breaking news
Siddipet District Latest News
-
దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులు వీరే..
దుబ్బాకటౌన్: మున్సిపల్లో 16 వార్డులకు పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రకటించారు. 1వ వార్డు కొంపల్లి రచనశ్రీ, 2వ వార్డుకు గంభీర్పూర్ కనకరాజు, 4వ వార్డు నిమ్మ యాదయ్య, 6వ వార్డు రజిత, 7వ వార్డు లోకాని బాలమని, 9వ వార్డు వనం యాదయ్య, 10వ వార్డు కాపరబోయిన శ్రీనివాస్, 11వ వార్డు బుస్స ప్రవీణ్, 13వ వార్డు మోత్కుపల్లి ప్రతిభ, 14వ వార్డు కాల్వ లింగం, 15వ వార్డు సుంకోజు రమ్య ప్రవీణ్, 16వ వార్డు దేవుని పరశురాములు, 17వ వార్డు పెంటం కిషన్, 18వ వార్డు దొరగోల్ల శ్రీకాంత్ యాదవ్, 19వ వార్డు కారంపూరి భవాని, 20వ వార్డు అంబటి మంజుల బాలేష్ గౌడ్ లను ప్రకటించారు. ఈ సందర్భంగా బైరి శంకర్ మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ ఎన్ చారి, బాలేష్గౌడ్, సంతోష్కుమార్, తదితరులు ఉన్నారు. -
సైనిక దుస్తులతో వచ్చి.. బోధించి
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ సైనిక దుస్తులతో వచ్చి బోధించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన ‘హోమ్ దే బ్రౌట్ హర్ వారియర్ డెడ్’ అనే పద్యాన్ని స్కిట్ రూపంలో బోధించారు. (యుద్ధంలో చనిపోయిన భర్త మృతదేహాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోవడం.. తన బిడ్డ కోసం బతకాలనే ఆశతో కన్నీరు పెట్టడం ఈ పద్యం సారాంశం.) పాఠశాలలో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా బోధించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అభ్యాసంపై ఆసక్తి పెంచాలనే ఇలాంటి స్కిట్లను బోధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ను ఎంఈఓ మహతిలక్ష్మి, హెచ్ఎం శ్రీరాములు అభినందించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
దుబ్బాకటౌన్: ‘విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?.. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని’ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకే కూర, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడేలా వంటలు చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మెనూ తప్పక పాటించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లో కలుపు తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందించే సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫార్మసీ స్టోర్, ఇంజక్షన్ గదులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరి గజ్వేల్రూరల్: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని కలెక్టర్ హైమావతి కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలోగల కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. విద్యార్థులందరికీ సరిపడా భోజనాన్ని రుచికరంగా వండి అందించాలని సూచించారు. భోజనం చేసే సమయంలో అన్నం, కూరలను విద్యార్థుల వద్దకే వెళ్లి వడ్డించాలన్నారు. సౌకర్యాల కల్పన, నాణ్యతలో రాజీ వద్దని, విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్పాలని కేజీబీవీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ‘మధ్యాహ్న భోజనం’పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ హైమావతి -
ఫోన్ ట్యాపింగ్ అతి నీచమైనది
హుస్నాబాద్: అధికారులపై, రాజకీయ నాయకులపై, వారి కుటుంభ సభ్యులపై ఫోన్ ట్యాపింగ్ చేయడం అతి నీచమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు విచారణకు పిలిస్తే దానిని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లించదన్నారు. మరోవైపు హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొంత మంది జీవితాల్లో, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, కుటుంబాల పరంగా వాళ్ల వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించారని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు, కుట్ర పూరితమైన అంశాలు లేవన్నారు. మీరు తప్పు చేయనట్లయితే విచారణలో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. అంతేకాని డైవర్షన్ పాలిటిక్స్తో రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి సూచించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
కొనుగోలు కేంద్రంలోనే విక్రయించండి
గజ్వేల్రూరల్: కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీఓ (జిల్లా సహకార అధికారి) వరలక్ష్మి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.8వేలను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రఘోత్తంరెడ్డి, ఏఎంసీ సెక్రటరీ జాన్వెస్లీ, అధికారులు బాలయ్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు డీసీఓ వరలక్ష్మి -
కేసీఆర్, హరీశ్రావు దిష్టిబొమ్మల దహనం
గజ్వేల్రూరల్: అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఫోన్ ట్యాపింగ్ అంశంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిష్టిబొమ్మలను అహ్మదీపూర్లో దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, మల్లేశం, అంజాగౌడ్, రామాగౌడ్, బాల్రాజుగౌడ్లు మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలకు అంతేలేదన్నారు. తప్పు చేస్తే ఎవరికై నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం అతి నీచమైనదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నారని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్చైర్, మొబైల్బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్, వీల్చైర్ అటాచ్మెంట్, వీల్చైర్, టాబ్స్, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 10లోపు ఆన్లైన్లో http://http.tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ గజ్వేల్: చైన్నెలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని సైనిక్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న యువికా అనే విద్యార్థిని రెండోస్థానంలో నిలిచి వెండి పతకం దక్కించుకున్నారు. దేశంలోని 16రాష్ట్రాలకు చెందిన 400మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా..యువికా తనదైన ప్రతిభతో పోటీల్లో విజేతగా నిలిచారు. విద్యార్థిని జాతీయస్థాయిలో రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలసంఖ్య పెంచండి గజ్వేల్రూరల్: ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారు ఎక్సర్సైజ్ చేసేందుకు ఒక యోగా టీచర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక తదితరులున్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక డ్రైవ్ అక్కన్నపేట(హుస్నాబాద్): రానున్న వేసవి దృష్టా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని మిషన్ భగీరథ (ఇంట్రా) డీఈ రుహీనా తస్కీన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం అక్కన్నపేట మండలంలోని కట్కూర్, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రీడ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా చాపగానీతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్ని ఆమె మాట్లాడారు గ్రామాల్లో ఉన్న భగీరథ వాటర్ ట్యాంకులు, పైపులైన్ల వ్యవస్థలతో పాటు పంచాయతీ బోరు బావుల వివరాలను నమోదు చేసుకుంటున్నామన్నారు. తాగునీరు సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకోరావాలన్నారు. కార్యక్రమంలో భగీరథ గ్రీడ్ ఏఈ సాయికృష్ణ, సర్పంచ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా జాగృతం కోసమే బాకీ కార్డు సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డుల పేరిట వినూత్న రీతిలో జాగృతం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక 7 వార్డులో బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీల పేరిట ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు విఠోభా, శ్రీనివాస్ యాదవ్, సాయి, నాయకులు బండల రాజు, ప్రభాకర్రెడ్డి, యాదగిరి, నగేష్, రాజు, నర్సింహులు, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సౌమ్యకు ఘన నివాళి
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్య చిత్రపటానికి సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో సిబ్బంది సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సౌమ్య ఎకై ్సజ్ శాఖకే కాకుండా సమాజానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అందరూ మెచ్చే బడ్జెట్పై విమర్శలా?
గజ్వేల్: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చే బడ్జెట్ను ప్రవేశపెడితే.. కేటీఆర్, హరీశ్రావులకు కనపడకపోగా, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిండ్రు, ఇప్పటికై నా ఏదీ పడితే అది మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం ఏడు హై స్పీడ్ రైళ్లు ఇస్తే...అందులో తెలంగాణకు మూడు కేటాయించారని, అదేవిధంగా గతంతో పోలిస్తే రోడ్లకు అత్యధికంగా నిధులు వచ్చాయన్నారు. సిట్ దర్యాపును సమర్థవంతంగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు ఆగ్రహం గజ్వేల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
గజ్వేల్ బీఆర్ఎస్లో ఉత్కంఠ
గజ్వేల్: మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20వార్డులకుగానూ అభ్యర్థులను ఖరారు చేసి భీ–ఫాంలను సైతం అందజేసింది. ఈ విషయాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ముదిరాజ్ విడుదల చేశారు. 20వార్డులకుగానూ 19మంది అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, 18వార్డు విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో మైస కనకమ్మ(1వవార్డు), గాడిపల్లి కల్యాణి(02), కోట కిశోర్(03), రొట్టెల శ్రీనివాస్(04), అన్నపూర్ణ(05), పేర్ల సిద్దేశ్వరీ(06), మన్నెం శశిధర్రెడ్డి(07), కేతావత్ ఆంజనేయులు(08), లింగంపల్లి హరికుమార్(09), కొమ్ము చంద్రశేఖర్(10), పిట్ల రత్నమ్మ(11), దామరంచ దయాకర్రెడ్డి(12), పల్పునూరి కల్పన(13), మామిండ్ల రేణుక(14), మౌనిక(15), పుష్పలత(16), నాగులపల్లి కవిత(17), నాయిని సందీప్కుమార్(19), ఉప్పల మధుసూదన్ గుప్తా(20వ వార్డు) ఉన్నారు. వీడని సస్పెన్స్ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా.. అధికారికంగా వారి పేర్లను ప్రకటించలేదు. కొన్ని వార్డుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నది. రెబెల్స్ బుజ్జగించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి వారి సమక్షంలోనే అధికారిక అభ్యర్థులకు భీ–ఫాంలను అందజేసి గెలుపునకు వారి సహకారం తీసుకోవాలనే ఆలోచనతో ముందుకుసాగుతున్నట్లు పార్టీ వర్గాల తెలిసింది. ఏదీఏమైనా కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రకటించి భీ–ఫాంలను కూడా అందజేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సంపూర్ణం -
పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆదివారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఎస్ఐ లక్ష్మారెడ్డి పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కపకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ దేవాలయంలో చండీ హోమంహుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమ పూజ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పచ్చిమట్ల రవీందర్గౌడ్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్రావు, అర్చకులు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గురు రవిదాస్ జయంతి గజ్వేల్: పట్టణంలో మోచి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గురు రవిదాస్ మహరాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వేణు, నాయకులు బైరి రవి, ప్రభాకర్, బైరి ప్రభాకర్లు మాట్లాడుతూ కులవ్యవస్థను, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ గురు రవిదాస్ సమతావాదాన్ని బోధించారని కొనియాడారు. -
నేటి నుంచే యూరియా బుకింగ్
ప్రశాంత్నగర్(సిద్ధిపేట): రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన ‘యూరియా బుకింగ్– మొబైల్ యాప్’ను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ రైతుల ఖాతా ఆధారంగానే యూరియా బుకింగ్ విధానం అమలు చేస్తామన్నారు. రైతులు కాకుండా ఇతరులు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై రైతులు యాప్లో పంట వివరాలు నమోదు చేసి అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. పాస్బుక్, మొబైల్ నంబర్ నమోదు చేసిన తరువాత ఓటీపీ ద్వారా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. భూమి విస్తీర్ణం మేరకు యూరియా విడతలుగా అందజేస్తామని తెలిపారు. రైతులు డీలర్ వద్దకు వెళ్లే ముందు తప్పనిసరిగా బుకింగ్ నంబర్ తీసుకొని వెళ్లాలన్నారు. బుకింగ్ చేసిన 24 గంటలలోపు యూరియా కొనుగోలు చేయాలని తెలిపారు. యూరియా పంపిణీ పూర్తిగా ఈ–పాస్ విధానంలోనే జరుగుతుందన్నారు. యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా యూరియా ఎక్కడ అందుబాటులో ఉందో రైతులకు నేరుగా సమాచారం లభిస్తుందన్నారు. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముందుగానే యూరియా బుక్ చేసుకోవాలని ఆమె కోరారు.జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటుదామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక కొమ్మూరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు ఒగ్గు వెంకటమ్మ, 2వ వార్డు ముస్త్యాల తేజ, 3వ వార్డు కొమ్ము రాజేశ్వరి, 4వ వార్డు వంగ జయలక్ష్మి, 5వ వార్డు వెలుగల దుర్గయ్య, 6వ వార్డు ముస్త్యాల కృష్ణ, 7వ వార్డు పోతుగంటి ప్రసాద్, 8వ వార్డు సందుల సురేష్, 9వ వార్డు మామిడాల నాగరాజు, 10వ వార్డు తుమ్మలపల్లి లీల, 11వ వార్డు గుస్క వాసంతి, 12వ వార్డు షరీఫాబేగం పేర్లను ప్రకటించారు. ఎంపీ చామల, కొమ్మూరి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. చేర్యాల మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు.గజ్వేల్: ఫోన్ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారణకు పిలిస్తే.. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దిష్టిబొమ్మలను దహనం చేయడం ఏమిటని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకునే రోజులు వచ్చాయని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు గోపాల్రావు, తీగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాశ్రావు, నాయకులు పాల్గొన్నారు.పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్రావు -
ఈసారీ నిరాశే..
కేంద్రబడ్జెట్పై భిన్నాభిప్రాయాలుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి కేటాయింపులు లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కలేదు. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి మందుల ధరలు కొంత తగ్గనున్నాయి. అలాగే విదేశాలలో విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారికి కొంత ప్రోత్సాహంగా ఉండనుంది. ఇంకా రైల్వేకు సంబంధించి బడ్జెట్ను కేటాయించారు. కానీ రైల్వే ప్రాజెక్ట్లకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదు. – సాక్షి, సిద్దిపేట మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి(కరీంనగర్) వరకు 152 కిలోమీటర్లు ఉండగా సిద్దిపేట(76.5కిలో మీటర్లు) వరకు రైల్వే లైన్ పూర్తయింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు 30కిలో మీటర్లు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట వరకు సైతం ఒకటే రైలు. అది స్లోగా వెళ్తుండటంతో ప్రయాణికులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ రైలు స్పీడ్ దాదాపు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్లు స్పీడ్ మాత్రమే వెళ్తుండటంతో సికింద్రాబాద్కు వెళ్లాలంటే దాదాపు 3గంటలకు పైగా పడుతుంది. సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. అలాగే మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ చేపడితే రైలు స్పీడ్ పెరగనుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దక్కని ఊరట కేంద్ర బడ్జెట్లో వేతన జీవులు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది. ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్లలో మార్పులు ఉంటాయని అందరూ భావించారు. కానీ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. జిల్లాలో దాదాపు 90వేల మందికి పైగా ఆదాయపు పన్నులు చెల్లిస్తుంటారు. క్యాన్సర్ రోగులకు ఉపశమనం క్యాన్సర్ రోగులకు కొంత ఉపశమనం కలిగింది. 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. జిల్లా వ్యాప్తంగా 600మందికి పైగా రోగులున్నారు. బాలికల హాస్టల్ కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు బాలికల హాస్టల్ను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. జిల్లాకు బాలికల హాస్టల్ రానుంది. బాలికల హాస్టల్ ఏర్పాటు అయితే విద్యను అభ్యసించే వారి సంఖ్య పెరగనుంది. పల్లెలు, పట్టణాలకు.. కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రూ.2,73,108 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు జనాభా వారీగా నిధులను ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయిస్తోంది. జిల్లాలో 506 గ్రామపంచాయతీలకు నిధులు రానుండటంతో పల్లెలు అభివృద్ధి చెందనున్నాయి. పట్టణాభివృద్దికి రూ85,522కోట్లను కేటాయించడంతో ఐదు మున్సిపాలిటీలలో 115 మున్సిపల్ వార్డులకు నిధులు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గింపు ఈవీ కార్లు, ద్విచక్రవాహనాల ధరలు తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గటంతో పాటు వాహనదారులకు ఖర్చు నుంచి విముక్తి లభిస్తోంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 40వేల మంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు.ఈ వాహనాల ధరలు తగ్గితే వినియోగించే వారి సంఖ్య మరింత పెరగనుంది.ఊసేలేని పర్యాటక ప్రగతి ● వేతన జీవులకు దక్కని ఊరట సిద్దిపేట రైలు స్పీడ్ పెరిగేనా? ● జిల్లాకు బాలికల హాస్టల్అంకెల గారడే.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా ఉంది. అంకెల గారడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. వ్యవసాయంతోపాటు పలు కీలకరంగాలకు కేటాయింపులు సముచితంగా లేవు. తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయమే. – కొత్త ప్రభాకర్రెడ్డి , ఎమ్మెల్యే దుబ్బాక, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వంచించిన కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలకు ఎలాంటి కేటాయిపులు, ప్రకటనలు చేయలేదు. ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి జీరామ్జీ పథకం ద్వారా రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని మోపారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా కేటాయించారు. కేంద్రం తమ పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి. – మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి అన్ని వర్గాలకూ అనుకూలం అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగేందుకు ప్రస్తుత బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంది. దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతాంగం, యువతకు ప్రాధాన్యమిచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. – బాసంగారి వెంకట్, బీజేపీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడునిరాశపరిచింది.. ఆదాయపు పన్ను చెల్లింపులు శ్లాబులు పెరుగుతాయని భావించాం. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో చాలా బాధాకరం. విద్యారంగానికి బడ్జెట్ మేలు జరిగే విధంగా ఉంది గతంలో కంటే ఈసారి బడ్జెట్ పెంచడం సంతోషదాయకం. – ఇంద్రసేనారెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
సిట్పై బీఆర్ఎస్ భగ్గు
● నోటీసులకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ● రాజీవ్ రహదారిపై గౌరారం వద్ద భారీ ధర్నా వర్గల్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసుల జారీపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం ఉదయం ఫామ్హౌస్ నుంచి హైదరాబాద్ నందీనగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేతకు గౌరారం వద్ద రాజీవ్రహదారిపై పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. మిరుదొడ్డిలో రాస్తారోకో మిరుదొడ్డి(దుబ్బాక): బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు ధర్మారం కుమార్, ధర్మారం బాబు తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట–భూంపల్లిలో... అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎం చిత్ర పటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు జరిగిన ఆందోళనతో సిద్దిపేట– రామాయంపేట జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
పాలన చేతకాక.. కేసీఆర్పై కుట్రలు
గజ్వేల్: పాలన చేతకాక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు గజ్వేల్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అక్రమ కేసులు, నోటీసులతో కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తుకు.. పైఎత్తు
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద● గజ్వేల్ మున్సిపల్ పోరు రసవత్తరం ● చైర్మన్ పీఠమే లక్ష్యంగా నేతల పావులుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు ఎత్తుకు.. పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. – గజ్వేల్ నామినేషన్ల పరిశీలన తర్వాత ఇక్కడ 125మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 37, బీజేపీ 28, సీపీఎం, బీఎస్పీ నుంచి ఒకరు చొప్పున, ఇండిపెండెంట్లు 13మంది ఉండగా.. గుర్తింపు పొందిన పార్టీల నుంచి మరో 12మంది బరిలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పుడే.. అసలు కథ మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3 తుది గడువు ఉండగా.. అన్నీ పార్టీల్లోనూ నేతలు రెబెల్స్ను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక పార్టీ కదలికలపై మరో పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఓ ప్రధాన పార్టీలో రెబెల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తుండగా.. వారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓ నేత మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమచారం. వారిని అలాగే పోటీలో ఉండాలని, అలా ఉంటే సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది గమనించిన సదరు పార్టీ ముఖ్యనేతలు సైతం ఎత్తుకుపై ఎత్తు వేస్తూ..ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తమ పార్టీ రెబెల్ అభ్యర్థులను బుజ్జగించి...అవసరమైతే వారికి అగ్రనేతలతో హామీలు ఇప్పించి పోటీలో నుంచి తప్పుకునేలా శతవిధాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ స్థానాలే లక్ష్యం.. రెబెల్స్ పోటీలో ఉంటే.. సదరు పార్టీ బలహీనపడి తమకు గెలుపు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని వైరి పార్టీల నేతలు వ్యుహాలకు పదునుపెడుతున్నారు. ఓ నేత తాను పోటీ చేసే వార్డులో పోటీ చేయకుండా వేరే వార్డులోకి వెళ్లి పోటీచేస్తే.. సహకారమందిస్తానని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓ నేత చెప్పాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ అభ్యర్థి వేరే వార్డులో నామినేషన్ వేశారని చెప్పుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపల్ ఎన్నికల తీరు వైరి పార్టీల వ్యూహప్రతివ్యూహాలతో మరింత వేడెక్కనుంది.దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తలనొప్పిగా తయారైంది. 20 వార్డులకు 235 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల కంటే ఎక్కువగా దుబ్బాకలో నామినేషన్లు దాఖలు కావడం శోచనీయం. శనివారం నిర్వహించిన పరిశీలనలో అన్ని నామినేషన్లు సరిగ్గానే ఉండటంతో 127 మంది బరిలో ఉన్నారు. కాగా వీటిలో అభ్యర్థులు వివిధ వార్డులకు రెండు, మూడు సెట్లు వేశారు. ఆదివారం 10 వ వార్డు నుంచి నామినేషన్ వేసిన బడుగు మాధవి ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం 126 మంది బరిలో ఉన్నారు. టికెట్ ధీమాతో.. మున్సిపాలిటీలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో చాలా మంది అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం ప్రధాన పార్టీల నాయకులకు తలనొప్పిగా తయారైంది. నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3వ తేది 3 గంటల వరకే గడువు ఉంది. కేవలం రెండు రోజులు మాత్రం గడువు ఉండడంలో బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అలాగే తమకు నష్టం కలగకుండా పలు వార్డులలో స్వతంత్రులను సైతం విత్డ్రా చేయించాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● రెండు విడుతలుగా పరీక్షలు ● హాజరు కానున్న 9,710 మంది విద్యార్థులు సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంఽధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈసారి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన ప్రయోగ పరికరాలను ఇప్పటికే అందించింది. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్)లకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అవసరమైన సూచనలు, సలహాలను అందించారు. జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలు జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గాను 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సీఎస్ను నియమించారు. రెండు విడతలుగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు జనరల్ కోర్సులకు సంబంధించి 4,965 మంది విద్యార్థు లు, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం 2,556, ద్వితీ య సంవత్సరం 2,189 మొత్తం 9,710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొద టి విడత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. రెండవ విడత 7 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో 39 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను కేటాయించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు హాల్టికెట్ల పంపిణీ పూర్తయింది. -
టికెట్ల సమన్వయం సరే.. మరి ఎన్నికల్లో?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ టికెట్ల పంచాయతీ రాష్ట్ర రాజధానిలోని గాంధీభవన్కు చేరింది. పలు మున్సిపాలిటీల్లో రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పట్టుబట్టారు. దీంతో ఈ టికెట్లలొల్లి ముదిరిపాకాన పడింది. ఈ టికెట్ల పంచాయితీని పరిష్కరించేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో సమన్వయ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. మహేశ్కుమార్గౌడ్తోపాటు, మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏకాభిప్రాయం కుదరని టికెట్ల విషయంలో ఆయా వర్గాల నేతలను సమన్వయం చేసి టికెట్లను ఖరారు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కుదరని సమన్వయం నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని టికెట్ల కోసం ఎంపీ షెట్కార్తోపాటు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పట్టుబట్టారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయాలని భావించినప్పటికీ..మూడు,నాలుగు వార్డుల టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ టికెట్లలొల్లి గాంధీభవన్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ ఆశిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్గా నామినేషన్ కూడా వేశారు. ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు షెట్కార్ అనుచరులకు దక్కినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెదక్ కాంగ్రెస్లోనూ టికెట్ల కుదుపు రామాయంపేట మున్సిపాలిటీ టికెట్ల లొల్లి ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. ఈ టికెట్లలొల్లి కారణంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పలువురు కాంగ్రెస్ నాయకులకు పొసగడం లేదు. ఈ క్రమంలో రామాయంపేట బల్దియా చైర్మన్ పదవిని తన కుటుంబసభ్యులకు ఆశించగా, కౌన్సిలర్ టికెట్ ఇచ్చేందుకు మైనంపల్లి నిరాకరించడంతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. ఇలా పలుచోట్ల కాంగ్రెస్ టికెట్లు ఆ పార్టీలో వర్గవిభేదాలను, ఆధిపత్యపోరు, అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేసినట్లైంది. అనుకూలంగా మార్చుకుంటున్న బీఆర్ఎస్ అధికార పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకుంటోంది. ఆ పార్టీలోని కీలక నాయకులకు గులాబీ కండువా కప్పి తగిన ప్రాధాన్యతనిస్తోంది. తద్వారా అధికార పార్టీని నైతికంగా దెబ్బతీయడమే కాకుండా, ఈ ఎన్నిక ఈ మున్సిపల్ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజారిటీ చైర్పర్సన్ స్థానాలపై గురిపెట్టిన బీఆర్ఎస్..కాంగ్రెస్లోని కుమ్ములాటలను అనుకూలంగా మార్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళుతుండటం ఆసక్తికరంగా మారింది.ఆధిపత్య పోరుతో తేలని అభ్యర్థిత్వాలు టికెట్ల కేటాయింపు వరకు టీపీసీసీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలను సమన్వయం చేయగలిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు ఎంతవరకు కలసి పనిచేస్తాయన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వర్గవిభేదాలు వీడి సమన్వయంతో పనిచేస్తే మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయతీరాలకు చేరుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారనేది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే. -
మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని శనివారం ఉపలోకాయుక్త జగ్జీవన్కుమార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందించారు, కార్యక్రమంలో ఆలయ ఈఓ టంకశాల వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలిరవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీవాణి పాఠశాలలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు, వ్యాసరచన, క్విజ్పోటీలు, ఉపన్యాస పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ శంకర్నారాయణ, ఎఎంవీఐ శ్రీకాంత్రెడ్డి, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, కోశాధికారి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, సికిందర్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయం సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మయిల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ఆపరేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్లో 70మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. వీరిలో 52మంది బాలురు, 18మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు 49మందిని తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చించినట్లు తెలిపారు. జిల్లాలోని ఇటుకబట్టీలు, బేకరీలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులను గుర్తించామని, వెట్టి చాకిరి నుంచి వారిని విముక్తి చేశామన్నారు. ఇప్పటివరకు 12మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. రేపు ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల విధుల కారణంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె.హైమావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నేడు బీఆర్ఎస్ నిరసన ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి, దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన చర్యని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడిగా, సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తిని దర్యాప్తునకు పిలవడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
గజ్వేల్లో రెబల్స్ గోల
పార్టీల నేతలకు తలనొప్పి ● బుజ్జగించేందుకు యత్నం ● మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయంగజ్వేల్: రెబల్స్ లొల్లి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికలో పార్టీలకు గండంలా మారింది. వీరివల్ల గెలిచే స్థానాలను ఓడిపోతామా...? అనే ఆందోళన ముఖ్య నేతలను వెంటాడుతోంది. బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ పార్టీకి 2, 3, 6, 15, 18, 20 వార్డుల్లో రెబెల్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఒకరిని సముదాయించి, పోటీనుంచి తప్పించేలా చేయడం నేతలకు కత్తిమీదసాములా మారింది. ఇప్పటికే పార్టీ నేతలు అధికారిక అభ్యర్థులు ఎవరనే విషయంలో స్పష్టతకు వచ్చారు. ఈ క్రమంలోనే అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు చేసిన వారిని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని కూడా సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకోగా.. వారికి పోటీగా రెబల్స్ కూడా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ..వాటికి కూడా హాజరుకావడం లేదు. కొందరు నేతల వల్లే తాము బీ–ఫాంకు దూరం కావాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. బీజేపీలోనూ 18వ వార్డులో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్లోనూ పలు వార్డుల్లో ఈ పరిస్థితి నేతలకు ఇబ్బందికరంగా మారింది. నామినేషన్ల విత్డ్రా ఈనెల 3లోగా ఈ పరిస్థితిలో మార్పులు ఉంటాయా..? అనేది వేచి చూడాల్సి ఉంది. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు
● కలెక్టర్ కె.హైమావతి హెచ్చరిక ● నాణ్యమైన భోజనం వడ్డించాలి ● మిట్టపల్లి గురుకుల, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలన సిద్దిపేటఅర్బన్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వడ్డించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, గుడ్డు, క్యాలీఫ్లవర్ కూర, పప్పు, రసం, పెరుగు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు డైనింగ్ హాలులో మాత్రమే భోజనం వడ్డించాలని, ఇతర చోట్ల వడ్డించవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం చేసే సమ యంలో క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్.. కూరల నాణ్యత సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పట్టణం, గ్రామీణం కలయిక.. దుబ్బాక
● ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్గా ఆవిర్భావం ● ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం ● రెండోసారి మున్సిపల్ పోరుకు సిద్ధం దుబ్బాక: అటు పట్టణం కాదు... ఇటు పూర్తిగా గ్రామం కాకుండా భిన్నమైన పరిస్థితి దుబ్బాక మున్సిపాలిటీది. భౌగోళికంగా దుబ్బాక మున్సిపాలిటీ సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉండడంతో భిన్నమైన సంస్కృతి పెనవేసుకుంది. వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమనే నమ్ముకొని ప్రజలు జీవనం గడుపుతుండడంతో ఆ వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది. ఏడు గ్రామాలతో దుబ్బాక మున్సిపల్గా.. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దుబ్బాకతో పాటు పట్టణానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని చెల్లాపూర్, లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, మల్లాయపల్లి, దుంపలపల్లి గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 2012లోనే ఏడు విలీన గ్రామాలతో కలిపి మున్సిపల్గా ఏర్పాటు చేయడంతో కొందరు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు.దీంతో సుమారుగా 12 ఏళ్లుగా మున్సిపల్పై నిర్ణ యం పెండింగ్లోనే ఉండిపోయింది. దీంతో రెండు పర్యాయాలు అంటే పదేళ్లకు పైగా ఈ ఏడు గ్రామా ల్లో అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉండాల్సి వచ్చింది. రెండోసారి మున్సిపల్ పోరుకు.. 2020లో దుబ్బాక మున్సిపాలిటీగా ఆవిర్భవించాక మొదటిసారి ఎన్నికలు జరగగా తాజాగా ఇప్పుడు రెండవ సారి ఎన్నికలకు సిద్ధమైంది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో సుమారుగా 40 వేలకు పైగా జనాభా ఉంది. మొదటిసారి 2020లో జరిగిన ఎన్నికల్లో 19,360 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు రెండు వేలకు పైగా ఓటర్లు పెరగడం విశేషం. -
స్కాంల దృష్టి మరల్చడానికే..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ను ఎదుర్కొనలేకనే సిట్ పేరుతో డ్రామాలను ఆడుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. శనివారం సిద్ది పేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారేమోనని భయంతో సిట్ను తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. అలీబాబా 40 దొంగలు, దండుపాళ్యం, లిక్కర్ కుంభకోణాలు, బొగ్గు స్కాం, హైదరాబాద్లో 9,300 ఎకరాల భూమి కబ్జా, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చిల్లర వేషాలు వేయడం తగదన్నారు. నలుగురు ఐపీఎస్లతో సిట్ను ఏర్పాటు చేసి ఇష్టారీతిన ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. రెండేళ్లుగా 350 మందిని, రెండు వారాలుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావులను 160 సీపీఆర్ ప్రకారం ఈ కేసులో సాక్షులుగా 7 నుంచి 9 గంటల పాటుగా సిట్ విచారించిందని పేర్కొన్నారు, అందులో ఏమీ తేలలేదన్నారు. రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. 1885 ఇండియన్ టెలిగ్రాం యాక్ట్ ప్రకారం దేశంలో ఎవరి ఫోన్నైనా కేవలం నిఘా అధికారులు మాత్రమే దేశ భద్రత, తదితర అంశాల కోసమే ట్యాపింగ్ చేస్తాయని, ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. కేసీఆర్ ఉండేది ఎర్రవల్లి ఫాంహౌస్లోనని, నందినగర్లోని నివాసం గోడకు నోటీసులు అంటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అవసరం ఉంటే ఎర్రవల్లిలోనే విచారించాలని, అందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారన్నారు.సిట్ పేరిట సర్కార్ డ్రామాలు -
గెలిచే అభ్యర్థులకే బీఫాంలు
సంగారెడ్డి: గెలిచే అభ్యర్థులకే బీఫారమ్లు అందజేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వారికి బీ ఫారమ్ల పంపిణీపై మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, సంగారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, సీఎం సలహాదారు షబ్బీర్అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్రావు హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల చేతుల మీదుగా బీఫారాలు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.సర్దిచెప్పిన అజారుద్దీన్ జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ టికెట్ల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటకు దారి తీసింది. 19 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించడం గందరగోళానికి కారణమైంది. ఈ ప్రకటనపై సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఏకంగా రాష్ట్రమంత్రి, మున్సిపల్ ఎన్నికల కోసం నియమితులైన ఇన్చార్జి అజారుద్దీన్ కలుగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని అజారుద్దీన్ సర్దిచెప్పాల్సివచ్చింది. గాంధీభవన్లో శనివారం జరిగిన సమావేశంలో ఈ టికెట్ల పంచాయితీని కొలిక్కి తెచ్చారు. ఇక్కడ ఎంపీ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, గిరిధర్రెడ్డి అనుచరులు ఈ టికెట్ల రేసులో ఉన్న విషయం తెలిసిందే. -
గెజిటెడ్ సంతకాల కోసం పరుగులు
హుస్నాబాద్: కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హైరానా పడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ఫారంలో తప్పొప్పులను సరిచూసుకున్నారు. ఫారంలో అన్ని అంశాలు పూరించినప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారితో సంతకం తప్పనిసరి అధికారులు సూచించారు. దీంతో అభ్యర్థులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు. హెచ్ఎంలు అందుబాటులో లేకపోవడంతో వివిధ శాఖల అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. -
మెనూ ప్రకారమే భోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి ● బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ వసతి గృహంలో వంటలను పరిశీలిస్తున్న కలెక్టర్హుస్నాబాద్: విద్యార్థులకు మెనూ ప్రకారం సరిపడా భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో మెనూ పాటించకుండా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించిన ఘటనపై కారణాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు. వంట గదిని పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. కామన్ డైట్ మెనూ ప్రకారమే భోజనం తయారు చేయాలని ఆదేశించారు. వసతి గృహం లోపల, బయట పరిశుభ్రతను పాటించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల స్ధితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నాపై విద్యార్థుల ద్వారా విచారణ చేపట్టి నివేదిక అందించాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిని కలిసిన కలెక్టర్సిద్దిపేటఅర్బన్: జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్ను కలెక్టర్ హైమావతి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యంలోని హరిత హోటల్లో ఆగిన కమిషన్ కార్యదర్శిని కలెక్టర్ కలిసి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రస్తుత పరిస్థితి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్ సునీల్కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అబ్దుల్హమీద్ తదితరులు పాల్గొన్నారు. -
స్కౌట్స్కు టీచర్లు డుమ్మా
శిక్షణకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు స్కౌట్స్ అండ్ గైడ్స్కు ప్రభుత్వ ఉపాధ్యాయులు మక్కువ చూపడం లేదు. ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లుగా ఎంపిక చేశారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కరీంనగర్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతున్నారు. జిల్లా విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. – సాక్షి, సిద్దిపేట విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు.. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడనుంది. ఇప్పటి వరకు జూనియర్ కళాశాలల్లో మాత్రమే అవకాశం ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 43 పాఠశాలలు ఎంపిక చేయగా అందులో 23 కేజీబీవీలు, 14 మోడల్ స్కూల్స్, 4 జెడ్పీహెచ్ఎస్లు, ఒకటి ప్రభుత్వ బాలికల పాఠశాల, ఒకటి టీజీఆర్ఈఐఎస్లు ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు 44 గైడ్ కెప్టెన్లు, 19 మంది స్కౌట్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్లో శిక్షణ కొనసాగుతుంది. యూనిఫాంల కొనుగోళ్లపైనే శ్రద్ధ మూడు నెలల క్రితం ఆయా పాఠశాలలకు రూ.62వేలను అందించారు. పాఠశాల హెచ్ఎంలు ఎంపికై న విద్యార్థుల కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫాంలను కొనుగోలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్ఎంలకు యూనిపాంల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ ఉపాధ్యాయులను శిక్షణకు పంపించేందుకు చూపించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సగంమందికి పైగా గైర్హాజరు జిల్లాకు చెందిన 43 పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ను అమలు చేసేందుకు 44 గైడ్ టీచర్లు, 19 మంది స్కౌట్స్ మాస్టర్లను ఎంపిక చేశారు. వీరికి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సగం మందికిపైగా గైడ్ టీచర్లు, స్కౌట్స్ మాస్టర్లు గైర్హాజరవుతున్నారు. ఈ శిక్షణకు 25 మంది గైడ్ కెప్టెన్లు, 12 మంది స్కౌట్స్ మాస్టర్లు మాత్రమే శిక్షణకు హాజరవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులకు స్కౌట్స్ అండ్ గైడ్స్పై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం కల్పించిన అవకాశానికి మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు హాజరు కాకపోవడంతో విద్యార్థులు శిక్షణకు దూరమయ్యే అవకాశం నెలకొంది.ఉత్తర్వులు ఇచ్చి.. శిక్షణకు హాజరు కావాలని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకొంది. శిక్షణకు ఉపాధ్యాయులు వెళ్తున్నారా?.. లేదా అని జిల్లా విద్యా శాఖ పట్టించుకోవడం లేదని, అందుకే వెళ్లడం లేదని ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పలువురు ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ శిక్షణకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ హైమావతి, డీఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరై శిక్షణ పొంది విద్యార్థులకు దేశ భక్తిని, సేవ భావాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పొద్దుతిరుగుడు.. ఆశలు బోలెడు
ఆలోచన అదిరే.. తొగుట మండలపరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులపై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రోడ్డు పక్కనే పొద్దుతిరుగుడు పంటలు కనుచూపుమేర పసుపు పచ్చనిపూలతో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. అటుగా వెళ్లే వారంతా కొద్దిసేపు ఆగి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటరైతన్న ఆలోచన అదిరింది. తన వరి పంటను జంతువులు, పక్షుల నుంచి రక్షించడానికి పొలం చుట్టూ కంచె(వల)ను ఏర్పాటు చేశారు. అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండాకు చెందిన భూక్యా ధర్మనాయక్ కోళ్లు, పక్షులు తినకుండా ఉండేందుకు వరి పంట చుట్టూ ఇలా వలను ఏర్పాటు చేశారు. తండా సమీపంలోనే పొలం ఉండటంతో కోళ్లు వెళ్లి పంటను తినేస్తున్నాయి. దీంతో వాటి నుంచి రక్షణగా ఇలా వలను ఏర్పాటు చేశానని రైతు తెలిపారు. – అక్కన్నపేట(హుస్నాబాద్) -
బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక అభివృద్ధి
ఎంపీ రఘునందన్రావు దుబ్బాక: బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే దుబ్బాక వెనుకబడిన నియోజకవర్గమని, అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచే నిధులు వస్తాయన్నారు. ప్రజలు ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ప్రాంత బిడ్డగా దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజు, బీజేపీ రాష్ట్రనాయకులు తదితరులు ఉన్నారు. అభివృద్ధికి బాటలువేయండి గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగులో సస్యరక్షణ తప్పనిసరి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించారు. శుక్రవారం చిన్నకోడూరు, రామంచ, గంగాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు ఎకరానికి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాషియం వాడాలన్నారు. వరి నాటే ముందు వేర్లను జీవన ఎరువుల మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నాటు వేసుకోవాలన్నారు. వివిధ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేశారు. అలాగే ఎరువుల షాపులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా వస్తుందని ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. సేవాభావం అలవరుచుకోవాలివర్గల్(గజ్వేల్): విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవాభావం అలవరుచుకోవాలని జాతీయ అవార్డు గ్రహీత, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ డాక్టర్ దేశబోయిని నర్సింహులు అన్నారు. వర్గల్ మండలం రాంసాగర్పల్లిలో శుక్రవారం గజ్వేల్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో సర్పంచ్ నాగరాజుతో కలిసి ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. జట్టుగా నిర్వహించే కార్యక్రమాలు నాయకత్వలక్షణాలు పెంపొందిస్తాయని, జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యువత వ్యసనాల బారిన పడి నిర్వీర్యం కావొద్దని, సన్మార్గంలో ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ప్రదీప్గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఇందూరు’లోక్యాంపస్ ప్లేస్మెంట్స్ టెక్ మహీంద్రాకు 27 మంది ఎంపిక సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్లో 27 మంది విద్యార్థులు సర్వీస్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు తెలిపారు. హైదరాబాద్కు చెందిన టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 164 మంది పాల్గొన్నారు. వీరికి ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 27 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి సంవత్సరానికి రూ. 3.5 లక్షల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం సిద్దిపేటరూరల్: మాజీముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నారాయణరావుపేట, సిద్దిపేటరూరల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రహదారులపై రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కృషి చేసిన కేసీఆర్పై క్షక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ మేరకు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థిసంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి సిద్దిపేటకమాన్: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, కుమార్, ప్రణయ్ పాల్గొన్నారు. -
అవగాహనతోనే లెప్రసీ దూరం
కొండపాక(గజ్వేల్): అవగాహనతోనే లెప్రసీ (కుష్ఠు) వ్యాధిని దూరం చేసుకోవచ్చని జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి అన్నారు. మండలంలోని దుద్దెడలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామాల్లో కృష్ఠు వ్యాధి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండీటీ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. లెప్రసీ వ్యాధి నిర్మూలన కోసం గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, మండల వైద్యాధికారి శ్రీధర్, డీపీఎంఓలు పాల్గొన్నారు.జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబుసిద్దిపేటఅర్బన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయని, ముఖ్యమైన ప్రదేశాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు పిలుపునిచ్చారు. అర్బన్ మండలం పొన్నాలలో సర్పంచ్ అమ్ముల వెంకటయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. అంతకు ముందు గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ కన్వెన్షన్ హాల్, పెట్రోల్ బంక్లకు పంచాయతీ అసెస్మెంట్ చేసి పన్నులు వసూలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్లు అందుబాటులో ఉండాలని, ఇంటి పన్నులు ఎప్పటికప్పుడు సక్రమంగా వసూలు చేయాలని తీర్మానించారు. సర్పంచ్ వెంకటయ్య, కార్యదర్శి నరేశ్, ఉప సర్పంచ్ సృజన, మాజీ స ర్పంచ్ తన్నీరు శ్రీనివాస్, యాదగిరి, బాల్రంగం, సంపత్యాదవ్, శ్రావణ్, ఏఈఓ మీరాబాయి తదితరులు పాల్గొన్నారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు వర్గల్(గజ్వేల్): మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి అన్నారు. మండలంలోని గోవిందాపూర్లో ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
పారా అథ్లెటిక్స్లో దివ్యాంగుడి ప్రతిభ
మిరుదొడ్డి(దుబ్బాక): హైదరాబాద్ గచ్చిబౌ లిలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి పారా (వైకల్యం కలిగిన అథ్లెట్లు) అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో మిరుదొడ్డికి చెందిన దివ్యాంగుడు, తెలంగాణ వీల్ చైర్ క్రికెటర్ ఎర్రోళ్ళ పరశురాములు ప్రతిభ చాటారు. చాంపియన్షిప్లో షాట్ఫుట్, జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్, డిస్కస్ త్రోలో బ్రౌంజ్ మెడల్ సాధించారు. పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు దీప్తీ జీవంజి చేతుల మీదుగా మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అథ్లెటిక్ చాంపియన్ షిప్లో మెడల్స్ సాధించిన పరశురాములును గ్రామస్తులు శుక్రవారం అభినందించారు. మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తున్న రాందేవ్ చంద్రశేఖర్కు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్లో డాక్టరేట్ పట్టా పొందినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన చేసి ఇంగ్లిష్ లిటరేచర్లో పీహెచ్డీ పట్టా పొందారన్నారు. తమ అధ్యాపకుడికి డాక్టరేట్ రావ డం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రశేఖర్ను ప్రిన్సిపాల్, అధ్యాపకులు సన్మానించారు. సిద్దిపేటకమాన్: గ్రూప్ 3 పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఆడిటర్గా ఎంపికై న కానిస్టేబుల్ ఎర్రవల్లి సందీప్రెడ్డిని టూటౌన్ సీఐ ఉపేందర్ అభినందించారు. కానిస్టేబుల్గా విధులు నిర్వ హిస్తున్న సందీప్రెడ్డి ఇటీవల వెలువడిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ఫలితాల్లో ఆడిటర్గా ఎంపికయ్యారు. పోలీసు స్టేషన్లో శుక్రవారం సీఐ, సిబ్బంది సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూనే పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పోలీసు యూనిట్ నుంచి రిలీవ్ చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి సందీప్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మద్దూరు(హుస్నాబాద్): కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష విడనాడాలని, వారితో ప్రేమతో వ్యవహరించాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్య క్షుడు శనిగరం సత్యనారాయణ సూచించారు. మండలంలోని నర్సయపల్లిలో శుక్రవారం కుష్ఠువ్యాధి నిర్మూలనా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠువ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అన్నారు. ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా నమయవుతుందని, కుష్ఠు రహిత దేశం కోసం అందరు కృషి చేయాలని కోరారు. అనంతరం కుష్ఠువ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొగుట(దుబ్బాక): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలని సర్పంచ్ పాగాల శోభ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడలను శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రవీందర్, రమేశ్, ఏఎంసీ చైర్మన్ విజయ్రెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, తహసీల్దార్ సమీర్ అహ్మద్ఖాన్, ఎంపీడీఓ నాగేశ్వర్, సీఐ లతీఫ్, మాజీ సర్పంచ్ లు బాల్రెడ్డి, రాంరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్పై అవగాహన అవసరం
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలు మాత్రమే పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరికి డ్రైవింగ్, నిబంధనలపై అవగాహన ఉండా లని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. రోడ్డు భద్రతపై చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీల్లో విజేతలకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, మద్యపానం కలిగే వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై షార్ట్ వీడియోల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకరావడానికి యువత ముందుండాలన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, శ్రీధర్గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కప్తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. శుక్రవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. 30 మంది క్రీడాకారులకు దుస్తులను అందజేసిన భూంపల్లి 2వ వార్డు సభ్యుడు కొండల్ను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రెహమాన్, ఎంపీడీఓ సోమిరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సంయుక్త, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ రవి, సర్పంచ్లు జెన్నారెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ములుగులో ముగిసిన క్రీడలు ములుగు(గజ్వేల్): ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా సాగిన మండలస్థాయి క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్, కోకో, బాస్కెట్బాల్ క్రీడల్లో విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఎంపీడీఓ స్వర్ణకుమారి ఎంఈఓ ఉదయ్భాస్కర్రెడ్డి, ఎస్ఐ రఘుపతి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాల్రెడ్డి, సర్పంచ్ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం, వికాసం చేర్యాల(సిద్దిపేట): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం, వికాసం కలుగుతాయని ఎంపీడీఓ ప్రణయ్కుమార్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన క్రీడోత్సవాలను ఎంఈఓ నరేందర్, ఎస్ఐ నవీన్తో కలిసి ప్రారంభించారు. పీడీలు రామేశ్వర్రెడ్డి, కిషన్, శ్రీధర్, కవిత, రజిత, రమేశ్, అరుణ, సురేశ్, సంతోష్, ఎంఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నవోదయలో.. వర్గల్(గజ్వేల్): నవోదయ స్టేడియం వేదికగా వర్గల్లో ఆటల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు సత్తాచాటారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్రెడ్డి, తహసీల్దార్ రఘువీర్రెడ్డి, ఎంఈఓ సునీత, ప్రిన్సిపాల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డిలో.. మిరుదొడ్డి(దుబ్బాక): క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ చైన్నె భూపాల్గౌడ్, ఇన్చార్జి ఎంపీఓ ఫహీం, సర్పంచ్ మహేశ్వరి, ఉప సర్పంచ్ కరుణాకర్, భైరయ్య, ఉపాధ్యాయులు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్తో విద్యార్థులకు లబ్ధి
3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక ప్రశాంత్నగర్(సిద్దిపేట): సాక్షి దినపత్రికలో ప్రతి రోజు అందిస్తున్న స్టడీ మెటీరియల్తో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకురుస్తుందని 3వ వార్డు కౌన్సిలర్ వంగ రేణుక అన్నారు. రంగదాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు ఆమె ఆధ్వర్యంలో సాక్షి స్టడీ మెటీరియల్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ను నిపుణుల సాయంతో రూపొందించారన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ద్వారా రానున్న వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని సూచించారు. రూ.250కే స్టడీ మెటీరియల్ అందించడం ఆహ్వానించదగిన విషయమని, విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
హుస్నాబాద్/చేర్యాల(సిద్దిపేట)/గజ్వేల్/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినే షన్లు వేశారు. హుస్నాబాద్లో మొత్తం 149 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ 39, బీజేపీ 33, బీఆర్ఎస్ 39, సీపీఐ 5, జనసేన 5, బీఎస్పీ 6, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) 1, ఇండిపెండెంట్లు 21 మొత్తం 149 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు అయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. అలాగే చేర్యాల మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు 59 నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. చివరి రోజు 85 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. మూడు రోజులుగా వచ్చిన నామినేషన్ల వివరాలు పార్టీల వారీగా బీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 31, బీజేపీ 13, సీపీఎం 2, సీపీఐ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, బీఎస్పీ 1, ఇతరులు 9 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లో చివరి రోజు శుక్రవారం 185 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కాంగ్రెస్ 53, బీఆర్ఎస్ 57, బీజేపీ 40, బీఎస్పీ 1, సీపీఎం నుంచి 1 నామినేషన్లు దాఖలుకాగా, ఇండిపెండెంట్లు 21 మంది, మరో 12 మంది ఇతర రిజిష్టర్డ్ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు వెల్లడించారు. దుబ్బాక మున్సిపాల్టిలో చివరిరోజున 145 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 235 నామినేషన్లు వచ్చినట్లు కమిషనర్ రమేశ్కుమార్ తెలిపారు. -
అగ్నివీర్తో నాయకత్వ లక్షణాలు
● ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి ● ఆర్మీ రిక్రూట్మెంట్ మెడికల్ అధికారి ప్రకాశ్చంద్రరాయ్ సిద్దిపేటఎడ్యుకేషన్: అగ్నివీర్గా దేశానికి సేవచేయడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆర్మీ రిక్రూటింగ్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ప్రకాశ్చంద్రరాయ్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో శుక్రవారం విద్యార్థులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు అగ్నివీర్ ఒక్క చక్కని అవకాశమన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దళారులను నమ్మవద్దని సూచించారు. భవిష్యత్లో ఇతర ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్గా ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, శారీరక దృఢత్వ ప్రమాణాలు, వైద్యపరీక్షలు, శిక్షణ కాలం, విధులు, బాధ్యతల గురించి వివరించారు. అగ్నివీర్కు లభించే వేతనాలు, అలవెన్స్లు, బీమా, నాలుగేళ్లు పూర్తయ్యాక అందించే సేవానిధి తదితర అంశాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై కళాశాల విద్యార్థులు ఇర్ఫాన్, సునీల్ రూపొందించిన ఉత్తమ షార్ట్ఫిల్మ్కు ట్రాఫిక్ అధికా రులు అందించిన సర్టిఫికెట్లను ఆయన చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దరిపల్లి నగేశ్, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, అధ్యాపకులు రఘురాజ్, వెంకటరమణ, గంగాధర్, రాజ్యలక్ష్మి, రాజశేఖర్, నరేందర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, శ్రీకాంత్ సత్యం, ఫాతిమా, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పతనానికి నాంది
గజ్వేల్: కేసీఆర్కు సిట్ నోటీసులు.. రేవంత్రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సీఎంగా పదేళ్లు పాలించి.. రాష్ట్రం దశాదిశలను మార్చిన కేసీఆర్పై కుట్రలను ప్రజలు సహించరని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకున్న రేవంత్రెడ్డి ఫోన్ట్యాపింగ్ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
మోసమే కాంగ్రెస్ నైజం
● కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం ● మాజీ మంత్రి హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): అనేక హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపూర్లోని సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన మామీలను అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదని, రైతులకు సకాలంలో యూరియా అందడం లేదని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవండతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసం రాజిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేక్ పాయింట్ ఏర్పాటు చేయండి సిద్దిపేటజోన్: సిద్దిపేట ప్రాంతంలో రైలు సౌకర్యం ఉందని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక రేక్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులకు సూచించారు. గురువారం పత్తి మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా సహకార శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీ సెక్రటరీలతో పలు అంశాలపై అరా తీశారు. రైతు బజార్లో అనేక సమస్యలు ఉన్నాయని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పరిష్కరించాలని సూచించారు. సన్ ప్లవర్ కొనుగోలు మీద ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సన్న వడ్ల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
పుర పోరు.. నామినేషన్ల జోరు
రెండో రోజు 187.. ● ఇప్పటి వరకు 72 వార్డులకు 222 నామినేషన్ల స్వీకరణ సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు గురువారం నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులలో 187 నామినేషన్లు వచ్చాయి. మొత్తం ఇప్పటి వరకు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వేగం పెంచాయి. ఈ నేపథ్యంలో పురపాలికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ధీమాతో దాఖలు.. టికెట్ దక్కుతుందన్న ధీమాతో కొందరు, పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో మరికొందరు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ముఖ్యనేతల ఆశీస్సులు ఉన్న వారు, అంతర్గతంగా అభయం దక్కిన వారు కేంద్రాలకు వచ్చి దరఖాస్తులను తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఆయా పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. టికెట్ కోసం టెన్షన్ టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పలు చోట్ల పలు వార్డులకు సంబంధించి టికెట్లను ఖరారు చేయగా మరికొన్ని చోట్ల ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో వారితో చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తున్నారు. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోతే బీజేపీ నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు ఇవే.. మున్సిపాలిటీ 28న 29న మొత్తం హుస్నాబాద్ 04 26 30 గజ్వేల్ 08 68 76 దుబ్బాక 18 72 90 చేర్యాల 05 21 26 -
విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ హైమావతి ● బస్తీ దవాఖాన ఆకస్మిక తనిఖీసిద్దిపేటకమాన్: విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్ నగర్లోని బస్తీ దవాఖానను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ రెండు చోట్ల విధులు నిర్వహిస్తున్నారని, మధ్యాహ్నం 12గంటలకు మరో పీహెచ్సీ వెళ్లారని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. నర్సింగ్ స్టాఫ్ బాలమణి ఒక్కరే ఉన్నారని, సపోర్టింగ్ స్టాఫ్ రమ్య లేరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ను ఫోన్లో కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు సిద్దిపేటరూరల్: జిల్లాలో ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సీపీ రష్మీ పెరుమాళ్తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంటిమామిడి నుంచి తొటపల్లి వరకు రాజీవ్ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో సూచికబోర్డులు, ట్రబుల్స్టిక్స్, ఐరన్ బారికేడ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. కొమురవెల్లి కమాన్, దుద్దెడ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా ఉన్నందున వెంటనే భూసేకరణ చేపట్టి రోడ్డును సరిచేయాలన్నారు. కుకునూరుపల్లి వద్ద సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేసి, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, నేషనల్ హైవే, ఆర్అండ్బీ, మున్సిపల్, వైద్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సీపి సాధన రశ్మిపెరుమాల్తో కలిసి కలెక్టర్ కె. హైమావతి మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. -
వన దేవతల ఆగమనం.. పోటెత్తిన భక్తజనం
నంగునూరు మండలం అక్కెనపల్లిలోని సమ్మక్క సారలమ్మ ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో పులిగుండ్ల నుంచి సమ్మక్క ప్రతిమను తెచ్చి పూజారులు గద్దైపె ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సమ్మక్క, సారమ్మకు ఒడి బియ్యం పోసి నైవేద్యం సమర్పించారు. ఎమ్మెల్యే హరీశ్రావు పూజలు చేసి అమ్మవారికి బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. – నంగునూరు(సిద్దిపేట) సమ్మక్క గద్దె వద్ద భక్తజనం -
పొత్తు పొడిచేనా?
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ వైపు నామినేషన్ల సందడి నెలకొనగా.. మరోవైపు పొత్తులకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీల నుంచి ఆయా వార్డుల కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న వారందరూ నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికే ఆయా పార్టీలు పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని వార్డులకు అభ్యర్థులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రకటించాల్సి ఉంది. – సాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్– సీపీఎం పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా అందులో ఒక వార్డును సీపీఎంకు కేటాయించారు. 3వ వార్డును ముస్త్యాల లావణ్యకు సీపీఎం కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీలలో సీట్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. గజ్వేల్లో ఒకటి, దుబ్బాకలో రెండు వార్డులు అడుగుతున్నతున్నట్లు సమాచారం. ఈ రెండు మున్సిపాలిటీలలో పొత్తు కుదరకపోతే సొంతంగానే బరిలోనే దిగుతామని సీపీఎం నేతలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్–సీపీఐ చర్చలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అప్పటి నుంచి వారి మధ్య దోస్తీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా? ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది. పొత్తు కోసం కాంగ్రెస్, సీపీఐ నాయకులు చర్చలు జరుపుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో రెండు నుంచి మూడు వార్డులు అవకాశం ఇవ్వాలని సీపీఐ అడుగుతున్నట్లు సమాచారం. హుస్నాబాద్లో పొత్తులో భాగంగా సీసీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండి పడనుంది. సొంతం గా పోటీ చేస్తారా? పొత్తుతో ముందుకు వెళ్తారా? అనేది శుక్రవారం తేలిపోనుంది. వామపక్ష వేదికగా..ఆయా మున్సిపాలిటీలలో సీపీఐ, సీపీఎంలు ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించి చర్చలు ఫలించకపోతే వామపక్ష వేదికగా పోటీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. సీపీఎం, సీపీఐలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని పోటీ చేయాలనుకునే పలువురు అభ్యర్థులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వామపక్షాల తమ ఓటు బ్యాంక్ చాటాలని అనుకున్నట్లు సమాచారం.ఈ ఎన్నికల్లో ఒక్క చేర్యాల మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు కుదరగా మిగతా వాటిలో ఎలా ఉంటుందో చూడాలి. చేర్యాలలో బీఆర్ఎస్కు 11.. సీపీఎంకు 1చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని 12 వార్డుల్లో 11 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఒక వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. 11 వార్డుల్లో ఆరు వార్డులకు ఇదివరకే అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 5 వార్డులకు అభ్యర్థులుగా 2వ వార్డు కమలాపురం గీతాంజలి, 5వ వార్డు తొండెంగల రాజే శ్, 7వ వార్డు మేర్గు లక్ష్మణ్, 11వ వార్డు ఎండీ ఇజాజ్ అహ్మద్, 12వ వార్డు శివగారి భబితలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. మిగిలిన 3వ వార్డును సీపీఎంకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కొలిక్కిరాని కాంగ్రెస్ – సీపీఐ దోస్తీ -
బీఆర్ఎస్ నాయకుల ధర్నా
సిద్దిపేట పట్టణంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులుప్రశాంత్నగర్(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు పంపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్కు సిట్ నోటీసులు పంపడం తగదన్నారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘బంగారం’తో పొన్నం మొక్కులు
హుస్నాబాద్ పట్టణం ఎల్లమ్మ చెరువు వద్ద సమ్మక్క సారలమ్మ దేవతలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రాంతమంతా సమృద్ధిగా వర్షాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే శక్తిని ఇవ్వాలని అమ్మవార్లను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. కాగా సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. – హుస్నాబాద్ -
వచ్చేయ్.. దూకేయ్!
చేరికలపై ప్రధాన పార్టీల నజర్మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు.. చేరికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పట్టణాల్లో కొంచెం పేరున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా పార్టీలలో అసంతృప్తులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఒక అడుగు ముందుకేసి నామినేటెడ్ పోస్టులు సైతం ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. ఎలాగైనా బల్దియా పీఠం దక్కించుకోవాలని ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ పట్టణాల్లో గోడ దూకుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు అటు ఇటు జంపింగ్ చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో కౌన్సిలర్ టికెట్ దక్కని వారు, నామినేషన్ల ఉపసంహరణ సమయం వరకు జంప్ జిలానీల కార్యక్రమం ఊపందుకోనుంది. సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతలు దాకా కండువాలు మార్చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ఆకర్ష్ మంత్రం పఠిస్తున్నాయి. ఉన్న వాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లిన వారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. బీజేపీ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి దుబ్బాక మున్సిపాలిటీలోని 11వ వార్డు టికెట్ ఆశిస్తున్న రఫియుద్దిన్ బీఆర్ఎస్లో చేరారు. ఈ వార్డు టికెట్ రఫియోద్దిన్కే బీఆర్ఎస్ ఖరారు చేసే అవకాశం ఉంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన యువజన నాయకుడు తొండెంగుల రాజేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో చేరారు. రాజేశ్కు ఐదవ వార్డు టికెట్ దక్కె అవకాశాలున్నాయి. అలాగే దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో బీఆర్ఎస్లో చేరికలు ఇంకా అవకాశం ఉంది. ఆయా పార్టీలు కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తుంటే టికెట్ రాని ఆశావహులు వివిధ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉండటంతో టికెట్ దక్కని వారు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజులు చేరికల జోరు మరింత పెరగనుంది. అధికార పార్టీలోకి జోరుగా జంపింగ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుస్నాబాద్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, మాజీ వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆకుల వెంకన్నకు ఏదైనా నామినేట్ పోస్టు ఇచ్చే అవకాశాలున్నాయి. చేర్యాల పట్టణానికి చెందిన జెన్కో రిటైర్డ్ ఎస్ఈ కాటం సంజీవయ్య, రిటైర్డ్ టీచర్ తేజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ పదవిని తేజ ఆశిస్తున్నారు. దుబ్బాకలోని దుంపలపల్లిలో ఇద్దరు యువ నాయకులు కాంగ్రెస్లో చేరారు. -
కార్యాలయం లేక కష్టాలు
● హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ ● చేర్యాల మున్సిపాలిటీలో వింత పరిస్థితి చేర్యాల(సిద్దిపేట): పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా సరైన వసతులు లేక చేర్యాలలో అధికారులకు, పాలకవర్గానికి తిప్పలు తప్పడంలేదు. మున్సిపల్ కార్యాలయం కొన్ని రోజులు పాత గ్రామ పంచాయతీ భవనంలోనే కొనసాగింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పేరుతో కార్యాలయం కూల్చి వేశారు. దీంతో పట్టణ శివారులో ఉన్న ఎస్సీ హాస్టల్లోకి కార్యాలయాన్ని మార్చారు. ఇరుకు గదుల్లోనే ఉంటూ పట్టణ ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుత కార్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో పాత ప్రభుత్వ ఆస్పత్రిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. కొత్తగా కొలువుదీరే పాలవర్గంలోనైనా మున్సిపాలిటీకి సొంత భవనం ఏర్పాటు అయ్యేనా అన్న చర్చ పట్టణంలో జరుగుతోంది. -
తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ
సిద్దిపేటకమాన్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు స్థానిక పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 లోపు డిపాజి ట్ చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకెళ్లవచ్చన్నారు. డిపాజిట్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ సరిహద్దుల్లో నాలుగు చెక్పోస్టులను ఏర్పాటు చేసి, 24 గంటలూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. అత్యుత్తమ సేవలే గుర్తింపునిస్తాయి మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన అత్యుత్తమ సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట–భూంపల్లి పీహెచ్సీ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అదీభా ఖురేషి సేవలకు జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ మేరకు డాక్టర్ అదీభా ఖురేషిని బుధవారం పీహెచ్సీలో శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తూ పీహెచ్సీకి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భూంపల్లి సర్పంచ్ జెన్నారెడ్డి, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ములుగు(గజ్వేల్): ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి అన్నారు. ములుగు మండలం వంటిమామిడిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్, పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెండింగ్ బిలుల్లు చెల్లించాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధానకార్యదర్శి శశిధర్శర్మ, క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీర్చండి సిద్దిపేటకమాన్: సిద్దిపేట వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీర్చాలని ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు నర్సింహులు కోరారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని పెన్షనర్లు సెంటర్ ఇన్చార్జి వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ వ్యాధులకు అవసరమైన మందులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో తిరుపతి, రవిందర్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల పట్టివేత.. సర్పంచ్పై కేసు దుబ్బాకరూరల్: అక్బర్పేట– భూంపల్లి మండలం బొప్పాపూర్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరగడంతో సర్పంచ్ వాటిని పట్టించారు. కుక్కలను మెటల్ వైరుతో బంధించి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అదులపురం గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
తొలిరోజు 35 నామినేషన్లు
స్వీకరణ షురూ.. ● రేపటితో ముగియనున్న గడువుసాక్షి, సిద్దిపేట: జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలలో ఆయా కమిషనర్లు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. రెండు వార్డులకు కలిపి ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు గాను తొలి రోజు 35 నామినేషన్లు వచ్చాయి. దుబ్బాకలో 18, గజ్వేల్లో 8, చేర్యాలలో 5, హుస్నాబాద్లో నాలుగురు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. మంచి ముహూర్తం కోసం.. ఈ రెండు రోజుల్లో ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్కుల దగ్గరికి పోటీ దారులు సంప్రదిస్తున్నారు. దీంతో వారు చెప్పిన సమయంలోనే నామినేషన్లను దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు వెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. స్పీడ్ పెంచిన పార్టీలు ఆయా వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పార్టీలు వేగం పెంచాయి. ఇప్పటికే చేర్యాల మున్సిపాలిటీలో ఆరుగురిని ప్రకటించారు. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేశారు. ఒకే పార్టీ నుంచి ఎక్కువ మంది టికెట్ను ఆశిస్తున్న చోట్ల అందరిని నామినేషన్లను వేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి సమయంలో బీ ఫామ్లను నేరుగా ఎన్నికల అధికారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
కాలువకు గండి
నీట మునిగిన వరి పంటలు ● నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ తొగుట(దుబ్బాక): మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాకకు వెళ్లే కాలువకు పెద్దమాసాన్పల్లి శివారులో గండిపడింది. దీంతో సుమారు 30 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. నీటి ప్రవాహంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాట్లువేసిన కొద్దిరోజులకే పంట పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో అధికారులు దుబ్బాక కాలువలోకి నీటిని వదిలిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహంతో సుమారు కిలోమీటరు దూరంలో రాత్రి 11గంటల సమయంలో కాలువకు గండిపడింది. పంట పొలాల వద్ద ఉన్న రైతులు పరిస్థితిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే నీటిని నిలిపివేశారు. కాలువలో పేరుకుపోయిన పూడిక తీయకుండా అధికారులు నీటిని వదలడం వల్లే కాలువ తెగిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల నిర్లక్ష్యంతో బతుకులు ఆగమయ్యాయని రైతులు అన్నారు. పరిహరం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా నీటిపారుదల శాఖ డీఈఈ శిరీష, వ్యవసాయాధికారి మోహన్, ఏఈఓ నారార్జున పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలను నమోదుచేశారు. ఈ సందర్భంగా డీఈఈ శిరీష మాట్లాడుతూ పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వివరించారు. -
పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు
● కలెక్టర్ హైమావతి ● దుబ్బాకలో నామినేషన్ ప్రక్రియ పరిశీలనదుబ్బాకటౌన్: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతారణంలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 రోజుల పాటు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలోనీ దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాసిరకం మధ్యాన భోజనం అందిస్తే సహించేది లేదని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని, పోటీ చేసే అభ్యర్థులందరూ సహకరించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. పట్టణ కేంద్రంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి సెంటర్కి వచ్చిన సమయం నుంచి నామినేషన్ వేసి బయటికి వెళ్లే వరకు వీడియో తీయించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. -
తపాస్పల్లికి గోదావరి జలాలు
కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్పల్లి రిజర్వాయర్లోకి బుధవారం మాజీ ఎమ్మెల్యే, జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి చొరవతో ఇరిగేషన్ అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. నీటి పంపింగ్ కోసం రెండు పైపు లైన్లు ఉండగా ప్రస్తుతం ఒక లైను నుంచి నీటిని విడుదల చేశారు. ధర్మసాగర్ నుంచి బొమ్మకూరు మీదుగా తపాస్పల్లి రిజర్వాయర్ కు నీరు చేరుతోంది. రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపిన అనంతరం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి యాసంగికి సాగు నీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. -
బల్దియాలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే
హుస్నాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యతతో పని చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభిమోగించాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత నాదేనని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పొన్నం ప్రత్యేక దృష్టి గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా గౌరవెల్లి గురించే మాట్లాడుతారని తుమ్మల అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సర్వే ఆధారంగానే టికెట్లు సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. మున్సిపల్ గెలుపుతో, అభివృద్ధి మరింత జరగాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఇరిగేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రుల సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, మాజీ ఎంపీపీ వెంకట్, పలువురు నాయకులు మంత్రులు నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోహెడ మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు ఉన్నారు. -
‘జిజ్ఞాస’తో పరిశోధనా పరిజ్ఞానం
● డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● అధ్యాపకులకు అవగాహన కార్యక్రమంసిద్దిపేట ఎడ్యుకేషన్: జిజ్ఞాస ప్రాజెక్టుతో నైపుణ్యం మెరుగవుతుందని, పరిశోధనా పరిజ్ఞానం పెరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, జిజ్ఞాస ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్)లో బుధవారం అధ్యాపకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిజ్ఞాస ప్రాజెక్టు విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమస్యలు విశ్లేషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంతో విద్యార్థులు చిన్న స్థాయి పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వారి అకాడమిక్ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ జిజ్ఞాస, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధ్యాపకులు మెంటర్లుగా వ్యవహరిస్తూ ప్రాజెక్టుల ఎంపిక, అమలు, నివేదిక తయారీలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు, ఉత్తమ విద్యా ఆచరణలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుదర్శనం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గురు చరణ్ దాస్, జిజ్ఞాస కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘పుర’
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026సమరంమోగిన మున్సిపల్ ఎన్నికల నగారాఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. గతేడాది నుంచి ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికలకుసంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, 72 వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఓటరు తుది జాబితాను ఈ నెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూరి చేశారు. – సాక్షి, సిద్దిపేట -
నోడల్ అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణకు 13 విభాగాలుగా విభజించి పది మంది నోడల్ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకానికి అధికారిగా డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల సిబ్బందికి శిక్షణకు డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లకు డీపీఓ రవీందర్, ట్రాన్స్పోర్టుకు డీటీఓ లక్ష్మణ్, మెటీరియల్ మేనేజ్మెంట్ జెడ్పీ సీఈఓ రమేశ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిశీలన డీసీఓ వరలక్ష్మి, నోడల్ అబ్జర్వర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్ భార్గవ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికా రిగా డీఆర్ఓ నాగరాజమ్మ, మీడియా కమ్యూనేషన్కు డీపీఆర్ఓ రవికుమార్, హెల్ప్లైన్ ఫిర్యా దులు ఏవో రాజ్కుమార్లను నియమించారు.1.01 లక్షల మంది ఓటర్లు నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 20 9,873 9,348 06 19,227 దుబ్బాక 20 11.117 10,224 0 21,341 గజ్వేల్ 20 24,001 22,738 01 46,740 చేర్యాల 12 7,119 6,658 0 13,777ఆయా మున్సిపాలిటీలలో బుధవారం కమిషనర్లు ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. 11న ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. 176 పోలింగ్ స్టేషన్లు నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పీఓలు 210, ఏపీఓలు 210, ఓపీవోలు 420 మందిని నియమించారు. బ్యాలెట్ బాక్స్లను 422 సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. అలాగే నాలుగు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు ఎంపిక చేశారు. వాటిలో ఏర్పాట్లు చేయనున్నారు. ప్రచారానికి ఆరు రోజులే.. ఫిబ్రవరి 3న విత్ డ్రాలు, అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో48 గంటలు(రెండు రోజుల) ముందే ప్రచారం బంద్ అవుతుంది. దీంతో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీంతో నాయకుల్లో ఆందోళన నెలకొంది.చేర్యాలలోని హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ చేర్యాల మున్సిపాలిటీ ఇరుకు భవనంలో కొనసాగుతుండటంతో నామినేషన్ల స్వీకరణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో స్థానిక పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీలు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ కార్యాలయాల్లోనే నామినేషన్లను స్వీకరించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు నాలుగు మున్సిపాలిటీలకు ఆర్వోలు 44, ఏఆర్వోలు 44 మందిని నియమించారు. వీరికి శిక్షణ సైతం పూర్తి అయింది. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
సిద్దిపేటకమాన్: వారంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని యూనియన్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట రీజినల్ సెక్రట రీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పలు బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిన కాలంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం వారానికి ఆరు రోజుల పనితో ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్యూలు, ఐటీ, కార్పొరేట్ రంగాల్లో వారంలో ఐదు రోజుల పని అమల్లో ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఇది అమలు కాకపోవడం అసమానత్వానికి నిదర్శనమన్నారు. ఐదు రోజుల పని దినాల అమలుతో ఉద్యోగుల వర్క్, లైఫ్ మెరుగుపడి ఆరోగ్యం, ఒత్తిడి లేకుండా వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందిస్తారన్నారు. వివిధ బ్యాంక్లకు చెందిన సుమారు 200మంది సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలోపాల్గొన్నారు. -
నేతల్లో హడావుడి..
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని పార్టీల్లో హడావుడి మొదలైంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుది గుడువుగా విధించడంతో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. వచ్చే నెల 11న పోలింగ్ ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. – గజ్వేల్ నిన్నటిమొన్నటివరకు సాదాసీదాగా ఉన్న మున్సిపల్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో సహజంగానే ఇక్కడ గెలిచే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా ముందుకుసాగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడి మున్సిపల్ పీఠం చేజిక్కించుకోవాలనే సంకల్పంతో సర్వశక్తుల ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు.. తమ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నాయకులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఓ నాయకుడు తనను గెలిపిస్తే.. వార్డుకు చెందిన ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. మరో నాయకుడు తన సతీమణి పోటీ చేసే వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇకపోతే మరికొందరు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కొందరైతే ఇప్పటికే రెండేసి, మూడేసి రౌండ్లు తమ వార్డుల్లో ప్రచారం పూర్తి చేశారు. తాయిలాలు ప్రకటిస్తూ ఓటర్లను మచ్చికచేసుకునే పనిలో పడ్డారు. మరొకొందరు నేతలు హామీలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసిచూపిస్తానంటున్నారు. అంతేకాకుండా పార్టీల ముఖ్య నేతలు భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా వార్డుల వారీగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపట్టి క్యాడర్ను కూడగట్టి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. వార్డులవారీగా ముఖ్యమైన నేతలను ఇన్చార్జిలుగా నియమించారు.రేపోమాపో కొలిక్కి.. అభ్యర్థుల ఎంపిక వడివడి అన్ని పార్టీల్లోనూ సందడి -
రక్షణ చట్టం తేవాల్సిందే
కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన హుస్నాబాద్: దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం విధులు బహిష్కరించి హుస్నాబాద్ కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, రక్షణ కరువైందన్నారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. విద్యుత్ సమస్యలా..? 1912కి ఫోన్ చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యుత్ సమస్యలుంటే విద్యుత్శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలని డీఈ రామచంద్రయ్య మంగళవారం తెలిపారు. సిద్దిపేట డివిజన్లో ఎక్కడ సమస్యలున్నా.. కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా వినియోగదారులు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆయిల్పామ్ సాగుతో బోలెడు లాభాలు కొమురవెల్లి(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగుతో బోలెడు లాభాలు పొందవచ్చని, రైతులు సాగుకు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.సువర్ణ సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఆయిల్పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్లు అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే విధంగా కచ్చితమైన మార్కెట్ సదుపాయం ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డి, మండల ఉద్యాన అధికారిని కౌసల్య తదితరులు పాల్గొన్నారు. సెంట్రింగ్ పనులు బంద్గజ్వేల్రూరల్: సెంట్రింగ్ కార్మికులు తమకు గిట్టుబాటు కూలీ రావడం లేదంటూ ధరలను పెంచే వరకు పనులు బంద్ చేస్తున్నట్లు గజ్వేల్ సెంట్రింగ్ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కూలీ డబ్బులు గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాలను నెట్టుకురాలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సెంట్రింగ్ కార్మికులు హెల్త్ కార్డులు అందించాలని, కార్మికుల హక్కులు అమలయ్యేంతవరకు పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు వివిధ సెంట్రింగ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బృందావనంలో వేడుకలు వర్గల్(గజ్వేల్): నాచగిరి రాఘవేంద్ర బృందావనంలో మంగళవారం మధ్వనవమి వేడుకలు ఘనంగా జరిగా యి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామివారి సన్నిధిలో తెలంగాణ మధ్వమండలి ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు ఉదయం సుప్రభాతం, పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రవచనం, రథోత్సవం వైభవంగా చేపట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గాడిచర్ల మదన్మోహన్రావు, ఉపేందర్రావు, గోవర్ధన్రావు తదితర మధ్వమండలి ప్రతినిధులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బృందావనంలో భక్తిపారవశ్యం నెలకొంది. -
పకడ్బందీగా ఎన్నికలు: కలెక్టర్
సిద్దిపేటరూరల్: అందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికలు సైతం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతులలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల గురించి మాస్టర్ ట్రైనర్ అందించే శిక్షణ క్లుప్తంగా నేర్చుకోవాలన్నారు. ఎన్నికల కరదీపికలోని మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ జరపాలన్నారు. ప్రతి అర్ఓ.. ఎలక్షన్ కరదీపికపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ప్రక్రియకు ఎలక్ట్రోరల్ రోల్ అతి ముఖ్యమైనదని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా ఒక నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హుస్నాబాద్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్లు మల్లికార్జున్, రమేష్, మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి సిద్దిపేటరూరల్: ఎన్నికల మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. నియమితులైన నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్కుమార్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీసీఈఓ రమేశ్, డిపిఆర్ఓ రవికుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన గజ్వేల్రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంక ట గోపాల్కు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, గజ్వే ల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి తదితరులున్నారు. -
ఆకట్టుకున్న
ప్రదర్శనలు● అలరించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ ● ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాల అందజేతసిద్దిపేటకమాన్: జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరేడ్గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ కె.హైమావతి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు వెంకటాచారి, పద్మను పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్తో కలిసి కలెక్టర్ హైమావతి సన్మానించారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన వేడుకల్లో గృహ నిర్మాణ సంస్థ ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్శాఖ గృహజ్యోతి, ఆర్టీసీ మహాలక్ష్మీ పథకం, రవాణశాఖ రోడ్డు భద్రత, వ్యవసాయశాఖ, డీఆర్డీఓ, ఉద్యాన పట్టుపరిశ్రమ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అటవీశాఖ, ఫైర్, ఫుడ్ అండ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ, లీడ్బ్యాంక్, క్రీడా శాఖ శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పరేడ్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు శాఖల స్టాళ్లను సీపీతో కలిసి కలెక్టర్ తిలకించారు. జిల్లాలోని వివిధశాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన 181 మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో ఇబ్బందులు పోలీసు కమిషనరేట్ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో వేడుకల్లో అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. సామన్య ప్రజలు మాత్రం హాజరు కాలేకపోయారు. వేడుకల్లో పాల్గొనడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేట్ ఆటోలలో పరిమితికి మించి తరలించారు. జిల్లా కేంద్రంలోనే వేడుకలు నిర్వ హించాలని పలువురు కోరుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, విద్యాసాగర్, శ్రీధర్గౌడ్, శ్రీను, లతీఫ్, ప్రవీణ్కుమార్, సైదా, రామకృష్ణ, ఆర్డీఓలు, తహాసీల్దార్ హరికిరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గెలుపు గుర్రాల కోసం వేట
సర్వే నిర్వహిస్తున్న పార్టీలు ● చాలా వార్డుల్లో పోటీ తీవ్రం ● తలనొప్పిగా మారిన టికెట్ల కేటాయింపుదుబ్బాక: మున్సిపల్ ఎన్నికల నగారా మోగే సమయం దగ్గర పడటంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. నేడే, రేపో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థుల హడావిడి ఎక్కువైంది. ఇప్పటికే దుబ్బాక మున్సిపల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడమే కాక, గెలుపు గుర్రాల ఎంపికకు జోరుగా సర్వేలు చేపడుతున్నాయి. పార్టీల అధిష్టానాలకు తలనొప్పి దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో పలు వార్డుల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సైతం పలు వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్లోని 20 వార్డులున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి ఇబ్బందిగా తయారైంది. వార్డుల వారీగా ఇప్పటికే సర్వే నిర్వహిస్తున్న ఆయన... గెలిచే వారికే టికెట్ ఇస్తామని కరాఖండిగా చెబుతున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 82, కాంగ్రెస్ 67, బీజేపీ నుంచి 52 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్ బీసీ మహిళ కావడంతోనే.. మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కావడంతో ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు జనరల్ స్థానాల్లో సైతం మహిళలనే పోటీకి దింపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యధిక వార్డులు గెలుచుకొని చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలున్నాయి. మంత్రి వివేక్, చెరుకు శ్రీనివాస్రెడ్డి మున్సిపల్లో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, క్యాడర్తో సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్లో తలనొప్పిగా తయారైన టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీలు ఎలా కేటాయిస్తాయో వేచి చూడాలి. -
జెండావిష్కరణ చేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే, బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ల్లో అధికారులు జెండా వందనం చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఆపరేషన్ సింధూర్లో భాగమైన వివిధ రకాల రాకెట్స్లు, భారత వ్యోమగామిలను శకటాల రూపంలో ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు. బహుమతులు ప్రదానంసిద్దిపేటకమాన్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డేను పురస్కరించుకుని న్యాయ విద్యార్థులకు వ్యాసరచన, రీల్స్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలు నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాధన, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయసేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నేతలతోనే పట్టణాభివృద్ధి సాధ్యం నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణహుస్నాబాద్: గత ఎమ్మెల్యేలు దేశిని చిన్నమల్లయ్య, చాడ వెంకట్రెడ్డిల హయాంలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ అన్నారు. అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, విద్యుత్ సౌకర్యం, ఎస్బీఐ బ్యాంక్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయించిన ఘనత వారికే దక్కిందని గుర్తుచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లోను తమ అభ్యర్థులను నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లేశ్, నాయకులు సంజీవరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జెండా తలకిందులు!
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతిదుబ్బాక: పట్టణంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు, అక్కడున్న వారు గమనించి జెండాను కిందికి దింపి సరిచేశారు. అనంతరం మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సంఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏం చేయడం లేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను వారించి ఎమ్మెల్యేను పంపించారు. జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
గులాబీ జెండా ఎగరాలి
● ప్రతి కార్యకర్త కష్టపడాలి ● హరీశ్రావు దిశానిర్దేశం ● బీఆర్ఎస్లో చేరిన రామాయంపేట కాంగ్రెస్ నేత సిద్దిపేటజోన్/సిద్దిపేటరూరల్/సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కాంగ్రెస్ నేత బాలు జొన్నల సోమవారం సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పిన హరీశ్.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికల గూర్చి దిశానిర్దేశం చేశారు. కాగా, స్థానిక 43 వార్డుకు చెందిన యశోధకు రూ.2,75 లక్షలు, చిన్నకోడూర్ మండల కేంద్రానికి చెందిన పూజకు రూ లక్ష విలువైన ఎల్ఓసి అందించారు. అదేవిధంగా వివిధ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ లు ఆవిష్కరించారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి తనిఖీ ప్రభుత్వాసుపత్రిలో కేన్సర్ సేవలు మరింత మెరుగు పడాలని హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఐసీయూ, కేన్సర్ విభాగాల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి రోజు అన్నం పెడుతున్నారా? సౌకర్యాలు మంచిగ ఉన్నాయా..? అని రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్రావు మాట్లాడుతూ.. చికిత్స కోసం వచ్చే రోగులకు మందులు బయటకు రాయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ చందర్, సీఎస్ఆర్ఎంఓ జ్యోతి, ఆర్ఎంఓ సదానందం, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హరీశ్రావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. మెడికల్ సీటు సాధిస్తే ఫీజు నేనే భరిస్తా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైద్య కళాశాలలో సీటు సాధిస్తే ఫీజులు తానే సొంతంగా భరిస్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని చింతమడక బీసీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వచ్చే ఏడాదిలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లను 280కి పెంచుతామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన వారికి సొంతంగా ఐ ప్యాడ్ కొనిస్తానన్నారు. కాగా, జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన 11 మంది విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మోత్కు లతా శంకర్, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును
హుస్నాబాద్ మున్సిపల్పై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఈ ప్రధాన పార్టీలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని పార్టీలు సీట్లు సర్దుబాటు చేస్తూ గెలిచే అవకాశాలున్న వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. – హుస్నాబాద్ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో ఆశావహులు పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు కలియదిరుగుతున్నారు. ఏ పార్టీ గుర్తు వచ్చినా పోటీ చేయడం ఖాయమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలకు కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్యానెల్ కోసం వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థుల వివరాలను పార్టీ నాయకులు మంత్రికి సమర్పించారు. మార్పులు, చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. మరోవైపు చేరికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు మంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. వారు రేపో మాపో మంచి ముహూర్తం చూసుకుని చేరనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించి భంగపడేవారిని తమ పార్టీల్లోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బండి సంజయ్ ప్రచారం.. హుస్నాబాద్ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. ఈసారి అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు అభ్యర్థుల కోసం ఆయన వేట ప్రారంభించారు. ఇదిలా ఉండగా బీజేపీలో వర్గాల కుంపటిపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వర్గపోరుకు స్వస్తి పలికి కార్యకర్తలను ఏకతాటిపై తేస్తేనే గానీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న సీట్లను సాధించే అవకాశం ఉండకపోవచ్చని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అగ్రనేతల ప్రచారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఏకై క హుస్నాబాద్ మున్సిపాలిటీని కై వసం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గత రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ, మూడోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. -
● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విలువ చేసే ఉచిత బస్సు ప్రయాణం వినియోగం ● జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ హైమావతి ● పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
సాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ హైమావతి అన్నారు. పోలీసు కమిషనరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో రూ 299.78కోట్ల విలువైన ఉచిత ప్రయాణం పథకంలో 7.89 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ 77.56 కోట్లతో 26,481మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు. 9 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల సాకా రం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంది రమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 13,057 మంజూరయ్యాని కలెక్టర్ తెలిపారు. వాటిలో 9,079 మంది ఇళ్లు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు 110 ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణం చేసుకున్న వారికి రూ183.39 కోట్లను అందించినట్లు వివరించారు. 1,79,860 మంది లబ్ధిదారులకు 7,53,962 సిలిండర్లను సబ్సిడీపై అందిచామన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ను 2,03,611 గృహాలకు రూ 140 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. రైతు భరోసా జిల్లాలో 2025–26 సంవత్సరం వానాకాలంలో మొత్తం 3.19 లక్షల మంది రైతులకు రూ 355 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేశామని హైమావతి పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద 2025–26 సంవత్సరానికి 275 మంది రైతుల నామినీ ఖాతాలలో రూ13.75 కోట్లను జమ చేశామన్నారు. యాసంగి సీజన్కు 81,787 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఆయిల్పామ్ సాగు విస్తరణ జరుగుతుందని తెలిపారు. నాబార్డు,. రాష్ట్ర ప్రణాళిక సహకారంతో రూ.83.76కోట్లతో 6,520 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా 19 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు. సేంద్రియ ఎరువులతో ఆదాయం పంచాయతీలలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తతో 90,875 కిలోల సేంద్రియ ఎరువును తయా రు చేయగా.. రూ3.26లక్షల ఆదాయం వచ్చి ందని కలెక్టర్ తెలిపారు. అలాగే 1,04,854 కిలోల పొడి చెత్త విక్రయంతో రూ 3,01,866 ఆదాయం గ్రామ పంచాయతీలకు లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 14,909 స్వయం సహాయక సంఘాలకు రూ886 కోట్లను బ్యాంకు రుణాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 10,080 సంఘాలకు రూ 839 కోట్ల రుణాలు అందించామని ఆమె వివరించారు. గ్రామైక్య సంఘాలకు భవనాలు జిల్లావ్యాప్తంగా 111 గ్రామైక్య సంఘ భవనాల నిర్మాణాలకు రూ11.10 కోట్లను మంజూరు చేసిన ట్లు హైమావతి తెలిపారు. 3,31,970 కుటుంబా లకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. వానాకాలంలో 3.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ 670 కోట్లతో 158.45 కి.మీ.ల రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయి. పీఆర్ శాఖ రూ73.66కోట్లతో 793 సీసీ రోడ్లు మంజూరు కాగా 722 పూర్తి కాగా ఇంకా 71 పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.కనువిప్పు కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.పోలీసుల గౌరవ వందనం సిద్దిపేటరూరల్: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వ హించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హైమావతి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. అంతకుముందుకలెక్టర్కు పోలీసులు గౌరవ వందనం చేశారు. -
కక్షగట్టి 20 కేసులు పెట్టించిండ్రు
దుబ్బాక: ‘రాజకీయంగా భిక్షపెట్టిన ఈ గడ్డపై నాకున్న ప్రేమ.. ప్రభాకర్రెడ్డికి ఉందా?, దుబ్బాక ఉప ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా గెలిచాక కక్షగట్టి నాపై 20 కేసులు పెట్టించారని, అయినా భయపడలేదని, తెగించి ధైర్యంగా ఎదుర్కొన్నా’నని ఎంపీ మాధవనేని రఘునందన్రావు తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని 15, 16, 19, 20 వార్డులలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి గెలిచి దుబ్బాకకు ఏం చేశారని, ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్లో గెలిస్తే మళ్లీ పరాయి పెత్తనం కింద ఉంటుందని అందుకే ఈ సారి బీజేపీకి పట్టం కట్టలన్నారు. దుబ్బాకపై సిద్దిపేట పెత్తనం ఎందుకని మొదటి నుంచి తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి చెందలేదని, రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను తాను ఛాలెంజ్గా తీసుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆధారాలున్నా అరెస్ట్ చేయరేం ● ఫోన్ ట్యాపింగ్లో స్పష్టమైన ఆధారాలున్నా ప్రభుత్వం, సిట్ ఏం చేస్తుందని, ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ఎంపీ ప్రశ్నించారు. ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క బీఆర్ఎస్ నాయకుడి అవినీతిని వెలికితీసింది లేదు.. అరెస్ట్ చేసింది లేదన్నారు. ● బావ, బామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్కు చేతకాకపోతే వచ్చేది మేమే అప్పుడు తప్పకుండా చూస్తామంటూ రఘునందన్రావు అన్నారు. -
ఢీ
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026మున్సిపాలిటీల్లో పొలిటికల్ స్పీడ్శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కాంగ్రెస్ రాజకీయ వేసాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మున్సిపాలిటీల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుండటంతో బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇలా మూడు పార్టీలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. జోరు పెంచిన కారు మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే హుస్నాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. చేర్యాల పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ బాకీ కార్డులను ప్రజలకు అందిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దుబ్బాక పట్టణంలో సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ప్రతాప్ రెడ్డి, రాధకృష్ణ శర్మలు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విజయసంకల్ప సభలతో.. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో విజయసంకల్ప సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అలాగే దుబ్బాక పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాదవనేని రఘునందన్రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్లు నిర్వహించారు. మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక కోసం త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు.అభివృద్ధి పనులతో.. పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముందస్తుగానే పలు ప్రారంభోత్సవాలను ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్లు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వీబీ జీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. -
ఓటు.. బ్రహ్మాస్త్రం
జిల్లాలో 9.94లక్షల మంది ఓటర్లు ● నూతనంగా పొందిన వారు 24వేల మంది ● నేడు జాతీయ ఓటరు దినోత్సవం సాక్షి, సిద్దిపేట: ఓటు అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కోరుకున్న పాలనను తెచ్చుకోవచ్చు. మంచి నాయకులను ఎన్నుకోవచ్చు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలు చేపడుతున్నా 90శాతానికి పోలింగ్ చేరడం లేదు. గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ ఓటర్లే వెనుకంజ వేస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఈ కథనం.. అసెంబ్లీలోనే ఎక్కువ గత శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ నమోదును పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో 83.05 శాతం, లోక్సభ ఎన్నికల్లో 78.32శాతం, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.29శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతివలే అధికం జిల్లాలో అతివలే అధికంగా ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9,94,786 ఓటర్లున్నారు. అందులో పురుషులు 4,86,221, మహిళలు 5,08,480, ఇతరులు 85 మంది ఉన్నారు. వీరిలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారు 24,183 ఉండగా అందులో పురుషులు 14,267, మహిళలు 9,915, ఇతరులు ఒకరు ఉన్నారు.కలెక్టర్కు అవార్డు ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వారిని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. అందులో ఉత్తమ ఎన్నికల సాధన అవార్డుకు కలెక్టర్ హైమావతి, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పని చేసిన గరీమా అగర్వాల్ (ప్రస్తుత సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్), బెస్ట్ బీఎల్ఓగా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 185 పోలింగ్ స్టేషన్ బీఎల్ఓ పుష్పలత ఎంపికయ్యారు. వీరు ఆదివారం హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 1,25,004 1,30,203 09 2,55216సిద్దిపేట 1,19,001 1,24,226 70 2,43,297దుబ్బాక 99,193 1,05,537 01 2,04,731గజ్వేల్ 1,43,023 1,48,514 05 2,91,542 -
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఏసీపీ రవీందర్రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాలల విద్యార్థులు సిద్దిపేట పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదన్నారు. అనంతరం పిల్లలతో రహదారి భద్రత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్రెడ్డి, పోలీసు, రవాణశాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఏసీపీ రవీందర్రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
కలెక్టర్ హైమావతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో 5 రోజుల పాటుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. అనంతరం మహిళా రైతులకు ధ్రువపత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమన్నారు. శిక్షణ కార్యక్రమంలో జీవామృతం, బీజామృతం, దశపర్ణి కషాయం, ఐదు పొరల సాగు నమూనా, వామ్, ట్రైకోడెర్మా తయారీ విధానాలపై కషి సఖిలకు సమగ్ర శిక్షణ అందించామని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ అధికారి మైథిలి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లు
ఎన్నికల నిర్వహణ, ఓటింగ్, కౌంటింగ్పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు మాక్ పోలింగ్ చేపట్టారు. విద్యార్థులే అభ్యర్థులు.. ఓటర్లుగా పాల్గొని ప్రత్యక్ష అనుభూతిని పొందా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులే అన్ని తామై విజయవంతం చేశారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల ప్రక్రియ లాగే చేపట్టారు. ఎలక్షన్ కమిషనర్, పోలింగ్ అధికారి, పోలింగ్ ఏజెంట్, పోలింగ్ సిబ్బంది విధులను విద్యార్థులే నిర్వర్తించారు. ఎన్సీసీ విద్యార్థులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికలు ఏ విధంగాజరుగుతాయో ఈ మాక్ పోలింగ్ ద్వారా తెలిసిందన్నారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులుబడిలో మాక్ పోలింగ్ భళా -
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి(సిద్దిపేట): గ్రామాలలో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తోటపల్లి, బెజ్జంకి క్రాసింగ్, పోతారం, రేగులపల్లె తదితర గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంస్థాపన చేశారు. పోతారంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్ల సమస్య పరిష్కారానికి సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు రత్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మిర్చి సాగు లాభదాయకం చిన్నకోడూరు(సిద్దిపేట): మిర్చి సాగు లాభదాయకమని, రైతులు మిర్చి సాగుకు ఆసక్తి చూపాలని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని గంగాపూర్లో మిర్చి మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న పంటలు కాకుండా కూరగాయలు, మిర్చి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిర్చి మార్కెట్లో విక్రయించాలన్నారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ ిసద్దిపేటరూరల్: చేనేత కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వృత్తిపరమైన పరికరాలు, ముడిసరుకు కొనుగోలు నిమిత్తం వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేశారన్నారు. జిల్లాలోని ఏడుగురి కార్మికులకు చెందిన రూ.5 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నేడు సామూహికసూర్య నమస్కారాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): రథసప్తమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్రోడ్లో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6.15 నుంచి 7.30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. -
రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్రూరల్: రక్తదానంతో అత్యవసర సమయాల్లో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆపన్నహస్త మిత్రబృందం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రక్తాన్ని దానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందన్నారు. శిబిరంలో రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్ సహకారంతో 277 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పుస్తక పఠనం ఎంతో మేలుజిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ములుగు(గజ్వేల్): గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకుని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ్భాస్కర్రెడ్డి, సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి, పాఠశాల హెచ్ఎం గీత తదితరులు పాల్గొన్నారు. పంటలు పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు సిద్దిపేటరూరల్: రాజేంద్రనగర్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పలు పంటలను పరిశీలించారు. బుస్సాపూర్లో మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటకు కత్తెర పురుగు ఆశించినందున నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 80గ్రాములు, లీటర్ వేప నూనె కలిపి ఎకరానికి పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తలు చంద్రమోహన్, భద్రు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండిహుస్నాబాద్రూరల్: మహిళా గ్రామైక్య భవనాల పనులను సర్పంచ్లు త్వరగా పూర్తి చేయాలని ఏపీఎం తిరుపతి అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్, రాములపల్లి గ్రామాల్లో గ్రామైక్య సంఘాల భవనాల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని, వ్యాపారంలో ప్రోత్సహించడానికి వడ్డీ లేని రుణాలను సైతం అందిస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొంది పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు తిరుమల, పద్మలు పాల్గొన్నారు. -
అభివృద్ధికి బాటలు వేస్తాం
సిద్దిపేటఅర్బన్: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని సర్పంచ్లు అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి దశలో కోహెడ, కొమురవెల్లి, నారాయణరావుపేట, చిన్నకోడూరు, దుబ్బాక మండలాలకు చెందిన 98 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణకు హాజరైన సర్పంచ్లను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారని, గ్రామాన్ని అభివృద్ది చేసుకోవడానికి అవసరమైన నిధులను ఎలా సమీకరించుకోవాలి? నిధులను ఎలా ఖర్చు చేయాలి? అనే అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగిందని వారు అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పరిపాలనలో ఉపయోగించి తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహిళా సాధికారతకు కృషి గ్రామంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తా. గ్రామ సభ ఆదర్శంగా ఉండేలా నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా. వీధి లైట్ల అన్నింటిని సోలార్ విద్యుత్తో నడిచేలా మారుస్తాం. – ఆకుల స్వప్న, సర్పంచ్, గుర్రాలగొందిపాలనపై పట్టు పెరిగింది శిక్షణలో తెలిసిన అంశాలతో గ్రామ పాలనపై పట్టుపెరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తా. – సురగోని శేఖర్, సర్పంచ్, చంద్లాపూర్ -
‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర
గజ్వేల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర సాగిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్ మండలం దాచారంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిలతో కలిసి ఉపాధి హామీ కూలీలు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన 60శాతం నిధుల్లో కోత విధించే కుట్రలో భాగంగానే.. ఈ పథకానికి ‘వీబీ జీరామ్జీ’ పేరును మార్చారని మండిపడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై భారాన్ని మోపాలని చూస్తున్నదని చెప్పారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను సైతం కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. దేశంలో కూలీలు ఉపాధిలేక అల్లాడుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం కామన్ మినీమమ్ ప్రోగ్రామ్లో భాగంగా.. మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి మహత్తర పథకంపై కుట్రలను సహించేదీలేదన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధికూలీలు ఈ పథకం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారి హక్కులను కాపాడటానికి పోరాటాన్ని ముమ్మరం చేస్తామన్నారు. జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాల్సిందే చిన్నకోడూరు(సిద్దిపేట): పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జీ రామ్ జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కూలీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి పేదలపై, గ్రామ పంచాయతీల అభివృద్ధిపై చిత్త శుద్ధిలేదన్నారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వాగ్వాదం.. తోపులాట పార్టీ మండల అధ్యక్షుడికే సమావేశం గురించి సమాచారం ఇవ్వలేదంటూ మీసం మహేందర్ తన అనుచరులతో కలిసి సచిన్ సావత్కు వివరించారు. దీంతో మరో వర్గం నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. -
ఏర్పాట్ల జోరు
పుర పోరు..జిల్లాలో నాలుగు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే వార్డులు, చైర్మన్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో)లకు శిక్షణ ఇవ్వనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ పత్రాల స్వీకరణ కోసం రెండు వార్డులకు కలిపి ఒక చోట నామినేషన్ స్వీకరణ కౌంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 49 ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమించారు. వీటిలోనే 20శాతం అధికారులను రిజర్వులో ఉంచనున్నారు. ఇప్పటికే అధికారులకు ఆర్వో, ఏఆర్వోలకు సంబంధించి ఆర్డర్లను పంపించారు. 176 పోలింగ్ కేంద్రాలు నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 198 బ్యాలెట్ బాక్స్లు అవసరం ఉంటాయని ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే డీపీఓకు లేఖలు అందించారు. దీంతో వాటిని మరమ్మతులు, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు. త్వరలో వాటిని ఆయా మున్సిపాలిటీలు తీసుకవెళ్లనున్నాయి. బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచేందుకు, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. చేర్యాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, హుస్నాబాద్లో తెలంగాణ మోడల్ స్కూల్, దుబ్బాకలో లచ్చపేట మోడల్ స్కూల్, గజ్వేల్లో బాలికల ఎడ్యుకేషన్ హబ్లలో ఏర్పాటు చేయనున్నారు. 13మంది నోడల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13 మంది నోడల్ అధికారుల నియమించారు. మ్యాన్పవర్ మేనేజ్మెంట్, వెబ్క్యాస్టింగ్, కోడ్ అమలు, సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ట్రాన్స్పోర్ట్, శిక్షణ నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఖర్చులు, పరిశీలకులు, మీడియా కమ్యూనికేషన్, నివేదికల తయారీ తదితర సంబంధించి 13 మందిని నియమించారు. వారికి బాధ్యతలను అప్పగించనున్నారు.మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ కేంద్రాల సంఖ్య చేర్యాల 12 24దుబ్బాక 20 41హుస్నాబాద్ 20 40గజ్వేల్ 20 71పకడ్బందీ చర్యలు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. పకడ్బందీ చర్యలు చేపట్టాం. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నాం. హుస్నాబాద్లో మోడల్ స్కూల్ కౌంటింగ్, స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశాం. – మల్లికార్జున్, కమిషనర్, పురపాలక సంఘం, హుస్నాబాద్సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
విద్యాధరి.. అక్షర ఝరివర్గల్(గజ్వేల్): స్వర్ణకిరీటాది సర్వాభరణాలతో విద్యాసరస్వతిదేవి దర్శనం.. పోటెత్తిన భక్తజనం.. చిన్నారుల అక్షరాభ్యాసాలు.. అభిషేకాలు, అర్చనలు, పారాయణాలు, పుష్పార్చనలతో వర్గల్ క్షేత్రం వసంతోత్సవ సిరితో అలరారింది. శుక్రవారం వసంత పంచమి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున పుష్పగిరి పీఠాధిపతి అమ్మవారి విశేషాభిషేకం నిర్వహించగా, చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అర్చక పరివారం సరస్వతిమాతకు లక్ష పుష్పార్చన, చెప్పన్భోగ్ మహా నివేదనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సకల విద్యలకు మూలమైన విద్యాసరస్వతి అమ్మవారు స్వర్ణ కిరీటాది విశేషాభరణాలతో దివ్యదర్శనమిచ్చారు. ప్రముఖుల సందర్శన వర్గల్ క్షేత్రాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్ హైమావతి, సీపీ రశ్మీ పెరుమాళ్, ఏసీపీ నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దాదాపు 60వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 6వేల వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. రోజంతా క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.కలెక్టర్ ప్రత్యేక పూజలు చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. కలెక్టర్ హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో క్షేత్రం మార్మోగింది.వర్గల్ క్షేత్రంలో వసంతోత్సవ సిరి దేవీనామంతో మార్మోగిన శంభుగిరులు వెల్లువగా చిన్నారుల అక్షరాభ్యాసాలు పోటెత్తిన భక్తులు -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఖజానాకు 23రోజులలో హుండీల ద్వారా రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం హుండీల కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలితసేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,01,24,258 రాగా, విదేశి కరెన్సీ 30, మిశ్రమ బంగారం 050 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒరిగిందేమీలేదన్నారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కొత్త పనులు రాకపోగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.180కోట్ల నిధులను రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ చొరవ వల్లే గజ్వేల్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని చెప్పారు. ప్రత్యేకించి స్థానిక మున్సిపాలిటీ రాష్ట్రానికే నమునాగా మారిందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులను గెలిపిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రత అందరి బాధ్యత
సీపీ రష్మి పెరుమాళ్ తొగుట(దుబ్బాక): రహదారి భద్రతను ప్రతి ఒక్కరి బాధ్యత అని సీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. మండల పరిధిలోని పెద్దమాసాన్ పల్లిలో గురువారం ‘అరైవ్ అలైవ్’అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్రెడ్డి సౌజన్యంతో 100 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. గ్రామస్తులతో నేరుగా ముచ్చటించారు. రహదారి భద్రతపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటిస్తేనే విలువైన ప్రాణాలు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్, తదితరులు పాల్గొన్నారు. -
బడిపాట్లు.. సర్కస్ ఫీట్లు
పాఠశాల విద్యార్థుల ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన బస్సు సౌకర్యంలేక నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. అందరూ చదుకోవాలన్నది సర్కారు లక్ష్యం. కానీ అందుకు తగ్గ మౌలిక వసతులు లేక విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించాలంటే బాలబాలికలు నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే వీరి కష్టాలు రెట్టింపవుతుంటాయి. మరోవైపు నలుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 15 మంది చిన్నారులు కిక్కిరిసి వెళ్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు సైతం నెలకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 82 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ఒకవేళ ఆయా రూట్లలో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లే వేళ.. ఇంటికి వచ్చే సమయంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి. 6 తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు కోవాలంటే నడక కష్టాలు తప్పడంలేదు. ఆటోల్లో నిత్యం 2,710 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండటం గమనార్హం. చాలా రూట్లలో రద్దీ తగ్గట్లు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్బోర్డులపై ప్రమాదపు అంచున ప్రయాణించాల్సి వస్తోంది. నిత్యం బడులకు ఆటోల్లో: 2,560 మంది టాటా మ్యాజిక్: 150 మంది విద్యార్థులు నర్సింహుల పల్లె నుంచి ఆటోలో వెళ్తున్న విద్యార్థులు ఆటోల్లో డ్రైవర్ సీటుకు అటు, ఇటు, లోపల ఖాళీ లేకుండా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నిబంధనలు పాటించడంలేదు. ఏదైన ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే తల్లిదండ్రులు ముందే మేల్కొవాలి. స్కూల్ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు. రోజూ కిలోమీటర్లమేర నడక జిల్లాలో 82 గ్రామాలకు బస్సులే లేవు చాలా చోట్ల ఆటోలే దిక్కు ప్రమాదం అంచున ప్రయాణాలు 2,710 మంది విద్యార్థులు ఆటోల్లోనే స్కూళ్లకు.. వెలుగు చూసిన వాస్తవాలు గజ్వేల్ రూరల్: గజ్వేల్ పట్టణం సంగాపూర్ రోడ్డు మార్గంలో గల బాలుర ఎడ్యుకేషన్ హబ్ లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ హబ్లో 6 తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారుగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. గజ్వేల్ పట్టణం నుంచి దాదాపు 3 కిలో మీటర్లు ఉంటుంది. చాలా మంది ఆటోలలో వస్తుండగా ఆర్థిక స్తోమతలేని విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంకొందరు ఆ రోడ్డు మార్గం గుండా వచ్చే వాహనాల వారిని లిఫ్ట్ అడుగుతుంటారు. ఇలా ఇబ్బందులు పడు తూ పాఠశాలకు.. ఇంటికి చేరుకుంటున్నారు. ఒకే ఆటోలో 15 మందికిపైగా.. అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో వస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మహారాజ్ తండా, బంజారాహిల్స్ తండా, బొడిగెపల్లిలకు ఆటోలలో విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఒకరి మీద ఒకరు కూర్చుని ప్రయాణిస్తున్నారు. బెజ్జంకి(సిద్దిపేట): నర్సింహుల పల్లె, వడ్లూరు, తలారివానిపల్లె గ్రామాలకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు లిఫ్ట్ అడగడం, లేక ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. కొందరు సైకిళ్లపై వెళ్లి వస్తున్నారు. తప్పని నడక మిరుదొడ్డి(దుబ్బాక): మోడల్ స్కూల్ విద్యార్థులను సాయంత్రం 4.15 గంటలకు బడి విడిచి పెడితే రాత్రి 7 గంటల వరకు బస్స్టాప్ వద్దనే పడి గాపులు కాయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సరికి రాత్రి 8 గంటలు దాటుతోందని వాపోతున్నారు. బరువున్న పుస్తకాల బ్యాగుతో నడక సాగించాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఆటోలోనే.. గౌరవెల్లి స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. మాది బంజారాహిల్స్ తండా. తండాకు బస్సు లేకపోవడంతో రోజూ ఆటోలో వెళ్లి వస్తున్నా. ఉదయం, సాయంత్రం సమయాల్లో మా తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. –నిరంజన్, 6వ తరగతి అన్ని రూట్లలోనూ బస్సులు తిప్పుతాం సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ డిపో పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నాం. కరోనా వేళ రద్దయిన గ్రామాలకు విద్యార్థుల వినతి మేరకు బస్సులను తిప్పుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని అదనపు ట్రిప్పులు కూడా ఏర్పాటు చేస్తాం. – భవభూతి, ఆర్టీసీ డీఎం -
వార్డులు పెరగకపాయే.. ఖర్చు పెరగవట్టే
● పార్టీల నాయకత్వంలోనూ టెన్షన్ ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నేతల పరిస్థితి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగకపోవడం ఆశావహులను టెన్షన్కు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో ఒక్కో వార్డులో 1400లోపు మాత్రమే ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 2400కుపైగా చేరుకుంది. ఫలితంగా ప్రచారానికి ఎక్కువగా శ్రమించాల్సిరావడం, ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలు విలీనమైన తర్వాత ఓటర్ల సంఖ్య 46,740కు చేరింది. ఇందులో మహిళలు 24,001 ఉండగా, పురుషులు 22,738మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. నిర్వాసిత గ్రామాలకు చెందిన ఓట్లే 14వేలపైచిలుకు ఓట్లు కొత్తగా కలిశాయి. దీని తర్వాత వార్డుల సంఖ్య 30కిచేరుకుంటాయని అంతా భావించారు. కానీ గతంలో ఉన్న 20వార్డుల్లోనే కొత్త ఓట్లు సర్దుబాటు చేసిన సంగతి తెల్సిందే. దీనివల్ల గత ఎన్నికల సందర్భంగా ఒక్కో వార్డులో 1,400 వరకు ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం ఈ సంఖ్య 2,400కుపైగా చేరుకున్నది. మరోవైపు వార్డుల పరిధి కూడా పెరిగింది. ఒక్కో వార్డును ఒక చోట కాకుండా, భౌగోళికంగా దూరంగా ఉన్నా కాలనీలను కలిపిన సంగతీ తెల్సిందే. దీనివల్ల బరిలో ఉండే అభ్యర్థులకు ప్రచారానికి శ్రమపెరిగే అవకాశం. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే ఖర్చు భారీగా పెరగనున్నది. దీనివల్ల ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. నిర్వాసిత గ్రామాల్లో.. ఇకపోతే మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీలో మరో రకమైన పరిస్థితి నెలకొంది. తమకు కొత్తగా పది వార్డులు ఇస్తారనుకుంటే.. వార్డుల్లోనే తమను సర్దుబాటు చేశారనే నిరుత్సాహాంలో నిర్వాసితులు ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వారికి కేటాయించిన 7, 8, 9, 10, 11, 12వార్డుల్లో నిర్వాసిత గ్రా మాలకు చెందిన వారే పోటీలో ఉండాలని, స్థానికేతరులకు మద్దతు పలకవద్దని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ పరిస్థితి వల్ల ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వీరి పాత్రే కీలకంగా మార నుంది. కొన్ని వార్డుల్లో ప్రజల్లో పేరున్న ఆశావహులు సైతం ఓటర్ల సంఖ్య పెరగడం, ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో పోటీకి విముఖత చూపుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రధాన పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదు. ఫలితంగా ఆ పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఎవరికై తే వార్డుల్లో మంచి పేరు ఉండి గెలిచే అవకాశాలున్నాయో...వారి ఇళ్ల వద్దకు వెళ్లి పోటీచేయాలంటూ బతిమాలుతున్నారు. ఖర్చు సంగతి మేం చూసుకుంటామంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయకుల మాటలను నమ్మడం లేదు. పోటీ చేయడానికి వెనకంజ వేస్తున్నారు. ముందుగా డబ్బులు సర్దుబాటు చేస్తామని చెప్పి.. తర్వాత తమను ఆగం చేస్తారని భయపడుతున్నారు. ఈ పరిిస్థితి పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీల నాయకత్వం కూడా తలలు పట్టుకుంటున్నది. కొద్ది రోజుల తర్వాత మార్పులు ఏమైనా ఉంటాయా..? అనేది వేచి చూడాల్సిందే. -
మెనూ కచ్చితంగా పాటించాలి
● కలెక్టర్ హైమావతి ● తిమ్మాపూర్లో మధ్యాహ్న భోజనం పరిశీలన గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును గురువారం కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెనూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం జగదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ను వేగం చేయాలి కొండపాక(గజ్వేల్): ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగం చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొండపాకలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ తీరును గురువారం పరిశీలించారు. పనుల నత్తనడకపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ త్వరలో 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఆయా వార్డుల వారీగా జీసీఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓల పనితీరును ఎప్పటికప్పుడు తహసిల్దార్ పర్యవేక్షించాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు చేసుకోవాలన్నారు. ఏరోజుకారోజు మ్యాపింగ్ వివరాలను అప్లోడ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, ఆర్ఐ బాలకిషన్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్ విద్యార్థులతో బ్యాంక్ అధికారులు, ఉపాధ్యాయ బృందంసిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమ్మూ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేలా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రాణించాలంటే ఆర్థిక అక్షరాస్యత అవసరమన్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో ఫైనాన్షియల్ లిటరసీతో పాటుగా డిజిటల్ లిటరసీపై అవగాహన పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, సర్పంచ్ లతాశంకర్, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
పుల్లూరు జాతరలో వినూత్నం
సాక్షి, సిద్దిపేట: పుల్లూరు జాతరలో భక్తి అఖండం.. ఇక్కడ గురిగీలే ప్రధానం. గురిగిలో నూనె తీసుకెళ్లి అంఖడ దీపం వెలిగించి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆనవాయితీ 800 ఏళ్లుగా వస్తుండటం విశేషం. సాధారణంగా ఏ దేవాలయమైనా అఖండ దీపానికి నూనె పావులతో పోస్తుంటారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో ప్రసిద్ధిచెందిన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో నూనెను చిన్న గురిగిలో తీసుకువచ్చి అఖండ దీపంలో పోస్తుంటారు. పుల్లూరు బండజాతరకు భక్తులు జిల్లా నుంచే కాకుండా సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత చిన్న గురిగిలో నూనె తీసుకవెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అఖండ దీపంలో పోయడం ఏళ్లుగా భక్తులు ఆచరిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన గురిగిని నూనె తో కలిపి రూ.20లకు విక్రయిస్తున్నారు. భక్తు లు కొనుగోలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కాగా బుధవారంతో జాతర ముగిసింది. -
మార్కండేయుడి కృప అందరిపై ఉండాలి
దుబ్బాక: మార్కండేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలో మార్కండేయ జయంతిని పద్మశాలి సమాజం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలి సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి సమాజం అధ్యక్షుడు జిందం గాలయ్య, యువజన సంఘం అధ్యక్షుడు నరేశ్తో పాటు కులపెద్దలు తదితరులు ఉన్నారు. -
ప్రాక్టికల్స్కు హాజరు తప్పనిసరి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలను రాయాలని, గైర్హాజరైతే ఫెయిల్గా పరిగణిస్తారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. బుధవారం ప్రారంభం అయిన ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని దీక్ష కళాశాల, న్యూజనరేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లలో జరుగుతున్న ప్రాక్టికల్స్ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, 23న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుందని, 24న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్కు 9,946 మంది ఫస్టియర్ విద్యార్థులకు 99శాతం మంది హాజరైనట్లు చెప్పారు. డీఐఈఓ రవీందర్రెడ్డి -
వసంత పంచమికి సన్నాహాలు
● విద్యాధరిలో విస్తృత ఏర్పాట్లు ● వర్గల్కు పోటెత్తనున్న భక్తజనం ● ప్రత్యేక క్యూలైన్లు, ప్రాంగణంలో టెంట్లువర్గల్(గజ్వేల్): వసంత పంచమి వేళ సుప్రసిద్ధ వర్గల్ క్షేత్రానికి భక్తులు పోటెత్తనున్నారు. శుక్రవారం ఈ మహోత్సవం సందర్భంగా క్షేత్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా విశాలమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వేడిమికి ఆస్కారం లేకుండా క్యూలైన్ మార్గంలోనూ నీడనిచ్చే ఏర్పాట్లు చేపట్టారు. క్షేత్రానికి దాదాపు 50 వేల మంది భక్తులు వస్తారని, అదే స్థాయిలో 10,000 పైగా చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయనే అంచనాలతో నాలుగు చోట్ల అక్షరాభ్యాస మండపాలు సిద్ధం చేస్తున్నారు. బారికేడ్లు, వాహనాల పార్కింగ్, పర్యవేక్షణకు రెండు చెక్పోస్టులు, క్షేత్రంలో కాంతిమంతంగా లైట్లు, ఆలయానికి రంగురంగుల దీపాల వరుసలు, స్వాగత తోరణాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్గల్ క్షేత్రం సందర్శించిన ఏసీపీ వసంత పంచమి మహోత్సవం పురస్కరించుకుని భక్తుల తాకిడి దృష్ట్య గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, రూరల్ సీఐ రవిరాజు, ఎస్ఐ కరుణాకర్రెడ్డి వర్గల్ క్షేత్రం సందర్శించారు. అక్కడ పార్కింగ్ స్థలం, క్యూలైన్లు, చెక్పోస్టు ఏర్పాటు తదితర అంశాలను ఆలయ వర్గాలతో సమీక్షించారు. కాగా క్షేత్రంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో శ్రీపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి భక్తునికి మహాప్రసాదం (అన్నదానం) అందేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షేత్రానికి ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం శ్రీపంచమి మహోత్సవ వేడుకలు భక్తులు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. -
నిబంధనలే ముఖ్యం.. సీపీ సందేశం
‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది.. గాలి పటం ఎగురవేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో.. అలాగే వాహనాలు నడిపే వేళ అంతే ఏకాగ్రతతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలి’ అని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ సందేశం ఇచ్చారు. బుధవారం పోలీసు కమిషనరేట్ పరేడ్ మైదానంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కై ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి సీపీ గాలి పటాలను ఎగురవేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కుషాల్కర్, సుభాష్ చంద్రబోస్, అన్ని డివిజన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. – సిద్దిపేటకమాన్ -
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్రూరల్: గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని వర్గల్ (ప్రజ్ఞాపూర్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యాసంవత్సరానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మోడల్ స్కూళ్లలో..ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో, 7 నుంచి 10 వరకు మిగిలిన సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు దగ్గరిలోని మోడల్ స్కూల్ను సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయండి: డీఈఓదుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం పధ్మనాభునిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని 110 మంది విద్యార్థులకు హెచ్ఎం పెద్ది మల్లికార్జున్ రూ.40 వేల తన సొంత ఖర్చులతో క్రీడాదుస్తులను డీఈఓ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు ెపేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అలాగే దుబ్బాక మున్సిపల్లోని చేర్వాపూర్ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఇష్టంతో చదవండి.. ఉత్తమ ఫలితాలు సాధించండి సాంఘిక శాస్త్ర ఫోరం ప్రతినిధులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సాంఘికశాస్త్ర ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్రావు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మల్టిపర్పస్ ఉన్నత పాఠశాలలో జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశాంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్లలో మార్కులు సాధించినపుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినేటర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ కోరారు. ఈ మేరకు బుధవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 26న గణతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు, గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రీ షెడ్యూల్ చేయాలని కోరామన్నారు. -
‘పట్నం వారం’ ఆదాయం రూ.75లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నం వారం (మొదటి ఆదివారం) పురస్కరించుకుని మూడు రోజుల ఆదాయం రూ.75,81,241 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం తదితర ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది పట్నం వారానికి రూ.61,81,228 సమకూరగా.. ఈసారి రూ.14లక్షలు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారి మాధవి తెలిపారు. పొట్లపల్లిలో నాగ బోనం శిల్పంహుస్నాబాద్ రూరల్: మండల పరిధి పొట్లపల్లి సమ్మక్కల గద్దెల వద్ద తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ నాగ బోనం శిల్పాన్ని గుర్తించారు. మంగళవారం పొట్లపల్లిలో సమ్మక్క గద్దెల ప్రాంతంలోని శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనం ఎత్తడం పోచమ్మ, కాటమయ్యలకే కాకుండా నాగ బోనాలు కూడా ఉంటాయని ఈ శిల్పాల ద్వారా తెలుస్తోందన్నారు. నాగ శిల్పాలు రాష్ట్రకూటుల కాలం నాటివిగా చర్రిత కారులు చెబుతున్నారని తెలిపారు. -
సౌరశక్తితో స్వయం సమృద్ధి సాధ్యం
● టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రవీందర్ చౌహన్ ● మోడల్ సోలార్ గ్రామంగా రామవరం ఎంపికఅక్కన్నపేట(హుస్నాబాద్): సౌరశక్తి వినియోగం ద్వారా గ్రామాలు విద్యుత్ స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో) జిల్లా మేనేజర్ లావుడ్య రవీందర్ చౌహన్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సౌరశక్తి వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముస్త్ బిజిలీ యోజన(పీఎంఎస్ఎంబీవై) పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రామవరం గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్ను నెట్మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తే వినియోగదారులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బానోతు జయరాం, ఎంపీఓ శివనగేష్, సర్పంచ్ బొమ్మ శైశ్రీలం, పంచాయతీ కార్యదర్శి రాము, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
గజ్వేల్రూరల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల జీపీపీ ఆర్టీసీ డిపో ఎదుట పోస్టు కార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ 300 మందికిపైగా కార్మికులు గవర్నర్కు పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీపీపీ ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ జక్కుల నర్సింహులు, కన్వీనర్ రాజయ్య, ప్రచార కార్యదర్శి బీఎస్రెడ్డి, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.గవర్నర్కు పోస్టుకార్డులు పంపిన కార్మికులు -
నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె..
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మరిచిపోయారని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో నిర్వహించిన ‘విజయ సంకల్ప’ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుమందు పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరుపై మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మల్లన్నసాగర్ ముంపు బాధితులను బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్కు తీసుకొచ్చి వారి సమస్యలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనిస్తున్నదని వాపోయారు. ఈ పార్టీల వల్ల ముంపు బాధితులకే కాదు.. మున్సిపాలిటీకి ఒరిగిందేమీ లేదన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గడిచిన 13ఏళ్లల్లో అతి కొద్దిసార్లు మాత్రే వచ్చారని విమర్శించారు. ఆయన ఫామ్హౌస్కే పరిమితమైతే ఇక్కడి ప్రజల సమస్యలను ఎవరూ పరిష్కరిస్తారని ప్రశ్నించారు. రింగు రోడ్డు పూర్తి చేయకపోగా, పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఇప్పటికీ పెండింగ్లోనే ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఆకుల విజయ, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్కు కొత్త సొబగులు
● సుందరీకరణ దిశగా పట్టణం ● డివైడర్ల మధ్య క్రీడాకారుల విగ్రహాలు ● మరింత వన్నె తెచ్చేలా ఏర్పాట్లుహుస్నాబాద్: సుందరీకరణలో భాగంగా పట్టణానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని నేషనల్ హైవే రోడ్లో మల్లెచెట్టు చౌరస్తా వరకు వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొందరలోనే అంబేడ్కర్ చౌరస్తా నుంచి పోతారం (ఎస్) వరకు సూర్య నమస్కారాలు, యోగాసనాల విగ్రహాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. విగ్రహాలను సిరిసిల్ల నుంచి తెస్తున్నారు. రూ.80 లక్షల వ్యయంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, హాకి, రన్నింగ్ క్రీడాకారుల విగ్రహాలతో పాటు వెల్కమ్ స్టాచ్యూలను పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బీటీ నుంచి మూడు ఫీట్ల ఎత్తు వరకు డివైడర్లను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రధాన కూడళ్లల్లో బ్యూటిఫికేషన్లో భాగంగా 5 ప్రధాన కూడళ్లల్లో వాటర్ ఫౌంటెన్తో జంక్షన్లు ఏర్పాటు చేసి సుందరీకరించారు. పట్టణానికి నాలుగు వై పులా రూ.1.20 కోట్లతో వెల్కమ్ హుస్నాబాద్ ఆర్చీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రూ.5 కోట్లతో మల్లెచెట్టు చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ఎల్లమ్మ చెరువు కట్ట వరకు నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తి కాగానే సెంట్రల్ డివైడర్ నిర్మాణంతో పాటుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి పట్టణ రూపు రేఖలను మార్చనున్నారు. అలాగే ఎల్లమ్మ చెరువును రూ.18 కోట్లతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. కట్ట మధ్యన ఆకర్షించే బొమ్మలు, చెరువు మధ్య గాజు వంతెన హైలెట్గా నిలువనుంది. బతుకమ్మ ఘాట్ పనులు పూర్తి చేశారు. -
టికెట్.. ప్లీజ్
ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు ● అన్ని పార్టీల్లోనూ సందడి ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఆసక్తికరంమున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆశావహులు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆలస్యమైతే రేసులో వెనుబడిపోతామనే భయంతో తమ పేరును ఖరారు చేయించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్ఆశావహుల పైరవీలు ముమ్మరంమున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన టికెట్ల కేటాయింపు పర్వం ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్ ముంచుకొస్తున్న వేళ.. ఆశావాహులు తమ పేర్లను అధికారికంగా ఖరారుచేయించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఆలస్యమైతే రేసులో వెనుకబడిపోతామనే భావన వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే టికెట్ల సాధనకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కసరత్తు జోరు.. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభమైంది. అఽధిష్టానం ఒక్కో వార్డులో నలుగురు, లేదా ఐదుగురిని ఎంపిక చేసి అందులో ఎవరికి ఎక్కువగా గెలుపు అవకాలున్నాయో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని అధికారికంగా ప్రకటన చేయాలని సూచించడంతో.. ఆమేరకు ముందుకుసాగుతున్నట్లు తెలిసింది. అధిష్టానం సూచనలు ఎలా ఉన్నా.. ఆశావాహులు మాత్రం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హరీశ్రావు ఆదేశాలతో.. బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తును మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాలమేరకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, పార్టీ పరిశీలకుడు రాధాకృష్ణ శర్మలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై సర్వేను కూడా చేశారు. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆశావాహులు సర్వే జాబితాలో తమ పేరు ఉందో...? లేదోనని నేతలు చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపిక తుది దశకు వచ్చినట్లు తెలుస్తున్నది. మెదక్ ఎంపీ రఘునందన్రావు పర్యవేక్షణలో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కసరత్తు నడుస్తోంది. త్వరలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ప్రచార కార్యక్రమాలకు సిద్ధంఎలాగైనా గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టు సాధించడానికి ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ మంగళవారం పట్టణంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, ర్యాలీతోపాటు విజయ సంకల్ప సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు సైతం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాయి. ఇకపోతే తమకు టికెట్ ఖాయంగా వస్తుందనే ధీమాలో ఉన్నా.. ఆశావాహులు ఇంటింటి ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. -
సీతక్కను కలిసిన కొమ్మూరి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మంగళవారం జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల ఇన్చార్జిగా నియమితులైన సీతక్కను కలిసి జనగామ, చేర్యాల మున్సిపాలిటీల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆయన వెంట చేర్యాలకు చెందిన సంజీవులున్నారు. తపాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరుపతినంగునూరు(సిద్దిపేట): తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజగోపాల్పేట ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు బి.తిరుపతి నియమితులయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బడుల బలోపేతంలో ఉపాధ్యాయులే కీలకం డీఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. కుకునూరుపల్లిలో, మంగోల్లో ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యాబోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మూడవ తరగతికి నిర్వహించే ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టు రైతులకు రుణాలివ్వాలి పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకు అధికారులు రుణాలు అందజేయాలని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి సూచించారు. జిల్లా నుంచి వచ్చిన యూనియన్ బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం మండలంలోని చంద్లాపూర్లోని పట్టు సాగును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పంటలతో పోలిస్తే పట్టు సాగు లాభదాయకమన్నారు. ఏడాదికి 8 నుంచి 10 పంటలు తీయవచ్చన్నారు. మొదటగా షెడ్ నిర్మాణం, పంట సాగు, పనిముట్లు, ఇతర పరికరాల కోసం పెట్టుబడి భారమవుతున్నందున బ్యాంకు అధికారులు సహకరించి రుణాలు అందజేస్తే ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తారన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో సహకరిస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. యూనియన్ బ్యాంకు జిల్లా మేనేజర్ హరిబాబు, నాబార్డు జిల్లా అధికారి నిఖిల్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రష్మితను అభినందించిన సీపీసిద్దిపేటకమాన్: జూనియర్ నేషనల్ అర్చరీ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన హోంగార్డు కుమార్తె రష్మితరెడ్డిని మంగళవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. తన కార్యాలయంలో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన రస్మిత, కోచ్ రవి శంకర్ను అభినందించారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
దుబ్బాక: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపడుతోందని తెలిపారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని ఐఓసీలో ఇందరామహిళ శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 26 వేల కొత్త రేషన్కార్డులు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డుల్లో 79 వేల పేర్లను అదనంగా చేర్చి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఉచిత బస్సుతో పాటు మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు చెప్పారు. దుబ్బాక పట్టణంలో 11,105 చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.1.26 కోట్ల వడ్డీలేని రుణాలు ఆయా మహిళా గ్రూపులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర రవి, అదనపు ఆర్డీఓ సుధీర్, మెప్మా పీడీ హన్మంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్కుమార్,తహసీల్దార్ సంజీవ్కుమార్ తదితరులు ఉన్నారు. అభ్యున్నతికి కృషి చేర్యాల(సిద్దిపేట): మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ హైమావతి అన్నారు. స్థానిక కల్యాణి గార్డెన్లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొన్న ఆమె.. పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు అందజేశారు.పథకాలు సద్వినియోగం చేసుకోండి గజ్వేల్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ హైమావతి ఆకాంక్షించారు. మంగళవారం గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐఓసీ)లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 3500 ఇందిరమ్మ ఇళ్లు గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరు చేసినట్లుచెప్పారు. ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవ్ ఆర్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంతరెడ్డి, తహసీల్దార్ శ్రావన్కుమార్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
సిద్దిపేటజోన్: లాభదాయకమైన వ్యవసాయ విస్తరణకు శిక్షణ తరగతులు దోహదపడతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి అన్నారు. స్థానిక ఎన్జీఓ భవన్లో మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 క్లస్టర్ పరిధిలోని 30మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
● వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ఎస్ఈ చంద్రశేఖర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సమస్యల పరిష్కార వేదిక సభ్యులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సభ్యులు రామానుజ నాయక్, వెంకట్, విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రశేఖర్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 77 మంది వినియోగదారులు తమ విన్నపాలను అధికారులకు అందించారు. ఇందులో అధికంగా నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల మార్పిడి, బిల్డింగ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ల తొలగింపు, నూతన విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తో పాటు, ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈలు శ్రీనాథ్, రాంచంద్రయ్య, భానుప్రకాశ్, కృష్ణయ్య, ఏడీ కమర్షియల్ ముత్తయ్య, ఏఈలు శ్వేత, ప్రియాంక, విద్యుత్శాఖ సిబ్బంది చందు, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది..
సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల పనితనం చాలా ఉపయోగకరంగా మారింది. – ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్ సమష్టి కృషికి నిదర్శనం జాతీయ, రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట మున్సిపాలిటీ గుర్తింపు పొందడం సమష్టి కృషికి నిదర్శనం. ప్రజల సహకారం గొప్పది. కార్మికుల శ్రమ, పాలకవర్గం పర్యవేక్షణ, అధికారుల బాధ్యత వల్ల అవార్డు లభించింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. – హరీశ్రావు, ఎమ్మెల్యే సిద్దిపేట -
వైభవంగా కొండపోచమ్మ జాతర షురూ..
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న బోనాల ఊరేగింపుగజ్వేల్: జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ ఆలయంలో సోమవారం జాతర వైభవంగా ప్రారంభమైంది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పట్నం వారం కావడంతో...మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆశీస్సుల కోసం వేల సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లు మధ్య మహిళలు నృత్యాలు చేస్తూ, శివసత్తులు సిగాలు ఊగుతూ, పోతరాజులు తమ విన్యాసాలను ప్రదర్శించడం ఆకట్టుకున్నది. ప్రత్యేకించి లష్కర్ బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
గ్రామాభివృద్ధికి తోడ్పడండి
● కలెక్టర్ హైమావతి ● నూతన సర్పంచ్లకు దిశానిర్దేశం ● గ్రామ పరిపాలనపై శిక్షణ ప్రారంభంసిద్దిపేటఅర్బన్: ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్లు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులోని న్యాక్ భవనంలో 5 మండలాల నూతన సర్పంచ్లకు గ్రామ పరిపాలనపై అందించే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్లకు దేవుడు ఇచ్చిన సువర్ణావకాశాన్ని పవిత్రంగా భావించి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో ఏ పనులు ఎలా చేయాలి? గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించుకోవడానికి శిక్షణ తోడ్పడుతుందని అన్నారు. గ్రామాల్లో తాగు నీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ మొదటి ప్రాధాన్యతగా భావించాలన్నారు. డ్రై డే సరిగ్గా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లు అన్ని సక్రమంగా ఖర్చు చేసే బాధ్యత సర్పంచ్లపై ఉందని అన్నారు. గ్రామాలలో ఏ పని చేసినా వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానాల ఆధారంగానే పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పది కాలాల పాటు గుర్తుండేలా పనలు చేపట్టాలన్నారు. మహిళా సర్పంచ్లు.. పతులకు పెత్తనం అప్పగించకుండా అన్ని విషయాలు నేర్చుకొని ప్రతి పనిలో తమ భాగస్వామ్యం ఉండాలన్నారు. అనంతరం వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, డీఆర్డీఓ జయదేవ్ఆర్య, ట్రైనీ డీపీఓ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి సిద్దిపేటరూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో గణతంత్ర వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించి, ఆదేశాలు జారీ చేశారు. శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
మున్సిపాలిటీలకు కేంద్రం నుంచే నిధులు
● ఉపాధి పనిదినాలు పెంచినఘనత మోదీదే ● మెదక్ ఎంపీ రఘునందన్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధి హామీ పనిదినాలను 125 రోజులకు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటుగా, పథకాలలో మార్పులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నిధులు వెచ్చించిందన్నారు. గాంధీ జీ కలలు కన్న రామరాజ్యం కాంగ్రెస్కు నచ్చదన్నారు. రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం చేసుకుంటుందన్నారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులతో ఒరిగేదేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్, దూది శ్రీకాంత్రెడ్డి, రాంచంద్రరెడ్డి, మార్కండేయులు, నలగామ శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, కనకయ్య పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
● వెయ్యి పడకల ఆస్పత్రిఅందుబాటులోకి తేవాలి ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటకమాన్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. సిద్దిపేటలో గత ప్రభుత్వంలో రూ.10కోట్లతో నిర్మించిన ఆయుష్, యునాని, హోమియా ఆస్పత్రి సేవలను వచ్చే పదిహేను రోజుల్లో అందుబాటులోకి తేవాలని కోరారు. సిద్దిపేటలో నిర్మించిన ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ను హరీశ్రావు సోమవారం సందర్శించారు. అవసరమైన పనులపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. హరీశ్రావు మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న వెయ్యి పడకల ఆస్పత్రి పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్లోగా ప్రజలకు వెయ్యి పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలందించాలన్నారు. ఆయుష్, యునాని, హోమియోకి సంబంధించిన వైద్యులు, థెరపిస్ట్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. -
పుర బరి.. పార్టీల గురి
అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తు సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడ్డాయి. ఆశావహుల సామాజిక వర్గాలు, పార్టీకి చేసిన సేవతోపాటు ఆయా వార్డుల్లో వారికి ఉన్న గుర్తింపు ఆర్థిక బలాలను అంచనా వేస్తున్నారు. ఆయా వార్డుల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందే అవకాశాలుంటాయన్న దానిపై ముఖ్యనాయకులతో చర్చిస్తున్నారు. గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు. ● నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులున్నాయి. రిజర్వేషన్ల ప్రకటనకు ముందు ఎక్కువ సంఖ్యలో నేనంటే.. నేను అని పోటీపడ్డారు. రిజర్వేషన్లు వెల్లడయ్యే సరికి పలువురికి కలిసి రాకపోవడంతో నిరాశ చెంది తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ముఖ్యనాయకులు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. ● బీఆర్ఎస్ దూకుడు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సమన్వయకర్తలను నియమించారు. గజ్వేల్ మున్సిపాలిటీకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాదాకృష్ణ శర్మ, దుబ్బాకకు గుండు భూపేశ్లను నియమించారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల సమన్వయకర్తలు పట్టణ ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించారు. వార్డుల వారీగా ఇన్చార్జిలను నియమించి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించారు. ఎక్కువ మంది పోటీ ఉండే చోట ఆశావహులు, ఇన్చార్జిలతో సమావేశం అవుతున్నారు. హుస్నాబాద్, చేర్యాలకు త్వరలో ఇన్చార్జిలను నియమించే అవకాశాలున్నాయి. ● మంత్రి వివేక్కు బాధ్యతలు నాలుగు మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా మంత్రి వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ పార్లమెంట్కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కు ఇన్చార్జిగా మంత్రి సీతక్కను నియమించి బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. వీరు ఒకటి రెండు రోజుల్లో మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించనున్నారు. గజ్వేల్లో ఇప్పటికే ఆశావహులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు సమావేశం అవుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. బీజేపీ అధిష్టానం జిల్లాకు చెందిన ముఖ్యనాయకులతో ఇటీవల హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై వివరించారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్చార్జిలను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇన్చార్జిలుగా నియమించేందుకు పలువురు పేర్లను అధిష్టానం సేకరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నియమించే అవకాశాలున్నాయి. -
చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు
హుస్నాబాద్: పట్టణంలోని కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ.7.49 కోట్లు, ఎల్లమ్మ చెరువు నీటి పారుదల కాలువల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ నుంచి రూ.2.74 కోట్లు నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యుత్ వినియోగదారుల సమస్యలపై విద్యుత్ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో ఉదయం11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పరిష్కార వేదిక నిర్వహించనునట్లు విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల అడిగే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. వినియోగదారులు కరెంట్ బిల్లు రశీదు, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అర్జీలు సత్వరమే పరిష్కారంఅదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 142 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అధికారులు, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు. కళాశాలల బలోపేతమే లక్ష్యం కావాలి: డీఐఈఓ23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి సూచించారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) నూతన క్యాలెండర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక వసుతులు, ప్రయోగశాలల పరికరాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల 23న అన్ని కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్కు ప్రతి విద్యార్థి తల్లితండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
నేటి నుంచి కొండపోచమ్మ జాతర
గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 19వరకు మూడు నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఆలయం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి మార్గంలోని గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏటా ఈ జాతరకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం తర్వాత భక్తులు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జాతరకు వచ్చే భక్తులు ఆలయం వద్ద ఉన్న చెరువులో పుణ్య స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను సమర్పిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చే లష్కర్ బోనాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ. కాగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రవికుమార్ తెలిపారు. -
హంగులేనా.. వెలుగులేవీ ?
గజ్వేల్ రింగురోడ్డుపై చీకటి ప్రయాణం ● సర్కిళ్ల వద్ద వెలగని సెంట్రల్ లైటింగ్స్ ● వాహనదారుల్లో అయోమయం.. ప్రమాదాలకు మూలం ● రూ.233కోట్లతో అధునాతన ప్రమాణాలతో నిర్మాణంఅధునాతన హంగులతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డుపై చీకటి అలుముకోవడంతో ప్రయాణం భయానకంగా మారుతోంది. పట్టణ అవసరాల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన రింగు రోడ్డు ఇది. రూ.233కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ రోడ్డుపై లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం.. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారినపడుతున్నారు. – గజ్వేల్ మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా రింగు రోడ్డు నిర్మాణం జరిగింది. 2015లో తొలుత రూ.220కోట్ల వ్యయంతో ప్రారంభమైన పనులు వివిధ కారణాలతో ఆగిపోయి.. 2023వరకు కొనసాగాయి. మొత్తం గా ఈ పనుల వ్యయం రూ.233కోట్లకు చేరింది. రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రహదారికి అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. కానీ సంగాపూర్ రోడ్డు వైపున కోర్టు కేసు కారణంగా 200మీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ధర్మా రెడ్డిపల్లి–జాలిగామ గామాల మధ్య రైల్వే బ్రిడ్జి పను లు తుది దశకు చేరుకున్నాయి. దీనివల్ల రింగు రోడ్డు అనుసంధానం ఏడేళ్ల కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కానీ పూర్తయిన మేర వినియోగంలోకి తెచ్చారు. లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం రూ.233కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డుపై లైటింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఈ రోడ్డుపై 12 సర్కిళ్లు ఉండగా, ఇందులో పాతూర్, శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ జంక్షన్ల వద్దగల ఆరు సర్కిళ్లల్లో మాత్రమే లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును ప్రారంభించిన కొత్తలో కొంత కాలం సర్కిళ్ల వద్ద లైట్లు వెలిగాయి. కానీ కొన్ని నెలలుగా లైట్లు వెలగక.. రింగు రోడ్డుపై ప్రయాణం చీకట్లోనే సాగుతోంది. ఈ పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతోంది. 12 సర్కిళ్ల నిర్మాణం.. రింగు రోడ్డుపై 12 సర్కిళ్ల నిర్మాణం చేపట్టారు. పాతూర్ జంక్షన్ నుంచి రిమ్మనగూడ వరకు ఆరు సిక్స్ లేన్ల సర్కిళ్లు, మరో ఆరు ఫోర్ లేన్ల సర్కిళ్లు ముట్రాజ్పల్లి, వర్గల్ రోడ్డు, తూప్రాన్ రోడ్డు, ధర్మారెడ్డిపల్లి రోడ్డు, జాలిగామ రోడ్డు, పిడిచెడ్ రోడ్డు వద్ద నిర్మించారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్, అడ్వాన్స్ డైరెక్షన్ బోర్డులు, మ్యాపు టైపు బోర్డులు, గాంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి...సర్కిళ్ల వద్ద పీలీషీయమ్, పగోడ, బోగన్ విల్లా, ఫాక్ స్టైల్, ఫామ్ట్రీ, వేపతోపాటు రంగురంగల పూల మొక్కలు పెంచి ఈ రోడ్డుకు నయాలుక్ తీసుకొచ్చారు. లైటింగ్ లేక ప్రమాదాలు ఎన్నో హంగులతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డుపై లైటింగ్ లేక.. ప్రయాణం భయాందోళనకు గురిచేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదు. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. లేకపోతే ప్రమాదాలు పెరిగిపోతాయి. – మంగళపల్లి సత్యనారాయణ, మున్సిపాలిటీ వాసి ప్రయాణం వణుకు పుట్టిస్తోంది గజ్వేల్ రింగు రోడ్డును ఇంత మంచిగా నిర్మించి లైట్లు మాత్రం మరిచిపోయిండ్రు. దీనివల్ల రోడ్డుపైకి రాత్రి వేళ వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించాలి. – శ్రీనివాస్, మున్సిపాలిటీ వాసిరింగు రోడ్డుపై రిమ్మనగూడ సర్కిల్ సమీపంలో కమ్ముకున్న చీకటి -
హుస్నాబాద్ చుట్టూ రింగ్రోడ్డు
● పెద్ద నగరంగా తీర్చిదిద్దుతాం ● ‘నీటి పన్ను’ సమస్యలూ పరిష్కరిస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట నగరాల మాదిరిగా హుస్నాబాద్ను పెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 20 వార్డులల్లో 372 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మహిళా సంఘాలకు రూ.1.13 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అలాగే 57 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళికబద్దంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా హుస్నాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట వెళ్లే వారు రింగ్ రోడ్డుకు లింక్ అయ్యేలా నక్లెస్ మాదిరిగా ప్లానింగ్ సర్వే చేస్తున్నామని తెలిపారు. కొత్తగా వ్యవసాయ మార్కెట్ యార్డు కోసం వంద ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో నీటి పన్ను సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పన్నులు భారం కాకుండా ఇంటి పన్ను పై సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. కమర్షియల్ ఇతర అవసరాల దానిపై గ్రేడ్లుగా వసూలు అయ్యేలా చేస్తామన్నారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేశామని తెలిపారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 171 ఇళ్లు, ప్రస్తుతం 372 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ రామ్మూర్తి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్లో కలుపుతాంహుస్నాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రిటైర్డ్ జడ్జిచే నివేదిక తయారు చేసి హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ గతంలో జిల్లా కాదని, జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ కాకుండా మల్కాజిగిరి జిల్లా చేశారని మంత్రి గుర్తు చేశారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే నిరసనలు, ఆమరణ దీక్షలు చేశారన్నారు. అప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ప్రాంతాలు ఉండాలన్నారు. హుస్నాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ నిర్ణయం మేరకే మున్సిపల్ చైర్మన్ అవుతారని అన్నారు. స్థానిక నాయకులపై సర్వే జరుగుతుందని, గెలుపు ఆధారంగా టికెట్లు ఇస్తామని తెలిపారు. -
పట్నం.. పరవశం
వైభవంగా మల్లన్న పట్నం వారం ● కొమురవెల్లికి పోటెత్తినభాగ్యనగర వాసులు ● వెల్లివిరిసిన భక్తిపారవశ్యంకొమురవెల్లికి భాగ్యనగర వాసులు పోటెత్తారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. ‘మల్లన్నస్వామి మమ్మేలు.. కోరమీసాల స్వామి దీవించు..’ అంటూ భక్త జనం పారవశ్యంలో మునిగిపోయారు. మరోవైపు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆదివారం స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారాన్ని పురష్కరించు కుని హైదరాబాద్ భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి, స్వామివారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. బోనాలతో బారులు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది బోనం. భక్తులు అందంగా అలంకరించిన బోనాలతో బారులుతీరారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అలాగే గుట్టపై కొలువైన మల్లన్న సోదరి రేణుక ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. దారులన్నీ కొమురవెల్లికే.. ‘పట్నం వారం’ సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపే కొనసాగాయి. ఆలయానికి చేరుకునే రహదారుల్లో సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ ఆధ్వర్యంలో పోలీసులు భారీబందోబస్తు చేపట్టారు. కాగా సోమవారం ఉదయం ఆలయ తోట బావి ప్రాంగణంలో పెద్దపట్నం, అగ్నిగుండాల నిర్వహణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. – కొమురవెల్లి(సిద్దిపేట)జాతరలో శివసత్తుల సందడి -
‘మైకోరైజా’తో మొక్కకు మేలు
ఏఈఓ నాగార్జున తొగుట(దుబ్బాక): భూమిలో ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించేందుకు మైకోరైజా ఎంతో దోహద పడుతుందని ఏఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్పల్లిలో మైకోరైజా తయారీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రసాయన ఎరువులపై ఆధారపడకుండా జీవ ఎరువులు కూడా వినియోగించాలని సూచించారు. వెసిక్యూలర్ ఆర్భస్కులార్ మైకోరైజా అనేది ఉపయోగకరమైన శిలీంద్రాలని, అవి మొక్కల వేర్ల పనితీరును మెరుగుపరుస్తాయని చెప్పారు. భాస్వరం వంటి పోషకాలను సులభంగా మొక్కలకు చేరేలా చేస్తాయని, దీంతో భాస్వరం ఎరువుల అవసరం తగ్గుతుందన్నారు. అలాగే మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని చెప్పారు. అన్ని పంటలకు విత్తన శుద్ధి, నేల శుద్ధిలో ఈ మైకోరైజా వినియోగించవచ్చుని తెలిపారు. -
ఎస్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రశాంత్నగర్(సిదిపేట): ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే విధులపై నిబద్ధతతో ఉండేలా చొరవ చూపాలని సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజప్రభాకర్రెడ్డి సూచించారు. స్థానిక ఇందిరానగర్ హైస్కూల్లో శనివారం స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. పెండింగ్ డీఏలు, ఆరోగ్య కార్డులు, సీపీఎస్ ఉద్యగుల కరువు భత్యం తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం నాయకులు గురవయ్య, యూసుఫ్, మండల ప్రధానకార్యదర్శి గంభీర్రావుపేట యాదగిరి, ఆర్థిక కార్యదర్శి బోడరాజు, నాయకులు వినోద్, ఫసియొద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్లో ప్రవేశాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీశ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఓసీ విద్యార్థులు రూ.200, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.125 ఫీజు చెల్లించాలని చెప్పారు. బెజ్జంకిలో.. బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులోని ఎల్లంపల్లెలోగల మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మాలోతు సంగీత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 28 నుంచి ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్త్యాలలో.. చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని ముస్త్యాల మోడల్ స్కూల్లో 6వ తరగతిలోని 100 సీట్లకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్షకు 28 నుంచి వచ్చే నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠ శాల ప్రిన్సిపాల్ జీనుగు భిక్షం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్షణశాఖకు ఎంపిక అభినందనీయం తొగుట(దుబ్బాక): రక్షణశాఖలో ఉద్యోగం సాధించడం అభినందనీయమని పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి అన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖలో ఉద్యోగాలకు ఎంపికై న ముచ్చర్ల రాజు, బండారు అఖిలతో పాటు వారి తల్లిదండ్రులను ఆయన శనివారం సన్మానించారు. రాజు సీఐఎస్ఎఫ్, అఖిల అస్సాం రైఫిల్స్కు ఎంపికై గ్రామానికి గుర్తింపుతీసుకువచ్చారని అభినందించారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించడం గొప్పవిషయమన్నారు. యువత వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, మాజీ ఎంపీటీసీ రమేశ్, నాయకులు శ్రీకాంత్, గణేశ్, దేవేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు. గోరక్ష సహ ప్రముఖ్గా రాజారాం ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర గోరక్ష సహ ప్రముఖ్గా జిల్లాకు చెందిన గ్యాదరి రాజా రాం నియామకమైనట్టు జిల్లా నాయకులు శనివారం తెలిపారు. పాలమూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సభలలో రాజారాంను ఎంపిక చేశారన్నారు. పోల్ ఎక్కి.. సమస్య పరిష్కరించి అక్కన్నపేట(హుస్నాబాద్): ఈ ఫోటోను చూశారా.. నిచ్చెన సహాయంతో విద్యుత్ అధికారులు రిపేర్లు చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. మండలంలోని పంతుల్తండా సర్పంచ్ లావుడ్య రాజు అలియాస్ చిన్నానాయక్ స్వయంగా పోల్ ఎక్కి కాలిపోయిన బోరు మోటరు వైర్లను తొలగించి కొత్త వైర్లను ఏర్పాటు చేశారు. అలాగే మునిగిపోయిన ఎర్తింగ్ పైపును కూడా తానే బయటకు తీసి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. గుగ్గిల్లలో ఉచిత పశువైద్య శిబిరం బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్లలో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో శనివారం గోపాల మిత్ర ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ ఉచిత పశువైద్య శిబిరాల వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పశువైద్యాధికారి హరిత, ఎండీ షాదుల్లా, ఉపసర్పంచ్ లావణ్య, కార్యదర్శి 0 వంశీ, గోపాలమిత్రలు, వార్డు సభ్యులు సత్తయ్య, లక్ష్మయ్య, భూపతి, రాజిరెడ్డి, కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం పన్నుల వసూలే లక్ష్యం
సిద్దిపేటజోన్: వంద శాతం పన్నుల వసూలు లక్ష్యం సాధించేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ కోరారు. శనివారం స్థానిక 14వార్డులో ఒక నివాసానికి సంబంధించి రూ.2,54,592 ఇంటి పన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు. వందశాతం పన్నులకు సహకరించి సిద్దిపేట బల్దియా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు. పట్టణంలో మంచి నీటిని వృథా చేయరాదని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ -
సెటిల్మెంట్లు అందక ఇబ్బందులు
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన హుస్నాబాద్: సెటిల్మెంట్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని డిపో గేట్ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తాము పదివీవిరమణ పొందిన తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు సెటిల్మెంట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాస్మెంట్ లాంటి డబ్బులు ఇంత వరకు చెల్లించలేదని వాపోయారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అనారోగ్య కారణాల వల్ల చేసిన అప్పులు తీరక మానసిక వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జీవించి ఉండగానే బకాయిలు చెల్లించి పెన్షన్లోని ఇబ్బందులు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు శంకర్, కనకయ్య, రాములు, సత్తయ్య, పరమేశ్వర్, మైసయ్య, మల్లేశం, శ్రీని వాస్గౌడ్, రాజిరెడ్డి, ఎంటీ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ మహిళకు చైర్ పర్సన్ పీఠం
చేర్యాల(సిద్దిపేట): త్వరలో జరగనున్న మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వార్డులతో పాటు చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు కలెక్టర్ కార్యాయంలో చేపట్టిన కార్యక్రమంలో రిజర్వేషన్లు ఖరారు చేయగా చైర్ పర్సన్ రిజర్వేషన్ మాత్రం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలో నిర్ణయించారు. చేర్యాల వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా.. 1వ వార్డు బీసీ మహిళ, 2వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు ఎస్సీ జనరల్, 7వ వార్డు బీసీ జనరల్, 8వ వార్డు ఎస్టీ జనరల్, 9వ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు జనరల్ మహిళ, 11వ వార్డు జనరల్, 12వ వార్డు జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇది ఇలా ఉండగా చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. కోతుల బెడద అరికట్టేందుకు తీర్మానం హుస్నాబాద్రూరల్: మండలంలోని పందిల్లలో కోతుల బెడద నివారించడానికి గ్రామస్తులు తీర్మానం చేశారు. సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. కోతులను పట్టించడానికి ప్రతి ఇంటి నుంచి విరాళాలు అందించాలని నిర్ణయించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ వెంకటయ్య పరామర్శ మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కుమ్మరిరాజు, మంగళి చిన్న అంజయ్యను శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం తన వంతు సహకారం అందిస్తానని వారికి భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ లు జెన్నారెడ్డి, కుమార్, బాల మల్లేశం గౌడ్, వార్డు సభ్యులు ప్రవీణ్, కొండల్, నాగరాజు నాయకులు నందం తదితరులు ఉన్నారు. పేదలను ఆదుకోవడమే లక్ష్యందుబ్బాకటౌన్: పేదలను ఆదుకోవడమే శ్రేష్ట ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ సీఈఓ కంకణాల ఏప్రాయిం అన్నారు. సర్పంచ్ పెరమండ్ల నర్సింహులుతో కలిసి శేరిపల్లి బందారంలో శనివారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పేదలు, వృద్ధుల సంక్షేమా నికి ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. చలికాలంలో ఇబ్బందులు పడకూడదనే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, జోసెఫ్, భిక్షపతి, వాలంటీర్లు పాల్గొన్నారు. -
మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదాలు
బెజ్జంకి(సిద్దిపేట): మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎస్ఐ సౌజన్య అన్నారు. బెజ్జంకిలో రోడ్డు భద్రత, నిబంధనలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులతో వాహనదారులకు పువ్వులు ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు తప్పనిసరి దుబ్బాకటౌన్: రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా దౌల్తాబాద్లో వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ అత్యంత ఉద్యోగులందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఇన్చార్జి ఎంపీడీఓ సయ్యద్ గపూర్ ఖాద్రి, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్, కానిస్టేబుల్స్ రాజుగౌడ్, నవీన్, షఫీ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు గజ్వేల్రూరల్: ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించాలని, మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని సీఐ రవికుమార్ అన్నారు. పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రత, నిబంధనలపై అవగాహన కల్పించా రు. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్, ముగ్గుల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుతులను అందజేశారు. -
వాటర్ప్లాంట్ ఏర్పాటు అభినందనీయం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిమద్దూరు(హుస్నాబాద్): సొంత ఖర్చులతో ప్రజలకు రక్షిత నీటిని అందించడం అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశంసించారు. మండలంలోని రెడ్యానాయక్తండాలో కల రాం సాయికిరణ్రావు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ప్లాంట్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు. ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మద్దూరు మండల కేంద్రంలో మృతి చెందిన పల్లె ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేక సంతోష్కుమార్, మంద యాదగిరి, మాజీ వైస్ఎంపీపీ మల్లిపెద్ది సుమలత, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
లాభాలు మెరుగు
వెదజల్లు..పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు ● కూలీల కొరత అధిగమించొచ్చు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు పొలంలో విత్తనాలు వెదజల్లుతున్న రైతు(ఫైల్) చిన్నకోడూరు(సిద్దిపేట): వరిలో విత్తనాలు వెదజల్లే పద్ధతి అన్నదాతలను అనేక విధాలుగా ఆదుకుంటోంది. తక్కువ ఖర్చుతోపాటు కూలీల కొరతను అధిగమించే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా వ్యవసాయ అధికారులు దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. లాభాలు ఉండటంలో చాలా మంది రైతులు యాసంగిసాగులో ఎక్కువగా వెదజల్లే పద్థతి వైపే మొగ్గు చూపుతున్నారు. విత్తనాలూ.. తక్కువే మొలకెత్తిన విత్తనాలను నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుతారు. దీంతో నారుపోయడం, నాటు వేయడం వంటి వాటికి చేసే ఖర్చు ఆదా అవుతోంది. అలాగే కూలీల కొరతను కూడా అధిగమించవచ్చు. నారు పోయడానికి ఎకరాకు 30 కిలోల విత్తనం వినియోగిస్తుండగా, నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎరకరాకు 12 నుంచి 18 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే సుమారు సగానికి పైగా విత్తనాలకు ఖర్చు తగ్గుతుంది. ఈ యాసంగి సాగులో మండల వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా అందులో 30 శాతం మంది రైతులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు ఆదా వెదజల్లే పద్ధతిలో సాగుచేస్తే నారు, నాట్ల ఖర్చు ఉండదు. పంట పది రోజులు ముందుగానే కోతకు వస్తుంది. దిగుబడి కూడా 10 నుంచి 15 శాతం అధికంగా వస్తుంది. ఎకరాకు రూ.6 నుంచి రూ.10 వేల వరకు ఆదా అవుతాయి. వెదజల్లే ముందు విత్తనాలను 24 గంటలు మండే కట్టాలి. మొలకెత్తిన తరువాత దమ్ము చేసిన పొలంలో వెదజల్లాలి. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. కలుపు యాజమాన్యం కలుపు నివారణకు 3 నుంచి 5 రోజుల మధ్యలో ఫైరజోల్ఫ్యూరన్ ఇథైలన్ను ఎకరాకు 80 నుంచి 100 గ్రాములు చొప్పున పొలంలో చల్లుకోవాలి. 15 రోజుల తర్వాత ఎరువులు వేయాలి. -
పట్నం వారం.. పనులు వేగిరం
రేపటి నుంచే కొమురవెల్లి మల్లన్న జాతర ● భారీగా తరలిరానున్న భక్తులుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరలో మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తుండటంతో పట్నం వారంగా పిలుస్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ ముందు భాగంలో తాత్కాలిక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలలో మంచి నీటి వసతి, భక్తులకు కావాల్సిన లడ్డూలను సిద్ధం చేశారు. సోమవారం హైదరాబాద్కు చెందిన మాణిక్యం, పోచయ్య కుటుంబ సభ్యులు పెద్ద పట్నం వేసి అగ్నిగుండాలు నిర్వహించే ఆనవాయితీ. ఇందుకు తోట బావి ప్రాంగణంలో ఏర్పాట్లను వేగిరంగా జరుగుతున్నాయి. -
క్రీడలతో మానసికోల్లాసం
ఎమ్మెల్యే హరీశ్రావుచిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం ఏర్పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మండల పరిధిలోని గంగాపూర్, పెద్దకోడూరు గ్రామాల్లో గురువారం మండల స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం మరింత బలోపేతం అవుతుందన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో క్రీడాకారులు సాధన చేస్తే జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. యువత చెడు వ్యవసనాలకు వెళ్లకుండా క్రీడల వైపు ఆసక్తి చూపాలన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. చైనా మాంజాపై ఉక్కుపాదం మోపాలి సిద్దిపేటకమాన్: చైనా మాంజాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా యువతతో కలిసి హరీశ్రావు గురువారం గాలిపటాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే వచ్చే తొలి పండగ సంక్రాంతి అన్నారు. చైనా మాంజా కిల్లర్ మాంజా అని అన్నారు. దీని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ, గాయాల పాలవుతున్నారన్నారు. చైనా మంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. -
మల్లన్న బండ.. జనం నిండా
జాతరలో భక్తజన సందోహం, (ఇన్సెట్లో) బండ్ల ఊరేగింపుఅక్బర్పేట–భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి, జంగపల్లి శివారులో వెలిసిన మల్లన్న బండపై జరిగిన జాతరకు జనం పోటెత్తారు. మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బండ్ల బోనాలతో స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
కళాశాలల్లో డిజిటల్ బోధన
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు అవసరమైన నిధులను కేటాయించి ఆయా కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే కళాశాలలకు వైట్వాష్, విద్యుత్ వైరింగ్, ప్రయోగ శాలలకు అవసరమైన పరికరాల కొనుగోళ్లు, మరమ్మతులు వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్ ఇంటర్బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు పద్ధతి (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేయడంతో సమయ పాలన సరిగ్గా అమలవుతోంది. ఒక్కో కళాశాలకు నాలుగు చొప్పున.. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాలుగు చొప్పున మొత్తం 80 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక సాకేంతికతతో కూడిన ఈ ఏర్పాట్లు విద్యార్థుల అభ్యాసానికి కొత్త దిశను చూపనున్నాయి. డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠ్యాంశాలను వీడియోలు, యానిమేషన్లు, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. ముఖ్యంగా గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విజువల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. విద్యుత్, ఇంటర్నెట్.. ఒక్కో కళాశాలకు రూ. 6లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అధ్యాపకుని కేంద్రంగా ఇంటరాక్టీవ్ బోధన కోసం రెండు ఐఎఫ్బీ స్క్రీన్లు, విద్యార్థుల విజువల్ లర్నింగ్కు ఉపయోగ పడేలా మరో రెండు ఐడీపీ మొత్తం నాలుగు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, సౌండ్ సిస్టమ్ వంటి వసతులను అప్గ్రేడ్ చేయనున్నారు.బోధనలో సౌలభ్యం.. ఎల్ఈడీ స్క్రీన్ల వినియోగంతో అధ్యాపకులకు బోధన మరింత సులభంగా మారనుంది. డిజిటల్ కంటెంట్, ప్రజెంటేషన్లు, ఆన్లైన్ విద్యావనరులను నేరుగా తరగతిగదిలో ఉపయోగించవచ్చు. ఒకే పాఠాన్ని అన్ని తరగతుల విద్యార్థులకు ఒకేలా బోధించే అవకాశం ఉండటం, నాణ్యత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంతా పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి బోధను అందేలా ఈ కార్యక్రమం ఉపయోగ పడనుంది. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు విద్యారంగంలో కీలకమైన ముందడుగా భావిస్తున్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహణ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుకార్పొరేట్కు దీటుగా.. ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మౌలిక వసతలతో పాటు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుంది. ఫిజిక్స్ వాలా, ఖాన్అకాడమీ, క్లాట్ తదితరాలతో పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధించేందుకు అవకాశం. అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి. – రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) -
విద్యాధరికి భక్తజనాదరణ
వర్గల్(గజ్వేల్): ఆలయ సముదాయం, సౌకర్యాల సమాహారంతో భక్తజనాదరణ చూరగొంటున్న వర్గల్ విద్యాధరి క్షేత్రం ప్రముఖ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోందని భారత ప్రభుత్వ అదనపు సంచాలకులు డాక్టర్ సంతోష్ కుమార్ పాండే అన్నారు. సంక్రాంతి పర్వదినం రోజు ఆయన క్షేత్రం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. గుగ్గిల్ల గ్రామాభివృద్ధికి నిధులివ్వండిబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ను కోరారు. ఈ మేరకు గ్రామస్తులు శుక్రవారం కేంద్ర మంత్రిని కరీంనగర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాలరెడ్డి, సర్పంచ్ మల్లయ్య, కొండాపూర్ సర్పంచ్ అజయ్వర్మ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులుగజ్వేల్రూరల్: పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల మోడల్స్కూల్లో 6వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెసా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా 6వ తరగతి నుంచి 10వ తరగతిలో అభ్యసించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఓసీలు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.125 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపటి నుంచి ఉర్స్ ఏ షరీఫ్ ఉత్సవాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ఆస్తాన– ఏ– నాయబి పీఠంలో ఆదివారం నుంచి ఉర్స్– ఏ– షరీఫ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పీఠాధిపతి హకీం షరీఫ్ చిష్తీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హకీం షరీఫ్ మాట్లాడుతూ ఆదివారం గంధారాధన, సోమవారం దీపారాధన, మంగళవారం సమాప్తారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ‘బహుజనుల కోసం పోరాడేది బీఎస్పీయే’సిద్దిపేటకమాన్: బహుజనుల కోసం పోరాడేది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి జన్మదిన వేడుకలను సిద్దిపేట పట్టణంలో బీఎస్పీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మాయవతిని భావి భారత ప్రధాని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పోరాడేది బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, మోహన్, హరిలాల్, భాను తదితరులు పాల్గొన్నారు. -
ఆయుష్ సేవలు చేరువ చేయండి
సిద్దిపేటరూరల్: ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి) వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేయాలని కలెక్టర్ హైమావతి ఆయుష్ డాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ, సీహెచ్సీలలో ఆయుష్ వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుష్ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్ ఖాళీల లిస్ట్ తయారుచేయాలన్నారు. జిల్లాలో నిర్మించిన యోగా షెడ్లలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రజలకు యోగా సేవలు అందించాలన్నారు. కాళ్లు, చేతులు నొప్పులతో బాధపడే వృద్ధులను ఆయుష్ వైద్యం వైపు మళ్లించేందుకు ప్రోత్సహించాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని 50 పడకల ఆయుష్ ఆస్పత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధనరాజ్, జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ మేనేజర్ భాను తేజ, జిల్లా ఆయుష్ ఇన్చార్జి అధికారి ఉమాదేవి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో మౌలిక వసతులుప్రశాంత్నగర్(సిద్దిపేట): గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటుగా భోజనం, వసతి, తదితర మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల వెబ్సైట్, వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బ్యాక్లాగ్ అడ్మిషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి వైద్యాధికారులకు ఆదేశం -
రిజర్వేషన్లపైఉత్కంఠ
‘మున్సిపల్’లో ఆశావహుల ఎదురుచూపు వార్డు స్థానాలపైనా సర్వత్రా చర్చ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నేడు ఖరారుసాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలకు ఓ వైపు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వార్డుల రిజర్వేషన్లపై ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల పాలక వర్గం గతేడాది ముగిసింది. మున్సిపాలిటీల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఇందుకు ఏ వార్డు.. ఏ రిజర్వేషన్ అనేది ప్రకటించనున్నారు. ఇందుకోసం శనివారం జిల్లా కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయా పార్టీల ప్రతినిధుల ఎదుటే మహిళ, జనరల్ స్థానాలకు సంబంధించి డ్రాను తీయనున్నారు. బీసీలకు తగ్గిన సీట్లు 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రిజర్వేషన్లతో పోలిస్తే ఈ సారి బీసీలకు దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో సీట్లు తగ్గాయి. చేర్యాల మున్సిపాలిటీలో గతంలో బీసీలకు నాలుగు వార్డులు కేటాయిస్తే ఇప్పుడు మూడు వార్డులు, అలాగే దుబ్బాకలో గతంలో 7 వార్డులు కేటాయిస్తే తాజాగా ఆరు వార్డులు మాత్రమే కేటాయించారు. హుస్నాబాద్లో గతంలో ఐదు వార్డులు ఇప్పుడు సైతం ఐదు వార్డులనే, గజ్వేల్లో 2020లో 7వార్డులు కేటాయించగా ఇప్పుడు సైతం ఏడు వార్డులను బీసీలకు కేటాయించారు. చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీలలో అన్ రిజర్వ్కు ఒక్కోక్కటి చొప్పున పెరిగాయి. నేడు తేలనున్న రిజర్వేషన్లు కొన్ని రోజులుగా కౌన్సిలర్గా పోటీ చేయాలనుకున్నవారు, చైర్మన్ గిరీని దక్కించుకోవాలనుకున్న ఆశావహుల్లో టెన్షన్ శనివారంతో తెలిపోనుంది. గత ఏడాదిగా నాలుగు మున్సిపాలిటీలు ప్రత్యేక పాలనలో కొనసాగుతున్నాయి. 2020లో గజ్వేల్(జనరల్), హుస్నాబాద్(జనరల్ మహిళ), దుబ్బాక (జనరల్ మహిళ), చేర్యాల (జనరల్ మహిళ)లకు రిజర్వేషన్ కాగా ఈ సారి ఏ రిజర్వేషన్ వస్తుందో అని చైర్మన్ గిరిని ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందో అని కొన్ని రోజులు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఆయా వార్డుల వారీగా ఏ వార్డు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ రిజర్వ్కు కేటాయించాలనే దానిపై ఇప్పటికే ఆయా మున్సిపల్ కమిషనర్లు పూర్తి చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నుంచి కలెక్టరేట్లో రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి కలెక్టర్కు జాబితాను అప్పగించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో మహిళలకు కేటాయించే వార్డులకు సంబంధించి డ్రాను తీయనున్నారు. అనంతరం రిజర్వేషన్లకు సంబంధించి ఉత్తర్వులను కలెక్టర్ జారీ చేయనున్నారు.నిబంధన మేరకు పురపాలికల్లో 50శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. జనరల్తోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా ఖరారు చేసి మహిళలకు కేటాయిస్తారు. ఈ క్రమంలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో కొందరు ఆశావహులు, మాజీ కౌన్సిలర్లు ఇప్పటికే తామున్న వార్డుల్లో బరిలో దిగుతున్నట్లు ఓటర్లకు తెలిసేందుకు ప్రధాన జంక్షన్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వేషన్ల స్థానాన్ని పురుషులకు కేటాయిస్తే వారే రంగంలో ఉండనున్నారు. లేకుంటే వారి భార్యలు పోటీలో ఉండనున్నారనే ప్రచారం సాగుతోంది. -
యూరియా కొరత లేదు
● రైతులు అధైర్య పడొద్దు ● కలెక్టర్ హైమావతిమిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు అధైర్య పడొద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని రామాంజనేయ ఫర్టిలైజర్ దుకాణా న్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటూ నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయాలని, కౌలు రైతులకు సైతం యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే మిరుదొడ్డి పీహెచ్సీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, ఇన్చార్జి ఎంపీఓ ఫహీం. పీహెచ్సీ డాక్టర్ సమీనా సుల్తానా, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నాచగిరి ఈఓగా రంగాచారి
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా బెల్లంకొండ రంగాచారి నియమితులయ్యారు. గతంలో ఆయన నాచగిరిలో సీనియర్ అసిస్టెంట్గా సుదీర్ఘకాలం సేవలందించారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయరామారావు ఇన్చార్జి ఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. క్రీడల్లో యువత రాణించాలికేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ హుస్నాబాద్రూరల్: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం కొత్తకొండ దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో మీర్జాపూర్ క్రాసింగ్ దగ్గర యువత క్రికెట్ ఆడుతుంటే ఆగి వారితో కాసేపు ముచ్చటించారు. అలాగే బ్యాట్ పట్టి ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, దొడ్డి శ్రీనివాస్, భూక్య సంపత్నాయక్ తదితరులు ఉన్నారు. వేడుకగా కాట్రావుల పండుగ నంగునూరు(సిద్దిపేట): పాడి, పంటలకు మూలాధారమైన గోవులు ఆరోగ్యంగా ఉంటే రైతు ఇంట సిరి, సంపదలకు కొదవ ఉండదు. అనాధిగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తూ మంగళవారం నంగునూరు రైతులు కాట్రావుల పండగ నిర్వహిస్తున్నారు. మకర సంక్రాతి పురస్కరించుకొని ఆవులు, గేదెలను కడిగి చక్కగా ముస్తాబు చేశారు. వ్యవసాయ బావి వద్ద పందిరి వేసి మట్టితో ఆవులు, గేదెలు, గోపాలుని ప్రతిమను తయారు చేసి గొడ్డు, గోదాను చల్లంగా చూడాలని పూజలు చేశారు. అనంతరం జీవాలను వ్యవసాయ బావి వద్దకు చేర్చి బెల్లం, కొత్త బియ్యంతో మట్టి కుండలో అన్నం వండి వాటి చుట్టు తిరుగుతూ నైవేద్యం సమర్పించి అక్కడే వన భోజనాలు చేశారు. -
గజ్వేల్ సమస్యలు పట్టించుకోరేం?
● కేసీఆర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఫైర్ ● సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన గజ్వేల్: నియోజకవర్గ సమస్యలను మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి విమర్శించారు. మంగళవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.18కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేగాకుండా మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో ఇందిరమ్మ ఇంటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. జీత భత్యాల కోసం మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టివస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గజ్వేల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్చైర్మన్ సర్ధార్ఖాన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు మొనగారి రాజు, నక్క రాములుగౌడ్, సుఖేందర్రెడ్డి, మతిన్ తదితరులు పాల్గొన్నారు. -
డూడూ బసవన్నలు..
క్రీడలతో మంచి గుర్తింపు యువత క్రీడల్లోనూ రాణించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. వివరాలు 9లో uనంగునూరు(సిద్దిపేట): ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. పిల్ల, పాపల సల్లంగా చూడు బసవా’ అంటూ గంగిరెద్దుల ఆట, పాటలు పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు కనువిందు చేస్తున్నాయి. పండగ వేళ బసవన్న తమ ఇంటికొచ్చాడనే ఆనందంతో మహిళలు ధనం, ధాన్యం ఇస్తూ ఉప్పొంగిపోతు న్నారు. అంతరించి పోతున్న కుల వృత్తులు, భాష, వేషం, జీవన శైలి మారినా సంప్రదాయంగా వస్తున్న కుల వృత్తినే నమ్ముకొని కొందరు గంగిరెద్దుల వారు జీవనం సాగిస్తున్నారు. నంగునూరు, ముండ్రాయి, గట్లమల్యాల, నాంచారుపల్లి, హుస్నా బాద్ మండలం ఆరేపల్లి, కొండాపూర్, బొమ్మనపల్లి, చేర్యాల మండలం ఆకునూర్, దుబ్బా క మండలం ధర్మాజీపేట, గ్రామాల్లో గింగిరెద్దుల వారు జీవనం సాగిస్తున్నారు. గ్రామ శివారుల్లో గుడిసెలు వేసుకొని మూడు రోజుల పాటు ఇంటింటా తిరుగుతూ సంక్రాంతి సంబరాలకు జీవం పోస్తున్నారు. అందంగా అలంకరించిన బసవన్నలు మహిళలు, చిన్నారులను దీవిస్తూ చేస్తున్న విన్యాసాలు అందరినీ అలరిస్తున్నాయి. -
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనులశాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందన్నారు. అర్హులందరికీ అందేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. దుబ్బాక పర్యటనలో భాగంగా రూ.10కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే సిద్దిపేట పట్టణంలో రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వేగంగా చేరుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ కమిటీ సభ్యులు సూర్యవర్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నారీమణులే నిర్ణేతలు..
నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికం సాక్షి, సిద్దిపేట: మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే గెలుపోటములపై ప్రభావం చూపనుంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం గతేడాది ముగిసింది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం మే నెలతో ముగియనుంది. ఆ నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. అందులో భాగంగా ఓటరు తుది జాబితాను సోమవారం ప్రకటించగా, మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో వార్డుల వారీగా అప్లోడ్ చేశారు. ఈ నెల 16న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ఆయా వార్డులలో ప్రదర్శించనున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఓటరు జాబితాను ఫైనల్ చేయగా ఇక రిజర్వేషన్ల పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో రిజర్వేషన్లను ప్రకటించే అవకాశాలున్నాయి. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వేగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతుండటంతో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.మున్సిపాలిటీ మహిళలు పురుషులు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 9,873 9,348 06 19,227 దుబ్బాక 11.117 10,224 0 21,341 గజ్వేల్ 24,001 22,738 01 46,740 చేర్యాల 7,119 6,658 0 13,777 -
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
భోగభాగ్యాల భోగి నేడు ప్రశాంత్నగర్(సిద్దిపేట): సరదాల సంక్రాంతిని సంబురంగా జరుపుకొనేందుకు అందరూ సిద్ధమయ్యారు. వాకిళ్లన్నీ రంగవల్లులతో, గొబ్బెమ్మలతో ముచ్చట గొలుపనున్నాయి. బుధవారం భోగి పండుగను నిర్వహించనున్నారు. మూడు రోజుల ముచ్చటైన పండుగ వేళ ఇంటింటా సంతోషాలు వెల్లివిరియనున్నాయి. ఏ ఇంట్లో చూసినా పిండి వంటకాల ఘుమఘుమలే.. మరోవైపు వివిధ వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. పతంగుల హోరు.. సంక్రాంతి పండుగ అనగానే పతంగుల హోరు కొనసాగనుంది. మార్కెట్లలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రూ.5 నుంచి రూ.500 వరకు పతంగుల ధరలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. మురిపించనున్న ముగ్గులు ఇళ్ల ముంగిట రంగవల్లులు ఆకట్టుకోనున్నాయి. ఇందుకు రంగుల విక్రయశాలలు వేలియడంతో కొనుగోళ్లతో సందడి నెలకొంది. అలాగే ధనుర్మాసం పురస్కరించుకుని వైష్ణవాలయాల వద్ద గోదా రంగనాయకుల కల్యాణాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకుగాను ఆలయాలను అందంగా అలంకరించారు. ఈ మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. -
నేత్రపర్వంగా గోదా కల్యాణం
వర్గల్(గజ్వేల్): గోదా రంగనాయకుల కల్యాణంతో ఈరబాయమ్మ తోట పరవశించింది. అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తజన హర్షధ్వానాలు, బాజాభజంత్రీల నడుమ మంగళవారం సుప్రసిద్ధ నాచగిరి క్షేత్రంలో గోదా, రంగనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, పురప్రముఖుల సమక్షంలో అర్చక, పురోహిత పరివారం శాస్త్రోక్తంగా అమ్మవారు, స్వామివార్లకు ఎదుర్కోలు, యజ్ఞోపవిత ధారణాది కార్యక్రమాలు నిర్వహించారు. సుమూహుర్త వేళ జిలకర బెల్లం, ముత్యాల తలంబ్రాలు, అమ్మవారికి మంగళ సూత్ర ధారణ తదితర కల్యాణ క్రతువు నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు నేత్రపర్వం చేసిన మహోత్సవాన్ని భక్తులు తిలకించి తరించారు. అనంతరం స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. -
పల్లె సారథులకు శిక్షణ
24 అంశాలపై సర్పంచ్లకు ట్రైనింగ్● ఒక్కో బ్యాచ్లో 50 మంది.. ● ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక శిబిరాలు జిల్లా వ్యాప్తంగా 90శాతానికిపైగా నూతనంగా ఎన్నికై న సర్పంచ్లే ఉన్నారు. పాలనా పరమైన అనుభవం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సర్పంచులకు విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 22న పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. 508 సర్పంచ్లు, 4,506 వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతీ విడతలో రెండు బ్యాచ్లు.. ఒక్కో బ్యాచ్కు 50 మంది చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్కు 5 రోజుల పాటు శిక్షణ ఉండనుంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలోని న్యాక్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. 24 అంశాలపై అవగాహన గ్రామ పాలనలలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వనమహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక ఇలా 24 అంశాల పై శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధి కృషి చేసే విధంగా ప్రోత్సహించనున్నారు. అలాగే పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా పల్లె అభివృద్ధికి కృషి చేసేలా వివరించనున్నారు. శిక్షణకు తప్పక రావాల్సిందే.. సర్పంచ్లకు శిక్షణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్ లింక్ ద్వారా బయోమెట్రిక్ అంటెండెన్స్ను శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతి సర్పంచ్ తప్పక హాజరు ఉండాలి. ఎనిమిది మంది మాస్టర్ ట్రైనర్లు సర్పంచ్లకు శిక్షణను ఇచ్చేందుకు ఇప్పటికే ఎనిమిది మంది మాస్టర్ ట్రైనర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ప్రవీణ్(ఎంపీడీఓ, గజ్వేల్), శ్రీనివాస రావు(ఎంపీవో, నారాయణరావు పేట), మల్లికార్జున్ (ఎంపీఓ, కొండపాక), సమ్మిరెడ్డి ( ఎంపీడీఓ రిటైర్డ్), రామక్రిష్ణ రెడ్డి(ఎమ్మార్పీ), చెన్నారెడ్డి, ప్రభాకర్, (ఏపీఓ, అక్కన్నపేట), శ్రీనివాస్ ( ఏపీఎం, నంగునూరు సెర్ప్)లు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణలో పాల్గొన్నారు. సర్పంచులకు శిక్షణ ముగిసిన తర్వాత వార్డు సభ్యులకు మండలాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 25 మంది మాస్టర్ ట్రెయినర్లను సిద్ధం చేశారు.శిక్షణ షెడ్యూల్ ఇలా.. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాభివృద్ధిలో పల్లె సారథులదే కీలక పాత్ర. రెండేళ్లుగాగ్రామాలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడ్డాయి. పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాభివృద్ధి కోసం 24 అంశాలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎనిమిది మంది మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది. ఈ నెల 19 నుంచి సర్పంచ్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట సద్వినియోగం చేసుకోండి జిల్లాలోని సర్పంచులు, వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 19 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి అయింది. సర్పంచ్లకు న్యాక్ సెంటర్లో, వార్డు సభ్యులకు ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. – రవీందర్, డీపీఓ -
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
‘చెప్పు’కునేలా చేశారుకలెక్టర్ చెప్పారు.. అధికారులు కదిలారుగజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్అండ్ఆర్ కాలనీ) సమస్యలు ప్రతిబింబిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై కలెక్టర్ హైమావతి స్పందించారు. ఈనెల 9న ‘నిర్వాసితుల నెత్తిన విలీనం పిడుగు’ శీర్షికన, 10న ‘ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ’, 11న ‘నిర్వాసితుల చుట్టే మున్సిపోల్...తెరపైకి పెండింగ్ సమస్యలు’ వంటి ప్రత్యేక కథనాలు ప్రచురితమైన సంగతి తెల్సిందే. ఈమేరకు ముందుగా ఆర్థికేతర సమస్యలు వెంటనే పరిష్కరించడానికి కలెక్టర్ ముందుకుసాగుతున్నారు. ఇందుకు సంబంధించి సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలకు ఆదేశాలిచ్చారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించగా.. ఆయా నిర్వాసిత గ్రామాల్లో అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు ఇళ్ల స్థలాలకు నోచుకోని వారి వివరాలను సేకరించారు. ఎర్రవల్లి, సింగారం గ్రామాలకు చెందినవారికి గజ్వేల్లో, మిగతా గ్రామాలవారికి సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం పరిధిలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిధులతో కూడుకున్న పనులను సైతం త్వరలోనే పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఆర్అండ్ఆర్ కాలనీకి సంబంధించి మున్సిపల్ వార్డుల విభజనలో దొర్లిన పొరపాట్లను సైతం సరిదిద్దడానికి అధికారులు చర్యలు చేపట్టారు. -
వైద్య సేవలు నిరంతరం అందాలి
సమయపాలన పాటించకపోతేచర్యలు: కలెక్టర్ హైమావతిమద్దూరు(హుస్నాబాద్): గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటలూ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. మద్దూరు మండల కేంద్రంతో పాటుగా లద్నూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం హాజరు రిజిస్టర్ను పరిశీలించి, మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా అనుమతి తీసుకున్నారా? అని డీఎంహెచ్ఓకు ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలాగే మెడికల్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు ఉన్నతాధికారులు అనుమతించాకే సెలవు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలన్నారు. ఇష్టానుసారంగా సమయానికి వస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు సిద్దిపేటరూరల్: కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ఆవిష్కరించనున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజావాణికి ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.అర్జీలు పునరావృతం కావొద్దు సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 116 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండానే
● కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ● ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీశ్రావుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్యరావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీల ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్రావు మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, పల్లెల నుంచి పట్టణాల వరకు పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మున్సిపాలిటీలు, నేడు నిర్వహణ లేక కళ తప్పాయని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలి కొదిలేసిందని విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని.. నేడు కనీసం ఆ తాగునీటి సరఫరాను నిర్వహించడం కూడా చేతకావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని హరీశ్రావు చెప్పారు. -
ఈసారైనా మున్సిపల్ కై వసం అయ్యేనా?
జిల్లా నేతలతో మంత్రి కోమటిరెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రానున్న ఎన్నికల్లో సిద్దిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుందా?.. లేదా? అని పార్టీ జిల్లా నాయకులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నంగునూరు మండలం ఘనపురం వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తా వద్ద మంత్రికి నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ సూర్యవర్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శివప్ప, గుండు రవితేజ ఉన్నారు. -
ఆస్పత్రి ఆవరణలో చెప్పుల కుప్ప తొలగింపు
సిద్దిపేటకమాన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెప్పుల కుప్పను తొలగించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి ఆవరణలో చిందర వందరగా చెప్పులు ఉండటం.. కొన్ని మాయం కావడంతో ‘ఎవరికి చెప్పుకునేది?’ అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు తక్షణం చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలోని చెప్పుల కుప్పను శానిటేషన్ సిబ్బంది చేత తొలగించి, ట్రాలీ ఆటో ద్వారా తరలించారు. ఉన్న వాటిని క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ పాదరక్షలు వదిలివెళ్లకూడదని, రాక్లో మాత్రమే విడిచి వెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు. -
జిల్లాలోని మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగానే గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈసారి హుస్నాబాద్ ము
● ముమ్మరంగా ప్రజాభిప్రాయ సేకరణ ● అశావహుల ప్రజాసేవలపైనా ఆరా ● మున్సిపోల్స్పై ప్రధాన పార్టీల ఫోకస్మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. ఇందులో భాగంగా ఆశావహులపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీని గతంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ విజయం సాధించగా, మూడో సారి ముచ్చటగా కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ పావులు కదుపుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక చైర్మన్ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ నాయకులకు సీరియస్గా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సతీష్కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకారం జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్ధానాల్లో ఎవరెవరు బరిలో ఉంటారో వారి పేర్లను నమోదు చేసుకొని ముందుకు సాగుతున్నారు. మరో వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపాలిటీలో బీజేపీ పాగా వేసేందుకు క్షేత్రస్థాయిలో గెలిచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు. సర్వేల బాట.. మున్సిపల్ పరిధిలో రిజర్వేషన్ ప్రకారం ఆయా కేటగిరిల్లో ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. వార్డుల వారీగా కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వార్డుల్లో తిరిగి ఆశావహులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో వివరాలు సేకరించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్లో కూడా గెలిచే వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని ఆ దిశగా సర్వే చేయాలని సతీష్కుమార్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో వైపు బండి సంజయ్ వ్యూహాత్మకంగా గెలిచే గుర్రాలపై దృష్టి సారించారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో ఈ మూడు పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండటంతో అన్ని పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిత్యంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఒకరు రాష్ట్ర మంత్రి, ఇంకొకరు కేంద్ర మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఈ ముగ్గురికి మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. ఓటరు తుది జాబితా విడుదల హుస్నాబాద్: మున్సిపల్ పరిధిలో ఓటరు తుది జాబితాను సోమవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ విడుదల చేశారు. మొత్తం 20 వార్డులకు గాను 19,227 ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. 15వ వార్డులో అత్యధికంగా 1,319 ఓటర్లు, మూడో వార్డులో అత్యల్పంగా 693 ఓటర్లు ఉన్నారు. గతంలో ఎక్కువ ఓట్లు ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్య తగ్గగా, తక్కువ ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.రిజర్వేషన్లపైనే అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు మారుతాయా, రొటేషన్ పద్ధతా? లేకుంటే గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? అనేది అన్ని పార్టీల నేతల్లో నెలకొన్న ప్రశ్న. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ సీటు జనరల్ మహిళకు కేటాయించారు. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఈ సారి బీసీ జనరల్కు కేటాయిస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జనరల్, బీసీలకు కేటాయిస్తే చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనేదానిపై అన్ని పార్టీలకు తలనొప్పిగా మారనుంది. మరో వైపు ఎస్సీకి కేటాయిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే అన్ని పార్టీలకు పెద్ద ఊరట లభించినట్లే. -
నిబంధనలు పాటిద్దాం..
సురక్షితంగా ప్రయాణిద్దాం సిద్దిపేటకమాన్: రోడ్డు నిబంధనలు పాటించి, సురక్షితంగా ప్రయాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. రహదారి భద్రత కార్యచరణలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టు వద్ద సోమవారం నిర్వహించిన ర్యాలీని న్యాయమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. విక్టరీ చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వాహనదారులను న్యాయమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్, రవాణశాఖ ఎంవీఐ శంకర్నారాయణ, మహిళా పీఎస్ ఎస్ఐ నాగరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’ తన్మయం.. భక్తజన ప్రదక్షిణం
స్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి క్షేత్రం అలరారింది. గిరి ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. సోమవారం నేత్రపర్వంగా సాగిన లక్ష్మీనృసింహుని జన్మనక్షత్ర వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. ప్రముఖులు హాజరుకాగా, భక్తజన సందోహం హర్షధ్వానాలు, మిన్నంటిన నారసింహ స్మరణలతో గిరిప్రదక్షిణ సాగింది. పోటెత్తిన భక్తజనం నాచగిరి కొండలు చుడుతూ.. హరిద్రానది తీరం, గోశాలను దాటుతూ ఉత్తరద్వారం వరకు గిరి ప్రదక్షిణ చేసి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గిరి ప్రదక్షిణలో భక్తజన సందోహం– వర్గల్(గజ్వేల్) -
కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్: కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్లో నిర్వహించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల, మతాల పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తుండగా.. కాంగ్రెస్ దేశంలో శాంతి, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని చెప్పారు. ప్రియాంకగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నిరంతరం పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నాచారం ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఉపాధి పథకం పేరు మార్పు తగదు ప్రశాంత్నగర్(సిద్దిపేట): యథాతథంగా మహాత్మాగాంఽధీ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు. సోమవారం జిల్లాకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల పార్టీ అని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉపాధి హామీ పథకం పేరుతో పేదలకు గ్రామాలలో పని కల్పించారన్నారు. నేడు పథకానికి పేరు మార్చడం సరికాదన్నారు. గతంలో ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించేదని, కానీ ఇపుడు 40శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలనడం తగదన్నారు. గతంలో గ్రామా పంచాయతీలకు ఉపాధి హామీ నిధులతో గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేసుకునే వీలుండేదన్నారు. కార్యక్రమంలో గుండు వెంకట్, బర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద ప్రశాంత్నగర్(సిద్దిపేట): యువతలో నిత్య చైతన్య స్ఫూర్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మెదక్ విభాగ్ సహ కార్యవాహ బొల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్ర, రచనలు, ఉపన్యాసాలు జీవితాంతం సమాజ హిత పనులను చేయడానికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. నేటి విద్యార్థులే భవిష్యత్తు భారత నిర్మాతలని, వారిలో జాతీయ భావనను, సామాజిక భావనను నిర్మాణం చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమానికి తపస్ జిల్లా అధ్యక్షుడు చిలుమల మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి పాల్గొన్నారు. జపాన్ సందర్శనకు ఇర్కోడ్ విద్యార్థి సిద్దిపేటరూరల్: ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థి సైన్స్ విజ్ఞాన పరీక్ష (సకుర)లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జపాన్ సందర్శనకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన పరీక్షలో విద్యార్థి వేణు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వేణు పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్నట్లు తెలిపారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేణు జపాన్ దేశ సందర్శనకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం వేణుకు అభినందనలు తెలిపారు. -
ఉన్నట్టా.. లేనట్టా!
సిద్దిపేట మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన జరిగేనా? జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక పాలకవర్గం గడువు మూడు నెలలే ఉండటంతో వార్డులపునర్విభజన అంశం తెర మీదకు వచ్చింది. ఈక్రమంలో విభజన ఉన్నట్లా.. లేనట్లా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. వార్డుల పునర్విభజన జరిగి నాలుగేళ్లు కావడం, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు వార్డుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాజకీయపదవులు ఆశిస్తున్న వారిలోనూ ఆశలు పెరిగాయి. – సిద్దిపేటజోన్సిద్దిపేట బల్దియా ఏర్పడి సరిగ్గా నేటికి 72 ఏళ్లు. అప్పట్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో లోకల్ ఫండ్గా పరిగణించి 1954లో మున్సిపల్గా ఆవిర్భావించింది. తర్వాత 1956లో 13 వార్డులతో మాజీ ఎమ్మెల్యే ఖాజా మోహినొద్దీన్ చైర్మన్గా తొలి పాలకవర్గం ఏర్పడింది. తర్వాత 1981లో పదహారు వార్డులుగా మారింది. సిద్దిపేట పట్టణ విస్తీర్ణం పెరగడంతో 1987లో 28 వార్డులుగా పునర్విభజన చేపట్టారు. అనంతరం 2005లో మళ్లీ వార్డుల్లో పునర్విభజన చేసి 34వార్డులుగా మార్చారు. తర్వాత 2021 మార్చిలో సిద్దిపేట బల్దియా సమీపంలో ఉన్న ఆరు గ్రామ పంచాయతీల విలీనంతో పునర్విభజన ప్రక్రియ తెర మీదకు వచ్చింది. ఎట్టకేలకు అప్పట్లో 43 వార్డులుగా పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య నిర్ణీత ప్రమాణాల కంటే అధికంగా ఉంది. 2021జనాభా లెక్కల ప్రకారం ఉన్న సంఖ్య కంటే 50వేల జనాభాపెరగడంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో వార్డుల పునర్విభజన అనేది తప్పనిసరి అనేది తెర మీదకు వచ్చింది. అప్పట్లో లక్ష ఓటర్లు మాత్రమే.. 2021 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట బల్దియాలో 1,00,658 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో జనాభా 50వేలకుపై చిలుకు పెరిగింది. అలాగే ఓటర్ల సంఖ్య 12వేలు పెరిగి.. ప్రస్తుతం మున్సిపాలిటీలో 1,12,000 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన ఓట్ల ఆధారంగా వార్డుల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దే క్రమంలో వార్డుల పునర్విభజన తప్పనిసరి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆరు వార్డుల్లో.. అప్పట్లో బల్దియా పరిధిలో వార్డుల్లో కనిష్టంగా 2,100 గరిష్టంగా 2,560 ఓటర్లతో వార్డుల రూపకల్పన జరిగింది. కానీ ప్రస్తుతం పెరిగిన జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చూస్తే పట్టణంలో ఉన్న ఆరు వార్డుల్లో లెక్కలకు పొంతన లేదు. పట్టణంలోని 1, 2, 3, 4, 15, 16 వార్డుల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి, నర్సాపూర్ , ఇమాంబాద్ గ్రామాల విలీనం ప్రక్రియ సమయంలో సమీప వార్డుల్లో కలిపి వార్డులుగా పునర్విభజన జరిగింది. ఒక్క రెండవ వార్డులోనే ఏకంగా నాలుగేళ్లలో 1500 ఓటర్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఆశలు చిగురించేనా? మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 43వార్డుల్లో పునర్విభజన జరిగితే అదనంగా మరో మూడు వార్డులు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. దీంతో కలిసి వచ్చే వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశవహులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా పునర్విభజన ప్రక్రియ సిద్దిపేటలో జరుగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. రాజకీయ నేతల్లో జోరుగా చర్చ ప్రస్తుతం 43 వార్డులు ప్రక్రియ జరిగితే మరో మూడు పెరిగే అవకాశం మూడు నెలల్లో ముగియనున్న పాలకవర్గం గడువు


