breaking news
Siddipet District News
-
లక్ష్యం వైపు అడుగులు..
● మార్కెట్ కమిటీల ఆదాయం టార్గెట్ రూ.45.3 కోట్లు ● జనవరి వరకు వచ్చింది రూ.32.81 కోట్లు ● రెండు నెలల్లో లక్ష్యం చేరుకునేలా ప్రణాళిక గజ్వేల్: జిల్లాలోని మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్యం ఎలాగైనా చేరుకునేలా అధికారుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ ఫీజు ద్వారా రూ.45.35కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉండగా, జనవరి నెలాఖరు నాటికి రూ. 32.81 కోట్ల ఆదాయం సమకూరింది. కీలకంగా భావించే ప్రస్తుత ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.13కోట్ల రాబడి సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్ కమిటీల ద్వారా ఈసారి అనుకున్న ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేలా సంబంధిత శాఖ అధికారులు ముందుకుసాగుతున్నారు. జనవరి నెలాఖరు వరకు రూ. 32.81 కోట్ల ఆదాయం సాధించగలిగారు. రూ. 45.35క ోట్ల లక్ష్యానికి ఇంకా రూ. 13 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉన్నది. ఈనెల 18న రామాయంపేటలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి మార్కెట్ కమీటీల సమీక్షను నిర్వహించి, లక్ష్య సాధనపై దిశానిర్ధేశం చేశారు. దీని తర్వాత స్థానిక అధికారులు ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టారు. జిల్లాలోని 14 మార్కెట్ కమీటీలకు వరి, పత్తి,మొక్కజొన్న, కందులు, శనగలు, పెసర్లు, వేరుశనగ, కూరగాయలు తదితర ఉత్పత్తుల క్రయ విక్రయాల ద్వారా మార్కెట్ ఫీజురూపంలో ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వ సంస్థలు, వ్యాపారు లు తమ చేసిన క్రయవిక్రయాల్లో 2 శాతం మార్కెట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తుల విక్రయా లపై వచ్చే మార్కెట్ ఫీజు, చెక్పోస్టులు, మడిగెల ఆద్దెలు, ఇతర వనరులతోపాటు ప్రైవేటులో మక్కలు, కందులు, శనగలు, పెసర్లు తదితరాల కొనుగోళ్లు జరిగితే ఆదాయం సమకూరుతుంది. గజ్వేల్లో వడ్ల కొనుగోళ్లు (ఫైల్)మార్కెట్ల వారీగా ఆదాయం.. జనవరి నెలాఖరు నాటికి జిల్లాలోని సిద్దిపేట మార్కెట్ కమిటీకి రూ. 409.19 లక్షలు, గజ్వేల్కు రూ. 187.48 లక్షలు, చిన్నకోడూర్కు రూ. 206.07 లక్షలు, నంగునూరుకు రూ. 123.37లక్షలు, తొగుటకు రూ. 94.58 లక్షలు, దౌల్తాబాద్కు రూ.169.39 లక్షలు, కొండపాకకు రూ. 157.81 లక్షలు, మిరుదొడ్డికి రూ.170.27లక్షలు, దుబ్బాకకు రూ. 259.90 లక్షలు, బెజ్జంకికి రూ. 260.20 లక్షలు, హుస్నాబాద్కు రూ. 461.95 లక్షలు, కోహెడకు రూ.144.85లక్షలు, చేర్యాలకు రూ. 512.41 లక్షలు, వంటిమామిడికి రూ. 124.05 లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా అన్ని మార్కెట్ కమిటీల్లో కలుపుకొని రూ. 32.81 కోట్ల ఆదాయం సమకూరింది. అయినా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈ ఆదాయం పట్ల సంతృప్తి చెందలేదు. లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో మార్కెట్ కమిటీల్లో ఆదాయం పెంపుపై దృష్టిపెట్టాయి. పత్తి ఉత్పత్తులు అతివృష్టి కారణంగా గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితి లేకుండా ఉంటే ఈపాటికే పత్తి ద్వారా వచ్చే ఆదాయంతోనే టార్గెట్ చేరుకునేవారు. కానీ పరిస్థితి భిన్నంగా మారింది. దీనివల్ల అధికారులు...గతంలో నుంచి భారీగా పెండింగ్లో ఉన్న పత్తి, వరి క్రయవిక్రయాల మార్కెట్ ఫీజు వసూలపై దృష్టి పెట్టారు. దీనివల్ల ఈ రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటామనే ధీమాలో ఉన్నారు. -
మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు. కంప్యూటర్ స్కిల్స్పై సర్టిఫికెట్ కోర్సు హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బెసిక్ కంప్యూటర్ స్కిల్స్పై సర్టిఫికెట్ కోర్సు రెండో బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయగిరి భిక్షపతి తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 5వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. కోర్సులో భాగంగా ఉచితంగా స్టడీ మెటీరియల్, కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తామని వెల్లడించారు. రైతులతో సమూహ చర్చ చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణలో భాగంగా మండల పరిధిలోని గంగాపూర్లో కరీంనగర్ జిల్లా వ్యవసాయ కళాశాల విద్యార్థినులు సమూహ చర్చ నిర్వహించారు. సేంద్రియ ఎరువులతో పంటలకు పోషకాలు అందించవచ్చని వివరించారు. సూక్ష్మ పోషకాల గూర్చి వివరించారు. పంటలను ఆశించే తెగుళ్లు, వాటి నివారణ చర్యల గూర్చి తెలిపారు. కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్, విద్యార్థినులు హశ్విత, ప్రత్యూష రెడ్డి, మంజూష, శివాని, మేఘన, ఫిర్దోస్, సర్పంచ్ భవాని, రైతులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రకృతి వ్యవసాయం చేస్తే సమాజానికి ఆరోగ్యం పంచడంతో పాటు రైతులకు మంచి దిగుబడి వస్తుందని ఏడీఏ పద్మ అన్నారు. మండల పరిధిలోని రామంచలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువులు, పురుగులమందుల వినియోగం తగ్గించి, సహజ ఎరువులు వాడాలని సూచించారు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని, భూమిలో సేంద్రియ కర్బనం, వానపాములు పెరిగి భూసారం మెరుగుపడుతుందన్నారు. 400 ఏళ్ల కోనేరు ప్రక్షాళన దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధి ధర్మాజిపేటలోని 400 ఏళ్ల చరిత్ర గల పురాతన శివాలయంలో కోనేరు శిథిలావస్థకు చేరుకోవడంలో బాగు చేసేందుకు యువత ముందుకు వచ్చింది. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోనేరులో చెత్తాచెదారం, శివాలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. కోనేరు శుభ్రం కావడంతో ఈ ప్రాంతం ఆధ్మాతికంగా రూపుదిద్దుకుంటుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
నవోదయను సందర్శించిన అధికారులు
పీఎంశ్రీ పనులు, నిధుల వినియోగంపై ఆరా వర్గల్(గజ్వేల్): స్థానిక జవహార్ నవోదయ విద్యాలయాన్ని బుధవారం కేంద్ర అధికారుల బృందం సందర్శించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శైలేంద్రకుమార్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ ఉషారాణి, అకాడమిక్ విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డిలతో కూడిన ఈ బృందం పీఎంశ్రీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, తదితర వాటిని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, మ్యాథ్స్ సర్కిల్స్, సైన్స్ సర్కిల్స్ పరిశీలించారు. బ్యాగ్లెస్ డే తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. నిధుల వినియోగం తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ దాసి రాజేందర్కు పలు సూచనలు చేశారు. -
సాగునీటి కాల్వలను పట్టించుకోని సర్కార్
● దుబ్బాక నియోజకవర్గంపై వివక్ష వీడాలి ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిగజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. సాగునీటి ఉప కాల్వల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి కాల్వల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కాల్వలు, ఉప కాల్వల నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు చెందిన రామాయంపేట, శంకరంపేట, ఉప్పర్పల్లి, దుబ్బాక ప్రధాన కాల్వల ద్వారా సాగునీటి సౌకర్యం ఉందన్నారు. నేడు ఉప కాల్వల నిర్మాణం జరగక పక్కనే నీళ్లు ఉన్నా.. వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికై నా వివక్ష వీడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవ తీసుకొని ఉప కాల్వల నిర్మాణానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఉప కాల్వల పూర్తయితే తమ నియోజకవర్గంలో 1.20లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి స్వరూపంపై అధికారులు సమగ్ర నివేదిక తనకు అందజేస్తే...సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమీక్షలో గజ్వేల్, సిద్దిపేట ఇరిగేషన్ శాఖ ఎస్ఈలు సుధాకిరణ్, లక్ష్మణ్లతోపాటు ఈఈలు, డీఈలు, తహసీల్దార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ పెన్షన్ పెంచాల్సిందే
బీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా సిద్దిపేటరూరల్: కార్మికులకు అందిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ను రూ. 7,500లకు పెంచాలని బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలకు సంబంధించిన జీఓలను వెంటనే అమలు చేయాలని, బీడీ కార్మికుల జీవన భృతి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. -
తిప్పలు ఉండవిక
వేసవి ప్రణాళిక.. తాగునీటి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ● 508 పంచాయతీల్లో 921 బోరుమోటార్ల గుర్తింపు ● నివేదికను అందజేసిన అధికారులు ● వచ్చే నెల 15లోగా మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రజలు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 508 గ్రామ పంచాయతీలలో 921 బోరుమోటార్లను గుర్తించారు. వీటి మరమ్మతులకు చర్యలు చేపట్టనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో 1,515 ఓవర్హెడ్ ట్యాంక్లున్నాయి. 2,793.43 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా 2,06,303 గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. మరమ్మతులను చేపట్టేందుకు గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీఓలు విస్తృతంగా పర్యటించారు. తాగునీటికి సంబంధించి ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉన్న 921 చోట్ల పనులను గుర్తించారు. అందులో హ్యాడ్ పంప్లు 126, సింగిల్ ఫేజ్ మోటార్లు 547, త్రీఫేజ్ మోటార్లు 230, బావులు 18 ఉన్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వానికి రూ 2.5కోట్ల నిధులు అవసరం ఉంటుందని నివేదికను అందజేశారు. అలాగే పలు చోట్ల కొత్తగా పైప్లైన్లు వేయనున్నారు. నివేదిక అందజేత గత ఏడాది తాగునీటి కోసం తలెత్తిన సమస్యలు, ఈ ఏడాది వేసవి కాలంలో సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి నివేదికను కలెక్టర్కు, రాష్ట్ర మిషన్ భగీరథ అధికారులకు పంపించారు. అందులో పలు చోట్ల రూ.లక్షల వ్యయంతో కూడిన పనులకు బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. మిగతా చిన్న చిన్న మరమ్మతులు పంచాయతీ ఫండ్ నుంచి చేయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సమాచారం అందించాం గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. అలాగే జీపీ ఫండ్ సైతం అందుబాటులో ఉంది. వాటితో పనులు చేపట్టాలని మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. దీంతో డీపీఓకు సమాచారం అందించాం. త్వరలో పనులను ప్రారంభించి వచ్చే నెల15లోగా పూర్తి చేస్తాం. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – నర్సింహులు, ఈఈ, మిషన్ భగీరథపెండింగ్ డబ్బులు ఇప్పించాలంటున్న కార్యదర్శులు గత సంవత్సరం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. దీంతో పంచాయతీ కార్యదర్శులే తమ సొంత డబ్బులను పెట్టి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలలో భాగంగా పలు మరమ్మతులు చేపించారు. వాటి డబ్బులు ఇప్పటి వరకు రాలేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి చేసిన పనులకు సంబంధించి డబ్బులు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి
చింతమడక బీరప్ప ఉత్సవంలో హరీశ్రావుసిద్దిపేటరూరల్: బీరప్ప దేవుడి దయతో, గ్రామ ప్రజలందరి దయతో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. కేసీఆర్ గ్రామ ప్రజలందరిని అడిగినట్లు చెప్పారని, ఉత్సవాలకు కేసీఆర్ సాయం అందించారన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. అందరి ఆశిస్సులతో తప్పకుండా సీఎం అవుతారన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, అందరికి మంచి కలగాలని ఆకాంక్షించారు. తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతశంకర్, ఉపసర్పంచ్ శివ, మాజీ సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవిచందర్రావు, మాజీ సర్పంచ్ హంసకేతన్రెడ్డి, నాయకులు ఎర్రయాదయ్య, కిషన్రెడ్డి, ప్రభాకర్వర్మ తదితరులు తదితర నాయకులు పాల్గొన్నారు. కాగా రూరల్ మండల పరిధిలోని బచ్చాయిపల్లికి చెందిన సీనియర్ నాయకుడు దుర్గం ఎల్లం తండ్రి మృతి చెందగా వారి కుటుంబాన్ని, సీతారాంపల్లిలో శ్రీకాంత్రెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని హరీశ్రావు పరామర్శించారు. -
నాణ్యమైన ఆహారం అందించండి
● విద్యార్థినుల భద్రత ముఖ్యం ● కలెక్టర్ హైమావతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): వసతి గృహంలో ఉన్న విద్యార్థినులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ హైమావతి షెడ్యూల్ కులాల వసతి గృహాల వార్డెన్ శ్వేతను ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్, వంట సరుకులను పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా లేదని వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డీఎస్సీడీఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థుల భద్రత ముఖ్యమని వసతి గృహంలో సీసీ కెమోరాలు తప్పనిసరిగా పని చేసే విధంగా ఉండాలన్నారు. వసతి గృహంలో ఉన్న సమస్యలపై విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. తాగు నీరు, శానిటేషన్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. -
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ విభాగాల నుంచి ప్రథమ, ద్వితీయ మొత్తం 20,035 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యుత్, ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్, డీఓలకు సూచించారు. గతంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమంతించని నిబంధన ఉండేది. అయితే ఈ సారి 5 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనల మేరకు బందోబస్త్ ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ సిద్దిపేటరూరల్: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇంటర్ పరీక్షల నిర్వ హణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నాయన్నారు. సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు టెలీమానస్ నంబర్ 14416కు ఫోన్ చేయాలని, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్ రూం 9949330191 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ ఆయేషాఫాతిమా, డీఐఈఓ రవీందర్రెడ్డి, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ ధనరాజ్, డీపీఓ రవీందర్, పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఎమ్మెల్యే హరీశ్రావుసిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలను విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇంటర్ మీ భవిష్యత్తుకు పునాదిలాంటిదని అన్నారు. -
భోజనం.. మరింత నాణ్యం
స్కూళ్లకు, హాస్టళ్లకు ఇక స్టీమ్రైస్మధ్యాహ్న భోజన పథకంలో సర్కారు కీలక మార్పులు చేసింది. సన్న బియ్యంతో అన్నం ముద్దగా అవుతుండటం.. విద్యార్థుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తుండటంతో ఇకపై స్టీమ్ రైస్ (ఆవిరి బియ్యం)ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో అందించే భోజనం కోసం ఇకపై స్టీమ్ రైస్ను అందించనున్నారు. – సాక్షి, సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లు, అంగన్ వాడీలకు సన్నబియ్యమే అయినా కొత్త బియ్యం కావడంతో వండిన తర్వాత ముద్దగా మారుతోంది. కొత్త బియ్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అన్నం ముద్దగా తయారై మెత్తబడి పోతుండటంతో పిల్లలు సంపూర్ణంగా భోజనం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేవారు ఇంటి దగ్గరి నుంచి బాక్స్లు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే వారు ఒక రోజు తినడం.. మరో రోజు తినకుండా ఉండటంతో అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని స్టీమ్ రైస్ను అందించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాకు ప్రతి నెలా 5,500 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉండనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 2,308 విద్యా కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు 5,500 క్వింటాళ్ల సన్న బియ్యాని సరఫరా చేస్తున్నారు. అందులో 1,002 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 1,800 క్వింటాళ్లు, 156 వివిధ సంక్షేమ హాస్టల్స్కు 3,000 క్వింటాళ్ల, 1,150 అంగన్ వాడీ కేంద్రాలకు 700 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇక స్టీమ్ రైస్ సరఫరా కోసం మిల్లర్లకు ఇండెంట్ను ఇచ్చారు. ఇక పొడిపొడిగా.. విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లలో ఎంత జాగ్రత్తగా వండినా కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయ్యేది. ఇక స్టీమ్ రైస్తో వండితే అన్నం ముద్ద కాదు. అలాగే పొడిపొడిగా ఉంటుంది. తినడానికి అనువుగా ఉంటుంది. తినేందుకు విద్యార్థులకు.. వండేందుకు వంట కార్మికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. మిల్లర్లకు ఇండెంట్ ఇస్తున్నాం పాఠశాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు స్టీమ్ రైస్ సరఫరా చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మిల్లర్లకు స్టీమ్ రైస్ను అందించేందుకు ఇండెంట్లను అందజేస్తున్నాం. వచ్చే నెల నుంచి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
3,887 ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షంతో రైతన్న ఆగం ● తొగుటలో అత్యధికంగా దెబ్బతిన్న పంటలు ● ప్రాథమిక అంచనాకు వచ్చిన వ్యవసాయశాఖప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను ఆగం చేసింది. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 3,55,501 ఎకరాల్లో వరి, 33,143 ఎకరాల్లో మొక్కజొన్న, 347 ఎకరాల్లో వేరుశనగ, 9,846 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు, 1,724 ఎకరాల్లో శనగ పంటలను సాగు చేశారు. జిల్లాలో సోమవారం ఈదురుగాలులతో వర్షం కురవడంతో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. తొగుట, మిరుదొడ్డి, రాయిపోల్, దౌల్తాబాద్, సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు, చేర్యాల, గజ్వేల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తొగుట మండలంలో 602 ఎకరాల్లో మొక్కజొన్న, 811 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, రాయిపోల్ మండలంలో 608 ఎకరాల్లో మొక్కజొన్న, 352 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మిరుదొడ్డి మండలంలో 664 ఎకరాల్లో మొక్కజొన్న, 155 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, దౌల్తాబాద్ మండలంలో 231 ఎకరాల్లో మొక్కజొన్న, 181 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,356 ఎకరాల్లో మొక్కజొన్న, 1531 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు పంటలు మొత్తంగా 3,881 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి తొగుట, మిరుదొడ్డి మండలాల్లోని దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలాల వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించారు. పంటల పరిశీలనమిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్లతో నష్టపోయిన పంటలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారులు స్వరూపా రాణి, దుబ్బాక ఏడీఎ మల్లయ్యతో పాటు, దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు ముత్యం రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాథమికంగా అందెలో 280 ఎకరాలు, కొండాపూర్లో 88, మిరుదొడ్డి 373, ధర్మారంలో 53 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, కూరయాల పంటలు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ పంటల నష్టాన్ని నిర్థారణ చే సి ప్రభుత్వానికి తుది నివేదికలు అందజేస్తామని తెలిపారు. పంట నష్టం అంచనా వేశాం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,356 ఎకరాల్లో మొక్కజొన్న, 1531 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. అత్యధికంగా తొగుట మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పంట నష్ట వివరాలను సేకరించారు. –స్వరూపరాణి,జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘హరిద్ర’ మనోహరం..
పొంగిపొర్లుతున్న ‘హల్దీ’ చెక్డ్యాంనాచగిరి ‘హరిద్ర’ ఉప్పొంగింది. కాళేశ్వరం గోదావరి జలాలతో హల్దీ జీవకళ సంతరించుకుంది. సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం కొలువైన హరిద్రా తీరం భక్తజనావళికి ఆహ్లాదం పంచుతోంది. జాలువారుతున్న నీటి ప్రవాహం నేత్రపర్వం చేస్తున్నది. ఇటీవల కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన విషయం తెల్సిందే. ఒక్కో జలాశయాన్ని దాటుతూ మంగళవారం పుణ్యక్షేత్రం వద్ద చెక్డ్యాం వద్ద గోదావరి జలాలు పొంగిపొర్లుతుండడంతో భక్తజనులు మురిసిపోతున్నారు. మరో పక్షం రోజులలో బ్రహ్మోత్సవాల తరుణంలో జలకళతో జాతర జనానికి ఆనందం, ఆహ్లాదం, నదీస్నానం సౌకర్యం సమకూరింది. – వర్గల్(గజ్వేల్) -
నామినేటెడ్ ఆశలు
మరోసారి తెరపైకి అంశం జిల్లాలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీలు మాత్రమే భర్తీ కాగా సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని మార్కెట్ కమిటీలను ఇప్పటి వరకు నియమించలేదు. పైగా జిల్లాకు ఒక్క రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కలేదు. స్థానిక నేతల నామినేటెడ్ పదవు లు కల నెరవేరడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో పదవులు ఆశిస్తున్న వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. గ్రంథాలయ చైర్మన్ రాజీనామాతో.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి కేడల లింగమూర్తి రాజీనామా చేశారు. మరో 8 నెలల పదవీ కాలం ఉండగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చైర్మన్ పదవిని వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. దీంతో రెండు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో పదవేదీ? రాష్ట్ర ప్రభుత్వం 22 నెలల క్రితం ఒకే సారి 34 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. వీటిలో ఒక్క పదవి సైతం జిల్లాకు దక్కలేదు. జిల్లా నుంచి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరో రెండు నెలలైతే ఆ పదవుల పదవీకాలం ముగియనున్నాయి. త్వరలో నియమించే రాష్ట్ర చైర్మన్ పోస్టులలో జిల్లాకు చెందిన నేతలకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.పైరవీల జోరు ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్కు నామినేటెడ్ పోస్టుల గురించి మీనాక్షి నటరాజన్ నివేదిక అందజేసినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు నెలకొన్నాయి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని పలువురు నేతలు సంతోషించారు. రెండేళ్లుగా గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. – సాక్షి, సిద్దిపేట మార్కెట్ కమిటీలకు సిఫార్సు చేశారా? జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని మార్కెట్ కమిటీలు కాకుండా మిగతా ప్రాంతాల్లోని మార్కెట్ కమిటీలను నియమించారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట, నంగునూరు. చిన్నకోడూరు మార్కెట్లుండగా వీటి కమిటీల కోసం పేర్లను కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయలేదా?.. చేసినా మార్కెటింగ్ శాఖ పెండింగ్లో పెట్టిందా? లేదంటే ఎవరైనా అడ్డుకుంటున్నారా? అని విషయంపై పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మార్కెట్ కమిటీని నియమిస్తే ఇప్పటి వరకు ఒక టర్మ్ ముగిసిపోయేది. మొదటి విడతలో కొందరికి.. రెండో విడతలో మరి కొందరికి పదవులు పొందేవారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
ఇక చెంతనే ఆహ్లాదం
శరవేగంగా అర్బన్ పార్క్ పనులు రామాయంపేట(మెదక్): ప్రజలతో పాటు ప్రయాణికులు సేద తీరడానికి కేంద్రం నగర వన యోజన పథకం తీసుకొచ్చింది. మండలంలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం రూ. 2 కోట్లు కేటాయించింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఈ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 125 ఎకరాల్లో నిర్మాణంజాతీయ రహదారి (765 డీజీ)ని ఆనుకొని అర్బన్ పార్క్ నిర్మిస్తున్నారు. ఇది మెదక్ మున్సిపాలిటీకి 13 కిలోమీటర్లు, రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ లైట్లతో పాటు సీసీ కెమరాలు ఏర్పాటు చేయనున్నారు. నిధుల అందుబాటును బట్టి చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్ టవర్ నిర్మిస్తున్నారు. అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు.పర్యావరణంపై అవగాహన కొత్తగా నిర్మిస్తున్న ఈ అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి వివరించనున్నారు. -
పట్టణ ప్రజలు సేద తీరేలా
రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్తున్న ప్రజలు సేద తీరడానికి వీలుగా కేంద్రం నిదులతో అర్బన్ పార్క్ నిర్మిస్తున్నాం. ఈమేరకు రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం. పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నాలుగైదు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. – విద్యాసాగర్, రేంజ్ అధికారి, రామాయంపేట -
మంత్రి పొన్నంను కలిసిన నేతలు
ములుగు(గజ్వేల్): ఏఐసీసీ రాజీవ్గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు కడపల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘటన్ జిల్లా అధ్యక్షునిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నర్సింహారెడ్డి నగరంలోని మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వార్షిక క్రీడా పోటీలను సీపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లో పోలీసు కమిషనరేట్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబర్చి మూడు బంగారు, రెండు వెండి, ఏడు కాంస్య పతకాలు సాధించారన్నారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అధికారులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్తో బంగారు భవిత చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో చేరి సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత అన్నారు. సోమవారం చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని పదో తరగతి విద్యార్థులకు పాలిసెట్ కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డీసీఈ, డీఈఈఈ, డీఐడీ, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్టల్ వసతి ఉందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ దరఖాస్తుకు ఏప్రిల్ 22 చివరి తేదని, మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పాటెక్నిక్ కోర్సులో చేరి అతి తక్కువ ఖర్చుతో నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి అవకాశం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకే కవాతు సిద్దిపేటకమాన్: ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సిద్దిపేట ఏసీపీ రవిందర్రెడ్డి, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్యాక్షన్ ఫోర్సు డిప్యూటీ కమాండెంట్ సరస్వతి తమ సిబ్బందితో కలిసి కవాతులో పాల్గొన్నారు. -
జబ్బాపూర్ను సందర్శించిన డీఈఓ
● పాఠశాల భవన నిర్మాణ పనుల పరిశీలన ● యజమానికి అద్దెబకాయిల చెక్కు అందజేతవర్గల్(గజ్వేల్): విద్యార్థులకు సౌకర్యవంతంగా పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు త్వరితగతిని పూర్తిచేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం వర్గల్ మండలం జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అద్దె బకాయల కోసం బడికి తాళం వేసిన సంఘటనపై విచారణ జరిపారు. హెచ్ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల అద్దెభవన యజమాని హరికృష్ణకు రూ. 12,000 అద్దె బకాయలు చెక్రూపంలో అందజేశారు. అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుందని, అద్దె కోసం మండల విద్యాధికారిని సంప్రదిస్తే చాలని డీఈఓ సూచించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు. అనంతరం ఎస్డీఎఫ్ నిధులతో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవన నిర్మాణపనులు పరిశీలించారు. పనుల పురోగతిని ఏఈ తేజకుమార్తో సమీక్షించారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణపనులు పూర్తిచేయాలని ఏఈని, సంబంధిత కంట్రాక్టర్లను డీఈఓ ఆదేశించారు. పాఠశాల నిర్వహణకు ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్డులో వంటల కోసం కిచెన్షెడ్డు, ఒక గదికి తాళం వేసుకునేలా డోర్లు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. -
నిధులు వచ్చేనా.. సమస్యలు తీరేనా?
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీల్లో.. నిధుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని నెలల కిందట టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నిధుల అంశం ఇంకా టెండర్ దశలోనే ఉండటంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై స్పష్టతకు మార్చి నెలాఖరు వరకు ఆగాల్సి ఉన్నది. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను అందజేసి త్వరగా పనులు ప్రారంభిస్తేనేసమస్యలు తీరనున్నాయి. – గజ్వేల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు వచ్చాయి. ఇందులో గజ్వేల్, సిద్దిపేటలకు రూ.18.7కోట్ల చొప్పున, మిగతా మున్సిపాలిటీలకు రూ.15కోట్లకుపైగా విడుదలయ్యాయి. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ప్రాధాన్యత క్రమంలో పనులను ప్రతిపాదించారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన వేళ.. ఈ పనుల ప్రారంభానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్చి నెలాఖరు వరకు ఆగాల్సిందే.. జిల్లాలోని మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం–2026 ద్వారా నిధులపై స్పష్టత కోసం మార్చి నెలాఖరు ఆగాల్సిందే. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఇప్పటికే పాలకవర్గం ఉండగా, కొన్ని రోజుల కిందట గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు పూర్తయి.. పాలకవర్గాలు కొలువుదీరిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పన్నుల వసూళ్లు తదితర అంశాలను ప్రతిపాదికగా తీసుకొని నిధులను విడుదల చేయనున్నారు. పెండింగ్ వాటికి మోక్షం లభించేనా? మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ, 15వ ఆర్థిక సంఘం నిధులే కాకుండా జనరల్ ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా వచ్చే నిధులు వినియోగంలోకి వస్తేనే పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తున్నది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణ, చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి, ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ మరమ్మతులు, సీసీ రోడ్లు ఇతర సమస్యల పరిష్కారానికి టీయూఎఫ్ఐడీసీ పనుల్లో ప్రతిపాదించారు. కానీ నేటికీ పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు. దశలవారీగా పరిష్కారం టీయూఎఫ్ఐడీసీ పనులు టెండర్ దశలో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. రాగానే ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతాం. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. – వెంకటగోపాల్, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ టెండర్ దశలోనే టీయూఎఫ్ఐడీసీ పనులు ‘ఆర్థిక సంఘం’ ఫండ్స్పై కానరాని స్పష్టత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు జిల్లాలోని మున్సిపాలిటీల దుస్థితి -
‘రైతు భరోసా’ వెంటనే ఇవ్వండి
కొండపాక(గజ్వేల్): రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర మాజీ కో ఆర్డినేటర్ దేవీ రవీందర్ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ రవీందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. యాసంగి రైతు భరోసాను వెంటనే విడుదల చేసి, నాణ్యమైన కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్గౌడ్, మధుమోహన్, భాస్కర్, కరుణాకర్, సుదర్శన్, మహిపాల్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి సౌందర్య, కోచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ చిన్నకోడూరు(సిద్దిపేట): ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలని, లక్ష్యాలకు అనుగణంగా ప్రతిభావంతులు కావాలని ముదిరాజు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జానపద కళాకారుడు స్వామి, కానిస్టేబుల్ లక్ష్మణ్లు గాయకులుగా అవార్డులు రావడంతో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ముదిరాజులు స్వామి, లక్ష్మణ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముదిరాజులు రాణించాలన్నారు. సమాజంలో వెనుకబడి ఉన్నారని అన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశం, ముత్యం, బాలయ్య, రాజేశ్, నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి జాతర అనంతరం మొదటి ఆదివారం కావడంతో పాటు మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారులు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సత్రాలు లభించక ఇబ్బందులు పడ్డారు. ఈఓ వీరేశం, ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
బడికి తాళం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే..
జబ్బాపూర్ స్కూల్ ఘటనపై డీఈఓ వివరణవర్గల్(గజ్వేల్): అద్దె చెల్లింపులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, యజమాని అత్యుత్సాహం కారణంగానే వర్గల్ మండలం జబ్బాపూర్ ‘బడికి తాళం’ ఘటన చోటుచేసుకుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ‘అద్దె చెల్లించలేదని.. బడికి తాళం’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ మెయిన్ఎడిషన్లో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. బడికి తాళం వేసిన ఘటనపై ‘సాక్షి’తోపాటు వివిధ పత్రికలలో కథనాలు రావడంతో ఆదివారం జిల్లా విద్యాధికారి స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణం కోసం 2024 మార్చి 14న స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ నిధుల ద్వారా రూ. 60 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 2025 జూలై 7న పాఠశాల విద్యాకమిటి సమావేశంలో నూతన భవన నిర్మాణం కోసం శిథిలభవనం కూల్చివేసి, తాత్కాలికంగా అద్దె ఇంటిలో స్కూల్ నిర్వహించాలని, కాంట్రాక్టర్ ద్వారా నెలకు రూ.3000 అద్దెచెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణపనులు బేస్మెంట్ స్థాయికి చేరాయని, ఆగస్టు 1 నుంచి పాఠశాల అద్దెగదిలో కొనసాగుతుండగా, కాంట్రాక్టర్ రెండు నెలలు మాత్రమే అద్దె చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో శనివారం పోషకుల సమావేశం సందర్భంగా మిగతా నాలుగు నెలల అద్దె కోసం ఇంటి యజమాని నిరసన వ్యక్తం చేస్తూ బడికి తాళం వేశారని, తల్లిదండ్రులు, సర్పంచ్ వెంకటేశ్ స్పందించి అద్దె చెల్లించేందుకు అంగీకరించడంతో 15 నిమిషాలలోనే తాళం తెరిచి యదావిధిగా పాఠశాల కొనసాగించారన్నారు. కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, యజమాని అత్యుత్సాహం వల్ల విద్యార్థులకు అసౌకర్యమేర్పడిందని వివరించారు. ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే భవన నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రభుత్వ నిధుల నుంచి అద్దె చెల్లించేలా కలెక్టర్ ఏర్పాటు చేశారన్నారు. -
గ్రామాభివృద్ధే లక్ష్యం కావాలి
ఎమ్మెల్యే హరీశ్రావుపాలమాకుల గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న హరీశ్రావునంగునూరు(సిద్దిపేట): అందరు ఐకమత్యంగా ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో పాలమాకులలో ఆదివారం శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమ కాలం నుంచి గ్రామంతో తనకు ఎంతో అనుభందం ఉందన్నారు. మొట్ట మొదటగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు గ్రామం మీదుగా ఫోర్లేన్ల రోడ్డు, రింగ్రోడ్డు నిర్మాణానికి కృషి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పింఛన్, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎగ్గొట్టి మోసం చేసిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వేణుచక్రవర్తి, సర్పంచ్ ఓజాలు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ లైబ్రరీకి పుస్తకాల అందజేత సిద్దిపేటఅర్బన్: విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ లైబ్రరీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ నాగుల స్రవంతి ఆదివారం పుస్తకాలను ప్రిన్సిపాల్కు అందజేశారు. ఇటీవల పాఠశాలను హరీశ్రావు సందర్శించిన సందర్భంగా లైబ్రరీకి పలు పుస్తకాలు కావాలని విద్యార్థినులు కోరారు. వారి కోరిక మేరకు రూ. లక్ష విలువైన పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం పుస్తకాలను అందజేసిన హరీశ్రావుకు విద్యార్థులు, ప్రిన్సిపాల్, సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. -
నేడే మల్లన్న ఆరోవారం
భారీగా తరలిరానున్న భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో ఆరవ ఆదివారానికి ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని ఈఓ వెంకటేశ్ సూచించారు. బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసులుగజ్వేల్రూరల్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసులను జారీ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గజ్వేల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు బండారు మహేష్, ఎల్కంటి సురేష్లు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నియమ నిబంధనలను ఉల్లఘించడంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అభ్యర్థుల ఓటమికి పనిచేశారని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నోటీసులను పంపించామని, నోటీసులు అందిన మూడ్రోజుల్లోపు జిల్లా కార్యాలయానికి వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.రాజకీయంగా రాణించాలి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సతీష్ సిద్దిపేటజోన్: రాజకీయంగా పద్మశాలీలు మరింత చైతన్యం కావాలని జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పొపా భవన్లో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పద్మశాలీ ప్రజాప్రతినిధులకు సన్మానం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 21మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. సంఘటితంగా ముందుకు సాగి రాజకీయ హక్కులు సాధించాలని సూచించారు. ఇటీవల గెలిచిన దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీతతో పాటు కౌన్సిలర్లుగా గెలిచిన వారిని, సర్పంచ్లను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు రాజేశం, సంఘం ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్, ఆగయ్య, దయాసాగర్, ప్రభాకర్, రవితేజ, వెంకన్న, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సన్మానంహుస్నాబాద్రూరల్: పట్టణ పౌరుడు, ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఐఏఎస్ శ్యాంప్రసాద్ లాల్కు శనివారం రాత్రి వైశ్య భవన్లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన ఊరు, అక్షరాలు దిద్దిన బడిని ఎప్పటికి మర్చిపోనన్నారు. కలెక్టర్ అయినప్పటికీ నేను హుస్నాబాద్ ప్రాంత వాసినేనన్నారు. నాపై అభిమానంతో పట్టణంలోని వివిధ సంఘాలు సన్మానించడం గర్హకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, ఆకుల రజిత, పందిల్ల శంకర్, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యం పెంచేలా వీడియోలు రూపొందించండిసీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: సైబర్ నేరాలు, మహిళలపై వేధింపుల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలను చైతన్య పర్చేలా వీడియోలు రూపొందించాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలను చైతన్చపర్చడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా చాలా మంది వీడియోలు రూపొందించారన్నారు. అదేవిదంగా ఇతర అంశాలపై కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఆసక్తిగల వారు సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న వీడియోలు రూపొందించాలని సూచించారు. -
చకచకా.. డబ్లింగ్
మేడ్చల్– ముథ్కేడ్ మధ్య పనులు ● శరవేగంగా ట్రాక్, వంతెనల నిర్మాణం ● భూసేకరణకు ప్రతిపాదనలురామాయంపేట(మెదక్): మేడ్చల్– ముథ్కేడ్ రైల్వే ట్రాక్ పరిధిలోని రెండో లైన్ (డబ్లింగ్) నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని అక్కన్నపేట నుంచి మేడ్చల్ వరకు 55 కిలోమీటర్ల మేర డబ్లింగ్, ట్రాక్ విద్యుద్దీకరణ కోసం రెండేళ్ల క్రితమే రూ. 523 కోట్లు మంజూరయ్యాయి. ఈలైన్ పరిధిలో ప్యాకేజీల వారీగా టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, మేడ్చల్ వరకు గతంలోనే డబ్లింగ్ పనులు పూరయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని మనోహరాబాద్ మండల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. 25 చిన్న .. 3 పెద్ద వంతెనలు డబ్లింగ్ పనుల్లో భాగంగా 55 కిలోమీటర్ల మేర లైన్లో సుమారు మూడు పెద్దస్థాయి వంతెనలతో పాటు 25 వరకు చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. రైల్వే క్రాసింగ్ల మూసివేతలో భాగంగా జిల్లాలో నాలుగో చోట్ల ఆర్యూబీలు నిర్మించనున్నారు. రెండో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలోనే విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్రాక్ పరిధిలో రెండో లైన్ నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో రెండో లైన్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆశాఖ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పెరగనున్న రైళ్ల సంఖ్య! జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు అక్కన్నపేట, వడియారం, మీర్జాపల్లి ఉన్నాయి. అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ పట్టణానికి ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించడంతో ఈస్టేషన్ జంక్షన్గా మారింది. ప్రతి రోజు 42 వరకు ప్యాసింజర్ రైళ్లతో పాటు ఆరు వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్తో తరచూ క్రాసింగులు తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది. రెండు ట్రాక్లుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. రెండో లైన్ నిర్మాణం పూర్తయితే ఆయా స్టేషన్ల రూపురేఖలు మారే అవ కాశం ఉంది. ఇప్పటికే వడియారం, అక్కన్నపేట స్టేషన్ల పరిధిలో భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఆయా స్టేషన్ల పరిధిలో ప్లాట్ఫాంల సంఖ్య పెరగనుంది. -
కబడ్డీ సీనియర్ జట్టుకు ఎంపిక
అక్కన్నపేట(హుస్నాబాద్): చౌటపల్లికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు పులికాశి వంశీకృష్ణ రాష్ట్ర సీనియర్ జట్టుకి ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పత్తిపాక లావణ్య, మాజీ సర్పంచ్ గద్దల రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులకు కేరాఫ్ చౌటపల్లి పుట్టినిల్లుగా నిలుస్తోందన్నారు. ఈ గ్రామం నుంచి అనేకమంది కబడ్డీతో పాటు వివిధ క్రీడాల్లో జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. అందులో భాగంగా వంశీకృష్ణ జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపిక కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. -
మెరుగైన సేవలందించండి
గజ్వేల్: ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని మున్సిపల్ పాలకవర్గానికి మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయితోపాటు కౌన్సిలర్లు మాజీ మంత్రి హరీశ్రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హరీశ్రావు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. కాగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డిలను సైతం పాలకవర్గం కలిసింది. కార్యక్రమంలో గజ్వే ల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివా స్, బీఆర్ఎస్ నేత వంటేరు విజయ్వర్ధన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.మాజీ మంత్రి హరీశ్రావు -
ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు
గజ్వేల్: ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తోర్నాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సరిత అన్నారు. శనివారం గజ్వేల్ మండలం దాతర్పల్లిలో ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలకవచ్చునని చెప్పారు. పొద్దుతిరుగుడు పంట సాగులో మెలకువలను ఈ సందర్భంగా వివరించారు. కాగా మండలంలోని దిలాల్పూర్లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ పథకం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, దాతర్పల్లి సర్పంచ్ దివ్య, దిలాల్పూర్ సర్పంచ్ వెంకట్రెడ్డి, ఏఈఓ మాధవీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ‘తోర్నాల’ శాస్త్రవేత్త సరిత దాతర్పల్లిలో అవగాహన సదస్సు -
పక్కాగా కొలతలు, హక్కులు
సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి పల్లెలు. గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లోని మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పల్లెల్లో బెల్ట్షాపులు పెరిగిపోవడం.. సంపాదించిన డబ్బంతా మద్యం తాగేందుకే ఖర్చు పెడుతండటంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. పైగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజలంతా ఏకమై మద్యం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఆస్తులకు కచ్చితమైన సరిహద్దులు.. యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నక్ష ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష (నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్స్) పైలెట్ ప్రాజెక్ట్ ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికై న 157 మున్సిపాలిటీల్లో తెలంగాణ నుంచి 10 పట్టణాలు చోటు దక్కగా అందులో హుస్నాబాద్ ఒకటి. ఇప్పటికే పట్టణాన్ని 100 బ్లాకులుగా విభజించి 8 వార్డుల వారీగా సర్వే చేస్తున్నారు. గతంలో ఇంటి విస్తీర్ణం పై డ్రోన్లు, ఏరియల్ సర్వే చేసిన అధికారులు ఇప్పుడు ఇంటింటికి నేరుగా వెళ్లి కొలతలు వేస్తున్నారు. ఖాళీ స్ధలాలు, ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్లు ఇలా ప్రతీ అంగుళాన్ని నమోదు చేస్తున్నారు. – హుస్నాబాద్: ఆస్తులకుడిజిటల్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూమి రికార్డులను నవీకరించడం, డిజిటలైజ్చేయడం, పట్టణ ప్రణాళిక, మెరుగైన పౌర సేవల కోసం కచ్చితమైన జీఐఎస్ ఆధారిత మ్యాప్లను తయారు చేయనున్నారు. ఆస్తి యాజమానులకు స్ఫష్టమైన హక్కుల దృవీకరణ ఇవ్వనున్నారు. ఆస్తికి ఇచ్చె డిజిటల్ కార్డు ఆధార్ కార్డుగా ఉపయోగపడుతుంది. యాజమాని ఆస్తికి ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. సర్వే తర్వాత ఇచ్చే పత్రం పక్కాగా ఉంటుంది. ఒక సారి పత్రం ఇస్తే కబ్జాల భయం ఉండదు. సరిహద్దు తగాదాలు పూర్తిగా తగ్గనున్నాయి. ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కట్టడం నుంచి మ్యుటేషన్ వరకు అంతా ఆన్లైన్లో నిక్షిప్తం అవుతుంది. డిజిటల్ కార్డును ఓపెన్ చేస్తే ఇంటి యాజమాని ఆస్తుల వివరాలు తెలిసేలా ఆన్లైన్లో పొందుపరుస్తారు. డిజిటల్ కార్డుతో ప్రాపర్టీ విలువ పెరగడంతో పాటు బ్యాంకుల్లో అప్పులు సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఒక్క సారి ఆన్లైన్లో డేటా నమోదు అయితే భవిష్యత్లో చట్టపరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.భూ రికార్డులు ఇక ఆధునీకరణ ● హుస్నాబాద్లో ప్రారంభమైన డిజిటల్ సర్వేఅవగాహన కల్పిస్తాం డిజిటల్ సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తాం. త్వరలో ప్రతి వార్డులో పట్టణ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. నక్షా సర్వేలో ప్రజలు తప్పని సరిగా భాగస్వాములు కావాలి. డిజిటల్ మ్యాపింగ్కు ప్రజలు సహకరించాలి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు భూమి పత్రాలు చూపించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆస్తుల భద్రత, పారదర్శకతకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. – మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్మరో లక్ష ఎకరాలకు సాగునీరుప్రజల్లో అపోహలు..డిజిటల్ సర్వే కోసం వచ్చే అధికారుల టీమ్ ఇంటికి వస్తే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్నులు పెంచుతారేమోనని, ఖాళీ ప్రదేశాలను ప్రభుత్వం తీసుకుంటుందేమోనని ప్రజల్లో అపోహలు వెంటాడుతున్నాయి. వివరాలు చెప్పేందుకు ఒకటికి, రెండ్లు సార్లు ఆలోచిస్తున్నారు. ఇది పూర్తిగా ఆస్తుల భద్రత కోసమేనని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ సర్వేపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఇంటి పన్నులు పెంచారని గగ్గోలు పెడుతున్న ప్రజలు ఖరీదైన ఖాళీ స్ధలాల వివరాలు చెప్పేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నాటికి టార్గెట్ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఇవి కూరలేనా?
● విద్యార్థులకు ఇలాగేనా వడ్డించేది ● కలెక్టర్ హైమావతి ఆగ్రహం ● బాధ్యులపై చర్యలకు ఆదేశందుబ్బాక: ‘ఇవి కూరలా?.. ఇది సాంబారా?.. ఇంత అధ్వానమా.. విద్యార్థులకు భోజనాలు ఇలాగేనా పెట్టేది.. పైగా అరకొర వండి వడ్డించడమా?’ అంటూ కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. శనివారం దుబ్బాక మండలంలోని రామక్కపేటలో బాలికల గురుకులాన్ని, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వండిన కూరలన్నీ నాసిరకంగా ఉండటం.. పైగా అరకొరగా వండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరకులు, కూరగాయలన్నీ అందిస్తుంటే పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన కూరలతో వడ్డించకుండా ఇంత నాసిరకంగా భోజనాలు పెడతారా? అంటూ కేర్ టేకర్, ఉపాధ్యాయులపై మండి పడ్డారు. అరకొరగా వడ్డించడంపై.. గురుకులంలో 500పైగా పిల్లలుంటే 237 మంది విద్యార్థులకు కూడా సరిపోకపోవడంతో ఎందుకిలా సగం కడుపుకే పెడుతున్నారంటూ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిష్టర్ తనిఖీ చేయగా రాసిన సరకులకు చేసిన వంటలకు పొంతన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇంత అధ్వానంగా భోజనం పెడుతున్న కేర్ టేకర్తో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జోనల్ అధికారిని ఫోన్లో ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, చదువు, వసతి విషయంలో రాజీపడొద్దని ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను చేరవేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల్లో చురుగ్గా పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని.. ఆలోచన శక్తి కూడా మెరుగవుతుందని, చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకోవాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్పై రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలపై తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఆటలతో పాటు విద్యలో ముందుంటే ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడతారన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. రోజులో గంట సమయం వ్యాయామం, వాకింగ్, రన్నింగ్కు కేటాయించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య, జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి సౌందర్య, కోచ్ సంజీవ్, రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ చంద్రమోహన్, సర్పంచ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ శ్రీనివాస్రెడ్డి రంగనాయక సాగర్పై సైక్లింగ్ పోటీలు -
ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకుగాను రైతులకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి శనివారం తెలిపారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా రైతు వేదికల్లో, సమీపంలోని మీ సేవా కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు నమోదు సమయంలో ఆధార్ కార్డు నంబర్, పట్టాదార్ పాస్బుక్ వివరాలు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ తదితర పత్రాలు తప్పనిసరిగా అధికారులకు అందించాలన్నారు. ప్రత్యేకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందేందుకు ఫార్మర్ ఐడీ అవసరమన్నారు. ఫార్మర్ ఐడీ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, పంట బీమా, సబ్సిడీలు, రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరగా అందుతాయని తెలిపారు. -
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి
● ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచాలని, ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఉద్యాన శాఖ జిల్లా అధికారి సువర్ణ సూచించారు. గురువారం మద్దురు మండల కేంద్రంలో సాగుచేస్తున్న మధుసుదన్రెడ్డికి చెందిన 3 ఎకరాల డ్రాగన్ పంటను, రేబర్తి గ్రామంలో లింగారెడ్డికి చెందిన ఆయిల్ పామ్ పంటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయడం వలన రైతులకు, వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అంతర పంటగా మునగ, వేరుశనగ సాగు చేసి అధిక రాబడి పొందారన్నారు. ఇప్పటి వరకు 17టన్నుల పంట తీసి దర్శంగా నిలుస్తున్నారన్నారు. ఆయిల్పామ్ సాగు చెపట్టడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి, నికర ఆదాయం పెరుగుతుందన్నారు. మామిడిలో పూత దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. ప్రస్తుతం కూరగాయల బాక్స్లకు, బ్యాగులకు, యంత్రాలకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ ఉందని రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి కౌసల్య, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఇన్చార్జి రాకేష్, ఏఈఓ రాజు, డ్రిప్ సిగ్నెట్ అధికారులు సతీష్, నరేశ్,తదితరులు పాల్గొన్నారు. -
ధర్మ రక్షణే లక్ష్యం కావాలి
సిద్దిపేటజోన్: ఛత్రపతి శివాజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని, హిందూ ధర్మ రక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం ఛత్రపతి శివాజి జయంతి సందర్భంగా పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాత్రి శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాతీయ సాహిత్య పరిషత్ ప్రతినిధి భాస్కర యోగి, హిందూ వాహిని సంఘటన కార్యదర్శి యాదగిరి, ప్రతినిధులు శ్రీనివాస్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
3,836 ఇందిరమ్మ ఇళ్లు రద్దు
ఇప్పటి వరకు ముగ్గు పోసింది 9,281 మందే సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు లబ్ధిదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోవని.. మరో వైపు నిర్మాణం కొలతల నిబంధనలతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నిర్మించినా బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తుండటం మరో కారణం. జిల్లా వ్యాప్తంగా 13,067 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 9,231 మందే ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఇంకా 3,836 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయకపోవడంతో వాటిని రద్దు చేశారు. వాటిని మరికొందరికి మంజూరు చేసేందుకు ప్రతిపాదన సేకరిస్తున్నారు. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన వారికి సైతం బిల్లులు వెంటనే చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పనుల పురోగతి ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నా సకాలంలో అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. వివిధ దశల్లో 7,636 నిర్మాణం జరిగిన వాటికి రూ.212.84కోట్లను చెల్లించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందిస్తోంది. సిమెంట్, ఐరన్, ఇటుకలు, భవన నిర్మాణ కూలీ డబ్బులు విపరీతంగా పెరగడంతో దాదాపు రూ.12లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పేదల ఇంటి నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ రుణాలు అందించి వెసులుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు. ఇల్లు ఒకరిది.. బిల్లు మరొకరికిఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లింపుల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని.. ఇంటింటి సర్వేలో అధికారులకు వివరాలన్నీ సమర్పించి.. తీరా ప్రొసీడింగ్ పత్రం వచ్చి ఇంటి నిర్మాణం కొనసాగుతున్న వేళ బిల్లులు మాత్రం ఇతరుల ఖాతాల్లో జమ కావడంతో లబ్ధిదారులు కంగుతింటున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో మంచాల అరుణ, భర్త పేరు యాదగిరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. గతేడాది జూలై 28న ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోశారు. సెప్టెంబర్ 8న బేస్మెంట్ వరకు నిర్మాణం కాగానే స్థానిక అధికారులు ఫొటో తీసుకుని ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేశారు. మొదటి బిల్లు రావడం లేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదే గ్రామానికి చెందిన మంచాల అరుణ భర్త పేరు కనకయ్యకు చెందిన బ్యాంక్ ఖాతాలో రూ.లక్ష జమ అయింది. ఇద్దరికి ఒకే ఆధార్ నంబర్ను అధికారులు నమోదు చేయడంతో మరొకరి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. అధికారులు చేసిన తప్పిదానికి బిల్లు రాకుండా పోయింది. 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలో నిలిపివేయవద్దని అప్పు తెచ్చి నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో సైతం రెండు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఆధార్ నంబర్లు సరి చేసి ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ముగ్గుపోయని వాటిని రద్దు చేశాం ఇందిరమ్మ ఇళ్లు మంజూరై 45 రోజులు అయినప్పటికీ నిర్మాణం కోసం ముగ్గు పోయని వారి వివరాలను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల ద్వారా వివరాలు తెప్పించి రద్దు చేశాం. వాటి స్థానంలో కొత్తగా మంజూరు చేసేందుకు వివరాలు తెప్పించుకుంటున్నాం. అలాగే ఇంటి నిర్మాణం చేసిన వారికి కాకుండా మరొకరికి బిల్లు పడిన విషయం మాదృష్టికి వచ్చింది. దానిని త్వరలో పరిష్కరిస్తాం. –పవన్కుమార్, పీడీ, హౌసింగ్ -
నిఘా నీడన ఇంటర్ పరీక్షలు
ఈనెల 25 నుంచి ప్రారంభం ● పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ● ‘సాక్షి’తో డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ‘ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి పరీక్షలు నిఘా కెమెరాల మధ్య జరగనున్నాయ’ని పరీక్షల కమిటీ కన్వీనర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించిన పలు అంశాలు ఇలా ఉన్నాయి. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఈసారి కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా? ప్రైవేట్ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదట నిజమేనా? పరీక్షా నిర్వహణ విధుల కేటాయింపు అధ్యాపక సంఘాల ఒత్తిడితో చేశారనే ఆరోపణలు ఉన్నాయి? పరీక్షల నిర్వహణ నిర్ణయాలను మీరే సొంతంగా తీసుకున్నట్లు సమాచారం. మీరేమంటారు? సీఎస్, డీఓ, స్క్వాడ్ల నియామకం చేశారా? ప్రశ్నపత్రాల పంపిణీ జరిగిందా? ఎలా చేస్తారు? పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, నిర్వహణ అధికారులు, సిబ్బందికి మీరిచ్చే సలహాలు, సూచనలు.. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? మొత్తం ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు? -
పాఠశాలల్లో పనులు వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో పీఎంశ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేపడుతున్న పలు రకాల పనుల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో పీఎంశ్రీ పథకం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయాల్లో ల్యాబ్లు, మరుగుదొడ్లు, భవిత కేంద్రాల పనులు వేగవంతం చేయాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 22 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో చేపట్టిన పనులు సైతం వందశాతం పూర్తి చేయాలన్నారు. అన్ని నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, సెక్టోరియల్ అధికారి రామస్వామి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో పలు అంశాలపై జూమ్ సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ వారీగా ఏడీఏలు.. క్లస్టర్ వారీగా ఏఓ, ఏఈఓలను మానిటర్ చేస్తూ పూర్తి చేయించాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ ఫెడ్ అధికారులందరూ సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమీక్షలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప రాణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధిపత్య పోరుతో.. చేజారే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు కారణంగానే పలు మున్సిపాలిటీలను వదులుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వం బలంగా ఉండి, అంతర్గత కుమ్ములాటలు లేని నియోజకవర్గాల్లోని బల్దియాలను కాంగ్రెస్ సునాయసంగా విజయం సాధించగలిగింది. అగ్రనేతలున్న చోట్ల క్లీన్స్వీప్ బలమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లోని బల్దియాలను హస్తం పార్టీ సునాయసంగా కై వసం చేసుకోగలిగింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్–జోగిపేట మున్సిపాలిటీల్లో 20 కౌన్సిలర్ స్థానాలకు 16 చోట్ల విజయం సాధించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాల్లో వేసుకోగలిగింది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్లోనూ అత్యధిక కౌన్సిలర్ స్థానాలతో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది. ఐదు బల్దియాల్లో కలవని ‘చేతులు’..బలమైన నాయకులున్న ఈ మూడు చోట్ల స్వతంత్రులుగానీ, ఎంఐఎం మద్దతు లేకుండానే సొంత మెజారిటీతో బల్దియాల్లో పాగా వేయగలిగింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభాసుపాలైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఈ ఐదింటిలో ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గం ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధుముదిరాజ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఈసారి తాము సమన్వయంతో కలిసి పనిచేస్తామని కాటా, నీలం మధు చేసిన బహిరంగ ప్రకటనలు సోషల్మీడియా ప్రచారానికే పరిమితమైందే తప్ప.. క్షేత్రస్థాయిలో ఇద్దరి క్యాడర్ కలిసి పనిచేయలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ఇక్కడ గట్టి పట్టున్న గాలి అనిల్కుమార్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ ఇన్చార్జిగా నియమించారు. అక్కడ పార్టీ విజయం సాధించింది. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఘెర పరాజయం పాలైంది. ఇద్దరు నాయకులు గాలి అనిల్కుమార్ వర్గం మద్దతు తీసుకుని ఉంటే ఫలితాలు కాస్త మెరుగ్గా వచ్చేవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమన్వయం లేనిచోట్ల బల్దియాలను కోల్పోయిన కాంగ్రెస్ బలమైన నాయకత్వమున్న చోట్ల భారీ మెజారిటీ సొంత పార్టీ కౌన్సిలర్లతోనే చైర్మన్ పీఠాలు కై వసం స్పష్టం చేస్తున్న మున్సిపల్ ఫలితాలుఆ రెండు మున్సిపాలిటీల్లో రచ్చజహీరాబాద్ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి రచ్చకెక్కింది. ఇక్కడ చంద్రశేఖర్తోపాటు, ఎంపీ సురేశ్షెట్కార్, సెట్విన్కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి ఇలా పార్టీ మూడు గ్రూపులుగా మారింది. ఈ మున్సిపాలిటీ టికెట్లను మాజీమంత్రి చంద్రశేఖర్ అనుచరుడు ప్రకటించడం పెద్ద రచ్చకు దారితీసింది. ఈ పంచాయితీని టీపీసీసీ అధిష్టానం కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఫయిమ్ఖరేషీని ఆ పార్టీ రంగంలోకి దించాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపుల నుంచి మొదలుకుని, చైర్మన్ ఎన్నిక వరకు ఖురేషీ ఈ మూడు వర్గాలను సమన్వయం చేయాల్సి వచ్చింది. ఇక్కడి చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ..బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు తక్కువ స్థానాలు దక్కాయి. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు లేకపోతే ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ వదులుకోవాల్సి వచ్చేది. -
ఏడుపాయల హుండీ ఆదాయం రూ.39.87 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల హుండీ ఆదాయం రూ.39,87,178 వచ్చినట్లు ఆలయ ఈఓ వీరేశం తెలిపారు. బుధవారం 29 రోజుల కానుకలు లెక్కించారు. కాగా వివిధ సేవల ద్వారా రూ. 47,69,090 వచ్చిందన్నారు. మొత్తం కలిపి రూ. 87,56,268 వచ్చినట్లు చెప్పారు. ఒడిబియ్యం టికెట్ల ద్వారా రూ.69,200, కేశఖండనం రూ.56,600, స్పెషల్ దర్శనం (రూ.20 టికెట్) ద్వారా రూ.3,59,420, స్పెషల్ దర్శనం (రూ.100 టికెట్) ద్వారా రూ.10,09,600, లడ్డూలకు రూ. 22,48,640, పులిహోర రూ.10,25,630 వచ్చినట్లు వివరించారు. కాగా మిశ్రమ బంగారం 0.32, వెండి 730 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా గత జాతరతో పోలిస్తే రూ.26,06,031 ఆదాయం అధికంగా వచ్చిందని ఈఓ తెలిపారు. -
బాల్య వివాహాలు చేస్తే చర్యలు
గజ్వేల్రూరల్: బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రావణ్కుమార్, సీడీపీఓ సరిత అన్నారు. గజ్వేల్ మండలంలోని ఓ గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారని సమాచారం తెలుసుకున్న సంబంధిత శాఖల అధికారులు బుధవారం పట్టణంలోని ఐవోసీలో బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాలికలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం బాలికలకు 18ఏళ్లు, బాలురకు 21ఏళ్లు నిండాలన్నారు. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పోక్సో చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే వ్యక్తిపై, సహకరించిన వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, చైల్డ్లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజాసేవే లక్ష్యం కావాలి
● సృజనాత్మకతతో ఆలోచించాలి ● గ్రూప్–1 అధికారులతో కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: విధినిర్వహణలో ప్రత్యేక దృష్టి సారించి సృజనాత్మకత ఆలోచనలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి మొదటి బ్యాచ్ గ్రూప్–1 అధికారులకు సూచించారు. గ్రూప్–1 అధికారులు జిల్లాలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ పాలన వ్యవస్థల పనితీరును తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో వారు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యటన మా సర్వీసులో జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభవమన్నారు. జిల్లా ప్రజలు, అధికారుల ఆతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగరీత్యా మంచి నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, వాటి పరిష్కారాలను తెలుసుకొని ప్రజలకు మంచి సేవ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రూప్ –1 అధికారులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం
నర్సాపూర్ రూరల్: తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్, ప్రొఫెసర్ అర్జున్రావు కూతాడి అన్నారు. బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం, హెరిటేజ్ తెలంగాణ శాఖ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువతకు హెరిటేజ్ పరిశోధనలో అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ చరిత్రను డాక్యుమెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, పరిశోధన సామర్థ్యాలు పెంచుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ.. రెండు సంస్థలు కలిసి హెరిటేజ్ సంరక్షణ, చరిత్ర పరిశోధనలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఫీల్డ్ వర్క్, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అధ్యక్షుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ అర్జున్రావు కూతాడి -
పైసలు పాయె.. పదవీ దక్కకపాయె
● గెలుపు ధీమాతో పోటాపోటీగా ఖర్చు ● గరిష్టంగా రూ.2కోట్లకు పైగా వెచ్చింపు ● అప్పులు ఎలా తీర్చేదంటూ ఆవేదన ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,256 మంది ఓటమి మున్సిపల్ ఎన్నికల్లో పైసలన్నీ పోయె.. పదవీ దక్కకపాయె.. అప్పుల కుప్పాయె.. అంటూ కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. చేసిన అప్పులను ఎలా తీర్చేది అంటూ లోలోపల కుమిలిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 402 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించగా, 1,256 మంది ఓటమి పాలయ్యారు. – సాక్షి, సిద్దిపేట పట్టణంలో కౌన్సిలర్గా పని చేయాలనేది కొందరికి మోజు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో కార్యకర్త, నాయకుడిగా కొనసాగుతున్న వారు ఈసారి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా రిజర్వేషన్ కలిసి వచ్చిందని చాలా మంది పోటీ చేశారు. రాజకీయ నేత ఎదగడానికి కౌన్సిలర్ తొలి మెట్టు అవుతుందని బరిలో దిగారు. అందులో ఆయా వార్డుల్లో ఎక్కువ ఓట్లు సాధించిన వారికి విజయం వరించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారు ఓటమి చెందారు. కొందరు సొంత డబ్బులు.. మరి కొంత మంది తమ దగ్గర ఉన్న డబ్బులతో పాటు అప్పులు తెచ్చారు. అలాగే భూములను విక్రయించడం.. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో వెచ్చించారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే రోజు వరుకు చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు.. ఓటమి చెందడంతో అప్పులు పెనుభారంగా మారాయి. విచ్చలవిడిగా వెచ్చింపు.. గెలుస్తామని ధీమాతో కొందరు అభ్యర్థులు విచ్చలవిడిగా వెచ్చించారు. విందులు, వినోదాలు, గిఫ్ట్లతోపాటు ఓటర్లకు నేరుగా రూ.1,000 నుంచి రూ.10వేల అందించినట్లు తెలిసింది. కొందరు స్థిరాస్తులు అమ్ముకోగా, మరికొందరు భూములు తాకట్టు పెట్టి, మరికొందరు నేరుగా అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో వెనకడుగు వేయకుండా డబ్బులు తీసుకవచ్చి వెచ్చించారు. ఓటమి చెందగానే చేసిన అప్పులు గుర్తు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఓటమి పాలైన కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థులు తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలు ఎలా కట్టాలి? అసలు అప్పు తీర్చేది ఎలా అని పలువురు తలలు పట్టుకుంటున్నారు. ఐదు మున్సిపాలిటీలలో అధికంగా ఖర్చు హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం పురపాలక సంఘాల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు చేశారు. వీటిలో మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలబడిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్లకు పైగా వెచ్చించినట్లు ప్రచారం జరిగింది. దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్లలో ఒక్కో ఓటుకు కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కింద కొంతమేర డబ్బులతో పాటు ప్రచార సామగ్రిని అందజేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కొంత వరకు కార్నర్ సమావేశాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓటమి చెందిన అభ్యర్థులను ఆయా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కనీసం పలకరించకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. బరిలో నిలిచి ఓటమిని చవిచూసిన అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు ఓదార్చకపోవడంతో మరింత కుమిలిపోతున్నారు. రాజకీయ భవిష్యత్తు ఎమిటని తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును చూస్తే పేదోడు రాజకీయాలలో ఉండటం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం కొసమెరుపు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 9,946, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,095 మంది ఉండగా 42 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. దీనికై అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనిచేసేలా చూడాలని, విద్యుత్ కొరత, లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామాలు ప్రతిరూపం.. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామాలు ప్రతిరూపమని కలెక్టర్ కె. హైమావతి అధికారులకు సూచించారు. క్షేత్ర పర్యటన చేస్తున్న 37 మందితో కూడిన గ్రూప్–1 మొదటి బ్యాచ్ అధికారులకు వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. మల్లన్న సాగర్ వద్ద మంగోల్ లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును, మహానగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ హైమావతి -
నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు
మిరుదొడ్డి(దుబ్బాక): అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు సాధ్యపడతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అల్వాల గ్రామాన్ని గ్రూప్–1 అధికారులు సందర్శించారు. గ్రామాన్ని సందర్శించిన అధికారులతో పాటు, బక్కి వెంకటయ్యను గ్రామస్తులు డప్పు చప్పుళ్ళ మధ్య గణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన నిరుపేద ప్రజలను ఆదరించి, వారి సమస్యలను పరిష్కరించిన అధికారులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. జిల్లాలో నూతనంగా నిమామకమైన గ్రూప్–1 అధికారులు సమష్టిగా విధులు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రూప్–1 అధికారులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల గణేష్రెడ్డి, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నర్సమ్మ, సర్పంచ్ ప్రమీలాదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామాన్ని మంగళవారం గ్రూప్ 1 అధికారుల బృందం సందర్శించింది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును, ప్రజా సమస్యలు, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, తాగు నీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం ట్రైనింగ్లో కీలక భాగమన్నారు. అధికారులు జెస్సీ పౌల్, ఉజ్వల, నరేందర్, సాత్విక్ నాయక్, నిఖిల, నిఖిత రెడ్డి, ప్రణయ్ సాయితో పాటు తహసీల్దార్ సలీమ్, ఎంపీడీఓ జనార్దన్, ఏఓ జయంత్ కుమార్, సర్పంచ్ అనిల్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గజ్వేల్రూరల్: శ్రీరాముని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని గజ్వేల్ ఏసీపీ నరసింహులు అన్నారు. గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం నుంచి వచ్చిన వడ్లకు మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల పార్దివేశ్వరస్వామి దేవాలయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు తుమ్మ శ్రీను, భాస్కర్, నర్సింలు, సత్యనారాయణ, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
‘సాక్షి’తో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత దుబ్బాక: మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చైర్పర్సన్ శ్రీరాం సంగీత తెలిపారు. మున్సిపల్కు నూతన చైర్పర్సన్గా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. మాది 50 ఏళ్ల నుంచే రాజకీయాలతో పెనువేసుకున్న కుటుంబం. మాకు ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. ఆ నమ్మకంతోనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకరన్న చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ పని చేస్తా. మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఇక్కడ ఎక్కువగా చేనేత, బీడీ కార్మికులు, రైతులు, పేద కుటుంబాలే ఎక్కువ. వీరికి ఆపద వేళ అండగా ఉంటా. నా భర్త రవీందర్కు ఉన్న రాజకీయ అనుభవంతో ముందుకు వెళ్తా. మౌలిక వసతులతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వాటర్, పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజలు, అన్ని వర్గాల సలహాలు తీసుకొని ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తాను. పట్టణ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో ప్రతీ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ అరుణ తెలిపారు. చైర్పర్సన్గా నూతనంగా ఎన్నికై న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. పట్టణ ప్రగతిపై వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే.. ముందుగా పాలకవర్గసభ్యులతో కలిసి పట్టణంలో పర్యటిస్తాం. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పరిష్కారానికి కృషి చేస్తాం. మౌలికవసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా ప్రజాఅవసరాల మేరకు అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తా. శానిటేషన్, తాగునీరు. వీధి దీపాలు, అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం వంటి పలు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తా. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. మున్సిపాలిటీకి వచ్చే నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సహకారంతో అదనపు నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతీ సమస్య పరిష్కరిస్తా. ‘సాక్షి’తో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అరుణ -
కోటి ఆశలు
కొత్త పాలకవర్గాలపై●పుర ప్రగతి పరుగులు పెట్టేనా? ●పెండింగ్ సమస్యలు పరిష్కారమయ్యేనా? ●పారిశుద్ధ్యం మెరుగుపడేనా? ●ఏళ్లుగా పట్టణ ప్రజల అవస్థలు దుబ్బాకలో ఏళ్లుగా యాతన.. ● దుబ్బాక మున్సిపాలిటీలో 27,496మంది జనాభా ఉండగా, 21,341మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయి. ● డంపు యార్డు నిర్మించినా...సక్రమంగా వినియోగించడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ శాసీ్త్రయంగా సాగటం లేదు. ● అంతర్గత రోడ్లు సక్రమంగా లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ● డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు చెరువుల్లోకి వదులుతున్నారు. దీనివల్ల పట్టణంలో దుర్గంధం వ్యాపిస్తోంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన వేళ.. మున్సిపాలిటీల్లో పెండింగ్ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఏళ్లతరబడి ఇబ్బందులతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు ఇకనైనా తమ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ పరిశీలన ఇది.. గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉండగా.. సిద్దిపేట మినహా మిగతా చోట్ల ఎన్నికలు జరిగి ఈనెల 16న కొత్త పాలకవర్గాల కొలువుదీరిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయా మున్సిపాలిటీల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. -
త్వరలో అధ్యాపకులను నియమిస్తాం
● మంత్రి కొండా సురేఖ ● ములుగు అటవీ కళాశాలలో దశాబ్ది ఉత్సవాలు ములుగు(గజ్వేల్): అటవీ కళాశాలలో అధ్యాపకుల నియామకానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండాసురేఖ తెలిపారు. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కను నాటి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధ్యాపకుల నియామకాలలో రిజర్వేషన్ల పెంపు దిశగా కృషి చేస్తానన్నారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ఎఫ్సీఆర్ఐ సంస్థ ముందంజలో ఉందన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని మంత్రి ప్రశంసించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి సన్మానించారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సి.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ బీఎస్సీ అటవీ శాస్త్ర ప్రవేశ విధానంలో మార్పులు అవసరమన్నారు. ఇంటర్మీడియెట్ మార్కులకు, ఈఏపీసెట్ ర్యాంక్కు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమతుల్యమైన, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి సువర్ణ, ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ దండ రాజిరెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రియాంక వర్గీస్, ఎస్.జె.ఆశ, కళాశాల డీన్ వి. కృష్ణ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నిధుల కోసం ఒత్తిడి పెంచుతాం
పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి గజ్వేల్: నియోజకవర్గం కేసీఆర్ అడ్డానని, ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న తమ పార్టీపై కుట్రలను సహించేదీలేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్ పర్సన్ కళ్యన్కర్ పద్మాబాయిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల మద్దతుతో నియోజకర్గంలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలను కై వసం చేసుకోగలిగామన్నారు. తూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో ఎంపీ రఘునందన్రావు బీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయంలో తానూ చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. మున్సిపాలిటీలోని సమస్యలు తీర్చకపోతే పోరాడుతామని హెచ్చరించారు. నిధుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. సమావేశంలో నాయకులు ఎన్సీ రాజమౌళి, నవాజ్మీరా, మధు తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ బడులు మూసివేస్తే సహించం
తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు లేరనే నెపంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే కుట్రను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తిప్పికొడుతుందని తపస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్యలు అన్నారు. జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ విస్తరణ సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నూతన కార్యవర్గ సభ్యులుగా ముండ్రాతి రాములు, గంట్యాల వెంకటేశం, గడీల శ్రీకాంత్, అనుముల వీరేశం, ఎండబెల్లి గోపాల్ రెడ్డి, భాస్కరాచారి, వీరారెడ్డి, తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జీవో నంబర్ 25ను సవరించకుండా హేతుబద్ధీకరణ చేపడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందన్నారు. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేయాలనే కుట్రను తిప్పికొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపడతామన్నారు. ఉపాధ్యాయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్రమశిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో తపస్ ఉపాధ్యాయులు ముందుంటారని అన్నారు. -
పురంలో వాడిన కమలం
బీజేపీకి మొత్తంగా 11శాతం ఓట్లే ● మూడు వార్డుల్లోనే కౌన్సిలర్లుగా గెలుపు ● దుబ్బాకలో ప్రత్యేక దృష్టి సారించినా ఫలితం శూన్యం ● నిరాశలో కార్యకర్తలు సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో కమలం వాడింది. ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాలు సైతం గెలవక చతికిలపడింది. దీంతో ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ పట్టణ ఎన్నికల ఫలితాలను చూస్తే పట్టుకోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది. హుస్నాబాద్, చేర్యాలలో ఒక్క సీటూ గెలవలేదు. మొత్తంగా బీజేపీకి 11.45శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. సంస్థాగతంగా పట్టణాల్లో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరుతున్నా సత్తా చాటడంలో విఫలమైంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 72 చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా కేవలం ముగ్గురే కౌన్సిలర్లు గెలుపొందారు. బీజేపీ నుంచి దుబ్బాకలో 2వ వార్డు కౌన్సిలర్గా గంబీపూర్ కనకరాజు, 8వ వార్డు కౌన్సిలర్గా మెరుపాల సాయికుమార్, గజ్వేల్లో 4వ వార్డు కౌన్సిలర్గా రొట్టెల శ్రీనివాస్లు గెలుపొందారు. నాలుగు మున్సిపాలిటీలలో 83,116 ఓట్లు పోలుకాగా బీజేపీకి 9,520(11.45 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంపీ ప్రత్యేక దృష్టిసారించినా.. మెదక్ ఎంపీ రఘునందన్రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకపై ప్రత్యేక దృష్టి సారించినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే హుస్నాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, గజ్వేల్లో ఎంపీ ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. కార్యకర్తలు చతికిల మెదక్, కరీంనగర్ ఎంపీలుగా రఘునందన్ రావు, బండి సంజయ్లు గెలుపొందడంతో పార్టీలో కొంత జోష్ కనిపించినా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. రాబోయే కాలమంతా ఎన్నికల కాలం.. ఇలాంటి సమయంలో కేడర్ నిరుత్సాహంలో ఉంటే ఎలా అని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. ఏప్రిల్లో సిద్దిపేట మున్సిపాలిటీ పదవీ కాలం ముగియనుంది. త్వరలో సిద్దిపేట మున్సిపాలిటీలో సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. పెరిగిన వర్గపోరు జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. బీజేపీ అధ్యక్షునిగా బైరీ శంకర్ నియమితులైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పార్టీ సత్తా చాటలేకపోయింది. జిల్లాలో వర్గపోరు పెరిగిందని కార్యకర్తలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో వర్గపోరు తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. ఒక వర్గం నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం కూడా చేటుచేసిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి అందరినీ ఒక్కతాటి పైకి తీసుకవచ్చి పార్టీని ముందుకు తీసుకవెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు. మున్సిపాలిటీ బీజేపీకి వచ్చిన ఓట్లు చేర్యాల 125 దుబ్బాక 3,487 గజ్వేల్ 4,421 హుస్నాబాద్ 1,487 -
సారె గిరగిర..
వర్గల్(గజ్వేల్): నవోదయ విద్యాలయలో ‘బ్యాగ్లెస్ డే’ సందడి నెలకొన్నది. మంగళవారం విద్యార్థులు పలు కృత్యాలలో మునిగితేలారు. కుమ్మరి ‘సారె’ గిరగిర తిప్పి మట్టి కుండలు తయారుచేయడం, ఫ్లూటుతో వినసొంపైన గీతాలాపనలు, గిటారు, వయోలిన్, ఓరిగామి తదితర అంశాలను విద్యార్థులు సాధన చేశారు. మరోవైపు తొమ్మిదో తరగతి మైగ్రేషన్ విద్యార్థులు రాయపోల్ హైస్కూల్, వర్గల్ ఎంజేపీ గురుకులం వెళ్లి గేమ్స్లో భాగస్వాములయ్యారు. బ్యాగ్లెస్ డే కార్యక్రమం విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి బాటలు వేస్తుందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేందర్ పేర్కొన్నారు. -
‘గజ్వేల్’లో పెండింగ్ పనులే అధికం
● ఈ మున్సిపాలిటీలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్పల్లి, సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ గ్రామాలతోపాటు ఆర్అండ్ఆర్ కాలనీ ఉంది. ● ఇక్కడ 88,827జనాభా, 46,740 ఓటర్లు ఉన్నారు. ● ఎన్నో సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రూ. 230 కోట్ల వ్యయంతో చేపట్టిన రింగు రోడ్డు అనుసంధానం అసంపూర్తిగా ఉంది. ● ప్రధాన రహదారికి వరద నీరు వెళ్లే మార్గం లేక.. వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారి జలదిగ్భంధంలో చిక్కుకుంటోంది. ● రూ.156కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ పనులు సక్రమంగా జరగకపోవడం వల్ల తరుచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలను నివారించడానికి జెట్టింగ్ యంత్రం లేదు. విలీన గ్రామాల్లో యూజీడీ ఊసే లేదు. ● పట్టణంలో అంతర్గత రోడ్లు ఛిద్రమై నరకం చూపుతున్నాయి. -
‘సాక్షి’తో గంగిశెట్టి చందన
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మూడో చైర్పర్సన్గా ఉన్నత విద్యావంతురాలు గంగిశెట్టి చందన రవీందర్ ఎన్నికయ్యారు. సోమవారం పదవీ స్వీకారం పురస్కరించుకుని ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ఈ సందర్భంగా ప్రజల నమ్మకాన్ని నిలబెడతానంటూ పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా.. సాక్షి: మీకు చాలా పెద్ద బాధ్యత వచ్చింది. ఎలా ఫీలావుతున్నారు? చైర్పర్సన్: చాలా గర్వంగా ఉంది. కేసీఆర్ వల్ల నాకు ఈ అవకాశం దక్కింది. ఈ పదవిని ప్రజ లకు మేలు చేయడానికి పూర్తిగా వినియోగిస్తా.. సాక్షి: పట్టణ అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏమిటీ? చైర్పర్సన్: మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నిధులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. దాంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవడానికి కొత్త ఆలోచనలతో ముందుకుసాగుతాం. సాక్షి: పట్టణంలో చాలా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయి... వాటి పరిస్థితి? చైర్పర్సన్: నిజమే. రింగురోడ్డుతోపాటు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అందరి సహకారం తీసుకుంటాం. ప్రత్యేకించి కౌన్సిలర్లను ఎప్పటికప్పుడూ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. ప్రజలకు మేలు చేసి వారి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం. -
నోటాకు 1,362
చెల్లని ఓట్లు 3,936..● ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ తీరు ● 59 వార్డుల్లో నోటాకు జీరో ● 5 వార్డుల్లో నో రిజెక్ట్ సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,936 ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్పై ఎక్కువ చోట్ల ముద్ర వేయడం, పెన్ను లు, ఇతర మార్కర్లతో రాయడం, అసలు ఓటు ముద్ర వేయకుండా ఖాళీగా ఉంచడం వంటి కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పాటు 1,362 మంది నోటాకు ఓటు వేశారు. పలు చోట్ల ఓట్లు తిరస్కరణ, నోటాకు ఓటు వేయడంతో అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయి. ఉదాహరణకు దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులో 1,076 ఓట్లుండగా 945 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వార్డులో బీఆర్ఎస్, బీజేపీలకు 266 చొప్పున ఓట్లు వచ్చాయి. 9 ఓట్లు తిరస్కరణ, ఒక ఓటు నోటాకు వేశారు. డ్రా తీయడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లవ్వ విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3,936 ఓట్లు తిరస్కరణకు గురికాగా 1,362 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఈవీఎం ద్వారా ఎన్నికల నిర్వహణ జరిగితే ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఓట్లు తిరుస్కరణకు గురయ్యాయి. బ్యాలెట్లో అభ్యర్థికి సంబంధించిన గుర్తును సరిగా ఎంపిక చేసుకుని ఓటు వేయడంలో చాలా మంది పొరపాట్లు చేశారు. స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన వారు చెల్లని ఓట్లతో ఆ ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి నోటాకు అవకాశం 2014లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. 2013లో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి ఓటింగ్కు దూరంగా ఉన్న వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించి పోలింగ్ శాతం పెంచేందుకు నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకవచ్చింది. పోటీలో ఉన్న వారు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు చోట్ల ఓటు హక్కును అవగాహనతో వినియోగించుకోవడంతో ఓట్లు తిరస్కరణకు గురికాలేదు. ఉమ్మడి జిల్లాలో 5 వార్డుల్లో ఒక్క ఓటు సైతం రిజెక్ట్ కాలేదు. అలాగే 59 వార్డుల్లో ఒక్కరు సైతం నోటాకు ఓటు వేయలేదు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఓట్లలో ఒక్కటీ రిజెక్ట్ కాలేదు. అలాగే నోటాకు ఓటు వేయలేదు. జహీరాబాద్ 6వ వార్డు పరిధిలో సైతం ఒక్క ఓటు రిజెక్ట్ కాలేదు, నోటాకు వేయలేదు. -
మల్లన్న పెద్దపట్నం.. భక్తుల తన్మయత్వం
శివనామస్మరణతో మారుమోగిన కొమురవెల్లికొమురవెల్లి(సిద్దిపేట): కోరమీసాల కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తజనసంద్రమైంది. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, ఒగ్గుపూజారులు పెద్దపట్నం ఘనంగా నిర్వహించారు. తోటబావి వద్ద సోమవారం తెల్లవారుజామున వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ వెంకటేశ్, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. పెద్దపట్నం వేడుకలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయధర్మకర్తలు, ఆలయ ఈఓ వెంకటేశ్ ఏఈఓలు పర్యవేక్షించగా, సీపీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మహా అన్నపూజ స్వామివారికి సోమవారం తెల్లవారుజామున పెద్ద పట్నం ముగిసిన వెంటనే గర్భగుడిలో మహా అన్నపూజ, ఏకదశ రుద్రాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల నిర్వహించారు. కొమురవెల్లి(సిద్దిపేట): ఆలయంలో ప్లంబర్ గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్ కుమార్ను ఆలయ ఈవో వెంకటేశం సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవల హుండీ లెక్కింపులో రూ. 9వేలు అపహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అతనిని విధులనుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆలయ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అభివృద్ధే ముఖ్యం
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంతక ముందు గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించారన్నారు. హుస్నాబాద్ చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల కేంద్రాల మాదిరి మరింత ప్రగతి బాట పట్టిస్తామన్నారు. హుస్నాబాద్లో మౌలిక సదుపాయాలు, వారి స్థితిగతులు మెరుగుపరుస్తామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధిలో ఒక మోడల్గా రూపొందిస్తామన్నారు. శాసనసభ్యుడిగా పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
చెరువును సుందరీకరిస్తాం
కోహెడరూరల్(హుస్నాబాద్): త్వరలోనే కోహెడలోని బడుగుల చెరువును సుందరీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కోహెడ పర్యటనలో భాగంగా ఆయన చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. చెరువు భూములకు పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. కోహెడ అభివృద్ధిలోనే ప్రథమ స్థానం ఉంటుందన్నారు. అనంతరం తిరిగి వెళ్తూ టీస్టాల్ వద్ద ఆగారు. టీతాగుతూ యువకులతో ముచ్చటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నంగునూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెటీరో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి తెలిపారు. టెన్త్లో 60 శాతం, ఇంటర్మీడియెట్లో 55 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే మేళాకు ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ, ఫార్మా, బ్రిడ్జ్ కోర్స్ చేసిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. టెన్త్, ఇంటర్ మెమోలు, ఒరిజినల్ ఆధార్కార్డు తోపాటు రెండు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించి నెలకు రూ.12,500 చెల్లిస్తారని చెప్పారు. 24న చలో సెక్రటేరియట్ సిద్దిపేటకమాన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట చలో సెక్రటేరియట్కు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మౌలానా, మల్లేశం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రామకోటి రామరాజు దుబ్బాకటౌన్: గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ వైభవాన్ని భక్తులకు చాటిచెప్పడానికి కృషి చేస్తానని శ్రీరామకోటి భక్త సమాజ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు చెప్పారు. మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన 500 యేళ్లనాటి భ్రమరాంబ మల్లికార్జునుడి ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ చుట్టూ పొలాలు, మధ్యలో ఆలయం ఎంతో ఆహ్లదకరంగా ఉందన్నారు. అనంతరం ఆలయ బాధ్యులు ఆయనను సత్కరించారు. -
నాడు చైర్పర్సన్.. నేడు కౌన్సిలర్గా
హుస్నాబాద్: మున్సిపల్ చైర్ పర్సన్గా ఐదేళ్లు సమర్థంగా పాలన కొనసాగించిన ఆమె.. నేడు కౌన్సిలర్గా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఆకుల రజిత 15వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచారు. నాడు చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించగా, రజితను చైర్ పర్సన్గా ఎన్నుకున్నా రు. ఈ సారి మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్కు కేటాయించారు. దీంతో చైర్మన్ పదవి దూరమైంది. అయినప్పటికీ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మళ్లీ 15వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందారు. నాడు అధ్యక్షా అని పిలిపించుకున్న ఆమె.. నేడు తానే అధ్యక్షా అని పిలవాల్సిన పరిస్థితి. -
పట్టణ ప్రగతికే ప్రాధాన్యం
‘సాక్షి’తో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి హుస్నాబాద్: కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల సహకారంతో మౌలిక వసతుల కల్పన, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటాల్లోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను గెలిపించారు. పట్టణంలో ఉన్న 20 వార్డుల్లో రాజకీయాలకు అతీతంగా సమానస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచనలేకుండా కృషిచేస్తా. శానిటేషన్, తాగునీరు. స్ట్రీట్ లైట్లు. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తా. ముఖ్యంగా కోతుల బెడద నుంచి ప్రజలను విముక్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. మున్సిపల్కు వచ్చే నిధులతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా అదనపు నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతీ సమస్య పరిష్కరిస్తా. మున్సిపల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికై న దండి లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసి బయటకు రాగానే భర్త దండి కొమురయ్య కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. 2004లో కౌన్సిలర్గా ఎన్నికై న దండి లక్ష్మి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. రెండో సారి లక్ష్మిని అదృష్టం వరించింది. రెండో ప్రయత్నంలో మున్సిపల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. -
దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలిచి గెలిపించిన దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం నూతనంగా ఎన్నికై న చైర్పర్సన్ శ్రీరాం సంగీత, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్లను అభినందించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా కుటిల ప్రయత్నాలు చేసినా 14 మంది కౌన్సిలర్లను గెలిపించి బీఆర్ఎస్కు అండగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. -
గజ్వేల్ పీఠంపై చందన
ప్రజల నమ్మకాన్ని నిలబెడతాగజ్వేల్: కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నవిధంగానే బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కై వసం చేసుకున్నది. సీల్డ్ కవర్లో ఈ రెండు పదవులకు ఎంపిక పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పంపగా...కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఈ ఎన్నికలో అనూహ్యంగా బీజేపీ మద్దతు లభించడం విశేషం. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా గంగిశెట్టి చందనను ఎన్నుకున్నారు. చైర్పర్సన్ అభ్యర్థిగా ఈమె పేరును 18వవార్డు కౌన్సిలర్ శ్రీధర్ ప్రతిపాదించగా, 2వ అభ్యర్థి గోలీ మమత బలపరిచారు. 20మంది కౌన్సిలర్కుగానూ చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించగా...అనూహ్యంగా బీజేపీ కౌన్సిలర్ కూడా చేతులెత్తడం విశేషం. మొత్తంగా 11మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో ఓటు కలిగిన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీజేపీ కౌన్సిలర్ కలుపుకొని మొత్తంగా 14ఓట్లు లభించాయి. ఇదే తరహాలో లభించిన ఓట్లతో వైస్ చైర్పర్సన్గా 17వార్డు కౌన్సిలర్ కళ్యన్కర్ పద్మబాయి ఎన్నికయ్యారు. ఎన్నిక విషయాన్ని ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం చైర్పర్సన్గా నాయిని సత్యలక్ష్మీని, వైస్ చైర్మన్గా శేర్పల్లి ఉపేందర్రెడ్డి పేర్లను ప్రతిపాదించినా...కేవలం ఏడు ఓట్లు మాత్రమే లభించడంతో వారి ఎన్నిక చెల్లలేదు. ‘వంటేరు’కు వ్యతిరేకంగా నినాదాలు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి వల్లే తమకు చైర్ర్సన్ పదవి దక్కలేదని ఆరోపిస్తూ వైస్ చైర్పర్సన్గా ఎన్నికై న కళ్యన్కర్పద్మబాయి భర్త నర్సింగరావు అతని మద్దతుదారులు అన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద వంటేరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రవికుమార్ అక్కకికి చేరుకొని వారిని సముదాయించి అక్కడినుంచి పంపించారు. వైస్ చైర్పర్సన్గా కళ్యన్కర్ పద్మాబాయి కొన్ని రోజుల ఉత్కంఠకు తెర.. బీఆర్ఎస్కు మద్దతు పలికిన బీజేపీ కౌన్సిలర్ -
చైర్మన్ గిరిపై పీటముడి
తూప్రాన్: తూప్రాన్ పురపోరులో బీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. చైర్మన్గిరి విషయంలో విభేదాలు పొడచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని బీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. ఇందులో 9 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 3 బీజేపీ కై వసం చేసుకున్నాయి. బీఆర్ఎస్కు స్థానాలు వచ్చినా.. గ్రూపు రాజకీయాలతో మూడు వర్గాలుగా చీలినట్లు తెలిసింది. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లతో హరీశ్రావు మంతనాలు సాగిస్తున్నారు. కాగా హరీశ్ అండదండలతో మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ చక్రం తిప్పుతుండగా.. ప్రతాప్రెడ్డి అండదండలతో చెలిమెల రఘుపతి (ప్రియాంక), సమతారెడ్డి తమకే పీఠం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి బీజేపీ మూడు స్థానాలు గెలిచిన వారితో జతకట్టి తూప్రాన్ మున్సిపల్ అధికార పార్టీ కై వసం చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ రఘునందన్రావు ఆధ్వర్యంలో బీజేపీ సైతం తాము మూడు స్థానాలు గెలిచామని, తామే కీలకం కానున్నామని చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు కొంపముంచుతాయా అనే చర్చ సాగుతోంది. -
కోహీర్ పీఠంపై కౌన్!!
జహీరాబాద్: కోహీర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక లాంఛనమే అయినట్లు సమాచారం. సోమవారం నిర్వహించనున్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికకు దాదాపుగా అభ్యర్థిత్వాలు ఖరారవగా అధికారిక ప్రకటనే మిగిలినట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కేటగిరీలో రిజర్వు అయింది. మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 8 వార్డులను కాంగ్రెస్, 5 వార్డులను బీఆర్ఎస్లు గెలుచుకున్నాయి. ఒక్కోస్థానంలో బీజేపీ, ఎంఐఎం, స్వతంత్రులు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు ఒకస్థానం దూరంలో ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే కాంగ్రెస్ శిబిరంలో ఉన్నట్లు, ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అశోక్, శిరీషలు ఆశిస్తూ వచ్చారు. ఎన్నికకు ముందు అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన కోహీర్ పురపీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. -
వనదుర్గమ్మకు వందనం
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మ సన్నిధి జన సంద్రంగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో ప్రభుత్వం తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివానీ దంపతులు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో దుర్గమ్మ ఏడుపాయల మారుమోగింది. మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం, ఉప్పొంగుతున్న గంగమ్మ భక్తులకు కనువిందు చేశాయి. కాగా, రెండో రోజైన సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. -
మంత్రి మదిలో ఏముందో..?
● నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు హుస్నాబాద్: స్థానిక రాజకీయాలు మున్సిపల్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో చైర్మన్ గిరి పదవి అదృష్టం ఎవరిదోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. చైర్మన్ రేసులో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత, 10వ వార్డు కౌన్సిలర్ సావుల మంజుల, 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వరూప ఉన్నారు. ఈ నలుగురి కౌన్సిలర్లలో ఎవరో ఒకరు చైర్మన్ పీఠం ఎక్కనున్నారు. సోమవారం ఉదయం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్ధానాలు, 4 స్ధానాలు బీఆర్ఎస్ కై వసం చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళనే చైర్మన్ అవుతారని పలువురు అంటున్నారు. అయితే నలుగురు మహిళల్లో ముగ్గురు మహిళలు మొదటి సారిగా కౌన్సిలర్గా గెలుపొందగా.. ఓ మహిళకు గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. సర్వత్రా ఉత్కంఠ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళకే చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఎస్సీలో మాల సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా? అనేది ఉత్కంఠను తెర లేపుతుంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంతుపట్టని ప్రశ్నగా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్గా అయిలేని అనిత పని చేయగా.. ఈ ఇద్దరి మహిళా ప్రజాప్రతినిధులు తోటి కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పాలనపరంగా ఐదేళ్లు సమర్థవంతంగా పనిచేశారు. వారి హయంలోనే హుస్నాబాద్ మున్సిపల్కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. రెండవ సారి కూడా చైర్ పర్సన్గా మహిళనే వరించనుండగా.. చైర్మన్ పదవి విషయంలో మంత్రి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించి ఓటింగ్ పద్ధతిపై వివరించనున్నారు. ఈ సమావేశంలోనే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవుల పేర్లను ప్రకటించనున్నారు. వైస్ చైర్మన్ పదవిని పురుషుడికి ఇస్తారా.. గతంలో మాదిరిగా మహిళకే ఇస్తారా? అనేది మరి కొన్ని గంటల్లో స్పష్టత రానుంది. -
రేసులో ముగ్గురు.. మురిపెం ఎవరికో..!
● మూడు పార్టీల్లోనూ ఆశావహుల యత్నాలు ● నర్సాపూర్లో ఎడతెగని ఉత్కంఠ నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ చైర్మనన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేనందున తలెత్తిన ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నికకు 8 మంది కౌన్సిలర్ల మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి నల్గురు కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కు ఐదుగురు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి క్యాంపులు చేపట్టిన ఆయా పార్టీలు ఇంకా కౌన్సిలర్లు క్యాంపులలోనే ఉన్నారు. కాగా మున్సిపల్ అధికారులు సోమవారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఆయా పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఆ పదవి కోసం కాంగ్రెస్ నుంచి 5వ వార్డు కౌన్సిలర్ ఎం.లక్ష్మిరాజు యాదవ్, బీఆర్ఎస్ నుంచి 9వ వార్డు కౌన్సిలర్ వి.సునీతాబాల్రెడ్డి, బీజేపీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్ ఏ.రాజమణి మురళీయాదవ్లు ఆశిస్తున్నారు. ఏ పార్టీకి సరిపడా మెజార్టీ రానందున చైర్మన్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు తమ పార్టీలో మద్దతు కూడగట్టుకుని ఇతర పార్టీల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నారని, చైర్మన్ పదవి కోసం బీజేపీకి మద్దతిస్తే మీకు వైస్ చైర్మన్ పదవికి మద్దతిస్తామని, దీంతో ఇరు పార్టీలం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకోవచ్చని చర్చలు జరుపుతున్నా ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు సైతం ఎలాగైనా చైర్మన్ పదవిని కై వసం చేసుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది. కాగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంటాయో వేచి చూడాలి. -
కాకరేపుతున్న దుబ్బాక
● రేసులో ఇద్దరు మహిళలు ● క్యాంపులోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ● 14కు చేరిన బీఆర్ఎస్ బలం దుబ్బాక: స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. ఇప్పటికీ చైర్పర్సన్పై స్పష్టత లేకపోవడంతో ఎవరు అవుతారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీతలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావుల మద్దతు ఎవరికి ఉంటుందో వారే చైర్మన్ అయ్యే అవకాశాలు ఉండడంతో వారి మెప్పు పొంది పదవి దక్కించుకునేందుకు ఇద్దరు కౌన్సిలర్లు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్న బండి శ్రీలేఖ గతంలో ఏఎంసీ చైర్మన్గా పనిచేయగా.. శ్రీరాం సంగీత సైతం దుబ్బాకకు సర్పంచ్గా చేశారు. దీంతో ఎవరికి ఇవ్వాలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావులకు తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యన పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ ఎంపిక ఇంకా సందిగ్ధంలోనే ఉంది. పెరిగిన బీఆర్ఎస్ బలం దుబ్బాక మున్సిపల్లో బీఆర్ఎస్కు కౌన్సిలర్ల బలం 14కు చేరింది. మొత్తం 20 వార్డులకు గాను 11 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉండడంతో సొంతంగా చైర్మన్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇండిపెండెంట్లుగా గెలిచిన 17వ వార్డు అభ్యర్థి చాంద్మియా ఇప్పటికే ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే 10వ వార్డు నుంచి గెలిచిన బడుగు రాజు, 11వ వార్డు నుంచి గెలిచిన నందాల శ్రీకాంత్ సైతం బీఆర్ఎస్కు మద్దతుగా క్యాంపుల్లో చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాంపులో 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఎక్స్ఆఫిషి యో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవడంతో 15 మంది కోరంగా.. ఇక చైర్మన్ పీఠం ఎవరనేది మరికొన్ని గంటల వరకు వేచి చూడాల్సిందే. -
నేడు ప్రజావాణి రద్దు
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం చైర్మన్, వైస్చైర్మన్ల ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్కు రావొద్దని తెలిపారు. కౌన్సిలర్లలోనే ఉన్నత విద్యావంతురాలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. పూజలు నిర్వహించిన మంత్రి దామోదర మహాశివరాత్రిని పురస్కరించుకుని కేతకీలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతాపాటిల్, మాజీ ఎంపీపీ హన్మంత్రావుపాటిల్, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అభ్యర్థిని ఖరారు చేసి బయటకు పొక్కకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ పేరును ఖరారు చేసిన బీఆర్ఎస్ అధిష్టానం..‘సీల్డ్ కవర్’లో భద్రపరిచింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను బీఆర్ఎస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండిపెండెంట్తో కలుపుకొని వారి కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. కాగా చైర్మన్ అభ్యర్థి పేరును ఎన్నిక సమయానికే బయటపెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అభ్యర్థులకు ‘విప్’జారీ చేసిన పార్టీ నేతలు..‘సీల్డ్ కవర్’లో అధిష్టానం ఎవరి పేరు పంపితే వారికి చేతులు ఎత్తి మద్దతు పలకాలని గట్టిగా ఆదేశించినట్లు తెలిసింది. తెరపైకి అనూహ్యంగా మూడో పేరు..? చైర్మన్ పోటీలో నిన్నమొన్నటి వరకు ప్రధానంగా 17వవార్డు కౌన్సిలర్ కళ్యన్కర్ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందన పేర్లు మాత్రమే ఉండగా... కొద్ది గంటల కిందట మరొకరి పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. మూడో పేరు అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా...? లేదా అనేది అనుమానంగానే ఉంది. ఇకపోతే పట్టణంలో చైర్మన్ ఎన్నికపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ప్రత్యేకించి వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా వేదికగా ఓటింగ్లు కూడా చేపడుతున్నారు. ప్రధానంగా కళ్యన్కర్ పద్మబాయి, గంగిశెట్టి చందనల పేర్లను ప్రస్తావిస్తూ..వీరిలో ఎవరైతే బాగుంటుందనే అంశంపై డిబేట్లు సైతం నిర్వహించడం ఆసక్తి రేకెత్తిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ సైతం చైర్మన్ పీఠంపై కన్నేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ ఎక్స్ అఫీషియోపై అంతా ఆసక్తి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే కేసీఆర్ ఎక్స్అఫీషియో ఓటు నమోదు కావడంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఓటు నమోదు చేసుకున్నారంటే నిజంగానే కేసీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశముందా..? అనే చర్చ కూడా నడుస్తోంది. పరిస్థితులను బట్టి కేసీఆర్ రావడం, లేదా..? అనేది ఆధారపడి ఉండొచ్చని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎన్నిక సమయానికి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి.. క్యాంపులో ఉన్న 11మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మరొక ఇండిపెండెంట్ కౌన్సిలర్ చైర్మన్ ఎన్నిక సమయం 11గంటలు కాగా, 10.45వరకే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. చైర్మన్తోపాటు వైస్ చైర్మన్ పేరును సైతం ‘సీల్డ్ కవర్’లోనే భద్ర పరిచి ఎన్నిక సమయానికి బయటకు వెల్లడించే అవకాశం కనిపిస్తున్నది. ఎన్నిక సమయానికే పేరును వెల్లడించే అవకాశం ఇప్పటికే అభ్యర్థులకు ‘విప్’జారీ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి -
జన జాతరకు రెడీ
విద్యుత్ దీపాల వెలుగుల్లో ఏడుపాయలనేటి నుంచి ప్రారంభం ● ముస్తాబైన ఏడుపాయల పాపన్నపేట(మెదక్): జన జాతరకు ఏడుపాయల ముస్తాబైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జాతరకు సుమారు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సింగూరు నుంచి విడుదల చేసిన నీటితో ఘనపురం ఆనకట్ట కళకళలాడుతోంది. 33 శాఖలకు చెందిన సుమారు 3 వేల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వివిధప్రాంతాల నుంచి 150 బస్సులునడుపుతుంది. -
మార్కెట్లో మహా రష్
● పండ్లు, పూలు కొనుగోళ్లతో కిటకిట ● పెరిగిన రేట్లతో భక్తుల ఆందోళన ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహాఽశివరాత్రిని పురస్కరించుకొని శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లు కిటకిటలాడాయి. పండ్లు, పూలు, ఇతర పూజ సామగ్రి కొనుగోలు చేసే వారితో కిక్కిరిసిపోయాయి. మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు పెరిగాయి. అరటి పండ్లు డజన్కు రూ.60 నుంచి రూ.80 వరకు, ద్రాక్షపండ్లు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, ఆపిల్ కిలో రూ.220 నుంచి రూ.280 వరకు, స్వీట్ పొటాటో కేజీ రూ. 50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం పండ్ల ధరలు పెరిగాయని భక్తులు వాపోతున్నారు. ముస్తాబైన ఆలయాలు కాగా, పట్టణంలోని ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయం, యోగా లింగేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయం, శివాలయం, పార్వతిదేవి ఆలయం, మార్కండేయ ఆలయంతో పాటు ఇతర ఆలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోనే ప్రధాన శైవక్షేత్రమైన శ్రీ ఉమాపార్థీశ్వర కోటిలింగాల ఆలయాన్ని సీపీ రష్మీ పెరుమాళ్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రైతుబజార్లో పండ్లు, ఇతర పూజ సామగ్రి కొనుగోళ్లతో సందడి -
బీఆర్ఎస్కు ఓట్ల సునామీ
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ పురిటిగడ్డలో పట్టణ ఓటర్లు కారు వైపే మొగ్గు చూపారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో మూడు చోట్ల బీఆర్ఎస్, ఒక చోట కాంగ్రెస్ అత్యధిక కౌన్సిలర్లు గెలుపొందారు. అయినప్పటికీ మొత్తం ఓటర్ల పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే 2.3శాతం మంది అధికంగా ఓట్లు వేశారు. ఆయా మున్సిపాలిటీలలో ఇండిపెండెంట్లు సాధించిన ఓట్లు సైతం కొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్లు సాధించలేకపోయాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 83,116 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో బీఆర్ఎస్కు 33,760 (40.61 శాతం), కాంగ్రెస్కు 31,855(38.32), బీజేపీకి 9,520 (11.45 శాతం) ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కంచుకోటలో మాత్రం తన ప్రభావం చూపలేకపోయింది. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ నుంచి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి టి.హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జనం బీఆర్ఎస్కే అండగా నిలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా చూస్తే 19 పురపాలికలలో 4,12,109 ఓట్లు పోలు కాగా 11 మున్సిపాలిటీలలో గులాబీ పార్టీకి, మరో 8 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. ఓటర్ల పరంగా కాంగ్రెస్కు (1,60,199 (38.87 శాతం), బీఆర్ఎస్ 1,50 582 (36.53 శాతం), బీజేపీ 47,540 (11.53 శాతం) సాధించాయి.దుబ్బాకలో కాంగ్రెస్ వెనకబాటు దుబ్బాక పట్టణంలో వచ్చిన ఓట్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 2వేలకు పైగా ఓట్లు తక్కువగా వచ్చాయి. దుబ్బాక పట్టణంలో పలు చోట్ల ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు సైతం కాంగ్రెస్ అభ్యర్థులు సాధించలేకపోయారు. చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేవలం 225 ఓట్ల తేడా మాత్రమే ఉంది. పుర పీఠం బీఆర్ఎస్కే దక్కింది. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులలో కలిపి బీజేపీకి కేవలం 125 ఓట్లు మాత్రమే సాధించింది. అలాగే గజ్వేల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 2,226 ఓట్లు తక్కువగా వచ్చాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ పట్టంలో కేవలం 1,487 మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు.మున్సిపాలిటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చేర్యాల 5,500 (47.69 శాతం) 5,275 (45.74) 125 (1.08 శాతం) దుబ్బాక 6,526 (35.89 శాతం) 4,403 (24.21) 3,487 (19.17శాతం) గజ్వేల్ 16,208 (43.65 శాతం) 13,982 (37.65) 4,421 (11.9శాతం) హుస్నాబాద్ 5,526 (33.95 శాతం) 8,195 ( 50,35) 1,487 ( 9.13 శాతం)కంగుతిన్న బీజేపీ 12 వార్డుల్లో 125 ఓట్లు చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటలేకపోయింది. పట్టణ పరిధిలో 12 వార్డుల్లో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్యను చూసి పుర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. సుమారు 30 మంది రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులు వచ్చి పట్టణంలో ఉండి మరీ ప్రచారం చేశారు. అయినా వారు గెలువకపోగా కనీసం గెలుపు, ఓటములను ప్రభావితం చేయలేకపోయారు. పోటీ చేసిన 12 వార్డుల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని వార్డుల్లో కలిపి మొత్తం 125 ఓట్లు, పోలైన వాటిలో 1.08శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉండి, ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన పార్టీగా అవతరిస్తున్నామని చెప్పుకునే బీజేపీ నాయకులకు ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. -
పురపీఠం దక్కేదెవరికి..?
వైస్ చైర్మన్ ‘బరి’లో ఇద్దరుజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిలర్లను క్యాంపులకు తరలించిన పార్టీలు.. చైర్మన్గా ఎవరిని నియమించాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నాయి. అయితే.. హుస్నాబాద్లో మంత్రి పొన్నం, గజ్వేల్, దుబ్బాక, చేర్యాలలో మాజీ మంత్రి హరీశ్రావుల కటాక్షం ఉన్న వారికే పీఠం దక్కుతుందని చర్చ జరుగుతోంది.సాక్షి, సిద్దిపేట: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మెన్ ఎవరెవరిని వరిస్తుందో అని జోరుగా చర్చించుకుంటున్నారు. గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు బీఆర్ఎస్కు, హుస్నాబాద్ బల్దియా పీఠం కాంగ్రెస్కు దక్కనున్నాయి. ఆయా పార్టీల్లో చైర్మన్ పదవి కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిసార్టులు, ఫామ్ హౌస్లలో క్యాంపులను ఏర్పాటు చేసి వారిని తరలించారు. హుస్నా’బాద్ షా’ఎవరు.. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బల్దియా చైర్మన్ గిరిని ఆశించిన కేడల లింగమూర్తి ఓటమి చెందారు. రెండవ వార్డు నుంచి గెలుపొందిన బూరుగు లత, పదవ వార్డుకు చెందిన సావుల మంజుల, 14వ వార్డుకు చెందిన దండి లక్ష్మి, 19వ వార్డు కు చెందిన బత్తుల స్వరూపలు ఆశిస్తున్నారు. 2014 దండి లక్ష్మి ఇండిపెండెంట్గా గెలుపొంది అప్పుడు చైర్మన్ గిరి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంత్రి పొన్నం ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే చైర్మన్ పీఠం దక్కనుంది. చేర్యాల పీఠం దక్కేదెవరికి..? చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 7 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. చేర్యాల బల్దియా చైర్మన్ ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందిన ముస్త్యాల అరుణ, 2వ వార్డు నుంచి గెలుపొందిన కమలాపురం గీతాంజలిలు పుర పీఠంను ఆశిస్తున్నారు. ఆర్ అండ్ బీలో డీఈఈగా పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్ఎస్ చేరిన బాలనర్సయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సతీమణి ముస్త్యాల అరుణ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎడతెగని ఉత్కంఠ గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ క్యాంపు రాజకీయం రసకందాయంలో పడింది. చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్తోపాటు ఇండిపెండెంట్తో కలుపుకొని 12 కౌన్సిలర్ స్థానాలను సాధించిన బీఆర్ఎస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో క్యాంపు నడుపుతోంది. పనిలోపనిగా రెండు ఎక్స్గ్రేషియో ఓట్లను బీఆర్ఎస్ సిద్ధం చేసుకున్నది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కాగా, మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఉన్నారు. కాగా చైర్మన్ పీఠం కోసం 17వార్డు కౌన్సిలర్ కళ్యన్కర్ పద్మబాయి, 19వవార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందనలు పోటీపడుతుండగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. గజ్వేల్: మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం సైతం పోటాపోటీ ప్రయత్నాలు కూడా తెరమీదికి వచ్చాయి. రెండవ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి(బీజేపీ)పై అధిక మెజార్టీతో విజయం సాధించిన గోలీ మమత, 20వవార్డులో ఇండిపెండెంట్గా గెలుపొందిన అత్తెల్లి శ్రీనివాస్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలోనూ పార్టీ ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక ఏడు కౌన్సిలర్ స్థానాలను సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ సైతం క్యాంపు రాజకీయాలకు నడపటం కూడా ఆసక్తిని రేకేత్తిస్తున్నది. దుబ్బాక ఎవరికో?దుబ్బాక: మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను బీఆర్ఎస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ 4, బీజేపీ నుంచి ఇద్దరు, ఏఐఎఫ్బీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. బీఆర్ఎస్కు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం చేరడంతో ఆ పార్టీ బలం 12కు చేరుకుంది. మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీత చైర్పర్సన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆశీస్సులున్న వారే చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. -
ఆ ఫలితాలు గుడ్డిలో మెల్ల
● అసెంబ్లీ ఎన్నికలే గీటురాయి: తలసాని ● బీఆర్ఎస్ కేడర్ ధైర్యంగా పోరాడిందని కితాబు సిద్దిపేటజోన్: రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు.. అవి వస్తుపోతుంటాయి. ప్రజలే శాశ్వతం. ప్రజలకు చేసిన మంచి పనులు గీటురాయిగా గుర్తించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు గుడ్డిలో మెల్లగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం నడిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం, ఏరులై పారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాదని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గీటు రాయిగా పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. అబద్ధాల పునాదుల మీద, దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తలసాని విమర్శించారు. బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ దైర్యంగా పోరాటం చేసి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయాణంలో మహిళకు ఉచితం అని పురుషులకు రెట్టింపు చార్జీలను విధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రియల్ రంగం కుదేలు అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం ఒక అద్భుతమైన ఘట్టంగా తలసాని అభివర్ణించారు. -
ఎల్లమ్మకు మంతిర పూజలు
హుస్నాబాద్/ప్రశాంత్నగర్(సిద్దిపేట): హుస్నాబాద్ పట్టణం, అలాగే జిల్లా కేంద్రంలోనిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో అమ్మవారికి శనివారం మొక్కులు సమర్పించుకున్నారు. సిద్దిపేటలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూక్య సంపత్ నాయక్, చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు. శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండాలిమాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పరమశివుని అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాఽశివరాత్రిని పురస్కరించుకొని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. దుబ్బాక బీఆర్ఎస్ అడ్డా..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందిన చాంద్మియా బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మొదటి నుంచి బీఆర్ఎస్కు అండగా ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లుతో పాటు మరో ముగ్గురు సైతం తమ వారే గెలుపొందడం సంతోషకరమన్నారు. దుబ్బాక మున్సిపల్పై మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడించాలికలెక్టర్ హైమావతి క్రీడాకారులకు బహుమతుల ప్రదానం సిద్దిపేటజోన్: క్రీడా రంగంలో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడించాలని జిల్లా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం కప్ క్రీడల ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకూ చెందిన క్రీడాకారులు నిరంతరం సాధన ద్వారా అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అంతకుముందు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కీలకంగా ఎక్స్అఫీషియోలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు ఎంతో కీలకంగా మారింది. ఆయా మున్సిపాలిటీల్లో ఈ ఎక్స్అఫీషియో సభ్యులుగా తమ పేరు నమోదు చేసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయా బల్దియాల చైర్మన్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఏ మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే..మాజీ సీఎం కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్నారు. ఇదే మున్సిపాలిటీ ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా నమోదు చేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా అందోల్ –జోగిపేట మున్సిపాలిటీలో, మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో, నారాయణఖేడ్ బల్దియాలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి (కాంగ్రెస్)లు ఎక్స్అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు.హంగ్ ఫలితాలు వచ్చిన మెదక్ మున్సిపాలిటీలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్రావుతోపాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, సురేశ్రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే హంగ్ ఫలితాలు వచ్చిన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ రఘునందన్రావుతోపాటు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిలు నమోదు చేసుకున్నారు. దుబ్బాకలో కొత్తా ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్), నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డిఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు. ఎక్స్అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉందని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి.హంగ్ వచ్చిన చోట్ల..ఎవరెవరు ఎక్కడ అంటే!! -
మంత్రి శ్రీధర్బాబును కలిసిన ఐటీ ఉద్యోగులు
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేట ఐటీ హబ్లో పని చేసే ఉద్యోగులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐటీ హబ్లో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పినట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సంతోష్, నితీష్, శశాంక్, శ్యాం ఉన్నారు. గజ్వేల్రూరల్: స్థానిక బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ ఆదర్శ గురుకుల(జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్వీ కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమో కోర్సులలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 24వరకు కొనసాగుతాయని తెలిపారు. గజ్వేల్లోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో డీఈసీఈ(డిప్లొమో ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), డీఎంఈ(డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్), డీసీసీపీ(డిప్లొమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్) కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఏఐఅండ్ఎంఎల్(డిప్లొమో ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) కోర్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతమున్న డీసీసీపీ కోర్సును డీసీఏఎంబీ(డిప్లొమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్)గా మార్చినట్లు తెలిపారు. కళాశాల ఆవరణలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9676841339లో సంప్రదించాలన్నారు. డీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్ధిపేట): స్పెల్బీ వంటి పోటీలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పెల్బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డీఈఓ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్లలో రాణించాలన్నారు. పదోతరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలన్నారు. ఈ పోటీలలో ఇందిరానగర్ విద్యార్థి ఆశ్రిత ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ తొగుట విద్యార్థి విజయ్ ద్వితీయ స్థానం, టీజీఎంఎస్ నాగసముద్రాల విద్యార్థి సంజన తృతీయ స్థానం సాధించారు. విజేతలకు బహుమతులను అందించారు. గురుకులం.. కోలాహలంవర్గల్(గజ్వేల్): వార్షికోత్సవ సంరంభంతో వర్గల్ పూలే బాలికల గురుకులం అలరారింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్థానిక జ్యోతిబాపూలే బీసీ బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. వార్షికోత్సవ సంరంభానికి బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు, ఐఆర్ఎస్ అధికారి శోభన్బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మెదక్ ఆర్సీఓ రాజేశం, నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్, ఆతిథ్య గురుకుల ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ‘రామాయణం’ నాటక ప్రదర్శనతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అతిథుల ప్రశంసలు చూరగొన్నారు. హర్యానా డ్యాన్స్తో వర్గల్ నవోదయ బాలికలు ప్రత్యేకత చాటుకున్నారు. అనంతరం కళాశాల, పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ప్రతీకగా తీర్చిదిద్దిన ‘అస్త్ర’ మ్యాగజైన్ను అతిథులు విడుదల చేశారు. -
మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా
● నాలుగింట మూడు కై వసం ● హుస్నాబాద్లో కాంగ్రెస్ జోష్ ● చేర్యాల, హుస్నాబాద్లో ఇండిపెండెంట్లకు అవకాశం ఇవ్వని ఓటర్లు పార్టీల బలాబలాలు ఇలా.. మున్సిపాలిటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు దుబ్బాక 11 04 02 03 గజ్వేల్ 11 07 01 01 చేర్యాల 07 05 0 0 హుస్నాబాద్ 04 16 0 0 -
కాంగ్రెస్కు ప్రజలే బలగం
● గెలుపుతో మరింత ఉత్సాహంగా పని చేస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్రూరల్: కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బలగం, బలమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం రాత్రి హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజల ఆశీర్వాదించారన్నారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తున్నదని మున్సిపల్ తీర్పుతో మరింత ఉత్సాహంతో ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అర్బన్ ప్రాంతాలకు రావాల్సిన నిధులను మంజూరు చేసి అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు కేడం లింగమూర్తి, మంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో సంబరాలు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దఎత్తున సంబరాలు నిర్వహించారు. గెలిచిన వారికి పూల దండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టపాసులు కాల్చి, ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గెలిపొందిన కాంగ్రెస్ అభ్యర్థులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. -
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుండ్రు
● కాంగ్రెస్, బీజేపీలది ఓర్వలేనితనం ● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిద్దిపేట అభివృద్ధిని అన్ని విధాలుగా అడ్డుకుంటున్నదని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులను వెనక్కి తీసుకొని పగబట్టిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో బీజేపీ నాయకులు హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా లబ్ధిపొందేందుకు మంత్రులు, ఎంపీలు సిద్దిపేట అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారన్నారు. నాడు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్రం బిందువుగా మారిందన్నారు. గతంలో ఎక్కడ చూసినా సిద్దిపేట పట్టణం చెత్త చెత్తగా కనిపించేదని, పట్టణ ప్రజల సహకారంతో, బీఆర్ఎస్ హయాంలో మహా నగరాల్లో లేని యూజీడీతో పాటు, పట్టణానికి నలుదిక్కులా పచ్చదనంతో స్వాగతం పలికేలా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేకుండా గోదావరి నీరు తెచ్చామన్నారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా 50 ఏళ్ల ముందుచూపుతో రింగు మెన్ను నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేటకు రైలు రావడం ఓ కళని, బీఆర్ఎస్ హామంలో నిజం చేసుకున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైల్వే పనులన్ని నిలిపివేసిందన్నారు. ఉత్తర భారతదేశానికి సిద్దిపేట నుంచి ప్రయాణ సౌకర్యం ఉండేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇక్కడికి వచ్చే నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, వారి అవసరాలు తీరిపోయాక మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలపై త్వరలోనే వీడియోలను విడుదల చేస్తానని, ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సిద్దిపేటను అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరం సిద్దిపేటజోన్: చదువుతో పాటు క్రీడలు సైతం ఎంతో ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో ట్రెస్మా ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శారీరక మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. అందరూ క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మన ఆరోగ్యమే నేటి మన విజయమన్నారు. ఆన్ లైన్ గేమ్స్, ఏఐలాంటి యాప్స్కు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నతనంలోనే క్రీడలు, వ్యాయామం ఒక దినచర్యగా మార్చుకోవాలి సూచించారు. -
రేపే కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం
● మహా శివరాత్రి వేడుకలకుసర్వం సిద్ధం ● తరలిరానున్న భక్తజనం కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సంసిద్ధమైంది. పరమశివుడి ప్రతిరూపంగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి నిరంతర అభిషేకాలు చేయనున్నారు. యాదవ సంప్రదాయం ప్రకారం తోటబావి ప్రాంగణంలో ఆదివారం పెద్దపట్నం వేసి స్వామి వారికి కల్యాణం నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే పెద్దపట్నానికి వైవిధ్యం, విశిష్టత ఉంది. పసుపు, కుంకుమ, తెల్లపిండి, సునేరు,పచ్చలను ప్రథమ గణాలుగా సమ్మేళనం చేసి చిత్రకన్ను నెలకొల్పి 41 వరుసలతో పట్నాన్ని వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి తొక్కుతూ స్వామి వారిని దర్శించుకుంటారు. పట్నాన్ని తిలకించి చిందేస్తే తమ కష్టాలు కడతేరుతాయని భక్తుల నమ్మకం. -
22 ఏళ్లకే కౌన్సిలర్గా రమ్య
దుబ్బాకలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల అనుచరుల సందడి.. దుబ్బాకటౌన్: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 1 వార్డు నుంచి 22 ఏళ్ల కోటగళ్ల రమ్య కౌన్సిలర్గా గెలిచారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సత్తాచాటారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాల్వ రజితపై 241 మెజార్టీ ఓట్లు సాధించి ఈ ఘనత సాధించారు. దీంతో రమ్యను పలువురు అభినందించారు. గతంలో భార్య.. ఇప్పుడు భర్త దుబ్బాకటౌన్: దుంపలపల్లి 4 వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి అధికం బాలకిషన్ గెలుపొందారు. గతంలో ఈయన భార్య అధికం సుగుణ 5 వార్డు నుంచి గెలిచి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయ్యారు. అప్పుడు భార్య వైస్ చైర్పర్సన్, ఇప్పుడు భర్త కౌన్సిలర్గా గెలుపొందడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నాడు ఓడి.. నేడు గెలిచి చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పరిధిలో 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో గతంలో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు. 1వ వార్డు, 5వ, 7వ, 10వ, 12వ వార్డుల నుంచి గెలిచిన వెంకటమ్మ, దుర్గయ్య, ప్రసాద్, ఉమ, షరీఫాబేగంలు గత ఎన్నికల్లో అదే వార్డుల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 8వ, 9వ వార్డుల నుంచి గెలిచిన సురేష్, సదానందంలు కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. ఇక 3వ వార్డులో గెలిచిన రాజేశ్వరి భర్త నర్సింగరావు ఆదేవార్డులో గతఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతఎన్నికల్లో ఓడిపోయిన వీరందరికీ ఈసారి సానుభూతి పనిచేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసిన కూరపాటి బంగారయ్య.. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బడుగు రాజుపై గెలుపొందారు. ఈసారి బంగారయ్య బీఆర్ఎస్ నుంచి.. బడుగు రాజు ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ(సింహం గుర్తు) నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్పై 103 ఓట్లతో రాజు గెలుపొందారు. కప్పు సాసర్ గుర్తుపై నాడు భార్య.. నేడు భర్త దుబ్బాకటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో సెంటిమెంట్ మంత్రం పని చేసింది. మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెందిన నందాల శ్రీజ గత ఎన్నికల్లో కప్పు సాసర్ గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. ఈసారి సైతం భర్త శ్రీకాంత్ అదే గుర్తుపై పోటీ చేసి 76 ఓట్లతో గెలుపొందడం విశేషం. -
టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ హైమావతి ● ఎంఈఓలతో సమీక్ష ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని, కలెక్టర్ హైమావతి ఎంఈఓలను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, మండల విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రణాళిక రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్టడీ క్లాస్లు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు దగ్గరుండి సబ్జెక్ట్లపై అవగాహన కల్పించాలన్నారు. సులభంగా ఎలా చదవాలో మెలకువలు నేర్పించాలన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ సరిపోయే విధంగా రుచికరంగా వండి విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తుల వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు ముండ్రాతి రమేష్, అన్ని మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే
● సమ్మెలో కార్మిక సంఘాల డిమాండ్ ● సిద్దిపేటలో భారీ ర్యాలీ సిద్దిపేటకమాన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో తీసుకువస్తున్న నూతన విద్యుత్ చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో తెస్తున్న వీబీ జీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. విరోచితంగా పోరాడి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, హెచ్ఎంఎస్ జాతీయ నాయకుడు సదుర్శన్రావు, బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు నారాయణ, ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శశిధర్, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అందరిచూపు గజ్వేల్పైనే..
గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధం కావడంతో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటముల అంచనాలో నిమగ్నమయ్యారు. ఎవరి కోణంలో వారు లెక్కలేసుకుంటున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 13మంది, స్వతంత్రులు ఆరుగురు, ఒకే ఒక కౌన్సిలర్ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నది. కానీ తర్వాత స్వతంత్రులపాటు కాంగ్రెస్ అభ్యర్థి సైతం బీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం ఫలితాలు ఈసారి భిన్నంగా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఈ మున్సిపాలిటీపై అందరి ఆసక్తి నెలకొన్నది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్య నియోజకవర్గం కావడమే ఇందుకు కారణం. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా విశ్లేషించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. విమర్శలకు పదును పెట్టి.. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై విమ్శరలను ఎక్కుపెట్టింది. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు సైతం ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అధిక స్థానాలు వస్తాయనే అంచనాలో కాంగ్రెస్ నేతలున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ సైతం మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామనే ధీమాలో ఉంది. కేసీఆర్ చొరవ వల్లే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27నెలలు గడుస్తున్నా... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ఒరిగిందేమీలేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఇప్పటివరకు మున్సిపాలిటీలో ఖాతా తెరవని బీజేపీ సైతం తన ప్రాభల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.ఫలితాలపై సర్వత్రా ఆసక్తి -
క్యాంపు పాలిట్రిక్స్
సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ముందే క్యాంప్ రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెరలేపాయి. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ముందస్తుగానే హైదరాబాద్, బెంగళూరు, చైన్నె శివారులోని పాంహౌస్లకు, రిసార్టులతో పాటు విహార యాత్రకు తరలిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డుల్లో 326 మంది పోటీ చేయగా అందులో దాదాపు 150 మంది అభ్యర్థులను ఆయా ప్రధాన పార్టీలు క్యాంపునకు తరలిస్తున్నాయి. ఓటరు నాడి ఎటు ఉందో లెక్కలు వేసుకున్న రాజకీయ దిగ్గజాలు తమ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఆకర్ష్ మంత్రానికి చిక్కకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలిచిన వారికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఇండిపెండెంట్లపై ప్రత్యేక దృష్టి గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లకు ప్రధాన పార్టీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉంటే గెలుపొందిన ఇండిపెండెంట్ల అవసరం తప్పనిసరి కానుంది. దీంతో ముందస్తుగానే ఇండిపెండెంట్లుగా గెలిచే వారిని సైతం క్యాంపునకు తీసుకువెళ్లారు. గెలిచే అభ్యర్థులందరినీ.. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులందరిని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు క్యాంపునకు పంపించాయి. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాక.. గెలుపొందిన వారిని క్యాంప్లోనే ఉంచి ఓటమి చెందిన వారిని ఇంటికి పంపించనున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలుపొందితే నేరుగా విజేతలు ఈ నెల 16న చైర్మన్ ఎన్నిక జరిగే చోటకే రానున్నారు. వారిని ఎక్కడికి తీసుకెళ్లారనేది గోప్యంగా ఉంచుతున్నారు. ముందే అభ్యర్థులను తరలించిన ప్రధాన పార్టీలు గెలిస్తే క్యాంప్లోనే.. ఓటమి చెందితే ఇంటికి నేరుగా ఈ నెల 16న వచ్చే విధంగా ప్లాన్ -
ప్రజాబాటతో సమస్యల పరిష్కారం
వర్గల్(గజ్వేల్): గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహిస్తోందని టీజీఎస్పీడీసీఎల్ రూరల్జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి అన్నారు. వచ్చే వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంటర్లింకింగ్, బైఫరికేషన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం వర్గల్ మండలం తున్కిఖాల్సాలో విద్యుత్ అధికారులు నిర్వహించిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమం జరుగుతుందని, విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలను సందర్శించి విద్యుత్ సంబంధ సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను డిపార్ట్మెంట్ వాహనంలోనే రిపేరింగ్ సెంటర్కు తరలించాలని స్పష్టం చేశారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య తదితర అన్ని కేటగిరిల విద్యుత్ వినియోగదారులు కిలోమీటర్ పరిధిలో (తాత్కాలిక కనెక్షన్ మినహా) కొత్త సర్వీస్ కనెక్షన్ల కోసం నిర్ణీత చార్జీలు చెల్లించి దరఖాస్తు చేస్తే ఉచితంగా లైన్ నిర్మింపజేసి సర్వీస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఉత్తమ సేవలందించిన ఏఎల్ఎమ్ నవీన్ను ఆయన శాలువాతో సత్కరించారు. కాగా గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచ్ గణేష్ సీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ చంద్రశేఖర్, గజ్వేల్ డీఈ భానుప్రకాశ్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వాసుదేవరావు, సర్పంచ్ గణేష్, విద్యుత్శాఖ లైన్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. టీజీ ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి -
ఓడేదెవరు? గెలిచేదెవరు?
● కొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ● 72 వార్డుల్లో 326 మంది పోటీ ● ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. కౌన్సిలర్గా గెలిచేదెవరు?.. ఓడేదెవరో శుక్రవారం తేలిపోనుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ జరగగా 82.03శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో 72 వార్డుల్లో 326 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. – సాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా మున్సిపల్ ఎన్నికల అధికారులు కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న ఈ ఓట్ల లెక్కింపు రౌండ్లుగా చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 35 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చేర్యాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో, దుబ్బాకలో లచ్చపేట తెలంగాణ మోడల్ స్కూల్, గజ్వేల్లో బాలికల ఎడ్యుకేషన్ హబ్, హుస్నాబాద్లో తెలంగాణ మోడల్ స్కూల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలలో కౌంటింగ్ కోసం ఏడు టేబుళ్ల చొప్పున, గజ్వేల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట చేర్యాలకు సంబంధించిన 10వ వార్డు తొలి ఫలితం రానుంది. తేలనున్న భవితవ్యం326 మంది అభ్యర్థుల్లో 72 మంది విజేతలు నిలవనున్నారు. బ్యాలెట్ బాక్స్లు తెరవనుండటంతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గెలుస్తామని ఎవరి ధీమాతో వారున్నారు. మరో వైపు ఆందోళన సైతం వెంటాడుతోంది. పలువురు అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనాయకులు పోలింగ్ ఆధారంగా లెక్కలు వేస్తున్నారు. ఎవరెవరికీ ఎన్ని ఓట్లు పడి ఉంటాయని చర్చించుకుంటన్నారు. మరోవైపు జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అభ్యర్థులతో పాటు బెట్టింగ్లు పెట్టిన వారు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ ఓటేసిన పోస్టల్ మొత్తం వారు బ్యాలెట్ చేర్యాల 11,491 41 11,532 దుబ్బాక 18,147 35 18,182 గజ్వేల్ 37,088 39 37,127 హుస్నాబాద్ 16,192 83 16,275 -
మల్లన్న హుండీ ఆదాయం రూ.90లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ 21 రోజుల హుండీ ఆదాయం రూ.90 లక్షలకు పైగా వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో హుండీలలోని కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో లెక్కించారు. నగదు రూ.90,42,186, మిశ్రమ బంగారం 047 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోలు వచ్చినట్లు అధికారి తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గంగం నర్సింహారెడ్డి, సార్ల లింగం, ఎల్లయ్య, మల్లేశం, వరలక్ష్మి నాగరాజు ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్. సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగి చేతివాటంకానుకలను లెక్కిస్తున్న సమయంలో ఓ ఆలయ ఉద్యోగి చేతివాటం చూపించారు. రూ.500 నోట్లను చాటుగా దాచాడు. అది గమనించిన హోంగార్డు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. ఈఓ వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలయంలో ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి సార్ల విజయ్కుమార్.. కానుకులను లెక్కిస్తున్న ఇద్దరి మహిళలనుంచి అధికారులకు ఇస్తానని చెప్పి రూ.500 నోట్లు 18 తీసుకుని చాటుగా అండర్వేర్లో ఉంచారు. హోంగార్డు శ్రీనివాస్ గమనించి అతనిని బాత్రూంలోకి తీసుకువెళ్లి చెక్చేశారు. దీంతో అతని వద్ద రూ.9 వేలు లభించాయి. వెంటనే ఆలయ అధికారులు సీసీ కెమెరాను పరిశీలించి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. గతంలో కూడా ఈ ఉద్యోగి చోరికి పాల్పడగా.. పలు కేసులు నమోదయ్యాయి. -
పట్టణ తీర్పు ఎటువైపో..!
అభ్యర్థుల భవితవ్యం బాక్స్ల్లో నిక్షిప్తం కావడంతో అభ్యర్థులు, నేతల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లు ప్రచారం చేశాయి. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని గమనించిన ఓటర్లు ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తం చేశారు. – సాక్షి, సిద్దిపేట ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, నేతలు పడరాని పాట్లు పడ్డారు. పలు చోట్ల జోరుగా డబ్బులు పంపిణీ చేయగా.. మరికొన్ని చోట్ల మద్యం ఏరులై పారింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే కంటే ముందే ఆయా పార్టీల అభ్యర్థులను వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారికి డబ్బులు, మద్యం అందించారు. చివరి అవకాశం కావడంతో ధన ప్రవాహం భారీగా సాగింది. అభ్యర్థులు డబ్బులకు వెనుకాడకుండా పంపిణీ చేయడం గమనార్హం. జోరుగా బెట్టింగ్లు పోలింగ్ పూర్తి కావడంతో ఏ వార్డులో ఎవరు గెలుస్తారని జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు. శుక్రవారం ఓట్లను లెక్కించనున్న నేపథ్యంలో ఏ పార్టీకి కౌన్సిలర్ల గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది? ఏ పార్టీ ఓడుతుంది? ఏ పార్టీ మున్సిపల్ను కై వసం చేసుకుంటుంది? అని గల్లీల్లో జోరుగా పందెం రాయుళ్లు బెట్టింగ్లు కాస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఉన్న చోట్ల ఎక్కువ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పలు చోట్ల ద్విముఖ పోరు, మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు కొనసాగింది. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటంతో పోరు మరింత ఆసక్తినిరేపుతోంది. ప్రశాంతంగా పోలింగ్: కలెక్టర్గజ్వేల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మహతి విద్యానికేతన్ ౖహైస్కూల్, బీఎంఆర్ డిగ్రీ కళాశాల, మైనార్టీ వెల్ఫేర్ కంప్యూటర్ సెంటర్, సెట్విన్ శిక్షణ సంస్థ, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీల పరిధిలోని 72వార్డుల్లో 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లోనూ పోలింగ్ సజావుగా సాగిందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, తహాశీల్దార్ శ్రావన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ నమోదును నేతలు, అభ్యర్థులు ఆరా తీశారు. ప్రధాన పార్టీలు వార్డుల వారీగా 100 ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. వారి నుంచి వివరాలు సేకరించి నేతలు, అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ఓట్లు బాక్స్ల్లో నిక్షిప్తం కావడంతో.. భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. గెలుస్తామా.. లేదా? అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: సీపీసిద్దిపేటకమాన్: మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 13న ఉదయం 6గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని తెలిపారు. మతపరమైన విద్వేషాలను ప్రేరేపించే ప్రసంగాలు నిషేధమన్నారు. బాణసంచా కాల్చడం, ఊరేగింపులు చేపట్టవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ గెలుపోటములపై అంచనాలు పలు చోట్ల జోరుగా ధన ప్రవాహం.. ఏరులై పారిన మద్యం -
18వేల మంది దూరం
● చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా కానరాని మార్పు ● గజ్వేల్లో ఓటు హక్కు వినియోగించుకోనివారే అధికం సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతో మంది తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే. అలాంటి మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు 18,164 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 82.03 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియెగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం. గజ్వేల్లో కదలని ఓటరు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోలింగ్ను చూస్తే గజ్వేల్ పట్టణ ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరంగా ఉన్నారు. మూడు మున్సిపాలిటీలలో కలిపి 8,515 మంది అయితే.. ఒక్క గజ్వేల్ మున్సిపాలిటీలో 9,652 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. పల్లెల్లోనే అధికం ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.30శాతం మంది పల్లె ఓటర్లు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో 82.03శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ఓటర్ల కంటే పల్లె ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్లె ఓటర్ల కంటే పట్టణ ఓటర్లు 6.27శాతం మంది తక్కువగా తమ ఓటు హక్కును వినియోగించకున్నారు. మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు చేర్యాల 13,777 11,491 దుబ్బాక 21,341 18,147 గజ్వేల్ 46,740 37,088 హుస్నాబాద్ 19,227 16,192 ఓటు వినియోగించుకోని వారి వివరాలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం చేర్యాల 1,032 1,254 0 2,286 దుబ్బాక 1,491 1,703 0 3,194 గజ్వేల్ 4,636 5,016 0 9,652 హుస్నాబాద్ 1,432 1,601 02 3,035 -
లిఫ్టు పనులు వేగిరం చేయండి
● కెనాల్లోని తుంగ, గడ్డి తొలగించాలి ● మాజీ మంత్రి హరీశ్రావు ● ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్దగల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మల్లన్న సాగర్ నీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 13న రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులాపూర్, కస్తూరిపల్లి గ్రామాల వద్ద నిర్మించే చెక్డ్యామ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అల్లీపూర్ వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అల్లీపూర్ కర్నాల కుంటకు నీళ్లు వచ్చేలా లిఫ్టు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేటఅర్బన్: స్థానిక ఐటీ టవర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం సందర్శించారు. ఐటీ టవర్లోని నాలుగు ఫ్లోర్లను కలియతిరిగి వివిధ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులతో ముచ్చటించి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను తెలపగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ టవర్లో 17 కంపెనీలు 350 మంది ఉద్యోగులు ఉన్నారని, టాస్క్ ట్రైనింగ్ సెంటర్ సైతం ఏర్పాటు చేసుకొని నిరంతరం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. టాస్క్ ట్రైనింగ్ సెంటర్ను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీ టవర్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి, ఇతర కార్మికులకు జీతాలు సరిగా రావడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
నర్సాపూర్లో ఉద్రిక్తత
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 10, 11 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ మొదలై పెద్దగా కావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కాగా అదే రాత్రి పట్టణంలోని 4, 5 వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగగా, పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా బుధవారం పోలింగ్ ప్రారంభమైన అనంతరం 15వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు ఆంజనేయులుగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు భిక్షపతిలతో పాటు వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అలాగే 8వ వార్డులో గొడవ జరగగా పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
● హక్కు మరవొద్దు ● తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: అర్బన్ ప్రాంతాల్లో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు 90 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే, అర్బన్ ప్రాంతాల్లో 50 శాతం లోపే ఓటింగ్లో పాల్గొంటున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవన స్థితిగతులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, వెస్ట్ మెనేజ్మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వం సమగ్ర ఆలోచన చేస్తోందన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, వీటితో మేసీ్త్ర, వడ్రంగి వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలవడం వల్లే బీజేపీ తొమ్మిది ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిలీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడంలేదని, మనకు రావాల్సిన వాటా కూడా రావడం లేదన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అనేక సార్లు కలిసి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామన్నారు. అయినా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అవినీతే జరిగిందన్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. ఎల్లమ్మ చెరువు పనుల పరిశీలన ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను మంగళవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సతీమణి మంజులతో కలిసి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి టీ స్టాల్ వద్ద చాయ్ తాగుతూ స్ధానికులతో ముచ్చటించారు. త్వరలోనే ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేసుకొని పర్యాటకులకు అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. -
ఓటెత్తాలే..
పట్టణ ఓటరూనేడే పోలింగ్● ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5వరకు..● నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ● 72 వార్డుల్లో 176 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.01లక్షల మంది ●మున్సిపాలిటీల వారీగా ఓటర్లు.. మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 20 9,873 9,348 06 19,227 దుబ్బాక 20 11,117 10,224 0 21,341 గజ్వేల్ 20 24,001 22,738 01 46,740 చేర్యాల 12 7,119 6,658 0 13,777పురపోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ జరగనుంది. నాలుగు మున్సిపాలిటీలలోని 72 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు 1,069 మంది సిబ్బంది, 723 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1.01లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. – సాక్షి, సిద్దిపేట నాలుగు మున్సిపాలిటీలోని 72 వార్డుల్లో 326 మంది పోటీ చేస్తున్నారు. వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రజలకు వివిధ హామీలు ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. 1,22,100 బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. ఇందులో చేర్యాలలో 16,800, హుస్నాబాద్లో 24,300, గజ్వేల్లో 54,300, దుబ్బాకలో 26,700 బ్యాలెట్ పేపర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటర్లకు ఓటరు స్లిప్లను అందించారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చారు. 1,069 మంది సిబ్బంది గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. 176 పోలింగ్ కేంద్రాలుండగా 1,069 సిబ్బందిని నియమించారు. పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు 211, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 211, ఇతర పోలింగ్ సిబ్బంది 647 మంది ఉన్నారు. బందోబస్తును 723 మందిచే ఏర్పాటు చేశారు. 31 ప్రాంతాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 68 ఉన్నాయి. ఎన్నికల సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్లను 49 బస్సులలో తరలించారు. 22 సెక్టోరియల్ టీంలను ఏర్పాటు చేశారు. 170 పోస్టల్ బ్యాలెట్ల జారీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. 170 పోస్టల్ బ్యాలెట్లకు 169 మంది వినియోగించుకున్నారు. అలాగే 15 మంది సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్లను జారీ చేశారు. వీరి నుంచి ఈ నెల 13వ తేదీ ఉదయం 8గంటల వరకు అందితే వాటిని లెక్కించనున్నారు. -
బాలల ప్రపంచ పుస్తకంలో విశ్వతేజ కథ
చిన్నకోడూరు(సిద్దిపేట): బాలల ప్రపంచ పుస్తకంలో విశ్వతేజ కథకు చోటు దక్కింది. తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు 56 కథలతో బాలల ప్రపంచం అనే కథా సంకలన పుస్తాకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి విశ్వతేజ రాసిన అడవి తల్లి కథ ఎంపికైంది. పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విశ్వతేజను అభినందించారు. హుస్నాబాద్రూరల్: మండల పరిధి మహ్మదాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ను డీఈఓ సస్పెండ్ చేసినట్లు హెచ్ఎం మహేందర్రెడ్డి మంగళవారం తెలిపారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో 15 రోజుల కిందట విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి పోక్సో కేసు నమోదు చేయడంతో డీఈఓ విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు హెచ్ఎం పేర్కొన్నారు. రేపు జిల్లా స్థాయి జట్టు ఎంపిక సిద్దిపేటజోన్: జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక ఈనెల 12న జరగనుందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాడిచర్లపల్లి శివార్లలోని స్టీఫెన్ హై స్కూల్లో ఎంపిక ఉంటుందన్నారు. ఎంపిక కోసం వచ్చే విద్యార్థులు ఆధార్ కార్డ్ జిరాక్స్, బోనఫైడ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. 14న ఫుట్బాల్ టోర్నీ.. ఈనెల 14న జిల్లా స్థాయి ఫుట్బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అక్బర్ పేర్కొన్నారు. జూనియర్ బాలికల, సబ్ జూనియర్ బాలల విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. సబ్ జూనియర్ కోసం అండర్–14, అదేవిధంగా జూనియర్ బాలికల కోసం అండర్–16 కేటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్గల్(గజ్వేల్): కూరగాయలు సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా రాయితీపై ట్రే బాక్సులు అందజేస్తున్నట్లు ఉద్యాన విస్తరణాధికారి అరవింద్ తెలిపారు. అవసరమైన రైతులు పట్టాదార్ పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, పాస్పోర్ట్సైజ్ ఫొటోను జతచేసి ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 9704389852 నంబర్ను సంప్రదించవచ్చని రైతులను కోరారు. గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం గజ్వేల్: జగదేవ్పూర్ మండలం మునిగడపలో బెల్ట్షాపులను నడపొద్దని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ బాలయ్య, ఉప సర్పంచ్ కిషన్యాదవ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తీర్మాన కాపీని ఎకై ్సజ్ శాఖ అధికారులకు అందజేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా బెల్ట్షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రానివ్వబోమని టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ ప్రతిమా షోమేను అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టోర్ను సందర్శించారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, 11 కేవీ, 33 కేవీ లైన్ పనులు, సబ్స్టేషన్ పనులకు అవసరమైన ప్రధాన సామగ్రి లభ్యతను సమీక్షించారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, ప్రతి వినియోగదారుడికి విద్యుత్ను అందించే విధంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. -
మంత్రిపై చర్యలు తీసుకోండి
హుస్నాబాద్: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంత్రి పొన్నం ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్కు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రచార గడవు ముగిసినా ఓట్లను అభ్యర్థించడం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమన్నారు. క్యాంప్ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
హోమ్ ఓటింగ్ ఏమాయె..
రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్రావుగజ్వేల్: గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ‘హోమ్ ఓటింగ్’ అవకాశం కల్పించారని, కానీ నేడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్రావు ఆరోపించారు. మంగళవారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఓటర్లు ‘హోమ్ ఓటింగ్’ కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. ఓటర్లు గట్టిగా అడిగితే తీరా ఇప్పుడు ప్రోవిజన్ లేదని చెబుతున్నారని వాపోయారు. ప్రోవిజన్ లేదనే విషయాన్ని ముందుగానే ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ‘హోమ్ ఓటింగ్’ ప్రోవిజన్ అమలయ్యేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. -
అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్
దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్లోని లచ్చపేట మోడల్ స్కూల్లో పోలింగ్ మెటీరియల్, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది అందజేసిన సామగ్రిని చెక్ చేసుకోవాలని బ్యాలెట్ పేపర్ కౌంట్ చేసుకోవాలన్నారు. ఉదయం మాక్ పోలింగ్ పూర్తి చేసుకొని 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఓటర్ స్లిప్లు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల బయట పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించుకోవాలన్నారు. -
నాచగిరి అభివృద్ధికి అడుగులు
వర్గల్(గజ్వేల్): నాచగిరి అభివృద్ధిలో కీలకమైన మాస్టర్ప్లాన్ పునరుద్ధరణ ప్రయత్నాలు ఫలవంతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.80 కోట్లతో మాస్టర్ప్లాన్ అంటూ హడావిడి కొనసాగిందే తప్ప ఆచరణ జరగలేదు. దీనికి తోడు మాస్టర్ ప్లాన్ ఆశలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో క్షేత్ర అభివృద్ధి కుంటుపడింది. పాలకులు మారడంతో మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాస్టర్ప్లాన్ పునరుద్ధరణ ప్రయత్నాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్గుప్తా, ధర్మకర్తలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రంగాచారి వినతి మేరకు మంగళవారం దేవాదాయశాఖ స్థపతి వల్లినాయగం, కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ) ఓంప్రకాశ్ నాచగిరి సందర్శించారు. శిథిలావస్థకు చేరిన పాత సత్రాలు తొలగించి, మాస్టర్ ప్లాన్కు అవరోధం లేకుండా వాస్తు ప్రకారం నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు స్థపతి వల్లినాయగం, ఈఈ ఓంప్రకాశ్, ఈఓ రంగాచారితో కలిసి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరిపారు. షాపింగ్ కాంప్లెక్స్, జనరేటర్ గది నిర్మాణాలకు సంబంధించి వాస్తు పరమైన సూచనలు చేశా రు. అనంతరం వారు శ్రీలక్ష్మీనృసింహుని దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. మాస్టర్ప్లాన్ పునరుద్ధరణకు కసరత్తు నూతన షాపింగ్ కాంప్లెక్స్ కోసం వాస్తు పరిశీలన నాచగిరీశుని సన్నిధిలో రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి, ఈఈ -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావు దుబ్బాకటౌన్: అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం దుబ్బాక, చెల్లాపూర్, దుంపలపల్లి, లచ్చపేట, చేర్వాపూర్ వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకుడు మాజీ మంత్రి హరీశ్రావు అని, గత బీఆర్ఎస్ హయాంలో దుబ్బాక అభివృద్ధిని అడుగడునా అడ్డుకొన్నారన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన కోట్ల రూపాయల నిధులను సిద్దిపేటకు మళ్లించుకున్నారని ఎంపీ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేతాను ముక్కలని, వారికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనన్నారు. పదేళ్ల పాటు మెదక్ ఎంపీగా ఉండి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పేరుతో భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గజ్వేల్: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను, అబద్దాలు చెప్పే బీజేపీనీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న, 14వవార్డు అభ్యర్థి శీరిషలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీరుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. చిన్నకోడూరు(సిద్దిపేట): సమాజంలో మానవ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు. సోమవారం చిన్నకోడూరులో ఎన్హెచ్ఆర్సీ క్యాలెండర్ను ఎస్ఐ చంద్రమోహన్తో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలు వారి హక్కులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు ప్రజలు, ప్రభుత్వ అధికారులు సంస్థ ద్వారా న్యాయం పొందగలుగుతారన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య తొగుట(దుబ్బాక): ఎస్సీ కార్పొరేషన్కు రూ.15వేల కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు. మండలంలోని తుక్కాపూర్లో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించిందని ఆరోపించారు. లిడ్క్యాప్ భూములు లీజుపేరుతో అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లిడ్క్యాప్కు రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. లిడ్క్యాప్ సంస్థకు చైర్మన్ను నియమించి మాదిగలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుర్రాల శ్రీనివాస్, మోహన్, వెంకట్, రాజమల్లయ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్ది అసమర్థ పాలన
దుబ్బాక: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క పనిచేయని దద్దమ్మ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. సోమవారం దుబ్బాక పట్టణంతో పాటు మున్సిపాలిటీలోని దుంపలపల్లి, చెల్లాపూర్, లచ్చపేట ల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి అన్నడు, రైతు భరోసా, పంట బోనస్, స్కూటీలు, తులం బంగారం అంటు ఇలా 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని రేవంత్ సర్కార్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడడమే తప్పా రేవంత్కు మరోపని లేదన్నారు. ఇంకా రెండున్నరేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రజలు ఏం ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు రుణమాఫీ లేదన్నారు. రైతు బంధు ఎగ్గొడుతున్నారని, యూరియా అందక రైతులు నరకయాతన పడుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. పోరాటాల పురిటిగడ్డ చైతన్యం గల దుబ్బాక ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.బీజేపీ దుబ్బాకలో గెలిచేది లేదు పెద్దగా వారితో ఒరిగేదేంలేదన్నారు. ప్రజలసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు. ఓటుతో బుద్ధిచెప్పాలి ‘ఎలుక తోలు ఏడాదంతా ఉతికినా నలుపేగాని తెలుపుకాదు అన్నట్లు.. హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్లినా రేవంత్రెడ్డి తిట్ల దండకం ఆగలేదు.. గుణం మారలేదు.. నోరు తెరిస్తే బూతులే’నని హరీశ్రావు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తానని దేవుళ్లమీద ప్రమాణం చేసి మోసం చేసిన రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోరు తెరిస్తే బూతులు తిడుతున్న రేవంత్కు పోలింగ్ బూత్లో ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్రెడ్డికి ఉమ్మడి మెదక్జిల్లాకు వచ్చేందుకు ముఖంలేదన్నారు. హామీలిచ్చి మోసం చేసిన సర్కార్కు ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. వాడిపోయిన కమలం పువ్వు గురుంచి మాట్లాడటం దండగ అన్నారు. రెండున్నరేళ్లలో ఒక్కపనిచేయని సర్కార్ బీజేపీ గెలిచేది లేదు..వారితో పెద్దగా ఒరిగేదేమీలేదు దుబ్బాకలో మాజీ మంత్రి హరీశ్రావు -
గజ్వేల్పైనే అందరి దృష్టి
● అగ్రనేతల ప్రచారంతోపొలిటికల్ హీట్ ● చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలు సీరియస్గా తీసుకొని అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించడం, ప్రచారపర్వంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠం కై వసం చేసుకోవడానికి పార్టీలు పావులు కదుపుతున్నాయి. – గజ్వేల్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రారంభం నుంచి ప్రచారం గడువు ముగిసిన సోమవారం వరకు ఆద్యంతం ఆసక్తికరమైన పరిస్థితి నెలకొన్నది. పట్టు సాధించడానికి పార్టీలు కట్టుదిట్టమైన వ్యుహాలతో ముందుకుసాగటం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర మంత్రులు వివేక్, అజారుద్దీన్తోపాటు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయన కూతురు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్రావు రెండు పర్యాయాలు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. కానీ ఈనెల 7న ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వహించే ప్రచారానికి హరీశ్రావు వస్తారని తెలిసి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాసితులు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, ఉద్రిక్తత నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్లు పాల్గొన్నారు. చిట్టచివరి అవకాశాలపై దృష్టి.. గెలుపు కోసం చిట్టచివరి అవకాశాలపై పార్టీల ప్రధానంగా దృష్టి పెట్టాయి. ప్రచారం పూర్తయి.. ఇక ప్రలోభాల పర్వం మిగిలిపోగా నోట్ల మంత్రాంగంలో నేతలు నిమగ్నమై ఉన్నారు. ఓటరు కు నేరుగా నగదు పంపిణీ చేస్తే..ఇబ్బందులు వస్తున్నాయని, ఫోన్పే, లేదా గూగుల్ పే ద్వారా అభ్యర్థులు డబ్బులు పంపడానికి ప్రయత్నిస్తున్నా రు. ఫోన్ నెంబర్లు దొరకని వారికి ఒక్కో వార్డు లో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ జరుగుతున్నదని తెలిసింది. మొత్తానికి చివరి అంకం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ముందుకుసాగుతున్నాయి. కాంగ్రెస్లో చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకోసం ఓ మహిళ నేత ప్రముఖంగా పోటీపడుతుండగా, మరొకరు సైతం పోటీలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. బీఆర్ఎస్లో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. నలుగురు మహిళ నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి కల్యాణి పేరును దాదాపుగా ప్రకటించారు. -
నిధుల వరద.. కాసుల వేట
పాపన్నపేట(మెదక్): ‘పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్ నంబర్ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్ టెక్నో సర్వీసెస్’ అనే ఒక ఫర్మ్కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతర వచ్చిందంటే పండుగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్, పోలీస్, ఆర్అండ్బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం. -
చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం హుస్నాబాద్: పాత కాలం వారు మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు సేవలను ఎలా గుర్తు చేసుకుంటున్నారో హుస్నాబాద్లో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి తీరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్కు వచ్చిందన్నారు. భవిష్యత్లో నీటి చుక్క దుకాణాల్లోకి రాకుండా రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్ను కరీంనగర్ మున్సిపాలిటిలో కలపడం తథ్యమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బస్స్టేషన్ను అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా చేశామన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో హుస్నాబాద్ను జిల్లా కేంద్రంగా మార్చేలా అభివృద్ధి చేసితీరుతామన్నారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
● మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హైమావతి సోమవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న 4 మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 4 మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 1069 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం 18 రూట్లను, 22 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని వివరించారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామన్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్లో కేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి147 మంది, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 240 మంది, దుబ్బాక మున్సిపాలిటీకి 246 మంది, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 436 మందిని కేటాయించినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేయండి హుస్నాబాద్: ఎన్నికలు సజావుగా జరిగేందుకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌటింగ్ హాల్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్, పోలీస్ సిబ్బందికి భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. -
పొద్దుతిరుగుడు సాగు లాభదాయకం
● ప్రత్యామ్నాయ పంటలే మేలు ● వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి అక్కన్నపేట(హుస్నాబాద్): పొద్దుతిరుగుడు పంట రైతులకు లాభసాటిగా ఉంటుందని, తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హుస్నాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం కట్కూర్లో యాసంగి పొద్దుతిరుగుడు సాగుపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు యాసంగిలో బావులు బోర్లపైనా నీటికోసం ఆధారపడి వరిసాగు చేస్తున్నారన్నారు. కానీ చివరి దశలో నీరు అందకపోవటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అదే కాకుండా వరి పంట తర్వాత మళ్లీ వరి సాగు చేయడంతో భూసారం తగ్గి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టపోతున్నారన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు పంటను పండిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి అయిలయ్య, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ఏఈఓ ఐశ్వర్య, కట్కూర్ సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులను ఆదుకుంటాం
● త్వరలోనే పెండింగ్ ప్యాకేజీలు అందజేస్తాం ● కార్మికశాఖ మంత్రి వివేక్ గజ్వేల్: సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలను అందజేస్తామని కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. ఆదివారం గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్రావుల నిర్లక్ష్యంతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్కు గజ్వేల్ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రక నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి కూన శ్రీశైలంగౌడ్, గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక: మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరితే రెవెవిన్యూ డివిజన్సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక పట్టణంలోని డబుల్బెడ్రూం కాలనీ సముదాయంలో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో 20 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే డబుల్బెడ్రూం కాలనీల్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
వారికి ఓటేస్తే ఐదేళ్లు నరకమే
● ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది ● హుస్నాబాద్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేస్తే ఐదేళ్లు నరకం చూస్తారని, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై బండి సంజయ్ మాట్లాడుతూ... ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు జాతీయ రహదారితో పాటు అమృత్, స్వచ్ఛ భారత్ ఇలా అన్నిరకాలుగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. పదేళ్లు మున్సిపాలిటీని బీఆర్ఎస్ నాయకులు దోచుకొని అభివృద్ధి గూర్చి పట్టించుకోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నన్ను కోసి వండుక తిన్నా ఒక్క పైసా లేదని చెప్పారని, మరీ మీకు పైసలు ఎవరు ఇయ్యాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోయేటోడులాగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్కు నా నిధుల నుంచి కమ్యూనిటి హాల్స్, బడులు, గుడులకు డబ్బులు ఇచ్చానని, వందలాది బోర్లు వేయించానని చెప్పారు. గుణవంతులైన మా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు నరకం చూస్తారన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ సంగప్ప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు దొడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్, నరేశ్ తదితరులు ఉన్నారు. -
దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ఆరు నూరైనా.. దుబ్బాక మున్సిపల్లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపల్లోని పలు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే దుబ్బాక మున్సిపాల్టీలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. వంద పడకల ఆస్పత్రి, ఐఓసీ భవనం, అధునాతన బస్టాండ్తోపాటు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే అన్నిరంగాల్లో మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని, యూరి యా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
ఫిషర్ మెన్ ఫెడరేషన్ చైర్మన్ సాయికుమార్ చేర్యాల(సిద్దిపేట): చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని తెలంగాణ ఫిషర్ మెన్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. రెండో వార్డు అభ్యర్థి ముస్త్యాల తేజకు మద్దతుగా ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను చూసి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు గుర్తు చేసుకుని, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐదేండ్లలో చేర్యాల మున్సిపాలిటీలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు పోతామని చెప్పారు. ఆయన వెంట రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజ, స్థానిక నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా కేసీఆర్ నిలబెట్టారన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ అభివృద్ధికి మంజూరైన రూ.180 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మర్కంటి వరలక్ష్మి, కల్యాణ్ కర్ పద్మబాయి, మన్నె రూప తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్): ఏడుపాయలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. ఆలయ సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వేగంగా జాతర ఏర్పాట్లు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు. మద్యం దుకాణాలు బంద్ రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మున్సిపాటీల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు ఎకై ్సజ్ ఈఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్ అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ఆదేశం ● 10న పోలింగ్ సామగ్రి పంపిణీ చేర్యాల(సిద్దిపేట)/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో, అలాగే.. చేర్యాలలో పోలింగ్ సామగ్రి, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్రూమ్ కేంద్రాలను, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11న జరిగే పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని, 11న పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్రూమ్లలో భద్రపర్చాలని చెప్పారు. 13న కౌంటింగ్ నేపథ్యంలో ఒకరోజు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి భోజనం, తాగునీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని, పాస్లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ వెబ్ కెమెరాలలో రికార్డు కావాలని సూచించారు. లచ్చపేట మోడల్ స్కూల్లో స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహా రా న్ని అందించాలని కలెక్టర్ హైమావతి అన్నా రు. దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్ట్రార్ సక్రమంగా నిర్వహించాలని కోరారు. పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ప్రలోభాల పర్వం ఆరంభం
● బాండ్ పేపర్లపై హామీలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ● కుల సంఘాల భవనాలకు స్థలం కొనిస్తానని బ్యాంక్ చెక్కులు ● ఇంటింటికీ మాంసం, మద్యం పంపిణీ ● పండుగ చేసుకుంటున్న ఓటర్లు హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో అభ్యర్థులు తన సొంత మేనిఫెస్టోతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థుల మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ రవీందర్రావులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారం తుది దశకు చేరుకోగా, అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. గత రెండురోజులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. యువకులకు, పెద్దలకు వేర్వేరు విందులు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ వార్డులో ఓ అభ్యర్థి మహిళల కోసం మినీవ్యాన్లో 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిళ్లు, స్టఫ్ పంచగా, మరో అభ్యర్థి సైతం కూల్ డ్రింక్ బాటిళ్లను పంపిణీ చేశాడు. ఓటర్లు దసరా పండుగను మించి ఓట్ల పండును తెగ ఎంజాయి చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మాంసం, మద్యం సీసాలను పంపిణీ చేస్తున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మందు సీసాను ఓటర్ల ముందు పెడుతున్నారు. ఓటర్లు ఏది అడిగినా కాదనకుండా..ఖర్చుకు వెనకాడకుండా అభ్యర్థులు పంచిపెడుతున్నారు. బాండ్ పేపర్లపై హామీలు పలు పార్టీల అభ్యర్థులు ఓటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే కుల సంఘాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 2 నుంచి 4 గుంటల స్థలాన్ని సొంత డబ్బులతో కొనిస్తానని బాండ్ పేపర్పై రాసి హామీలను గుప్పిస్తున్నారు. బాండ్ పేపర్తోపాటు బ్యాంక్ చెక్కులు ఇస్తూ ఓటర్లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఓ వార్డులో అభ్యర్థి గెలవక ముందే వందలాది గ్యాస్ కనెక్షన్ కిట్లను పంపిణీ చేసినట్లు వినికిడి. ఓ రెబెల్ బీఆర్ఎస్ అభ్యర్థి తన సొంత మేనిఫేస్టోను విడుదల చేసి ప్రచారం చేస్తున్నాడు. తనను గెలిపిస్తే ఆడబిడ్డ పెళ్లికి రూ.5,016 కానుక, ఆడబిడ్డ పుడితే రూ. 3,016 కానుక, వార్డులో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఇస్తానని హామీలిస్తున్నాడు. -
నేటితో పుర ప్రచారానికి తెర
చివరి రోజు ప్రచార సభలు, ర్యాలీలకు ప్లాన్ ●పోటాపోటీగా జన సమీకరణ ●ఐదు రోజులుగా హోరాహోరీగా ప్రచారం 72 వార్డులు.. 326 మంది అభ్యర్థులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో దుబ్బాకలో 20 వార్డులకు 102 మంది అభ్యర్థులు, గజ్వేల్లో 20 వార్డులకు 88 మంది, హుస్నాబాద్ 20 వార్డులలో 92 మంది, చేర్యాలలో 12 వార్డులలో 44 మంది కలిపి మొత్తం 72 వార్డులలో 326 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. దీంతో చివరి రోజు అభ్యర్థులు ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. కీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. – దుబ్బాక జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి నేడు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వివేక్, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు మంత్రులు ప్రచారం చేపట్టనున్నారు. బీజేపీ అభ్యర్థుల కోసం ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రచారం ఇప్పటికే గత ఐదు రోజులుగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా దుబ్బాకలో జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హుస్నాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, గజ్వేల్లో ఎంపీలు, రఘునందన్రావు, ఈటల రాజేందర్, అరవింద్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో మంత్రి వివేక్, హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్, చేర్యాలలో సీతక్క, గజ్వేల్లో అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గజ్వేల్లో మాజీ మంత్రి హరీశ్రావు, దుబ్బాకలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీశ్ విస్తృతంగా పర్యటించారు. -
కాంగ్రెస్ది మోసపూరిత పాలన
గజ్వేల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి మోసపూరిత పాలన సాగిస్తున్న కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ హయాంలో చేపట్టిన పథకాలు ఆపేశారన్నారు. యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గజ్వేల్ గౌరవాన్ని జాతీయస్థాయిలో పెంచారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లకు గుంతలు పడితే పూడ్చలేని స్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎలాగైనా అక్రమ పద్ధతుల్లో గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి ఇక్కడికి డబ్బు సంచులను పంపుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.5వేల కోట్లతో మిషన్ కాకతీయ పనులు జరిగితే...ఆ పథకంలో రూ.55వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతల తప్పుడు మాటలను నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీశ్రావు -
పుర పోరులో
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి యువత బరిలోకి దిగింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో 326 మంది పోటీ చేస్తుండగా, అందులో 95 మంది యువత ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. – సాక్షి, సిద్దిపేటఎన్నికల సమయంలో కాలనీలో రోడ్డు నిర్మాణం.. జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తా.. ఆ యువజన సంఘం నూతన భవనం నిర్మాణం చేపిస్తాం.. గెలిచిన తర్వాత టూర్ తీసుకెళ్తానని పోటీలో ఉన్న అభ్యర్థులు యువతకు గాలం వేస్తుంటారు. గెలుపొందిన తర్వాత కొన్ని నెరవేర్చేవారు.. మరి కొన్నింటిని మర్చిపోయేవారు. అభ్యర్థులు ఇచ్చే అఫర్లకు కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత అడుగుపెడుతున్నారు. తాము గెలిస్తే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి, మురుగు కాలువల సమస్యలు పరిష్కరించడంతో పాటు చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దుబ్బాక నుంచి అత్యధికంగా నాలుగు మున్సిపాలిటీల్లో 22 నుంచి 35 సంవత్సరాల వారు 95 మంది (29 శాతం) పోటీ చేస్తున్నారు. అందులో అత్యధికంగా దుబ్బాక నుంచే యువత బరిలో ఉన్నారు. ఇందులో కొంతమంది పార్టీల తరఫున బరిలో ఉండగా.. మరికొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. వీరిలో పీజీ, డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.యువత రాజకీయాల్లో రాణించాలి యువత రాజకీయాల్లో రాణిస్తేనే.. అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకటో వార్డు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నా. అవకాశం ఇస్తే.. వార్డును అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా భర్త ప్రోత్సాహంలో ముందుకు వెళ్తున్నా. – కోటగల్ల రమ్య బీఆర్ఎస్ అభ్యర్థి, దుబ్బాక ప్రజలకు సేవ చేయాలనే.. 2వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ చేస్తున్నా. వార్డులో చాలా మంది పేదలున్నారు. పక్కా ఇల్లు లేనివారు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తా. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. – చెన్నబోయిన అనూష, కాంగ్రెస్ అభ్యర్థి, హుస్నాబాద్మున్సిపాలిటీ వార్డుల బరిలో సంఖ్య ఉన్నవారు యువత చేర్యాల 12 44 11 గజ్వేల్ 20 88 23దుబ్బాక 20 102 41హుస్నాబాద్ 20 92 20వర్షానికి మాఽ వీధి మునిగిపోతుంది గెలిచిన తర్వాత ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మళ్లీ ఐదేళ్లకు కనిపిస్తున్నారు. ప్రతి వర్షాకాలం 9వ వార్డులోని పోచమ్మవీధి జలమయం అవుతుంది. అప్పటి కౌన్సిలర్, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదు. వాటిని పరిష్కరించేందుకు ఈ సారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. – బింగి శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి, చేర్యాల -
కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ
గజ్వేల్: గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గజ్వేల్కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్రావు ముందుగా పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా, ఢిల్లీవాలా హోటల్ వద్ద సభల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రచారం పూర్తయ్యాక ఆర్అండ్ఆర్ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్ వద్ద ప్రచార సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు కాలనీకి చెందిన కాంగ్రెస్ శ్రేణులు హరీశ్రావును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రచార సభ ప్రదేశానికి వచ్చారు. పెద్ద మొత్తంలో నాయకులు ర్యాలీగా అక్కడికి చేరుకొని హరీశ్రావు డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అప్పటికే హరీశ్రావు ఇక్కడికి రాకుండా తూప్రాన్ వెళ్లిపోయారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు మాత్రం ఇక్కడికి చేరుకొని ప్రచార సభను కొనసాగించారు. అయితే సమీపంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోటీగా కాంగ్రెస్కు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరువర్గాలు ఒకరినొకరు దూర్భాషలాడుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతోపాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాసేపు గందరగోళం నెలకొనడంతో పోలీసులు సముదాయించడానికి ప్రయత్నించగా ఎవరూ వినలేదు. దీంతో ఏసీపీ నర్సింలు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా బీఆర్ఎస్ సభకు కాంగ్రెస్ శ్రేణులు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా రోప్ వేశారు. సభ జరుగుతున్నంత సేపు ఆందోళనకారులను అటువైపు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులు, ఆయా పార్టీల కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎగిరిన చెప్పులు.. హోరెత్తిన నినాదాలు హరీశ్రావు వస్తున్నారని అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు -
నేడు మల్లన్న నాల్గొవ వారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గొవ ఆదివారం భక్తులు భారీగా తరలిరానున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో నాల్గవ ఆదివారం కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఓడి బియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగితే చర్యలుసిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: బహిరంగ ప్రదేశంలో మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే ఇప్పటివరకు జరిమానాలు విధించేవారని, కానీ ఇకపై ఈ పెట్టి కేసుల్లో జైలు శిక్ష విధిస్తారన్నారు. మద్యం సేవించి గొడవలు చేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలని సీపీ పేర్కోన్నారు. అంతర పంటతో అధిక ఆదాయం ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్బాషా నంగునూరు(సిద్దిపేట): ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అంతర పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. నర్మేటలో రైతు ఇర్ఫాన్ సాగు చేస్తున్న బ్లూబెర్రీ పంట, షేడ్నెట్ ద్వారా దేవులపల్లి వెంకటేశ్ సాగు చేస్తున్న యూరోపియన్ దోస పంటను పరిశీలించారు. పాలమాకులలో రైతు వీరారెడ్డి ఆయిల్పామ్ తోటలో సాగు చేస్తున్న శ్రీగంధం, అంజీర, అరటి, ఉల్లి సాగును పరిశీలించారు. అనంతరం యాస్మిన్మాట్లాడుతూ.. రైతులు అధిక ఆదాయం లభించే ఆయిల్పామ్ పంటను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సువర్ణ, డీడీఎస్ ఇంద్రసేనారెడ్డి, అధికారులు మౌనిక, బాలాజీ, రమేశ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. పట్టుసాగుకు ప్రోత్సాహం చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకంలో రైతులు మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం మండల పరిధి చంద్లాపూర్లో రైతులు సాగు చేస్తున్న పట్టు సాగును పరిశీలించారు. అధికారులు పట్టుసాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. విజ్ఞానాన్ని కళారూపంగా చెప్పడమే ఒగ్గుకథ ప్రొఫెసర్ కమలాకరశర్మ గజ్వేల్రూరల్: విశిష్టమైన విజ్ఞానాన్ని కళారూపంగా మార్చి చెప్పడమే ఒగ్గుకథ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ అన్నారు. ఒగ్గుకథ–గతం–వర్తమానం–భవిష్యత్ అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ మాట్లాడుతూ తెలంగాణకే ప్రత్యేకమైన ఒగ్గుకథ కళారూపాన్ని పరిరక్షించుకుందామన్నారు. ఒగ్గుకథ కళాకారులు రవికుమార్, మిద్దె వినిత్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబా సీజ్ సిద్దిపేటకమాన్: అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబాను సీజ్ చేసి, నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. పట్టణంలో సీపీ రష్మి, సీఐ ఉపేందర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వేములవాడ కమాన్ సమీపంలోని రాజరాజేశ్వరి దాబాలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు మద్యం సేవించడాన్ని సీపీ గుర్తించారు. దీంతో దాబా యజమాని పోదేన్ల దశరథంతోపాటు మద్యం తాగుతున్న ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. -
అన్నా.. బాగున్నావే..!
పొన్నం, సతీష్ ఆప్యాయంగా పలకరింపులుమున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎదురుపడ్డారు. అన్నా.. బాగున్నావా అంటూ మంత్రి పొన్నం.. సతీష్కుమార్ను ఆప్యాయంగా పలకరించుకున్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డులో ఈ ఘటన జరిగింది. ఎప్పుడు విమర్శనస్త్రాలను సంధించుకునే వీరు పరస్పరం చేయి చేయి కలిపి కరచాలనం చేసుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఈ సన్నివేశాన్ని చూసి అబ్బురపడ్డారు. – హుస్నాబాద్: -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే నిధులు
గజ్వేల్: రాష్ట్ర ఖాజానాపై భారం పడుతున్నా.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ అన్నారు. శనివారం గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ను గెలిపిస్తేనే అభివృద్ధికి నిధులు వచ్చే అవకాశమున్నదని చెప్పారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలు కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్లో మైనార్టీల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల్లో తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి అజహరుద్దీన్ -
అక్కసుతోనే విమర్శలు
హుస్నాబాద్: తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విమర్శించారు. శనివారం హుస్నాబాద్లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, దాన్ని యుద్ధప్రాతిపదికన, గుండె ధైర్యంతో గాడిన పడేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కంటోన్మెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలు కడిగేందుకే సమయం సరిపోవడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.21 వేల కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తుమ్మల వివరించారు. మార్చిలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్మించిన ఆయిపామ్ ప్యాక్టరీని మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నర్మేటలో నిర్మించిన ప్యాక్టరీని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎండీ యాస్మిన్ బాషాతో కలసి ఆయన పరిశీలించారు. నర్మేట ప్యాక్టరీకి 120 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెసింగ్ చేయగల సామర్ధ్యం ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆయిల్ తెప్పించి ఇక్కడే ప్యాకింగ్ చేస్తారన్నారు. గెలల నుంచి వచ్చిన పిప్పితో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకుంటామని తెలిపారు. ప్యాక్టరీలో మూడు రోజుల పాటు రైతు మేళా నిర్వహిస్తామన్నారు. ఆయిల్పామ్ సాగు, విస్తీర్ణం పెంచాలన్నారు. కార్యక్రమలో ప్యాక్టరీ ఎండీ శ్రీకాంత్రెడ్డి, హార్టి, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక పొతున్నారు: తుమ్మల మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం -
కాంగ్రెస్తోనే పట్టణాల అభివృద్ధి
హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 10, 11, 17, 20వ వార్డుల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఈ రెండేళ్లలో జరిగిందన్నారు. హుస్నాబాద్ను పెద్ద నగరంగా మార్చేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం కుర్చీ వేసుకొని కడతామన్నవారు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం పనులు వేగవంతమయ్యాయని, ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. హుస్నాబాద్కు గౌరవం పెరగాలంటే, ఇంకా అభివృద్ధి వైపు వెళ్లాలంటే పాలకవర్గం అధికార పార్టీదే ఉండాలన్నారు. చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లెల్లగడ్డలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని మంత్రి కోరారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
కూరలేవీ?.. కొందరికేనా గుడ్డు?
వర్గల్(గజ్వేల్): ‘మెనూ ప్రకారం వంటలు లేవు.. ఇంకో కూర వండలేదు.. కొందరికే గుడ్డు.. ఇలాగేనా మధ్యాహ్న భోజనం.. బడి వంటల తీరు అంటూ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఫోన్ద్వారా డీఈఓను ఆదేశించారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో మధ్యాహ్నభోజన వంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. అన్నం, గుడ్డు, పప్పు చారులను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం మరో కూర చెయ్యలేదని, 336 మంది విద్యార్థుల హాజరుకు బదులు 233 మంది విద్యార్థులకు మాత్రమే గుడ్లు పెట్టారని కలెక్టర్ మండిపడ్డారు. విద్యార్థుల హాజరు ప్రకారం కడుపునిండా భోజనం అందేలా చూడాలని, ఒకే కూరతో, కొంత మందికే భోజనం పెడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. మెనూ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఫోన్ ద్వారా డీఈఓను ఆదేశించారు. చదువు, మధ్యాహ్న భోజనం విషయంలో లోటు లేకుండా జాగ్రత్త వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వర్గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికర భోజనం పెట్టాలన్నారు. పిల్లలకు భోజనం, వసతి, చదువులో రాజీ పడొద్దని, క్రమశిక్షణాయుత విద్యాబుద్ధులు నేర్పించాలని ఎస్ఓ, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు తరచూ పర్యవేక్షిస్తూ అవి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శుక్రవారం వర్గల్ ఎంపీపీ కార్యాలయంలో ఇందిరమ్మ గృహాల పురోగతిని ఎంపీడీఓ దామోదర్రెడ్డి, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటికి గ్రౌండింగ్ కావాలన్నారు. మంజూరైన వారు ఎందుకు కట్టుకోవడం లేదో కారణం తెలుసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాల దశల వారీగా వెంటవెంటనే హౌసింగ్ అధికారులు ఫోటో క్యాప్చర్ చేయాలన్నారు. పే మెంట్ విషయంలో లబ్ధిదారుల అపోహలను తొలగించాలని, వారి ఖాతాలోనే ప్రభుత్వం నిధులు జమ చేస్తుందన్నారు.11న సెలవుసిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 11న సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న అన్ని భవనాలు/సంస్థలకు 10వ తేదీన నుంచే సెలవు ప్రకటించామన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, భవనాలకు 12న, 13న స్థానిక సెలవు వర్తించనున్నట్లు తెలిపారు. -
12 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్షసిద్దిపేటరూరల్: జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు ఈనెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ అమీద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి సీఎం క్రీడా పోటీల నిర్వహించనున్నామన్నారు. ఈ క్రీడల్లో డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికై న దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, యోగా, క్యారం, చెస్, కరాటే, బేస్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, హాకీ తదితర 25 క్రీడాంశాలలో పాల్గొననున్నారన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల ను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడలు నిర్వహించే ప్రదేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, క్రీడాకారులకు భోజనం, వసతి, మెడికల్ క్యాంపు, ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటనర్సయ్య, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డీపీఆర్ఓ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి వ్యూహం.. వారిదే
గెలుపే లక్ష్యంగా ముందుకు● ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి ● గజ్వేల్లో జోరందుకున్న ప్రచారం ● ప్రచార గడువు ముంచుకొస్తుండటంతో ఆసక్తికరంగా రాజకీయాలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడం వల్ల ప్రధానంగా బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీలు ఛాలెంజ్గా తీసుకొని ముందుకుసాగుతున్నాయి. ఈ మున్సిపాలిటీపై పట్టు సాధించడానికి అవసరమైన అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార గడువు ఈనెల 9న ముగియనుండటంతో.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడిని పెంచాయి. మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా మారిందని బీఆర్ఎస్ వాదిస్తున్నది. వేలాది కోట్ల నిధులతో ఇక్కడ భారీ అభివృద్ధి పనులు జరిగాయని ప్రచారంలో చెబుతున్నారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కూడా చెబుతూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్అండ్ఆర్ కాలనీ)లో బాధితులు ఎన్నో పెండింగ్ సమస్యలతో కొట్టామిట్టాడుతున్నారని ప్రచారంలో చెబుతున్నారు. పార్టీల ప్రచారం తీరు ఎలా వున్నా.. ఓటర్లు మాత్రం అందరి మాటలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక పరిస్థితుల మేరకు తాము ఏ పార్టీ వైపు ఉండాలనే అంశంలో స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తున్నది. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తున్నది. ప్రధాన పార్టీల నాయకులు సైతం మరో పార్టీ అభ్యర్థికి బాహాటంగా మద్దతు పలుకుతూ.. ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. ఇకపోతే నిన్నటిమొన్నటి వరకు బీఫామ్ల విషయంలో పోటాపోటీ ప్రయత్నాలు చేసిన నాయకులు కొన్ని వార్డుల్లో కలిసిపోయి పనిచేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల మాత్రం బీఫామ్ దక్కని వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్నారు. గతంలో ఒకటిరెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో సానుభూతని వాడుకుంటున్నారు. ప్రచారం సందర్భంలో తాము గతంలో పలుసార్లు ఓడిపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని, ఈసారి గెలవకపోతే తమకు భవిష్యత్తు ఉండదని ఆందోళ వ్యక్తం చేస్తూ.. తమను ఎలాగైనా గట్టెక్కించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మొత్తానికి పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తిగా మారాయనడంలో సందేహం లేదు.మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. విమర్శలకు పదునుపెడుతూ.. వేడిని పెంచుతున్నాయి. ప్రచార గడువు ఈనెల 9తో ముగుస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. – గజ్వేల్ -
సాగునీటి కోసం రైతుల ధర్నా
రోడ్డుపై బైఠాయించి నిరసన సిద్దిపేటరూరల్: యాసంగికి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి వద్ద ముస్తాబాద్ ప్రధాన రోడ్డుపై చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల రైతులు మల్లన్నసాగర్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలు సైతం ఎండిపోయాయన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని కోరినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికై నా సాగునీటిని వదిలి పంటలను రక్షించాలన్నారు. సీఐ శ్రీను అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. సమస్యల ప్రతిబింబమే ఒగ్గుకథ గజ్వేల్రూరల్: సమకాలిన సమాజంలో ఉన్న సమస్యల ప్రతిబింబమే ఒగ్గు కథ అని, కాలానుగుణంగా నిత్యనూతనంగా విరాజిల్లుతోందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఒగ్గుకథ గతం–వర్తమానం–భవిష్యత్ అనే అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు జరిగిన కార్యక్రమానికి హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కళారూపం ఒగ్గు కథ అని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా ఒగ్గు కథ సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టర్ మహేందర్రెడ్డి పరిశోధన చేసిన గ్రంధాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్బాచారి, జరిపల్లి అశోక్, సుదర్శనం, వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రకృతిని పరిరక్షిద్దాం సిద్దిపేటఅర్బన్: గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు గురి కాకుండా ప్రకృతిని పరిరక్షించుకునే విధంగా వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ అన్నారు. విజ్ఞాన దర్శిని నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని సురభి వైద్య కళాశాలలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్, కవి, గాయకుడు జయరాజ్ ప్రకృతి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గంజి ఈశ్వరలింగం, కళాశాల డీన్ రఫీ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి శైలజ, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ సమతరోషిని, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయండీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. చిన్నకోడూరుకు చెందిన మహేందర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ నియామకపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రూపులకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి మండలంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, నర్సింహులు తదితరులు ఉన్నారు. -
పుర పోరులో నేతల బిగ్ ఫైట్
జిల్లాలో హీటెక్కిన రాజకీయాలు ● ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంజిల్లాలో మున్సిపల్ పోరు తీవ్ర స్థాయికి చేరడంతో రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు ఈ ఎన్నికలు ఆయా పార్టీల అగ్రనేతలకు పెను సవాల్గా నిలిచాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుండటంతో ప్రచారం ఊపందుకుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్), మాజీ మంత్రి, తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావులు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. – సాక్షి,సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్, హుస్నాబాద్ నుంచి రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, దుబ్బాక నుంచి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుర ఎన్నికల్లో ఆ మూడు మున్సిపాలిటీలు ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకమే కానున్నాయి. ఆయా పార్టీలు ఇన్చార్జిలను నియమించారు. ఏ పార్టీ వారు.. ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. పురిటిగడ్డపై బీఆర్ఎస్కు పట్టు బీఆర్ఎస్ పురిటిగడ్డ సిద్దిపేట. జిల్లాలో బీఆర్ఎస్కు ఎక్కువగా పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రింగ్ రోడ్, వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశారు. హరీశ్రావు నిత్యం ఆయా మున్సిపాలిటీల పార్టీ పరిశీలకులతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార పార్టీ హామీల బాకీపై ప్రజలకు వివరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీని తిరిగి దక్కించుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. జోష్తో బీజేపీ.. లోకసభ ఎన్నికల్లో ఎంపీగా రఘునందన్ రావు విజయం సాధించడంతో బీజేపీ నేతలు జోష్తో ముందుకు సాగుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీపై మెదక్ లోకసభ సభ్యుడు రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేవలం ఒక్క కౌన్సిలర్ మాత్రమే విజయం సాధించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో అదే విదంగా మున్సిపాలిటీని కై వసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.మంత్రికి పెనుసవాల్..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రభాకర్కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించి తరగతులు ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పొన్నం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను మంత్రి అయిన తర్వాత పార్టీ గుర్తుతో మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి సొంత నియోజకవర్గం గజ్వేల్ కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. -
చేర్యాల చైతన్యానికి అడ్డా..
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డా.. పోరాటాలకు పురిటిగడ్డ అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా గాంధీ సెంటర్ నుంచి అంగడిబజార్ వరకు ఎంపీ చామల కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్రెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పావల వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ సంవత్సరకాలంలో చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు ఇచ్చిననట్లు తెలిపారు. మహిళలందరూ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే చేర్యాల ప్రాంతం నాలుగు ముక్కలుగా చీలి అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు. చేర్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. అంతకు ముందు భువనగిరి ఎంపీ చామల మట్లాడుతూ 1600 మంది అమరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోయిందని, అది దొరల పాలైందని విమర్శించారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఉద్యమం మొదలు పెట్టిన కేసీఆర్ తానే గద్గెనెక్కారని గుర్తు చేశారు. దొంగ ఓట్లతో గెలిచిన పల్లా రాజేశ్వర్ నియెజికవర్గంలో డబ్బులతో మాయచేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెరార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు ఓట్లడిగే హక్కే లేదు
● గత ప్రభుత్వంలో అంతా అవినీతే.. ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: పదేళ్లల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే హక్కే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం పట్టణంలోని 5, 6,7వ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఆటో నడుపుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా అవినీతి పాలనే జరిగిందన్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశామన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని స్థానాల్లో గెలిచినప్పుడే హుస్నాబాద్కు మరింత కీర్తి పెరుగుతుంది. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఓటరుపై దృష్టి పెట్టి పని చేయాలని, చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. -
గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు
● ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి ● మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ● మాజీ మంత్రి హరీశ్రావు గజ్వేల్: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని, ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు వస్తే ఎక్కడికక్కడా హామీలపై నిలదీ యాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. గజ్వేల్ పట్టణంలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఇప్పటివరకు బాకీపడిన రూ.65 వేలు చెల్లించాలన్నారు. బీజేపీకి ఓటేసినంతమాత్రాన ఒరిగేదేమీలేదన్నారు. ఆ పార్టీకి తగువిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేదీ బీఆర్ఎస్సేనని, తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. హార్వర్డ్ పోయినా.. మారలే.. హార్వర్డ్ యూనివర్సిటీ పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరలాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత ఎట్లయితడని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తుండు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చునా, ఈ రాష్ట్రానికి నువ్వు సీఎం అయ్యేవారివా? అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. దమ్ముంటే పనిలో పోటీ పడాలని, కేసీఆర్ను తిట్టడంలో కాదని చెప్పారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్రావు -
ర్యాలీలు.. రోడ్ షోలు
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచార సమయం ఉండటడంతో అభ్యర్థులు వేగం పెంచారు. అభ్యర్థులు వారి కుటుంబాల సమేతంగా పొల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళ్తూ కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కౌన్సిలర్గా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రణాళికలను రూపొందించుకున్నారు. ప్రచారంలోకి మంత్రులు, ఆయా పార్టీల ముఖ్యులు దిగారు. ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ సమావేశాలు, ర్యాలీలు, రోడ్షో జోరుగా నిర్వహిస్తున్నాయి. – సాక్షి, సిద్దిపేట దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంపీ రఘునందన్రావు సైతం జోరు పెంచారు. ‘తమ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. కేంద్రంలో అధికారంలో ఉన్నాం. అక్కడి నుంచి అధికంగా నిధులు కేటాయించేందుకు కృషి చేస్తాం’ అని హామీలు ఇస్తున్నారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేపట్టారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. పట్టణం అభివృద్ధికి ఇంకా అధిక నిధులు కేటాయించి, మరింత అభివృద్ధి చేస్తాం’అని హామీల వర్షం కురిపిస్తున్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని.. ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో వివరిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ ప్రచారం చేపడుతున్నారు. రోజూ 16 గంటలు ఓటర్ల మధ్యే.. ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రోజులో దాదాపు 16 గంటలు ఓటర్ల మధ్యనే ఉంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు పలు వీధుల్లో ఉన్న వారిలో యువజన, మహిళ, కుల సంఘాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి వారి మద్దతును కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇక ప్రచార రథాలు సైతం ఏర్పాటు చేసి కాలనీల్లో తిప్పుతున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో పులువురు ఇంటింటికి ఒక మారు తిరిగి ఓటును అభ్యర్థించారు. ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడు మార్లు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే.. వేగం పెంచిన అభ్యర్థులు రంగంలోకి వివిధ పార్టీల నేతలు దుబ్బాకలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్లో మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారానికి మరో నాలుగు రోజులే గడువు ప్రశాంత్నగర్(సిద్దిపేట): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు కో ఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హుస్నాబాద్కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గజ్వేల్కు కూన శ్రీశైలంగౌడ్, దుబ్బాకకు వనం శ్రీనివాస్ యాదవ్, చేర్యాలకు మెట్టు సాయికుమార్ను కో ఆర్డినేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు. -
రంగంలోకి సినీనటులు!
● జోరుగా వాయిస్ వీడియోలు ● గజ్వేల్లో ప్రచారం కొత్తపుంతలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన మార్గాలపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇందుకోసం సినీనటుల వాయిస్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయిస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలంగా పట్టణ ప్రముఖులచే వాయిస్ వీడియోలను చేయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. – గజ్వేల్ పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, జనసేన, గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లు కలుపుకొని మొత్తంగా 88 మంది అభ్యర్థులు మున్సిపల్ బరిలో ఉన్నారు. ప్రచారంలో ఎవరికి వారే తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఓటర్లను ఆలోచింపజేయడానికి కొందరు తమ సన్నిహిత సినీనటులను రంగంలోకి దింపుతున్నారు. పట్టణంలో పోటీలో ఉన్న ఓ అభ్యర్థి గబ్బర్సింగ్ సినిమా నటులతో వాయిస్ వీడియోలు చేయించి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాకుండా జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీడియోలు షేర్ చేస్తూ.. గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖుల వీడియోలు తయారు చేయించి వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రముఖుల మాటలు ఇక్కడి ప్రజలను ప్రభావితం చేస్తాయనే భావనతో ఇలా చేస్తున్నారు. ప్రత్యేకించి పట్టణానికి చెందిన పురోహితులు, ఇతర పండితుల వీడియోల సందేశాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. వీరు ఫలానా వ్యక్తికి ఓటు వేయాలని నేరుగా చెప్పకపోయినా.. వారు చెప్పే సందేశం తమకే వర్తిస్తుందనే భావనతో ఒకే వార్డులో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు. ఇక పోతే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ మహిళా నాయకురాలి వాయిస్ను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఆ మహిళా నాయకురాలు మున్సిపల్ ఎన్నికల్లో.. ‘ఆపతికి, సంపతికి.. మన వెంటే ఉండే వారిని, సమస్యలను పరిష్కరించే వారిని మాత్రమే ఎన్నుకోండి...’ అంటూ సందేశమిచ్చారు. ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ.. మరికొందరు అభ్యర్థులు తాము గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వాల్పోస్టర్లు, వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలో ఓటర్లను ఆకట్టుకునే పాటలను జతచేసి పర్సనల్గా షేర్ చేస్తున్నారు. మొత్తానికి వివిధ రూపాల ప్రచారపర్వం అందరినీ ఆకట్టుకుంటోంది. -
దుబ్బాకపై కేసీఆర్కు ఉన్న ప్రేమ రేవంత్కు ఏదీ?
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: పుట్టి పెరిగి విద్యా బుద్ధులు నేర్చుకున్న దుబ్బాక గడ్డమీద కేసీఆర్కు ఉన్న ప్రేమ రేవంత్రెడ్డికి ఉంటుందా? ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లాయపల్లి, చెల్లాపూర్ 1, 2, 3 వార్డులతో పాటు దుబ్బాక 13, 14 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పట్టణ, పల్లె వికాసం జరిగితే రేవంత్ పాలనలో వికారంగా మారిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు.కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.బీడీలు ఎంచుతూ.. ఓటు అడుగుతూదుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గురువారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీడీ కార్ఖానలో పనిచేస్తున్న మహిళలను ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల బాగోగులు తెలుసుకొన్నారు. కార్మికులకు పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించారు. -
పకడ్బందీగా ప్రభుత్వ భూముల సంరక్షణ
● కలెక్టర్ హైమావతి ● ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం సిద్దిపేటరూరల్: ప్రభుత్వ భూముల సంరక్షణతో పాటు రెవెన్యూ రికార్డుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చాలా ముఖ్యమైనదన్నారు. భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా ఉంటుందన్నారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి, భూ సమస్యలు లేకుండా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. చట్టం ప్రకారం భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మొద్దు
దుబ్బాక: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషితోనే తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దుబ్బాక పట్టణంలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అఽధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా బాగుచేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. మెదక్, సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణం ఎంపీ రఘునందన్రావు కృషితోనే జరుగుతోందన్నారు. డబ్బులు లేవని సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దోచుకున్న డబ్బులను దాచుకునేందుకు కేసీఆర్ కుటుంబం రోడ్డున పడి గొడవలు చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతుంది తప్పా రాష్ట్రప్రభుత్వంతో కాదన్నారు. దుబ్బాకలో రఘునందన్రావు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి చరిత్ర సృష్టించాలన్నారు. కాషాయ జెండా ఎగురవేద్దాం దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాషాయం జెండాను ఎగురవేద్దామని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు.కాంగ్రెస్కు దుబ్బాకలో స్థానం లేదని ఆ పార్టీకి ఓట్లువేస్తే గంగలో వేసినట్లవుతుందని ఇక బీఆర్ఎస్కు వేస్తే ఏం లాభం ఉండదన్నారు.బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల సభలో సంఘీభావం చాటుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ రఘునందన్రావు, బీజేపీ అభ్యర్థులు మోదీ కృషితోనే జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుబ్బాకలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సభ -
కర్రు కాల్చివాత పెట్టాలి
నర్సాపూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బంద్ చేసి హామీలన్నీ ఎగ్గొట్టారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి 14 రోజుల పాటు అమెరికాకు పోయినప్పుడు టీవీల్లో శబ్ధ కాలుష్యం తగ్గిందన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ సిగాచీ కార్మిక కుటుంబాలను ఆదుకోలేదని, కంపెనీ ఇచ్చిన డబ్బులే ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ విషయమై ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. రేవంత్రెడ్డివన్నీ తొండి మాటలేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఏపీకి నిధులు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపిందని, ఇక్కడి బీజేపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్కు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలని, ఎగిరిపడితే ప్రజలు రాళ్లతో కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సంగీత, అనుసూయ అశోక్గౌడ్, నయిమోద్దీన్, సత్యనారాయణగౌడ్, సునీతాబాల్రెడ్డి, కండెల రాజు, సమీన బేగం, షేక్హుస్సేన్, కళ్యాణి, హమీద్, శ్రావ్య, మంజుల, మోహిన్అలీ, వినయ్కుమార్, సరిత, లలితలను పరిచయం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు దేవేందర్రెడ్డి, చంద్రాగౌడ్, గోపి, మన్సూర్, శేకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ హైమావతి ● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షదుబ్బాక: జిల్లాలోని అన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా కేవలం 15 మాత్రమే గ్రౌండింగ్కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులతో మాట్లాడి నిర్మించుకోవడానికి సుముఖంగా లేనివారి నుంచి లెటర్ తీసుకొని డిలీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుబ్బాక, భూంపల్లి–అక్బర్పేట మండల కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మండలంలోని హబ్షీపూర్ జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి కూరలు పలుచగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల్లో వంటలు నాణ్యతగా రుచికరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు వండాలని సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. -
తాయిలాల ఎర..
● ‘గంపగుత్త’ ఓట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి ● జోరుగా సంప్రదింపులు, సమావేశాలు ● తాయిలాలతో ఆకట్టుకునే యత్నాలు ● గజ్వేల్ పుర పోరు రసవత్తరంగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు సామాజికవర్గాల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఎలాగైనా ‘గంపగుత్త’గా రాబట్టుకోవడానికి తాయిలాల ఎర చూపుతున్నాయి. ఇందుకోసం సమావేశాలు, సంప్రదింపులు ముమ్మరం చేశాయి. – గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మార్గాల్లో కీలకమైన సామాజికవర్గాలపై ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న సంగతి తెల్సిందే. ఒకటిరెండు చోట్ల ఇండిపెండెంట్లు, మరొకచోట ఓ పార్టీ అభ్యర్థి ప్రభావాన్ని చూపే పరిస్థితి కనపడుతోంది. ప్రచారానికి కేవలం మరో నాలుగు రోజులు ఉండటం వల్ల ఈ స్వల్ప వ్యవధిలో ఎక్కువమందిని కలిసి గెలుపు కార్యాచరణ రూపొందించుకోవడమే లక్ష్యంగా పార్టీల ముఖ్యనేతలు ముందుకుసాగుతున్నారు. ఇక్కడ 20 వార్డులు ఉండగా, ఆయా వార్డుల్లో ఏయే సామాజికవర్గాలు ప్రభావం చూపుతున్నాయే పరిశీలించి ఆమేరకు వారిని కలుస్తున్నారు. సామాజికవర్గాలను కలిసేందుకు పట్టణంలో విస్త్రతంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సామాజికవర్గాల పెద్దల ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశాలు, సంప్రదింపుల సందర్భంగా ఓట్లు వేయించుకోవడం, మాట తీసుకోవడం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సమావేశాలు, సంప్రదింపులను ఎక్కువగా ఆలయాల్లో నిర్వహిస్తున్నారుగంపగుత్తగా ఓట్లు పడేలా చూస్తే.. భారీగా నగదుతోపాటు ఇంటింటికీ విలువైన వస్తువులను ఆఫర్ చేస్తున్నారు. ఓ అభ్యర్థి పట్టణంలో బలంగా ఓ సామాజికవర్గానికి ఇంటికో ఫ్రిజ్ ఆఫర్ చేయడానికి సిద్ధమవుతున్నారని, మరో అభ్యర్థి ల్యాప్టాప్, ఇంకో అభ్యర్థి గంపగుత్తగా గోవా ట్రిప్ ఆఫర్ చేయడానికి సిద్ధమయ్యారని చర్చించుకుంటున్నారు. ఇవేకాకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇప్పటికే సుక్క, ముక్క పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణంలోని హాట్ సీటుగా చెప్పుకుంటున్న ఓ వార్డులో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటాపోటీగా పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక అభ్యర్థి ఉదయం చికెన్, బాస్మతీ బియ్యం అందజేస్తే.. అదే రోజు మధ్యాహ్నానికల్లా పోటీ అభ్యర్థి ఇంటింటికి హాఫ్ బాటిల్ బ్రాండెడ్ మందు పంపిణీ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇకపోతే మందు పంపిణీ సందర్భంగా ఓటర్లకు స్టఫ్ కింద మొలకలు, మిక్సర్ కూడా అందిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సామాజికవర్గాల సంప్రదింపులు, సమావేశాలు పార్టీల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఒకటిరెండ్రోజుల్లో ఈ వ్యవహారం మరింతగా ఆసక్తికరంగా మారనున్నది. -
స్వతంత్రుల.. సత్తా
మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రులు సత్తాచాటుతున్నారు. రాజకీయ పార్టీల నడుమ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం అంత సులువు కాదు. అయినా చెమటోడ్చి గట్టి పోటీ ఇస్తూ విజయబావుటా ఎగురవేస్తుండటం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2020లో జరిగిన 15 పురపాలికలు 309 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. పలు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్గా వ్యవహరించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 392 మంది ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట గత మున్సిపల్ ఎన్నికల్లో 35 మంది విజయం● గతంలో ఇండిపెండెంట్కు దక్కిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ● ఈసారి 19 మున్సిపాలిటీల్లో 392 మంది పోటీ ● ప్రస్తుత పుర బరిపై సర్వత్రా చర్చఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 1,658 మంది పోటీ చేస్తుండగా అందులో 392 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ సారి జహీరాబాద్ మున్సిపాలిటీలో 58 మంది, సంగారెడ్డిలో 52, అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. రాజకీయ పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువగా ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇండిపెండెంట్లు దాదాపు 15శాతం వరకు విజయం సాధిస్తున్నారు. స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారంలో దూసుకపోతున్నారు. సొంత మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు. ప్రచార రథాలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎంత మంది ఇండిపెండెంట్లు గెలుపొందుతారోనన్న చర్చ అన్ని పార్టీల్లో సాగుతోంది. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఎంత మంది స్వతంత్రులకు ఓటర్లు పట్టం కడతారో వేచిచూడాల్సిందే. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలోనూ ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారే కీలకంగా మారుతున్నారు. ఇండిపెండెంట్లు వ్యక్తిగతంగా ప్రచారం నిర్వహించి.. ప్రజల మన్ననలు పొంది విజయబావుటా ఎగురవేశారు. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులుండగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) 5, కాంగ్రెస్ 5 వార్డుల్లో, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇండిపెండెంట్గా గెలుపొందిన నిమ్మ రాజీవ్రెడ్డి బీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గిరిని కై వసం చేసుకుంది. బీఆర్ఎస్కు మద్దతు పలికినందుకు వైస్ చైర్మన్గా రాజీవ్రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 9, బీజేపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారు బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఆ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకుంది.మున్సిపాలిటీ గత ఎన్నికల్లో గెలుపొందిన వారు దుబ్బాక 09హుస్నాబాద్ 03గజ్వేల్ 06చేర్యాల 02అమీన్పూర్ 01అందోల్–జోగిపేట్ 01బొల్లారం 0నారాయణఖేడ్ 0సదాశివపేట 01సంగారెడ్డి 03తెల్లాపూర్ 02మెదక్ 01నర్సాపూర్ 03రామాయంపేట్ 01తూప్రాన్ 02జిల్లా మున్సిపాలిటీలు మొత్తం స్వతంత్రులు అభ్యర్థులు సిద్దిపేట 4 326 73 సంగారెడ్డి 11 1,045 276 మెదక్ 4 287 43 -
పారదర్శకంగా యూరియా పంపిణీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రైతులకు అవసరానికి అనుగుణంగా, పారదర్శకంగా, సమయానికి పంపిణీ జరుగుతోందన్నారు. యాప్లో నమోదైన వివరాల ప్రకారం 9,136 మంది రైతులు 29,732 యూరియా బస్తాలు బుక్ చేయగా, ఇప్పటివరకు 20,829 బస్తాలు పంపిణీ చేశామన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతో పాటు పంట అవసరాలకు అనుగుణంగా సమాన పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు. కౌలుదారుల రైతులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందన్నారు. రైతులు యూరియాను యాప్ ద్వారానే బుకింగ్ చేయాలని, ఫీల్డ్ స్థాయి సిబ్బందితో సహకరిస్తూ డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి -
ఇవేం వంటలు?
మర్కూక్ (గజ్వేల్): ‘ఇవేం వంటకాలు.. మీరైతే ఇలానే తింటారా? విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?.. మెనూ ఎందుకు అమలు చేయడంలేదు’ అని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే నూతనంగా నిర్మిస్తున్న గణేశ్పల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మర్కూక్ కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొలత ప్రకారం ఇచ్చిన కూరగాయలు చేసిన వంటకు పొంతనే లేదని ఎస్ఓ భాగ్యలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. రిజిస్టర్లో రాయకుండా ఇష్టానుసారంగా సరుకులు అందిస్తారా? అని మండిపడ్డారు. ఇష్టానుసారంగా పిల్లలకు భోజనం వడ్డిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట చేయలేదని ఎస్ఓ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓ శ్రీనివాస్రెడ్డిని ఫోన్లో ఆదేశించారు. తరుచూ కేజీబీవీని సందర్శించాలని ఏంఈఓ వెంకట్రాములుకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులను సందర్శించారు. మెరుగైన వైద్యం అందించి మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి ఆఫీసర్ వరకు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గణేశ్పల్లిలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా మెనూ ఎందుకు పాటించడంలేదు కలెక్టర్ హైమావతి ఫైర్ ఎస్ఓ భాగ్యలక్ష్మిపై చర్య తీసుకోవాలంటూ ఆదేశాలు -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
హుస్నాబాద్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆర్యవైశ్య భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 20 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో ఎవరూ అసంతృప్తిలో లేరని, నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, 250 పడకల ఆస్పత్రి, ఇండస్ట్రీయల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో హుస్నాబాద్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో నీటిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లును ఇవ్వలేదన్నారు., హుస్నాబాద్ పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో కోతుల బెడద ఉందని, చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
చేర్యాలలో 44 మంది అభ్యర్థులు
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపల్ బరిలో 44 మంది నిలిచారు. 12 వార్డులకు మొత్తం 57 మంది 85 నామినేషన్లు వేశారు. వీరిలో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 44 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగెందర్ తెలిపారు. 1, 2, 3, 5, 7, 8, 10, 12 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 4, 9 వార్డుల్లో నలుగురు చొప్పున, 6, 11 వార్డుల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఏఐఎఫ్బీ పార్టీల అభ్యర్థులు తమ బీ ఫాంలను అందజేశారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తులు కేటాయించారు. -
వామపక్షాలు ఒంటరిగానే..
సాక్షి, సిద్దిపేట: పురపాలికల్లో ఒంటరిగానే వామపక్షాలు బరిలోకి దిగాయి. ఒక్క చేర్యాలలో మాత్రమే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు కుదిరింది. హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాకలో సీపీఐ, సీపీఎంలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. తమ సత్తాను చాటుతామని నేతలు ముందుకు సాగుతున్నారు. ఈసారి పురపాలికల్లో జనసేన, బీఎస్పీ సైతం పలు వార్డులో పోటీ చేస్తోంది. కాంగ్రెస్–సీపీఐకి కుదరని పొత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–సీపీఐ పొత్తుతో ముందుకు వెళ్లారు. బల్దియా ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పై చివరి వరకు చర్చలు జరిపారు. కానీ పొత్తు కుదరలేదు. దీంతో హుస్నాబాద్లో సీపీఐ నాలుగు వార్డుల్లో తమ అభ్యర్థులను, గజ్వేల్లో నలుగురు, దుబ్బాక చేర్యాలలో ఒక్కరు చొప్పున పోటీ చేస్తున్నారు. మిగతా వార్డుల్లో ఎవరికి మద్దతు తెలుపుతారో ఇంకా ప్రకటించలేదు. చేర్యాలలో పొత్తు చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్–సీపీఎం పొత్తుతో పోటీ చేస్తున్నారు. 12 వార్డులుండగా అందులో 11 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో సీపీఎం పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 3వ వార్డును కేటాయించగా లావణ్య అనే మహిళ పోటీ చేస్తున్నారు. మిగతా గజ్వేల్, దుబ్బాకలలో చర్చలు జరిపారు. రెండు చోట్ల బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించి... పొత్తుకు ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగానే.. తమకు బలం ఉన్న చోట సీపీఎం పోటీ చేస్తోంది. దుబ్బాకలో 12, 15, 17 వార్డుల్లో, గజ్వేల్లో ఒక చోట పోటీ చేస్తున్నారు. చేర్యాలలోనే బీఆర్ఎస్–సీపీఎం పొత్తు మిగతా మున్సిపాలిటీల్లో ఒంటరిగా బరిలోకి.. సీపీఐ సైతం 10వార్డుల్లో పోటీ -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్రనగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతికి, అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఖాళీలు ఉన్న సీట్లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల్గిన విద్యార్థులు ఈ నెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్. ఎస్ఐ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి దుబ్బాకటౌన్: ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి, గువ్వలేగి, గోవిందాపూర్, పోసానిపల్లి,గొడుగుపల్లి, మల్లేశంపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషనల్ లీటరసీ స్టడీ జాతీయస్థాయి సర్వేకు సంబంధించిన పరీక్ష కోసం విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. విద్యార్థులతో ఆంగ్లం పాఠాలు చదివించి గణితంలో సమస్యలు చేయించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులందరికీ మాదిరి పరీక్షలు నిర్వహిస్తూ జాతీయస్థాయి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కనకరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్యాన్సర్ను జయిద్దాం ● ప్రారంభ దశలో గుర్తిస్తేనే మేలు ● జిల్లా న్యాయమూర్తి సంతోశ్కుమార్ సిద్దిపేటకమాన్: క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని జయించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోశ్కుమార్ అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్యాన్సర్లో 200 రకాలు ఉంటాయని తెలిపారు. క్యాన్సర్ వచ్చినపుడు మనిషి మానసికంగా, దృఢంగా ఉన్నప్పుడే వ్యాధిని జయించవచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదని, మహిళలు ముందు వారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బావుంటుందన్నారు. గుట్కా, సిగరెట్టు, తంబాకు, వాడే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సదానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రంలోనే విక్రయించండి
గజ్వేల్రూరల్: కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీఓ (జిల్లా సహకార అధికారి) వరలక్ష్మి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.8వేలను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రఘోత్తంరెడ్డి, ఏఎంసీ సెక్రటరీ జాన్వెస్లీ, అధికారులు బాలయ్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు డీసీఓ వరలక్ష్మి -
గజ్వేల్ బీఆర్ఎస్లో ఉత్కంఠ
గజ్వేల్: మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20వార్డులకుగానూ అభ్యర్థులను ఖరారు చేసి భీ–ఫాంలను సైతం అందజేసింది. ఈ విషయాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ముదిరాజ్ విడుదల చేశారు. 20వార్డులకుగానూ 19మంది అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, 18వార్డు విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో మైస కనకమ్మ(1వవార్డు), గాడిపల్లి కల్యాణి(02), కోట కిశోర్(03), రొట్టెల శ్రీనివాస్(04), అన్నపూర్ణ(05), పేర్ల సిద్దేశ్వరీ(06), మన్నెం శశిధర్రెడ్డి(07), కేతావత్ ఆంజనేయులు(08), లింగంపల్లి హరికుమార్(09), కొమ్ము చంద్రశేఖర్(10), పిట్ల రత్నమ్మ(11), దామరంచ దయాకర్రెడ్డి(12), పల్పునూరి కల్పన(13), మామిండ్ల రేణుక(14), మౌనిక(15), పుష్పలత(16), నాగులపల్లి కవిత(17), నాయిని సందీప్కుమార్(19), ఉప్పల మధుసూదన్ గుప్తా(20వ వార్డు) ఉన్నారు. వీడని సస్పెన్స్ బీఆర్ఎస్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా.. అధికారికంగా వారి పేర్లను ప్రకటించలేదు. కొన్ని వార్డుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నది. రెబెల్స్ బుజ్జగించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి వారి సమక్షంలోనే అధికారిక అభ్యర్థులకు భీ–ఫాంలను అందజేసి గెలుపునకు వారి సహకారం తీసుకోవాలనే ఆలోచనతో ముందుకుసాగుతున్నట్లు పార్టీ వర్గాల తెలిసింది. ఏదీఏమైనా కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రకటించి భీ–ఫాంలను కూడా అందజేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సంపూర్ణం -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
దుబ్బాకటౌన్: ‘విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?.. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని’ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకే కూర, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడేలా వంటలు చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మెనూ తప్పక పాటించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లో కలుపు తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందించే సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫార్మసీ స్టోర్, ఇంజక్షన్ గదులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరి గజ్వేల్రూరల్: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని కలెక్టర్ హైమావతి కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలోగల కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. విద్యార్థులందరికీ సరిపడా భోజనాన్ని రుచికరంగా వండి అందించాలని సూచించారు. భోజనం చేసే సమయంలో అన్నం, కూరలను విద్యార్థుల వద్దకే వెళ్లి వడ్డించాలన్నారు. సౌకర్యాల కల్పన, నాణ్యతలో రాజీ వద్దని, విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్పాలని కేజీబీవీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ‘మధ్యాహ్న భోజనం’పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ హైమావతి -
కేసీఆర్, హరీశ్రావు దిష్టిబొమ్మల దహనం
గజ్వేల్రూరల్: అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఫోన్ ట్యాపింగ్ అంశంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిష్టిబొమ్మలను అహ్మదీపూర్లో దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, మల్లేశం, అంజాగౌడ్, రామాగౌడ్, బాల్రాజుగౌడ్లు మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలకు అంతేలేదన్నారు. తప్పు చేస్తే ఎవరికై నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయడం అతి నీచమైనదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అందరూ మెచ్చే బడ్జెట్పై విమర్శలా?
గజ్వేల్: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చే బడ్జెట్ను ప్రవేశపెడితే.. కేటీఆర్, హరీశ్రావులకు కనపడకపోగా, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిండ్రు, ఇప్పటికై నా ఏదీ పడితే అది మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం ఏడు హై స్పీడ్ రైళ్లు ఇస్తే...అందులో తెలంగాణకు మూడు కేటాయించారని, అదేవిధంగా గతంతో పోలిస్తే రోడ్లకు అత్యధికంగా నిధులు వచ్చాయన్నారు. సిట్ దర్యాపును సమర్థవంతంగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్రావు ఆగ్రహం గజ్వేల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
సైనిక దుస్తులతో వచ్చి.. బోధించి
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ సైనిక దుస్తులతో వచ్చి బోధించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన ‘హోమ్ దే బ్రౌట్ హర్ వారియర్ డెడ్’ అనే పద్యాన్ని స్కిట్ రూపంలో బోధించారు. (యుద్ధంలో చనిపోయిన భర్త మృతదేహాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోవడం.. తన బిడ్డ కోసం బతకాలనే ఆశతో కన్నీరు పెట్టడం ఈ పద్యం సారాంశం.) పాఠశాలలో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా బోధించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అభ్యాసంపై ఆసక్తి పెంచాలనే ఇలాంటి స్కిట్లను బోధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ను ఎంఈఓ మహతిలక్ష్మి, హెచ్ఎం శ్రీరాములు అభినందించారు.


