫీమేల్) గ్రూపు విద్యార్థినులకు నర్సింగ్ సబ్జెక్టులు బోధించుటకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన గెస్టు ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మహిళలు ఈ నెల 31 నుంచి, ఆగస్టు 2 వరకు మిరుదొడ్డిలోని కేజీబీవీలో దరఖాస్తులను అందించాలని కోరారు. హిందీ అతిథి అధ్యాపక పోస్టుకు.. దుబ్బాకటౌన్: పట్టణంలోని కస్తూర్బాలో హిందీ బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి స్వాతి బుధవారం తెలిపారు. హెచ్పీటీ అర్హత ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేతనం రూ.18వేలు ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఆగస్టు 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డెమో తరగతుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. నేడు డయల్ యువర్ డీఎం గజ్వేల్రూరల్: జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) డిపో పరిధి లోని ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డయల్ యువర్ డీఎం దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తమ సమస్యలను 99592 26270 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘గ్రంథాలయ’ బడ్జెట్ ఆమోదం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా గ్రంఽఽథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్మన్ లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఆమోదించారు. గ్రామ పంచాయతీలకు గ్రామ గ్రంథాలయాలు చెల్లించాల్సిన సెస్ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని జిల్లా పంచాయతీ అధికారి దేవికాదేవి తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రవికుమార్, లైబ్రరీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కలపండిబెజ్జంకి(సిద్దిపేట): మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని స్థానిక నాయకులు కోరారు. ఈమేరకు మంత్రి వివేక్ను బుధవారం నగరంలోని తన నివాసంలో కరీంనగర్ జిల్లా పోరాట సమితి బెజ్జంకి నాయకులు మానాల రవి, మైల ప్రభాకర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయం మేరకు గతంలో సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని వారు వివరించారు. జిల్లాకు మంచిపేరు తేవాలి సిద్దిపేటజోన్: ఇదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య సూచించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సెలెక్షన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అథ్లెటిక్స్ ద్వారా మంచి భవిష్యత్తు ఉందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. వివిధ అంశాల్లో 60 మంది బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకట్ స్వామి, ప్రతినిధులు రామేశ్వర్రెడ్డి, భిక్షపతి, అశోక్, ఉప్పలయ్య, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హుస్నాబాద్: బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులు, వృత్తులు, అమ్మకాల ప్రదర్శనను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి తదితర లోన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు పొందారన్నారు. ఈ ఏడాది పట్టణంలో 503 సంఘాలకు గాను 23 సంఘాలకు రూ.2 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ప్రదర్శనలో తినుబండారాలు, స్వీట్లు, కప్స్, ప్లేట్స్, కూరగాయ లు, గాజులు, డ్రెస్ మెటీరియల్ ఐటమ్స్, తదితర ఉత్పత్తులను ప్రదర్శించారన్నారు. రుణాలను వ్యక్తిగత అవసరాలకు కాకుండా వ్యాపారాలకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎంసీ సంతోషిమాత, మున్సిపల్ మేనేజర్ సంపత్, ఆర్పీలు పాల్గొన్నారు. -
పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలి
● కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ● జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం గజ్వేల్: జిల్లాలో కాంగ్రెస్ పటిష్టతపై నాయకులు దృష్టి పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానని వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సారెడ్డితోపాటు టీపీసీసీ నేతలు పాల్గొన్నారు. -
వైభవం
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025నాగ పంచమి ఆలయాల వద్ద భక్తుల సందడి జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల ఆవరణలోని పుట్టల్లో పాలు పోశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాగదేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోటిపడగల సంతాన నాగదేవత, ఉమాపార్థీఽశ్వర కోటిలింగాల, తదితర ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) న్యూస్రీల్ -
ఎకరాకు ఒకటే బస్తా
● కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు ● ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు ● జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి గజ్వేల్: కొరత నేపథ్యంలో యూరియా పంపిణీ తీరు మారింది. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు ఆధారంగా ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇది కూడా స్టాకు తక్కువగా ఉంటే నాలుగైదు ఎకరాల భూమి రైతుకు కూడా ఒకటి, రెండు బస్తాలను ఇచ్చి పంపుతున్నారు. జిల్లాలోని అన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొనగా..యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరుతున్నారు. జిల్లాలో వరి సాగు క్రమంగా ఊపందుకుంటోంది. వానాకాలం సీజన్కు సంబంధించి 5.60లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 3లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. మరోవైపు పంటలు సాగు పెరిగే కొద్దీ యూరియా వాడకం పెరుగుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్ మొత్తానికి 35,144 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. 10వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా వచ్చిందని వ్యవసాయశాఖ చెబుతోంది. నిజానికి గతంలో వానాకాలం సీజన్ అవసరాలకు యూరియా 80శాతంవరకు ముందుగానే స్టాకు వచ్చేది. జూలై చివరివారం, ఆగస్టు నెల వరకు పూర్తిస్థాయి నిల్వలు అందుబాటులో ఉండేవి. వాడకాన్ని తగ్గించడంపై దృష్టి రైతులు ఎకరా వరికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడుతారు. ఇలా పంట పూర్తయ్యేంతవరకు 6నుంచి 8బస్తాలను వాడతారు. కానీ ఎకరాకు ఒక దఫాలో ఒకే బస్తా సరిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంట పూర్తయ్యేంతవరకు 2 బస్తాలు వేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అన్ని చోట్ల క్యూలైన్లు యూరియా పంపిణీ సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్నిచోట్ల క్యూలైన్లు కనిపించాయి. ఎకరాకు ఒకటే బస్తా పంపిణీ జరిగింది. చాలా చోట్ల నాలుగైదు ఎకరాలున్న రైతులకూ రెండు, మూడు కంటే ఎక్కువ బస్తాలు దొరకలేదు. గజ్వేల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులతో కలిసి బీఆర్ఎస్ నియోజకవర్గఇన్చార్జి నిరసన తెలిపారు. అధికంగా వాడితే అనర్థమే యూరియా కొరత లేదని వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ మోతాదుకు మించి వాడటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. -
సబ్ కోర్టు ఏర్పాటుకు ముందడుగు
హుస్నాబాద్: పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. గత నెలలో న్యాయ కార్యదర్శి ప్రభుత్వ తరపున హైకోర్టుకు లేఖ రాసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ చైర్మన్ పొన్నం అశోక్ మంగళవారం హుస్నాబాద్ బార్ అసోసియేషన్కు సమాచారం అందించారు. చిరకాల కల అయిన సబ్ కోర్టు ఏర్పాటుకు బార్ అసోసియేషన్ సభ్యులు సమష్టి కృషి చేశారు. ఈ విషయంలో మంత్రి పొన్నం చొరవ చూపడంపై బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరు గజ్వేల్: పట్టణానికి స్పెషల్ జ్యుడీషియల్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టు మంజూరయ్యింది. కోర్టును మంజూరు చేయాలంటూ స్థానిక బార్ అసోసియేషన్ కొంత కాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం నగరంలో న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పండరి, ఏజీపీ కిరణ్సాగర్రావు, న్యాయవాదులు పార్థసారధిరాజు తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. చట్టాలు అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్ బెజ్జంకి(సిద్దిపేట): చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా వాటిని అమలు చేసినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బెజ్జంకిలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత చట్టంపైన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు లబ్ధి చేకూరేలా చట్టాలు, బాధ్యతలు వివరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహరం అందించాలన్నారు. రేషన్ అర్హులందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు సమకూర్చుకునేందుకు తన వంతు సహాయంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధనరాజ్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంతరెడ్డి, ఫుడ్ సెక్యురిటీ అధికారి జయరాం పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి పీఆర్టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్రెడ్డి హుస్నాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు ఆగస్టు 15లోగా పరిష్కరించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రతినిధి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయకుంటే సెప్టెంబర్ 1న వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమిస్తామన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న జెడ్పీ జీపీఎఫ్ సరెండర్ బిల్లులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్లో ఉంచడం శోచనీయమన్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వర్తించే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, హుస్నాబాద్ మండల శాఖ అద్యక్షుడు తిరుపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. -
ఫేస్తోనే ఇక పెన్షన్
మరింత పారదర్శకంగా డబ్బు పంపిణీ పెన్షనర్లకు ఇక నుంచి ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫేస్ రికగ్నిషన్ అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బయోమెట్రిక్ విధానం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడంతో పాటు సులభంగా, వేగంగా పెన్షన్ అందించేందుకు ఈ విధానం చేయనుంది. ఇప్పటికే సంబంధించిన అధికారులు, సిబ్బందికి శిక్షణ అందించారు. సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీల్లో పింఛన్ ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లెతే సదరు లబ్ధిదారునికి అందించే పింఛన్ నిలిచిపోతుంది. కానీ అలా జరగడం లేదు. పింఛన్ దారులు మరణించినా డబ్బులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. వాటిని కొంతమంది ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకున్నాయి. అలాగే పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు పింఛన్ కాజేసిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా ప్రభు త్వం ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పకడ్బందీగా అమలు పెన్షన్ పొందుతున్న వారిలో కొందరు వారి ఆధార్ కార్డుల్లో వయస్సును తప్పుగా నమోదు చేయించుకుంటూ ఎక్కువ వయస్సు ఉందంటూ అధికారులను నమ్మించి మోసం చేస్తూ పెన్షన్లు పొందుతున్నారు. దీంతో ఈ యాప్ను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులు దూరం.. ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. పెన్షన్ పొందాలంటే పోస్టాఫిస్కు వెళ్లి అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. ఈ క్రమంలో లబ్ధిదారుల్లో అత్యధికులు వృద్ధులు కావడంతో వేలి ముద్రలు స్కాన్ కాకపోవడంతో వారు పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఐరిష్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వార్డు అధికారులు, కార్యదర్శుల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన యాప్ ద్వారా బయోమెట్రిక్ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఆధార్ ఫొటోతో అనుసంధానమైన లబ్ధిదారుల వివరాలు స్మార్ట్ ఫోన్లో ఫొటో తీయగానే చెల్లింపు వివరాలు వస్తాయి. దీంతో వెంటనే పెన్షన్ డబ్బులు పొందేందుకు ఆస్కారం ఉంది. జిల్లాలో పెన్షన్దారుల వివరాలు లబ్ధిదారుల సంఖ్య: 1,85,296 నెలవారీగా చెల్లిస్తున్న డబ్బులు: రూ.40,08,70,736 వృద్ధులు: 58,666 వితంతువులు: 54,734 దివ్యాంగులు: 13,657 ఒంటరి మహిళలు: 3,406 టేకీదార్లు (మునీంలు): 274 చేనేత: 2,194 బీడీ కార్మికులు: 45,393 గీత కార్మికులు: 2,921 ఫైలేరియా: 2,429 డయాలసిస్ రోగులు: 232 ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు: 1,390 బయోమెట్రిక్ ఇబ్బందులకు స్వస్తి ఇప్పటికే పూర్తయిన బీపీఎంల శిక్షణ ఆగస్టు నెల నుంచే అమల్లోకి.. అక్రమాలకు చెక్ పెట్టేందుకే..పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు చెక్పెట్టి మరింత పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశ్యంత ఫేస్ రికగ్నిషన్ యాప్ను తీసుకువచ్చారు. అధికారులకు, బీపీఎంలకు, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ పూర్తి అయింది. పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుంది. –జయదేవ్ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ● గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్కార్డూ ఇవ్వలేదు ● పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్కార్డులిచ్చాం ● సొంతింటి కలనూ నెరవేరుస్తున్నాం ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు సిద్దిపేటజోన్: ‘మాది ప్రజా ప్రభుత్వం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సంక్షేమ పథకాలు ఆపడంలేదు’ అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, రూరల్ మండల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పదేళ్లుగా నిరీక్షించిన వారికి రేషన్ కార్డులు ఇచ్చి వారి కలను నిజం చేశామన్నారు. అలాగే పేదల సొంతింటి కలను సైతం నెరవేరుస్తున్నామని వివేక్ అన్నారు. సిద్దిపేట అర్బన్, రూరల్ పరిధిలో కొత్తగా 10వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్కు అధికంగా నిధుల కేటాయించేందుకు ప్రయత్నిస్తానన్నారు. పరస్పర నినాదాలు.. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు అనుగుణంగా నినాదాలు చేశారు. పెద్ద రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ సదానందం, కాంగ్రెస్ నాయకుడు హరికృష్ణ అధికారులు పాల్గొన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి నంగునూరు(సిద్దిపేట): రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు పెంచిన ఘనత రేవంత్ సర్కారుదేనని, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం నంగునూరులో 3,302 మంది లబ్ధిదారులకు రేషన్కార్డుల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ డిసెంబర్లోపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించి, మూడేళ్లలో మరో లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం నిర్వీర్యం చిన్నకోడూరు(సిద్దిపేట): గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి.. రాష్ట్రా న్ని అప్పుల పాలు చేసిందని మంత్రి వివేక్ అన్నారు. చిన్నకోడూరులో నూతన రేషన్ కార్డు ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందన్నారు. సిద్దిపేటరూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రేషన్కార్డుల ప్రొసీడింగ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న గడ్డం వెంకటస్వామి మూడు సార్లు ఎంపీగా పనిచేసి, 1973లో కేంద్ర మంత్రిగా ఉంటూ రేషన్కార్డు పద్ధతిని తీసుకువచ్చారని’ గుర్తు చేశారు. ఆయన వారసుడిగా తానూ రేషన్కార్డులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రేషన్కార్డుల ద్వారా సరాఫరా చేసే సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామన్నారు. -
సాహితీ సౌరభం సినారె
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలుగు సాహిత్యం అభివృద్ధిలో సింగిరెడ్డి నారాయణరెడ్డి చేసిన కృషి ఎనలేనిదని ప్రముఖ పద్య కవి కనకయ్య, గ్రంథ పాలకులు దాసరి రాజు అన్నారు. డాక్టర్ నారాయణరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సినారె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ నారాయణరెడ్డి రచనలు నేటి యువ కవులకు ఆదర్శమన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద కుటుంబంలో జన్మించి, ఎంతో కష్టపడి, పలు ప్రక్రియలలో రచనలు చేశారన్నారు. జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య పురస్కారం లాంటి ఎన్నో అవార్డులతో పాటు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన డాక్టర్ నారాయణరెడ్డి తెలుగు సాహితీ జగత్తులో ఒక వెలుగు వెలిగారన్నారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, రాజ్కుమార్, పర్శరాములు పాల్గొన్నారు. -
బడి నిధుల గోల్మాల్పై విచారణ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల దుర్వినియోగంపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది. మంగళవారం సాక్షిలో ప్రచురితమైన బడి నిధులు గోల్మాల్ కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు పీఎం శ్రీ పాఠశాలల్లో నిధుల వ్యయం పై పూర్తి వివరాలు సమర్పించాలని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్లను డీఈఓ ఆదేశించారు. అయితే పీఎం శ్రీ నిధుల వినియోగం వివరాలు ఆన్లైన్లో పంపించాలని కోరడంతో మళ్లీ, పాత లెక్కలే పంపించే అవకాశం ఉందని, ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందువల్ల అధికారులే నేరుగా క్షేత్ర స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
యూరియా నిల్వ చేస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి దుబ్బాకటౌన్: యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్లలో సలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా విక్రయాలను, బిల్లు బుక్, స్టాక్ రిజిస్టర్ లను, ధరల పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. -
మొక్కలు సంరక్షించడం అందరి బాధ్యత
ఎస్ఐ కీర్తిరాజుదుబ్బాకరూరల్: వనమహోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దగుండవెళ్లిలో ఎస్ఐ కీర్తిరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని చెప్పారు.ప్రతి ఒక్కరు విధిగా ఐదు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మహేశ్ ఆయనకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్లుగారి ప్రేమ్, కార్యదర్శి యాదగిరి, పరశురాములు, శ్రీకాంత్రెడ్డి, ప్రదీప్రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఐదు మొక్కలు నాటాలి హుస్నాబాద్రూరల్: స్వశక్తి మహిళలు వనమహోత్సవంలో పాల్గొని ఇంటింటికీ ఐదు మొక్కలు నాటాలని ఏపీఎం భిక్షపతి సూచించారు. పోతారం(ఎస్) గ్రామంలో స్వశక్తి మహిళలతో కలిసి వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇంటి ఎదుట మొక్కలు నాటుకోవాలన్నారు. మునగ, జామ, నిమ్మ, కరివేప, తులసి మొక్కలు నాటితే అవి మన ఆర్యోగానికి ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీసీలు రవీందర్, సీఏ కనకతార తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మనుగడ చిన్నకోడూరు(సిద్దిపేట): చెట్లను పెంచడం ద్వారా నే మానవ మనుగడ సాధ్యమవుతుందని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏపీఎం ఆంజనేయులు అన్నారు. సోమవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఏపీఓ స్రవంతి, సీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
బీటీ రోడ్డు నిర్మించాలని వినతి
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల గ్రామ వేముల పోచమ్మ దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ దిలీప్నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లానేత అందె అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరి భూమయ్య మాట్లాడుతూ పోచమ్మ దేవాలయానికి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారన్నారు. అలాంటి ఆలయం వరకు మట్టి రోడ్డు ఉండడంతో వర్షం పడితే రోడ్డు బురదగా మారి భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఆలయం వరకు బీటీరోడ్డు మంజూరు చేయించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని చెప్పారు. నాయకులు భద్రయ్య, ప్రభాకర్, రాజు, కుమార్, నర్సిరెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
చేర్యాల(సిద్దిపేట): పట్టణకేంద్రంలోని పదో వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు సోమ వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, వార్డు ఇన్చార్జి చింతల మల్లేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, పార్టీలో చేరిన యువత అందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ ప్రతాప్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు చంద్రయ్య, లక్ష్మీనారాయణ, నరేంద ర్, సతీశ్, రాకేష్కృష్ణన్, నాని, సన్ని, సదానందం ఖలీం పాష, అరవింద్, హరీశ్, భాను, ప్రసాద్, రాజేశ్, అరవింద్, సోను, హర్షవర్ధన్, బాలరాజ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ ముద్దు సోషల్ మీడియా వద్దు
జగదేవ్పూర్(గజ్వేల్): విద్యార్థులు భవిష్యత్ను లక్ష్యంగా పెట్టుకుని విద్యను అభ్యసించాలని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఎస్ఐ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం జగదేవ్పూర్లో కేజీబీవీ పాఠశాలలో షీటీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ చట్టాలు, అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలు, సైబర్నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్రవంతి, ఏఎస్ఐ రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.