పాలన చేతకాక.. కేసీఆర్‌పై కుట్రలు | - | Sakshi
Sakshi News home page

పాలన చేతకాక.. కేసీఆర్‌పై కుట్రలు

Feb 2 2026 8:21 AM | Updated on Feb 2 2026 8:21 AM

పాలన చేతకాక.. కేసీఆర్‌పై కుట్రలు

పాలన చేతకాక.. కేసీఆర్‌పై కుట్రలు

గజ్వేల్‌: పాలన చేతకాక, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. కేసీఆర్‌పై సిట్‌ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు గజ్వేల్‌ పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు. అక్రమ కేసులు, నోటీసులతో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ పార్టీని ఏమీ చేయలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement