breaking news
Siddipet District Latest News
-
వేగంగా సమాధానం ఇవ్వాలి
సిద్దిపేటరూరల్: ప్రజలు వారి అవసరాల కోసం ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇచ్చిన దరఖాస్తులకు వేగంగా సమాచారం రూపంలో సమాధానం ఇవ్వాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో సమాచార హక్కు చట్టం– 2005 గురించి జిల్లాలోని అన్ని శాఖల పబ్లిక్ సమాచార అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాఖల వారీగా ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరితగతిన అర్జిదారులకు అడిగిన సమాచారాన్ని పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించాలని కోరారు. సమాచార హక్కు చట్టం అనేది పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పించే ఒక చట్టమన్నారు. ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ సంస్థలకు జవాబుదారీగా ఉండేలా చేయడం, అవినీతిని అరికట్టడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. జిల్లాలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ సెక్షన్ ద్వారా అర్జిదారులకు జవాబు ఇవ్వాలో ప్రతి అధికారి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టంకు సంబంధించి పీఐఓ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, ఎంసీఎచ్అర్డీ రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ భిక్షపతి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్టీఐ దరఖాస్తులపై సమీక్ష -
93 దుకాణాలకు 2,518 దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు మొత్తం 2,518 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. చివరి రోజైన శనివారం ఆశావాహులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడానికి సిద్దిపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. సర్కిల్స్ వారీగా సిద్దిపేట 747, గజ్వేల్ 706, హుస్నాబాద్ 484, చేర్యాల 371, మిరుదొడ్డి 210 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గత పాలసీలో 4,166 దరఖాస్తులు రాగా ప్రస్తుతం 2,518 మాత్రమే వచ్చాయి. డిపాజిట్ ధర రూ.3 లక్షలకు పెంచడంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడానికి అనాసక్తి చూపినట్టు చెప్తున్నారు. 23న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా వైన్షాపులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. -
చకచకా
ఇక భూ సర్వేలునెల రోజులుగా ఎదురుచూపులు● జిల్లాలో 26 మండలాలకు 15 మందే సర్వేయర్లు ● లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంతో తీరనున్న కొరత ● మొదటి బ్యాచ్లో 120 మంది ఉత్తీర్ణత ● నేడు సీఎం చేతుల మీదుగా లైసెన్స్లను అందుకోనున్న సర్వేయర్లులైసెన్స్డ్ సర్వేయర్లుగా ఉత్తీర్ణులైన వారు నెల రోజులుగా మండలాల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ఇచ్చారు.. పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకపోవడంతో కొంత నిరాశ చెందారు. నెల రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న రెండో బ్యాచ్కు వివిధ పరీక్షలను నిర్వహించిన తర్వాత వీరికి సైతం లైసెన్స్లను జారీ చేయనున్నారు.సాక్షి, సిద్దిపేట: ఇక భూ సర్వేలు చక చకా కానున్నాయి. భూ సమస్య పరిష్కారం కోసం సర్వే చేయించేందుకు నెలల తరబడి ఎదురు చూసేవారు. ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు, సర్వేయర్ల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని నిర్ణయించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. జిల్లా వ్యాప్తంగా 352 మంది దరఖాస్తు చేశారు. అందులో మొదటి విడతలో 175 మందిని ఎంపిక చేయగా 150 మంది 50 రోజుల పాటు శిక్షణ పొందారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 120 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా నుంచి 120 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు పత్రాలను అందుకోనున్నారు. తప్పనున్న ఇబ్బందులు -
‘సాక్షి’ జోలికొస్తే ఖబడ్దార్
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ,అక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటూ తన కలంతో ఎండగడుతున్న సాక్షిపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దారుణం. ప్రజా ఉద్యమాలకు అండగా ఉంటూ.. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు విధానాలను కూకటివేళ్లతో పెకిలిస్తూ మొదటి నుంచి ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి జోలికొస్తే ఖబడ్దార్. చంద్రబాబు, పవన్కల్యాణ్లు తమ తప్పుడు ధోరణిని మానుకోకుంటే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. సాక్షికి మాలమహానాడు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. – కాల్వ నరేష్, మాలమహానాడు రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులుఅరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారా..? సాక్షిపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రభుత్వాలకు ,ప్రజలకు మధ్యన వారధి పత్రికలు. ఫోర్త్ ఎస్టేట్పై దాడి అంటే ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపైనే దాడి చేసినట్లు. వాస్తవాలు రాస్తే దాడులు, కేసులు పెట్టడడం మంచి పరిణామం కాదు. దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులతో సాక్షిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామని చూడడమే అవుతుంది. సాక్షికి కూటమి సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. – పల్లె వంశీకృష్ణాగౌడ్, న్యాయవాది -
జాతీయ క్రీడలకు వేదికగా పటాన్చెరు
పటాన్చెరు: క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని..రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మూడు రోజులుగా పటాన్చెరులోని మైత్రి మైదానం వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్ 14 బాలుర, బాలికల కబడ్డీ ,అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగం రాష్ట్రస్థాయి పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ...క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ..కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు. మెదక్ జట్టు ఘన విజయం శనివారం సాయంత్రం అభిమానుల మధ్య జరిగిన అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది..అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు పైన ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్రెడ్డి, ఎంఈవో లు పీపీ రాథోడ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముగిసిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడలు -
తమను పున్నామ నరకం నుంచి తప్పించకపోయినా బతికుండగా వృద్ధాప్యంలో చేరదీసి పట్టెడన్నం పెడతారని బిడ్డలపై ఆశలుపెట్టుకునే తల్లిదండ్రులెందరో. అయితే చాలామంది కొడుకులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారి ఆశల్ని వమ్ము చేస్తూ కనీస మానవత్వాన్ని మరిచిపోతున్నారు. పున్నా
● డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ● వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల మూసివేత ● బంద్లో పాల్గొన్న బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్దిపేటకమాన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన సిద్దిపేట బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. బంద్లో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట వారు బైఠాయించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు యాజమాన్యాలు ఒకరోజు ముందుగానే సెలవు ప్రకటించాయి. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని అన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: గరీమా
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో విషజ్వరాలు, డెంగ్యూపై ఆరాతీశారు. పిల్లకు ఇచ్చే వాక్సిన్ను పరిశీలించారు. ఉద్యోగులు సకాలంలో హాజరై విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకులాల్లో మిగులు సీట్లు కేటాయింపుచేర్యాల(సిద్దిపేట): జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్లకు శనివారం చేర్యాలలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సమక్షంలో విద్యార్థినిలకు మిగులు సీట్లకు కౌనెలింగ్ చేసి అర్హులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ప్రత్యూష, జిల్లా సమన్వయ అధికారి పోలోజు నర్సింహాచారి, ప్రిన్సిపాల్తో పాటు 800 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు. ఎర్రోళ్లకు ఈటల పరామర్శచిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఎర్రోళ్ల తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం గంగాపూర్లోని ఆయన నివాసంలో ఈటల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గంగాపూర్ పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, పరశురాలు, నాగరాజు పాల్గొన్నారు. నియామక పత్రం అందుకున్న మణికంఠేశ్వర్ రెడ్డిహుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుస్నాబాద్కు చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్– 2 నియామక పత్రాన్ని అందుకున్నాడు. మణికంఠేశ్వర్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్ ఏసీటీఓ (అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)గా పోస్టింగ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈయన తండ్రి శ్రీనివాస్రెడ్డి శంషాబాద్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి అనిత హుస్నాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్గా పని చేశారు. సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలిప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్ సిద్దిపేటఎడ్యుకేషన్: మన పూర్వీకులు జరుపుకునే సాంప్రదాయ పండుగల్లో శాసీ్త్రయ దృక్పథం దాగి ఉందని, అయితే ప్రస్తుతం ఆధునిక పోకడలతో అశాసీ్త్రయ పద్ధతులతో పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయిందని సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్కుమార్ అన్నారు. శనివారం స్థానిక కళాశాల ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పర్యావరణరహిత దీపావళి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయంగా నిర్వహించే ప్రతి పండుగకు ఒక శాసీ్త్రయత ఉందన్నారు. ఆధునిక కాలంలో మన జీవన విధానంతో పాటు పండుగలు సైతం పొల్యూట్ అయ్యాయన్నారు. తద్వారా అనేక రకాల అనర్థాలకు సమాజం గురువుతుందని చెప్పారు. తిరిగి పాత సాంప్రదాయ పద్దతుల్లో పండుగలను జరపుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. -
నిజాలు రాస్తే దాడులా..?
నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నా సాక్షి పత్రికపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడడం సిగ్గుచేటు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వ అరాచకపాలనను ఎండగడుతుండడంతో జీర్ణించుకోలేక పోతోంది. సాక్షిపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతుంది. కక్ష సాధింపు చర్యలను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి బెదిరింపులకు భయపడొద్దు. మేం సాక్షికి అండగా ఉంటాం. – బి.భాస్కర్, సీపీఎం రాష్ట్ర నాయకులు ‘సాక్షి’పై బాబు సర్కార్ దుర్మార్గం చంద్రబాబు పెద్ద నియంత. మొదటి నుంచీ ప్రజాఉద్యమాలను అణగదొక్కుతూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుండు. అక్రమ మద్యం తయారీని వెలుగులోకి తెచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సాక్షిపై కావాలనే చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై అక్రమ కేసులు మంచి పరిణామం కాదు. చంద్రబాబు సర్కార్ చర్యలను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. -
కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం
దుబ్బాక: నిజాలు నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి, మేధావులు తీవ్రంగా ఖండించాయి. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దారుణాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నాయి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు ఏపీలో సాక్షి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ పలువురు డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
పత్రికా స్వేచ్ఛను హరించడమే..
‘సాక్షి’పై దాడులు సరికావు● టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు రంగాచారి ● నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసనసిద్దిపేటకమాన్/సిద్దిపేటజోన్: పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని, సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్పై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు, విచారణ పేరుతో నిర్బంధకాండకు వ్యతిరేకంగా సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో శుక్రవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టులపై దాడులను మానుకోవాలన్నారు. ప్రత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పత్రికా కార్యాలయాల మీద దాడులు ఆపాలన్నారు. లేదంటే భవిష్యత్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు రాజిరెడ్డి, నాగరాజు, రంగధాంపల్లి శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి, యాదగిరిగౌడ్, జనార్ధన్, శ్రీనివాస్, మైసారెడ్డి, రవి, నరేష్, సాయి, ఇంద్ర, సంతోష్, మల్లారెడ్డి, రాజబాబు, అరుణ్, శ్రీకాంత్, శ్రీనాథ్, చందు, రాజు, వంశీ, స్వామిగౌడ్, ముంజ గిరి, వెంకట్, నరేష్, కృష్ణ, వెంకట్, గణేష్, గణేష్బాబు, పరశురాములు, దయానంద్, రజనీకాంత్, దర్శన్, దయానంద్, రాజు, సతీష్, ఇంద్రసేనారెడ్డి, సంతోష్, శ్రీకాంత్, వెంకటేష్, కుమారస్వామి, తులసి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.అక్రమ కేసులు సరికాదు కథనాలను ఆధారంగా చూపుతూ సాక్షి పత్రిక ఎడిటర్పై ఏపీ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. అభ్యంతరం ఉంటే చట్టపరమైన, సామరస్యంగా దారులలో వెళ్లాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిదీ. – తిరుపతి రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేసులు ఉపసంహరించాలి సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికలపై వత్తిడి సరికాదు. ఎడిటర్ను లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేసినట్టుగా ఉంది. ఏపీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరించేలా చర్యలు ఉండొద్దు – తిరుమల్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
మంచి సంస్కృతి కాదు
సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను సాకుగా చూపి ఏపీ పోలీసులు సాక్షి ఎడిటర్ దనంజయ రెడ్డి, పాత్రికేయుల మీద అక్రమ కేసులు నమోదు చేయడం మంచి సంస్కృతి కాదు. కథనాల మీద అభ్యంతరం, ఆక్షేపణలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. సాక్షి ఎడిటర్ పైన అక్రమ కేసులు నమోదు చేయడం దారుణం. – వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్బందులకు గురిచేయొద్దు నకిలీ మద్యం అంశంపై కథనాలు రాసిన సాక్షిపై తప్పుడు కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమే. విచారణ పేరిట సాక్షి కార్యాలయంలో పోలీసుల హడావిడి సరికాదు. కథనాలపై ఆక్షేపణ ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి. కానీ పత్రిక కార్యాలయంలో సోదాల పేరిట ఇబ్బందులకు గురిచేయద్దు. – అంజయ్య, ప్రెస్ అకాడమీ మాజీ సభ్యుడు -
1,250 మద్యం దరఖాస్తులు
సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు 1,250 దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లాలోని 93 మద్యం దుకాణాల నిర్వహణకు శుక్రవారం 688 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు మొత్తం 1,250 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సర్కిల్ వారీగా సిద్దిపేట 380, గజ్వేల్ 318, హుస్నాబాద్ 295, చేర్యాల 177, మిరుదొడ్డి 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుకు శనివారం చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఎర్రోళ్లను పరామర్శించిన కేటీఆర్చిన్నకోడూరు(సిద్దిపేట): ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం గంగాపూర్లోని ఆయన నివాసంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండిహుస్నాబాద్రూరల్: ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శుక్రవారం మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ మొక్కజోన్న విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా, నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. రైతులు విత్తన ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొంటే పంటల దిగుబడులు పెరుగుతాయన్నారు. విచ్చల విడిగా రసాయన ఎరువులను వేసి పెట్టుబడుల భారం పెంచుకోవద్దన్నారు. స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించండిసిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులను పరిశుభ్రంగా ఉంచేందుకు స్కావెంజర్లను నియమించారన్నారు. రెండేళ్లలో 9 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ధర్నాలో సహాయ కార్యదర్శి రవికుమార్, రాములు, కవిత, రజిత పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి సిద్దిపేటరూరల్: జిల్లావ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ పత్తి పంట చేతికి అందే దశలో గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 10,075కు పెంచి కొనుగోళ్ళు చేపట్టాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. -
ఎడ్యుకేషన్ హబ్లో ఎంఈఓ విచారణ
గజ్వేల్: ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డు కారం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. శుక్రవారం స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్లోని హైస్కూల్కు ఎంఈఓ వై.కృష్ణ వెళ్లి విచారణ జరిపారు. విద్యార్థులకు గొడ్డు కారం పెట్టిన విషయం నిజమేనని ఎంఈఓ నిర్ధారించారు. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. మెనూ అమలులోనూ నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. విచారణ అంశాలను జిల్లా విద్యాధికారికి నివేదించనున్నట్లు ఎంఈఓ ‘సాక్షి’కి తెలిపారు. డీఈఓ ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. -
రిజర్వేషన్లపై రాజీలేని పోరాటం
దుబ్బాక: పార్టీలు, రాజకీయలను పక్కన పెట్టి 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా పోరాటం చేయాలని బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని కుల సంఘాలతో బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు మచ్చ శ్రీనివాస్, పల్లె వంశీకృష్ణాగౌడ్, శ్రీరాం నరేందర్ ఉన్నారు.బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ -
కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం కావాలి
● ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా ● వర్గల్లో కార్యకర్తల అభిప్రాయ సేకరణవర్గల్(గజ్వేల్): కార్యకర్తల అభీష్టం మేరకే నాయకత్వ ఎంపిక జరగాలనే వినూత్న కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. పార్టీ పటిష్టతకు, ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ ఫంక్షన్హాల్లో డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, మర్కూక్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం మెదక్ జిల్లాలో అబిప్రాయ సేకరణ పూర్తి చేశామని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో జరుగుతోందన్నారు. ఈనెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షుల ఎంపికను ప్రకటిస్తామన్నారు. మండల, గ్రామ స్థాయిలో కూడా ఇదే పద్ధతిలో నాయకత్వ ఎంపిక జరుగుతుందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం దక్కుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్లు జగదీశ్వర్ రావు, నజీర్ అహ్మద్, వరలక్ష్మి, సంతోష్ గుప్త, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై నిర్లక్ష్యమేలా?
గజ్వేల్రూరల్: విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీజేపీ, బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం’ శీర్షికన ప్రచురితమైన కథనం మేరకు ఆయా పార్టీల నాయకులు పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎడ్యుకేషన్ హబ్లను సందర్శించారు. విద్యార్థులతో మట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మధ్యాహ్న భోజన బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కార్యక్రమాల్లో బీజేపీ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు అశోక్గౌడ్, నాయకులు మన్నె శేఖర్, అరవింద్, శ్రీనివాస్, కుమార్, చంద్రం, రాజు, మహేందర్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మోహన్బాబు, వర్గల్ మండల అధ్యక్షుడు స్వామిగౌడ్, జగదేవ్పూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● పీహెచ్సీ, కస్తూర్బా పాఠశాల సందర్శనసిద్దిపేటరూరల్: విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులతో ఓపికతో ఉంటూ వైద్యం అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్, హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం రాఘవాపూర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ మెనూ పాటిస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని, రోజువారీగా వ్యాయామం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. -
● చెప్పినట్లు వినకపోతే బెదిరింపులు ● వీరిని బదిలీ చేయాలంటూ స్థానిక నేతల ఫిర్యాదులు ● అధికార పార్టీ నేత దూషణతో పీఎస్లో హౌసింగ్ ఏఈ ఫిర్యాదు ● కలెక్టర్కు మొరపెట్టుకున్న ఓ మండల అధికారి
నేతల పోకడ ఇలా..● ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నంగునూరు మండల అధికార పార్టీ నాయకుడు సంబంధిత హౌసింగ్ ఏఈకి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా ఎంపీడీఓ, కలెక్టర్ను సైతం దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. సదరు నేతపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది. దూషించినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. ● నంగునూరు మండల పరిధిలో తాము చెప్పిన పనులు చేయాలని ఓ అధికార పార్టీ నేత పరిషత్ కార్యాలయ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గత 29న కలెక్టర్ను సదరు అధికారి కలిసి తాము ఇక్కడ పని చేయలేమని మొరపెట్టుకున్నారు. కలెక్టర్ మందలించినా నేతల్లో మాత్రం మార్పురాకపోవడం గమనార్హం. నంగునూరు మండలంలో పని చేయడం ఇబ్బందిగా ఉందని ఎంపీడీఓ, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తన దృష్టికి తీసుకవచ్చారని ఈ నెల 8న విలేకర్లతో చిట్ చాట్లో స్వయంగా సీపీ విజయ్ కుమార్ వెల్లడించిన విషయం విదితమే. ● నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌసొద్దిన్కు చెందిన బైక్ను ఆగస్టు 2న గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామ పంచాయతీ విధుల్లో భాగంగా వైకుంఠధామం వద్ద బైక్ను పార్క్ చేసి, గ్రామ నర్సరీని పరిశీలించేందుకు గౌసొద్దిన్ వెళ్లారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై పెట్రోల్ పోసి దహనం చేశారు. దీంతో రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఎవరన్నది తేలలేదని సమాచారం. -
మంత్రి వ్యాఖ్యలు సరికావు
విద్యార్థి కుటుంబ సభ్యుల రాస్తారాకోహుస్నాబాద్: జిల్లెల్లగడ్డ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థి వివేక్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మృతుని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేక్ ఆటలాడుతూ ప్రమాదవ శాత్తు మృతి చెందాడని మంత్రి అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ల విచారణ పూర్తి కాకుండానే వ్యాఖ్యానించడంపై కేసు నిర్వీర్యం చేసినట్లేనని అన్నారు. వివేక్ మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివేక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఆ షాపులపైనే నజర్
జిల్లాలో నూతన మద్యం పాలసీ ప్రక్రియ జోరందుకుంది. 2025–27కి గాను వైన్ షాప్ల కేటాయింపు కోసం ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 26 నుంచి ప్రారంభం కాగా, 18వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో లిక్కర్ వ్యాపారులు 2023–25లో వైన్షాపుల వారీగా జరిగిన మద్యం అమ్మకాలపై దృష్టిసారించారు. ఈ నెల 23న లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 93 వైన్స్ షాపులు ఉండగా, ఐదు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24, గజ్వేల్ పరిధిలో 26, చేర్యాలలో 16, హుస్నాబాద్లో 16, మిరుదొడ్డిలో 11 ఉన్నాయి. రిజర్వేషన్లలో ఎస్సీలకు 9, గౌడలకు 16 షాపులను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్1,2023 నుంచి నవంబర్ 30,2024 వరకు రూ.1,415.32 కోట్లు, డిసెంబర్ 1,2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు రూ.959.98కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇలా జిల్లా మొత్తం 2023–25లో ఇప్పటి వరకు రూ.2,375.3కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఒక్కో షాపులో రూ.30కోట్లకు పైగా.. జిల్లా వ్యాప్తంగా 11 వైన్స్ దుకాణాలలో ఒక్కో షాపులో రూ.30కోట్లకుపైగా విక్రయాలు జరగడం విశేషం. సిద్దిపేట పట్టణంలో షాప్ నంబర్–5లో మొత్తంగా రూ.37.76కోట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే జగదేవ్పూర్ మండలంలో తిగుల్ నర్సాపూర్ వైన్ షాప్లో రూ.34.44కోట్లు, మర్కూక్లో రూ.32.7కోట్ల విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో లిక్కర్ వ్యాపారులు ఏ ఏరియా వైన్స్లో ఎంత మద్యం అమ్మకాలు జరిగాయనేదానిపై ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలో పరిచయం ఉన్న వారితో వ్యాపారులు లిస్టులను తెప్పించుకున్నారు. ఎంత వ్యాపారం జరిగితే ఎంత లాభం ఉంటుందన్న విషయంపై లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూ.55లక్షల చెల్లించే షాపులలో ఎక్కువ విక్రయాలు జరిగే వాటిపై సైతం నజర్ పెట్టారు. మద్యం వ్యాపారులు గ్రూప్ల వారీగా హోటల్స్, లాడ్జీలలో సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్ని షాప్లకు.. ఎక్కడి షాపులకు టెండర్లు వేయాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. రేపటితో ముగియనున్న గడువువైన్స్ షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వతేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 561 దరఖాస్తులే వచ్చాయి. 2023–25లో 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు 300 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్కిల్ వారిగా సిద్దిపేట 163, గజ్వేల్ 159, హుస్నాబాద్ 145, చేర్యాల 76, మిరుదొడ్డి 18 దరఖాస్తులు వచ్చాయన్నారు. అయితే జిల్లాలో 9 షాప్లలో ఒక్క దరఖాస్తు రాలేదు. సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్దిపేట–15, 16, గజ్వేల్ పరిధిలోని నంబర్లు 27, 40, 41, మిరుదొడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో 88, 91, 92, 93 నంబర్ షాప్లకు ఇప్పటి వరకు దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం వైన్ షాప్ల కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ నెల 23న డ్రా ద్వారా షాప్లను కేటాయిస్తాం. – శ్రీనివాస మూర్తి, ఈఎస్ 11 వైన్స్ షాపులలో రూ.30 కోట్ల చొప్పున అమ్మకాలు లెక్కలేస్తున్న మద్యం వ్యాపారులు జిల్లాలో 93 దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు 561 -
మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం
● అర్ధాకలితో విద్యార్థులు విలవిల ● కలుషిత నీటితో చర్మ రోగాలు ● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలుగజ్వేల్/గజ్వేల్ రూరల్: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధునాతన ప్రమాణాలతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం మెతుకులే దిక్కవుతున్నాయి. మరోవైపు కలుషిత నీటితో చర్మరోగాల బారిన పడి అల్లాడుతున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పట్టణంలోని ‘సాక్షి’ బాలుర ఎడ్యుకేషన్ హబ్ను సందర్శించింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హైస్కూల్కు చెందిన విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తంగా 529 విద్యార్థులు ఉండగా, మధ్యాహ్న భోజన సమయానికి 509మంది ఉన్నారు. వారి భోజనాన్ని పరిశీలించగా పేట్లల్లో గొడ్డుకారం కనిపించింది. కూరలు వండటం లేదా? గొడ్డుకారంతో ఎందుకు తింటున్నారు? అని అడిగితే కూరలు అయిపోయాయని కారం వేస్తున్నారంటూ బదులిచ్చారు. కారాన్ని తినలేకపోతున్నామని అర్ధాకలితోనే ఉంటున్నామని చెప్పారు. ఇదే క్రమంలో వంట గదిలోకి ‘సాక్షి’ వెళ్లి చూడగా ఓ మహిళ విద్యార్థుల ప్లేట్లల్లో కారం పొడి వేస్తూ కనిపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఈ రోజు పిల్లలు ఎక్కువగా రావడం వల్ల కూరలు అయిపోయాయని చెప్పడం గమనార్హం. మరో విషయమేమిటంటే భోజనాన్ని పిల్లలే తమ ప్లేట్లలో వేసుకోవడం కనిపించింది. అపరిశుభ్ర వాతావరణంలో ప్లేట్లను కడగడం, నేలపైనే కూర్చొని తినడం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పిల్లలు ఏం తింటున్నారు? వారికి భోజనం సరిపోయిందా? లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన ఉపాధ్యాయులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆఫీస్ రూమ్లో ఉండటం గమనార్హం. ఇదే హబ్లోని బాలుర జూనియర్ కళాశాలను సైతం ‘సాక్షి’ సందర్శించింది. ఈ కళాశాలలో 571 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా ఇదే ప్రాంగణంలోని హాస్టళ్లల్లో ఉంటున్నారు. కలుషిత నీటితో పిల్లలకు చర్మ రోగాలు వచ్చాయి. ఒళ్లంతా దద్దుర్లు, కురుపులతో అల్లాడుతున్నారు. మరికొందరు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాలికల ఎడ్యుకేషన్ హబ్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణం దృష్టిసారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. -
అందరి అభీష్టంతోనే ఎంపిక
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి నియామకం ● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ జ్యోతి రౌటేలా ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నచ్చిన వ్యక్తే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికవుతారని ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగదీశ్, నజీమ్ అహ్మద్, వరలక్ష్మితో కలిసి జ్యోతి రౌటేలా సిద్దిపేట అర్బన్, పట్టణం, రూరల్, నారాయణరావుపేట మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, జిల్లాస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కష్టపడే నాయకుడ్ని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ప్రజాధరణ ఉన్న నాయకుని నియమించడానికే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉంటుందన్నారు. దళిత, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రధా ని మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్ నియంతృత్వ పాలన చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చే యడమే తమ లక్ష్యం అన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష ఆశావహులు కమిటీకి దరఖాస్తులు అందజేశారు. -
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● కలెక్టర్ హైమావతి ● సివిల్సప్లై, డీఆర్డీఓ అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లు, అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డీఆర్డీఓ అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లై శాఖ అందించిన మార్గదర్శకాల మేరకు కొనుగోలు చేయాలన్నారు. ఈ సీజన్లో 6లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 239 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కొనుగోలు చేయగానే గన్నీబాగుల్లో నింపి మిల్లులకు పంపించాలని తెలిపారు. మిల్లులో సైతం తేమ శాతం పరిశీలించాలన్నారు. మిల్లర్లు అగ్రిమెంట్ చేసుకుని బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వరి ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్ ఎంట్రీ చేయాలన్నారు. ఫిజికల్ స్టాక్ , రిజిస్టర్ ఎంట్రీ సమానమవ్వాలన్నారు. లేబర్ కొరత లేకుండా చూసుకుని, ఎక్కడైనా ధాన్యం మళ్లించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ తనూజ, డీఎం సీఎస్ ప్రవీణ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డీటీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పోస్టుద్వారా పంపిణీ చేస్తున్నాం నూతనంగా వస్తున్న ఓటర్ కార్డులను పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనీ బీఎల్ఓ లకు ఐడీ కార్డ్ ల పంపిణీ పూర్తి చేశామన్నారు. నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఫామ్ 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని, జిల్లాలో చనిపోయిన వారిని గుర్తించి, మిగతా వారి వయస్సు ధ్రువీకరణను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, కలెక్టరేట్ ఏఓ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్రూరల్: పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పాఠశాల బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రత ఉంటుందని చెప్పారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మృతి చెందిన విషయంపై తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావదని హెచ్చరించారు. రాత్రి వేళ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. -
సంఘటితంగా ఉద్యమిద్దాం
● 18న బంద్ జయప్రదం చేద్దాం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు సిద్దిపేటజోన్: ‘రిజర్వేషన్ల సాధనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ ఏకమై సంఘటితంగా ఉద్యమిద్దాం. 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులోని ఓ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈనెల 18న నిర్వహించనున్న బంద్ విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టగా కోర్టు కేసులతో ఆశలపై సందిగ్ధం నెలకొందన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన చివరి దశలో ఉందని, వత్తిడి తెచ్చి సాధించుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు చంద్రం, సర్పంచ్ ఫోరం రాష్ట్ర జేఏసీ సెక్రటరీ సుభాష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా సీపీఐ సెక్రటరీ పవన్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నవీన్ గౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు శ్రీహరి, శ్రీనివాస్,రాజేశం, వెంకట్, ఎల్లయ్య, శ్రీనివాస్,నరేందర్ పాల్గొన్నారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి
సీపీ విజయ్కుమార్ గజ్వేల్రూరల్: పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. గురువారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏసీపీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్, పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ విజయ్కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ విధులు నిర్వహించే సిబ్బంది ఎళ్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి, రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గజ్వేల్: మనోధైర్యంతో ముందుకుసాగితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రముఖ మానసిక వికాస నిపుణుడు వీరేందర్ అన్నారు. వర్గల్ మండలం వేలూరు గ్రామంలో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత పులి రాజు రచించిన ‘వేలూరు ఆత్మహత్యల గోస’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన వీరేందర్ మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోయే మనస్తత్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధ వ్యహకర్త కల్నల్ జీజే రావు మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు తనవంతుగా సెప్టెంబర్ 10 సినిమా తీశానని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. సమస్యలు ఎదురైనపుడు దాచుకోకుండా, బంధువులకు, సన్నిహితులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పెద్ది రాజు, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటఎడ్యుకేషన్: పర్యావరణాన్ని పరిరక్షించడంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అన్నారు. గురువారం స్థానిక కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎకో బజార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో విద్యార్థులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణహిత స్టాల్స్ ను పరిశీలించి అభినందించారు. అనంతరం విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, వ్యాసరచన తదితర పోటీల నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతుల అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): పాఠశాలల తనిఖీలకు ఉపాధ్యాయులను వేయొద్దని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చిన్నకోడూరు, అల్లీపూర్, పెద్దకోడూరు, మాచాపూర్, గంగాపూర్ ఉన్నత పాఠశాలల్లో సమస్యల సేకరణ, పభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేసి, ఖాళీగా ఉన్న ఎంఈఓ, జిల్లా ఉప విద్యాధికారుల పోస్టులు భర్తీ చేసి వారి ద్వారా పాఠశాలల పర్యవేక్షణ చేయాలన్నారు. పీఆర్సీ వెంటనే అమలు చేసి, ఐదు డీఏలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్, కార్యదర్శి దేవ ఋషి, జిల్లా నాయకులు జానికి రాములు, శివాజీ, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం బువ్వ!
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. మధ్యాహ్న భోజనం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉడికీ ఉడకని అన్నం, అరకొర కూర, నీళ్లచారే అందిస్తుండటంతో విద్యార్థులు అర్ధాకలితోనే ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పచ్చిపులుసుతో వడ్డిస్తుండటం చూసి సాక్షాత్తు కలెక్టర్ హెచ్చరించినా సంబంధిత అధికారుల తీరు మారకపోవడం గమనార్హం. బుధవారం సాక్షి పలు పాఠశాలలను సందర్శించగా విద్యార్థులకు మాడిన అన్నం, నీళ్ల చారుతోనే వడ్డిస్తుండటం కనిపించింది. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 80వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజూ 64వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రూ.6.78 కేటాయించగా, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.11.17 కేటాయించారు. దీనికి తోడు కోడి గుడ్డుకు రూ.6 అదనంగా అందిస్తున్నారు. బియ్యం ప్రభుత్వమే అందిస్తోంది. కూరగాయలు, ఇతర వంట సరుకులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీసుకువచ్చి భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే విద్యాశాఖ ఇచ్చిన మోనూ ప్రకారం కూరలు, వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆహారం రుచిగా, శుచిగా ఉండటం లేదని, సగం కడుపే నిండుతోందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో 1,933 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ అధికారులు రోజూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ.. సక్రమంగా అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంలేదని, ప్రధానోపాధ్యాయులు అసలే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులు, ఎంఈఓలు, కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తీరును కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించగా పచ్చి పులుసుతో వడ్డిస్తుండటం.. మోనూ పాటించకపోవడాన్ని గుర్తించారు. దీంతో నంగునూరు మండలం బద్దిపడగ ప్రధానోపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. అలాగే తోర్నాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. గతంలో ఇర్కోడ్ పాఠశాలలో ఇదే దుస్థితి. సాక్షాత్తు కలెక్టర్ ఎదుటనే మధ్యాహ్న భోజనం అమలు ఈ విధంగా ఉంటే, మిగతా సమయాలలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు. మధ్యాహ్న భోజనం నాసిరకం కానరాని మెనూ.. అందని పౌష్టికాహారం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి సాక్షాత్తు కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు సగం గంటెడే కూర మధ్యాహ్న భోజనంలో సగం గంటెడే కూర వేస్తారు. మళ్లీ వేయరు, మిగతా అన్నం చారుతోనే సరిపెట్టుకోవాలి. మోనూ ప్రకారం పాటించడంలేదు. కలెక్టర్, అధికారులు వస్తున్నారని తెలిస్తేనే కూరలు అందిస్తారు. మిగతా రోజుల్లో సగం కడుపుకే తినాల్సి వస్తోంది. –పేరు చెప్పడానికి ఇష్టపడని, ఓ విద్యార్థి ఆవేదన -
ప్రజాస్వామ్యం అపహాస్యం
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం కావాలి ● ఓట్ల గల్లంతుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్లో ఓట్ చోరీపై భారీ ర్యాలీ హుస్నాబాద్: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగిస్తూ, ఓట్ల చోరీకి పాల్పడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్లో బుధవారం ఓట్ చోరీపై భారీ ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓట్ చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఉంచారన్నారు. నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను నమోదు చేయించుకొని ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందన్నారు. చంఢీగఢ్లో పని చేసే హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పురన్ కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇంత వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదన్నారు. ఆయన భార్య మృత దేహంతో ధర్నా చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారన్నారు. ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తాం.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే కుట్రకు పాల్పడుతున్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీశ్రావులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. విద్యార్థి మృతి దురదృష్టకరం హుస్నాబాద్రూరల్: మండల పరిధి పోతారం (ఎస్)లోని గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థి వివేక్ మృతిగల కారణలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆడుతున్న సమయంలో పడిపోయి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మరేదైన కారణలు ఉంటే పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. విద్యార్థి మృతిని రాజకీయం చేయవద్దని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం అందించి బాసటగా ఉంటుందన్నారు. నిత్యం గురుకులాలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు.హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతి రౌటేలా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలందరూ ఓట్ చోరీపై సంతకాల సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. -
లింగనిర్ధారణ చేపడితే చర్యలు
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అడ్వైజరీ కమిటీ సమావేశంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చట్టవిరుద్దంగా అబార్షన్లు చేపడితే చర్యలు చేపడతామన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు డీ ఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ, డాక్టర్ రమ్య మాధురి, డీపీఆర్ఓ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి
సీపీ విజయ్కుమార్ సిద్దిపేటకమాన్: బాణా సంచా విక్రయాలకు అను మతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకునే యజమానులు సంబంధిత ఏసీపీల అనుమతులు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాణాసంచా దుకాణాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 67100కు ఫోన్ చేయాలని తెలిపారు. దుబ్బాక: పట్టణంలోని జెడ్పీజీహెచ్ఎస్ జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు బి.రజిత రాష్ట్ర ఉత్తమ మెంటర్ –2025 పురస్కారం అందుకున్నారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన మనక్ మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నుంచి రజిత పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా రజితను పాఠశాల హెచ్ఎం భూపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో రామవరంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డు ఎత్తుగా.. ఇళ్లు దిగువకు ఉండటంతో వర్షపు నీరు చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. త్వరగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. సిద్దిపేటకమాన్: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సీపీ విజయ్కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21నుంచి 24వరకు పోలీస్స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నివారణలో పోలీసులు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీ ఉంటుందన్నారు. ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు అభ్యర్థులకు సీపీ కార్యాలయంలో బహుమతుల ప్రదానం చేసి, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. -
టూరిజం ప్రదేశంగా మల్లన్న వనం
కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో మల్లన్న వనం టూరిజం ప్రదేశంగా మారనుందని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ అన్నారు. మల్లన్న సాగర్కు ఆనుకొని కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ శివారులో మల్లన్న వనంలో నిర్మిస్తున్న ముఖ్య అధికారుల, సిబ్బంది గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించేలా.. పనుల్లో పాదర్శకతలు లోపించకుండా పనులు చేపట్టాలన్నారు. మల్లన్న వనం విసీ్త్రర్ణం రూట్ మ్యాప్ను పరిశీలిస్తూ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ మల్లన్న వనం విస్తీర్ణం 4,794 హెక్టార్లకు గాను సుమారు 1,324 హెక్టార్ల భూమి మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి వెళ్లగా మిగతా 3400 హెక్టార్ల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. వనంలో అన్ని రకాల ఔషధ, పండ్ల, ఇతరత్రా మొక్కలు పెంచాలన్నారు. వనంలో వన్య ప్రాణుల రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీనివాస్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఇక్రమొద్దిన్, ఫారెస్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ -
అవినీటి అధికారులపై వేటు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీటి పారుదల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకు పోయి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు మూకుమ్మడి బదిలీలు జరగనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ అధికారులకు ఏమాత్రం తీసిపోని స్థాయిల్లో జిల్లాలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇలాంటి అధికారులపై దృష్టిసారించిన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మూడేళ్లకోసారి బదిలీ ఎక్కడ? నిబంధనల ప్రకారం ప్రతీ మూడేళ్లకొకసారి బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేతల పంచన చేరుతున్న కొందరు అధికారులు ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకేచోట కదలకుండా ఉన్నారంటే ఈ అధికారులు ఏ స్థాయిలో అక్రమార్జన కూడగట్టారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈశాఖలో ఒక చీఫ్ ఇంజనీర్, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 24 డీఈ పోస్టులున్నాయి. అలాగే సుమారు 80కిపైగా ఏఈలు, ఏఈఈలు పనిచేస్తున్నారు. ఖాళీలు పోగా సుమారు 120మందికి పైడా ఇంజనీరింగ్, టెక్నికల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొందరు దశాబ్ద కాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులున్నారంటే ఏ స్థాయిలో వీరి ఆగడాలు సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి కోసమే ప్రత్యేక బదిలీలురాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఇంజనీరింగ్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదుగురు డీఈలకు, 11 మంది ఏఈఈలకు స్థాన చలనం కలిగింది. అయితే ఈ బదిలీలతో సంబంధం లేకుండా సంగారెడ్డి జిల్లా కోసం ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వందల కోట్లు అక్రమార్జనకు మరిగిన ఈశాఖ అధికారులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఈ బదిలీల విషయం ముందే పసిగట్టిన ఈ అక్రమార్కులు మళ్లీ మంచి పోస్టింగ్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుండటం గమనార్హం.ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం చెరువుల ఆక్రమణదారులతో చెట్టపట్టాల్ వందల చెరువుల అన్యాక్రాంతానికి పరోక్ష సహకారం కోట్లలో అక్రమాస్తులు కూడగట్టిన ఇంజనీరింగ్ అధికారులు త్వరలో జారీ కానున్న బదిలీల ఉత్తర్వులు!సంగారెడ్డి ప్రాంతంలో సుమారు తొమ్మిదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఓ ఇంజనీరింగ్ ఉన్నతాధికారి చెరువుల కబ్జాదారులతో చేతులు కలిపారు. కంచే చేను మేసిన చందంగా చెరువులను కాపాడాల్సిన ఈ అధికారి వీటిని కబ్జా చేస్తూ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా వ్యవహరించారు. చెరువుల్లోంచి మట్టిని అక్రమ రవాణాదారుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. పైగా చెరువులను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చాలు.. పెద్ద మొత్తంలో దండుకోవడం, ఆక్రమణదారులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడంలో సదరు అధికారి ఆరితేరారు. రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడిన ఈ అధికారిపై ఇప్పుడు బదిలీ వేటు వేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.పటాన్చెరు ప్రాంతంలో సుమారు నాలుగున్నరేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న మరో ఇంజనీరింగ్ అధికారి చెరువుల కబ్జా రాయుళ్లతో చెట్టపట్టాలేసుకున్నాడు. సుమారు నాలుగు వందలకు పైగా చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర వాటర్బాడీలకు ఎన్ఓసీలు జారీ చేసి రూ.వందల కోట్లు వెనకేసుకున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. పైగా చెరువులను కబ్జా చేసే అక్రమణదారులతో చేతులు కలిపి పదుల సంఖ్యలో చెరువులు అన్యాక్రాంతం అయ్యేందుకు పరోక్షంగా సహకరించాడు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈ అధికారికి స్థానచలనం కల్పించాలని ఆశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
దుబ్బాక: పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తామని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి రౌటేలా అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్గాంధీ నేతృత్వంలో ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థ పనితీరును ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తున్నామన్నారు. సిద్దిపేట, మెదక్ డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం తనను కాంగ్రెస్ పెద్దలు నియమించారన్నారు. పూర్తిగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, ఆ తరువాతే డీసీసీ అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందన్నారు. ఇందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్రెడ్డి, పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక దేశంలో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకువస్తాం ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతిరౌటేలా దుబ్బాకలో కార్యకర్తల సమావేశం -
దేవాదుల కాలువలు పూర్తి చేయండి
మంత్రి ఉత్తమ్కు ఎమ్మెల్యే పల్లా వినతి కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాలువలను పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డి మంత్రి ఉత్తమ్ను కోరారు. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశానికి పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఎమ్మెల్యే మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయడానికి, సేకరించిన భూమికి నిధులు విడుదల చేసి కాలువ పనులు పునరుద్ధరించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. స్పందించిన మంత్రి.. తక్షణ చర్యలు తీసుకుని పనులు వెంటనే మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ సిబ్బందితో డీఎంహెచ్ఓ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నంగునూరు(సిద్దిపేట):విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అందించడంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం పద్మ మంగళవారం సస్పెండ్ అయ్యారు. బద్దిపడగ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం అందించకపోవడం, పాఠశాల పరిశుభ్రంగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఫోన్లో ఆదేశించడంతో ఈ మేరకు డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. చేర్యాల(సిద్దిపేట): గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ పోలోజు నర్సింహాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చేర్యాల, వర్గల్, కోహెడ, చిన్నకోడూరు, అల్వాల్, దుబ్బాక, హుస్నాబాద్, బాలికల పాఠశాలలు, ములుగు, జగదేవపూర్, గజ్వేల్, సిద్దిపేట రూరల్, రామక్కపేట, మిట్టపల్లి, తొగుట, బెజ్జంకిలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీజీసెట్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 16 లోపు చేర్యాల గురుకుల పాఠశాల, లేదా దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. -
అమ్మో..
నకిలీ లెక్చరర్లు!●జిల్లా వ్యాప్తంగా 20 మంది ●తప్పుడు పత్రాలతో కొలువులు ●ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ల గుర్తింపు ●ఇటీవల 172 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు పలువురు నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని ఇంటర్ విద్యా శాఖ గుర్తించింది. జిల్లాలో ఇరవై మంది లెక్చరర్లు ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీ పేరుతో ఉన్న ఫేక్ సర్టిఫికెట్లను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు పనిచేస్తున్న 3,800మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను 2023 మేలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా జిల్లా నుంచి 172 మంది ఉన్నారు. సాక్షి, సిద్దిపేట: రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అయిన లెక్చరర్లను పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. దీంతో లెక్చరర్లకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లను ఇంటర్మీడియెట్ విద్యాశాఖ పరిశీలన చేసింది. పలువురు ఇతర రాష్ట్రాల్లో ఆయా యూనివర్సిటీలలో సంబంధిత కోర్సులు లేకపోయినా ఆ కోర్సు చదివినట్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్గా ఉద్యోగం పొందిన వారిలో ఆందోళన మొదలైంది. దాదాపు 20 మంది ఫేక్ సర్టిఫికెట్లు జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పొందిన 172 మంది అధ్యాపకులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వరంగల్ ఆర్జేడీ ఇటీవల పరిశీలించారు. ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లతోపాటు బోనఫైడ్ పత్రాలనూ ఆయా యూనివర్సిటీలలో ఇంటర్ విద్యాశాఖ చెక్ చేయించింది. అందులో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దాదాపు 20 మంది చదివినట్లు సర్టిఫికెట్లను అందించారు. పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీలలో దూరవిద్య కేంద్రాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించారు. ఆ వర్సిటీకీ యూజీసీ గుర్తింపు ఉందా? ఆ కోర్సు ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు పదోతరగతి సర్టిఫికెట్లపై పుట్టిన తేదీలను మార్చారు. 14 ఏళ్ల పాటు వరుసగా సర్వీసులో ఉన్న వారిని క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకు విరుద్దంగా మధ్యలో సర్వీస్ బ్రేక్ అయిన వారిని సైతం హడావుడిగా క్రమబద్ధీకరించినట్లు తెలిసింది. ●నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అధ్యాపకులుగా క్రమబద్ధీకరణ పొందిన వారిలో గుబులు మొదలైంది. ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. వీరు ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు వివిధ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. డబ్బులు వెచ్చించి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పరిశీలన జరుగుతోంది లెక్చరర్లను ప్రొబేషనరీ పీరియడ్ నుంచి పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆర్జేడీ పరిశీలించారు. మన రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలలో చదివిన వారివి చెక్ చేశారు. ఇతర రాష్ట్రాల ప్రైవేటు యూనివర్సిటీలలో పలువురు చదివినట్లు సర్టిఫికెట్లు అందించారు. వాటిని పరిశీలించకుండా పక్కన పెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయలేదు. త్వరలో వాటిపై ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. – రవీందర్ రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ అధికారి, సిద్దిపేట -
సేంద్రియం సాగుతోనే ఆరోగ్యం
సిద్దిపేటరూరల్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా నూతన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ సాగు చేపట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం మండల పరిధిలోని తోర్నాలలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వంగడాలను, కొత్త పద్ధతులను పాటిస్తూ రసాయనాలు వాడకుండా సాగు చేపట్టాలన్నారు. యూరియా అధికమోతాదులో వాడడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్నామన్నారు. మేలురకమైన పద్ధతులతో సేంద్రియ సాగుచేపట్టి మంచి ఆహారాన్ని పొందాలన్నారు. తాను వ్యవసాయం చేశానని, అన్ని పంటలు పండించే ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉందన్నారు. అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులే మేలు రైతు వంగ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ, సాంకేతికత వినియోగం ద్వారానే రైతు ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, సేంద్రియ సాగుతో భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి సంతోష్ కుమార్, ఏడీఏ పద్మ, అసోసియేషన్ డీన్ ఏజీ కాలేజీ సిరిసిల్ల సునీత దేవి, శాస్త్రవేత్తలు పల్లవి, రమాదేవి, మోహన్, ఏఓ నరేశ్, ఏఈఓ గీతా, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కావొద్దు జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యుటేషన్, ఫీల్డ్ ఎంకై ్వరీ, పేరుమార్పు, రకం, విస్తీర్ణం మార్పు, నేషన్ఖాతా, పీఓబీ, సాదాబైనామా వంటి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సాగులో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి కలెక్టర్ హైమావతి తోర్నాల విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు -
చెరువులో స్తంభం ఎక్కి..
తెగిన కరెంటు తీగలు బిగించి.. వర్గల్(గజ్వేల్): జలాశయాల్లో కరెంటు తీగలు తెగిపడిన సందర్భాల్లో మరమ్మతు పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సాహసమే చేయాల్సివస్తున్నది. సోమవారం ఉదయం నెంటూరు 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని జబ్బాపూర్ 11కేవీ ఫీడర్ బ్రేక్డౌన్ అయింది. దీంతో లైన్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య, క్యాజువల్ లేబర్ సతీష్, మీటర్ రీడర్ ధర్మయ్యలు రంగంలోకి దిగారు. ఫీడర్ లైన్ వెంట తనిఖీలు నిర్వహించారు. మైలారం చింతల చెరువులో స్తంభాల మధ్య కరెంట్ తీగ(కండక్టర్) తెగిపోయినట్లు గుర్తించారు. నడుము లోతు నీటిలో 4, 5 గజాల కొత్త కండక్టర్ తీగను తీసుకొని స్తంభం వద్దకు చేరుకున్నారు. బైండింగ్ చేసి తీగను అతికి విద్యుత్ లైన్ను యథావిధిగా బిగించారు. గంటన్నర వ్యవధిలో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ‘వెల్డన్.. నెంటూర్ స్టాఫ్’ అంటూ అందరి ప్రశంసలు చూరగొన్నారు. సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిని పోలీసు కమిషనర్ విజయ్కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం న్యాయమూర్తి జయప్రసాద్ను కూడా కలిశారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి చర్చించుకున్నారు. -
ఉద్యానం.. కొత్త ఉత్సాహం
గజ్వేల్: ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈనెల 9న విడుదల చేసిన ‘ఉద్యాన పంటల ప్రణాళిక–2035’పై ఆశలు చిగురించాయి. కొంత కాలంగా ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహంపై స్తబ్ధత నెలకొన్న తరుణంలో తాజాగా ప్రభుత్వ ప్రకటనతో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ప్రభుత్వ సహకారం పెరిగితే ప్రత్యేకించి ఉద్యాన పంటలకు హబ్గా ఉన్న ఉమ్మడి జిల్లాలో సాగు మరింతగా విస్తరించనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యాన పంటల (కూరగాయలు, పండ్లు, పూలు)కు హబ్గా మారింది. 40కిపైగా మండలాల్లో భారీగా ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. పదిహేనేళ్ల కిందట కేవలం 10వేల ఎకరాలకే పరిమితమైన ఉద్యాన పంటలు ప్రస్తుతం 2.5లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం నిత్యం నుంచి వేలాది టన్నులు కూరగాయలు హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చైన్నె, బెంగళూరు, మహారాష్ట్రలోని, చంద్లాపూర్, కలకత్తా తదితర రాష్ట్రీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ సహకారం లేక .. ఉద్యాన పంటలకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడంతో రైతులను నిరాశకు గురిచేస్తున్నది. విత్తన సబ్సిడీ కనుమరుగవటం, పందిరి, ఫాల్హౌస్ పథకాలకు చేయూత లేకపోవడంతోపాటు సలహాలు, సూచనలు అందించేందుకు క్షేత్రస్థాయిలో తగినంతగా ఉద్యానశాఖ సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యూనివర్సిటీ కీలక సూచనలు.. ● ఉద్యాన ప్రణాళికలో ప్రభుత్వానికి హార్టికల్చర్ యూనివర్సిటీ కీలకమైన సూచనలు చేసింది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలేకాకుండా, రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు ఉపయెగపడే సూచనలు ఉన్నాయి. ● ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ములుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేసి మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో నిర్వహించేలా చూడాలని సూచనలు చేశారు. ● వంటిమామిడి లాంటి కూరగాయల మార్కెట్ యార్డుల్లో క్రయవిక్రయాలు సక్రమంగా జరిగేలా చూడాలని నిర్దేశించారు. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యాన పథకాలు, ఫుడ్ ప్రాసెసింగ్ నిధులు వినియోగించుకోవాలని నిర్ణయించారు. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదు. అందువల్ల పథకాల అమలు నిలిచిపోయింది. ఇక నుంచి మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసి రైతులకు పథకాలను చేరువ చేయాలని ప్రణాళికలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ● ఎంఐడీహెచ్(మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్), ఎన్హెచ్ఎం (నేషనల్ హార్టికల్చర్ మిషన్), హెచ్సీడీపీ (హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం)లను వాడుకోవాలని సూచించారు. ● ప్రతి ఎకరానికి పెట్టుబడి ఖర్చు తగ్గించి, ఉత్పాదకతను పెంచడంతోపాటు.. మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ● ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ యంత్రాల కోసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులకు సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని యూనివర్సిటీ సూచించింది. ఇవే కాకుండా మరెన్నో అంశాలను ప్రభుత్వానికి ప్రణాళికలో సిఫార్సు చేసింది. ఉద్యాన సాగును పెంచుదాం ఉద్యాన పంటల సాగును పెంచడమే లక్ష్యంగా ఉద్యాన ప్రణాళిక– 2035ని రూపొందించాం. ప్రభుత్వం ఈ ప్రణాళిక అమలుకు సుముఖంగా ఉంది. వచ్చే రోజుల్లో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు ప్రోత్సాహం పెరగనుంది. – రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రణాళిక–2035పై కోటి ఆశలు ఉద్యాన పంటల హబ్గా ఉమ్మడి మెదక్ జిల్లా సహకారం లేక రైతుల్లో నిరాశ ప్రభుత్వం చేయూతనిస్తే సాగు మరింత విస్తరణ -
దుబ్బాక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించండి
ఆర్టీసీ ఎండీకి ఎంపీ రఘునందన్ విజ్ఞప్తి దుబ్బాక: స్థానిక బస్డిపోను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఎంపీ మాధవనేని రఘునందన్రావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998లో 54 బస్లతో డిపో ప్రారంభించారని 134 మంది సిబ్బంది ప్రతిరోజు 14,014 కిలోమీటర్ల ప్రయాణంతో రూ.8 లక్షల దినసరి ఆదాయం సాధించిందన్నారు. నష్టాల సాకుతో 2006లో దుబ్బాక డిపోను మూసి వేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధుల నిరసనలతో వారం రోజుల్లోనే మళ్లీ పునః ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 35 బస్లతో రాష్ట్రంలో ఆదాయపరంగా ముందున్న డిపోలలో దుబ్బాక ఒకటన్నారు. డిపోకు డీఎంను నియమించి 60 బస్లను కేటాయించి పూర్తిస్థాయి డిపోగా మార్చాలని ఎండీకి విన్నవించారు. దుబ్బాక డిపో నుంచి నిజామాబాద్, శ్రీశైలం, కరీంగనర్, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర రూట్లలో కొత్త బస్లు ప్రారంభించాలని ఎండీ నాగిరెడ్డిని కోరినట్లు ఎంపీ తెలిపారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించాయి. సోమవారం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పూర్తి స్థాయిలో, మరిన్ని పాక్షికంగా బంద్ చేపట్టాయి. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి వర్గల్(గజ్వేల్): బీసీ బిల్లు అమలుపై అన్ని వర్గాలు కలిసిరావాలని, బిల్లు అడ్డుకునే రాజకీయ శక్తులకు తగిన బుద్ధి చెబుతామని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. సోమవారం వర్గల్ మండలం గౌరారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ అంశంపై అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించి, అందుకు కట్టుబడాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని, బీసీ బిడ్డ బండి సంజయ్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం శుభ పరిణామమన్నారు. సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. పార్టీలన్నీ చౌకబారు విమర్శలుమానుకుని కలిసిరావాలని సూచించారు. చేర్యాల(సిద్దిపేట): హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో హమాలీ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం రేపాక కుమార్ అధ్యక్షతన పట్టణంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాలస్వామి మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించడంలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పని చేస్తున్న హమాలీలకు లారీ ఓనర్లు ఇచ్చే తాడుకట్టే వేతనం పెంచాలని సూచించారు. వారికి ప్రమాద బీమా, పని భద్రత, కనీసవేతనం, 55 ఏళ్లు దాటిన వారికి పింఛన్ సదుపాయాలను కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ మావో, హమాలీ కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి జాప్యం లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 114 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రావొద్దు కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. సోమవారం మండలంలోని శనిగరం గ్రామంలోని ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనుగోలు కేంద్రానికి వచ్చిన ధ్యానాన్ని వెంట వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు. తేమ శాతం రాగానే బస్తాలను అందించాలని అన్నారు. పరిశుభ్రతపై అవగాహన తప్పనిసరి కోహెడ(హుస్నాబాద్): పరిసరాల పరిశుభ్రతపై గ్రామాలలోని ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా కేసులపై ఆరా తీశారు. రోగులకు అన్నిరకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులకు అన్నిరకాల మందులు సరఫరా చేయాలని డీఎంఎచ్ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ కాచిచల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. -
సీజేఐపై దాడి దుర్మార్గం
సిద్దిపేటరూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మందకుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే భావించాలన్నారు. ఈ ఘటన దళిత, పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఇన్చార్జి యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో లాభాలు అధికం
మిరుదొడ్డి(దుబ్బాక): దీర్ఘకాలికంగా సాగు చేసే ఆయిల్పామ్ పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని ఆయిల్ఫెడ్ ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ రాములు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రైతు అంజిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్పామ్ సాగును సోమవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయిల్పామ్ గెలలను ఎలా హార్వెస్టింగ్ చేయాలి? నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్పామ్ గెలలు టన్నుకు రూ.19,400 ధర పలుకుతోందన్నారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్పామ్ తోటల్లో కోకో వంటి అంతర పంటలు సాగు చేస్తే అదనంగా రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎకరానికి నికరంగా ప్రతి సంవత్సరం 10 టన్నుల ఆయిల్పామ్ దిగుబడిని పొందవచ్చని తెలిపారు. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో మర్కెటింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆయిల్పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, రైతులు వెంకట్రెడ్డి, రామస్వామి, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నంగునూరు(సిద్దిపేట): నాణ్యమైన సరుకులతో మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం బద్దిపడగ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం పద్మ వంట సరుకులు, కూరలను పరిశీలించడంలేదని, స్లాబ్ నుంచి నీరు కారుతున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్లో ఆదేశించారు. పాఠశాలలో రోజు అందించే మెనూ వివరాలను అడిగి తెలుసుకొని విద్యార్థులతో కలసి అక్కడే భోజనం చేశారు. క్రమశిక్షణ, చక్కని అలవాట్లు అలవర్చుకొని, ఒక లక్ష్యంతో చదివి ప్రయోజకులు కావాలని విద్యార్థులకు సూచించారు. -
ఎవరి చేతికో పగ్గాలు!
● ఆశావహుల నుంచి అధిష్టానం దరఖాస్తుల స్వీకరణ ● ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు ● జిల్లా పరిశీలకురాలిగా ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా ● నేటి నుంచి బ్లాక్ల వారీగా సమావేశాలు కాంగ్రెస్లో పదవుల పండుగ మొదలైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)అధ్యక్షులను నియమించి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుని ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ పదవికి డిమాండ్ పెరిగింది. పదవిని ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. –సాక్షి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదీశ్వర్ రావు, నజీర్ హుస్సేన్లను నియమించారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పరిశీలకుల బృందం సమావేశాలు నిర్వహించనుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, మండల అధ్యక్షులతో సమావేశమై అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవికి అర్హతలు ఉన్న నేతల పేరును పీసీసీ ద్వారా ఏఐసీసీకి పంపించనున్నారు. నేటి నుంచి సమావేశాలు డీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం పరిశీలకులు నియోజకర్గాలు, బ్లాక్ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం దుబ్బాక బ్లాక్కు సంబంధించి దుబ్బాక పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్, మధ్యాహ్నం దౌల్తాబాద్ బ్లాక్ తొగుటలోని చెరుకు బాలమ్మ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 15న హుస్నాబాద్ పట్టణం, 16న సిద్దిపేట బ్లాక్ ఇర్కోడ్లోని లావణ్య గార్డెన్, మధ్యాహ్నం నంగునూరులో, 17న ఉదయం వర్గల్ మండలం శాకారం, మధ్యాహ్నం గజ్వేల్ పట్టణంలో సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ సైతం తీసుకుంది. తనకే మరోమారు డీసీసీ పదవి ఇవ్వాలని నర్సారెడ్డి కోరుతున్నట్లు సమాచారం. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ కూడా డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో వివిధ పదవులను హరికృష్ణ నిర్వర్తించారు. పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో దరిపల్లి చంద్రం పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ, కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న తనకు డీసీసీ అధ్యక్ష పదవినీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎన్ఆర్ఐ గాడిపెల్లి రఘువర్ధన్ రెడ్డి సైతం డీసీసీ అద్యక్ష పదవి రేస్లో ఉన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్లో వివిధ పదవులతో పాటు గాడిపెల్లి ట్రస్ట్ పేరుతో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి కోరారు. జెడ్పీ మాజీ ఫ్లోర్లీడర్ గిరి కొండల్రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకైక కాంగ్రెస్ జెడ్పీటీసీగా మద్దూరు నుంచి గెలుపొందారు. గజ్వేల్కు చెందిన పార్టీ నాయకుడు బండారు శ్రీకాంత్, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం మెప్పుపొంది అధ్యక్ష పీఠంపై ఆసీనులయ్యేందుకు ఎవరికి వారు మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడి పదవి ఎవరిని వరిస్తుందో అని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది. -
93 షాపులు..
95 దరఖాస్తులుసిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సిద్దిపేట ఎకై ్స జ్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ నెల 23వ తేదీన పట్టణంలోని సీసీ గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా వైన్ షాప్లను కేటా యించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా ఇప్పటి వరకు 95 దరఖాస్తులే రావడంతో ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడ్డారు. ఆసక్తి చూపడం లేదు.. జిల్లాలోని 93 వైన్ షాప్లకు ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సిద్దిపేట సర్కిల్లో 31, గజ్వేల్ సర్కిల్లో 29, హుస్నాబాద్ సర్కిల్లో 17, చేర్యాల సర్కిల్లో 17, మిరుదొడ్డి సర్కిల్లో ఒక దరఖాస్తు చొప్పున వచ్చాయి. దరఖాస్తు డిపాజిట్ రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావాహులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏ షాప్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఏ దుకాణానికి టెండర్ వేయాలని అందరూ కలిసి సమాలోచనలు చేస్తున్నారు. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్లకు 4,166 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18వ తేదీ చివరి తేదీ కావడంతో ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో? ఎలా పెంచాలో అని ఎకై ్సజ్ అధికారులు సమాలోచన చేస్తున్నారు. చివరి మూడు రోజులే కీలకం చివరి మూడు రోజుల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపార పెద్దలను సంప్రదించి దరఖాస్తులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. 17 రోజులైనా మందకొడిగా ప్రక్రియ గతేడాది 4,166 దరఖాస్తులు డిపాజిట్ రూ.3లక్షలకుపెంచడంతో అనాసక్తి చివరి మూడు రోజులే కీలకమంటున్న అధికారులు గతేడాది కంటే ఎక్కువ వస్తాయి.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు దారులు ఆలోచనలో పడ్డారు. కానీ ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే రావడంతో ఇప్పుడు దరఖాస్తులు పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు 95 దరఖాస్తులు వచ్చాయి. గత మద్యం పాలసీలో 4,166 దరఖాస్తులు వచ్చాయి. అప్పటి లాగానే ఈ సారి కూడా చివరి మూడు రోజుల్లోనే అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నాం. –శ్రీనివాసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
కౌలు.. కన్నీళ్లు..!
జగదేవ్పూర్(గజ్వేల్): ఎలాంటి జీవనధారం లేని వారు వ్యవసాయంపై మక్కువతో కౌలు రైతులుగా మారుతున్నారు. గ్రామంలోనే వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి కౌలు రైతులకు కన్నీళ్లు, అప్పులు తప్ప ఏమి మిగిలే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ఈ యేడు కౌలు రైతులకు కౌలు..కష్టం..పెట్టుబడి..కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది. జిల్లాలో ఖరీఫ్లో ఈ సారి ఐదు లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలను సాగు చేశారు. వరి అత్యధికంగా 3.40 లక్షల ఎకరాలు, పత్తి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కూరగాయలు 28 వేల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో సుమారు 50 వేలకు పైగా ఎకరాల్లో పంటలు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఎక్కువ శాతం గజ్వేల్ నియోజకవర్గంలోని నల్లరేగడి భూములు ఉండటం వల్ల ఇక్కడి రైతులు పత్తి పంటను సాగు చేశారు. గజ్వేల్, జగదేవ్పూర్లో మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. జగదేవ్పూర్ మండలంలోని 14,200 ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో వరి, 220 ఎకరాల్లో మొక్కజొన్న, మూడు వందల ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేశారు. కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం పంటలను చూస్తుంటే కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. జిల్లాలో 3 లక్షలకు పైగా రైతులు ఉంటే కౌలు రైతులు 50 వేల వరకు ఉన్నారు. భూముల రకాలను బట్టి ఎకరానికి కౌలు రూ.8 వేల నుంచి 15 వేలు చెల్లిస్తున్నారు. అకాల వర్షాలతో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఎకరానికి కనీసం ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేటట్లు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర నెలలో కొంత భాగానే ఉన్నప్పటికి నల్లరేగడి భూముల్లో పంటలు పూర్తిగా నష్టం జరిగిందని కౌలు రైతులు చెబుతున్నారు. ఎకరం భూమిపై సుమారు 15 వేల నుంచి 30 వేల నష్టం జరుగుతుందని చెబుతున్నారు. పత్తి ఏరడానికి కూలీలకు రోజుకు రూ.350 నుంచి 400 వరకు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అయినా కూలీల కొరత తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆగం చేసిన అకాల వర్షాలు అప్పులు తప్ప మిగిలిందేమీ లేదు కౌలు రైతుల అష్టకష్టాలు ఆదుకోవాలని సర్కార్కు వినతి పెట్టుబడి వచ్చేటట్లు లేదుసొంత భూమి ఏమి లేకపోవడంతో కౌలు రైతుగానే జీవనం సాగిస్తున్నా. గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని ఖరీఫ్లో పత్తి పంటను సాగు చేసిన. అకాల వర్షాలు కురవడం, సరైన సమయంలో యూరియా దొరక్కపోవడంతో పంట ఎదగలేదు. దీంతో పాటు పంట అంత ఎర్రబడి కాయ నల్లబడింది. మొత్తం పెట్టుబడి రెండు లక్షలకు పైగా అయింది. ప్రస్తుతం పంటలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. –అశోక్, రైతు, తిగుల్ -
భక్తజన నాచగిరి
పట్నాలు వేసి.. మొక్కులు చెల్లించిమల్లన్న ఆలయంలో భక్తుల కోలాహ లంగంగిరేణి చెట్టు ప్రాంగణంలో భక్తుల సందడివర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయ పుష్కరిణి, హరిద్రానది వాగులో పుణ్యస్నానాలాచరించారు. గర్భగుడిలో సర్వాలంకృతులై కొలువుదీరిన శ్రీలక్ష్మీనృసింహుల దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులను దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందికలగకుండా పర్యవేక్షించారు. కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆల యం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. శనివారం సాయంత్రం నుంచి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్లు పర్యవేక్షించారు. -
హుస్నాబాద్లో ట్రామా!
● అన్నీ ఎమర్జెన్సీ కేసులు ఇక్కడే.. ● సత్వర వైద్య సేవలు.. ప్రజల ప్రాణాలకు భరోసా హుస్నాబాద్: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు తక్షణమే వైద్య సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే మొదటి విడతలో 30 ట్రామా కేర్ సెంటర్లు మంజూరు చేయగా, రెండో విడత లిస్టులో హుస్నాబాద్ పేరును చేర్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అత్యవసర కేసులను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయకుండా ఎంత క్లిష్టమైన కేసులనైనా ఈ సెంటర్లోనే శస్త్ర చికిత్సలు అందిస్తారు. ఆర్ధోపెడిక్, అనస్తీషియా ఇతర వైద్య నిపుణులు, సిబ్బంది, అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుంది. -
ఆర్యవైశ్య సేవలు అమోఘం
● అని రంగాల్లో ముందంజ ● ఎమ్మెల్యే హరీశ్రావు ● విశిష్ట సేవలందించినవారికి అవార్డుల ప్రదానం ప్రశాంత్నగర్(ిసిద్దిపేట): ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాలు అమోఘమని ఎమ్మెల్యే హరీఽశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని వైశ్య భవన్లో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శోభశ్రీ ప్రాంతీయ సదస్సులో భాగంగా వివిధ సేవల్లో ఎంపికై న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి, వనిత, ఇలా సంస్థ పేరు ఏదైనా సామాజిక సేవే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో గో సేవలు, పేదల వివాహాలకు పుస్తెమట్టెలు, వంట సామగ్రి, దుస్తుల పంపిణీ, తదితర కార్యక్రమాలు గొప్పవన్నారు. మహిళ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, రక్తదాన శిబిరాలు, ఉచిత అన్నదాన సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు గతంలో కేవలం వ్యాపార రంగంపైనే దృష్టి సారించేవారని, నేడు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలల్లోను కీలకంగా మారారన్నారు. అమర్నాథ్, కేదారినాథ్, అయోధ్య ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించిన చరిత్ర మన సిద్దిపేట ఆర్యవైశ్యులకు ఉందని కితాబిచ్చారు. సమయాన్ని కుటుంబానికి, వ్యాపారానికి, సేవా కార్యక్రమాలకు మాత్రమే కేటాయించడం గొప్ప విషయమన్నారు. అందుకే పది మంది మిత్రులు ఉంటే అందులో ఒక ఆర్యవైశ్యుడు ఉండాలనేది మన పెద్దల మాట అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లురి శశాంక్, మాంకాల నవీన్కుమార్, నాగరాణి, పుల్లురి శివకుమార్, గంప శ్రీనివాస్, గంప కృష్ణ, పుల్లురి శ్రీనివాస్, సోమ శివకుమార్, వనజ, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
ములుగు ఉద్యానవర్సిటీవైస్ చాన్సలర్ రాజిరెడ్డి ములుగు(గజ్వేల్): రైతులు అవకాడో, కూరగాయల లాంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించి అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ రాజిరెడ్డి సూచించారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ధన్–ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా విశ్వవిద్యాలయంలో రైతులు, అధికారులు, విద్యార్థులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యాన పంటల ఉత్పత్తి ఇప్పటికే 350 మిలియన్ టన్నులకు చేరిందని ఇది సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువని రైతులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలపై అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లాభాల దిశలో ముందుకు వెళ్లాలని వివరించారు. అనంతరం రైతులు ఉద్యాన శాస్త్రవేత్తలతో వివిధ అంశాలపై చర్చించారు. కరివేపాకు, మునగ వంటి ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ అధికారులు సురేష్కుమార్, సిందుజ, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ
దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పత్తికి మద్దతు ఏదీ?
అతివృష్టి కారణంగా తీవ్ర పంట నష్టానికి గురై పీకల్లోతూ కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కడం లేదు. అవసరాలకు పత్తిని అమ్ముకుందామని వస్తే.. వ్యాపారులు తేమ పేరుతో క్వింటాలుకు రూ.5500మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు ఇది రూ.2610 తక్కువ. సీసీఐ కేంద్రాలు తెరవకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. – గజ్వేల్జిల్లాలో పత్తి ఉత్పత్తులు.. మార్కెట్ బాట పట్టడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురై ఇబ్బందుల్లో రైతులకు మద్దతు ధర దక్కకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది పత్తికి మద్దతు ధర రూ.7,521 ఉండగా, ఈసారి పింజ పెద్దగా ఉండే పత్తికి గరిష్టంగా రూ.8,110 మద్దతు ధరను ప్రకటించారు. జిల్లాలో 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా, 12లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నది. కానీ కొందరు తమ అవసరాల కోసం కొదిపాటి పత్తి ఉత్పత్తులను జిన్నింగ్ మిల్లుల్లో అమ్ముకోవడానికి వస్తున్నారు. కానీ పత్తి క్వింటాలుకు రూ.5,500కు మించి ధర పలకడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఇతర కారణాలను సాకుగా చూపి అంతకుమించిన ధర చెల్లించడం లేదు. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్లే ఈ దుస్థితి. సీసీఐ నిబంధనలతో.. సీసీఐ కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోగా, ఒకవేళ ఏర్పాటుచేసినా కూడా సవాలక్ష నిబంధనలు పెడుతోంది. సిద్దిపేట, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, కొండపాక, బెజ్జంకి, హస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మార్కెట్ కమిటీల పరిధిలో 23సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో ఈ కేంద్రాలకు ఇతర జిల్లాలకు చెందిన రైతులు సైతం వచ్చి పత్తిని అమ్ముకునే వారు. కానీ ఈసారి ఉమ్మడి జిల్లాలోని రైతులు మాత్రమే ఆ జిల్లా పరిధిలోని కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవడానికి అర్హులని సీసీఐ నిబంధనలు విధించింది. ఉదాహరణకు మెదక్ జిల్లాలో 34751 ఎకరాల్లో సాగులోకి రాగా 3.48 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ జిల్లాలో ఒక్క సీసీఐ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ జిల్లాకు సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని సీసీఐ కేంద్రంలో మెదక్ రైతు పత్తిని విక్రయించుకునే వీలు లేదని చెబుతున్నారు. ఈ నిబంధన అమలు చేస్తే...లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.త్వరలోనే సీసీఐ కేంద్రాలు తెరుస్తాం సీసీఐ కేంద్రాలు త్వరలోనే తెరుస్తాం. జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సీసీఐ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. – నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారిరూ.5,500 ధరకే అమ్ముకున్నా.. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశా. వానలతో పంట దెబ్బతిన్నది. రెండ్రోజుల కిందట రెండు క్వింటాళ్ల పత్తి ఏరి గజ్వేల్లోని జిన్నింగ్ మిల్లులు అమ్ముకున్నా. రూ.5500మాత్రమే ధర చెల్లించారు. – బీడ చెన్ను, రైతు తిగుల్ -
బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే పుట్టగతులుండవ్
గజ్వేల్రూరల్: బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్న పార్టీలకు గుణపాఠం తప్పదని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42శాతం రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆరు నెలలవుతోందని, అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందినప్పటికీ గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంచడం విచారకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని పార్టీలకు పుట్టగతులుండవని, కోర్టులను అడ్డం పెట్టుకొని 42శాతం రిజర్వేషన్ను అడ్డుకుంటున్న పార్టీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లబిల్లులు చెల్లించండి సీపీఎం నేత శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆన్లైన్ లోపాలను సవరించి బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి తాడూరి రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 11 గ్రామాలలో 276 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు పనులు ప్రారంభించారని తెలిపారు. అందులో చాలా వరకు బేస్మెంట్ వరకు పనుల పూర్తి అయినా బిల్లులు చెల్లించడం లేదన్నారు. లబ్ధిదారులు అధికారులను అడిగితే ఆన్లైన్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసిన తర్వాతే చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. బిల్లులు సకాలంలో రాక లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. అధికారులు స్పందించి ఆన్లైన్ లోపాలను సవరించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి మల్లేశం, శారద, నీల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గురుకులాల అభివృద్ధికి కృషి హుస్నాబాద్రూరల్: గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, అధిక నిధులు కేటాయిస్తున్నదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి అన్నారు. శనివారం పోతారం(ఎస్)లోని గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ నెల 7న విద్యార్థి వివేక్ మరణించిన విషయంపై ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు కార్పొరేటు విద్యను అందించడానికే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుందన్నారు. నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్లపల్లిలో నిర్మించడానికి భూ సేకరణ చేసినట్లు చెప్పారు. గురుకులంలో విద్యార్థి మరణం అందరికీ బాధకలిగించదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు రోజుల్లో హుస్నాబాద్కు వచ్చి విద్యార్థి కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాజ్కుమార్, రాజు, మహేందర్లు ఉన్నారు. 95 మద్యం దరఖాస్తులు సిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 95దరఖాస్తులు వచ్చినట్లు ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 93మద్యం దుకాణాల నిర్వహణకు శనివారం 43 దరఖాస్తులు వచ్చినట్లు, మొత్తం 95దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. రెండోవ శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. -
సీజేఐపై దాడి హేయమైన చర్య
● ఘటనపై వెల్లువెత్తిన నిరసన ● గజ్వేల్లో దళిత, ప్రజా,ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ గజ్వేల్: సీజేఐ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. శనివారం దళిత, ప్రజా, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాంచంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, దళిత, ప్రజా సంఘాల నాయకులు పి.ఎల్లయ్య, రాజులు, అటకూరి రాములు, కిష్టయ్య, కృష్ణ, యాదగిరి, పొన్నాల కుమార్, తుమ్మ శ్రీనివాస్ దాసరి ఏగొండ స్వామి, సందెబోయిన ఎల్లయ్య, నీరుడి స్వామి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజేఐపై దాడి..దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నా.. ఆధిపత్య కులాల నుంచి అవమానాలు తప్పడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాడిని వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
అసలేం జరిగింది?
మెదక్జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విషయం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు. గిరిజన మహిళ హత్యాచారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం సంచలనం రేపిన కొల్చారం ఘటన -
ధాన్యం నిల్వకు చోటేది?
మిల్లుల్లో మూలుగుతున్న గత సీజన్ల నిల్వలుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) చేసేందుకు మిల్లుల్లో స్టోరేజీ కొరత వేధిస్తోంది. పెద్ద ఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎక్కడ? అన్నది పెద్ద సమస్యగా మారింది. సకాలంలో రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో గత యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుత కొనుగోళ్లపై పడే అవకాశం ఉంది. దీంతో అధికారులలో ఆందోళన మొదలైంది. 439 కోనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రస్తుత సీజన్లో 5.08లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే 130 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 132 రైస్ మిల్లులుండగా అందులో ఇప్పటి వరకు బ్యాంక్ గ్యారంటీలను మిల్లర్లు ప్రభుత్వానికి అందించలేదు. గత సీజన్ పూర్తి చేసిన మిల్లర్లవే కొనసాగనున్నాయి.పై ఫొటోలో కనిపిస్తున్న ధాన్యం బస్తాలు సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ సమీపంలోని ఓ రైస్ మిల్లులోనివి. గత సీజన్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులో స్థలం లేకపోవడంతో ఇలా ఆరుబయట పెట్టి టార్పాలిన్లు కప్పారు. ఇదే సమయంలో కొత్త ధాన్యం వస్తే నిల్వ ఎలా చేస్తారో తెలియని పరిస్థితి. ఇలా ఒక్క మిల్లు కాదు జిల్లాలో చాలా రైస్ మిల్లుల్లో ఇదే దుస్థితి. ఆరు బయటనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి.రైతులకు ఇబ్బందులు రానివ్వం వచ్చే నెల 12వ తేదీ వరకు ధాన్యంను సీఎంఆర్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సీఎంఆర్ చేస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ కానుంది. దీంతో ఆ స్థలాల్లో కొత్త ధాన్యం నిల్వ చేయవచ్చు. అలా కాని పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం
బీసీ కుల సంఘాల నాయకులుసిద్దిపేటకమాన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం అన్యాయమని బీసీ కుల సంఘాల నాయకులు అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న మాధవరెడ్డి దిష్టిబొమ్మను పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ కుల సంఘాల నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబాటు తనానికి గురవుతున్న బీసీలకు సముచిత వాటా దక్కుతుంటే అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుని పార్లమెంట్లో పెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నంగునూరు(సిద్దిపేట): బీసీ సంఘాల పిలుపు మేరకు నంగునూరు మండలంలో శుక్రవారం వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాంపూర్ క్రాస్రోడ్డు వద్ద హన్మకొండ రహదారిపై జేపీతండా వాసులు రాస్తారోకో నిర్వహించారు. నంగునూరులో బీసీ సంఘాల ఐఖ్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలో రిజర్వేషన్ వర్తింపజేయాలన్నారు.రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాంప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారాయన్నారు. రాష్ట్రంలో కులగణన గత ప్రభుత్వం చేయకపోవడం శోచనీయమన్నారు. నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా నిలువడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించామన్నారు. జీవో 9 తీసుకురాకముందే సర్వే పూర్తయ్యిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలే రిజర్వేషన్లకు అడ్డుగా నిలుస్తున్నాయని, ఆరోపించారు. ప్రతి విషయాన్ని బీసీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. సమయం రాగానే ద్రోహులకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే నేడు అడ్డంకిగా మారాయి టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం -
పిల్లలకు పచ్చిపులుసా?
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పచ్చిపులుసుతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండటంపై కలెక్టర్ హైమావతి భోజన నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని పందిల్ల స్టేజి దగ్గర ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలోనే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పచ్చి పులుసు, టమాటా పప్పు ఉండటంతో మండిపడ్డారు. పిల్లలకు నీళ్ల చారు ఇస్తే ఆరోగ్యం ఏంకావాలని ప్రశ్నించారు. కొత్త మెనూను ఎందుకు అమలు చేయడం లేదని హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికే మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, సాకులు చెప్పి తప్పించుకోవద్దని హెచ్చరించారు. పాఠశాల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సైతం కలెక్టర్ తనిఖీ చేసి పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని రుచి చూశారు. బాలింతలకు అందించే బాలమృతాన్ని పరిశీలించారు. పిల్లలకు రోజూ స్నాక్స్ అందించాలని అయాకు సూచించారు. వంద శాతం గ్రౌండింగ్ కావాలిహుస్నాబాద్: ఇందిరమ్మ ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతక ముందు పట్టణంలోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్కతుర్తి, సిద్దిపేట నేషనల్హైవే పనులు వేగం పెంచాలన్నారు. అంతకపేట నుంచి కొత్తకొండ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడి కేంద్రాల భవనాల కోసం స్ధల సేకరణ చేయాలన్నారు. ఇది పౌష్టికాహారమా? విద్యార్థుల ఆరోగ్యం పట్టదా.. ‘మధ్యాహ్న’ భోజన నిర్వాహకులపై కలెక్టర్ హైమావతి ఫైర్ పందిల్ల గ్రామంలో ఆకస్మిక తనిఖీ -
వామ్మో.. ఇవేం రోడ్లు
ప్రయాణం ప్రాణసంకటమే..చిత్రంలోని రోడ్లను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ దారులపై ప్రయాణం నరకమే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడపాల్సిన దుస్థితి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సిద్దిపేట నుంచి తొగుటకు వెళ్లే ప్రధాన రహదారి, అలాగే తడకపల్లి నుంచి తోగుట మధ్యలో పెద్ద పెద్దగుంతలు, కంకరతేలి ప్రమాదకరంగా మారాయి. మరోవైపు అక్కడక్కడా మూలమలుపులతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
అధునాతన మార్గం.. ఛిద్రం
ఇటీవల తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అధునాతన హంగులతో నిర్మించిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పలు చోట్ల ఛిద్రమై ప్రయాణికులకు నరకం చూపుతోంది. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకడంతో ఆ వరదంతా ప్రధాన రోడ్డుపైకి చేరి, రోజుల తరబడి రాకపోకలకు ఇబ్బంది కలిగిన విషయం తెల్సిందే. రూ.45కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు.. వరద ఉధృతికి ఇలా మారడం కలవరానికి గురిచేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. – గజ్వేల్ -
అజ్ఞాతం నుంచి జనంలోకి..
మద్దూరు(హుస్నాబాద్): ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. గ్రామానికి చెందిన కొంకటి లచ్చవ్వ ఓజయ్యల చిన్న కుమారుడు వెంకటయ్య మండల కేంద్రంలో పదో తరగతి వరకు చదువుకున్నారు.1990లో 19 ఏళ్ల వయస్సులో చేర్యాల పీపుల్స్వార్ దళ కమాండర్ బాలన్న ప్రోత్సాహంతో పీపుల్స్వార్లో చేరారు. వెంకటయ్య చేర్యాల దళంలో రమేశ్ అన్నగా, దళసభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహదేవ్పూర్ జిల్లా కమిటీ సభ్యుడిగా ఛతీస్గఢ్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. అక్కడే మవోయిస్టుగా పని చేస్తున్న మంజులను వివాహం చేసుకున్నారు. ఆమె గత సంవత్సరం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వారి కుటుంబ సభ్యులతో నగరంలో ఉంటున్నారు. వెంకటయ్యపై ప్రభుత్వం అప్పట్లో రూ.5లక్షల రివార్డు ప్రకటించింది. వెంకటయ్య తల్లిదండ్రులు, సోదరుడు మృతి చెందిన సమయంలోనూ గ్రామానికి రాలేదు. ప్రస్తుతానికి అతని కుటుంబ సభ్యులు ఎవరూ గ్రామంలో లేరు. చిన్న వయస్సులోనే గ్రామాన్ని విడిచి అడవిలోకి వెళ్లిన వెంకటయ్య 35 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుండడంతో ఆయన రాక కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.35 ఏళ్ల తర్వాత గ్రామానికి వస్తున్న వెంకటయ్య -
పాలన చేరువై.. ప్రగతి కరువై
జిల్లా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు సిద్దిపేట జిల్లాగా ఏర్పాటై నేటికీ తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ప్రగతిపై కోటి ఆశలతో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి విడిపోయి 23 మండలాలతో 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లా అవతరించింది. నాటి ఎన్నికల నినాదాలైన జిల్లా అవతరణ.. గోదావరి నీళ్లు.. రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చాయి. కలెక్టర్ గంట సమయంలో ఏ గ్రామానికై నా వెళ్లొచ్చు. స్వయంగా ప్రజలే జిల్లా కేంద్రానికి రావొచ్చు. చేరువలోనే పాలన ఉన్నా.. కానరాని ప్రగతే కలవరపెడుతోంది. పల్లెలు, పలు పట్ణణాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఇప్పుడైనా వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని మంత్రులను, పాలకులను ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ మండలాలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన చేర్యాల, మద్దూరు మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. తరువాత ధూళ్మిట్టను మండలంగా ప్రకటించారు. జిల్లాలో మొదట 298 గ్రామ పంచాయతీలు ఉంటే వాటిని 508కి పెంచారు. గతంలో ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలుండేవి. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. తర్వాత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అక్కన్నపేట, కుకునూరుపల్లి, అక్బర్పేట–భూంపల్లి మండలాలను ఏర్పాటు చేసుకుంటూవచ్చారు. అభివృద్ధి అంతంతే జిల్లా ఏర్పాటైన తొలి ఏడేళ్ల వరకు అభివృద్ధి పరుగులు పెట్టినా.. ఆ తరువాత కుంటుపడింది. అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయి. పలు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కోమటి చెరువు సుందరీకరణ, శిల్పారామం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రూ.100 కోట్లతో రంగనాయసాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి పనులు పిల్లర్లకే పరిమితం అయ్యాయి. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల వెనక్కి వెళ్లింది. జిల్లా కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ జంక్షన్లో మార్కెట్ పనులు ఆగిపోయాయి. సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు దాదాపు 90శాతం పూర్తి కాగా మరో 10శాతం పనులకు నిధులు లేని కారణంగా వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో వినియోగంలో లేదు. ఇప్పటికై నా జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేసి ప్రగతిని పరుగులు పెట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కోటి ఆశలతో పదో వసంతంలోకి జిల్లాలో 26 మండలాలు.. 508 పంచాయతీలు అభివృద్ధిపై మంత్రులు దృష్టిసారించాలని కోరుతున్న ప్రజలు -
ఉపాధి ఈకేవైసీలో జిల్లా రెండో స్థానం
అక్కన్నపేట(హుస్నాబాద్): ఉపాధి కూలీల ఈకేవైసీలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కూలీలకు ఈకేవైసీ నమోదు చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కూలీలు తమ ఆధార్కార్డులను జాబ్కార్డులతో ఈకేవైసీ చేసుకుంటేనే పని కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,24,300జాబ్కార్డు ఉండగా 2,09,506మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1,54,692మంది కూలీల ఈకేవైసీ పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా రెండోవ స్థానంలో నిలిచింది. 1,79,000కూలీల ఈకేవైసీతో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అక్కన్నపేట మండలంలో ఉపాధి హమీ కూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను యాప్లో అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు జోరుగా నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పని కల్పించడం ఇకనుంచి వీలుకాదని అధికారులు చెబుతున్నారు. అలాగే కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,54,692మంది కూలీలు యాప్లో జోరుగా ముఖ గుర్తింపు ప్రక్రియ కొత్త విధానంతో మరింత పారదర్శకతమండలాల్లో ఈకేవైసీ ఇలా.. జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందులో గజ్వేల్లో 82శాతం, మద్దురూలో 81, అక్కన్నపేటలో 79, భూంపల్లిలో 69, బెజ్జంకిలో 79, చేర్యాలలో 78, చిన్నకోండూర్లో 75, దూల్మిట్టలో 35శాతం ఈకేవైసీ పూర్తయింది. అలాగే దౌల్తాబాద్లో 67శాతం, దుబ్బకలో 71, హుస్నాబాద్లో 71, జగదేవపూర్లో 72, కోహెడలో 74, కొమురవెల్లిలో 79, కొండపాకలో 76, కుకునూరుపల్లిలో 43, మర్కూక్లో 67, మిరుదొడ్డిలో 76, ములుగులో 73, నంగునూర్లో 85, నారాయణపేటలో 72, రాయిపోల్లో 72, సిద్దిపేట రూరల్లో 66, సిద్దిపేట అర్బన్లో 76, తొగుటలో 78, వర్గల్లో 67శాతం చొప్పున కూలీల ఈకేవైసీలను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 74శాతం ఉపాధి హామీ కూలీల ఈకేవైసీలను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలేవీ?
గజ్వేల్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందించడంలేదని, ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్, టెలికామ్ బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్లు మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు. గతంతో పోలిస్తే ప్రసవాల సంఖ్య సైతం తగ్గిందన్నారు. పరిస్థితి మారకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోస్, నాయకులు రామచంద్రాచారి, నత్తి శివకుమార్, చెప్యాల వెంకటరెడ్డి, నరసింహ, సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమాయె.. గిట్లాయె!
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ సహా ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్, నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే సహచర నాయకులను ఒప్పించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను ఖరారు చేసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల ఆశావహులు కోర్టు తీర్పుతో అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు ఆయా స్థానాలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన రాజకీయ పార్టీలకు చుక్కెదురైంది. ఇదిలా ఉంటే జిల్లాలో తొలి విడతలో 15 జెడ్పీటీసీ స్థానాలు, 125 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే తొలిరోజు ఎంపీటీసీకి మూడు, జెడ్పీటీసీకి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. – సాక్షి, సిద్దిపేట స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తొలి విడతలో 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయా మండల పరిషత్తు కార్యాలయాల్లో నోటిఫికేషన్లను జారీ చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు సాగింది. తీరా సాయంత్రం ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నెం.9 పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచి ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను, ప్రతిపాదించే వారిని సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. టిక్కెట్ల రేసులో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. బరిలో నిలిచే అభ్యర్థులు డబ్బులు సైతం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులను సైతం పిలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలను రూపొందించుకున్నారు. తీరా కోర్టు స్టే ఇవ్వడంతో అయోమయానికి లోనయ్యారు. కోర్టులో రిజర్వేషన్ల కేసు విచారణ కొనసాగుతుండటంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. పలువురిలో చిగురిస్తున్న ఆశలు స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో కొత్త రిజర్వేషన్లు.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలించక పలువురు నిరాశ చెందారు. కోర్టు రిజర్వేషన్ల పై స్టే ఇవ్వడంతో జనరల్ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారవచ్చని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వార్డుల పెంపునకు ప్రతిపాదనలు
● కలెక్టర్ ద్వారా సీడీఎంఏకు పంపిన మున్సిపల్ అధికారులు ● త్వరలోనే కసరత్తు ప్రారంభమయ్యే అవకాశంగజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల పెంపునకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నందువల్ల కొత్తగా గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ అనివార్యమవుతోంది. ఇందులో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్తోపాటు రాష్ట్రంలోని ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ జరుగనుంది. ఇందుకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ద్వారా సీడీఎంఏ(కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)కు ప్రతిపాదనలు పంపారు. ఈ మున్సిపాలిటీలో ముట్రాజ్పల్లి, సంగాపూర్ల పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్అండ్ఆర్ కాలనీ) విలీనమైన సంగతి తెల్సిందే. ఈ కాలనీ పరిధిలో ప్రస్తుతం 11,601 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో 34,365మంది ఓటర్లు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 45,966కు చేరింది. జనాభా 75వేల పైచిలుకు చేరుకున్నది. మున్సిపాలిటీలో ప్రస్తుతం 20వార్డులు ఉండగా, డీలిమిటేషన్లో భాగంగా 1500మంది ఓటర్లకు ఒక వార్డు లెక్కేసినా.. వార్డుల సంఖ్య 30కి చేరుకోనుంది. ఓటర్ల సంఖ్య, జనాభా, వైశాల్యం, ఆదాయపరంగా చూస్తే మున్సిపాలిటీ గ్రేడ్ వన్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ వార్డుల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమేనని తెలిపారు. సీడీఎంఏ నుంచి ఆదేశాలు రాగానే ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. -
మక్కకు దిక్కేది?
జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి మక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా మక్కతో ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు లేఖ రాసి నెల రోజులు కావొస్తున్నా చడీచప్పుడు కానరావడంలేదు. సిద్దిపేట యార్డులో కొనుగోలు కేంద్రం జాడ లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు తక్కువ ధరతో నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. సిద్దిపేటజోన్: బతుకమ్మ, దసరా పండుగల ఖర్చుల నుంచి బయటపడేందుకు అన్నదాతలు ముందస్తుగా యార్డుకు పెద్ద ఎత్తున మక్కలు తరలించారు. జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున పంట సాగు అయింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 29 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయినట్లు సమాచారం. ఈ లెక్కన 6 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. రూ.300 తక్కువకు.. సిద్దిపేట మార్కెట్ యార్డులో విక్రయానికి మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయని, కొనుగోలు కేంద్ర ఏర్పాటు ఆవశ్యకత వివరిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గత నెల 16న రాసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు సిద్దిపేట యార్డులో ప్రయివేటు వ్యాపారులు నెల రోజులుగా మక్కలను కొనుగోలు చేస్తున్నారు. తేమ, పొల్లు, గింజ నాణ్యత తదితర కారణాలను సాకుగా చూపి తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేసేదిలేక కొందరు రైతులు ఉత్పత్తులను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. దీంతో రైతు ప్రతి క్వింటాల్కు రూ.350 నుంచి రూ 500 వరకు నష్టపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో ప్రయివేటు వ్యాపారులు 190మంది నుంచి సుమారు 4 వేల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు సమాచారం. తడిసిన మక్కలు సిద్దిపేట మార్కెట్ యార్డులో రోజులతరబడి ఎదురుచూస్తున్న రైతన్నను వరుణుడు కూడా కరుణించడంలేదు. ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో రైతు లబోదిబోమంటూ మళ్లీ ఆరబోసే ప్రయత్నాలు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ఎప్పుడు ప్రారంభిస్తారో.. ఈసారి ఐదు ఎకరాల్లో మక్క వేశాను. రెండు ట్రాక్టర్ల నిండా యార్డుకు తెచ్చాను. ఐదు రోజులుగా ఇక్కడే ఉన్నాం. సర్కారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వాళ్లు వచ్చి తక్కువకు అడుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. –మమత, ఎల్లారెడ్డిపేట) పది రోజులుగా పడిగాపులు పదహారు ఎకరాల్లో మక్క పంట వేశా. 12 ట్రాక్టర్లలో యార్డుకు పంట తెచ్చా. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 వస్తుందని ఇక్కడకు వస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ప్రయివేటు వ్యాపారులు రూ.2 వేలకే అడుగుతున్నారు. పది రోజులుగా ఇక్కడే ఉంటున్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలి. –రెడ్డి ఎల్లవ్వ, పెద్దకోడూర్ వర్షానికి తడిసిన మక్కలను ఆరబోస్తున్న రైతు జాడలేని కొనుగోలు కేంద్రాలు -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దుబ్బాక: విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ అన్నారు. గురువారం దుబ్బాకలో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, అధునాతనమైన యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాలన్ని అందిపుచ్చుకొని భవిష్యత్త్లో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలన్నారు. ఏటీసీతో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగి మంచి ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ కనకయ్య తదితరులు ఉన్నారు. -
ఏటీసీతో ఆర్థికంగా రాణించాలి
● కలెక్టర్ హైమావతి ● ఇర్కోడ్లో శిక్షణ సంస్థ సందర్శనసిద్దిపేటరూరల్: జీవితంలో ఆర్థికంగా రాణించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) చక్కని వేదిక అని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ శివారులో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రిన్సిపాల్ రామానుజ, ట్రైనింగ్ టీచర్స్తో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని కోర్సుల శిక్షణ సరైన పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి అందేలా చూడాలన్నారు. ఉదయం నేర్చుకున్నది సాయంత్రం మూల్యాంకనం చేయించాలన్నారు. ఏటీసీకి కావలసిన మౌలిక వసతులు, స్టాఫ్ గురించి అన్ని వివరాలను తనకు నివేదిక రూపంలో అందించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ట్రైనింగ్ క్లాస్లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. -
కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టుడే..
కొండపాక(గజ్వేల్): హామీలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేలా ప్రజలను సిద్ధం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మండలంలోని దుద్దెడకు చెందిన మాజీ ఎంపీపీ అనంతుల పద్మతో పాటు సుమారు 100 మంది గురువారం హరీశ్రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో అనంతుల పద్మ భర్త నరేందర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పనితీరు నచ్చక అనతి కాలంలోనే మళ్లీ అనుచరులతో యూటర్న్గా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పరిపాలనను గాలికొదిలేసి ప్రతీకార చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వివిధ రకాల పెన్షన్ల పెంపు మాట దేవుడెరుగు.. పాత వాటిలో కోత పెట్టిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనంతుల అశ్విణి, నాయకులు ర్యాగల్ల దుర్గయ్య, జైపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తిరుపతి, అంజయ్య, కోడెల ఐలయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం కోలాహలం.. సాయంత్రం నిర్మానుష్యం
మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ దాఖలు నేపథ్యంలో మిరుదొడ్డిలో గురువారం ఉదయం అభ్యర్థులతో కోలాహలం నెలకొంది. ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో నామినేషన్ కౌంటర్లు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందించడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అభ్యర్థులు, నాయకులతో ప్రభుత్వ కార్యాలయాలు, జీరాక్స్ సెంటర్లు కిటకిటలాడాయి. తీరా సాయంత్రం వేళ హైకోర్టు ఎన్నికలపై ఆరు వారాలు స్టే విధించడంతో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అవాక్కయ్యారు. చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. -
బిడ్డా.. పైలం
హుస్నాబాద్రూరల్: ‘బిడ్డా... పైలం భయపడకు. ఆదివారం బాపును పంపిస్తా’ ఇది హుస్నాబాద్ గురుకుల పాఠశాల గేటు ఎదుట బుధవారం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా ధైర్యం చెప్పారు. మంగళవారం 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం విదితమే. దీంతో తల్లిదండ్రులు పిల్లల బాగోగులు తెలుసుకొనేందుకు గురుకులానికి పరుగులు తీశారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట నుంచే పిల్లలతో మాట్లాడారు. బంగారు భవిష్యత్ ఉంటుందని.. గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువులో ముందుంటారని, పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందని భావించి గురుకులంలో సీట్లు పొందడానికి పోటీపడతారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు. ప్రమాద ఘటనలు కొన్ని.. పర్యవేక్షణ కరువు గురుకులంలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువులు చీకటి పడగానే ఇంటికి వెళ్తున్నారు. దీంతో రాత్రి వేళ విద్యార్థులను చూసే వారే కరువయ్యారు. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా ఉపాధ్యాయులు స్థానికంగా లేకపోయినా అధికారులు పట్టించుకోవంలేదు. విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాల్సిందే హుస్నాబాద్: సాక్షాత్తు మంత్రి పొన్నం ఇలాకాలోని గురుకులంలోనే విద్యార్థులకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. విద్యార్థి వివేక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీలు నాయక్, సుద్దాల చంద్రయ్య, తిరుపతిరెడ్డి, మల్లికార్జున్రెడ్డి తదితరులు ఉన్నారు. హుస్నాబాద్లోని గురుకుల పాఠశాల గేటు బయటి నుంచే పిల్లలతో మాట్లాడుతున్న తల్లిదండ్రులు కట్టుతప్పిన గురుకులాలు కేటీఆర్ ఆరాహుస్నాబాద్: గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థి ఏ తరగతి చదువుచున్నాడు, మృతికి గల కారణాలపై హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే గురుకుల పాఠశాల అధికారులు విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.10 వేలు అందజేశారు. -
పరిషత్ సంగ్రామం
పల్లెల్లో ఓట్ల పండుగ షురూ అయ్యింది. స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలో పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరగనున్నాయి. ఈ మేరకు గురువారం తొలి విడతలో జరిగే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. –సాక్షి, సిద్దిపేటజిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలలో జరగనున్నాయి. మొదటి విడతలో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీలు, రెండో విడతలో 11 జెడ్పీటీసీలు, 105 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించనున్నారు. మొదటి విడతకు సంబంధించి ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా, 13వతేదీ వరకు అప్పీల్కు అవకాశం, 14న అప్పీళ్ల పరిష్కారం, 15న నామినేషన్ల ఉపసంహరణ, మధ్యాహ్నం 3గంటలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలను నియమించి నామినేషన్ల స్వీకరణ, నిబంధనల గురించి శిక్షణ ఇచ్చారు. నేడే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న టెన్షన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహుల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టులో కేసు గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఏమి ప్రకటిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.ముహూర్తాలు చూస్తున్న అభ్యర్థులు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తాలను తెలుసుకుంటున్నారు. ఈ మూడు రోజుల్లో కలిసి వచ్చే రోజును తెలుసుకుని నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగం చేశాయి. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేపనిలో నిమగ్నమయ్యారు. -
పొదుపు చేస్తేనే జీవితం మలుపు: ఎమ్మెల్సీ
కొండపాక(గజ్వేల్): పొదుపును జీవన విధానంగా మార్చుకుంటేనే కుటుంబాలు బాగుపడుతాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. కొండపాక మండలంలోని మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఆవరణలో బుధవారం విధాత పొదుపు సంఘం 21వ వార్షిక మహాసభను నిర్వహించారు. ఈసందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మనిషి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తామన్నారు. సంఘం అధ్యక్షులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ 2003లో ప్రారంభమైన పొదుపు సంఘం నేడు రూ. 51లక్షలతో లావాదేవాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వంపై, బ్యాంకులపై ఆధారపడకుండా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నదే పొదుపు లక్ష్యమన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3.70లక్షల లాభం డబ్బులను తిరిగి సభ్యులకు బోనస్ రూపంలో అందించామన్నారు. సంఘంలోని ప్రతీ పైసా జమ, ఖర్చుల విషయమై ఆడిట్ ఉంటుందన్నారు. సంఘం సభ్యులు గడీల కుమార్ మృతి చెందడంతో కుటుంబానికి రూ. 41 వేలు, పిండి మల్లయ్య కుటుంబానికి రూ. 16 వేల పొదుపు, బోనస్ డబ్బులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్, సంఘం కోశాధికారి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు. -
వార్షిక పరీక్షలకు సిద్ధంకండి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, విద్యార్థులు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, కళాశాల పరిసరాలు, రికార్డులు, టీచింగ్ డైరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అధ్యాపకులు బోధించే ప్రతీ అంశాన్ని శ్రద్ధగా వినాలని, అర్థం కాకపోతే అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు అవశ్యం హుస్నాబాద్: కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి అన్నారు. అక్కన్నపేట మండలం కుందనవాని పల్లెలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఖేతీ రక్షక్ నెట్ హౌస్లో బుధవారం డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి వ్యవసాయ పంటల పరిరక్షణ ఏ విధంగా చేయవచ్చో అగ్రిదూత్ అనే యాప్ సహ వ్యవస్థాపకుడు శాశ్వత రాజ్ వివరించారు. పంటలకు వచ్చే తెగుళ్లు, తేమ శాతం, శీతోష్ణస్థితి పరిస్థితులు మొదలైనవి ఒక క్లిక్తో తెలుసుకోవచ్చని యాప్ వినియోగాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తస్లీమా, విస్తరణ అధికారి శ్రీలత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో టెన్త్ మార్కులు కీలకం డీఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో 10వ తరగతి పరీక్షల మార్కులే కీలకంగా మారనున్నాయని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కుకునూరుపల్లి హైస్కూల్లో టెన్త్ ప్రత్యేక తరగతుల నిర్వహణను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే మంచి ఫలితాలను సాధిస్తారన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. అంతకు ముందు టెన్త్లోని పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. ఇటీవల జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రాజ్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనులపండువగా బొడ్రాయి ప్రతిష్ఠామహోత్సవాలు దుబ్బాక: పట్టణంలో బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠామహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధాన వీధుల గుండా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విగ్రహాలకు మంగళహారతులతో స్వాగతం పలికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. -
సెటిల్మెంట్లు జాన్తానై..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ‘ప్రజా కేంద్రిత పోలీసింగ్ వ్యవస్థను పకడ్బందీగా కొనసాగించేందుకు టీం వర్క్తో ముందుకు సాగుతాం. ప్రజల భద్రతకు, రక్షణకు పెద్దపీట వేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. రౌడీలు, గుండాయిజం, సెటిల్మెంట్లు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం’ అని పోలీస్కమిషనర్ ఎస్ఎం విజయ్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. వివాహిత మహిళలపై వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. భరోసా, స్నేహిత సెంటర్లలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం కానీ కేసులను నమోదు చేస్తున్నాం. జిల్లాలో అనేక సమస్యలపై దృష్టి సారించి, ప్రజల రక్షణ, లా అండ్ ఆర్డర్కు అనుగుణంగా పని చేస్తాం. పేకాట, గంజాయి, అక్రమ ఇసుక రవాణ, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. సెటిల్మెంట్లకు తావులేదు.. భూ తగాదాలు, వివిధ గొడవల నేపథ్యంలో పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారు. అలాంటివి ఇక బంద్ చేయాలి. సెటిల్మెంట్లకు తావులేకుండా పోలీస్ అధికారులు కేసులు నమోదు చేయాలి. సాక్ష్యాలు సేకరించి చార్జీషీట్ ఫైల్ చేసి చట్టప్రకారం ముందుకు వెళ్లాలి. పోలీసులు పోలీసింగ్ చేయాలి. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవాలి. ఎవరూ పరిధి దాటొద్దు. సెటిల్మెంట్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి. జిల్లాలో ఇప్పటి వరకు 94 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రౌడీయిజం, గుండాయిజం చేసేవాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నంగునూరు మండలంలో రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ను తరిమికొడదాం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డ్రగ్స్కు అలవాటైతే పోలీసులకు సమాచారం అందించాలి. యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నట్లు, మత్తుకు బానిస అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. ‘డ్రగ్స్’పై నిఘా ముమ్మరం చేస్తాం. అందరం సమష్టి కృషితో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి. ఇసుక అక్రమ రావాణాపై దృష్టి ఇసుక, మట్టి రవాణా కోసం రెవెన్యూ, సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా రవాణ చేసే వారిని, సహకరించే వారిని ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. డీజేలకు అనుమతులు లేవు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దు ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహించవద్దు. అలాగే ఆన్లైన్ లోన్ యాప్ జోలికి వెళ్లవద్దు. సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ మోసానికి గురైతే 1930, సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఇది ఉచితంగా చేయాల్సిన పని. పోస్టుమార్టం కోసం బాదితుల నుంచి పోలీసులు, వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించేందుక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపా రు. బుధవారం సీపీ విజయ్కుమార్, అదనపు కలెక్టర్లతో కలిసి ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది విధులు తదితర అంశాలపై సబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సేవల్లో ముందుండాలి సిద్దిపేటరూరల్: వైద్య సేవల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉంచాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. డ్రైడే పాటించడంతోపాటు, శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లావైద్యాధికారి ధనరాజు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిగజ్వేల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్తోపాటు పలువురు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రూ.2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలతో గ్రామీణ సమాజంలో పరివర్తనకు నాందిపలుకుతున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా సాగిందన్నారు. బీఆర్ఎస్ చేసిన మోసాలను వివరిస్తూ ఢోకా కార్డుల పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్కలు తప్పనిసరిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు మండలస్థాయిలో సహాయక పరిశీలకులు అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం
కలెక్టర్ హైమావతిప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రపంచం ఉన్నంత వరకు వాల్మీకి చరిత్ర ఉంటుందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందన్నారు. ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం అన్నారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారన్నారు. ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు. -
విజయం.. భవ్యం
సాక్షి, సిద్దిపేట: ‘చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలన్నది లక్ష్యం.. 2024లో సివిల్స్లో క్వాలిఫై కాలేకపోయా.. అదే సమయంలో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. దీంతో దరఖాస్తు చేశా.. రోజుకు 10గంటలు పట్టుదలతో చదివి 9వ ర్యాంక్ సాధించా’ అని సిద్దిపేట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ కుడికాల భవ్య అన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకుని సిద్దిపేటకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం భవ్యను ‘సాక్షి’ పలకరించింది. సివిల్స్ కోసం హైదరాబాద్లో ఉదయం వేళ కోచింగ్కు, తర్వాత 10 గంటల పాటు చదివాను. అలా ఏడాదిన్నర పాటు ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ అనేది 50శాతమే ఉపయోగపడుతుంది. మిగతాది కోచింగ్ సెంటర్లో చెప్పిన అంశాలను ప్రిపేర్ కావాలి. గ్రూప్–1 నోటిపికేషన్ రాగానే మూడు నెలల పాటు రోజూ 10 గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. వారంలో ఆరు రోజులు ఒక సబ్జెక్ట్ చొప్పున చదివాను. నేను చదివిన దానిలో నుంచి ప్రశ్నలు తయారు చేసుకుని వాటిని జవాబులు రాయడం చేశాను. ఇలా చేయడంతో మనం ప్రిపేర్ అయిన దానికి ఎంత రాయగలుగుతున్నామో అర్థమవుతుంది. మాది వరంగల్ జిల్లా ఏకశిలానగర్. మా నాన్న పేరు కుడికాల వెంకటేశ్వర్లు. అమ్మ పేరు చాయా. మా అమ్మానాన్న, అక్క ప్రోత్సాహంతో గ్రూప్–1 సాధించాను. డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ పూర్తి అయ్యాక.. పూర్తి స్థాయిలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అవుతాను. ప్రతీ రికార్డు డిజిటలైజేషన్ ముఖ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు, పాలసీలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవాలి సివిల్స్ అయినా.. గ్రూప్స్, బ్యాంక్ పరీక్షలు ఏవైనా ఏ అంశాలు ఉంటాయో ముందుగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన బుక్స్ తెచ్చుకుని చదవాలి. అలాగే ఒక మెంటర్, గైడ్ను ఏర్పాటు చేసుకోవాలి. చదవడం పోటీ పరీక్షల్లో ఒక వంతు అయితే, దానిని రాయడం మరో ఎత్తు. అందుకోసం ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్మార్ట్గా వర్క్ చేయాలి. చాట్ జీపీటీ, ఏఐ ఇలా వాటిని ఉపయోగించి స్టడీస్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. కొంత మంది పరీక్షల్లో మంచి ర్యాంక్ రాకపోతే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వారు ఎమోషనల్గా పరీక్షను చూస్తారు. అలా చూడటం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కటే జీవితం కాదు. ఒక పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.పట్టుబట్టి.. ఉన్నత కొలువు కొట్టి -
పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే
● ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ ● మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం ● అడ్డుకున్న పోలీసులు హుస్నాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంజం వెంకట్స్వామి మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ చాలా సున్నితమైన, విశాలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. అలాంటి నాయకుడని పరుష పదజాలంతో ధూషించడం పొన్నం దూకుడు స్వభావానికి తార్కాణమని అన్నారు. -
రైల్వేలైన్ పనుల పరిశీలన
చిన్నకోడూర్(సిద్దిపేట): మండల పరిధిలోని గంగాపూర్ శివారులో రైల్వేలైన్ నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైల్వే లైన్ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో రైల్వే లైన్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. పనులను అడ్డుకోవడం సరైందికాదన్నారు. నష్ట పరిహార విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన బాధితులందరికీ తప్పనిసరిగా పరిహారం అందేలా చూస్తామంటూ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ సలీం, రైతులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
జ్వర సర్వేను నిర్వహించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటకమాన్: క్షేత్ర స్థాయిలో జ్వర సర్వేను నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నాసర్పూర అర్బన్ పీహెచ్సీ, అంబేడ్కర్ నగర్ యుపీహెచ్సీని డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ ● ఎన్నికల సిబ్బందికి చివరి విడత శిక్షణ సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు రిటర్నింగ్ అధికారుల బాధ్యత చాలా ముఖ్యమైనదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న చివరి విడత శిక్షణలో అధికారులు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కరదీపికను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను మొదలుకొని కౌంటింగ్ వరకు తప్పులు లేకుండా సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలన్నారు. నామినేషన్ల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో కలిపి ముగ్గురితో పాటు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్ బందోబస్తు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిబంధనలను తెలపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకీదేవి, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సిద్ధం కండి
బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్గజ్వేల్రూరల్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎన్వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గజ్వేల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థలలో పోటీచేసే ఆశావహులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రేణులంతా ఐక్యంగా కృషిచేయాలన్నారు. అధిష్టానం ఎవరిని సూచించినా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీజేఐపై దాడి హేయమైన చర్య
గజ్వేల్: సీజేఐపై దాడి చేయడం హేయమైన చర్య అని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం సాయంత్రం గజ్వేల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పొన్నాల కుమార్, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు పోశయ్య, భిక్షపతి పాల్గొన్నారు. వైన్షాపులకు 9 దరఖాస్తులు సిద్దిపేటకమాన్: జిల్లాలోని వైన్ షాప్ల నిర్వహణ (2025–27)కు ఇప్పటి వరకు తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు సోమవారం రోజే 8 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో హుస్నాబాద్ పరిధిలో 6, చేర్యాల పరిధిలో 1, సిద్దిపేట పరిధిలో 2 దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి గజ్వేల్రూరల్: ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. సమాచార హక్కుచట్టం వచ్చి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 5 నుంచి 12వరకు జరుగుతున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారం డీబీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఏటిగడ్డ కిష్టాపూర్)లో ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటాడన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల పనితీరులో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. అలాగే సులభంగా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల అవినీతిని అరికట్టేందుకు ముఖ్య సాధనమన్నారు. లిఖితపూర్వకంగా సమాచారాన్ని కోరుతూ పౌరులు అభ్యర్థన చేయాలని, సాధారణ సమాచారాన్ని 30రోజుల్లో, అత్యవసర సందర్భాల్లో 48గంటల్లోగా అందించాల్సి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరులు రాజునాయక్, కుమార్, మల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజ రుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి సోమవారం రూ.18,400 జరిమానా, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. గొర్రెలకు టీకాలు దుబ్బాకరూరల్: మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో కొన్ని రోజులుగా వింత వ్యాధి సోకి మూగజీవాలు మరణిస్తుండటంతో పశువైద్యాధికారులు వైద్యశిబిరం నిర్వహించారు. సోమవారం గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలే లక్ష్యం కావాలి
● నూతన సీపీ విజయ్కుమార్ ● బాధ్యతల స్వీకరణసిద్దిపేటకమాన్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలే లక్ష్యంగా సేవలు అందించాలని నూతన పోలీస్ కమిషనర్గా విజయ్కుమార్ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి, పోలీసు అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి టీం వర్క్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.వైద్యం వివరాలు నమోదు చేయండి కొండపాక(గజ్వేల్): రోజువారీ వైద్యం అందించే వివరాలను, మందుల స్టాక్ను రిజిస్టరులో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, పరీక్షల తీరును, మందుల స్టాక్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రాపిడ్ టెస్టులను తప్పనిసరిగా చేయాలన్నారు. టెస్టుల వివరాలను రిజిస్టరులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రహదారి వెంట ఉండే ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 108 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫోన్ ద్వారా సూచించారు. కార్యక్రమంలో వైద్యులు ఫర్విన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలి ప్రశాంత్ నగర్ (సిద్దిపేట): అమ్మవారి దయవల్ల అందరం క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్ని అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం రహదారులు తదితర అభివృద్ధి పనులన్నీ పడకేశాయని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలన్నీ విస్మరించారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మానవ అక్రమ రవాణాను అరికడదాంప్రశాంత్నగర్(సిద్దిపేట): మానవ అక్రమ రవా ణా నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ సెల్ కోఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరై న రమేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవా ణా.. అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ వారికి అవగా హనా కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సురేశ్కుమార్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలి రాజ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన సీపీసిద్దిపేటకమాన్: నూతన పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ సోమవారం కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. -
సంక్షేమ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం
జగదేవ్పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్లు పేదలందరికి అందిస్తామని, సంక్షేమ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో సోమవారం లబ్ధిదారులు కవిత, నర్సింలు దంపతులు గృహప్రవేశం చేశారు. నర్సారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. లింగారెడ్డిపల్లిలో 70 ఇళ్లు మంజూరు కాగా 23 ఇళ్ల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోనే మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. గజ్వేల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానికంపై ఫోకస్
అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఆశావహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. మరోవైపు ఆశావహులపై క్షేత్రస్థాయిలో సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్ పీఠాలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. –సాక్షి, సిద్దిపేట స్థానిక సంస్థల బరిలో దిగే అభ్యర్థుల ఎంపికలపై అధికార పార్టీ వేగం పెంచింది. ఇదివరకే మండలాల వారీగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఒక్కో జెడ్పీ స్థానం నుంచి మూడు పేర్లతో కూడిన జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యే, మంత్రి అందరూ కలిసి ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్కు అందజేశారు. రిజర్వేషన్కు అనుగుణంగా ఉపకులాలవారికి అవకాశం కల్పిస్తూ శాసన సభ నియోజకవర్గాలవారీగా జాబితాను రూపొందించారు. మరోవైపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానిపై క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తోంది. ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థులను పార్టీ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో ఇన్చార్జి మంత్రి వివేక్ చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఎంపికలో బీఆర్ఎస్ నిమగ్నం జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది. 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 23 స్థానాలకు గాను 22 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్కు దక్కింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా, ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీలను, ఎంపీపీ, ఎంపీటీసీలను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఎంపికలు పూర్తి చేయాలని పార్టీ నిర్దేశించడంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు. -
ఏడుపాయల జనసంద్రం
50 రోజులుగా జలదిగ్బంధంలో దుర్గమ్మఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 50 రోజులుగా ఏడుపాయల మంజీరా వరదల్లో చిక్కుకుంది. ఆదివారం వరదలు తగ్గడంతో సిబ్బంది ఆలయంలోకి వెళ్లారు. భారీ స్థాయిలో వచ్చిన వరదలతో ప్రసాదం షెడ్డు కొట్టుకుపోయింది. గర్భగుడిలోని గ్రిల్స్, రేకులు, జాలీ ధ్వంసం కాగా, మండపంలోని గ్రానైట్ బండలు, టైల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఆలయ ప్రాంగణం మొత్తం పాకురుతో నిండిపోయింది. – పాపన్నపేట(మెదక్) -
భక్తజన సందోహం మల్లన్న ప్రాంగణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్నాలు వేసి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామివారి నిత్యాన్నదానానికి కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామానికి చెందిన భక్తులు రాపల్లి మహేశ్ దివ్య దంపతులు ఆలయ ఈఓకు రూ. 1,00,116లు విరాళంగా అందించారు. ఆలయ ఈఓ వెంక టేశ్, ఏఈఓ శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహా దేవుని మల్లికార్జున్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పద్మశాలీ సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలీ సంఘం ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక పద్మశాలీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు టి.రాజు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 7 నుంచి 8వ తేది సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, 11న ఎలక్షన్ కమిటీ సమావేశం, అదే రోజు అభ్యర్థుల ప్రకటన, 13న డమ్మీ బ్యాలెట్ పత్రాల విడుదల, 19న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు గెలిచిన అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలీ సంఘం నాయకులు రాజారామ్, రాజేశం, గాడిపల్లి శ్రీనివాస్, అనూప్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులు అమానుషంఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గజ్వేల్: దళితులపై దాడులు సహించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. జగదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లిలో దాడికి గురై గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు మహిపాల్ను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడికి గల కారణాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. పాత కక్షలు, భూతగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దాడులకు తెగబడటం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోన్లో ఆదేశించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, దళిత ఉద్యోగుల వేదిక నాయకులు సత్యనారాయణ, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. కొండపోచమ్మకు ఎమ్మెల్యే గణేశ్ పూజలు జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని కొండపోచమ్మతల్లిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పండుగ తర్వాత ఆదివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పత్తి టెండర్
సీసీఐ కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొంది. కేంద్రాల నిర్వహణలో కొత్త నిబంధనల వల్ల తాము నష్టపోయే అవకాశముందని, పాత విధానంలోనే కొనుగోళ్లు చేపడతామంటేనే తాము టెండర్లలో పాల్గొంటా మని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8తో గడువు ముగియనుంది. ప్రభుత్వ చొరవపైనే కేంద్రాల ఏర్పాటు అంశం ఆధారపడి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో పది రోజుల్లో పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశముండగా, కేంద్రాలను ప్రారంభించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఇక్కడ 10 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా. మెదక్ జిల్లాలో 34,751 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా 4.17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 3.48 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకిరాగా ఇక్కడ 25లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనావేస్తోంది. మూడు జిల్లాల్లో కలుపుకుని సుమారుగా 40 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏటా 50కిపైగా జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. సీసీఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరం గతంతో పోలిస్తే సీసీఐ ఈసారి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కొత్త నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించింది. ఇందులోభాగంగానే కేంద్రాలు నిర్వహించే ప్రాంతంలో...ఆ ప్రాంతానికి సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొనుగోలు చేయవద్దని సూచించింది. మరోవైపు సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2 పేరిట రెండు కేటగిరీలుగా విభజించి ఎల్1 కేంద్రాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నది. ఇక కొనుగోళ్లకు తప్పనిసరిగా ‘కాపాస్ కిసాన్ యాప్’ను వాడాలని స్పష్టం చేసింది. తేమ శాతం 12కంటే ఎక్కువగా ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదని చెబుతూ తరుగు శాతం గతంలో 1.70% ఉండగా, దానిని సగానికి కుదించారు. ఈ నిబంధనలు తమకు గుదిబండగా మారాయని, గతంలో మాదిరిగానే కొనుగోళ్లను కొనసాగిస్తామంటేనే తాము టెండర్లలో పాల్గొని, సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా యాజమాన్యాల నుంచి స్పందన లేకపోగా మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8న తుది గడువుగా విధించారు. మరో పది రోజుల్లో పత్తి ఉత్పత్తులు మార్కెట్ బాట పట్టే అవకాశముండగా, ఆలోగా కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు తప్పవనే పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చొరవపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.నిబంధనలు మారిస్తేనే టెండర్లలో పాల్గొంటాం కొత్త నిబంధనలు అమలు చేయకుండా, గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపడితే సీసీఐ టెండర్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. సోమ వారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సమావేశం ఉంది. ఇందులో చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నాం. –జిల్లా శ్రీనివాస్– అధ్యక్షుడు, ఉమ్మడి మెదక్ జిల్లా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం -
ప్రయాణికుల రద్దీతో పాట్లు
కిక్కిరిసిన బస్టాండ్లు ● సెలవులు ముగియడంతో తిరుగు పయనం ● స్పెషల్ సర్వీసుల పేరిట ఆర్టీసీ అదనపు చార్జీల వసూలు సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండగ వరుస సెలవులు ముగియడంతో ప్రజలు తమ సొంతూరు నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండడంతో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అదనపు ట్రిప్పులు సిద్దిపేట పట్టణంలోని మోడ్రన్ బస్టాండ్, న్యూబస్టాండ్ నుంచి ప్రతి నిత్యం వేల మంది ప్రయాణికులు జేబీఎస్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణిస్తుంటారు. సెలవు దినాల్లో, పండగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సిద్దిపేట డిపోలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు వివిధ రూట్లలో అధికారులు తిప్పుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో 77 బస్సులు, దుబ్బాక డిపోలో 38 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 40 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. పండగ రోజుల్లో 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నారు. దసరా పండగకు ఆర్టీసీ సిద్దిపేట డిపోకు రూ.1.5కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా, పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు బతుకమ్మ, దసరా పండగ సెలవులు ముగియడంతో తమ సొంతూర్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా ఆదివారం 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడిపాం. ఆర్టీసీ అదికారులు, సిబ్బంది బస్టాండ్లో దగ్గర ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. – రఘు, డిపో మేనేజర్ -
పారదర్శకంగా వాహనాల తనిఖీలు
కలెక్టర్ హైమావతి బెజ్జంకి(సిద్దిపేట): వాహనాలను అత్యంత పారదర్శకంగా తనిఖీ చేయాలని కలెక్టర్, ఎన్నికల ఇన్ఛార్జి హైమావతి సూచించారు. మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం వాహనాల తనిఖీ నమోదు రిజిస్టర్ను పరిశీలించి తనిఖీ ప్రక్రియను వీడియో తీయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బంది గైర్హాజర్పై ఆగ్రహం బెజ్జంకితోపాటు పీహెచ్సీని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ఈ సమయంలో స్టాఫ్నర్స్ పద్మ మినహా సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది వైఖరిపై డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. తప్పనిసరిగా డ్యూటీలో ఉండేలా సూచించారు. విధుల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయనున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ ముగిసేంత వరకు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్కు రావద్దని సూచించారు. -
వాస్తు మార్చినా వేటు తప్పలే!
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వివాదంలో చిక్కుకుని బదిలీ అవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ మధ్య వివాదంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారించిన అధికారులు ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డిని సస్పెండ్ చేసి ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎంపీఓ సత్యనారాయణ కూడా అధికారుల మధ్య వివాదంతోనే సస్పెండ్ అయ్యారు. హుస్నాబాద్కు పోస్టింగ్ తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని నూతనంగా నిర్మించి 2019 జూన్లో ప్రారంభించారు. కార్యాలయంలో ఎంపీడీఓ, ఎంపీపీల చాంబర్స్ విషయంలో అప్పటి ఎంపీడీఓ రాము, ఎంపీపీ మధ్య వివాదం తలెత్తడంతో ఎంపీడీఓను బదిలీ చేయించారు. తర్వాత జయశీల వచ్చిన కొద్ది రోజులు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిపోయారు. సత్యశ్రీ ఎంపీడీఓగా వచ్చిన అధికారుల మధ్య విభేదాలతో ఆమెను నంగునూరుకు బదిలీ చేయించారు. ఎంపీడీఓగా కుమారస్వామికి పోస్టింగ్ ఇస్తే ఏడాది పాటు విధులు నిర్వహించిన ఆయనపై కూడా మండల పరిషత్ సిబ్బంది ఎంపీపీకి తప్పుడు సమాచారం ఇచ్చి వివాదాలు సృష్టించి బదిలీ చేయించారు. ఆ తరువాత ఎంపీడీఓగా అనిత బాధ్యతలు స్వీకరించి పరిపాలనపై పట్టు బిగిస్తున్న సమయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయించి మరీ బదిలీ చేయించారు. కొద్ది రోజులు కోహెడ సూపరింటెండెంట్ రాఘవేంద్ర రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎంపీడీఓల బదిలీల్లో హన్మకొండ జిల్లా నుంచి వేణుగోపాల్ రెడ్డి హుస్నాబాద్కు బదిలీపై వచ్చాడు. ఎంపీపీల పాలన ముగిసిన వెంటనే అందరూ వివాదాలతో బదిలీ అవుతున్నారని ఎంపీడీఓ చాంబర్ను ఎంపీపీ గదికి మార్చుకొని పరిపాలన సాగించాడు. అంతర్గత విభేదాలపై ఫిర్యాదులు ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే అధికారుల మధ్య అంతర్గత విభేదాలతోనే ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ అయినట్లు తెలిసింది. వాస్తు లేదని ఎంపీడీఓ చాంబర్ను మార్చిన అధికారికి అపవాదు తప్పలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. హుస్నాబాద్ ఎంపీడీఓగా ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించి, ఎంపీఓ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ రవీందర్రావుకు అప్పగించారు. కార్యాలయం నిండా సిబ్బంది ఉన్న అధికారులు ఎవరూ సమయానికి విధులకు రాకపోవడం, విధులకు వచ్చినా వ్యక్తిగత పనులపై బయటే ఎక్కువ సమయం కేటాయిస్తారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు.. ఆరుగురు బదిలీ -
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుజోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్చార్జిలు దేశ్పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుర్గామాత కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే మంచి సంస్కృతి ,సాంప్రదాయాలు తరాల నుంచి వస్తుందన్నారు. భక్తి భావంతో పాటు ప్రజలు ఐకమత్యంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యంజాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి గజ్వేల్రూరల్: బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. గజ్వేల్కు చెందిన యాదగిరి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా శనివారం హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సంద ర్భంగా గజ్వేల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరమవుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమన్నారు. వారిని చైతన్యం చే స్తూ సంఘటిత పోరాటం చేస్తామని పేర్కొన్నా రు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు. మహిళల రక్షణే ప్రధాన కర్తవ్యం: సీపీ అనురాధసిద్దిపేటకమాన్: మహిళల రక్షణే షీటీమ్ ప్రధాన కర్తవ్యమని పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో షీటీమ్ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో షీటీమ్స్ గత నెలలో 49మంది ఈవ్ టీజర్లను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా హాట్స్పాట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి 53 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలను ఎవరైనా వేధిస్తే డయల్ 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 8712667434కు ఫోన్ చేయాలని సూచించారు. మద్యం షాప్లకు మొదటి దరఖాస్తుసిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణ (2023–25)కు శనివారం మొదటి దరఖాస్తు వచ్చినట్లు ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈసారి దరఖాస్తుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. 23న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు. జోరు తగ్గిన మంజీరా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. -
ప్రజాధనం నేలపాలు!
● ఆస్పత్రి విస్తరణ పేరిట పాత భవనాలు కూల్చివేత ● 250 పడకల ఆస్పత్రి కోసమేనంటున్న అధికారులు, పాలకులు ● మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రోగులు, వైద్య పరికరాలు తరలింపు ఒకే ప్రాంగణంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారు. నాటి ఆనవాళ్లు లేకుండా తుడిచి పెట్టుకుపోయాయి. స్థలం కొరతతో ఇదే ప్రాంగణంలో కొత్తగా 250 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని వీటిని కూల్చివేశారు. కాగా ప్రజాధనం వృథా అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. – హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. తరువాత మరో 20 పడకలకు పెంచారు. రోగుల సంఖ్య పెరగడంతో ప్రత్యేక రాష్ట్రంలో ఈ ఆస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ మే, 30, 2017లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. మొత్తంగా 100 పడకల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 400 మంది రోగులు వివిధ చికిత్స కోసం వస్తున్నారు. ప్రసవాల సంఖ్యతోపాటు కిడ్నీ రోగులకు డయాలసిస్, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా సాగుతున్నాయి. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు హుస్నాబాద్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న వంద పడకల ఆస్పత్రిని ప్రభుత్వం 250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసింది. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.82 కోట్లు మంజూరు చేసింది. అయితే.. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోదని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే ఉన్న వంద పడకల ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూల్చివేసి, నూతన ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలింపు ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా డాక్టర్లు, సిబ్బంది, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రోగులతో పాటు వైద్య పరికరాలను తరలించారు. నూతన భవనం పూర్తి అయ్యే వరకు ఇక్కడే వైద్య సేవలు అందనున్నాయి. -
డైలమాలో ఆశావహులు!
సాక్షి, సిద్దిపేట: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఆశావహుల్లో ఇంకా డైలమా కొనసాగుతోంది. న్యాయపరమైన చిక్కులను దాటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.?, లేదా అనే చర్చ పల్లెల్లో సాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్పై ఈ నెల 8వ తేదీన హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని బరిలోనే నిలిచే వారు, అధికారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ స్థానం రిజర్వేషన్ గెజిట్ను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. 2018, 2019 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఈ మూడు వర్గాలకు కలిపి 69.21శాతంకు రిజర్వేషన్లు పెరిగాయి. దీంతో 50 శాతానికి మించవద్దని హైకోర్టును పలువురు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. న్యాయస్థానం ఏమి ఆదేశిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మళ్లీ మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల నాయకుల్లో సాగుతోంది. మరోవైపు 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. సమాయత్తం కావాలంటున్న పార్టీలు పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతాయని క్షేత్రస్థాయి నాయకులకు అప్రమత్తం చేస్తోంది. ఎన్నికలపై సందిగ్ధతను పక్కనబెట్టి సమాయత్తం కావడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయా పార్టీల ముఖ్యనేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు. స్తబ్దుగా ఉంటే ప్రత్యర్థి పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారే ప్రమాదం లేకపోలేదని శ్రేణులు జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు మారితే..? హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు ఏవి అన్ రిజర్వ్ (జనరల్), మహిళా అవుతాయో తెలియని పరిస్థితి ఉండగా ,ఆశావహులంతా మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు పోవాలా ? వద్దా అనే అంశంపై తమ సన్నిహితులతో మాట్లాడుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో మార్చాల్సి వస్తే అందుకు సైతం అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశిస్తే మూడు రోజుల్లో మళ్లీ కొత్త రిజర్వేషన్లు మార్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో అందరూ ఆసక్తిగా 8వ తేదీన ఉన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్పై చర్చ -
● గంటన్నరకు పైగా ఏకధాటిగా.. ● జలమయమైన లోతట్టు ప్రాంతాలు
దంచికొట్టిన వాన దుబ్బాక: దుబ్బాకలో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. శనివారం దుబ్బాకలో అంగడి కావడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంతో పాటుగా మండలంలోని చాలా గ్రామాల్లో వర్షం కురిసింది. భారీగా వరద నీరు చేరడంతో పంటలకు నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎలా చేతికొస్తాయో అన్న ఆందోళనలో ఉన్నారు. -
ఎన్నికల వేళ.. జంపింగ్ల మేళా
జోరుగా రాజకీయ వలసలు ● పార్టీలు మారుతున్న నాయకులు ● రెండు నెలలుగా సాగుతున్న పరంపరమెదక్జోన్: Ý린MýS çÜ…çܦÌS G°²-MýSË$ çÜÒ$í³-çÜ$¢¯]l² Ðólâýæ hÌêÏÌZ f…í³…VŠæ ´ëÍ-sìæMŠSÞ gZÆý‡…-§ýl$-MýS$¯é²Æ‡$$. Æð‡…yýl$ ¯ðlÌS-Ë$V> D ç³Æý‡…ç³Æý‡ ÝëVýS$-™èl*¯ól E…¨. Ýë«§é-Æý‡×æ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ Ððl¬§ýl-Ë$-Mö° °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y, Ð]l$…yýl-ÌSÝë¦Æ‡$$ ¯éĶæ$-MýS$ÌS Ð]lÆý‡MýS$ ´ëÈ-tË$ Ð]l*Æý‡$-™èl$-¯é²Æý‡$. D Ð]lÅÐ]làÆý‡…ÌZ ½BÆŠḥG‹Ü, M>…{VðS‹ÜË$ §ýl*MýS$yýl$V> Ð]lÅÐ]lçß ÇçÜ$¢¯é²Æ‡¬. VýS™èl AòÜ…½Ï G°²-MýSÌS çÜÐ]l$-Ķæ$…ÌZ Ððl$§ýlMŠS GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l# Ððl¯]l²…sìæ E¯]l² Ķæ¬Ð]l-¯ól™èl iÐ]l-¯ŒS-Æ>Ð]l#, Æ>Ð]l*-Ķæ$…õ³r Ð]l*i Ð]l*Æð‡PsŒæ MýSÑ$sîæ O^ðlÆý‡Ã¯ŒS VýS…V> ¯]lÆó‡…-§ýlÆŠ‡ ĶæÊrÆŠ‡² ¡çÜ$-Mö° Æð‡…yýl$ ¯ðlÌSÌS {MìS™èl… ½B-ÆŠ‡-G‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. Aç³µsZÏ hÌêÏÌZ C¨ àsŒæ-sê-í³MŠSV> Ð]l*Ç…-¨. ©°MìS Mú…r-ÆŠ‡V> GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l#, M>…{VðS‹Ü Æ>çÙ‰ ¯ól™èl OÐðl$¯]l…ç³-ÍÏ çßæ¯]lÃ…-™èl-Æ>Ð]l# hÌêÏÌZ ¿êÈ ºíßæ-Æý‡…VýS çÜ¿ýæ¯]l$ HÆ>µ-r$-^ólÔ>Æý‡$. ï³ïÜïÜ `‹œ Ð]l$õßæ-ÔŒæ-MýS$-Ð]l*-ÆŠ‡VúyŠæ, hÌêÏ C¯ŒS-^é-Çj Ð]l$…{† ÑÐól-MŠS¯]l$ Bà-Ó-°…-^éÆý‡$. D çÜ¿ýæÌZ °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y…ÌZ° ç³Ë$ Ð]l$…yýl-ÌêË$, {V>Ð]l*-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l*i çÜÆý‡µ…-^Œl-ÌS™ø ´ër$ ½B-ÆŠ‡-G‹Ü, ½gôæ-ï³ÌS ¯]l$…_ M>Æý‡Å-MýSÆý‡¢Ë$, ¯ól™èlË$ ò³§ýlª-G-™èl$¢¯]l M>…{VðS‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. ÐéÇ™ø ´ër$ {ç³Ð]l¬Q çÜ…çœ$ õÜÐ]lMýS$yýl$ ÎÌê {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS Ððl*çßæ-¯ŒS-¯éĶæ$-MŠS¯]l$ M>…{VðS-‹Ü-ÌZMìS Bà-Ó-°…-^éÆý‡$. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు రెండు రోజుల క్రితం అధికార పార్టీకి గుడ్బై చెప్పి ఎమ్మె ల్యే సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇటీవల యూరియా కొరతతో పాటు స్థానికంగా ఉన్న నేతలతో పొసగకపోవటమేనని తెలుస్తోంది. పెద్దశంకరంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత మురళి (పంతులు) ఇటీవల ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీతో పాటు ఆ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం జనరల్ మహిళాకు రిజర్వేషన్ కావటంతో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పాపన్నపేట మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్లీ బీజేపీ వైపు పంజా చూపు! -
లక్ష్యాన్ని అధిగమించాలి
● ఈ ఏడాది స్లాట్ బుకింగ్ ప్రక్రియ ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నూతన యాప్ కపాస్ కిసాన్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో కొత్తగా యాప్ ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. పత్తి రైతులు తప్పనిసరి కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సీసీఐ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు పత్తికి రూ 8,110 ప్రకటించిందని, అది పొందడానికి యాప్లో స్లాట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పత్తి రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులకు మాత్రం వ్యవసాయ విస్తరణ అధికారులు తమ లాగిన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలని సూచించారు. యాప్ నిర్వహణ, మద్దతు ధర తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ రీజినల్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి స్వరూప రాణి, జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమయపాలన పాటించాలి
● వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం ● డుమ్మాకొట్టిన మీర్జాపూర్ సిబ్బందిపై ఆగ్రహంఅక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం ఆమె అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్ఎస్టీ శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలు, మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్ఎస్టీ శిబిరంలో రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో వీడియో రికార్డు చేయాలన్నారు. మీర్జాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఒక ఉద్యోగి మినహా అందరూ గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. -
గజ్వేల్లో ఆర్ఎస్ఎస్ కవాతు
గజ్వేల్రూరల్: ప్రతి ఒక్కరూ దేశ, దైవ భక్తిని కలిగి ఉండాలని, అలాగే.. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహాఇంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ విధానాలను తీసుకెళ్లాలని సూచించారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరముందని, అందరు విధిగా కుటుంబ విలువలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మంద సాయినాథ్రెడ్డి, సామాజిక సమస్త విధిగా ప్రాంత అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్బాబు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిద్దాం
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ ప్రశాంత్నగర్(సిద్ధిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా మెదక్ ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపొందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అందుకోసం నాయకులు, కార్యకర్త ప్రజల్లో మమేకం అవ్వాలని సూచించారు. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. గంగమ్మకు పూజలు చేసి మంజీరా నదిలో ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి నిమజ్జనం చేశారు. కాగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను శుక్రవారం ఏడుపాయల మంజీరా నదిలో నిమజ్జనం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో జనసంద్రంగా మారింది. రెండవ బ్రిడ్జిపై ట్రాఫిక్ జాం అయి వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. భక్తులు రాజగోపురంలోని దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
పేదలకోసమే పరితపించిన రామలింగారెడ్డి
● నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా సాధారణ జీవితమే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ,ఎస్టీ చైర్మన్ వెంకటయ్య దుబ్బాక/దుబ్బాకటౌన్: తుదిశ్వాస విడిచేంత వరకు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేదల కోసమే పరితపించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం చిట్టాపూర్తోపాటు దుబ్బాకలో ఆయన విగ్రహాలకు కొత్త ప్రభాకర్రెడ్డి, బక్కి వెంకటయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా రామలింగారెడ్డి అత్యంత సాధారణ జీవితమే గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన భౌతికంగా లేకున్నా పేదప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలచిపోయాడని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామలింగారెడ్డి కుమారుడు సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, ఎల్లారెడ్డి తదితరులున్నారు. దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుబ్బాక పట్ణణంలో రెడ్డిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన లైటింగ్, డీజే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ, యువకుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. -
దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు
హుస్నాబాద్: పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలని గాంధీ అడుగు జాడల్లో మనమంతా నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీచౌక్లో గురువారం గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని, రాజ్యాంగం పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, నాయకులు బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు. దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి గురువారం మున్సిపాలిటి ఆధ్వర్యంలో శివాలయం వద్ద నిర్వహించిన శమీ పూజలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద దసరా సందర్బంగా రామ్ లీలా కార్యక్రమంలో పాల్గొని మంత్రి రావణ దహనం చేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అనిత తదితరులు ఉన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
రేపు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
ప్రశాంత్నగర్(సిద్ధిపేట): సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఈ నెల 5న ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నట్లు, జిల్లా అధ్యక్షుడు అమ్మన చంద్రారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక, మండలాల ఎన్నికలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రెస్క్లబ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గాంధేయ మార్గాన్ని అనుసరించాలిఅదనపు డీసీపీ కుశాల్కర్ సిద్దిపేటకమాన్: మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలని అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పోలీసు కమిషనరేట్లో గాంధీ చిత్ర పటానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినపుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సాయిప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ విజయాలను అందించాలిఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్: దసరా అందరి జీవితాల్లో విజయాలను అందించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఆకాంక్షించారు. గజ్వేల్ పట్టణంలోని డీసీఎంఎస్ గోదాము వద్ద గురువారం మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ గుంటుకు శీరీష రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలపిట్టను ఎగురవేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ చెడుపై మంచి విజయంగా చెప్పుకునే దసరా పండుగ అందరికీ మేలు చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, భరత్నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి: చుక్కా రాములుసిద్దిపేటఅర్బన్: నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే సీపీఎం అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కార్మిక కర్షక భవన్లో గురువారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పాలకులు లేక సమస్యలతో ప్రజలు విసిగిపోతున్నారని, వారికి అండగా నిలుస్తున్న పార్టీ సీపీఎం అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పండగ పూట నీటిగోస కౌడిపల్లి(నర్సాపూర్): పండుగ పూట నీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈసంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. కౌడిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీరు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు భగీరథ నీరు రాక, మరోవైపు గ్రామంలో బోరుబావులు సరిగా లేకపోవడంతో కొత్తకాలనీకి చెందిన పలువురు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడంతో విరమించారు. -
రాజరాజేశ్వరీదేవిగా వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): అమ్మ విజయదర్శనం..శ్రీరాజరాజేశ్వరిదేవిగా సాక్షాత్కారం..వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దసరాశరన్నవరాత్రోత్సవాలు గురువారం విజయ దశమి వేడుకలతో ముగిశాయి. దసరా పర్వదిన వేళ జయములిచ్చే జగన్మాత శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేషాభిషేకం జరిపారు. శమీపూజ అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి విజయదర్శనం లభించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరునికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు. -
గాంధీ మార్గంలో నడుద్దాం
దుబ్బాక: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని ఎంపీ రఘునందన్రావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు గాంధీ అని ఆయన స్ఫూర్తితో దేశరక్షణకు పాటుపడుదామన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఘనంగా దసరా ఉత్సవాలు దుబ్బాక మండలంలో దసరా ఉత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రఘునందన్రావు తన స్వగ్రామం బొప్పాపూర్లో, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తన స్వగ్రామం పోతారంలో తమ కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా సంబరాల్లో పాల్గొన్నారు.కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ హైమావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, కలెక్టరేట్ ఏఓ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
వైభవంగా దసరా ఉత్సవం
ప్రశాంత్నగర్( సిద్దిపేట): జిల్లాలోని ప్రజలు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు తరలివచ్చి శమీ పూజ నిర్వహించి, పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అమ్మవార్లు, హనుమాన్ ఆలయాల వద్ద వాహనాలకు పూజలు నిర్వహించారు. దీంతో ఏ ఆలయం వద్ద చూసినా భారీ లైన్లు కన్పించాయి. జిల్లా కేంద్రంలోని కోటిలింగాల ఆలయం, రంగదాంపల్లి హనుమాన్ ఆలయం, నర్సాపూర్ హనుమాన్ ఆలయం, రూరల్ పోలీస్స్టేషన్ హనుమాన్ ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో శమీపూజ నిర్వహించారు. లాల్కమాన్, నర్సపూర్ హనుమాన్ ఆలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సాయంత్రం ఆలయాల వద్ద రావణ దహనం నిర్వహించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీరు, పండ్లు, ఆహరపదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. పిల్లలకు సంస్కృతిని నేర్పించాలి జిల్లా కేంద్రంలోని ఆలయాల వద్ద జరిగిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ హనుమాన్ ఆలయంలో వెండి కిరీటాన్ని అందించారు. అనంతరం ఆలయాల వద్ద పాలపిట్టను ఎగురవేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ...చిన్నారులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలన్నారు. దేశానికి మంచినీళ్ల పథానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. సిద్దిపేటకు అన్ని రకాల విద్యా సంస్థలను తీసుకువచ్చామన్నారు. కాళేశ్వరంతో రంగనాయకసాగర్ జలకళతో కళకళలాడుతుందన్నారు. కాశీ పురోహితులు సిద్దిపేటకు వచ్చి హారతి ఇవ్వడాన్ని చూస్తే సాక్షాత్తూ కాశీని తలపించిందన్నారు. -
దసరాకు కిక్కెంచారు
● రూ.20కోట్ల మద్యం విక్రయాలు ● వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో ఎకై ్సజ్కు భారీ ఆదాయం ముందుగానే కొనుగోళ్లు ఈ ఏడాది దసరా పండుగకు మూడు రోజుల్లో జిల్లాలో రూ.20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఆఖరి వారంలో ప్రారంభం కావడం వరుస దసరా సెలవులు రావడంతో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. దసరా రోజునే గాంధీ జయంతి కూడా రావడంతో ఒకరోజు ముందుగానే మద్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. – శ్రీనివాసమూర్తి, సిద్దిపేట, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా వరుస సెలవుల నేపథ్యంలో మందుబాబులు తెగ తాగేశారు. దసరా పండగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందే మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా గత నెల 29, 30, ఈ నెల 1వ తేదీల్లో రూ. 20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది తో చూస్తే ఈ దసరా పండగా ముందుగా సెప్టెంబర్ నెలాఖరు నుంచే సేల్ ప్రారంభం కావడంతో అదే నెలలో సేల్ వివరాలు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు దసరా పండగను రెండు రోజులు మందు, మాంసంతో విందులు జరుపుకున్నారు. మూడు రోజుల్లో రూ.20కోట్ల విక్రయాలు జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా దసరా పండగకు మూడు రోజుల్లో రూ.20కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో గత నెల 29న 6,907 లిక్కర్ బాక్సులు, 10,445 బీర్ బాక్సులు, 30న 7,632 బాక్సుల లిక్కర్, 9,796 బాక్సుల బీర్లు, ఈ నెల 1న 3,761 బాక్సుల లిక్కర్, 9,686 బాక్సుల బీర్లు విక్రయించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందుగానే అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో చూస్తే ఈ ఏడాది అధికంగా మద్యం విక్రయాలు జరిగి ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. -
సామాజిక సేవకు నిలయంగా సిద్దిపేట
ప్రశాంత్నగర్(సిద్దిపేట)/సిద్దిపేటజోన్: సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవ, అన్నదానాలు, వివిధ సేవా కార్యక్రమాలకు నిలయంగా సిద్దిపేట నిలుస్తోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అమర్నాథ్ సేవా సమితి భవనం భూమి పూజ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట నుంచి ప్రారంభమైన అన్నదానం అమర్నాథ్, అయోధ్య, కేదారినాథ్ వరకు సాగుతోందన్నారు. అమర్నాఽథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గాంధీ ఆశయసాధనకు కృషి చేయాలి గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అహింసామార్గంలో శాంతియుతంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సింహ, సుడా మాజీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంగారెడ్డిలో సందడే..
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సవాల ఏర్పాట్లు..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండగను పురస్కరించుకుని పాతబస్టాండ్ రాంమందిర్ నుంచి శావ శోభాయత్ర నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో భజన కీర్తలతో ఈ శోభయాత్ర ఉంటుంది. రాంమందిర్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. భారీ స్థాయిలో బాణాసంచ కాల్చుతారు. పట్టణ వాసులతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుల బృందాలు పాడే భక్తిగీతాలు వేడుకకు హాజరైన వారిలో ఆధ్మాత్మిక భావాన్ని పెంపొందిస్తుంటాయి. -
గెలుపు గుర్రాల వేట
● ‘స్థానిక’ పోరుపై పార్టీలు ప్రధాన దృష్టి ● ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం కసరత్తు ● పార్టీ నేతల అభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ ● దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ ● ఇన్చార్జులను నియమించిన బీజేపీస్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరిగే వాటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాయి. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలో నిలబడే వారిలో ఎవరికి మద్దతు తెలిపే విషయంపైనా కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230, సర్పంచ్లు 508, వార్డులు 4,508 ఉన్నాయి. – సాక్షి, సిద్దిపేట బీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెజార్టీ గ్రామ నాయకులు, కమిటీ అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ఇప్పటికే ఇంటింటికి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 22 నెలలు అయినా అమలు కావడం లేదని ప్రజలల్లోకి తీసుకవెళ్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ఆయా మండలాల కమిటీలను సూచించారు. ఈ నెల 3 తేదీ వరకు ఆయా నియోజకవర్గ ఇన్చార్జులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పీసీసీ నుంచి వచ్చే ఇన్చార్జి సమక్షంలో ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన నాయకుల పేర్లలను ఈ నెల 5న పంపించాలని సీఎం ఆదేశించారు. పీసీసీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నిర్వహించనున్నారు. వామపక్షాల పొత్తు ఉండేనా? వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? లేదా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జిల్లాలో భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ సైతం అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. పలువురు ఇండిపెండెంట్లుగా బరిలో దిగేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్చార్జిల నియామకం బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్చార్జిలను నియమించింది. మండల అధ్యక్షులు, ఇన్చార్జులు, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ను మెదక్ ఎంపీ రఘునందన్రావు నిర్వహించారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. -
‘జమ్మి’వనం..
ప్రత్యేకత చాటుకుంటున్న తున్కిఖాల్సా పల్లెప్రకృతి వనంవర్గల్(గజ్వేల్): అడవిలో ‘జమ్మి’ వనం ఊరందరికి చేరువైంది. పల్లె ప్రకృతికి శోభనిస్తోంది. పూజనీయమైన జమ్మి వృక్షాలతో వర్గల్ మండలం తున్కిఖాల్సా పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత చాటుకుంటున్నది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో 5 జమ్మి వృక్షాలు ఒకేచోట సముదాయంగా పెరిగాయి. అక్కడే దసరా జమ్మీ పూజ నిర్వహించుకునేవారు. 2019లో పల్లెప్రకృతివనం ఆలోచన తెరపైకి వచ్చింది. ఆ వెంటనే రెండెకరాల విస్తీర్ణంలో జమ్మిచెట్లు మధ్యలో ఉండేలా పచ్చనిలాన్, చుట్టూరా వృత్తాకారంలో గద్దె, అక్కడే భారతమాత విగ్రహం, దేశభక్తికి చిహ్నంగా ఎత్తయిన జాతీయ జెండా, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, తెలంగాణ సంస్కృతికి చిహ్మంగా బతుకమ్మ..ఇలా అన్ని కలగలసి పల్లెప్రకృతి వనం శోభాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆహ్లాదతకు నెలవుగా, ఊరందరూ దసరా వేళ జమ్మి వృక్షాలు పూజించే ఆధ్యాత్మికతల కొలువుగా ప్రత్యేకత చాటుకుంటున్నది. -
ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
బతుకమ్మ, దాండియా ఆటలతో దుమ్మురేపే ఆడపడుచులుయువకుల అలయ్– బలయ్ దుబ్బాకలో ప్రత్యేకందుబ్బాక/దుబ్బాకటౌన్: పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా గాంధీ విగ్రహం వద్ద ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచుల బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. యువకులు, పెద్దలు అలయ్ – బలయ్ కార్యాక్రమాలు, యువకుల డ్యాన్సులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పట్టణాలను నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండల పాల వద్ద వారం పాటు ఆడపడుచుల దాండియా, బతుకమ్మ ఆటపాటలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. అలాగే దసరారోజున పట్టణంలోని చెల్లాపూర్రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జమ్మిచెట్టు వద్దకు డప్పుచప్పుళ్లతో వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. -
మహా సరస్వతి హోమం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ అధికారులు, అర్చకులు మహా సరస్వతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మహాపూర్ణాహుతి, విశేషద్రవ్య సమర్పణ, సువాసిని తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: రఘునందన్రావు దుబ్బాక: అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. బుధవారం సాయంత్రం దుబ్బాక పట్టణంలోని తన స్వగృహంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవనామస్మరణతోనే సర్వసుఖాలు కలుగుతాయన్నా రు. అమ్మవారి కరుణతో మంచి పంటలు పండి రైతులు,ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఢోకా కార్డులను ప్రవేశ పెడతాం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీఆర్ఎస్ హామీలను నమ్మి రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ విధంగా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారో అన్నింటిని ప్రతి ఓటరుకు ఢోకా కార్డుల పేరిట పంచుతామని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మీసం నాగరాజు యాదవ్ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులూ రెండు సార్లు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు హరీశ్రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతులకు ఉచిత ఎరువులు, ప్రతి పేద దళితులకు దళిత బంధు, తదితర హామీలను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ,అభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్లూరి నర్సింహులు, కోరిమి రాజు, మహేందర్రెడ్డి, స్వామి , మీసం రాజు, కోడెల నాగరాజు, సురేష్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తనిఖీబెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తోటపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సిద్ధిధాత్రి నమోస్తుతే..
మహిషాసుర మర్దినిగా వర్గల్ అమ్మవారు వర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రోత్సవాలలో తొమ్మిదోరోజు బుధవారం వర్గల్ శ్రీవిద్యా సరస్వతి అమ్మవారు సిద్ధిధాత్రి మహిషాసుర మర్దినిగా దివ్యదర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు ఆలయ మహామండపంలో 108 కలశాలు, 108 శంఖువులు స్థాపన చేశారు. గర్భగుడిలో మూలవిరాట్టుకు మహా కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిషాసుర మర్దినిగా సాక్షాత్కరించిన అమ్మవారిని భక్తజనులు దర్శించుకుని తరించారు. -
నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం
ఉమ్మడి మెదక్ జిల్లా విభిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం. అనేక ఆచారాలు, అలవాట్లతో కూడిన వైవిధ్యమైన ఉమ్మడి జిల్లా. వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆటపాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. అంతా కలిసి బ్యాండు మేళాలతో వెళ్లి పాల పిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితంగా జరిగే వేడుకల కథనాలు కొన్ని.. -
దసరా జోష్
దసరా జోరు అంతాఇంతా కాదు.. దసరా అంటేనే చుక్క, ముక్క అనేలా ఉంటుంది. కానీ దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజున రావడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం వైన్స్ షాప్లు, చికెన్, మటన్ షాప్లు మూసివుంటాయని, ముందస్తుగా బుధవారమే మందు, మాంసాహార ప్రియులు కొనుగోళ్లు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటరావణ దహనానికి ఏర్పాట్లు పూర్తిప్రశాంత్నగర్(సిద్దిపేట): దసర పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పలు ఆలయాల వద్ద ఉత్సవాలను నిర్వహించనున్నారు. అందుకు గాను ఆలయాల వద్ద రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రంగథాంపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, లింగారెడ్డిపల్లి, ఎన్సాన్పల్లిలలో భారీ రావణ కటౌట్లను దహనం చేయనున్నారు. హరీశ్రావు శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనంద, సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను నిర్వహించుకోవాలన్నారు. -
గజ్వేల్లో నేడు సద్దుల బతుకమ్మ
గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊరచెరువు వద్ద స్థానిక ఏసీపీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా చెరువుల వద్ద అవసరమైన బారీకేడ్లు, లైటింగ్, వేదిక ఏర్పాటు తదితర అంశాలపై కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలోనే వాహనాలు నిలిపేలా చూడాలని పోలీసులకు ఆదేశాలివ్వనున్నట్లు ఏసీపీ తెలిపారు. రోడ్డుపై రద్దీ ఉండే అవకాశమున్నందువల్ల స్టాపర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలాంటి ఈవ్టీజింగ్ జగరకుండా మఫ్టీలో పోలీసుల నిఘా కొనసాగుతోందన్నారు. అలాగే దసరా పండుగ రోజు మహంకాళీ ఆలయం వద్ద నిర్వహించనున్న రావణ దహనం, ఇతర ఏర్పాట్లను సైతం ఏసీపీ పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూకేలో పేరిణి సంతోష్ నృత్య ప్రదర్శనలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్లో యూనైటెడ్ కింగ్డమ్ (యూకే) తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేరిణి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన ప్రముఖ పేరిణి నాట్యాచార్యుడు, యువకళా రత్న సంతోష్ మంగళవారం తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నృత్య రూపకం, పేరిణి శివతాండవం నృత్య ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పేరిణి నృత్యంను విదేశీయులు ఇష్టపడుతున్నట్లు సంతోష్ తెలిపారు. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● పటిష్ట కార్యాచరణతో ముందుకు ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అదనపు డీసీపీ, డీపీఓలతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలు, విధులపై అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించాలి... ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది నిబంధనలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు 15 కమిటీలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకిదేవి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఊరూరా స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. బరిలో నిలిచే ఆశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా సంఘాల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏఏ విడతల్లో జరగనున్నాయో తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, జెడ్పీటీసీలు 26, ఎంపీటీలు 230 ఉన్నాయి. ఏ మండలం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ఆశావహులు ఆసక్తిగా ఉన్నారు. బరిలో నిలిచే నేతలు కసరత్తు షూరు చేశారు. జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. – సాక్షి, సిద్దిపేట శ్రీదుర్గే.. జయదుర్గేవర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రి ఉత్సవ వైభవంతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం అలరారుతోంది. మంగళవారం అమ్మవారు సకల సద్గతులు ప్రాప్తించే దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచహారతులు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చదువుల తల్లి సన్నిధిలో చిన్నారుల అక్షరస్వీకారాల సందడి నెలకొంది. కనకదుర్గ మాతగా..కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం తొమ్మివ రోజున అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
యాసంగిపైనే ఆశలు
రాబోయే యాసంగి సీజన్లో 4.12లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. వానాకాలంలో అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురైన రైతులు యాసంగిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లోనైనా ఊరట పొందాలనే ఆశావహదృక్పథంతో ఉన్నారు. – గజ్వేల్ యాసంగి సీజన్ సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తంగా 4.12లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వరి 3,64,823 ఎకరాల్లో, 31,416 ఎకరాల్లో మొక్కజొన్న, 12,609 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 455ఎకరాల్లో వేరుశనగ, 579ఎకరాల్లో శనగలు, 54ఎకరాల్లో పత్తి, 968ఎకరాల్లో స్వీట్కార్న్ సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా మొక్కజొన్న కోత తర్వాత దాని స్థానంలో అక్టోబర్ రెండో వారం నుంచి పొద్దు తిరుగుడు, శనగలు ఇతర ఆరుతడి పంటలు విత్తుతారు. గతంలో శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు సబ్సిడీపై ఇచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా సబ్సిడీ ఊసే లేకపోవడం వల్ల శనగ పంట సాగు భారీగా పడిపోయింది. ఇదిలావుంటే వానాకాలం సీజన్లో అతివృష్టి కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం సంభవించింది. ఈ కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి ఎక్కడికక్కడా తెగుళ్లు దాడి చేశాయి. ప్రస్తుతం ఈ పంటలను తొలగించి పొద్దు తిరుగుడు, శనగ ఇతర ఆరుతడి పంటలతో ఉపశమనం పొందాలనుకుంటున్నారు. కానీ విత్తన సబ్సిడీ లేకపోవడం కలవరపరుస్తోంది. ఇతర పంటలదీ అదే పరిస్థితి... మొక్కజొన్న 31,416వేల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉండగా 4,200 క్వింటాళ్ల విత్తనం అవసరం. పొద్దు తిరుగుడు 12,609 ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు 2,300 క్వింటాళ్ల విత్తనం, వేరుశనగ 579 ఎకరాల్లో సాగులోకి రానుండగా.. 100క్వింటాళ్లకుపైగా విత్తనం అవసరం ఉంటుంది. యూరియా కొరత తీరేనా? వానాకాలంలో యూరియా దొరక్క తీవ్ర పంట నష్టానికి గురైన రైతులు యాసంగి సీజన్లోనూ యూరియా తీరుతుందా లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. యాసంగి సీజన్ పూర్తయ్యేంతవరకు సుమారుగా 25వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా అవసరముంటుందని అంచనా. కానీ అవసరం మేరకు నిల్వలు వస్తాయా? అనేది అనుమానంగా ఉంది. ఈ పరిస్థితి వల్ల రైతులు పంటల సాగును తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ విషయంలో వ్యవసాయశాఖ రైతుల్లో నమ్మకం పెంపొందిస్తే తప్పా పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు నానో యూరియా వాడకం పెంచేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని కూడా భావిస్తున్నది. కానీ ఈ ప్రయత్నం ఏమేరక ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. -
ప్రభుత్వాస్పత్రిలో ఆయుధ పూజ
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో దసరా పండుగను పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది మంగళవారం ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, పిడియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ సురేష్బాబు వైద్యులు, సిబ్బందితో పాటు ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా విభాగ హెచ్ఓడీ చందర్, వైద్యులు రాగిణి, రమ్య, రవి, గ్రీష్మ, సునీత, మహేందర్, సౌజన్య, ప్రవీణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. -
పంటల నమోదు తప్పనిసరి
నంగునూరు(సిద్దిపేట): రైతులు సాగు చేసిన పంట వివరాలను ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. నంగునూరులోని రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని మంగళవారం ఏఓ గీతతో కలసి గోదాం, రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఎరువులు అమ్మిన వెంటనే రిజిష్టర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం ఘణపూర్లో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ పంట అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పంట నమోదు తప్పనిసరన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. కుకునూర్పల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గుర్రం ఎల్లం తన కార్యకర్తలతో కలిసి మంగళవారం నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బురుజుకు పునరుజ్జీవం నంగునూరు(సిద్దిపేట): చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కాపాడేందుకు యువకులు ముందుకొచ్చారు. నంగునూరు మండలం మగ్ధుంపూర్లో మంగళవారం యువకులు శ్రమదానం చేసి బురుజుపై పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి దసరా ఉత్సవాలను సిద్ధం చేశారు. నార్కోటిక్ డాగ్స్తో తనిఖీలు సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని సీఐ వాసుదేవరావు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్స్తో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు కలిగిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికై నా సమాచారం ఉంటే 100కు ఫోన్చేసి తెలియజేయాలని కోరారు. -
నేతల గురి
స్థానిక బరి..ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో జిల్లాలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. – మొదటి విడతలో 15 మండలాల్లో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావు పేట, చిన్నకోడూరు. నంగునూరు, దుబ్బాక, అక్బర్పేట–భూంపల్లి, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, చేర్యాల, కొమురవెల్లి, రాయపోలు, దూల్మిట్ట, మద్దూరు మండలాలు ఉన్నాయి. పట్టు కోసం కసరత్తు బరిలో నిలిచే అశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ విడతలో ఏ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయో తేలడంతో అశావహులు ఇప్పటికే కార్యకర్తలు, యువజన, మహిళా, కుల సంఘాల నేతలతో సమావేశాలవుతున్నారు. తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే పల్లెలో తిరుగుతూ పట్టును మరింత పెంచుకుంటున్నారు. పల్లెల్లో సందడి నెలకొంది.ఏర్పాట్లలో ఆశావహులు మూడు విడతల్లో ‘పంచాయతీ’ -
పశువైద్యాధికారిపై వేటు
నూతనంగా కొండల్రెడ్డి నియామకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా ఇన్చార్జి పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారిగా కొండల్రెడ్డిని నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ సూపరింటెండెంట్ పూర్ణిమ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగపూర్ణచందర్రావు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర అంశాలపై వరుసగా సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారించి నాగపూర్ణచందర్రావును బాధ్యతల నుంచి తొలగించారు. ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేసి, కోడ్ ముగిసిన తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ ‘విద్య నా హక్కు. బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం’ అని నినాదంతో ముందుకు వెళదామన్నారు. గత ప్రభుత్వం హయాంలో మూసివేసిన ఆరు వేల పాఠశాలలను తెరిపించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులను విద్య కోసం కేటాయించాలన్నారు. కవికి కీర్తి రత్న పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవులు బస్వరాజ్కుమార్, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు, తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్రావుకు ఆహ్వానం సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియా పరిధిలో రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగే దసరా వేడుకలకు హాజరుకావాలని ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే హరీశ్రావును కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లు గూర్చి అరా తీశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వార్డు ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. జోరు తగ్గని మంజీరాపాపన్నపేట(మెదక్): మంజీరా నది వరదలు సోమవారం సైతం కొనసాగుతున్నాయి. ఘనపురం అనకట్టపై నుంచి సుమారు 1.06 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవిహిస్తోంది. దీంతో దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. అయితే ఎల్లాపూర్ బ్రిడ్జి, ఏడుపాయల బ్రిడ్జిపై నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. -
స్థానిక సమరమే..
కోడ్ కూసె.. పోరు ఎగిసెపల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో బరిలోకి దిగాలని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు దసరా పండుగల సందర్భంగా విందులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. – సిద్దిపేటజోన్ -
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం ● వైభవంగా ‘మూల’ మహోత్సవం ● లక్ష పుష్పార్చన, మహా పుస్తకపూజ ● భారీగా చిన్నారులకు అక్షరాభ్యాసాలువర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. పూర్ణకుంభస్వాగతం క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభిషేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.3,000పైగా అక్షర స్వీకారాలు మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● అక్టోబర్ 23, 27తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ ● నవంబర్11న ఓట్ల లెక్కింపు,ఫలితాలు విడుదల ● మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్.. అదే రోజు ఫలితాలు
జిల్లాలోని గ్రామ పంచాయతీ(సర్పంచ్), మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ జరుగనుంది. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు నవంబర్11న విడుదల కానున్నాయి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలను అక్టోబర్ 31, నవంబర్4, 8 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలను పోలింగ్ రోజనే జరిగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. జెడ్పీటీసీ 26, ఎంపీటీసీ 230.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలతో పాటు 508 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 4508 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంసిద్ధమై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఈనెల 27న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ గెజిట్ జిల్లా యంత్రాంగం అధికారికంగా విడుదల చేసింది. విడతల వారీగా ఎన్నికలు.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను అక్టోబర్ 23, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 15మండలాల్లో, రెండో విడతలో 11 మండలాల వారీగా ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. 508 పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ వారీగా ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. 23, 27 తేదీల్లో పోలింగ్.. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు.. మొదటి విడత షెడ్యూల్ అక్టోబర్ 9న ఓటర్ల జాబితా, 11న అభ్యర్థుల నామినేషన్ తుది గడువు, 15న అభ్యర్థుల తుది జాబితా విడుదల, అక్టోబర్ 23న ఉదయం7నుంచి సాయంత్రం5 వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది. అదేవిధంగా రెండో విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న ఓటర్ల జాబితా విడుదల, 15 నామినేషన్ దాఖలు చివరి గడువు, 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 27న పోలింగ్ జరగనుంది. మూడు విడతల్లో.. జిల్లాలోని 508 సర్పంచ్, 4,508 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ పోలింగ్, అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి. ఈ క్రమంలో మొదటి విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న, రెండో విడత 21న, మూడో విడత 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించనున్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు: కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, పంచాయతీ అధికారి దేవకీదేవి, డీఆర్డీఓ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణులకూ రిజర్వేషన్లు కల్పించాలి
హుస్నాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే, విశ్వబ్రాహ్మణుల జనాభా ప్రకారం 5 శాతం సీట్లు తమకు కేటాయించాలని విశ్వనాథుల పుష్పగిరి డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయాల్లో తమ వంతు వాటా దక్కాలనే డిమాండ్తో ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం హుస్నాబాద్కు చేరుకుంది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర 13 రోజులుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాజకీయాలలో ఎదిగితేనే జాతి మనుగడ సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సదానందం, కార్యదర్శి శ్రీనివాస్, మనుమయ సంఘం అధ్యక్షుడు సదానందం, సుదర్శనంచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతి మాతగా విజయదుర్గ
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఎనిదవ రోజున అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ మాతగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేబతుకమ్మకు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతీ తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ విశిష్టతలను పెంచుతున్నారన్నారు. బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దుర్గా మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశామన్నారు. -
పూల సింగిడి.. సద్దుల సందడి
● పల్లెపల్లెనా పూల పులకింత ● ఘనంగా బతుకమ్మ వేడుకలు ● ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలుజిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా పూలజాతర కనువిందు చేసింది. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఆడిపాడిన మహిళలు, యువతులు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని సద్దులను ఆరగించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వివిధ కాలనీలలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖల అఽధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ఊరెళ్తున్నారా?.. జర భద్రం
తీసుకోవాల్సిన జాగ్రత్తలుసిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సెలవులు వచ్చాయి. వివిధ రకాల పనులు, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, పట్టణాల్లో స్థిరపడ్డారు. వరుస సెలువల నేపథ్యంలో పట్టణాల నుంచి తమ సొంత ఊర్ల బాట పట్టారు. ఇలాంటి సమయంలోనే దుండగులు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలో తాళం వేసిన షెటర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంటికి తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం, నగదు ఇంట్లో ఉంచకూడదు పండుగ సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తే.. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఉంచకూడదు. బ్యాంకు లాకర్లో భ్రదపర్చుకోవడం ఉత్తమం. పగటి సమయంలో గుర్తు తెలియని దుండగులు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, టార్గెట్ చేసుకుని ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు తాళం వేసిన ఇళ్లు, దుకాణాల షెటర్లు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి వెళ్తే అప్రమత్తంగా ఉండాలి సమాచారం ఇవ్వాలి పండుగల సెలవుల వేళ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరుస సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి ఊరెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. – సీహెచ్ కుశాల్కర్, అదనపు డీసీపీ అడ్మిన్ రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం వరుస సెలవుల నేపథ్యంలో పట్టణంలో, కాలనీల్లో రాత్రి వేళల్లో బ్లూకోల్ట్ సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. అనుమానాస్పద వ్యక్తులను ఫింగర్ ఫ్రింట్ డివైజ్తో పరిశీలించనున్నాం. ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా పండగను జరుపుకోవాలి. – వాసుదేవరావు, సిద్దిపేట వన్ టౌన్ సీఐ -
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం మహాలక్ష్మి స్వరూపిణిగా.. విద్యుద్దీపాల వెలుగుల్లో వర్గల్ క్షేత్రంవర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి స్వరూపిణిగా దర్శనం ఇచ్చారు. ఉదయం 6 గంటలకు క్షేత్రం నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు లక్ష పుష్పార్పన చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి గజ్వేల్రూరల్: అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎళ్లప్పుడూ ఉండాలని నాచారం క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామివారు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో అమ్మవారు శాంభవిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదనానంద సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కొంత సమయం దైవచింతనకు కేటాయించాలన్నారు. సామూహిక కుంకుమార్చన నంగునూరు(సిద్దిపేట): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహచండీగా దర్శనమిచ్చారు. బద్దిపడగలో వీరసావర్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. -
గొప్ప పండుగ
బతుకమ్మ చాలా గొప్ప పండుగ. పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లల్లో సంబరమే. నాకు 80 ఏళ్లు. అయినా ప్రతి ఏటా తప్పకుండా బతుకమ్మను పేరుస్తా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పాను. 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా. – బిల్ల సరోజన, దుబ్బాక ఘనంగా నిర్వహిస్తాం సద్దుల బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తాం. పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇళ్లన్నీ సందడితో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సంతోషాన్ని నింపుతుంది. – ఎర్రగుంట సుజాత, కవయిత్రి లచ్చపేట పోటాపోటీగా పేర్చేటోళ్లం మేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను పోటీపడి పెద్దగా పేర్చేటోళ్లం. పండుగకు ఒక రోజు ముందే అడవికి వెళ్లి గునుగు పువ్వు కోసుకొచ్చేవాళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. – స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు -
పెంపుడు జంతువులపై అప్రమత్తత అవసరం
జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి పూర్ణచందర్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పెంపడు జంతువుల పట్ల అప్రమత్తతంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అఽధికారి పూర్ణచందర్రావు అన్నారు. ప్రపంచ రేబీసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పెంపుడు జంతువులకు వ్యాధులు సంక్రమించినపుడు తప్పనిసరిగా చికిత్స చేయించాలన్నారు. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల వద్ద సిబ్బంది చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. -
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొనుగోళ్లదారులతో కిటకిటలాడుతున్న సిద్దిపేట పట్టణంలోని సుభాష్రోడ్డు ఊరూరా పూలవనాలు.. ఉవ్వెత్తున సంబురాలుబతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఎటు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే దేవతగా కొలిచే అరుదైన ఈ పండుగలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా మహిళలు, ఆడపడుచులు పాల్గొంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ సంబరాలు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన ఈ ఉత్సవాలలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. –ప్రశాంత్నగర్(సిద్దిపేట)/దుబ్బాకఆటపాటలతో హోరెత్తుతున్న పల్లెలు, పట్టణాలు నేడే సద్దుల బతుకమ్మ -
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గడువు లేదు
జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ప్రశాంత్నగర్( సిద్దిపేట): వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువును ప్రభుత్వం విధించలేదన్నారు. సెప్టెంబరు 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వాహనదారులు నమ్మవద్దన్నారు. మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్జి జస్టిస్ సాధన, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకిలో నాకాబందీ బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి –కల్లెపెల్లి రోడ్డులో ఎస్ఐ సౌజన్య ఆధ్వర్యంలో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు పరిశీలించారు. నిబంధన లు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. గణేశ్కు నిఫా పురస్కారం తొగుట(దుబ్బాక): అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిఫా (నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ జిల్లా స్థాయి అవార్డును మండల పరిధిలోని వెంకట్రావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త బండకాడి గణేశ్ అందుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచి ఆదివారం కరీంనగర్లో అందుకున్నారు. గణేష్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన నిఫా రాష్ట్ర అధ్యక్షుడు యాదవ రాజుతో పాటు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బోర్డులే దర్శనం.. మైదానాలు నిరుపయోగం
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక, సరైన వసతులు లేక బోర్డులకే పరిమితమయ్యాయి. ముళ్ల పొదలు, చెత్తా చెదారంతో దర్శన మిస్తున్నాయి. దీంతో లక్షల నిధులు వృథాగా అయ్యాయి. కొన్ని క్రీడా ప్రాంగణాల్లో వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో క్రీడా సామగ్రి కనిపించక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేన్లు ఖరారుసాక్షి, సిద్దిపేట: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడింది. జిల్లాలోని సర్పంచ్లు 508, ఎంపీటీసీలు 230, వార్డు సభ్యులు 4,508, జెడ్పీటీసీలు 26లకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. శనివారం జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లను కలెక్టరేట్లో, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎదుట 50శాతం మహిళలకు సంబంధించిన డ్రాను తీశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఏమి ఉండబోతున్నాయో అని ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీసీలకు 11 జెడ్పీటీసీలు జిల్లా వ్యాప్తంగా 26 జెడ్పీటీసీలు, ఎంపీపీలుండగా అందులో 11 బీసీలు, ఎస్సీలకు 5, అన్ రిజర్వ్ 9, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. జనరల్కు 15, మహిళలకు 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు అన్ రిజర్వ్కు 9 కేటాయించగా జనరల్కు 5, మహిళలకు 4, బీసీలకు 11 కేటాయించగా జనరల్కు 6, మహిళలకు 5, ఎస్సీలకు ఐదు కేటాయించగా జనరల్ 3, మహిళలకు 2, ఎస్టీ జనరల్కు కేటాయించారు.పలువురికి నిరాశ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పలువురు రాజకీయ నాయకులు నిరాశ చెందారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకున్నారు. పలువురు ఆశావహులకు రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో డైలామలో పడ్డారు. గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పట్టుసాధించుకున్న నేతలు.. రిజర్వేషన్లు తారుమారు కావడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే కొన్ని మండలాల్లో కొత్త లీడర్లు, వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడమే మిగిలి ఉంది. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్ సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో 11 మండలాల్లో గెలిచే జెడ్పీటీసీలలో ఒక్కరికి చైర్మన్ దక్కే అవకాశం ఉండనుంది. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలుసిద్దిపేటరూరల్: జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి మహిళల ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకై క పండగ బతుకమ్మ పండగ అని కలెక్టర్ చెప్పారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగస్లుఉ సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కాగా, బతుకమ్మ పండుగ విశిష్టతపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించిన ఇ.సాయి సంతోషి, డి.సృజన, జి.మనస్వినిలకు, షార్ట్ ఫిలిం కాంపిటేషన్ విజేత గిరిబాబులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ హబ్గా సిద్దిపేట
గజ్వేల్: ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా హబ్గా మారబోతుంది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం కొత్తగా ప్రారంభమైన సాగును క్రమంగా విస్తరించుకుంటూ సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును పెంచేందుకు కేంద్రం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్పామ్(ఎస్ఎంఈఓ) పథకంలో భాగంగా నాలుగేళ్లల్లో తెలంగాణ 1,25,300 హెక్టార్ల సా గు లక్ష్యానికి తెలంగాణ ఇప్పటివరకు 78,869 హెక్టార్లకుపైగా లక్ష్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో సాగు పెరుగుతూ వస్తున్న జిల్లాల్లో సిద్దిపేట తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. గడిచిన ఐదేళ్లల్లో ఇక్కడ 12,350 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులోకి వచ్చింది. జిల్లాలోని నర్మెటలో మాజీ మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా రూ.300 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తికాగా, ప్రస్తుతం క్రషింగ్ను ట్రయల్ చేస్తున్నారు. దీని కారణంగా రాబోవు రోజుల్లో జిల్లాలో ఆయిల్పామ్ మరింతగా పెరగనున్నది. నర్మెటలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఆయిల్పామ్ సాగు సమీప జిల్లాలో విస్తరించడానికి అడుగులు పడ్డాయి. ఇంతకాలం మార్కెటింగ్ సౌకర్యాలు సక్రమంగా లేక, సాగుకు వెనుకంజ వేసిన రైతులు ఆయిల్పామ్ సాగును పెంచుకునే అవకాశం కలిగింది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో నిత్యం 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగివున్నది. ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్కు అవకాశమున్నది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి యంత్ర సామగ్రి ఇప్పటికే అమర్చారు. ఈ అంశంపై సిద్దిపేట జిల్లా ఉద్యానవనశాఖాధికారి సువర్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఆయిల్పామ్ సాగుకు సంబంధించి హబ్గా మారే అవకాశమున్నదని చెప్పా రు. జిల్లాలోని రైతులకు ఈ సాగు కొత్తయినా, ఏటా ఈ పంటను సాగుచేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. గణనీయంగా పెరుగుతున్న సాగు -
ఐటీఐలో కొత్త కోర్సులు
● కలెక్టర్ హైమావతి ● అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధునాతన సాంకేతిక కేంద్ర (ఏటీసీ) బోధన తీరులను శనివారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి తే విజయం సాధిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తు న్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. మారుతున్న కాలంతో సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని చెప్పారు. ఐటీఐలో కొత్త కోర్సులను చేర్చి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, విద్యార్థులు చెక్కపై మిషన్తో బొమ్మలు తయారు చేసిన తీరు లను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపల్ రమణ పాల్గొన్నారు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్లో వైద్య సేవ లందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించి వైద్యం అందుతున్న తీరులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 2 వరకు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్ వైద్య సేవలందిస్తామన్నారు. పీహెచ్సీ పరిధిలో ఇప్పటి వరకు 85 మందికి పైగా మహిళలకు వైద్యం అందించామంటూ వైద్యులు శ్రీధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ధాన్యం కొనుగోలుకు సమగ్ర ప్రణాళిక
● జిల్లా లక్ష్యం 5.03లక్షల మెట్రిక్ టన్నులు ● రైతులకు ఇబ్బందులు కలుగొద్దు ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలతో యంత్రాంగం ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. వరి ధాన్యం కొనుగోళ్లు–మద్దతు ధర తదితర అంశాలపై శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో వానాకాలం 2025–26 కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3,29 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లకు పోను 5.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం మద్దతు ధర క్వింటాలుకు రూ 2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ 2,369 ప్రభుత్వం ధర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లినర్, వేయింగ్ స్కెల్, తేమ పరీక్ష మిషన్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో పెద్ద కొనుగోలు కేంద్రాలకు ఆటోమేటిక్ ప్యాడి క్లినర్లను ఇస్తామన్నారు. ప్రభుత్వ బోనస్ రూ 500అదనంగా చెల్లింపు ఉంటుందన్నారు. నిర్దేశించిన లక్ష్యం ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగ్లను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడా హమాలీలు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ తనూజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డిఎం సివిల్ సప్లై,, ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
సిద్దిపేట సీపీగా విజయ్కుమార్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ బదిలీ అయ్యారు. నూతన పోలీసు కమిషనర్గా ఎస్ఎమ్ విజయ్కుమా ర్ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ను సిద్దిపేట నూతన సీపీగా నియమిస్తూ, ఇప్పటి వరకు సిద్దిపేట సీపీగా కొనసాగిన అనురాధను ఎల్బీ నగర్ డీసీపీగా నియమించారు. పండుగలు సంస్క ృతికి ప్రతీకలుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని శ్రీ దేవి నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాతను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావనతో పాటు సామాజిక సేవను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్రెడ్డి, జిల్లా నాయకులు సూకూరి లింగం, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ కో అప్షన్ మెంబర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ భైరయ్యపాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీకి నివాళిసిద్దిపేటకమాన్/ ప్రశాంత్నగర్(సిద్దిపేట): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బాపూజీ విగ్రహానికి కలెక్టర్ హైమావతి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, తదితరులు పాల్గొన్నారు. అలాగే.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పాల్గొన్నారు. బాపూజీ బాటలో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ కోదండరాం ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ బాపూజీ అంకిత భావం స్ఫూర్తిగా సమాజ సేవకు యువత నడుం బిగించాలని ప్రొఫెసర్ ఎం.కోదండరాం పిలుపు నిచ్చారు. ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బాపూజీ జీవితం, రాజకీయ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ఉద్యాన వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్.దండా రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
దుబ్బాకటౌన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఐఓసీ కార్యాలయంలో ఉదయం అక్బర్పేట భూంపల్లి, మధ్యాహ్నం వివిధ మండలాల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జహీరోద్దిన్, ఎంపీఓ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి, రవీందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. సర్వేకు సహకారం అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): పంటల సర్వేకు రైతులు సహకరించాలని ఏడీఏ మల్లయ్య కోరారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సాగైన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ల ప్రకారం పంటలు వివరాలు నమోదు చేయాలన్నారు. దీనివల్ల దిగుబడిని విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటా యని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, ఏఈఓ సాయి కుమార్, రైతులు పాల్గొన్నారు. చెరువు కట్టకు మరమ్మతులు గజ్వేల్రూరల్: మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామంలోగల లక్ష్మీదేవి చెరువుకట్టకు గండిపడే అవకాశం ఉండడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ సుశాంత్ పర్యవేక్షణలో శుక్రవారం చెరువుకట్టపై మట్టి పో యించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడితే సుమారు 200 ఎకరాల పరిధిలోని పంటలు నీటమునిగే ప్రమాదముంటుందన్నారు. వారం రోజుల క్రితం చెరువుకట్ట పొలాలవైపు కుంగిపోతున్నట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టా మని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం మద్దూరు(హుస్నాబాద్): సీజనల్ వ్యాధులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ సూచించారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో నిర్వహించిన స్వస్థ్ నారి సశక్తి అభియాన్ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాధుల సోకిన వారు వెంటనే వైద్యులను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్వర సేవలందించడమే లక్ష్యం వర్గల్(గజ్వేల్): ఖాతాదారులకు సత్వర సేవలందించడమే తమ లక్ష్యమని గౌరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సీహెచ్ మాతాజీ అన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్లో భాగంగా ఐకేపీ పర్యవేక్షణలో ఏర్పాటైన ఐదు స్వయం సహాయక వృద్ధుల సంఘాలకు శుక్రవారం బ్యాంకు ఖాతాలు తెరిపించి పాస్ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో పాములపర్తి సీసీ పద్మలత, మహిళలు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా గోపి హుస్నాబాద్: మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా మాటూరి గోపి ఎన్నికయ్యారు. డీలర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం గోపి, యాదగిరి పోటీపడ్డారు. ఒక్క ఓటు తేడాతో మాటూరి గోపి ఎన్నికై నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. కార్యదర్శిగా గూళ్ల మంగ, కోశాధికారిగా మల్లేశం ఎన్నికయ్యారు.