Siddipet District Latest News
-
హైందవ ధర్మం కోసం పాటుపడాలి
మాట్లాడుతున్న సునీతారెడ్డి. చిత్రంలో శివాచార్య స్వామిజీజహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.వీహెచ్పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి -
అంజన్న దయతో కాళేశ్వరం జలాలు
సిద్దిపేటజోన్: విజయవాడ కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం తరహాలో సిద్దిపేట గోదారి నీటిలో ఘనంగా హనుమాన్ తెప్పోత్సవం జరగడం ఆనందంగా ఉందని, సిద్దిపేట తెప్పోత్సవానికి నెలవుగా మారిందని ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోమటిచెరువులో వైభవంగా హనుమాన్ తెప్పోత్సవం నిర్వహించారు. అంతకుముందు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ విగ్రహప్రతిమతో చెరువులో కలియ తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హనుమాన్ మాల ధారణ విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ తెప్పోత్సవం భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అంజన్న దయతో సిద్దిపేటకు కాళేశ్వరం ద్వారా గోదారి నీరు వచ్చిందన్నారు. సమష్టి కృషితోనే 22 అవార్డులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చా యని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు కోమటిచెరువులో ఘనంగా తెప్పోత్సవం -
ఇక వినతులకు సులువే..
సిద్దిపేటజోన్: ప్రజావాణిలో సమస్యలపై ఫిర్యాదు ప్రక్రియ ఇక సులభతరంగా మారనుంది. ప్రజలకు మరింత చేరువగా చేసే పనిలో భాగంగా జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ప్రజావాణిలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లో మాత్రమే అర్జీలు స్వీకరించేవారు. కొత్త నిబంధనల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కలెక్టర్ హైమావతి జారీ చేశారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు మున్సిపాలిటీలు, 26 మండలాల్లో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా ప్రాంతానికి చెందిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసింది. ప్రతి వారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలు సమర్పించేవారు. ఈ లెక్కన 90నుంచి 150వరకు వివిధ అంశాలపై దరఖాస్తులు వచ్చేవి. కలెక్టరేట్లో మాత్రమే ఉన్న ప్రజావాణి ప్రక్రియను మరింత విస్తృత పరిచేందుకు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నారు. భూముల సమస్యలు, పింఛన్లు, ఇంటి మంజూరు, ఉద్యోగం తదితర అంశాలపై అర్జీలు అధికంగా వస్తున్నాయి. కొన్ని మండలం, రెవెన్యూ స్థాయిలో ఉండే సమస్యలపై కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రజలకు ఫిర్యాదు ప్రక్రియ సులభంగా మార్చేందుకు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ప్రజావాణిని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం ఉదయం10గంటల నుంచి ఆయా డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజావాణిలో అర్జీలు స్వీకరించనున్నారు. దీని వల్ల సుదూరంగా ఉండే జిల్లా కేంద్రానికి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వెళ్లే ప్రయాస తగ్గుతుంది. ఎక్కడికక్కడ అర్జీలు అధికారులకు ఇచ్చే వెసులుబాటు కల్గనుంది. సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. డివిజనల్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆయా డివిజన్ ప్రజలు ఆర్డీఓ ఆఫీస్లోని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం మరింత చేరువగా ప్రజావాణి జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ఏర్పాటు ఎక్కడికక్కడ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి జిల్లాలో అమలు -
ధాన్యం వర్షార్పణం
హుస్నాబాద్: వడగండ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. చేతికందిన పంట వర్షం పాలు కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కొద్ది సేపు కురిసిన రాళ్ల వర్షంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఽరైతులు ఆరబెట్టిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు దిగాలు చెందారు. మార్కెట్ యార్డులో గ్యాప్ లేకుండా ధాన్యం రాశులు నిండిపోయాయి. మండుతున్న ఎండలకు ధాన్యం మ్యాచర్ వచ్చినా నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేదని రైతులు వాపోయారు. వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. వారం రోజుల నుంచి గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా, ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందారు. మరికొంత మందికి గన్నీ బ్యాగులు ఇచ్చినా కాంటాలు పెట్టకుండా వదిలేశారని తెలిపారు. టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఎండలే ఉన్నాయని ఇప్పుడెందుకు అంటూ నిరాకరించారని చెప్పారు. రోజుల తరబడి మార్కెట్లోనే ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నా... చెడగొట్టు వానతో నిండా ముంచిందని వాపోయారు. రవాణా సౌకర్యం లేకపోవడం, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా పెట్టి మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యమంతా నీళ్ల పాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందు, కౌన్సిలర్ రవీందర్ పరిశీలించారు.తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న రైతులువడగండ్లతో రైతులకు కడగండ్లు అకాల వర్షంతో ఆవిరైన అన్నదాతల ఆశలు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
మద్దూరు(హుస్నాబాద్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని, రైతులను ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని సలాఖపూర్ గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. సెంటర్లో ప్యాడీ క్లీనర్లు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించాలన్నారు. మిల్లుల్లో జాప్యం కాకుండా ఒక సెంటర్కు రెండు లేదా మూడు మిల్లులను కేటాయించాలని సివిల్ సప్లయి అధికారులను ఆమె ఫోన్లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
వడ్లకు చోటేదీ...?
గజ్వేల్: వడ్ల కొనుగోళ్లకు మరో కష్టం వచ్చిపడింది. పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డు లు నిండిపోయాయి. దీంతో వడ్లకు చోటు లేకుండా పోయింది. జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వరిధాన్యం ఉత్పత్తులు పోటెత్తుతుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యాసంగికి సంబంధించి జిల్లాలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం 5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఉత్పత్తులు కొనుగోళ్లకు రానున్నాయి. 422 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ అధ్వర్యంలో 214, సహకార సంఘాల ఆధ్వర్యంలో 202, మెప్మా ఆధ్వర్యంలో మరో 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ యార్డుల ఫుల్ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, బెజ్జంకి, హుస్నాబాద్, మిర్దొడ్డి, చిన్నకోడూరు మార్కెట్ యార్డులు పొద్దుతిరుగుడు రాశులతో నిండిపోయాయి. ఎన్నో అశలతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులు.. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా కేంద్రాల్లో కొద్ది రోజులు మాత్రమే కొనుగోళ్లు సాగాయి. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ముగిసిందనే పేరుతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,800 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 18వ తేదీ నుంచే కేంద్రాలను మూసేశారు. ఫలితంగా ఆయా యార్డుల్లో ఇంకా 3,500 టన్నులకుపైగా పొద్దుతిరుగుడు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ నిల్వల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు వస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నా..ఫలితం లేకుండా పోతుంది. దీంతో రైతులు ఆయా మార్కెట్ యార్డుల్లో నెలకుపైగా నిరీక్షణలో ఉన్నారు. ఇప్పటికై నా వీటి కొనుగోలు జరుగుతుందా...? లేదా అనేది అనుమానంగా ఉన్నది. పొద్దుతిరుగుడు ఖాళీ అయితేనే.. పొద్దు తిరుగుడు కొనుగోళ్లు జరిగి...అవి ఖాళీ అయితేనే అయా మార్కెట్ యార్డుల్లో వడ్ల కొనుగోళ్లకు అవకాశం కలగనుంది. ఇప్పటికే వరిధాన్యం మార్కెట్ యార్డులకు పోటెత్తుతున్నది. షెడ్లలో ఖాళీ లేక... రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఆరుబయటే పోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా అదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వడగండ్ల వానకు వరి ధాన్యం తడిసి ముద్దయిన ఘటన ఆందోళన కలిగిస్తున్నది.పొద్దు తిరుగుడు రాశులు ఖాళీ చేయిస్తాం పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు తేదీని పొడగించే అవకాశమున్నది. రాగానే వారంలో కొనుగోళ్లను పూర్తి చేసి మార్కెట్ యార్డులను ఖాళీ చేయిస్తాం. దీనిద్వారా వడ్ల కొనుగోళ్లకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – మార్క్ఫెడ్ డీఎం సునీత పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డులు ఫుల్ కొనుగోలు తేదీ పొడిగింపు రాక ఈ దుస్థితి అవి ఖాళీ అయితేనే... వడ్ల కొనుగోళ్లకు అవకాశం నిరీక్షణలో పొద్దుతిరుగుడు రైతులు -
‘నీట్’గా రాశారు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షకు 937 మంది అభ్యర్థులకు గాను 916 మంది హాజరయ్యారు. 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్, నీట్ పరీక్షల నోడల్ అధికారి పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో నీట్ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. అధికారుల ముందస్తు సూచనలతో అమ్మాయిలు తమ బంగారు ఆభరణాలను తల్లిదండ్రులకు ఇచ్చారు. గాజులు లేకుండానే పరీక్షకు హాజరయ్యారు. సాధారణ దుస్తులకు అనుమతి లేకపోవడంతో టీషర్ట్, ప్యాంట్లు ధరించాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. జిల్లా కేంద్రం పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన అమ్మాయి 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు రావడంతో అప్పటికే గేటు మూసివేశారు. సిబ్బంది పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశగా వెను తిరిగింది.చెవి కమ్మలు, ముక్కు పొడకలను తొలగిస్తున్న తల్లి 21 మంది గైర్హాజరు క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ హైమావతి -
మల్లన్న ఆలయంలో భక్తుల రద్ధీ
టేక్మాల్(మెదక్): భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన వీరభద్రుడి కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ అవినాష్, వైస్ చైర్మన్ ఈశ్వరప్పతో పాటు పలువురు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. కాగా బోడ్మట్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి టాపర్గా నిలిచిన విద్యార్థిని వైష్ణవిని మంత్రి దామోదర సన్మానించి అభినందించారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
గజ్వేల్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మంత్రి హరీశ్రావు సమక్షంలో గజ్వేల్ మండలం అక్కారం కాంగ్రెస్ నాయకులు సింగర్ ఎల్లంతోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, బాల్చంద్రం, నాయకులు పాల్గొన్నారు. -
గౌరవెల్లి ప్రాజెక్టు బాధ్యత నాదే
● త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తాం ● కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తనదే బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలో పేమెంట్ చేసి కాలువల నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మూర్తి ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. అంతకముందు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు రూ.128 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కులు, కల్యాణలక్ష్మి, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జూన్ 2 తర్వాత పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. హుస్నాబాద్లో హోల్సెల్ కూరగాయల ఏర్పాటు చేస్తామని, త్వరలో కబడ్డి అకాడమీ సైతం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీ సాధన రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో చేర్యాల జడ్జికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని చేర్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లికి సీపీ పూజలుహుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. శనివారం సీపీ రష్మీ పెరుమాళ్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, అమ్మవారి విశిష్టత, జాతర కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు జెడ్పీ సీఈఓ రమేశ్ దుబ్బాక: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని జెడ్పీ సీఈఓ,స్పెషల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల మహిళా సమాఖ్యలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.194.89 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు.. అండగా ఉంటా
● ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు పోరాటం ● నిరుద్యోగ యువతతో మాజీ మంత్రి హరీశ్సిద్దిపేటజోన్: ‘ఆందోళన వద్దు.. మీకు అండగా ఉంటా.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు ఊరుకునేది లేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ గురించి వివరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. అనంతరం నిరుద్యోగ యువతతో కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చేపడుతున్న యాత్రపై అడిగి తెలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ప్రతినిధులను అభినందించారు. విలీనం అయ్యాకే రంగధాంపల్లి అభివృద్ధి ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని రంగధాంపల్లి మున్సిపాలిటీలో కలిశాకే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంగధాంపల్లిలో శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం ప్రాంగణం లో నిర్మించిన అన్న ప్రసాద భవనాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మాలధారులతో కలిసి భోజనం(భిక్ష) చేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట అన్నదానాలకు, ఆధ్యాత్మికతకు నెలవుగా మారిందన్నారు. హనుమాన్ దీక్షకు, భిక్ష కు బీజం వేసింది మన సిద్దిపేటనేన్నారు. -
రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని సభ నేపథ్యంలో శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని సభకు ప్రతి మండలం నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్ రావు -
ఆదేశాలు రాలేదని చెబుతుండ్రు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 18 రోజులవుతోంది. తొమ్మిది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నాతోపాటు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంది. – రేణికుంట వెంకటేశ్, రైతు, రాఘవాపూర్కొనుగోళ్లు సాగుతున్నాయికొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ధాన్యంలో తాలు లేకుండా చూడాలని రైతులను కోరుతున్నాం. ధాన్యం డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 15 రోజులు అవుతుంది. కేంద్రం ప్రారంభించి పది రోజులైనా ఇప్పటికీ గింజ ధాన్యం కూడా కొనలేదు. అధికారులను అడిగితే ఇంకా ఆదేశాలు రాలేదని సమాధానం చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తాలు తీసే మిషిన్లు లేవు. హమాలీ కార్మికులు కూడా అందుబాటులో లేరు. గన్ని సంచులకూ దిక్కులేదు. – చెరుకూరి మల్లేశం, రైతు, మల్లాయిపల్లి, దుబ్బాక -
సాగని కొనుగోళ్లు..ఆగని కన్నీళ్లు
సాక్షి, సిద్దిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 20 రోజుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఽవాతావరణ మార్పులతో వర్షాలు కురవచ్చన్న బెంగ రైతుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 3.73లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 421 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,100 మంది రైతుల నుంచి 25,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకపోయాయి. ఇప్పటి వరకు రూ.30 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.6.44కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా దాదాపు రూ.13.56కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కొంత మేరకు తాలుతోనే ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్యాడి క్లీనర్ల ద్వారా ఎంత జల్లి పట్టినా అలాగే ఉంటుందని, పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఽకూలీల కొరతతో జల్లి పట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హమాలీలు, లారీల కొరత తో సైతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. 18 రోజులుగా పడిగాపులు ధాన్యం అమ్మేందుకు కర్షకుడి కష్టాలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పలుచోట్ల రోడ్డెక్కుతున్న రైతులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 25వేల మెట్రిక్ టన్నులే..ధాన్యం రాశులు ఉన్న ఈ దృశ్యం.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటికీ తొమ్మిది రోజులవుతున్నా ఒక్క గింజనూ కొనుగోలు చేయలేదు. 60 మందికి పైగా రైతులుకొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఉంచారు. దాదాపు 300 టన్నుల ధాన్యం రాశులు పేరుకపోయాయి. అకాల వర్షాలు కురిస్తే అంతా ఆగమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులవుతున్నా కొంటలేరు దుబ్బాక మార్కెట్ యార్డులో వడ్లు పోసి 20 రోజులవుతోంది. వడ్లు ఎండి 12 శాతం తేమ వస్తోంది. అయినా కాంటా పెట్టడం లేదు. బి గ్రేడ్ అయితేనే కొంటామంటూ అధికారులు చెబుతున్నారు. ఎండల్లో నానాపాట్లు పడుతున్నాం. అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి. – వంగ శ్రీనివాస్రెడ్డి, చెల్లాపూర్ -
కొంటరా.. కొనరా..?
తాలు తీసి తీసుకురండి.. దుబ్బాకరూరల్: ధాన్యాన్ని తాలు తీసి తీసుకురావాలని చీకోడ్ మిల్లు యజమాని సతీశ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రాజక్కపేట ఎల్లాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీ లోడ్ వచ్చిందన్నారు. ధాన్యం బస్తాలను చెక్ చేయగా అంతా తాలు, దుమ్ముధూళి ఉందన్నారు. క్వింటాల్కు 5 కిలోలు కట్ చేస్తున్నారని, కొంత మంది పని గట్టుకుని రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.దుబ్బాకరూరల్: వరి పంట కోసి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కొనడం లేదంటూ రైతులు ఆగ్రహించారు. శనివారం మండలంలోని హబ్సిపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏ ఒక్క అధికారి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పాపాన పోవడంలేదన్నారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఐ రాజేశ్, ఎస్ఐ కీర్తిరాజ్ రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
ఇక ‘మధురమ్మ’ జ్ఞాపకమే..
తిమ్మాయిపల్లిలో శతాధిక వృద్ధురాలి మృతి నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. -
రాఘవాపూర్లో రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేటరూరల్: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. శనివారం మండల పరిధిలోని రాఘవాపూర్ వద్ద సిద్దిపేట– కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారం రోజులవుతున్నా నేటికీ ధాన్యం కొంటలేరని మండిపడ్డారు. పంటలు కోసి నెల రోజులు దాటుతున్నా కొనుగోళ్లు సాగడం లేదన్నారు. తాలు పట్టే ప్రక్రియలో జల్లి యంత్రాలు సరిగ్గా లేవని దీంతో సమయం వృథా అవుతోందన్నారు. తాలు పట్టే విధానం కాకుండా పాతపద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్ఐ రాజేష్లు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ రెహమాన్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. రెండురోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచులు పద్మ శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
దుబ్బాకలో ఉద్రిక్తత
దుబ్బాక: పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశంలోకి దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ మాట్లాడుతుండగా మైక్లు కట్ అయ్యాయి. రైతుల గురించి మాట్లాడుతుంటే కట్ చేస్తారా అంటూ ఆగ్రహంతో మైక్ను నేలకేసికొట్టారు. అనంతరం సభను బహిష్కరించి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బయటకొచ్చి గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు కష్టాలు పడుతుంటే సంబరాలా? ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్లపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాదని, రైతుల మధ్యకొస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. బీ గ్రేడ్ ధాన్యం కొంటామంటూ అధికారులు షరతులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. చివరి గింజకొనే వరకు రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు. -
వైభవంగా ఎల్లమ్మ కల్యాణం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంబాల పూజారులు అమ్మవారి కథను వినిపించారు. పంబాల కళాకారుల డప్పుకు మంత్రి స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని దివ్య కల్యాణం కనులపండువగా సాగింది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొత్తగా నియమించిన జాతర ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్ రావు, కౌన్సిలర్లు, గౌడ కులస్తులు, భక్తులు పాల్గొన్నారు.పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం -
నాచ‘గిరి’ ప్రదక్షిణం
ఆధ్యాత్మిక తరంగంగిరి ప్రదక్షిణలో భక్తజన సందోహంస్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. నృసింహ నామంతో మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. శుక్రవారం ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలయ ఉత్తర ద్వారం వద్ద ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. నాచగిరి కొండలు చుడుతూ, హరిద్రానది తీరం దాటుతూ, గోశాల మీదుగా ఉత్తరద్వారం వరకు కొనసాగిన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. – వర్గల్(గజ్వేల్) -
గుర్రాలగొందిని సందర్శించిన ట్రెయినీ డీపీఓలు
సిద్దిపేటరూరల్: నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామాన్ని ట్రెయినీ డీపీఓలు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో అమలవుతున్న గ్రామస్థాయి మంత్రివర్గ పనితీరు, రుతుప్రేమ, స్టీల్బ్యాంకు నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వంటి వాటిని అధికారులకు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ గ్రామ వార్డు సభ్యులు మంత్రివర్గం మాదిరిగా శాఖలను కేటాయించుకుని సమస్యలు పరిష్కరించుకోవడం బాగుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ డీపీఓ అనూష, సిద్దిపేట డీపీఓ వినోద్, జగిత్యాల ట్రెయినీ డీపీఓ రేవంత్, వనపర్తి ట్రైనీ డీపీఓ తరుణ్చక్రవర్తి, డీఎల్పీఓ చందన, ఎంపీఓ విష్ణు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధైర్యపడొద్దు ● ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదు ● సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పిల్లలను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చవద్దని వారిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఫలితాల తర్వాత పిల్లలు మౌనంగా ఉన్నా, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించాలని సూచించారు. ఓటమి అనేది తాత్కాలికమని, విద్యార్థులకు జిల్లా పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సహాయం కోసం ఏ సమయంలోనైనా సిద్దిపేట పోలీసు కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. కార్మిక చట్టాలపై అవగాహన అవసరం సిద్దిపేటరూరల్: కార్మిక చట్టాలపై అవగాహనతో పాటు హక్కులను కాపాడుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్ఓ నాగరాజమ్మ , అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్లు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రతీ కార్మికుడికి కనీస వేతనం అందేలా చూడడం, అదనపు వేతనం పొందే హక్కు, భద్రతా ప్రమాణాలు, భీమా సౌకర్యం తదితర పొందేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మిక కార్డు, ఈశ్రమ్ కార్డులను దరఖాస్తు చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను పొందాలన్నారు. కార్మిక ప్రయోజనాలు పొందేందుకు కార్మిక కార్యాలయాన్ని, మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అనంతరం కార్మిక చట్టాలు, ప్రయోజనాల వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధంబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని శుక్రవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. హార్వెస్టర్ నడిపిస్తుండగా బెల్ట్ నుంచి నిప్పు రవ్వలు రావడంతో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. ఈ సంఘటనలో కొండల్రెడ్డి, హనుమంతరెడ్డి, రాజయ్యలకు చెందిన మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా పంటలు అధిక శాతం కాలిపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా వేడుకున్నారు. -
తాలు తీసిన ధాన్యాన్నే కొంటాం
● కలెక్టర్ హైమావతి ● కొనుగోలు కేంద్రాల సందర్శనసిద్దిపేటఅర్బన్: తాలు తీసిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలలో కొంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి, తడ్కపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాడీ క్లీనర్ పనిచేయడం లేదని, తాలు తీయడం ఇబ్బంది అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రిపేర్ చేయించాలని మార్కెటింగ్ డీఎం నాగరాజును ఫోన్లో ఆదేశించారు. పాడీ క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో పరీక్షించాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం తేమశాతం రాగానే తాలు పట్టించాలని, తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో తాలు తీయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ జరిగే ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కేంద్రాలలో టెంట్, తాగునీరు, తాలు తీసే యంత్రాలు, కాంటాలు, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు పంటలు వరి సాగు చేసే రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోందని, అధునాతన కార్మాగారం అందుబాటులో ఉన్న దృష్ట్యా ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. -
ఆర్టీసీ కార్మికులకు వారధిగా ఉంటా
● బాధ్యతగా విధులు నిర్వహించండి ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు బాధ్యతను హక్కుగా భావించి విధులు నిర్వహించినప్పుడే సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. డిపో ఎదుట కార్మికులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తెచ్చామన్నారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చించి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా వారధిగా ఉంటానని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, ఏసీపీ సదానందం, డిపో మేనేజర్ వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన ఫలితాలు సాధించాం
● టాపర్స్కు త్వరలో ఐ ప్యాడ్స్ ● మాజీ మంత్రి హరీశ్రావు ● విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్సిద్దిపేటజోన్: ‘పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాం. అందరికీ అభినందనలు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన చిన్నకోడూరు మండల ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు. పదిలో ఉత్తీర్ణత సాధించిన మీ పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదివి, ఉన్నతంగా ఎదగాలి అనేది నా తాపత్రయం, నా ప్రయత్నం అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,874మంది విద్యార్థులు పది పరీక్ష రాయగా 2,791మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇదే పట్టుదలతో చదివి భవిష్యత్తుకు మంచి లక్ష్యం ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. అదేవిధంగా నంగనూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావు పేటలకు త్వరలో బెస్ట్ 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్స్ గిఫ్ట్గా ఇస్తానని, అదేవిధంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు. -
జీవించు.. జయించు
ధైర్యం వీడొద్దు.. ఆత్మస్థైర్యం మరవొద్దు సిద్దిపేటకమాన్: విద్యార్థుల అనాలోచిత నిర్ణయాల వల్ల విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ర్యాంకులు, మార్కుల విషయంలో తోటివారితో పోలికలు ఒత్తిడిలోకి నెడుతున్నాయి. విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. ర్యాంకుల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థుల బలవన్మరణాల ఫలితంగా రేపటి భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలవగానే తాము అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని, ఫెయిల్ అవుతామని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. పరీక్షలు మళ్లీ రాసి గెలవాలే గానీ క్షణికావేశంలో జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. మార్కుల పట్ల ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారి జీవితం అత్యంత ప్రాధాన్యమైనదని గుర్తించాలి. ‘చిన్న’కోడూరుకు ‘పది’ంతల కీర్తి ఆత్మహత్య పరిష్కారం కాదు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో క్షణికావేశంలో విలువైన ప్రాణాలు తీసుకోకూడదు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి. అంతేకాని అనాలోచిత నిర్ణయాల వల్ల జీవితాన్ని కోల్పోవద్దు. విద్యార్థులు ఏవరైనా ఒత్తిడికి లోనైతే తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకవస్తా. – డాక్టర్ శాంతి, మానసిక వైద్య నిపుణురాలు, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి -
ఈత ఇంపు.. కొలను కంపు
అధ్వానంగా సర్కార్స్విమ్మింగ్ పూల్ ● జిల్లా కేంద్రంలో రూ. కోట్లు వెచ్చించి నిర్మాణం ● అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం ● వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో 2016లో రూ.5కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈత కొలను నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్ను సైతం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడింది. కొన్ని రోజులు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యుజవన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్లు నిర్వహణ గాలికి వదిలేశారు. వేసవి కాలంలో, డబ్బులు వచ్చే సమయంలోనే ఓపెన్ చేసే వారు. తర్వాత మూసివేస్తున్నారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమన్వయ లోపం మున్సిపల్ పరిధిలో ఉండటంతో తమకు అప్పగిస్తే వినియోగంలోకి తీసుకువస్తామని కలెక్టర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులకు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. దీంతో మున్సిపాలిటీకి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో మరమ్మతులకు నోచుకోడం లేదు. పైగా రెండు శాఖల నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి త్వరగా మరమ్మతులు చేసి ఈ వేసవి కాలంలో అందుబాటులోకి తీసుకరావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. భానుడి భగభగలకు ఉపశమనం పొందాలని ఆశించే పట్టణ వాసులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు సిద్దిపేట లోని ఈత కొలను నిరాశే మిగులుస్తున్నది. మున్సిపల్, యువజన క్రీడల శాఖాధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. 8 నెలలుగాతెరుచుకోకపోవడంతోకంపుకొడుతోంది. మున్సిపాలిటీకి అప్పగించాం కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వారికి స్విమ్మింగ్ పూల్ బాధ్యతలను అప్పగించాం. ఈ మేరకు ఇదివరకే సంతకం చేశాను. విద్యుత్ బిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి. – శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి డీవైఎస్ఓ అప్పగించలేదు జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఈత కొలను ఉంది. కొలను నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని లేఖ రాశాం. ఇంకా అప్పగించలేదు. మా ఆధీనంలోకి రాగానే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీస్తాం. – ఆశ్రిత్ కుమార్, కమిషనర్, సిద్దిపేట పురపాలక సంఘంఅంతా చెత్తాచెదారం ఎనిమిది నెలలుగా స్విమ్మింగ్ పూల్ను తెరవకపోవడంతో దుర్వాసన వస్తోంది. వర్షపు నీళ్లు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎయిర్ బాల్స్ గొలుసు తెగిపోయింది. మోటార్లు పాడయ్యాయి. కొలను ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ప్రైవేట్ పూల్స్ కోసమే ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
గణితంలో గ్రహపాటు
● పదో తరగతిలో 401 మంది ఫెయిల్ ● అధికంగా గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోనే..సాక్షి, సిద్దిపేట: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది. అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో 401మంది ఫెయిల్ అయ్యారు. పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే గణితం, ఇంగ్లిష్లలో అధికంగా ఫెయిల్ అయ్యారు. గణితం పాఠ్యాంశాల్లో సమస్యలను అన్వయించి పరిష్కరించడంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆంగ్లం స్పష్టంగా చదవడం రాయడం రాకపోవడంతోనే ఫెయిల్ అయ్యారు. మూడు మండలాల్లో.. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు. ధూల్మిట్ట, కోహెడ, కుకునూరుపల్లి మండలాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం పెరుగుతూ.. తగ్గుతూ పదేళ్లుగా పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం పెరుగుతూ... తగ్గుతూ వస్తోంది. 2021–22లో 14,869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14,550 (97.85 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ ఏడాది రాష్ట్రంలో మొదటి స్థానం జిల్లా సాధించింది. 2018–19, 2022–23. 2023–24లలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. -
చట్టబద్ధ దత్తతే చక్కని మార్గం
జిల్లా సంక్షేమశాఖ అధికారి శారదసిద్దిపేటరూరల్: అందమైన కుటుంబం ఏర్పాటు కోసం చట్టబద్ధంగా చిన్నారుల దత్తత చక్కని మార్గమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మిషన్ వాత్సల్య పథకం– డీసీపీయూ విభాగం ఆధ్వర్యంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చట్టబద్ధ దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవడానికి గల అర్హతలు, సంబంధిత వివరాలను తెలియజేస్తూ దరఖాస్తుచేసుకోవాలన్నారు. చట్టబద్ధంగా కాకుండా అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోరాదన్నారు. అనంతరం దత్తత తీసుకున్న తల్లితండ్రులకు అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగిరం చేయండి
● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడరూరల్(హుస్నాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం కోహెడ మండల కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మండలానికి మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తాం హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మండలంలోని ఉమ్మాపూర్లో శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్ధలాన్ని పరిశీలించి స్థల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. విద్యార్థి, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఒకటిన్నర ఎకరాల్లో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) ఏర్పాటు కోసం సంబందిత అధికారులకు స్థలం అప్పగించామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, ఏటీసీ కేంద్రం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అలాగే కూచనపల్లి, మాలపల్లె మధ్య న్యాక్ సెంటర్ మంజూరు కాగా స్థలాన్ని పరిశీలించారు. విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం మెరుగుపడాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేష్కుమార్ తదితరులు ఉన్నారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● కలెక్టర్ హైమావతి ● సివిల్ సప్లై, రైస్ మిల్లర్లతో సమావేశం సిద్దిపేటరూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లు ప్రతినిధులతో, సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12,936 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యంతో వచ్చిన లారీలను దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను ఏర్పటు చేసుకోవాలని మిల్లుల యజమానులను ఆదేశించారు. తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు వచ్చేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. అధికారులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. -
సింహవాహనంపై నాచగిరీశుడి విహారం
వర్గల్(గజ్వేల్): స్వాతి నక్షత్రం వేళ నృసింహావిర్భావం.. సింహవాహనంపై స్తంభోద్భోవుని దివ్యదర్శనం ఆవిష్కృతమైంది. నృసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నాచగిరి భక్తిపారవశ్యమైంది. జయంతి ఉత్సవాలలో భాగంగా విశేష అభిషేకం, సుదర్శన నారసింహ మూలమంత్ర హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అష్టోత్తర శతకలశ పూజ జరిపారు. భక్తజన హర్షధ్వానాల మధ్య సింహవాహనంపై శ్రీవారు ఊరేగారు. అనంతరం స్తంభోద్భవుడు నృసింహుని ఆవిర్భావ ఘట్టంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడం కోసం దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిదిలోని లింగుపల్లిలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ బొమ్మెర సంయుక్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన తాగు నీరు, నీడ, వంటి వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కోదండరాంను కలిసిన టీజేఎస్ నాయకులుగజ్వేల్రూరల్: ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా టీజేఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీజేఎస్(తెలంగాణ జన సమితి) జిల్లా ఇన్ఛార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి గురువారం కోదండరాంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల నష్టపరిహారం తదితర అంశాలను కోదండరాం దృష్టికి తీసుకెళ్లి ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మంత్రి ఇలాకాలో ఏఈ ఏరీ?హుస్నాబాద్: రూ.కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్న మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్)ని నియమించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్గౌడ్, భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ కన్వీనర్ కవ్వ వేణుగోపాల్రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఇలాకాలో పూర్తి స్థాయి ఏఈ లేకపోవడం దారుణమన్నారు. సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడం, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడేళ్లకే గుంతలు పడి కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. -
చెడు స్నేహం వలలో పడొద్దు
సిద్దిపేటరూరల్: సైబర్ క్రైమ్, సమాచార మాధ్యమాలతో ఏర్పడిన చెడు స్నేహాల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వమాట్లాడుతూ అన్ని తెలుసనే భ్రమలో విద్యార్థులు ఉంటారని, ఏది నిజం, ఏది అబద్దం అనేది గ్రహించకుండా త్వరగా అట్రాక్టివ్ అవుతారన్నారు. ఇంటర్నెట్, టెక్నాలజీ అవసరం మేరకు వాడుకోవాలని సూచించారు. వాట్సప్, పలు సోషల్ మీడియాలో రకరకాల కొత్త వారితో ఎక్కువ మంది స్నేహాలు చేస్తుంటారని, దాని వల్ల జీవితం నాశనమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సైతం చూస్తున్నామన్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు పెంచి చదివిస్తున్న క్రమంలో వారి కలలను నిజం చేయాలన్నారు. ఆధ్యాత్మిక భావన, యోగ, ధ్యానం చేసుకుని పాజిటివ్ దృక్పథంతో ఉండాలన్నారు. విద్య పరంగా సమస్యలు ఎదురైతే ఉపాధ్యాయులకు తెలపాలని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని నిరంతరం శ్రమించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ బారిన పడకుండా జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, సీడీపీఓ రాము, ఇన్చార్జి డీఎంహెచ్ఓ తదితరులు పాల్గొన్నారు. జీవితాలను నాశనం చేసుకోవద్దు కలెక్టర్ హైమావతి నర్సింగ్ విద్యార్థులకు సైబర్క్రైమ్పై అవగాహన -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్జోన్: జిల్లా కోర్టులో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ 1, స్టేనో టైపిస్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మే 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా జూనియర్ అసిస్టెంట్కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, స్టేనో టైపిస్ట్కు డిగ్రీతో పాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా కోర్టు వెబ్సైట్, నోటీస్ బోర్డులో చూసుకోవచ్చన్నారు. -
సమస్యల పరిష్కారానికి కమిటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు రావద్దన్నారు. ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. బావుల పూడికతీత, పైపులైన్ వేయడం, తదితర అంశాలపై పరిష్కారం చూపడానికి ఐదుగురుతో కమిటీ వేయాలని చెప్పారు. గ్రామాల్లో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలుగుతాయన్నారు. మండలంలో రూ.14కోట్లతో రోడ్లు వేశామన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. మండలంలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, కలెక్టర్ హైమావతి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ ఐల్లయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఎమ్మారో సింహాచలం మధుసూదన్, ఎంఈఓ గుగులోతు రంగా నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ -
పదింతల సంబురం
ఫలితాల్లో జిల్లా ౖపైపెకి..● 25 నుంచి 13వ స్థానానికి ● ఈసారి బాలురదే హవా ● 243 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ● చిన్నకోడూరు మండలంలో అందరూ పాస్ ● రాణించిన గురుకులాల విద్యార్థులుగురుకుల విద్యార్థినికి 585 మార్కులువర్గల్(గజ్వేల్): జిల్లా స్థాయిలో వర్గల్ మండలం చౌదరిపల్లి(గజ్వేల్) సోషల్వెల్ఫేర్ బాలికల గురుకులం మెరిసింది. టెన్త్ పరీక్షలో సత్తాచాటిన అనుముల అక్షిత 585 మార్కులు సాధించారు. ఏ.జ్యోతిర్మయి (565), డి. మేనక(554) మార్కులు సాధించారు. మొత్తం 78 మంది పరీక్ష రాయగా 77 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. పూలే భళా.. వర్గల్(గజ్వేల్): టెన్త్ ఫలితాల్లో వర్గల్ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకులం శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 77 మంది బాలికలు పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీ దేవి తెలిపారు. టీ. శ్రీహర్ష (566), ఎం. శిరీష(558) మార్కులతో టాపర్లుగా నిలిచారు. గురుకులంలో శతశాతం ఉత్తీర్ణత నమో దు కావడంపై ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. జిల్లా 13వ స్థానంలో నిలిచింది. గత 2024– 25 విద్యాసంవత్సరంలో 25వ స్థానంలో ఉన్న జిల్లా.. 2025– 26 ఫలితాల్లో 13వ స్థానానికి ఎకబాకింది. 15,325 మంది విద్యార్థులకు గాను 14,995 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో 7,752 మంది బాలురకు 7,540 మంది, 7,573 మంది బాలికలకు 7,455 మంది ఉత్తీర్ణులయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన మండలంగా చిన్నకోడూరు నిలిచింది. స్పింగ్డల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రవళ్లి సాత్విక 595 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎన్సాన్పల్లి గురు కులం విద్యార్థిని శ్రీగారి వర్ష 588 మార్కులు సాధించారు. 136 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, 21గురుకులాలు, 13 కేజీబీవీలు, 11 ఆదర్శ స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు: 15,325ఉత్తీర్ణత సాధించిన వారు : 14,995ఫెయిల్ అయిన వారి సంఖ్య: 330జిల్లాలో ఉత్తీర్ణత శాతం: 97.85అత్యధిక మార్కులు సాధించిన వారుశ్రీగారి వర్ష (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్పల్లి): 588బొమ్మిడి అమూల్య (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్మేట): 587దనాల అశ్వప్రియ (రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్పల్లి): 586 -
చదువుల్లో రాణించినప్పుడే గుర్తింపు
గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించినపుడే గుర్తింపు లభిస్తుందని సీపీడీసీ సభ్యులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల సీపీడీసీ సభ్యులు లక్ష్మణ్, నరేష్, గోపాల్రెడ్డి, సుభాష్చంద్రబోస్ తదితరులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేయకుండా విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
ఎల్లమ్మ ఉత్సవ కమిటీ నియామకం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా పూదరి శ్రీనివాస్గౌడ్, పచ్చిమట్ల రాధాగౌడ్, టాకూర్ భగవాన్ సింగ్, దొబ్బల అనిల్, లావుడ్యా కిషన్నాయక్, కోడం ప్రభాకర్, పున్న సమ్మయ్య, అలవోజు రవీందర్, ముప్పిడి రాజిరెడ్డి, గొర్ల కొమురయ్య, సావుల వెంకటస్వామి, గట్టు సాయికృష్ణ, బొల్లి శ్రీనివాస్లను నియమించారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఉత్సవ కమిటీ పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంట వివరాల నమోదు తప్పనిసరి: స్వరూపరాణిదుబ్బాకటౌన్: రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లిలో పంట నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంట నమోదు చేసుకుంటేనే ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలుంటుందన్నారు. ప్రతి సీజన్లో పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ యాప్ అప్డేట్స్ కోసం తాత్కాలికంగా నిలిపి వేశారన్నారు. రైతులకు యూరియా అవసరం ఉంటే నానో యూరియా వాడాలని, అలాగే ఆయిల్పామ్ పంట కోసం అమ్మోనియా సల్ఫేట్ వాడాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి స్వర్ణలత, రైతులు తదితరులున్నారు. బకాయిలు విడుదల చేయండి సిద్దిపేటజోన్: పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాజు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. 14లక్షల మంది పేద విద్యార్థులు పథకంపై ఆధారపడి చదువుతున్నారని, వారికి విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు కాలేజీలు హాల్టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. బకాయిలు చెల్లించకుండా మరోపక్క ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను 35 శాతం పెంచి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు భారం చేసిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. -
ఒకే రోజు రెండు ప్రవేశ పరీక్షలు
గజ్వేల్: పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఓ పేద విద్యార్థినికి ఒకే రోజు ఒకే సమయానికి ఇంటర్మీడియెట్ కేజీబీవీ, గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఉండటంతో అయోమయానికి గురవుతోంది. గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామానికి చెందిన హారిక ములుగులోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 508 మార్కులను సాధించారు. రిజల్ట్కు ముందే ఇంటర్మీడియెట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సదరు విద్యార్థినికి హాల్టికెట్లు కూడా వచ్చాయి. కేజీబీవీ ప్రవేశ పరీక్ష మే 3న ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు సిద్దిపేట మండలం తడ్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాయాల్సి ఉంది. టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్ష సైతం అదే రోజు, అదే సమయానికి సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు మోడల్ పాఠశాలలో ఉన్నట్లు హాల్ టికెట్లు వచ్చాయి. ఈ రెండింటిలో ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియక సదరు విద్యార్థిని తికమకపడుతున్నారు. ఒకే రోజు.. ప్రవేశ పరీక్షలను నిర్వహించడంలో సంబంధిత అధికారుల ఆంతర్యమేమిటో అర్థం కాని ప్రశ్నగా మారింది. వారి నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు హారికలాగే ఆందోళన చెందుతున్నారు. ఒకే సమయానికి టీజీఆర్జేసీ, కేజీబీవీ ఎంట్రెన్స్ టెస్ట్లు ఆందోళనలో టెన్త్ విద్యార్థులు -
వైద్యసేవల్లో అగ్రగామిగా నిలుపుదాం
దుబ్బాక: వైద్యసేవల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక వంద పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఎల్వీ ప్రసాద్ యాజమాన్యంతో ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే మోకాలు చిప్పల మార్పిడిపై వాటికి సంబంధించిన ఆపరేషన్ పరికరాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఆసుపత్రి చుట్టూ ప్రహరీ, పోస్టు మార్టమ్ రూమ్ వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ కొత్తగా నిర్మించడం, రోగులకు అవసరమయ్యే పరికరాల కొనుగోలు తదితర విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. నార్మల్ డెలవరీలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సంగీత, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్ దేవుని రాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ అన్నపూర్ణ, ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అరుణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం -
రోడ్డెక్కిన రైతులు
గతంలో మాదిరిగానే ధాన్యం కొనాలంటూ ధర్నా సిద్దిపేటఅర్బన్: గతంలో మాదిరిగా ధాన్యాన్ని జల్లి పట్టకుండానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ధాన్యం జల్లి పట్టడానికి యంత్రాలు లేవని, గతంలో మాదిరిగానే తాలుకు తరుగు తీసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ధాన్యాన్ని జల్లి పట్టిన తరువాతే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అన్నారు. తాలు తీయకుండా కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలిపారు. -
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
● నలుగురు బీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవం ● ఎమ్మెల్యే అభినందనలుదుబ్బాక: మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. చైర్పర్సన్ శ్రీరాం సంగీత ఆధ్యక్షతన జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్కు చెందిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. మైనార్టీ కోటాలో ఎండీ.ఖలీల్, నసీమా, పాలన అనుభవం కోటాలో ఆస యాదగిరి, గోనె దేవలక్ష్మి ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యుల కోసం మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. కో ఆప్షన్ మెంబర్ల ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మొత్తం కౌన్సిల్లో 20 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ చెందిన వారు 14 మంది ఉండటంతో కో ఆప్షన్ మెంబర్లను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచన మేరకు ఎన్నుకున్నారు. ఎన్నికై న నలుగురు కో ఆప్షన్ మెంబర్ల చేత ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు. కో ఆప్షన్ ఎన్నిక సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ అభివృద్ధికి భాద్యతయుతంగా పనిచేయాలని కో ఆప్షన్ మెంబర్లకు సూచించారు. -
ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ముఖ్యం
గజ్వేల్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్–ప్రజాపూర్ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్మికుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి రేవంత్, పొన్నం చిత్రపటాలకు క్షీరాభిషేకం -
చదువుతోనే ఉన్నత స్థానం
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదువొక్కటే మార్గమని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మిరుదొడ్డిలోని మోడల్ స్కూల్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం, వాటి నివారణ చర్యలు, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేరీర్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. విద్యారంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడటానికి అవకాశాలు వస్తాయన్నారు. జీవితంలో ఓటమి అనేది విజయానికి దారి చూపుతుందన్నారు. నిరాశపడకుండా నిబద్ధతతో పని చేస్తేనే విజయం వరించడమే కాకుండా పది మందికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. కష్టాల సుడిగుండంలో పెరిగి ఉన్నత చదువులు చదివి శాస్త్రవేత్తగా ఎదిగి, అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టిన డాక్టర్ అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండి ఆరోగ్యం, చదువు, భద్రతపై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పాజిటివ్ ఎనర్జీ రావాలంటే యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారి శారద, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీడీపీఓ రాము, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్ బాబు, ఎంపీడీఓ గణేష్రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిని, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం సందర్శన మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. కొనుగోలు కోసం రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించామని, వారి నుంచి అనుమతులు రాగానే కొనుగోళ్లు చేపడతామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయండి సాక్షి, సిద్దిపేట: నీట్– 2026 ఆఫ్లైన్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 3న నీట్–2026 పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 937 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం సెంటర్లో సీసీ కెమెరాలు, పవర్ సప్లయ్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను, సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. అలాగే రెండు సెంటర్ల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి కలెక్టర్ హైమావతి -
అంతా.. ఆన్లైన్
ధాన్యం లారీలకు జీపీఎస్జీపీఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనంలో ధాన్యం బస్తాల లోడింగ్మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు.. పంపిన ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్, ఆన్లైన్లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీ అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ సీజన్ నుంచే నూతన పద్ధతులను పౌరసరఫరాల శాఖ అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందు కోసం 419 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అక్రమాలను అరికట్టేందుకే.. ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది.. ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్ల పై చర్యలు తీసుకుంటారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పని చేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనన్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్లైన్లో ట్రక్షీట్లు జనరేట్, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడికి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు దాదాపు 48 గంటల్లో ధాన్యం డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి. ‘పలుకుబడి’కి ఇక చెల్లు ఇదివరకు సివిల్ సప్లయ్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించే వారు. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్లో ట్రక్షీట్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. మాన్యువల్గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపివేసింది. కొత్త విధానంలో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాతే అదే ఆటోమేటిక్గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాలి. నూతన పద్ధతిలోనే మిల్లులకు కేటాయింపులు అన్లోడింగ్ జాప్యానికి చెక్ రైతులకు త్వరగా డబ్బు చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ..పారదర్శకత కోసమే.. మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరితగతిన రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్లోడింగ్ జాప్యం సైతం తగ్గనుంది. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
బంకుల్లో డీజిల్ కొరత
హుస్నాబాద్: బంకుల్లో డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రెండు రోజుల నుంచి డీజిల్ కొరత నెలకొంది. బంకు యాజమానులు డీజిల్ కోసం అడ్వాన్స్ పేమెంట్ చేసినా చమురు కేంద్రాల నుంచి దిగుమతి కావడం లేదు. వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరం. రోజూ ప్రతి హార్వెస్టర్కు దాదాపు 100 నుంచి 150 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. దీంతో వరి కోత మిషన్లు వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాల్సి పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. గతంలో కొంత మంది అవసరానికి మించి డీజిల్ను నిలువ చేసుకొని, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో వైపు పెట్రోల్ కొరత ఉంటుందనే వదంతులతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. ముందస్తుగా వాహన ట్యాంక్లను నింపుకొంటున్నారు. -
సెలవుల్లో ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లులో భద్రపర్చుకోవాలని తెలిపారు. ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా సంబంధిత పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా ఈత కోసం చెరువులు, కుంటల, లోతైన నీరు ఉన్న ప్రాంతాలకు పంపకూడదన్నారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
వైభవంగా నాచగిరిశుడి జయంత్యుత్సవాలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో స్వామివారి జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు ఉదయం 7.30 గంటలకు యాగశాల ప్రవేశం జరిగింది. అర్చకస్వాములు మంత్రోచ్ఛరణలతో మూర్తికుంభ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, ప్రధాన కుండానికి అదనంగా మరో మూడు కుండాలు ఏర్పాటుచేసి సుదర్శన నారసింహ మూలమంత్ర హవనములు నిర్వహించారు. పూర్ణాహుతి జరిపారు. సాయంత్రం హవనాది కార్యక్రమాలు కొనసాగాయి. ఉత్సవాలలో ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ధర్మకర్తలు శ్రీనివాస్, భక్తులు హోమంలో పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. మల్లన్న ఆలయంలో వేలం పాటలుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో మంగళవారం పలు దుకాణాల నిర్వహణకు ఈఓ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. ఆలయ పరిసరాలలో పూజా సామగ్రి విక్రయించే లైసెన్సు హక్కును కొమురవెల్లికి చెందిన చిక్కుడు స్వామి దక్కించుకున్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్లోని షాప్ నెం.15ను రూ.88వేలకు ఎల్. నరేందర్, అన్నదాన సత్రం ఎదుట ఉన్న షాప్ నెం. నాలుగును రూ.65,500 కె.మహేశ్ దక్కించు కున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు సుదర్శన్, శ్రీను పాల్గొన్నారు.ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోలేదుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన గజ్వేల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణ వ్యవస్థను ప్రైవేటీకరించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ దుకాణాల వద్ద మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని చైర్పర్సన్ గంగిశెట్టి చందన తెలిపారు. కొన్ని రోజులుగా చెత్త సేకరణపై వస్తున్న విమర్శలపై మంగళవారం స్పందించారు. మున్సిపాలిటీలో ఆర్అండ్ఆర్ కాలనీ విలీనం కావడం వల్ల గతంలో అక్కడి పంచాయతీల్లో పనిచేసిన 32మంది పారిశుద్ధ్య సిబ్బంది.. ఇక్కడికి బదిలీ అయ్యారన్నారు. దీంతో చెత్త వాహనాల డీజిల్ ఖర్చులు, సిబ్బంది వేతనాలు భారంగా మారాయన్నారు. పరిస్థితులను సమతుల్యం చేసుకోవడానికి మాత్రమే ట్రయల్ రన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల అనుమతితోనే తదుపరి చర్యలు చేపడతామని, ఈవిషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. సజ్జనార్ను కలిసిన లింగాయత్ నేతలు గజ్వేల్: పోలీస్శాఖ డీజీగా పదోన్నతి పొందిన వీసీ సజ్జనార్కు గజ్వేల్, చేర్యాల ప్రాంతాలకు చెందిన వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయనను కలుసుకొని పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు అకుల ప్రశాంత్, కాసని వీరేశం, కొత్తపల్లి శ్యామ్కుమార్, మధుసూదన్, రమేశ్, రాకేశ్, యాదగిరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులను ఆదుకోండిసిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ పెంచాలని కోరారు. గతంలో అనేక సార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. దివ్యాంగులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. -
కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీని బూత్స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్ వన్ టూ వన్గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్, గ్రామ, మండల, బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నుకునే ఈ కమిటీ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతారని, అందుకే ఈ కార్యవర్గం ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ప్రీతం, అహ్మదుల్లా, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి (సంగారెడ్డి), ఆంక్షారెడ్డి (సిద్దిపేట), ఆంజనేయులుగౌడ్ (మెదక్) తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
నంగునూరు(సిద్దిపేట): జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చొరవతో కాలువ పూర్తి కావడంతో వాగవతలి గ్రామాలకు సాగునీరు అందుతోందని ఏఎంసీ చైర్మన్ యాదగిరి అన్నారు. సోమవారం ఘణపూర్ పంప్హౌస్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మంత్రి వివేక్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పంప్హౌస్ పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోయిన పనులు పూర్తి చేసిందన్నారు. కార్యక్రమంలో సత్తయ్య, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, రాములు, రవి, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే సహించం
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయిని సత్యలక్ష్మి, గుంటుకు లక్ష్మీ, సంతోషి, రమేష్, ఉపేందర్రెడ్డి, నర్సింహారెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెత్త సేకరణ పేరుతో ప్రజలపై అదనపు భారం మోపాలని చూడడం ఎంతవరకు సమంజసమన్నారు. మెరుగైన పాలన అందించాల్సింది పోయి ఈ విధానం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికై నా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ల హెచ్చరిక -
ఘనంగా ఎల్లమ్మ ఉత్సవాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అల్లీపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. పుట్టకు పూజలు చేయడంతో పాటు మహిళలు బోనాలు తీశారు. అలాగే ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘గేట్’కు ఉచిత కోచింగ్ హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్స్–ఐఈఎస్ (ఆల్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్) అభ్యర్థి చింతల రమేశ్ ఉపన్యసించారు. వచ్చే నెల ఒకటి నుంచి గేట్కు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గేట్ సిద్ధత, సబ్జెక్ట్ ప్రణాళిక, సమయ నిర్వాహణతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర వర్గల్(గజ్వేల్): రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగనోల్ల విజయ అన్నారు. సోమవారం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి శ్రీనివాస్రెడ్డి, సెక్రటరీ జితేందర్రెడ్డితో కలిసి ఆమె వర్గల్ మండలం తున్కిఖాల్సా, వేలూరు, నాచారం, మజీద్పల్లి, మైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడొద్దన్నారు. సన్నధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పెండింగ్ బకాయిలివ్వండి ఏబీవీపీ నాయకుల నిరాహార దీక్ష సిద్దిపేటకమాన్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సిద్దిపేట బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, బస్టాండ్ వద్ద సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఏడాదికి సుమారు 14లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మధ్యతరగతి విద్యార్థులు పలు కోర్సుల్లో చదువుకుంటున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు కార్యాలయం తరలింపు గజ్వేల్రూరల్: పట్టణంలో ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు కార్యాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో శాశ్వత కోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోగల బ్లాక్ – ఏలో తాత్కాలికంగా కోర్టు కార్యాలయం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ హైమావతి గజ్వేల్ ఆర్డీఓను ఆదేశించారు. -
కులవృత్తులను కూల్చకండి
కలెక్టరేట్ ఎదుట వడ్డెర సంఘం నాయకుల నిరసనసిద్దిపేటరూరల్: వడ్డెర కులవృత్తిని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో సుమారు 60 వడ్డెర కుటుంబాలు 70 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకుని బండరాయి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. కొంతమంది రియల్ఎస్టేట్, రాజకీయ నాయకులు తమ పలుకుబడితో బండరాయి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పేద కుటుంబాలైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని వడ్డెకుటుంబాలకు వెంటనే న్యాయం చేసి, బండప్రాంతాలపై హక్కులు కల్పించాలన్నారు. వారికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు తిరుపతి, జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు స్వామి, రమేశ్, కనకయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కావొద్దు
● పరిష్కరించేందుకు అధికారులుచొరవచూపాలి ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: ప్రజలు అందించే అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వస్తారన్నారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు పరిష్కరించాలన్నారు. వచ్చే ప్రజావాణి నుంచి విభాగాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 98 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తాలు తీసాకే ధాన్యం కొనుగోలుతప్పనిసరిగా తాలు తీసిన తర్వాతే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. సోమవారం రూరల్ మండలం పుల్లూరు, రాఘవపూర్, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ శాతం వచ్చే వరకు వ్యవసాయ క్షేత్రాల వద్దనే ఆరబెట్టుకోవాలన్నారు. తాలు తీసాకే ధాన్యానికి గ్రేడ్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతిలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
రేవంత్ పాలనలో రాష్ట్రం విధ్వంసం
గజ్వేల్: ఎన్నో బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ నేడు సీఎం రేవంత్రెడ్డి కబంధహస్తాల్లో విధ్వంసమవుతోందని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్దపు పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో పురోగతిని సాధించిన తెలంగాణ ప్రస్తుతం అధ్వానస్థితికి చేరిపోయిందన్నారు. కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు మరోసారి బలంగా నమ్ముతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.జిల్లా పార్టీ కార్యాలయంలో.. సిద్దిపేటజోన్: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్లు పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఊడేనా?
రెచ్చిపోతున్న గ్రామసింహాలు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కలుస్వైరవిహారం చేస్తున్నాయి. వివరాలు 8లో uఉండేనా..గజ్వేల్లోని ఈఎన్సీ కార్యాలయాల సముదాయం ఏడాదిగా ఈఎన్సీ పోస్టు ఖాళీ పదేళ్లపాటు అధికారంలో ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే నమూనాగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ప్రత్యేకించి సాగునీటి పారుదలశాఖ(ఇరిగేషన్)కు సంబంధించి మరో అడుగు ముందుకేసి.. ఈ ప్రాంతాన్ని ఈఎన్సీ కార్యాలయంగా అప్గ్రేడ్ చేశారు. దీనివల్ల ఈ కార్యాలయం జిల్లాతోపాటు తెలంగాణలోని జనగామ, యాదాద్రి, మెదక్, మేడ్చల్ తదితర జిల్లాలకు ప్రధాన ఆధారంగా మారింది. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్లకు ఇక్కడ ఈన్ఎసీగా పనిచేసిన హరేరామ్ కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను పూర్తి చేయడం, కాల్వల నిర్మాణం చేపట్టడంలో ఇక్కడి ఇరిగేషన్ శాఖ అధికారులు బిజీబిజీగా గడిపారు. ఏడాదికాలంగా మారిన సీన్.. ఏడాది కిందట ఇక్కడి ఈఎన్సీ హరేరామ్ ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయన విచారణను ఎదుర్కోవడం వల్ల.. ఇక్కడికి కొత్త ఈఎన్సీ రాలేదు. దీనివల్ల ఇక్కడ ఈఎన్సీ పోస్టు కొనసాగుతుందా? లేదా..? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ఇక్కడ సీఈ, ఎస్ఈతోపాటు ముగ్గురు ఈఈలు ఉండగా, డీఈ, ఏఈల పోస్టులు చాలావరకు ఖాళీలు ఉన్నాయి.ఎక్కడి పనులు అక్కడే.. గతంలో ఈఎన్సీ కార్యాలయంగా ఉన్న గజ్వేల్లో పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అంశాలు చాలా వేగంగా జరిగేవి. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన ప్రధాన కాల్వలు, పంపిణీ కాల్వలు, ఉప కాల్వలకు సంబంధించి ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి. ఏళ్లతరబడి ఈ పనులన్నీ సాగకపోవడం వల్ల సాగునీటి పంపిణీ సమస్యగా మారుతోంది. జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధాన కాల్వల పనులు ఏళ్లతరబడి పెండింగ్లో ఉండటం వల్ల కొన్ని జిల్లాలకు ఇంకా గోదావరి జలాలు అందలేదు. ఇకపోతే పంపిణీ కాల్వల సమస్య తీవ్రంగా ఉంది. ఉప కాల్వలకు సంబంధించిన కార్యాచరణ ముందుకుసాగకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఇక్కడికి ఈఎన్సీ పంపడం ద్వారా పనులు గాడిన పడేలా చేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే. -
బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత
సిద్దిపేటకమాన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని రెండు, మూడు బంకుల్లో మాత్రమే ఇంధనం ఉండడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో ఉన్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు బంకులు మూతపడటంతో రైతులు, వినియోగదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉంది. పది రోజుల క్రితమే నిర్వాహకులు డబ్బులు చెల్లించినప్పటికీ కంపెనీల నుంచి ఇంధనం సరఫరా కావడం లేదని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. -
జయంత్యుత్సవాలకు అంకురార్పణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శ్రీవారి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం గర్భగుడిలో స్వయంభూ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషాలంకృతులను చేశారు. ఆలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. రక్షాబంధనం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారికి నివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కేంద్ర జౌలి పరిశ్రమ శాఖ కమిషనర్ అరుణ్కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.నాచగిరిలో భక్తిపారవశ్యం -
కంట తడి
చివరికి..సాగునీరు అందక ఎండుతున్న పంటలుమొరాయిస్తున్న మోటార్లు నెల రోజుల వరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. నీటి ఊటలేక ఉపయోగం లేకుండా పోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా సైతం సమస్యగా మారింది. అర ఎకరా, ఎకరా సాగుచేయడమే గగనంగా మారింది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పడిపోతున్న భూగర్భ జలాలు గింజలు గట్టిపడుతున్న వేళఅందని నీరు ఆరు మండలాల్లో 15 మీటర్ల లోతులో జలం నీటి కోసం రైతుల భగీరథ ప్రయత్నం -
‘కో–ఆప్షన్’పై ఉత్కంఠ
గజ్వేల్: ‘కో–ఆప్షన్’ సభ్యుల ఎన్నికపై గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. నాలుగు కో–ఆప్షన్ స్థానాలు ఉండగా, ఇందులో మైనార్టీలకు రెండు(మహిళ, జనరల్), మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు(మహిళా, జనరల్) కేటాయించిన సంగతి తెల్సిందే. ఈ పదవులకు 40మంది దరఖాస్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఎన్నిక ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కమిషనర్ సెలవులో ఉన్న కారణంగా.. దరఖాస్తుల స్క్రూటీని చేయలేదు. ఎన్నికకు సంబంధించి తేదీ నిర్ణయం జరగలేదు. ఒకటిరెండ్రోజుల్లో కమిషనర్ విధుల్లో చేరే అవకాశం ఉండగా, స్క్రూటీని ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికకు రంగం సిద్ధం చేయనున్నారు. బీఆర్ఎస్లో కసరత్తు మున్సిపాలిటీని కై వసం చేసుకున్న బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరుపుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్తోపాటు పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. గత పాలకవర్గంలో ‘సీల్డ్ కవర్’ పంపిన తర్వాత కూడా.. చివరి క్షణంలో కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చి ఎన్నిక చేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. కాకపోతే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఎంపిక పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ప్రాధాన్యతల మేరకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. పోటీలో కాంగ్రెస్ నేతలు... కో–ఆప్షన్ పదవుల కోసం కాంగ్రెస్కు చెందిన నేతలు సైతం పోటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలోని 20కౌన్సిలర్ స్థానాల్లో 11మంది బీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్, ఏడుగురు కాంగ్రెస్, మరొకరు బీజేపీ కౌన్సిలర్ ఉన్న తెల్సిందే. ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్కు మద్దతు పలకడంతో వారి సంఖ్య 12కు చేరింది. ఈ క్రమంలో ‘కో–ఆప్షన్’ సభ్యుల ఎన్నికకు చేతులెత్తే విధానంలో అభ్యర్థులకు మద్దతు పలకాల్సి ఉంటుంది.ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు ఎలాగైనా ‘కో–అప్షన్’ పదవులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కొందరు పట్టణంలో తమ రాజకీయ ఉనికికి పరీక్షలా భావించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాము అభ్యర్థుల గెలుపునకు పనిచేశామని.. బీఆర్ఎస్ అధిష్టానం తమను గుర్తించాలని నేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు నేతలు ఖర్చుకు సైతం సిద్ధమవుతుండటం గమనార్హం.పోటీలో 40మంది ఆశావహులు నేటికీ పూర్తికాని దరఖాస్తుల స్క్రూటీని ఎన్నికకు తేదీ నిర్ణయంలో జాప్యం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి -
ఎర్లీబర్డ్.. ఎగిరిపోతది!
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలవుతున్న ఎర్లీబర్డ్ పథకం ఆఫర్ గడువు ముంచుకొస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఇస్తోంది. ఇది వరకు బకాయిలు లేని వారు ఈ పథకానికి అర్హులు. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలనే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఐదు మున్సిపాలిటీల్లోని 69,709 నివాస గృహాలకు గాను కేవలం 8,705మంది మాత్రమే వినియోగించుకున్నారు. 26 రోజుల్లో.. జిల్లా వ్యాప్తంగా రూ.35.12కోట్ల లక్ష్యానికి ఎర్లీబర్డ్ పథకం కింద 26 రోజుల్లో రూ.4.96 కోట్ల వసూలుతో 14.29శాతం నమోదు అయింది. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను వసూలు లక్ష్యం అనంతరం ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్నుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే ఒకేసారి ముందస్తు ఆస్తిపన్ను చెల్లించే వారికి 2026–27 ఆర్థిక సంవత్సర పన్నులో ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల్లో హోర్డింగ్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం తెచ్చారు. గత ఏడాది ఎలాంటి ఆస్తిపన్ను బకాయిలు లేని వారికి ఈ పథకం కల్పించారు. మరోవైపు ఆర్థిక ఆస్తిపన్ను లక్ష్యం అధిగమించేందుకు ఎర్లీబర్డ్ పథకం బల్దియాలకు ఎంతో ఉపయోగం కానుందని ప్రభుత్వం సంకల్పించింది. సిద్దిపేట మున్సిపాలిటీలో అత్యధికంగా రూ.3.82కోట్లు ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తిపన్ను చెల్లించగా, అత్యల్పంగా చేర్యాలలో కేవలం రూ.12లక్షలే వసూలయ్యాయి. ఆఫర్ మరో నాలుగు రోజులే ఇప్పటివరకు రూ.4.96 కోట్లు వసూలు సద్వినియోగం చేసుకున్నది8,705 మందే అత్యధికంగా సిద్దిపేట.. అత్యల్పం చేర్యాల -
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
రైతుల కష్టం ఎండలకు ఆవిరైపోతోంది.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పలు చోట్ల కుంటలు, చెరువులలో నీళ్లు లేక నోళ్లు తెరుచుకున్నాయి. బోరు బావులన్నీ భోరుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. యాసంగి పంటలకు తడి అందక రైతులకు గుండె తడే మిలిగిస్తున్నది. మూడు తడులు పారిస్తే చేతికొస్తదనుకున్న పంటల కోసం తిప్పలపడుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని రైతులు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్లు, చెరువులు, ఇతర బావుల నుంచి నీటిని తరలించి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి , సిద్దిపేట -
‘బంధం’ మరమ్మతులకు మోక్షం
వర్గల్(గజ్వేల్): ‘సాక్షి’ కథనానికి స్పందన లభించింది. అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారీ జలాశయం ‘బంధం’ చెరువు మరమ్మతులకు మోక్షం లభించింది. రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్గా ప్రాధాన్యత కలిగిన చౌదరిపల్లి ‘బంధం’ చెరువు దుస్థితి వెల్లడిస్తూ ఈ నెల 21న ‘బంధం..బలహీనం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ మేరకు స్పందించిన అధికారులు ఆదివారం చెరువు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. చెరువులో నీళ్లు అడుగంటిపోగా, కట్టవైపు మరమ్మతు పనులకు అవరోధం కలగకుండా మిగతా నీరు వెళ్లిపోయేలా ‘ట్రెంచ్’ (కాలువ) తవ్వారు. కట్టమీద చెట్ల తొలగింపు పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ‘బంధం’ చెరువు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. -
స్వీయగణనలో భాగస్వాములు కండి..
దుబ్బాక: స్వీయగణనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్కుమార్అన్నారు. జనగణనలో భాగంగా ఆదివారం చైర్పర్సన్ శ్రీరాం సంగీత స్వీయగణనలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల్లో భాగంగా స్వీయగణనలో తొలిరోజునే కౌన్సిలర్లు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారన్నారు. ఫుట్బాల్ పోటీల్లో రాణించాలిగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలికల ఫుట్బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఐఎస్ కోచ్ నరసింహ, జీఎఫ్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై దృష్టిసారించాలి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి హుస్నాబాద్: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చైర్పర్సన్, కౌన్సిలర్లు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. తినే ఆహారంలో పప్పు దినుసులు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కార్మికులు పాల్గొన్నారు. మహనీయులను మరవొద్దు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల సందడి
మల్లన్న ఆలయంలో భక్తుల సందడిమల్లన్న ఆలయంలోస్వామివారి రాజగోపురం ఎదుట భక్తులసందడి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. -
జాబ్ మేళాకు అనూహ్య స్పందన
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం నిర్వహించిన పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జాబ్ మేళాలో 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో అభ్యర్థులకు ఎంపిక చేశారన్నారు. మొత్తం 2 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూ అనంతరం 624 మందిని ఎంపిక అయినట్లు చెప్పారు. కాగా జాబ్మేళాలో మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని విశాఖపట్టణం నుంచి ఆరుగురు అభ్యర్థులు వచ్చారు. వారిని గుర్తించిన గౌరారం ఎస్ఐ కరు ణాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఫార్మా కంపెనీ విభాగంలో ఇంటర్వ్యూకు పంపించగా, వారు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అనంతరం అభ్యర్థులకు సీపీ నియామక పత్రాలు అందజేశారు. పోలీస్శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం తమ కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు రవీందర్రెడ్డి, సుమన్కుమార్, సీఐలు లక్ష్మీబాబు, వాసుదేవరావు, ఉపేందర్, లతీఫ్, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు, పలు కంపెనీల హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు.వివిధ ఉద్యోగాలకు 624 మంది ఎంపిక -
ఉపాధి పనులకు రండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. కీలక మార్పుల నేపథ్యంలో.. నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు.. కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.జిల్లాల వారీగా టార్గెట్లు ఇలా.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.ఈజీఎస్ కూలీల హాజరు పెంచేందుకు టార్గెట్లు గ్రామాల వారీగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు వీబీజీరాంజీగా పేరు మార్పు నేపథ్యంలో కీలక నిర్ణయాలు -
స్వీయ గణనలో పాల్గొనండి
సిద్దిపేటరూరల్: జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26 నుంచి నిర్వహించనున్న స్వీయ గణనలో ప్రజలు పాల్గొనాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. వెబ్ పోర్టల్ https://se.censesgov.in/ సంప్రదించి ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. మే 11 తర్వాత ఇంటికి వచ్చే జనగణన అధికారులకు చూపిస్తే ధృవీకరిస్తారని తెలిపారు. ఇదే విషయమై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్జి, ఎమ్మెల్సీలకు ముందస్తు సమాచారం అందించి, వారి స్వగృహంలో స్వీయ గణన, జియో ట్యాగింగ్ ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేయించాలన్నారు. ఇప్పటికే రెండు గ్రూపులకు శిక్షణ అందించామన్నారు. రోజువారీగా ఇచ్చిన టార్గెట్ ఆధారంగా ఈనెల 30 వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
వరికోతలు నిలిచిపోయాయి
గత నాలుగు రోజులుగా డీజిల్ దొరకక హార్వెసర్లు, ట్రాక్టర్లు నడవడం లేవు. వరికోతలు ఆగిపోయాయి. నా ట్రాక్టర్లో రెండు రోజుల క్రితమే డీజిల్ అయిపోవడంతో పొలం వద్దే ఆగిపోయింది. క్యాన్లు పట్టుకొని రోజు బంకుల చుట్టూ తిరుగుతున్నా. ఇంధనం ఎప్పుడు వస్తదో వరి కోతలు ఎప్పుడు కోయాలో అర్థం కావడం లేదు. – భూపతిరెడ్డి, రైతు, దుబ్బాక ఇబ్బందిగా మారింది పెట్రోల్, డీజిల్ కొరతతో తమకు చాలా ఇబ్బంది తయారైంది. డబ్బులు కట్టి వారం రోజులు అవుతున్నా ఇంధనం సరఫరా కావడం లేదు. చాలా బంకులు ఖాళీగానే ఉన్నాయి. వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. వరికోతల సమయంలో కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – సురేశ్, జిల్లా పెట్రోల్ బంకుల ఓనర్ల సంఘం ప్రెసిడెంట్ -
నియోజకవర్గానికో ‘ఏటీసీ’
నర్సాపూర్ రూరల్: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. శనివారం మండలంలోని నారాయణపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే స్కిల్స్ అవసరం అన్నారు. అందుకే ఏటీసీ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించి చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, సర్పంచ్ దేవిసింగ్, ఎంఈఓ తారాసింగ్, హెచ్ఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు నర్సాపూర్: తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ చెప్పారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి పథకం కింద రూ. 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లించడం తమకు భారంగా తయారైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కావొద్దని మాజీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పలు పనులను నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. -
కోర్టుల ద్వారానే కేసుల పరిష్కారం
సంగారెడ్డి టౌన్: కోర్టుల ద్వారానే కేసులు చట్టపరంగా పరిష్కారమవుతాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వివాదాలు ఉన్న వారు కోర్టులను సద్వినియోగం చేసుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర, ఎస్పీ పరితోశ్ పంకజ్, కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నంద, జస్టిస్ అనిల్కుమార్ -
కిచెన్ గార్డెన్లు తప్పనిసరి
రామాయంపేట(మెదక్): అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మహిపాల్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని దేవక్కపల్లెకు చెందిన కరివేద మహి పాల్రెడ్డిని నియామకం అయ్యారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, స్టేట్ చీఫ్ రామచంద్రారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అవగాహనతోనే మలేరియా అంతం సిద్దిపేటకమాన్: అవగాహనతోనే మలేరియా ను అంతం చేయవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మలేరియాకు ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ దీప్తి ప్రియాంక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులతో మానసిక వికాసం కొండపాక(గజ్వేల్): వేసవి శిబిరాలు విద్యార్థుల మానసిక వికాశానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ముండ్రాతి రమేశ్ అన్నారు. కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం ఆయన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఆంగ్లంపై పట్టుసాధించడం, చేతిరాత తదితర అంశాల్లో శిక్షణనిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఎన్ఆర్ ట్రస్టు నిర్వాహకుడు పొల్కంపల్లి నరేందర్, సీఆర్పీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునుడికి హైకోర్జు జడ్జి పూజలు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ఆర్వోబీ పనులు చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని రైల్వేగేట్ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్ నూరొద్దీన్ హబీబ్ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్, జగదీశ్తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు. -
జిల్లాలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. నాలుగైదు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. దీంతో చాలా వరకు బంకులు మూతపడగా.. రైతులు, వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. – దుబ్బాక
జిల్లాలో గత మూడు రోజులుగా ఇంధన కొరత వేధిస్తోంది. మొత్తం 180కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, సగానికి పైగా బంకుల్లో కొరత ఏర్పడింది. వారం క్రితమే డబ్బులు కట్టినప్పటికీ, కంపెనీల నుంచి బంకులకు ఇంధనం సరఫరా కావడం లేదంటూ బంకుల యజమానులు చెబుతున్నారు. దుబ్బాక పట్టణంతో పాటు శివారులో 7 పెట్రోల్ బంకులుండగా, ఐదు పెట్రోల్ బంకుల్లో మూడు రోజులుగా, మిగితా రెండు బంకుల్లో శనివారం మధ్యాహ్నం వరకే పెట్రోల్, డీజిల్ అయిపోయింది. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, మిరుదొడ్డి, చిన్నకోడూర్, నంగునూర్, భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, వర్గల్, జగదేవ్పూర్ మండలాల్లో సైతం కొరత తీవ్రంగా ఉంది. సరిగ్గా వరి కోతల సమయంలోనే సమస్య ఉత్పన్నం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు స్పందించి ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.వరి కోతల వేళఇంధన కొరత నాలుగైదు రోజులుగా బంకుల మూత ఇబ్బంది పడుతున్న వినియోగదారులు -
చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
దుబ్బాక: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు లేవని వెంటనే స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీల, వైస్ చైర్పర్సన్ సులోచన, కౌన్సిలర్లు, సీడీపీఓ ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
● 11 రోజుల్లో ముగియనున్నపాలకవర్గం పదవీకాలం ● ఈనెల 30న చివరి కౌన్సిల్ సమావేశం ● వార్డుల పెంపు, ఎన్నికలపై సర్వత్రా చర్చ
సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం మరో 11 రోజుల్లో ముగియనుంది. ‘పుర’ పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. మే 7వ తేదీతో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీ నేతలు, పట్టణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు ఏప్రిల్ 30, 2021న ఎన్నికలు జరగగా, మే 3న ఫలితాలు ప్రకటించారు. అందులో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) 36 వార్డులో విజయం సాధించగా, ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు(రెబల్), బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కో వార్డులో గెలుపొందారు. మున్సిపల్ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. మే 7, 2021న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కడవేర్గు మంజుల బాధ్యతలు చేపట్టారు. మే 6, 2026కు పదవీ బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు పూర్తి అవుతుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పలు మార్లు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టువీడకుండా హరీశ్ రావు వైపే ఉన్నారు. దీంతో నలుగురు మాత్రమే అఽధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. 30న పాలకవర్గానికి సన్మానం ఈ నెల 30వ తేదీన సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ పాలక వర్గం ఏర్పాటైన తర్వాత చాలా అవార్డులు అందుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్లో అనేక అవార్డులు సాధించింది. మే మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు డివిజన్ల సంఖ్య పెంచాలని మున్సిపల్ శాఖ ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీలో సైతం వార్డుల పెంపు? వార్డుల పునర్విభజన ఉంటుందా? అని అధికారులను పలువురు రాజకీయ పార్టీనేతలు, ఆశావహులు అడిగి తెలుసుకుంటున్నారు. వార్డుల పెంపు ఉంటే ఎంత మంది ఓటర్లకు ఒక వార్డును విభజిస్తారని రాజకీయ పార్టీల నేతలు, ప్రస్తుత కౌన్సిలర్లు ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. పాలకవర్గానికి మరో 11రోజులు మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీ ప్రత్యేక అఽధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తారా? కొంత సమయం తీసుకుంటారా? అన్న విషయమై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2010 నుంచి 2016 వరకు ప్రత్యేక పాలనలో బల్దియా కొనసాగింది. పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పుడు ఆయా గ్రామాల ప్రజలు కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆరేళ్లు ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2016లో ఎన్నికలు నిర్వహించారు. -
శంకర్గౌడ్ది ముమ్మాటికీ
● మంత్రి పొన్నం రాజీనామా చేయాలి ● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వ హత్యేగజ్వేల్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే శంకర్గౌడ్ మృతిచెందారన్నారు. శుక్రవారం గజ్వేల్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇదే క్రమంలో డ్రైవర్ శంకర్గౌడ్ ప్రాణత్యాగానికి ఒడిగట్టారని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు నర్సింగరావు, నవాజ్మీరా, బెండ మధు, మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, అర్జున్గౌడ్, కృష్ణారెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనుగోళ్లల్లో నిర్లక్ష్యాన్ని సహించం టార్గెట్ పూర్తయ్యిందనే సాకుతో పొద్దు తిరుగుడు కొనుగోళ్లను నిలిపివేసి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వంటేరు ప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లను పునఃప్రారంభించకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
మూడో రోజూ బస్సులు బంద్
సిద్దిపేటకమాన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బస్సులన్నీ ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు గంటల తరబడి బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిద్దిపేట బస్టాండ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలో శుక్రవారం 5 ఆర్టీసీ, 49 అద్దె బస్సులు వివిధ ప్రాంతాలకు నడిపారు. ప్రైవేటు వాహనాల దోపిడీ ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తుండటంతో చేసేదిలేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. దీంతో వారు రెండింతల చార్జీ వసూలు చేశారు. సమ్మెతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన వరంగల్ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి సంతాపంగా సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి మోడ్రన్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జేఏసీ ప్రతినిధులు నక్క మల్లేశం, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బీఎస్ గౌడ్, రాజయ్య, కేఎస్ నారాయణ, ప్రభాకర్రెడ్డి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన ఆర్టీసీ సమ్మె నోటికి నల్లరిబ్బన్లతో కార్మికుల నిరసన పలు పార్టీలు, కుల సంఘాల సంఘీభావం -
బీడీ కార్మికులకు ‘సంజీవని శక్తి’ కిట్లు
దుబ్బాకరూరల్: మండలంలోని శిలాజీనగర్లో బీడీ కార్మికులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక ‘సంజీవని శక్తి’ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాత్రనక పగలనక కష్టపడి పని చేసే బీడీ కార్మికుల ఆరోగ్యం బాగు కోసమే కిట్లు అందించినట్లు తెలిపారు. సంజీవని శక్తి కిట్లో క్యాల్షియం టాబ్లెట్లు, మిల్టీవిటమిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పేయిన్ రిలీఫ్ జెల్, హెయిర్ ఆయిల్, దువ్వెన, స్టిక్కర్స్, కాజల్(కాటుక), కుంకుమ పసు పు, యాంటిసెప్టిక్ సబ్బు, నెయిల్ కట్టర్, హాట్ వాటర్ బ్యాగ్, గాజులు, ఛత్రం, కాటన్ బ్యాగ్ తదితర వస్తువులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
400 ఎకరాల్లో పంట నష్టం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో గురువారం కురిసిన వడగళ్ల వానతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం జిల్లాలోని వడగళ్ల వాన కురిసిన ప్రాంతాలను జిల్లా, మండల, వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వరి 398 ఎకరాల్లో, మొక్కజొన్న 2 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.నష్టపోయిన రైతులను ఆదుకోండిసిద్దిపేటజోన్: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో అధికంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి, రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ను హరీశ్రావు కోరారు. వడగళ్ల వాన నష్టంపైప్రాథమిక అంచనా క్షేత్రస్థాయిలో పరిశీలించినవ్యవసాయాధికారులు అకాల వర్షాల బాధితులకుపరిహారం ఇవ్వాలి మాజీ మంత్రి హరీశ్రావు -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
సిద్దిపేటరూరల్: ప్రతీ విద్యార్థి తనలోని నైపుణ్యాలను గ్రహించి విద్య, ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పథకాలపైన కలెక్టర్ అధ్యక్షతన ఒక రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాలలో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, వారిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి యువత కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చిందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఉపాధి పొందవచ్చని, ఇంజనీరింగ్ వాళ్లకు లేనన్ని ఉపాధి అవకాశాలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలోను విద్యార్థులకు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ హైమావతి ఉపాధి, విద్య అవకాశాలపై శిక్షణ -
జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా కె.సౌజన్య నియామకం అయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ ఎల్బీనగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న సౌజన్య సిద్దిపేటకు రానున్నారు. అదేవిదంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న బానోతు శ్రీరామ్ చేర్యాల కోర్టుతోపాటు సిద్దిపేట జువైనల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయండి వ్యవసాయ శాస్త్రవేత్త పల్లవి దుబ్బాక: రైతులు కేవలం వరిపంటపైనే ఆధారపడకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేస్తూ లాభాలు ఆర్జించాలని వ్యవసాయ శాస్రవేత్త పల్లవి అన్నారు. శుక్రవారం హసన్మీరాపూర్లో మండల వ్యవసాయ అధికారి ప్రయదర్శిని ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానాలపై రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో కలిగే లాభాలను తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, కార్యదర్శి తేజస్విని, రైతులు తదితరులు ఉన్నారు. పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ నంగునూరు(సిద్దిపేట): మండలంలోని వాగవతలి గ్రామాలకు సాగు నీరందించేందుకు ఘణపూర్ వద్ద నిర్మించిన పంప్ హౌస్ పూర్తి కావడంతో శుక్రవారం ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. రంగనాయకసాగర్ కుడి కాలువ ద్వారా ఖాతా, ఘణపూర్, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లోని 13 చెరువులను నింపేందుకు ఘణపూర్ వద్ద పంప్ హౌస్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్ అధికారులు ట్రయల్రన్ నిర్వహించారు. ట్రయల్రన్ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. పంప్ హౌస్తో నాలుగు గ్రామాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఘణపూర్లో 4 చెరువులు, అక్కేనపల్లి 4, గట్లమల్యాలలో 5 చెరువులు నింపడం ద్వారా 4,142 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. బాలల హక్కులు ఉల్లంఘిస్తే చర్యలుదుబ్బాకటౌన్: ప్రభుత్వం బాలల పరిరక్షణ కోసం పలు చట్టాలను ఏర్పాటు చేసిందని, హక్కులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు నరసింహులు అన్నారు. మండల పరిధిలోని తిర్మలాపూర్ జెడ్పీ పాఠశాలలో బాలల సంక్షేమంపై మండల విద్యాధికారి కనకరాజుతో కలిసి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారంపై ప్రభుత్వానికి సూచనలు చేయడం కమిటీ ప్రధాన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర, నరేందర్, రజని, శ్రీనివాస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రి సందర్శన చేర్యాల (సిద్దిపేట): స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ విజయ్భాస్కర్ శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్తో సమావేశమయ్యారు. త్వరలో డయాలసిస్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్తో చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా టీం లీడర్ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
జిల్లా కేంద్రంంలో ఇప్పటి వరకు ఎలాంటి నూతన కళాశాలలకు అనుమతులు లేవు. కనీసం దరఖాస్తు కూడా చేసుకున్న దాఖలాలు లేవు. ఒక కళాశాల మాత్రం పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని ఇంకా అనుమతి రాలేదు. అకాడమీలు, ఐఐటీలు, జేఈఈ, నీట్ లాంటి కోచింగ్ సెంటర్ల అనుమతికి సంబంధించిన అంశం మా పరిధిలో లేదు. అనుమతులు లేని కళాశాలల్లో విద్యార్థులను చేర్పించకూడదు. – రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి, సిద్దిపేట నిర్మాణం పూర్తి కాకుండానే ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో వెలసిన విద్యాసంస్థ -
కో– ఆప్షన్ సభ్యుల ఎన్నిక
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. నలుగురు సభ్యులకుగాను ఒకరు సీపీఎం, ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. పరిపాలనలో అనుభవం కలిగిన కోటాలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు బరిలో ఉండగా వీరిలో ఇద్దరి నామినేషన్లు ఎన్నికల నిబందనల మేరకు తిరష్కరణకు గురయ్యాయి. దీంతో ముస్త్యాల నాగేశ్వర్రావు, యాట కనకవ్వలు ఎన్నికయ్యారు. మైనార్టీ కోటాలో సీపీఎం అభ్యర్థి ఇబ్రహీం, బీఆర్ఎస్ అభ్యర్థి మెరీలమ్మ నామినేషన్లు వేయగా ఇద్దరూ ఎన్నికయ్యారు. పై నలుగురు కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు కమిషనర్ ప్రకటించారు. నూతనంగా ఎన్నికై న కో–ఆప్షన్ సభ్యుల చేత కమిషనర్ ప్రమాణస్వీకారం చేయించారు. -
ప్యాడీ క్లీనర్లకు తుప్పు.. ఎవరిదీ తప్పు
తుప్పు పట్టిన ప్యాడీ క్లీనర్లు ప్యాడీ క్లీనర్ల యంత్రాలపై నిర్లక్ష్యపు గ్రహణం ఆవహించింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో చెత్తా చెదారాన్ని వేరు చేసి శుభ్రం చేయడానికి వినియోగించే ప్యాడీ క్లీనర్లపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని ఏఎంసీ గోదాం వద్ద సుమారు 15 ప్యాడీ క్లీనర్లు తుప్పుపట్టి ఉన్నాయి. వాటిపై పర్యవేక్షణ లోపించడంతో ప్రజాధనం వృథాగా మారుతోందని రైతులు మండిపడుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
నేటి నుంచి వేసవి సెలవులు
● విద్యార్థులకు పోగ్రెస్ కార్డుల పంపిణీ ● జూన్ 12 నుంచి పునఃప్రారంభం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2025–26 విద్యాసంవత్సరం గురువారంతో ముగిసింది. జిల్లాలోని 980 ప్రభుత్వ, 250 ప్రైవేట్ పాఠశాలల్లో 1.3లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు గురువారం పాఠశాలల్లో పోగ్రెస్ కార్డులను అందజేశారు. చివరి రోజు విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. 2026–27 నూతన విద్యాసంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని, విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గురుకులాల విద్యార్థులు ఇంటిబాట.. సెలవుల నేపథ్యంలో గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు తరలి వెళ్లారు. జిల్లాలో 36 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, 59 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. -
చెత్త సేకరణ ఇక భారమే!
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఇక భారం కానుంది. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు కాలనీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సిబ్బంది, వాహనాల కొరత కారణంగా వేగవంతమైన సేవల కోసం మున్సిపల్ యంత్రాంగం ఈ నిర్ణయానికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. కానీ మున్సిపాలిటీలో సిబ్బంది, వాహనాల కొరత శాపంగా పరిణమించింది. ఇక్కడ 160మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 80 మందికిపైగా సిబ్బంది అవసరం. 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పదికిపైగా వాహనాలు అవసరమున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో. .ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా సాగటం లేదు. చెత్త బండ్లు సకాలంలో రాకపోవడంతో పలు కాలనీల్లో ఇంటి యజమానులు కవర్లలో చెత్తను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. దీంతో ఆయా రోడ్లు కంపుకొడుతున్నాయి. మరోవైపు డంపింగ్ యార్డు నిర్వహణ సైతం అధ్వానంగా మారింది. యార్డులో తరుచూ మంటలు చెలరేగి.. పట్టణంలో దట్టమైన పొగలు కమ్ముకొని ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. అంతేకాకుండా వర్మీకంపోస్ట్ తయారీ, బయోమైనింగ్ ప్రక్రియ కూడా నామమాత్రంగా సాగుతోంది. ప్రైవేటీకరణ దిశగా చర్యలు ప్రైవేటీకరణకే మొగ్గు.. సిబ్బంది, వావాహనాల కొరత కారణంగా పారిశుద్ధ్య నిర్వహణ భారంగా మారటంతో మున్సిపల్ యంత్రాంగం, పాలకవర్గం ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం కారణంగా ఈ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా కీర్తిని తెచ్చుకుంది. పేరుకు తగ్గట్టుగా నిధుల వరద పారింది. కానీ నేడు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా సాగాలంటే.. ప్రైవేటీకరణే తరుణోపాయంగా భావించి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పట్టణంలోని పలు కాలనీలకు సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి చెత్త సేకరణకు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించినట్లు వినికిడి. ఈ విధానాన్ని ముందుగా కొన్ని కాలనీల్లో అమలు చేసి...భవిష్యత్తులో అన్ని కాలనీల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. మున్సిపల్ నిర్ణయం ఎలా వున్నా.. చెత్త సేకరణ ప్రైవేటీకరణపై పట్టణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి
● తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించండి ● కలెక్టర్ హైమావతి నంగునూరు(సిద్దిపేట): అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులకు సూచించారు. గురువారం పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లుకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, బార్దాన్, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్ను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మాట్లాడుతూ వరి పంట కోయగానే తేమ లేకుండా ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు. దిగుమతిలో జాప్యం తగదు చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం దిగుమతిలో జాప్యం రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని పెద్దకోడూరు, గోనెపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు, నిర్వహకులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగ్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తాగు నీరు, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. -
మామిడి పండ్ల ఎగుమతులపై అవగాహన
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మామిడి పండ్ల ఎగుమతి, ఉత్పత్తులపై గురువారం రైతులకు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఏపీఈడీఏ సంస్థకు చెందిన ఏజీఎం ఆర్పీ నాయుడు, బీడీఎం బాష మాట్లాడుతూ మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై అవగాహన కల్పించారు. గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు, పంటలో అవశేషాల నియంత్రణ, నాణ్యత ప్రమాణాలు, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ నిర్వహణ, ఎగుమతి విధానాలపై విపులంగా వివరించా రు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం అతిథులను వర్సిటీ అధికారులు సత్కరించారు. పథకాలు సద్వినియోగం చేసుకోండి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కోరారు. గురువారం మండల పరిధిలోని అందె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్ధతు ధరను పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, జిల్లా నాయకుడు సూకూరి లింగం తదితరులు పాల్గొన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలిగజ్వేల్: స్వయం సహాయక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన ఆకాంక్షించారు. గురువారం గజ్వేల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అధర్యంలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’లపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడగళ్ల వాన.. రైతన్న హైరానా
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● పలు ప్రాంతాల్లో తడిసిన వరి ధాన్యం ● నేలకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● నిలిచిన విద్యుత్ సరఫరా ● ఇబ్బందులు పడిన ప్రజలు జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచికొట్టింది. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించినా రైతులకు నష్టాన్ని కలిగించింది. అకాల వర్షానికి సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. అలాగే ఆరుబయట ఉన్న ధాన్యం రాశులు తడవకుండా అన్నదాతలు శ్రమించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొన్నాల, బక్రిచెప్యాల, నాంచారుపల్లి, ఎన్సాన్పల్లి, కృష్ణసాగర్లో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో పాటు చేనులోని వరి గింజలు నేలరాలాయి. తడిసిన వరి ధాన్యాన్ని సిద్దిపేట అర్బన్ మండల వ్యవసాయధికారి శ్రీనాథ్ పరిశీలించారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/సిద్దిపేటఅర్బన్/ సిద్దిపేటజోన్ -
భూసారం మేరకే ఎరువులు వాడాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): భూసార పరీక్షల ఆధారంగానే అవసరమైనంత ఎరువులు వాడాలని శాస్త్రవేత్తలు ప్రసాద్, సురేష్, పల్లవి సూచించారు. బుధవారం చిన్నకోడూరులో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల, నీటి కాలుష్యం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చు వృథా అవుతుందన్నారు. సేంద్రియ, జీవన ఎరువులను వినియోగించాలన్నారు. తద్వారా పంట పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ వంటివి వాడాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
రాయితీపై డ్రోన్లు
జహీరాబాద్: వ్యవసాయంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గాను యాంత్రీకరణ అన్నదాతను ఆదుకుంటోంది. పొలం దుక్కి దున్నడం వద్ద నుంచి పంట చేతికి అందివచ్చే వరకు అత్యాధునిక పరికరాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. యాంత్రీకరణతో వ్యవసాయ పనులు చకచకా సాగడమే కాకుండా సకాలంలో పనులను పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతోంది. కూలీల కొరత సైతం తీరుతోంది. పంటల్లో వచ్చే చీడ పీడల నివారణ కోసం పురుగు మందులను పిచికారి చేసేందుకు గాను డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వాటి వినియోగం నానాటికీ పెరుగుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో వానాకాలంలో 7.60లక్షలు, యాసంగిలో 2.80లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, అల్లం, అరటి, కంది, మినుము, పెసర, శనగ, జొన్న, ఆలుగడ్డ, అల్లం, బొప్పాయి, అరటి, పసుపు, సోయాబీన్పంటల సాగుతో పాటు కూరగాయ పంటలు సాగవుతున్నాయి. జిల్లాకు పది మేర కేటాయింపు మొదటి విడతలో జిల్లాకు 10 డ్రోన్లు కేటాయించింది. మార్చిలో 10 డ్రోన్లను పంపిణీ చేయాలని లక్ష్యం నిర్ణయించగా 9 డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా ముందుకు వచ్చే రైతులకు, ఆయా సంఘాలకు డ్రోన్లను ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాగానే అందుకు అనుగుణంగా పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఒక్కో డ్రోన్ యూనిట్ వ్యయం ఆయా కంపెనీలను బట్టి రూ.9.50 లక్షల నుంచి రూ.11.50లక్షల వరకు ఉన్నాయి. ప్రతి యూనిట్కు 40 శాతం మేర సుమారు రూ.4లక్షల వరకు రాయితీ ఇస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్కు రూ.4లక్షల వరకు సబ్సిడీ సహకార, మహిళాసంఘాలకు ప్రాధాన్యం రైతులకు తీరనున్న పిచికారీ అవస్థలు జిల్లాలో 10డ్రోన్లకు 9 పంపిణీ -
కొండపోచమ్మలో బోటింగ్
అధునాతన స్పీడ్ బోట్ల ఏర్పాటు పర్యాటక శాఖ రాష్ట్రంలోని 12 జలశయాల వద్ద బోటింగ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందులోభాగంగానే కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లో ‘బోటింగ్’ను ఏర్పాటు చేస్తున్నారు. అధునాతన స్పీడ్ బోట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దీంతీ కొండపోచమ్మసాగర్ పరిసరాల్లో సందడిపెరిగి.. మరిన్ని హోటళ్లు, రెస్టారెంట్లు రానున్నాయి.గజ్వేల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కొత్త శోభను సంతరించుకొని, మరింత ఆహ్లాదాన్ని అందించబోతున్నది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ రిజర్వాయర్లో బోటింగ్ ఏర్పాటుచేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం శాఖ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలోని 12 జలశయాల్లో బోటింగ్ ఏర్పాటుకు నిర్ణయించగా.. అందులో కొండపోచమ్మసాగర్ ఒకటి. మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా మర్కూక్ మండల కేంద్రంలో కొండపోచమ్మసాగర్ జలాశయం నిర్మాణం జరిగింది. 2020 మే 29న ఈ జలాశయాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ల్లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్లోకి మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల మీదుగా జిల్లాలోని రంగనాయక్సాగర్, మల్లన్నసాగర్ ద్వారా కొండపోచమ్మసాగర్లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లామీదుగా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి ఉంది. అంతేకాకుండా వరంగల్ హైవే, నిజామాబాద్వైపు వేళ్లే 44 నంబర్ జాతీయ రహదారితో ఈ రోడ్డును అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ రహదారి 96కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూవస్తోంది. ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న పర్యాటకులను మరింత ఆహ్లాదపరచడానికి ప్యారాచూట్ విహారం ఏర్పాటు చేశారు. భద్రతపై తొలగని ఆందోళన కొండపోచమ్మసాగర్కు సెలవు రోజుల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రిజర్వాయర్ను ప్రారంభించిన తొలి నాళ్లల్లో ఇక్కడ పోలీస్ అవుట్పోస్ట్ కొనసాగింది. అదేవిధంగా సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ రానురానూ ఇక్కడ భద్రత తగ్గింది. 2025 జనవరి 11న హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా చర్యలపై సైతం అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ఏర్పాటుకు రంగం సిద్ధం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు -
శుద్ధీకరణకు విద్యుత్ భారం ఉండదిక..
సిద్దిపేటజోన్: మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ) విద్యుత్ భారం నుంచి గట్టెక్కేందుకు సిద్దిపేట బల్దియా వినూత్న ప్రక్రియ చేపట్టింది. యూజీడి పథకానికి అనుసంధానంగా ఎస్టీపీని అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జెల్ హి అమృత్ పథకం కింద ఉత్తమ నిర్వహణకు గాను రూ.2.75కోట్లు ఇన్సెంటివ్ కింద మంజూరు చేసింది. ఆ నిధులతో ఎస్టీపీలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. శుద్ధీకరణ ప్రక్రియ కోసం విద్యుత్ చార్జీల భారం పడకుండా సొంతంగా సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కమిషనర్ ఆశ్రిత్ కుమార్ లాంఛనంగా సోలార్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట మున్సిపాలిటికీ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిందన్నారు. వచ్చిన నిధులతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తంగా 286 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ ప్రేరణ, ఇంజనీర్ పథ్వీరాజ్, కౌన్సిలర్ అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ -
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో స్తంభించిన ప్రజారవాణా
విధులు బహిష్కరించి నిరసన ● ఇబ్బందులు పడిన ప్రయాణికులుడిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులుసిద్దిపేటకమాన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ –ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచే విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఎలాంటి గొడవలు జరగకుండా డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసు పహారా మధ్య తిరిగిన అద్దె బస్సులు కార్మికులు సమ్మెలో ఉండటంతో అద్దె బస్సులను తిప్పడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలో 63 ఆర్టీసీ, 53 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో 30అద్దె బస్సులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వినియోగించి జేబీఎస్, మెదక్ వంటి ప్రాంతాలకు తిప్పారు. అలాగే దుబ్బాక డిపోలో ఎనిమిది అద్దె బస్సులు కలుపుకొని మొత్తం 37 బస్సులున్నా అన్నీ డిపోకే పరిమితమయ్యాయి. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డిపోలో 70 బస్సులకు గాను ఒక ఆర్టీసీ, 16 అద్దె బస్సులు నడిచాయి. హుస్నాబాద్ డిపోలో 22 అద్దె బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పారు. సిద్దిపేట డిపో పరిధిలో వివిధ ప్రాంతాలకు నడిపిన అద్దె బస్సుల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండులు వెలవెలబోయాయి. ప్రైవేటు నిలువు దోపీడీ ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహ నదారులు అధిక చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో సిద్దిపేట నుంచి జేబీఎస్కు ఒక్కొక్కరికి రూ.150 చార్జీ చేయగా.. ప్రైవేటు వాహనదారులు రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించి మరిన్ని బస్సులను నడపనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు.కాంట్రాక్ట్ పద్ధతిన కండక్టర్లు, డ్రైవర్లు కావలెనుహుస్నాబాద్: ఆర్టీసీ డిపోలో రోజు వారి కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయుటకు కండక్టర్లు, డ్రైవర్లు కావాలని హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. కండక్టర్ పదో తరగతి ఉత్తీర్ణత, డ్రైవర్కు హెవీ లైసెన్స్ 18 నెలల అనుభవం ఉండాలని సూచించారు. ఆసక్తి గల వారు ఒరిజినల్ ధ్రువపత్రాలతో డిపోలో హాజరు కావాలని సూచించారు. -
జిల్లా కవులకు అవార్డులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కవులకు అవార్డులు వరించాయి. సిద్దిపేటకు చెందిన ఉండ్రాళ్ళ రాజేశం, భైతి దుర్గయ్యలకు బాలసాహితీ మిత్ర అవార్డుతో పాటు జ్ఞాపిక, రూ.5వేల నగదు అందజేయనున్నట్లు సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య బుధవారం తెలిపారు. రెండు దశాబ్దాలుగా వివిధ బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలలచే రచనలు చేయించి పుస్తక రూపంలో అందించినందుకు గాను జాతీయస్థాయిలో బాలసాహితీమిత్ర అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 4న నగరంలో నిర్వహిస్తున్న బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో అవార్డులు అందించనున్నట్లు చెన్నయ్య చెప్పారు. కాంగ్రెస్తోనే సొంతింటి కల సాకారం కొండపాక(గజ్వేల్): పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. కొండపాక మండలం సిర్సనగండ్ల, కుకునూరుపల్లిలో బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం పథకం కింద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువగా లబ్ధిపొందారన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగ్య కుటుంబానికి అండగా ఉంటాంమిరుదొడ్డి(దుబ్బాక): ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య ఎలియాస్ రూపీ కుటుంబ సభ్యులను ధర్మారంలో బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రజాభ్యుదయం కోసం 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి పోరాడిన భాగ్య ఎన్కౌంటర్లో మృతి చెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రచారానికి చెంపపెట్టుఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కరువును శాశ్వతంగా నిర్మూలించేందుకు దోహదపడిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నిరంతరం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. జస్టిస్ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతోనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలన్నారు. నర్సాపూర్: మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఇన్చార్జి కమిషనర్ తిరుపతి తెలిపారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వారి కోసం రెండు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రెండు కోఆప్షన్ పదవులు ఉంటాయని, రెండు వర్గాలలో ఒక పోస్టు మహిళకు కేటాయించినట్లు చెప్పారు. కాగా ఈనెల 23 నుంచి 29 వరకు తమ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. -
ప్రైవేట్ బస్సులను అడ్డుకున్న కార్మికులు
హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. డిపో ఎదుట మహిళా కార్మికులు బతుకమ్మ ఆటపాటలతో నిరసన చేపట్టారు. ప్రైవేట్ బస్సులను నడిపే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షాల వేళ అప్రమత్తం
చేర్యాల(సిద్దిపేట): అకాల వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తేమ శాతం రాగానే లోడ్ చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం తాడూరు, చిట్యాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడారు. మిల్లులు కేటాయించలేదని పలువురు రైతులు తెలిపారు. వెంటనే ఏపీఎంకు ఫోన్ చేసి వారం క్రితమే మిల్లుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని, తేమశాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, కాంటాలు, ప్యాడీ క్లీనర్లు, తాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మొత్తం 419 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలైందని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన తేమ శాతం రాగానే ధాన్యాన్ని లోడ్ చేయండి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు -
ఆర్టీసీలో సమ్మె సైరన్..
రైతులకు అండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అన్నారు. వివరాలు 8లో uనేటి నుంచి కార్మికుల ఆందోళన ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులుబుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సిద్దిపేటకమాన్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ అధికారులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సిబ్బంది ముందుగా ప్రకటించిన విధంగా బుధవారం తెల్లవారుజాము నుంచే సమ్మె బాట పట్టనున్నారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021–25 వేతన సవరణ పేస్కేల్ అమలు చేయడం, ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించడం వంటి పలు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. నాలుగు డిపోల పరిధిలో.. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్ –ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె బస్సులు 285 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. సిద్దిపేట డిపోలో సుమారుగా 300మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. నాలుగు డిపోల పరిధిలో ఉద్యోగులు బుధవారం తెల్లవారుజాము నుంచే విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గోననున్నట్లు వారు ప్రకటించారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించక తప్పడం లేదని పలువురు ఉద్యోగులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రామాయంపేట, హుస్నాబాద్, కామారెడ్డి, వేములవాడ, జగిత్యాల వంటి పలు ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు తిప్పలు తప్పే అవకాశం లేనట్లే. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.హుస్నాబాద్: డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులుఏర్పాట్లు చేస్తున్నాం రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెలో ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో డ్రైవింగ్ వచ్చిన వారిని డ్రైవర్లుగా వినియోగించుకోనున్నాం. అద్దె బస్సులకు కండక్టర్లను ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు తిప్పడానికి ప్రయత్నిస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, 25నుంచి 35ఏళ్ల వయసు ఉండి డ్రైవింగ్ వచ్చిన వారిని డ్రైవర్లుగా, పదవ తరగతి పాసై 25నుంచి 35ఏళ్ల మద్య వయసు ఉన్న వారిని కండక్టర్లుగా తీసుకుని బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – భవభూతి, సిద్దిపేట ఆర్టీసీ డీఎం -
కో ఆప్షన్ పదవులు దక్కేదెవరికో?
దుబ్బాక: మున్సిపల్లో కో ఆప్షన్ పదవుల ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. పదవుల కోసం మొత్తం పది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు పదవులకు పది మంది పోటీ పడుతుండటంతో ఎంపిక ఆసక్తికరంగా మారింది. మున్సిపల్లో మొత్తం 20 కౌన్సిలర్లకు గాను బీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్ల బలంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను దక్కించుకున్నారు. కాంగ్రెస్కు 4, బీజేపీకి ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. దీంతో నాలుగు కో ఆప్షన్ పదవులను బీఆర్ఎస్కు అవకాశం ఉండటంతో చాలా మంది నేతలు ఎలాగైన దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నం కోసం.. మైనార్టీ కోటాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖలీల్, వసీం, మైనారిటీ మహిళా కోటాలో కై సర్, నసీమా, ప్రజాప్రతినిధుల కోటాలో జనరల్లో మాజీ కౌన్సిలర్లు ఆస యాదగిరి, కూరపాటి బంగారయ్య, మాజీ సర్పంచ్ వేముల మల్లేశంగౌడ్, ఆస రవి, మహిళా కోటాలో మాజీ కౌన్సిలర్లు పల్లె మీనా, గోనెపల్లి దేవలక్ష్మీ, దేవుని లలిత దరఖాస్తు చేసుకున్నారు. పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రసన్నం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కో ఆప్షన్ ఎంపిక ఎమ్మెల్యేకు సైతం తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కో ఆప్షన్ పదవులు ఎవరి దక్కుతాయోనన్నది మూడు రోజులు వేచి చూడాల్సిందే.హుస్నాబాద్లో 11 మంది దరఖాస్తుహుస్నాబాద్: మున్సిపల్లోని కో ఆప్షన్ పదవులకు 11 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మొత్తం నాలుగు కో ఆప్షన్లకు గాను మాజీ ప్రజాప్రనిధులు, ఇతర కోటా నుంచి రెండు స్థానాలు ( మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీలకు రెండు స్ధానాలు (మహిళ, జనరల్)కు కేటాయించారు. మొహమ్మద్ రెహానా, కాత సల్మాన్ రెడ్డి, ఫహిమా మున్సీసా బేగం, పచ్చిమట్ల సత్తయ్య గౌడ్, అయిలేని అనిత, వల్లపు రాజయ్య, మొహమ్మద్ హాసన్, కాత గ్లోరీనా , చిట్యాల మలాకి, పున్న లావణ్య, భూక్య సరోజనలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22, 23, 24 దరఖాస్తుల పరిశీలన ఉంటుందని కమిషనర్ తెలిపారు. -
జేఈఈ మెయిన్స్లో మెరిసిన సిద్దిపేట కుసుమాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. సోమవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలను ప్రకటించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన లుక్క అక్షయ్ గుణ 873వ ర్యాంకు, ఊడెం కౌశిక్ వర్ధన్రెడ్డి 1594వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ముంబాయిలో ప్రవేశం పొందడమే లక్ష్యంగా చదువుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో (విద్యారణ్య అవాస విద్యాలయం)లో చేరుటకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ మంగళవారం తెలిపారు. 3వ తరగతిలో 5 సీట్లు, 5వ తరగతిలో 3 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు మే 7న సాయంత్రం 5గంటల లోపు తమ దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మే 15న ఉదయం 11గంటలకు కలెక్టర్ కాంప్లెక్స్లో డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. విద్యాధరి క్షేత్రంలో శంకర జయంతివర్గల్(గజ్వేల్): విద్యాధరి క్షేత్రంలో మంగళవారం శంకర జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో వేదపండితులు ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షకులు ఆదిశంకరుల బోధనలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావన వైపు నడిపించాయన్నారు. ఈ మహోత్సవం అనంతరం సిద్ధాంతిని ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఆకస్మిక తనిఖీ మిరుదొడ్డి(దుబ్బాక): చెప్యాల క్రాస్ రోడ్డులోని గురుకుల బాలుర ఉన్నత పాఠశాల/కళాశాలను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ గణేశ్రెడ్డి, ఇన్ఛార్జి ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్ని గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, ఉపన్యాసం, డ్యాన్స్, డ్రామా, కవితలు, క్విజ్ పోటీలను నిర్వహించారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. కార్యక్రమాలలో నోడల్ అధికారులు, స్థానిక వార్డెన్లు పాల్గొన్నారు. -
వాటర్ షెడ్ పనులు భేష్
చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని చౌడారం గ్రామంలో కొనసాగుతున్న వాటర్ షెడ్ పనులను మంగళవారం స్పెషల్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపడుతున్న వాటర్ షెడ్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలోని ఫార్మేషన్ రోడ్డు, మ్యాంగో ఆర్టికల్ ప్లాంటేషన్, నర్సరీ, ఆయిల్పామ్ తోటలను సందర్శించారు. గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ జనార్దన్, ఏపీఓ శ్యాంసుందర్ రెడ్డి, అధికారులు, సర్పంచ్ వాసుదేవాచారి పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీలక్ష్మి -
ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేయండి
సిద్దిపేటరూరల్: జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి ఈఅర్ఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా దాదాపు సిద్దిపేట 53 వేలు, గజ్వేల్ 33 వేలు, దుబ్బాక 21 వేలు, హుస్నాబాద్ 18 వేలు ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ పెండింగ్ ఉన్నందున వాటిని పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఓటర్ల వద్దకు వెళ్లి వెరిఫై చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల ఈఅర్ఓలు మ్యాపింగ్ పక్కాగా జరిగేలా సమావేశాలు నిర్వహించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ కోసం ఒక టీంను వేసి ప్రణాళిక ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం దిశగా ముందుకు సాగాలి సిద్దిపేటరూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలని కలెక్టర్ కె. హైమావతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని తోర్నాలలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలుర పోస్టుమట్రిక్ వసతి గృహాన్ని కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వారోత్సవాలు నిర్వహణలో భాగంగా రోజువారి కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు.కలెక్టర్ హైమావతి -
అవార్డులు, రివార్డులతో ఖ్యాతి
వర్గల్(గజ్వేల్): అవార్డులు, రివార్డులు, పుస్తకావిష్కరణలతో యూనివర్సిటీ ఖ్యాతి ఇనుమడించిందని గౌరారం కావేరి యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ డాక్టర్ వీ. ప్రవీణ్రావు అన్నారు. మంగళవారం వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వప్రకాశ్బాబు రచించిన ‘ఏ టెక్స్ట్బుక్ ఆఫ్ జెనరలైజ్డ్ థీరీ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రంగంలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ఈ గ్రంథం ముఖ్యమైన శాసీ్త్రయ ఆధారంగా నిలుస్తుందన్నారు. కావేరి యూనివర్సిటీ ఇటీవల వివిధ సంస్థల ద్వారా మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బీ. శ్రీనివాసులు, డీన్లు ప్రతాప్కుమార్ రెడ్డి, కొండ శ్రీనివాస్, సునీత మెహతా, ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సౌర వెలుగు.. ముందడుగు
సోలార్ విద్యుత్తో ఇక ఎస్టీపీలు జల్ ిహీ అమృత్ పథకంలో భాగంగా ఏర్పాటు 15 రోజుల్లో అందుబాటులోకి నర్సాపూర్ ఎస్టీపీ వద్ద ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా విద్యుత్ బిల్లును తగ్గించేందుకు సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశారు. 2022లో రెండు చోట్ల మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లు భారాన్ని తగ్గించేందుకు మున్సిపాలిటీ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. – సాక్షి, సిద్దిపేట సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్లో 11 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే), చింతల్ చెరువు వద్ద 7.25 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీలు పని చేస్తున్నాయి. ఈ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లు (ఎస్టీపీ) విద్యుత్పై ఆధారపడి నడుస్తున్నాయి. మోటార్లు, పంపులు నిరంతరం పని చేయాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఫలితంగా ప్రతీ నెల రూ.8లక్షలపై విద్యుత్ బిల్లు భారంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సూర్యశక్తి వైపు అధికారులు అడుగులు వేస్తున్నారు. జల్ ిహీ అమృత్ స్కీంలో భాగంగా ఎస్టీపీల వద్ద రూ.1.92కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నర్సాపూర్ ఎస్టీపీ వద్ద 245 కిలో వాట్స్, చింతల్ చెరువు వద్ద 42కిలో వాట్స్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యానల్స్ను బిగించారు. గ్రిడ్తో కనెక్షన్ ఇస్తున్నారు. మరో 15 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకరానున్నారు. ఎస్టీపీలు సోలార్ విద్యుత్తో కొనసాగడం ద్వారా ఒక వైపు విద్యుత్ బిల్లు తగ్గడంతో పాటు గ్రీన్ ఎనర్జీ కానుంది.ఫోర్ స్టార్ రేటింగ్ ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి అధికారులు సిద్దిపేటలో ఉన్న ఎస్టీపీలను పరిశీలించారు. నర్సాపూర్ ఎస్టీపీకి ఫోర్ స్టార్, చింతల్ చెరువుకు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు ఎస్టీపీలకు మాత్రమే ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో ఒకటి సిద్దిపేటలోని నర్సాపూర్ ఎస్టీపీ వచ్చింది. ప్రతీ రోజు నర్సాపూర్ ఎస్టీపీ ద్వారా 9.5 ఎంఎల్డీ , చింతల్ చెరువు ఎస్టీపీ 6ఎంఎల్డీ నీటిని శుద్దిచేసి అందిస్తోంది. మురుగు నీటిని శుద్ది చేసిన తర్వాత చెరువులు నింపుతున్నారు. అలాగే పట్టణంలో నాటిన మొక్కలకు నీటిని వీటినే అందిస్తున్నారు.ప్రతీ నెల రూ.8లక్షలు ఆదా ఎస్టీపీలలో విద్యుత్ బిల్లు ప్రతీ నెల దాదాపు రూ.8లక్షల వరకు వస్తోంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లు ఆదా కానుంది. త్వరలో స్థలాలు ఉన్న దగ్గర సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. బుస్సాపూర్ డంప్ యార్డ్ వద్ద సైతం సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – అశ్రిత్ కుమార్, కమిషనర్, సిద్దిపేట మున్సిపాలిటీ -
పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తాం
వర్గల్(గజ్వేల్): ఎన్నికల్లో హామీ ప్రకారం సీఎం రేవంత్రెడ్డి జూన్ 2లోపు 50శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళవారం వర్గల్ మండలం నెంటూరులో పీఆర్టీయూ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన మైలారం జెడ్పీహైస్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యేశ్వర్రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పీఆర్సీ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు అని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు సుబ్రహ్మణ్యేశ్వర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ ఆనంద్ కిషోర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్శర్మ, మండల ప్రధాన కార్యదర్శి పారుపల్లి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ రంగారెడ్డి, ఎంఈఓ సునీత, నాయకులు కరీమొద్దీన్, రామకృష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు
దుబ్బాకరూరల్: మండలంలోని రాజక్కపేట అంగన్వాడీ కేంద్రంలో ఉడక బెట్టిన గుడ్లు కుళ్లిపోయాయి. మంగళవారం పిల్లలకు ఉడక బెట్టిన గుడ్లు వడ్డించారు. గుడ్లను చిన్నారులకు ఇవ్వగా వారితో వచ్చిన తల్లులు వాటిని విప్పడంతో పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో వారు ఆందోళన చెందారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో అంగన్వాడీ సిబ్బందిని నిలదీశారు. కుళ్లిపోయిన గుడ్లను ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. కలుషిత ఆహారం తీసుకోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్కు సీడీపీఓ ఎల్లయ్య చేరుకుని అక్కడ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలకు సంబంధించిన గుడ్లను వడ్డించడం వల్లే కుళ్లి పోయాయని తెలిపారు. గుడ్లను ఎప్పటికప్పుడే వడ్డించాలని, కాలం చెల్లిన వాటిని పెట్టకూడదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి టీచర్కు, ఆయాకు మెమోలు జారీ చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్తులు సీడీపీఓకు వినతి పత్రం అందజేశారు.ఆందోళన చెందిన తల్లిదండ్రులు -
వడదెబ్బతో రైతు మృతి
హుస్నాబాద్రూరల్: వడదెబ్బతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పోతారం(ఎస్)లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంసాని దేవేంద్రరెడ్డి (58) ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టారు. మూడు రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టిన క్రమంలో ఎండకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమీప రైతులు హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు ప్రదీప్, కూతురు ఉన్నారు. 1 నుంచి సాంస్కృతిక వారోత్సవాలు గజ్వేల్రూరల్: మే 1 నుంచి 7 వరకు శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య తెలిపారు. గజ్వేల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ శ్రామికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
నాలుగెకరాలు వదిలేశా
చెరువు కట్ట తొలుకులతోని శాన బలహీనమైంది. కట్ట మధ్యల ఇరుపు గండ్లు పడి పొలాల్లోకి నీళ్లు జాలు వారుతున్నయ్. దిగబాటుతోని సాగు కష్టమై నాలుగెకరాలు బీడుగ వదిలేశాను. కట్ట పకడ్బందీ చేస్తే మళ్లీ పొలాలు సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. – కృష్ణారెడ్డి, ఆయకట్టు రైతు పనులు చేపడతాంబంధం చెరువు హల్దీకి ఫీడర్ చానల్గా కీలకమవడందో గోదావరి జలాలతో నిండుగా ఉంటోంది. చెరువులో నీటితో మరమ్మతులు సాధ్యం కాలేదు. ప్రస్తుతం చెరువులో నీళ్లు అడుగంటడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతాం. రిబిట్మెంట్తో కట్టను పటిష్టం చేస్తాం. నెలరోజుల్లోగా పనులు పూర్తిచేస్తాం. – పవన్కుమార్, డిప్యూటీ ఈఈ -
మంత్రి చెంతకు బాధితుడు
● న్యాయం చేయాలని వేడుకోలు ● రింగ్ రోడ్డు వ్యవహారంలో మరో ట్విస్ట్ గజ్వేల్: రింగ్ రోడ్డు అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈనెల 11న రింగ్ రోడ్డు పనులు ఆగిపోయిన రైతు రామచంద్రం పొలం వద్దకు ఎంపీ రఽఘునందన్రావు వెళ్లడం, సదరు రైతుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా బాధిత రైతు మంత్రి దామోదరను కలిసి న్యాయం చేయాలని కోరడం చర్చనీయాంశంగా మారుతోంది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పనులు రూ.233 కోట్ల వ్యయంతో చేపట్టగా, 23కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. సంగాపూర్ రోడ్డు వైపున రైతు రామచంద్రం పొలం వద్ద కేవలం 150మీటర్ల పనుల పెండింగ్ వల్ల పదేళ్లుగా అనుసంధానానికి నోచుకోని విషయం విదితమే. మరోవైపు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతు రామచంద్రానికి భూమికి, భూమి ఇవ్వాలని, లేదా మెరుగైన పరిహారం ఇవ్వాలని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 2023లో సదరు రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ రైతుకు తగువిధంగా న్యాయం చేయడానికి ప్రజాప్రతినిధుల నుంచిగానీ, అధికారుల నుంచిగానీ గట్టి ప్రయత్నం జరగలేదు. దీంతో అప్పటినుంచి పెండింగ్లోనే ఉంది. ఈ క్రమంలో ఈనెల 11న ఎంపీ.. రింగ్ రోడ్డు పనులు పెండింగ్లో ఉన్న రామచంద్రం పొలం వద్ద స్వయంగా పరిశీలన జరిపారు. రైతుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, లేదంటే చట్టప్రకారం ముందుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ఎంపీ ప్రకటన తర్వాత అధికారుల నుంచి తరుచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆందోళనకు గురైన బాధిత రామచంద్రం, తన భార్య, కుమారునితో సోమవారం మంత్రి దామోదరను కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఈ పరిణామం పట్టణంలో చర్చనీయాంశంగా మారుతోంది. మంత్రిని కలిసిన తర్వాతనైనా బాధితునికి న్యాయం జరిగి.. రింగ్ పనులు పూర్తికావడానికి మార్గం సుగమమవుతుందా? లేదా అని అంతా చర్చ జరుగుతోంది. -
కాంటా పెడ్తలేరంటూ రోడ్డెక్కిన రైతులు
కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు: కలెక్టర్● రహదారిపై అడ్డంగా దుంగలు పెట్టి బైఠాయింపు ● మిరుదొడ్డి ఏఎంసీ గోదాం వద్ద ఘటన మిరుదొడ్డి(దుబ్బాక): కొనుగోలు కేంద్రానికి సన్ఫ్లవర్, మక్కలు తీసుకువచ్చి పక్షం రోజులు గుడుస్తున్నా కాంటా వేయడం లేదంటూ సోమవారం మిరుదొడ్డి ఏఎంసీ గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా చెట్ల దుంగలు పెట్టి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోనె సంచులు ఇవ్వడంలో కూడా అధికారులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అనుకూలంగా ఉన్న వారికి గొనెసంచులు అందిస్తున్నారని ఆరోపించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పక్షం రోజులుగా కాంటా పెట్టకుండా, గోనె సంచులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సమాధానం చెప్పి తీరాలని రైతులు పట్టుబట్టారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంటా పెట్టేలా చొరవ తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన చెట్ల దుంగలను పోలీసులే స్వయంగా తొలగించారు. సుమారు గంట పాటు జరిగిన రైతుల ఆందోళనతో మిరుదొడ్డి –గజ్వేల్ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కోహెడరూరల్(హుస్నాబాద్): వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్లో ఐకేపీ సెంటర్ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ముప్పు ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులకు తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి లోడింగ్ చేయాలన్నారు. కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని లారీల కొరత వల్ల రవాణా ఆలస్యమవుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందిస్తూ వెంటనే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి సరిపడా లారీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. -
అర్జీలు పునరావృతం కావొద్దు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను అధికారులు పరిష్కరించి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) లక్ష్మీతో కలిసి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్జీలను వెంటవెంటనే పరిష్కరించి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు మొత్తం 163 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. సోమవారం జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలను రాశారు. ఓపెన్ పదోతరగతిలో 526 మందికి గాను 465 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఓపెన్ ఇంటర్కు 926 మందికి 812 మంది హాజరుకావడంతో 114 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యాశాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ప్రారంభమైన వెల్ఫేర్ వీక్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వెల్ఫేర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీలు, అన్ని వసతి గృహాలను జిల్లా నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా వంటశాలలు, శానిటేషన్, సమగ్ర శుభ్రత ప్రమాణాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర గోరక్ష కో కన్వీనర్ గ్యాదరి రాజారాం ధర్మ యోధ అవార్డు పొందినట్లు భారత్ నేషనలిస్ట్ ఫోరం వ్యవస్థాపకుడు కొత్తకొండ రాజు, ప్రధాన కార్యదర్శి బోండ్ల మల్లికార్జున్ సోమవారం తెలిపారు. సద్గురు ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో సువర్ణ భారతి గోశాలలో భారత్ నేషనలిస్ట్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ చేతుల మీదుగా ధర్మ యోధ అవార్డుతో గ్యాదరి రాజారాంను సన్మానించినట్లు తెలిపారు. -
ఇంటింటికీ గోదారి జలాలు
● ట్రయల్ రన్ సక్సెస్ ● ఐదు వార్డుల్లో తొలి ఫలితం సిద్దిపేటజోన్: గోదావరి నీటిని సిద్దిపేట బల్దియా ప్రజలకు అందించాలనే లక్ష్యంలో తొలి అడుగు పడింది. ఎమ్మెల్యే హరీశ్రావు ముందు చూపుతో శాశ్వత దాహార్తిని తీర్చేందుకు రూపకల్పన చేసిన వాటర్ రింగ్ మెయిన్తో మొదటి ఫలితం అందనుంది. రూ. 50లక్షలతో సిద్దిపేట పట్టణం చుట్టూ భారీ వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే రూ.10లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ వద్ద సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల కొబ్బరికాయ కొట్టి గేట్ వాల్ ఆన్ చేసి ట్రయల్ రన్ చేపట్టారు. దీంతో 5, 6, 7, 22, 26 వార్డుల్లో గోదారి నీరు ఇంటింటికీ సరఫరా కానుంది. ఇదే తరహాలో పట్టణానికి నలుదిక్కులా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగధాంపల్లి, ఇందిరమ్మ కాలనీ, గాడిచర్లపల్లి ప్రాంతాల్లో కూడా రూ.10లక్షల చొప్పున భారీ వాటర్ ట్యాంక్లను నిర్మిస్తున్నారు. మిషన్ భగీరథ తరహాలోనే సిద్దిపేట పట్టణ ప్రజలకు మానేరు నీటితో పాటు గోదారి జలాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, కౌన్సిలర్ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బంధం.. బలహీనం
● ఆయకట్టు సాగుకు స్వస్తి ● మరమ్మతులకు ఇదే సరైన సమయమంటున్న రైతులు వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని చౌదరిపల్లి ‘బంధం’ చెరువు పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీవాగులోకి తరలించే కీలక ఫీడర్ చానల్ ఇది. కోతకు గురైన కట్టతో ‘బంధం’ చెరువు పరిస్థితి ఎప్పుడేమవుతుందో అన్నట్లు మారింది. మరోవైపు కట్ట నుంచి జాలువారుతున్న నీటితో పొలాలు దిగబడుతుండటంతో దాదాపు 60 ఎకరాల ఆయకట్టు సాగుకు రైతులు స్వస్తి పలికారు. 2021లో చెరువు దుస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ, అగ్రిమెంట్ జరిగిపోగా, నాటి నుంచి ‘నిండా జలం’తో చెరువు మరమ్మతులు సాధ్యపడలేదు. ప్రస్తుతం నీరు అడుగంటడంతో సత్వరమే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. భారీ జలాశయాల్లో ఒకటిగా.. పూర్వకాలంలో సాగుకు దన్నుగా వర్గల్ మండలంలో నిర్మితమైన 13 భారీ జలాశయాలలో ‘బంధం’ చెరువు ఒకటి. 12 శతకోటి ఘనపుటడుగుల(మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ చెరువు కింద 118 ఎకరాల ఆయకట్టు నిర్దేశితమైంది. ఎనిమిదేళ్ల క్రితం భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. కట్టకు గండి భయంతో మత్తడి వద్ద మూడు వరుసల రాళ్లు తొలగించారే తప్ప అధికారులు కట్ట పటిష్ఠత చర్యలు చేపట్టలేదు. ఆ తరువాత కట్టకు పగుళ్లు, పిచ్చిమొక్కలతో చెరువు పరిస్థితి మరింత దిగజారింది. హల్దీకి ఫీడర్ చానల్గా.. కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీలోకి తరలించే ఫీడర్ చానల్గా ‘బంధం’ చెరువు కీలకమైంది. 2021 ఏప్రిల్ నుంచి గోదావరి జలాలు హల్దీలోకి గోదావరి జలాలను తరలిస్తుండడంతో వానాకాలం, ఎండాకాలం తేడాలేకుండా నాటి నుంచి బంధం చెరువు నిండుకుండను తలపిస్తోంది. దీంతో అలల తాకిడికి చెరువు కట్ట కోతకు గురవుతున్నది. ‘మైసమ్మ గుడి’ ప్రాంతంలో కట్ట కుంగిపోయి, ఇరుకుగా మారి పటిష్టత కోల్పోయింది. ఇరుపుగండ్లతో సాగుకు స్వస్తి కట్ట మధ్యలో ఇరుపు గండ్లు(పగుళ్లు) ఏర్పడి ఆయకట్టు పొలాల్లోకి నీరు జాలువారుతుందని రైతులు వాపోయారు. నీటిజాలుతో పొలం దిగబడి సాగుచేయలేని పరిస్థితిలో దాదాపు 60 ఎకరాల ఆయకట్టు సాగుకు స్వస్తిపలికామని ఆవేదన వ్యక్తం చేశారు. కట్ట పటిష్టం చేస్తే పొలాలు తిరిగి సాగుచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. -
విద్యాధరి సేవలో కలెక్టర్
వర్గల్(గజ్వేల్): అక్షయ తృతీయ పర్వదినం వేళ ఆదివారం రాత్రి సుప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాఽ దరి క్షేత్రాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీచక్రపూజలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మహ దాశీర్వచనం చేసి, తీర్థప్రసాదం, అమ్మవారి శేషవస్త్రం అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న వెల్ఫేర్ వీక్ను విజయవంతం చేయాలని వసతి గృహాల వార్డెన్లను కలెక్టర్ హైమావతి ఆదేశించారు.ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటశాలలు, కిచెన్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. బాలికల భద్రత అతి ముఖ్యమని కామన్ డైట్ మెనూ పాటించాలని రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్లను ఆదేశించారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర సారస్వత పరిషత్ బాలల కథల పోటీల్లో ‘అందరూ చేసిందే చేద్దాం’ కథ ఉత్తమంగా ఎంపికై నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. మొత్తం 180 కథలలో పది కథలు ఎంపిక కాగా, అందులో సిద్దిపేటకు చెందిన అనిశెట్టి సతీశ్కుమార్ రాసిన కథ ఉత్తమ బహుమతికి ఎంపికైందన్నారు. ఈ మేరకు కవులు బస్వరాజ్కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారన్నారు. హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్యామలత ఆదివారం తెలిపారు. గురుకుల కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనే జ్మెంట్ కోర్సును ప్రవేశ పెట్టారు. గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోర్స్ను ప్రారంభించారు. ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో రజాకర్ 453(500), మణికంఠ 452 (500) మార్కులతో జిల్లా టాపర్స్గా నిలిచారు. ఆసక్తి గల విద్యార్థులు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గ్రూపులో ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈ నెల 25 తేదీలోగా గురుకుల వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
అభివృద్ధి బాధ్యత నాదే..
● సిద్దిపేటను ప్రగతి బాటపట్టిస్తా ● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలో రెండు లక్షల కొత్త పింఛన్లు ● కార్మిక శాఖ మంత్రి వివేక్ సిద్దిపేటజోన్: సిద్దిపేటను అభివృద్ధి బాటలో తీసుకెళ్లే బాధ్యత నాపై ఉందని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట ప్రాంతంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ వార్డులో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలనగా అభివర్ణించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండు లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణానికి త్వరలో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): నైపుణ్యం కల్గిన కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్రంలోని హమాలీల కోసం నూతన చట్టాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన 14 కార్మిక సంఘాల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు విదేశాల్లో ఉద్యోగ కల్పనకు రూ.90 కోట్లు మంజూరు చేసామన్నారు. టామ్కామ్ కంపెనీ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు, కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇచ్చేందుకు త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మికసంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులెన ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సిద్దిపేటలో కార్మిక సంఘం భవనానికి స్థల కేటాయింపుతోపాటు, నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
మన మట్టిబిడ్డ జాతీయ జట్టులో ఆడాలి
● మాజీమంత్రి హరీశ్రావు ● కేసీఆర్ ట్రోఫీలో విజేతలకు బహుమతుల ప్రదానం సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట మట్టి బిడ్డ భారత క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా స్వప్నం.. అప్పుడే సిద్దిపేట స్టేడియానికి సార్థకత లభిస్తుంది’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ అంటే ఒక ఆట కాదని, ఒక కమ్యూనిటీ అని, అందరూ కలిసి కట్టుగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. నేటి యువత కూడా కలిసి మెలసి ఉండాలని సూచించారు. స్నేహం అంటే జీవితాంతం తోడునీడగా ఉండాలన్నారు. క్రికెట్ ఆటలో ఆల్రౌండర్ మాదిరి నిజజీవితంలో కూడా చదువు, ఉద్యోగం, సమాజానికి సేవ, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. క్రికెట్ను కాలక్షేపం కోసం కాకుండా సీరియస్గా ఆడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. భవిష్యత్తులో మహిళా టోర్నీ.. మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నారని, భవిష్యత్తులో సిద్దిపేట ప్రాంత అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ఉమెన్స్ క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. అనంతరం ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన గణేశ్నగర్ 11 జట్టుకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన కింగ్స్ ఖాదర్ పూర జట్టుకు రూ.50వేల ప్రైజ్ మని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాలు మురిసేనా?
కూడళ్లు మెరిసేనా?‘సుందరీకరణ’కు గ్రహణం వీడేనా? జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుందరీకరణ పనులు ఈసారైనా ముందుకు సాగేనా..? అనే చర్చ సాగుతోంది. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టకపోవడంతో ల్యాప్స్ అయ్యాయి. తాజాగా మున్సిపాలిటీలకు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధులతో ఈ పనులు చేపట్టే అవకాశం ఉండగా.. పాలకవర్గాల చొరవపైనే ఆశలు నెలకొన్నాయి. – గజ్వేల్ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన సుందరీకరణ పనులకు ఏళ్ల తరబడి ఏదో అంశం అడ్డంకిగా మారుతోంది. ఫలితంగా గతంలో మంజూరైన నిధులు ల్యాప్స్ కావడంపై చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా నాలుగేళ్ల క్రితం మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటేన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వద్ద గల సర్కిల్, ముట్రాజ్పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిద్దిడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్రాం చౌరస్తా, ముట్రాజ్పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టకుండా చేతులు దులుపుకొన్నారు. వచ్చిన నిధుల్లో పావువంతుకుపైగా మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన ల్యాప్స్ అయ్యాయి. నిధులు మంజూరుతో.. గతంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు ల్యాప్స్ ఇటీవల టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరు పాలకవర్గాల చొరవపైనే ఆశలు జిల్లాలోని మున్సిపాలిటీల తీరు జిల్లాలోని మున్సిపాలిటీల సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఇందులో గజ్వేల్, సిద్దిపేటలకు రూ.18.7కోట్ల చొప్పున, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15కోట్లకుపైగా విడుదలయ్యాయి. ప్రధానంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణలో భాగంగా.. సెంట్రల్ లైటింగ్, హౌసింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ, ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కు సుందరీకరణకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు, మరో రూ.15కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పనులను ప్రారంభించాల్సి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఈ నిధుల్లో సింహభాగం సుందరీకరణకే వెచ్చించాలనుకుంటున్నారు. పాలకవర్గాల చొరవపైనే పనుల ప్రగతి ఆధారపడి ఉంది. -
కాంటా వేసేదెన్నడో?
మిరుదొడ్డి(దుబ్బాక): విత్తనం వేసింది మొదలు చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఉన్న ఉత్సాహం.. వాటి నిర్వహణపై లేకపోవడంతో ధాన్యపు రాశులు ఎక్కడిక్కడా నిలిచిపోయాయి. మిరుదొడ్డి మండల కేంద్రంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కేంద్రాలను నెల క్రితం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. మొదట్లో నామమాత్రంగా కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు రాను రాను కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోవండంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంగా దౌల్తాబాద్, అక్బర్పేట–భూంపల్లి, రాయపోల్, దుబ్బాక మొదలైన మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకువస్తున్నారు. ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా అధికారులు కాంటా పెట్టకపోవడంతో ధాన్యం రాశులు పెరిగిపోతున్నాయనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద మండుటెండలో పడరాని అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ధాన్యం కేంద్రం వద్ద ఎలాంటి మౌలిక వసతులు లేక, మండుతున్న ఎండలకు నిలువు నీడ లేక అరిగోస పడుతున్నామని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లోనే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రాశులు మండుతున్న ఎండల్లోనే రైతుల పడిగాపులు దృష్టిసారించని అధికారులు -
వణికించిన వడగళ్లు
చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్)/ శివ్వంపేట(నర్సాపూర్): అకాల వర్షం జిల్లాను వణికించింది. ఆదివారం ఉదయం ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పడించిన పంట వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడగా, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
విద్య, వైద్యానికే తొలి ప్రాధాన్యం
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
ఉపాధి కూలీల సంఖ్య పెంచండి
దుబ్బాకటౌన్: ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను కనీసం 100 మందికి పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య అధికారులను ఆదేశించారు. శనివారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, రహదారి పక్కన మట్టి పనులు చేపట్టడం ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, సమయానికి వేతనాలు చెల్లించేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను క్రమం తప్పకుండా సేకరించి, డంపింగ్ షెడ్డులకు తరలించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బోర్లు, ట్యాంకులు, పైపులైన్లకు సకాలంలో మరమ్మతులు చేయించాలని సూచించారు.డీఆర్డీఓ జయదేవ్ ఆర్య -
‘కుస్తీ’మే సవాల్
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. క్రమశిక్షణ తప్పనిసరి మెదక్జోన్: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. -
కాంగ్రెస్ నాయకుల మాటలన్నీ అబద్ధాలే
హుస్నాబాద్: గతంలో పనికి రాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి, ఇప్పుడు మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా కాంగ్రెస్ నాయకుల మాటలన్నీ అబద్ధాలని తెలిపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ శివారులోని పోతారం(ఎస్) శుభం గార్డెన్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ గెలిచిందని మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ -
అటవీశాస్త్రంలో పీహెచ్డీ
ములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్ అటవీ శాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు. జీవన్ పీహెచ్డీ సాధించడంపై కళాశాల డీన్ ప్రవీణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత, అధ్యాపకులు అభినందించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: జిల్లాలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ (తె లంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 20నుంచి 27వరకు పరీక్షలు జరగనున్నందున ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షలకు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సర్కారు బడిలో సకల వసతులు హవేళిఘణాపూర్(మెదక్): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్, శశికుమార్, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చిన్నశంకరంపేట(మెదక్): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ యాదగిరిరావు, ఎంఎల్హెచ్పీ కుమారి, సూపర్వైజర్ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు. పకడ్బందీగా జనగణన కౌడిపల్లి(నర్సాపూర్): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు. -
కవిగా నిలబెట్టిన కళాశాల ఇదే
సిద్దిపేట ఎడ్యుకేషన్: తనను కవిగా నిలబెట్టిన కళాశాల సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలేనని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని ిసిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన సందర్భంగా శనివారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ..సిద్దిపేట కళాశాల విద్యార్థిగా తాను కవిత్వంలోకి అడుగు పెట్టానని కళాశాల వాతావరణం తనను కవిగా తీర్చిదిద్దిందన్నారు. బాల్యంలోని బంగారం జ్ఞాపకాలను యువకుడిగా డిగ్రీ కాలేజీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని వాటి ప్రేరణలను విద్యార్థులకు వివరించారు. ‘కట్టువోతల బందారం– బాల్య జ్ఞాపకాలు’‘సిద్దిపేట కాలేజీలో తన విద్యార్థి జీవితం’ఇవి రెండు తనను కవిగా పరిశోధకుడిగా నిలబెట్టాయన్నారు. సిద్దిపేట గడ్డ బందారం గడ్డ ఆనాటి రైతాంగ ఉద్యమాలు తనకు ఉద్యమస్ఫూర్తిని ఉగ్గుపాలతోనే నేర్పించాయని గుర్తు చేసుకున్నారు. కళాశాల తనను ఆత్మీయంగా సత్కరించటం గొప్ప గౌరవమని కళాశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల పూర్వ విద్యార్థి పూర్వాధ్యాపకులు సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత అభినందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.పాపయ్య, సిధారెడ్డి బాల్య స్నేహితులు, అధ్యాపక మిత్రులు బాల నరసయ్య, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, రవికుమార్, శ్రీహరి యాదవ్, బాలమణి, తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ మట్ట సంపత్ కుమార్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.అయోధ్యరెడ్డి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గోపాల సుదర్శనం, తెలుగు విభాగం అధ్యాపకులు పిట్ల దాసు, నారోజు వెంకటరమణ, విద్యార్థులు, పాల్గొన్నారు.డాక్టర్ నందిని సిధారెడ్డి -
ప్రభుత్వంతో పోరాడుతా
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్రావు -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
సిద్దిపేటఅర్బన్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూఓ శారద సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాలలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తే పౌష్టికాహారం అందుతుందన్నారు. చిన్నారులను ఫోన్కు అలవాటు చేయడంతో వారిలో మానసిక ఎదుగుదల లోపించి మాటలు సరిగా రాకపోవడం, ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఉండకపోవడం, ఒంటరితనంకు అలవాటు పడుతారన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారానికి సంబంధించి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ వంటి వాటిని ప్రదర్శిస్తూ గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పొన్నాల సర్పంచ్ అమ్ముల వెంకటయ్య, పోషణ్ అభియాన్ డీసీ వెంకటప్రసాద్, బీసీ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ నరేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.డీడబ్ల్యూఓ శారద -
పసిడి పండుగకు స్వాగతం
సాక్షి, సిద్దిపేట: పసిడి పండుగ రానే వచ్చింది. ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో జిల్లాలోని ప్రముఖ బంగారం షాప్లన్నీ కొత్త మోడళ్ల ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తక్కువ బరువు ఉండే నగలను రూపొందించారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో పనిలో పనిగా ఈ రోజు నగలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు బంగారం షాపులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి ధర ఎక్కువ ఉన్నా.. బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం షాపులన్నీ రద్దీగా ఉంటాయని భావించి కొంత మంది ఇప్పటికే నగలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్లు సైతం ఇచ్చారు. అక్షయ తృతీయ రోజు అభరణాలు తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాగా పలు బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని షాపుల నిర్వాహకులు తరుగులో తగ్గింపు, గోల్డ్, వెండి కాయిన్స్ అందజేయనున్నారు. వివిధ బ్యాంక్ల క్రెడిట్ కార్డులకు క్యాష్ బ్యాక్ను రూ. 1,000 నుంచి రూ.5 వేలు ప్రకటించారు. నేడే అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో హడావుడి జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం అందుబాటులోకి మోడల్స్ అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకొని అనేక మోడల్స్ ఆభరణాలను అందుబాటులో ఉంచాం. ఎంతో కొంత బంగారమైన కొనుగోలు చేయాలని ప్రజల భావిస్తారు. బంగారు ఆభరణాలపై ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. – రాజేశ్, సేల్స్ మేనేజర్, మలబార్ జ్యువెల్లర్స్, సిద్దిపేట -
రక్తం నిండుకుంటోంది
‘గత నెల 31న సిద్దిపేట జీజీహెచ్లో రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో బ్లడ్ కోసం ఇబ్బంది పడుతుంటే సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ స్పందించి రక్తదానం చేశారు. దీంతో ఆ వ్యక్తికి అత్యవసర చికిత్స పూర్తి చేశారు’.సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, 20 నుంచి 30 మంది మహిళలు పురుడు పోసుకుంటున్నారు. ఇందులో చాలా మందికి రక్తం అవసరం అవుతోంది. తలసేమియా బాధితులకు పదిహేను రోజులకోసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం జిల్లాలో బ్లడ్ బ్యాంక్లో నిల్వలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. జీజీహెచ్ (ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి)లో బ్లడ్ బ్యాంక్ ఉంది. వేసవిలో ఏర్పడే కొరతను అధిగమించేందుకు దాతల సహకారం అవసరం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉచితంగా రక్తం కావాలంటే ఇతరుల నుంచి సేకరించి ఇవ్వాల్సి వస్తోంది. వేసవిలో ప్రమాద ఘంటికలు మోగే పరిస్థితులున్నాయి. నెగెటివ్ స్టాక్ తక్కువ జీజీహెచ్లో నెగెటివ్ బ్లడ్ స్టాక్ చాలా తక్కువగా ఉంది. బ్లడ్ బ్యాంక్ మొత్తంగా అన్ని రకాల గ్రూప్లు కలిపి 112 యూనిట్ల రక్తం మాత్రమే నిల్వ ఉంది. అందులో ఏబీ పాజిటివ్ 08, ఏబీ నెగిటివ్ 01, ఓ పాజిటివ్ 39, బీ పాజిటివ్ 35, ఏ పాజిటివ్ 18, ఏ నెగిటివ్ 02, ఓ నెగిటివ్ 06, బీ నెగిటివ్ 03 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రక్తం కొరత ఉండటంతో బ్లడ్ అవసరం ఉన్న వారి తరఫున ఒకరు డొనేట్ చేస్తే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో డొనర్ కోసం రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కొరత ఉండే నెగిటివ్ గ్రూప్లకు సంబంధించిన ఫోన్ నంబర్లకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు. ఎవరు ఇవ్వొచ్చు.. 18– 55 వయసు ఉండి.. 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వారే రక్తదానం చేయాలి. మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. 350 మిల్లీ లీటర్ల మేర రక్తం సేకరిస్తారు. రక్తదానం చేయడంతో శరీరంలో ఐరన్, మినరల్ లెవెల్స్ సమస్థాయిలో ఉండి, శరీరానికి మేలు చేస్తాయి.దాతలు స్పందించాలి రక్త నిల్వలు సమకూరేందుకు యువత, రాజకీయ పార్టీ నేతలు, సినీ హీరో అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. రక్తం కొరత నుంచి గట్టెక్కించ్చేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి. రాజకీయ నేతలు, సినీ హీరో పుట్టిన రోజుల, పెళ్లి రోజుల సందర్భంగా దాతలు ముందుకు వచ్చి యువత, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. అలాగే ఆస్పతి సిబ్బంది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను సంప్రదించి విద్యార్థులచే క్యాంప్లను ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పించాలి. బ్లడ్ బ్యాంక్లో తగ్గుతున్న నిల్వలు నెగెటివ్ గ్రూపుల స్టాక్ చాలా తక్కువ అన్నీ కలిపి 112 యూనిట్లే నిల్వ వేసవిలో మరింత తగ్గే అవకాశంఇబ్బంది లేకుండా చూస్తున్నాం వేసవిలో సాధారణంగా రక్తం కొరత ఉంటుంది. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రస్తుతం జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో అన్ని గ్రూప్ల రక్తపు నిల్వలున్నాయి. బ్లడ్ అవసరం ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులు రక్తం డొనెట్ చేసేలా అవగాహన కల్పిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి క్యాంప్లు ఏర్పాటు చేస్తే వేసవిలో రక్తం కొరత లేకుండా ఉంటుంది. – డాక్టర్ జ్యోతి, ఆర్ఎంఓ, జీజీహెచ్ -
ముగిసిన కో–ఆప్షన్ గడువు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పాలకవర్గానికి అనుబంధంగా ఎన్నిక కావాల్సిన నాలుగు కో– ఆప్షన్ సభ్యులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ ఎస్.నాగేందర్ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్, రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల నుంచి ఇద్దరు సభ్యులు, మైనార్టీల నుంచి ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది. వచ్చిన దరఖాస్తుల్లో ఇద్దరు మైనార్టీలు, నలుగురు మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైర్డ్ గెజిటెడ్ అధికారులెవరూ దరఖాస్తు చేసుకోలేదు. స్క్రూటినీ, విత్డ్రాల అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు. నాలుగు స్థానాలకు ఆరు దరఖాస్తులు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు దూరం -
మంత్రి దామోదరను కలిసిన నిర్వాసిత మహిళలు
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. ప్యాకేజీలు, పరిహారాల కోసం హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన వీరు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2019నుంచి ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి అండగా నిలిచిన దామోదర్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు నిర్వాసిత గ్రామాలకు చెందిన ప్రతినిధులు హయతొద్దీన్ తదితరులున్నారు. సుందరీకరణ పనులు వేగిరం చేయండి హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను వేగిరం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం మ్యాప్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సుందరీకరణ పనులు పూర్తయితే ఎల్లమ్మ చెరువు పర్యాటక కేంద్రంగా మారి, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్ భూక్య సంపత్ నాయక్, అధికారులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతకు ఎన్ఎస్ఎస్ దోహదం రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు వర్గల్(గజ్వేల్): ఎన్ఎస్ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో సేవా నిరతి, సామాజిక బాధ్యతను పెంపొందింపజేస్తాయని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చలమల్ల వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో స్థానిక పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల వారం రోజుల ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవాపథకం) శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ సమాజం, మానవ సంబంధాల పెంపు, నిత్యజీవితంలో సమస్యలపై శిబిరం ద్వారా విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ప్రిన్సిపాల్ గోవిందరావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ జీ భాగ్యలక్ష్మి, రాధా రాణి, ఏటీపీ వర్జిని పాల్గొన్నారు. -
డ్రైవర్ల అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
గజ్వేల్: డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడూ మనసు ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్లో ఫోన్ వాడటం ఎంతమాత్రం సరికాదన్నారు. మరోవైపు సీటు బెల్టులు వాడటం నమోషీగా భావిస్తున్నారని చెప్పారు. కారు ప్రయాణంలో డ్రైవింగ్ చేసే వ్యక్తితోపాటు అందులో ప్రయాణించే ప్రతిఒక్కరూ సీటు బెల్టులు పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్లలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమాల లక్ష్యమన్నారు. ఆటోడ్రైవర్లకు యూనిఫామ్ల పంపిణీ సదస్సులో భాగంగా 150మందికిపైగా ఆటోడ్రైవర్లకు యూనిఫారమ్లను పంపిణీ చేశారు. వైద్యశిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న మరికొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన వీడియో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీపెరుమాళ్, గజ్వేల్ ఆర్డీఓ వీవీల్ చంద్రకళ, గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, జిల్లాలోని ఏసీపీలు, స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా డీజీపీని పోలీసులు సన్మానించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూఆదర్శంగా నిలవాలి చైతన్యం పెంపొందించేందుకే‘అరైవ్–అలైవ్’ : డీజీపీ శివధర్రెడ్డి -
బకాయిలన్నీ చెల్లించాల్సిందే
కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన ● ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన సిద్దిపేటరూరల్: విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలన్నీ చెల్లించాల్సిందేనని టీజీఈజేఏసీ జిల్లా నాయకులు గ్యాదరి పరమేశ్వర్, విక్రంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి బకాయిలను చెల్లించాలన్నారు. హెల్త్కార్డులుపై నగదు రహిత వైద్యం, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి గజ్వేల్: ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్లోని ఐఓసీ ఎదుట పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన రెండు పీఆర్సీలను, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే అందించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల బెనిఫిట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం గజ్వేల్ తాలూకా కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, కోశాధికారి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం, వెంకట్, మహిళా విభాగం నాయకురాలు జబినా సుల్తానా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణరెడ్డి, లింగం, వలీ అహ్మద్, సత్యనారాయణ, శ్రీనివాస్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగేగజ్వేల్లోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గజ్వేల్ శాఖ అధ్యక్షుడు శ్రీనివాసచారి ఆధ్వర్యంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన సిద్దిపేటఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఆవరణలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాల నాయకలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీసీటీఏ, టీఎన్జీఓ, టీజీఓల ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడం విచారకరమన్నారు. -
పైసలు రాక.. పస్తులు
ఉపాధి కూలీల వెతలుమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కూలీలు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.2.95కోట్లు పెండింగ్లో ఉన్నాయి. డబ్బుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో ఉపాధి పనులకు కూలీలు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. – సాక్షి, సిద్దిపేట దాదాపు రూ.6వేలు రావాలి ఉపాధి పనులు చేస్తున్నా డబ్బులు రావడంలేదు. దాదాపు రూ. 6వేలు రావాలి. కూలి డబ్బుల కోసం రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఇంకా పడలేదు అని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి కూలి డబ్బులు త్వరగా చెల్లించాలి. – ముత్యాలు, ఉపాధి హామీ కూలీ,లింగుపల్లి, మిరుదొడ్డి త్వరలో జమ అవుతాయి పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. రోజు పనులకు వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. కూలి పనికి వచ్చిన వారందరికీ తప్పకుండా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. – జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట గ్రామాల్లో రైతులకు, కూలీలకు ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5,69,156 జాబ్ కార్డులుండగా 10,84,409 మంది ఉపాధి కార్మికులున్నారు. అందులో 5,59,118 మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధి పనులకు వెళ్తున్నారు. పనిలోకి వచ్చిన కూలీ పేరు, చేసిన పరిమాణాన్ని రోజూ ఫీల్డు అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉదయం 8గంటలకు ఒక సారి ఫొటో దిగితే , మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు (కనీసం 4గంటలు గ్యాప్) ఫొటో దిగాలి. అప్పుడే ఉపాధి కూలీకి డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. కేవైసీ కొర్రీలతో.. ప్రతి 15 రోజులకు ఒక సారి కూలి డబ్బులు కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమకావాలి. కానీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి డబ్బులు జమ కావడం లేదు. గత రెండు నెలలుగా కూలి డబ్బులు అందక, ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 2,95,49,000లు పెండింగ్లో ఉన్నాయి. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా పరిహారాన్ని అందించాలి. ఉపాధి కూలీలకు డబ్బులు వెంటవెంటనే అందిస్తే ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా కూలి డబ్బులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.జిల్లా జాబ్ కార్డులు కూలీలు బకాయిలు ిసద్దిపేట 1,96,086 3,84,444 రూ.1,26,83,000 సంగారెడ్డి 2,09,508 3,37,490 రూ.56,23,000మెదక్ 1,63,562 3,24,475 రూ.1,12,43,000 రెండు నెలలుగా నిలిచినడబ్బుల చెల్లింపులు పెండింగ్లో రూ.2.95కోట్లు ఎదురుచూస్తున్న కూలీలు ఉమ్మడి మెదక్ జిల్లాలోజాబ్ కార్డులు: 5.69లక్షలు -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గ్రిల్స్ ఏర్పాటు చేయాలి వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న గంగిరేణి చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. చెట్టుపై బంతిపూల దండలు పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. భక్తులు వేసిన దండలను రోజూ తీసివేయాలి. దండలు చెట్టుపై కాకుండా మొదట్లో వేసేలా చర్యలు చేపట్టాలి. – కటకం అమరేందర్ స్థానికుడు రక్షణ చర్యలు చేపడతాం ఇటీవల మూడు నెలలపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షాలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో చెట్టు ఎండిపోతోంది. వాటిని తొలగించి రక్షణచర్యలు చేపడతాం. – కృష్ణ ప్రసాద్, ఆలయ ఈఓదేవుని చెట్టుకు ఏమైంది?కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దేవుని చెట్టుగా పిలువబడే గంగిరేణి వృక్షం మోడుబారుతోంది. భక్తులు వేసిన పూల దండలు తొలగించకపోవడమే కారణమని పలువురు వాపోతున్నారు. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే భక్తులు.. ఆలయ ప్రాంగణంలోని గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించి ముడుపులు కడుతుంటారు. ఇలా నిత్యం వేలాది పూల దండలను చెట్టుపై వేస్తుండటంతో కొమ్మలన్నీ చిగురించకపోగా చెట్టంతా మోడుబారుతుంది. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా కళకళలాడే వృక్షం పూల దండలు వేయడం వల్లే ఇలా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. భక్తులు వేసిన పూలదండలను నిత్యం ఆలయ సిబ్బంది తొలగించాలి. కానీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వృక్షం కళావిహీనంగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు పరిరక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. మోడుబారుతున్న గంగిరేణి వృక్షం పూలదండలు తొలగించకపోవడమే కారణమా? రక్షణ చర్యలు తీసుకోవాలనికోరుతున్న భక్తులు -
‘రోడ్డు భద్రత’పై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రోడ్డు భద్రతలపై నిర్లక్ష్యం వీడాలని, నిబంధనలు పాటిస్తే క్షేమంగా గమ్యం చేరవచ్చని రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం, సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి లక్రా మాట్లాడుతూ రహదారి భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరిదన్నారు. రోజూ జరుగుతున్న ప్రమాదాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలేనన్నారు. ముఖ్యంగా వాహనదారులు నిద్రలేకుండా సుదూర ప్రయాణాలు చేయడం, మద్యం సేవించడం, అతివేగం, కంటిచూపు సక్రమంగా లేకపోవడమే కారణమన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సీట్బెల్ట్ , హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో కంటి చూపు సమస్యలు వస్తాయన్నారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు తక్షణం సీపీఆర్ చేయడం ద్వారా వారి జీవితాన్ని రక్షించే అవకాశం ఉంటుందన్నారు. అంతకు ముందు సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వాహనదారుడు క్షేమంగా ఇంటికి చేరడమే అన్నారు. అందువలన వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారులపై ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. రహదారులపై ఎవరైనా ప్రమాదాలకు గురైతే వెంటనే డయల్ 100, 108లకు సమాచారం అందించి, ప్రాణాలను కాపాడాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై వాహనదారులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పోలీస్శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా -
ప్రజల వద్దకే పాలన
కలెక్టర్ హైమావతి కొమురవెల్లి(సిద్దిపేట): ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చేందుకే ప్రభుత్వం ‘ప్రజా పాలన– ప్రణాళికలు’ తీసుకువచ్చిందని కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కో అంశంపై ప్రణిళికలు చేస్తూ చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. జూన్ 2 నుంచి కుటుంబ జీవిత బీమాను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ శ్రీనివాస వర్మ, అధికారులు ,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కో ఆప్షన్ పదవుల పందేరం
నోటిఫికేషన్ జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్: ఎన్నో రోజులుగా ఆశావహులు ఎదురు చూస్తున్న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక సందడి మొదలైంది. బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సారిగా హుస్నాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకున్న విషయం విదితమే. 20 వార్డులకు గాను 14 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ గెలుచుకుంది. నలుగురు కో ఆప్షన్ సభ్యులను కౌన్సిల్ ఎన్నిక చేయనుంది. ఇందులో మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర కోటా నుంచి రెండు స్ధానాలు (మహిళా, జనరల్)కు కేటాయించారు. మైనార్టీలకు రెండు స్థానాలు (మహిళ, జనరల్) కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టికెట్లు ఆశించి భంగపడిన వారికి, మాజీ కౌన్సిలర్లకు కో ఆప్షన్ పదవులు ఇస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉంటున్న కాంగ్రెస్ నాయకులు కో ఆప్షన్ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీ కోటా నుంచి మాజీ ఎంపీటీసీ ఎండీ హస్సేన్ ముందు వరుసలో ఉన్నారు. అలాగే మాజీ ప్రజా ప్రతినిధుల కోటా నుంచి పున్న లావణ్య, తణుకు ఆంజనేయులు, స్వరూప, వల్లపు రాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఆశీస్సులు ఉన్న వారికి కో ఆప్షప్ పదవులు దక్కనున్నాయి. అర్హులైన వారు ఈనెల 21వ తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో ధరఖాస్తులు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కోరారు. -
సారు.. ఇదేం తీరు
● స్వచ్ఛమైన నీరు అని చెప్పే వారే తాగకపోవడమా? ● ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ● అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు భగీరథ నీరు.. అధికారులు తాగరు ‘మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి.. పలుమార్లు శుద్ధి చేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం.. భగరీథ నీటిని తాగడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటా’రని అధికారులు తరచూ చెప్పే మాటలను వారే ఆచరించకపోవడం విచిత్రం. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు తెప్పించుకుని తాగుతుండటం గమనార్హం. చెప్పే వారే పాటించకపోతే ఎలా అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామ పంచాయతీలలో 1,515 ఓవర్హెడ్ ట్యాంక్ల నుంచి 2,06,308 గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. కానీ ఆ నీటిని కార్యాలయ సిబ్బంది తాగకుండా ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని తెప్పిస్తున్నారు. ఇలా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను అధికారులే వినియోగిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా ఆ నీరు తాగడం లేదంటే.. భగీరథ నీటిపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల్లో మినరల్ వాటర్కు స్వస్తి పలికి మిషన్ భగీరథ వాటర్ను తాగి ప్రజల్లో మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది. సమీకృత కలెక్టరేట్లో సైతం.. జిల్లా సమీకృత కలెక్టరేట్లో దాదాపు 44శాఖలకు సంబంధించిన జిల్లా ప్రధాన కార్యాలయాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సమీకృత కలెక్టరేట్కు నిత్యం ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నుంచి ఆటో ట్రాలీ వస్తుంది. పెద్ద ట్యాంక్లో నీటిని తీసుకువచ్చి క్యాన్లలో నింపి కార్యాలయాల్లోకి పంపిస్తున్నారు. ప్రైవేట్ మినరల్ వాటర్నే అధికారులు, సిబ్బంది తాగుతున్నారు. అలాగే కలెక్టరేట్లోని అధికారిక నివాసాలకు సైతం భగీరథ వాటర్ కనెక్షన్లు ఇచ్చారు. ఇటీవల మిషన్ భగీరథ వాటర్నే తాగుతున్నానని కలెక్టర్ హైమావతి ప్రకటించారు. సాక్షాత్తు కలెక్టరే భగీరథ నీరు తాగుతున్నా.. జిల్లా అధికారులు మాత్రం ప్రైవేటు మినరల్ వాటర్ వైపు మొగ్గుచూపడం గమనార్హం.సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కూలింగ్ ఫ్రిడ్జ్ పక్కన మినరల్ వాటర్ క్యాన్లు మిషన్ భగీరథ నీటిని పలు మార్లు ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా అందజేస్తున్నాం. మా కార్యాలయంలో నల్లా కనెక్షన్ కొంత ఇబ్బంది ఉండటంతో మినరల్ వాటర్ క్యాన్ ద్వారా తెప్పించుకుంటున్నాం. నల్లా కనెక్షన్ ద్వారా వచ్చే నీటినే తాగుతాం. – నర్సింహులు, ఈఈ, మిషన్ భగీరథ ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను కట్టడి చేయాల్సిన మున్సిపల్ అధికారులే కట్టుతప్పుతున్నారు. పట్టణ ప్రజలందరూ మిషన్ భగీరథ నీరు తాగడానికి సరఫరా చేస్తున్నారు. కానీ సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం అధికారులు, సిబ్బంది మాత్రం ప్రైవేట్ ప్లాంటు నీళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.సిద్దిపేట పట్టణంలోని మిషన్ భగీరథ ఈఈ కార్యాలయంలో భగీరథకు చెందిన మున్సిపల్ నల్లా కనెక్షన్ ఉన్నా బయట నుంచి మినరల్ వాటర్ను క్యాన్లలో తెప్పించుకుని తాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ను సరఫరా చేస్తున్న కార్యాలయ సిబ్బందే తాగడం లేదు. ప్రతి రోజు ప్రైవేటు ప్లాంటు నుంచి వచ్చే మినరల్ నీటినే ఇక్కడి వారంతా వినియోగిస్తున్నారు. -
నిబంధనలు పాటిద్దాం. సురక్షితంగా పయనిద్దాం
● రోడ్డు భద్రత.. అందరి బాధ్యత ● సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో ‘అరైవ్–అలైవ్’ సిద్దిపేటకమాన్: రోడ్డు భద్రత చట్టం మాత్రమే కాదని.. అది మన జీవితానికి రక్షణ కవచమని అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్ తెలిపారు. అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో పోలీసు అధికారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణపై బుధవారం అవగాహన కల్పించారు. రవాణశాఖ, పోలీసు అధికారులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో మానవహారం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేసమయంలో సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవ్ చేయకూడదని అవగహన కల్పించారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, ప్రవీణ్కుమార్, రవాణశాఖ అధికారి శంకర్నారాయణ, ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు అంకితభావం అవసరం
● సీపీ రష్మీ పెరుమాళ్ ● పుల్లూరులో మన పోలీస్– మన ఊరు కార్యక్రమం సిద్దిపేటరూరల్: విద్యార్ధులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అంకిత భావం అవసరమని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పుల్లూరులో నిర్వహించిన మన పోలీస్–మన ఊరు కార్యక్రమాన్ని సీపీ సందర్శించారు. అలాగే పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను, వైద్య శిబిరాన్ని, పాఠశాల సమీపంలో పునరుద్ధరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత చదవడాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్య గొప్ప ఆయుధమని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. ఫోన్ వాడకం తగ్గించి, కష్టపడి చదవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారుల భద్రత కోసం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, స్థానిక ఏసీపీ రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘మల్లన్న’ నిర్వాసితుల్లో సంబురం
● ఎట్టకేలకు ఫలించిన న్యాయపోరాటం ● రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీ గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన ఒంటరి మహిళల న్యాయపోరాటం ఫలించింది. ప్యాకేజీ కోసం 2019 నుంచి పోరాటం సాగించారు. వేములఘాట్ గ్రామానికి చెందిన 24 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన 21 మంది ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి రూ.12.54లక్షల చొప్పున ప్యాకేజీని వారి ఖాతాల్లో జమచేసినట్లు బుధవారం తెలిపారు. ఏడేళ్ల తర్వాత తమ న్యాయ పోరాటం ఫలించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టులో సమర్ధవంతంగా వాదించి గెలిపించిన హైకోర్టు న్యాయవాది సీహెచ్. రవికుమార్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా సంబురాలు చేసుకున్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు నిర్వహణలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. గత యాసంగి సీజన్లో 93,142 మంది రైతుల నుంచి 3,84,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.884.56 కోట్లు మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 421 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. మండల సభలను సమర్థంగా నిర్వహించాలి ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 16న జరిగే మండల సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, రుణమాఫీ సంబంధిత పూర్తి సమాచారాన్ని , ప్రభుత్వం అందజేసిన నిధులను వివరించాలన్నారు. సాధారణ సేంద్రీయ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీపీఓ రవీందర్, డీడబ్ల్యూఓ శారధ, ఇరిగేషన్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావుగజ్వేల్రూరల్: బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ దేశ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీ ముందు చూపుతో పాలన సాగిస్తుండగా, మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి బీజేపీ కార్యకర్త బూత్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఓఎస్ రెడ్డి, ప్రకాశ్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భాగ్య కుటుంబానికి అండగా ఉంటాం
మావోయిస్టు భాగ్య కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేమిరుదొడ్డి(దుబ్బాక): ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు భాగ్య కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 13న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన భాగ్య ఎలియాస్ రూపీ మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి భాగ్య కుటుంబాన్ని పరామర్శించారు. భాగ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత వర్గాల అభ్యున్నతి కోసం 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి పోరాడి అసువులు బాసిన భాగ్య మృతి చెందడం బాధాకరమన్నారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. -
పాఠ్యాంశంగా రోడ్డు భద్రత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రోడ్డు భద్రతా అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డుభద్రతపై మరింత అవగాహన పెంచేందుకు ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఐఐటీలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయని, కుటుంబాల భవిష్యత్ను చీకటిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రమాదాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులను సాయం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ఏటా దేశంలో 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ 10,081 బస్సులతో దేశంలోనే మూడో అతిపెద్ద రవాణా సంస్థగా నిలుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే బోధనజరిగేలా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఐఐటీహెచ్ఓలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం -
మెరిట్ విద్యార్థులకు పారితోషికాలు
గజ్వేల్: గతేడాది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మెరిట్ సాధించిన దళిత విద్యార్థులకు అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నగదు పారితోషికాలను అందజేశారు. మండలంలోని ఆహ్మదీపూర్ ఉన్నతపాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి గోవర్ధనగిరి, కొడకండ్ల ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థిని అక్షిత, ఇంటర్కు సంబంధించి ములుగు మండలం అడవిమజీద్కు గ్రామానికి చెందిన మనోహర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని క్యాసారం గ్రామానికి చెందిన భావన పారితోషికాలను అందుకున్నవారిలో ఉన్నారు. అదేవిధంగా దళిత సర్పంచ్లు, కౌన్సిలర్లను సైతం ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ఎం. కిష్టయ్య, నాయకులు మన్నె కృష్ణ, ఎం.నాగయ్య తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటితేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లో మంగళవారం ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు తమలోని నైపుణ్యాన్ని చాటినపుడే అవకాశాలు లభిస్తాయన్నారు. జాబ్మేళాకు ఎంపికై న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాబ్మేళాకు గజ్వేల్తో పాటు ములుగు, జగదేవ్పూర్, దౌల్తాబాద్ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 81 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 47 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కృష్ణంరాజు, శర్మతో పాటు ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బెజ్జంకి(సిద్దిపేట): 108 వాహనాన్ని ప్రోగ్రాం మేనేజర్ సంపత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్సులోని మందులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఈఎంటీ రాజు, పైలెట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకం, భాగ్యశ్రీ శతకం పుస్తకావిష్కరణలు ఈ నెల 19న హైదరాబాదులో జరుగుతాయని కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఈ మేరకు మంగళవారం పుస్తకావిష్కరణలకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ పుస్తకావిష్కరణల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అవుసుల భాను ప్రకాష్, కంది శంకరయ్య, బండకారి అంజయ్య గౌడ్, వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ల సరస్వతీ రామశర్మ, బడేసాబ్ హాజరవుతారన్నారు. సిద్దిపేటకమాన్: రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రెడ్డి జేఏసీ నేతలు కోరారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం వారు మాట్లాడుతూ రెడ్డి జేఏసీ, ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. -
రాజ్యాంగం వల్లే తెలంగాణ
● ఎమ్మెల్యే హరీశ్రావు ● బంజేరుపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సిద్దిపేటరూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ కల సాకారం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ తనకోసం కాకుండా దేశం కోసం, అణగారిన వర్గాల కోసం ఆలోచించారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతోందన్నారు. ఎంతో దూరదృష్టితో అలోచింది కొత్త రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాశారన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రేవంత్ సర్కార్ తాళం వేసిందన్నారు. నేటి యువత అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. అంతకుముందు రాఘవాపూర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్, మండల నాయకులు తదితరు లు పాల్గొన్నారు. సిద్దిపేటరూరల్: చుక్కనీళ్ళు లేని ప్రాంతంలో మండుటెండల్లో సైతం చెరువుల, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో ఎల్లమ్మతల్లి సిద్దోగం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయానికి దారి లేకపోతే బ్రిడ్జి నిర్మించామని, గౌడఫంక్షన్హాల్ నిర్మాణానికి రూ. 35లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. గంగమ్మతల్లి గలగలా పారుతూ ఎల్లమ్మతల్లి పాదాలకు చేరిందన్నారు. కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేసిన కుహనా నాయకులు నారాయణరావుపేట పెద్దచెరువు, కుంటలు చూడాలని హితవు పలికారు. ఎల్లమ్మగుడి నుంచి మల్యాలకు బీటిరోడ్డు మంజూరు అయిందని, టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తానన్నారు. -
మోక్షం
సాదాబైనామాలకు● జిల్లా వ్యాప్తంగా 44వేల దరఖాస్తులు పెండింగ్ ● ఆరేళ్లుగా ఎదురుచూపులు ● నోటీసులు సిద్ధం చేస్తున్న తహసీల్దార్లు రెవెన్యూ పెండింగ్ డివిజన్ దరఖాస్తులు సిద్దిపేట 26,591 గజ్వేల్ 6,200 హుస్నాబాద్ 12,153 సాదా బైనామాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 44వేల మంది దరఖాస్తు దారులు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. భూ క్రయవిక్రయదారులు ఇద్దరూ అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనను సవరించారు. ఆర్డీఓ విచారణాధికారిగా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట కాగితాలపై బాండ్ పేపర్ల ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్ధత కల్పించేందుకు గతంలో అవకాశం కల్పించింది. దీంతో సాదా బైమానాల కింద 2020లో దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి నుంచి పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో అవి రికార్డుల్లోకి ఎక్కలేదు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం హక్కులు రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,944 మంది రైతుల సాదా బైనామాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొనుగోలు, విక్రయదారులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాలని గతంలో ప్రకటించగా పలు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో తాజాగా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రమే అఫిడవిట్ను సమర్పించాలని సవరణ చేసింది. ఎదురుచూపులు కొన్నేళ్లుగా భూమిని సాగు చేస్తున్నా పట్టా పాస్ బుక్ల కోసం ఎదురుచూస్తున్నారు. ధరణిలో భాగంగా కొందరికీ పట్టా పాస్ బుక్లు చేశారు. తర్వాత స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలగలేదు. దీంతో ఆరేళ్లుగా దరఖాస్తు దారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం గత ప్రభుత్వంలో జరిగిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ తహసీల్దార్లు పూర్తి చేశారు. ప్రస్తుతం భూభారతి చట్టం ప్రకారం ఆర్టీఓలకు అధికారాలు కల్పించారు. తహసీల్దారు విచారణ నివేదిక పంపిస్తే వాటిని పరిశీలించి ఆర్డీఓ భూ భారతి పోర్టల్లో భూ భారతి సమాచారం నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణలో తేలే అంశాలే కీలకంగా మారనున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేయనున్నారు. సాదాబైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవీ రాకుంటే క్రమబద్ధీకరణ సులువుగా పూర్తికానున్నాయి. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు యాజమాన్య హక్కులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసా, బీమా వీరికి అందడం లేదు. ధాన్యం విక్రయించే సమయంలో పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడంతో ఇతర రైతు పేరు మీద నమోదు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం భూ భారతిలో సాదాబైనామాలకు సంబంధించి పలు సవరణలు చేయడంతో భూ యాజమాన్య హక్కులు వస్తాయని దరఖాస్తు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


