breaking news
Siddipet District News
-
ఎన్నికల ఖర్చుపై నిఘా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. అలాగే ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు కూడా ఓ లెక్క ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఐదు వేల జనాభా లోపు ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షల లోపు అలాగే వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30 వేల లోపు ఉండాలి. మరోవైపు ఐదు వేలకు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి ఖర్చు రూ.50 వేలు ఉండాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెబుతోంది. ఖర్చు చేసే ప్రతీ రూపాయి బ్యాంకు లావాదేవీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజుకంటే ఒకరోజు ముందుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ ఎన్నికల ఖర్చు వివరాలను తెలపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిశీలకుల నియామకం స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టేందుకు మండల స్థాయిలో సహాయక పరిశీలకులను (అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు) నియమించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులను ఈ పరిశీలకులుగా నియమించారు.లెక్కలు తప్పనిసరిస్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓ స్థాయిలో ఖర్చు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణీకరణ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉంటుంది. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు, క్యాప్లు, టీషర్టులు వంటి ఖర్చులు ఉంటాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు సమావేశాలు సైతం నిర్వహిస్తుంటారు. ఎన్నికల ప్రచారానికి వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలా అభ్యర్థులు తాము పెట్టే ఎన్నికల ఖర్చుకు లెక్కలు చూపాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం ‘సాక్షి’తో పేర్కొన్నారు.జెడ్పీటీసీకి రూ.4 లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు అభ్యర్థులు వెచ్చించే వ్యయంపై పరిమితులు మండలస్థాయిలో సహాయక పరిశీలకులు అభ్యర్థులు ఎంసీసీని పాటించాలంటున్న అధికారులు -
విజయం.. భవ్యం
సాక్షి, సిద్దిపేట: ‘చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలన్నది లక్ష్యం.. 2024లో సివిల్స్లో క్వాలిఫై కాలేకపోయా.. అదే సమయంలో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. దీంతో దరఖాస్తు చేశా.. రోజుకు 10గంటలు పట్టుదలతో చదివి 9వ ర్యాంక్ సాధించా’ అని సిద్దిపేట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ కుడికాల భవ్య అన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకుని సిద్దిపేటకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం భవ్యను ‘సాక్షి’ పలకరించింది. సివిల్స్ కోసం హైదరాబాద్లో ఉదయం వేళ కోచింగ్కు, తర్వాత 10 గంటల పాటు చదివాను. అలా ఏడాదిన్నర పాటు ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ అనేది 50శాతమే ఉపయోగపడుతుంది. మిగతాది కోచింగ్ సెంటర్లో చెప్పిన అంశాలను ప్రిపేర్ కావాలి. గ్రూప్–1 నోటిపికేషన్ రాగానే మూడు నెలల పాటు రోజూ 10 గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. వారంలో ఆరు రోజులు ఒక సబ్జెక్ట్ చొప్పున చదివాను. నేను చదివిన దానిలో నుంచి ప్రశ్నలు తయారు చేసుకుని వాటిని జవాబులు రాయడం చేశాను. ఇలా చేయడంతో మనం ప్రిపేర్ అయిన దానికి ఎంత రాయగలుగుతున్నామో అర్థమవుతుంది. మాది వరంగల్ జిల్లా ఏకశిలానగర్. మా నాన్న పేరు కుడికాల వెంకటేశ్వర్లు. అమ్మ పేరు చాయా. మా అమ్మానాన్న, అక్క ప్రోత్సాహంతో గ్రూప్–1 సాధించాను. డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ పూర్తి అయ్యాక.. పూర్తి స్థాయిలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అవుతాను. ప్రతీ రికార్డు డిజిటలైజేషన్ ముఖ్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు, పాలసీలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవాలి సివిల్స్ అయినా.. గ్రూప్స్, బ్యాంక్ పరీక్షలు ఏవైనా ఏ అంశాలు ఉంటాయో ముందుగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన బుక్స్ తెచ్చుకుని చదవాలి. అలాగే ఒక మెంటర్, గైడ్ను ఏర్పాటు చేసుకోవాలి. చదవడం పోటీ పరీక్షల్లో ఒక వంతు అయితే, దానిని రాయడం మరో ఎత్తు. అందుకోసం ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్మార్ట్గా వర్క్ చేయాలి. చాట్ జీపీటీ, ఏఐ ఇలా వాటిని ఉపయోగించి స్టడీస్కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. కొంత మంది పరీక్షల్లో మంచి ర్యాంక్ రాకపోతే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వారు ఎమోషనల్గా పరీక్షను చూస్తారు. అలా చూడటం వల్ల మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కటే జీవితం కాదు. ఒక పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.పట్టుబట్టి.. ఉన్నత కొలువు కొట్టి -
వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం
కలెక్టర్ హైమావతిప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రపంచం ఉన్నంత వరకు వాల్మీకి చరిత్ర ఉంటుందని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందన్నారు. ఇతిహాసాల్లో మొదటిది రామాయణం, పెద్దది మహాభారతం అన్నారు. వాల్మీకి ఇచ్చిన స్ఫూర్తితో అనేక మంది రచయితలుగా, కవులుగా మారారన్నారు. ఇలాంటి గొప్ప వారి చరిత్రల గురించి తెలుసుకోవడం నేటి తరానికి చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు. -
జ్వర సర్వేను నిర్వహించండి
డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటకమాన్: క్షేత్ర స్థాయిలో జ్వర సర్వేను నిర్వహించి రక్త నమూనాలు సేకరించి తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. నాసర్పూర అర్బన్ పీహెచ్సీ, అంబేడ్కర్ నగర్ యుపీహెచ్సీని డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, పాటించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలైన్ పనుల పరిశీలన
చిన్నకోడూర్(సిద్దిపేట): మండల పరిధిలోని గంగాపూర్ శివారులో రైల్వేలైన్ నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైల్వే లైన్ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. దీంతో రైల్వే లైన్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. పనులను అడ్డుకోవడం సరైందికాదన్నారు. నష్ట పరిహార విషయాన్ని తహసీల్దార్, ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన బాధితులందరికీ తప్పనిసరిగా పరిహారం అందేలా చూస్తామంటూ హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ సలీం, రైతులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే
● ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ ● మంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం ● అడ్డుకున్న పోలీసులు హుస్నాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇంజం వెంకట్స్వామి మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ చాలా సున్నితమైన, విశాలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. అలాంటి నాయకుడని పరుష పదజాలంతో ధూషించడం పొన్నం దూకుడు స్వభావానికి తార్కాణమని అన్నారు. -
మెరుగైన సేవలే లక్ష్యం కావాలి
● నూతన సీపీ విజయ్కుమార్ ● బాధ్యతల స్వీకరణసిద్దిపేటకమాన్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలే లక్ష్యంగా సేవలు అందించాలని నూతన పోలీస్ కమిషనర్గా విజయ్కుమార్ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను సందర్శించి, పోలీసు అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి టీం వర్క్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.వైద్యం వివరాలు నమోదు చేయండి కొండపాక(గజ్వేల్): రోజువారీ వైద్యం అందించే వివరాలను, మందుల స్టాక్ను రిజిస్టరులో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్, పరీక్షల తీరును, మందుల స్టాక్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రాపిడ్ టెస్టులను తప్పనిసరిగా చేయాలన్నారు. టెస్టుల వివరాలను రిజిస్టరులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రహదారి వెంట ఉండే ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 108 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫోన్ ద్వారా సూచించారు. కార్యక్రమంలో వైద్యులు ఫర్విన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలి ప్రశాంత్ నగర్ (సిద్దిపేట): అమ్మవారి దయవల్ల అందరం క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో దేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్ని అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రస్తుతం రహదారులు తదితర అభివృద్ధి పనులన్నీ పడకేశాయని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలన్నీ విస్మరించారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మానవ అక్రమ రవాణాను అరికడదాంప్రశాంత్నగర్(సిద్దిపేట): మానవ అక్రమ రవా ణా నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ సెల్ కోఆర్డినేటర్ ముండ్రాతి రమేశ్ అన్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరై న రమేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవా ణా.. అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ వారికి అవగా హనా కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో పజ్వల స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సురేశ్కుమార్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలి రాజ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన సీపీసిద్దిపేటకమాన్: నూతన పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ సోమవారం కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. -
స్థానికంపై ఫోకస్
అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఆశావహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. మరోవైపు ఆశావహులపై క్షేత్రస్థాయిలో సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్ పీఠాలను కై వసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. –సాక్షి, సిద్దిపేట స్థానిక సంస్థల బరిలో దిగే అభ్యర్థుల ఎంపికలపై అధికార పార్టీ వేగం పెంచింది. ఇదివరకే మండలాల వారీగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఒక్కో జెడ్పీ స్థానం నుంచి మూడు పేర్లతో కూడిన జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యే, మంత్రి అందరూ కలిసి ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్కు అందజేశారు. రిజర్వేషన్కు అనుగుణంగా ఉపకులాలవారికి అవకాశం కల్పిస్తూ శాసన సభ నియోజకవర్గాలవారీగా జాబితాను రూపొందించారు. మరోవైపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దానిపై క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తోంది. ఆ సర్వేల ఆధారంగా అభ్యర్థులను పార్టీ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో ఇన్చార్జి మంత్రి వివేక్ చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఎంపికలో బీఆర్ఎస్ నిమగ్నం జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది. 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 23 స్థానాలకు గాను 22 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీ చైర్పర్సన్ పీఠం బీఆర్ఎస్కు దక్కింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా, ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీలను, ఎంపీపీ, ఎంపీటీసీలను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఎంపికలు పూర్తి చేయాలని పార్టీ నిర్దేశించడంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమయ్యారు. -
ఎన్నికలకు సిద్ధం కండి
బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్గజ్వేల్రూరల్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎన్వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. గజ్వేల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, స్థానిక సంస్థలలో పోటీచేసే ఆశావహులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శ్రేణులంతా ఐక్యంగా కృషిచేయాలన్నారు. అధిష్టానం ఎవరిని సూచించినా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీజేఐపై దాడి హేయమైన చర్య
గజ్వేల్: సీజేఐపై దాడి చేయడం హేయమైన చర్య అని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం సాయంత్రం గజ్వేల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ నాయకుడు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పొన్నాల కుమార్, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు పోశయ్య, భిక్షపతి పాల్గొన్నారు. వైన్షాపులకు 9 దరఖాస్తులు సిద్దిపేటకమాన్: జిల్లాలోని వైన్ షాప్ల నిర్వహణ (2025–27)కు ఇప్పటి వరకు తొమ్మిది దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు సోమవారం రోజే 8 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో హుస్నాబాద్ పరిధిలో 6, చేర్యాల పరిధిలో 1, సిద్దిపేట పరిధిలో 2 దరఖాస్తులు వచ్చాయని వారు వివరించారు. ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి గజ్వేల్రూరల్: ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. సమాచార హక్కుచట్టం వచ్చి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 5 నుంచి 12వరకు జరుగుతున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారం డీబీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ(ఏటిగడ్డ కిష్టాపూర్)లో ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటాడన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వాల పనితీరులో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. అలాగే సులభంగా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల అవినీతిని అరికట్టేందుకు ముఖ్య సాధనమన్నారు. లిఖితపూర్వకంగా సమాచారాన్ని కోరుతూ పౌరులు అభ్యర్థన చేయాలని, సాధారణ సమాచారాన్ని 30రోజుల్లో, అత్యవసర సందర్భాల్లో 48గంటల్లోగా అందించాల్సి ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పౌరులు రాజునాయక్, కుమార్, మల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజ రుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి సోమవారం రూ.18,400 జరిమానా, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. గొర్రెలకు టీకాలు దుబ్బాకరూరల్: మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో కొన్ని రోజులుగా వింత వ్యాధి సోకి మూగజీవాలు మరణిస్తుండటంతో పశువైద్యాధికారులు వైద్యశిబిరం నిర్వహించారు. సోమవారం గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం
జగదేవ్పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇళ్లు పేదలందరికి అందిస్తామని, సంక్షేమ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో సోమవారం లబ్ధిదారులు కవిత, నర్సింలు దంపతులు గృహప్రవేశం చేశారు. నర్సారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. లింగారెడ్డిపల్లిలో 70 ఇళ్లు మంజూరు కాగా 23 ఇళ్ల నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోనే మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. గజ్వేల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ ● ఎన్నికల సిబ్బందికి చివరి విడత శిక్షణ సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు రిటర్నింగ్ అధికారుల బాధ్యత చాలా ముఖ్యమైనదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న చివరి విడత శిక్షణలో అధికారులు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కరదీపికను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను మొదలుకొని కౌంటింగ్ వరకు తప్పులు లేకుండా సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించాలన్నారు. నామినేషన్ల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థితో కలిపి ముగ్గురితో పాటు ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్ బందోబస్తు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిబంధనలను తెలపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకీదేవి, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి టెండర్
సీసీఐ కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొంది. కేంద్రాల నిర్వహణలో కొత్త నిబంధనల వల్ల తాము నష్టపోయే అవకాశముందని, పాత విధానంలోనే కొనుగోళ్లు చేపడతామంటేనే తాము టెండర్లలో పాల్గొంటా మని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8తో గడువు ముగియనుంది. ప్రభుత్వ చొరవపైనే కేంద్రాల ఏర్పాటు అంశం ఆధారపడి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో పది రోజుల్లో పత్తి మార్కెట్లోకి వచ్చే అవకాశముండగా, కేంద్రాలను ప్రారంభించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట జిల్లాలో ఈసారి 1,07,243 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ఇక్కడ 10 లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా. మెదక్ జిల్లాలో 34,751 ఎకరాల్లో పత్తి సాగులోకి రాగా 4.17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 3.48 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకిరాగా ఇక్కడ 25లక్షల క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తాయని మార్కెటింగ్ శాఖ అంచనావేస్తోంది. మూడు జిల్లాల్లో కలుపుకుని సుమారుగా 40 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏటా 50కిపైగా జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. సీసీఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరం గతంతో పోలిస్తే సీసీఐ ఈసారి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కొత్త నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించింది. ఇందులోభాగంగానే కేంద్రాలు నిర్వహించే ప్రాంతంలో...ఆ ప్రాంతానికి సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొనుగోలు చేయవద్దని సూచించింది. మరోవైపు సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను ఎల్1, ఎల్2 పేరిట రెండు కేటగిరీలుగా విభజించి ఎల్1 కేంద్రాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నది. ఇక కొనుగోళ్లకు తప్పనిసరిగా ‘కాపాస్ కిసాన్ యాప్’ను వాడాలని స్పష్టం చేసింది. తేమ శాతం 12కంటే ఎక్కువగా ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదని చెబుతూ తరుగు శాతం గతంలో 1.70% ఉండగా, దానిని సగానికి కుదించారు. ఈ నిబంధనలు తమకు గుదిబండగా మారాయని, గతంలో మాదిరిగానే కొనుగోళ్లను కొనసాగిస్తామంటేనే తాము టెండర్లలో పాల్గొని, సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా యాజమాన్యాల నుంచి స్పందన లేకపోగా మూడోసారి పిలిచిన టెండర్లకు ఈనెల 8న తుది గడువుగా విధించారు. మరో పది రోజుల్లో పత్తి ఉత్పత్తులు మార్కెట్ బాట పట్టే అవకాశముండగా, ఆలోగా కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు తప్పవనే పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చొరవపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.నిబంధనలు మారిస్తేనే టెండర్లలో పాల్గొంటాం కొత్త నిబంధనలు అమలు చేయకుండా, గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపడితే సీసీఐ టెండర్లలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. సోమ వారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సమావేశం ఉంది. ఇందులో చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నాం. –జిల్లా శ్రీనివాస్– అధ్యక్షుడు, ఉమ్మడి మెదక్ జిల్లా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం -
ప్రయాణికుల రద్దీతో పాట్లు
కిక్కిరిసిన బస్టాండ్లు ● సెలవులు ముగియడంతో తిరుగు పయనం ● స్పెషల్ సర్వీసుల పేరిట ఆర్టీసీ అదనపు చార్జీల వసూలు సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండగ వరుస సెలవులు ముగియడంతో ప్రజలు తమ సొంతూరు నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండడంతో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అదనపు ట్రిప్పులు సిద్దిపేట పట్టణంలోని మోడ్రన్ బస్టాండ్, న్యూబస్టాండ్ నుంచి ప్రతి నిత్యం వేల మంది ప్రయాణికులు జేబీఎస్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల, రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణిస్తుంటారు. సెలవు దినాల్లో, పండగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. సిద్దిపేట డిపోలో 53 ఆర్టీసీ, 53 అద్దె బస్సులతో కలిపి మొత్తం 106 బస్సులు వివిధ రూట్లలో అధికారులు తిప్పుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో 77 బస్సులు, దుబ్బాక డిపోలో 38 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 40 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. పండగ రోజుల్లో 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నారు. దసరా పండగకు ఆర్టీసీ సిద్దిపేట డిపోకు రూ.1.5కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా, పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు బతుకమ్మ, దసరా పండగ సెలవులు ముగియడంతో తమ సొంతూర్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా ఆదివారం 50 నుంచి 60 ట్రిప్పులు అదనంగా నడిపాం. ఆర్టీసీ అదికారులు, సిబ్బంది బస్టాండ్లో దగ్గర ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. – రఘు, డిపో మేనేజర్ -
ఏడుపాయల జనసంద్రం
50 రోజులుగా జలదిగ్బంధంలో దుర్గమ్మఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 50 రోజులుగా ఏడుపాయల మంజీరా వరదల్లో చిక్కుకుంది. ఆదివారం వరదలు తగ్గడంతో సిబ్బంది ఆలయంలోకి వెళ్లారు. భారీ స్థాయిలో వచ్చిన వరదలతో ప్రసాదం షెడ్డు కొట్టుకుపోయింది. గర్భగుడిలోని గ్రిల్స్, రేకులు, జాలీ ధ్వంసం కాగా, మండపంలోని గ్రానైట్ బండలు, టైల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఆలయ ప్రాంగణం మొత్తం పాకురుతో నిండిపోయింది. – పాపన్నపేట(మెదక్) -
భక్తజన సందోహం మల్లన్న ప్రాంగణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్నాలు వేసి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించారు. స్వామివారి నిత్యాన్నదానానికి కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామానికి చెందిన భక్తులు రాపల్లి మహేశ్ దివ్య దంపతులు ఆలయ ఈఓకు రూ. 1,00,116లు విరాళంగా అందించారు. ఆలయ ఈఓ వెంక టేశ్, ఏఈఓ శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహా దేవుని మల్లికార్జున్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పద్మశాలీ సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలీ సంఘం ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక పద్మశాలీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు టి.రాజు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 7 నుంచి 8వ తేది సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, 11న ఎలక్షన్ కమిటీ సమావేశం, అదే రోజు అభ్యర్థుల ప్రకటన, 13న డమ్మీ బ్యాలెట్ పత్రాల విడుదల, 19న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు గెలిచిన అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలీ సంఘం నాయకులు రాజారామ్, రాజేశం, గాడిపల్లి శ్రీనివాస్, అనూప్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడులు అమానుషంఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గజ్వేల్: దళితులపై దాడులు సహించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. జగదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లిలో దాడికి గురై గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు మహిపాల్ను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడికి గల కారణాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. పాత కక్షలు, భూతగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దాడులకు తెగబడటం సరికాదన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోన్లో ఆదేశించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, దళిత ఉద్యోగుల వేదిక నాయకులు సత్యనారాయణ, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. కొండపోచమ్మకు ఎమ్మెల్యే గణేశ్ పూజలు జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని కొండపోచమ్మతల్లిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పండుగ తర్వాత ఆదివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుజోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్చార్జిలు దేశ్పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పారదర్శకంగా వాహనాల తనిఖీలు
కలెక్టర్ హైమావతి బెజ్జంకి(సిద్దిపేట): వాహనాలను అత్యంత పారదర్శకంగా తనిఖీ చేయాలని కలెక్టర్, ఎన్నికల ఇన్ఛార్జి హైమావతి సూచించారు. మండలంలోని తోటపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం వాహనాల తనిఖీ నమోదు రిజిస్టర్ను పరిశీలించి తనిఖీ ప్రక్రియను వీడియో తీయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బంది గైర్హాజర్పై ఆగ్రహం బెజ్జంకితోపాటు పీహెచ్సీని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ఈ సమయంలో స్టాఫ్నర్స్ పద్మ మినహా సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం సిబ్బంది వైఖరిపై డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. తప్పనిసరిగా డ్యూటీలో ఉండేలా సూచించారు. విధుల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయనున్నట్లు కలెక్టర్ కె.హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ ముగిసేంత వరకు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి దృష్ట్యా ఎవరూ కలెక్టరేట్కు రావద్దని సూచించారు. -
వాస్తు మార్చినా వేటు తప్పలే!
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వివాదంలో చిక్కుకుని బదిలీ అవుతున్నారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ మధ్య వివాదంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారించిన అధికారులు ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డిని సస్పెండ్ చేసి ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎంపీఓ సత్యనారాయణ కూడా అధికారుల మధ్య వివాదంతోనే సస్పెండ్ అయ్యారు. హుస్నాబాద్కు పోస్టింగ్ తీసుకోవడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని నూతనంగా నిర్మించి 2019 జూన్లో ప్రారంభించారు. కార్యాలయంలో ఎంపీడీఓ, ఎంపీపీల చాంబర్స్ విషయంలో అప్పటి ఎంపీడీఓ రాము, ఎంపీపీ మధ్య వివాదం తలెత్తడంతో ఎంపీడీఓను బదిలీ చేయించారు. తర్వాత జయశీల వచ్చిన కొద్ది రోజులు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిపోయారు. సత్యశ్రీ ఎంపీడీఓగా వచ్చిన అధికారుల మధ్య విభేదాలతో ఆమెను నంగునూరుకు బదిలీ చేయించారు. ఎంపీడీఓగా కుమారస్వామికి పోస్టింగ్ ఇస్తే ఏడాది పాటు విధులు నిర్వహించిన ఆయనపై కూడా మండల పరిషత్ సిబ్బంది ఎంపీపీకి తప్పుడు సమాచారం ఇచ్చి వివాదాలు సృష్టించి బదిలీ చేయించారు. ఆ తరువాత ఎంపీడీఓగా అనిత బాధ్యతలు స్వీకరించి పరిపాలనపై పట్టు బిగిస్తున్న సమయంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయించి మరీ బదిలీ చేయించారు. కొద్ది రోజులు కోహెడ సూపరింటెండెంట్ రాఘవేంద్ర రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎంపీడీఓల బదిలీల్లో హన్మకొండ జిల్లా నుంచి వేణుగోపాల్ రెడ్డి హుస్నాబాద్కు బదిలీపై వచ్చాడు. ఎంపీపీల పాలన ముగిసిన వెంటనే అందరూ వివాదాలతో బదిలీ అవుతున్నారని ఎంపీడీఓ చాంబర్ను ఎంపీపీ గదికి మార్చుకొని పరిపాలన సాగించాడు. అంతర్గత విభేదాలపై ఫిర్యాదులు ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే అధికారుల మధ్య అంతర్గత విభేదాలతోనే ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సస్పెండ్ అయినట్లు తెలిసింది. వాస్తు లేదని ఎంపీడీఓ చాంబర్ను మార్చిన అధికారికి అపవాదు తప్పలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. హుస్నాబాద్ ఎంపీడీఓగా ఎంపీఓ రమేశ్కు పూర్తి బాధ్యతలు అప్పగించి, ఎంపీఓ బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ రవీందర్రావుకు అప్పగించారు. కార్యాలయం నిండా సిబ్బంది ఉన్న అధికారులు ఎవరూ సమయానికి విధులకు రాకపోవడం, విధులకు వచ్చినా వ్యక్తిగత పనులపై బయటే ఎక్కువ సమయం కేటాయిస్తారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు.. ఆరుగురు బదిలీ -
సమయపాలన పాటించాలి
● వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశం ● డుమ్మాకొట్టిన మీర్జాపూర్ సిబ్బందిపై ఆగ్రహంఅక్కన్నపేట(హుస్నాబాద్)/హుస్నాబాద్రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం ఆమె అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్ఎస్టీ శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలు, మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే.. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో ఎస్ఎస్టీ శిబిరంలో రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలో వీడియో రికార్డు చేయాలన్నారు. మీర్జాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఒక ఉద్యోగి మినహా అందరూ గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. -
ఎన్నికల వేళ.. జంపింగ్ల మేళా
జోరుగా రాజకీయ వలసలు ● పార్టీలు మారుతున్న నాయకులు ● రెండు నెలలుగా సాగుతున్న పరంపరమెదక్జోన్: Ý린MýS çÜ…çܦÌS G°²-MýSË$ çÜÒ$í³-çÜ$¢¯]l² Ðólâýæ hÌêÏÌZ f…í³…VŠæ ´ëÍ-sìæMŠSÞ gZÆý‡…-§ýl$-MýS$¯é²Æ‡$$. Æð‡…yýl$ ¯ðlÌS-Ë$V> D ç³Æý‡…ç³Æý‡ ÝëVýS$-™èl*¯ól E…¨. Ýë«§é-Æý‡×æ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ Ððl¬§ýl-Ë$-Mö° °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y, Ð]l$…yýl-ÌSÝë¦Æ‡$$ ¯éĶæ$-MýS$ÌS Ð]lÆý‡MýS$ ´ëÈ-tË$ Ð]l*Æý‡$-™èl$-¯é²Æý‡$. D Ð]lÅÐ]làÆý‡…ÌZ ½BÆŠḥG‹Ü, M>…{VðS‹ÜË$ §ýl*MýS$yýl$V> Ð]lÅÐ]lçß ÇçÜ$¢¯é²Æ‡¬. VýS™èl AòÜ…½Ï G°²-MýSÌS çÜÐ]l$-Ķæ$…ÌZ Ððl$§ýlMŠS GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l# Ððl¯]l²…sìæ E¯]l² Ķæ¬Ð]l-¯ól™èl iÐ]l-¯ŒS-Æ>Ð]l#, Æ>Ð]l*-Ķæ$…õ³r Ð]l*i Ð]l*Æð‡PsŒæ MýSÑ$sîæ O^ðlÆý‡Ã¯ŒS VýS…V> ¯]lÆó‡…-§ýlÆŠ‡ ĶæÊrÆŠ‡² ¡çÜ$-Mö° Æð‡…yýl$ ¯ðlÌSÌS {MìS™èl… ½B-ÆŠ‡-G‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. Aç³µsZÏ hÌêÏÌZ C¨ àsŒæ-sê-í³MŠSV> Ð]l*Ç…-¨. ©°MìS Mú…r-ÆŠ‡V> GÐðl$ÃÌôæÅ Æøíßæ-™Œæ-Æ>Ð]l#, M>…{VðS‹Ü Æ>çÙ‰ ¯ól™èl OÐðl$¯]l…ç³-ÍÏ çßæ¯]lÃ…-™èl-Æ>Ð]l# hÌêÏÌZ ¿êÈ ºíßæ-Æý‡…VýS çÜ¿ýæ¯]l$ HÆ>µ-r$-^ólÔ>Æý‡$. ï³ïÜïÜ `‹œ Ð]l$õßæ-ÔŒæ-MýS$-Ð]l*-ÆŠ‡VúyŠæ, hÌêÏ C¯ŒS-^é-Çj Ð]l$…{† ÑÐól-MŠS¯]l$ Bà-Ó-°…-^éÆý‡$. D çÜ¿ýæÌZ °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y…ÌZ° ç³Ë$ Ð]l$…yýl-ÌêË$, {V>Ð]l*-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l*i çÜÆý‡µ…-^Œl-ÌS™ø ´ër$ ½B-ÆŠ‡-G‹Ü, ½gôæ-ï³ÌS ¯]l$…_ M>Æý‡Å-MýSÆý‡¢Ë$, ¯ól™èlË$ ò³§ýlª-G-™èl$¢¯]l M>…{VðS‹Ü ¡Æý‡¦… ç³#^èl$a-MýS$-¯é²Æý‡$. ÐéÇ™ø ´ër$ {ç³Ð]l¬Q çÜ…çœ$ õÜÐ]lMýS$yýl$ ÎÌê {VýS*‹³ O^ðlÆý‡Ã¯ŒS Ððl*çßæ-¯ŒS-¯éĶæ$-MŠS¯]l$ M>…{VðS-‹Ü-ÌZMìS Bà-Ó-°…-^éÆý‡$. అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు రెండు రోజుల క్రితం అధికార పార్టీకి గుడ్బై చెప్పి ఎమ్మె ల్యే సునీతారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇటీవల యూరియా కొరతతో పాటు స్థానికంగా ఉన్న నేతలతో పొసగకపోవటమేనని తెలుస్తోంది. పెద్దశంకరంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేత మురళి (పంతులు) ఇటీవల ఆ పార్టీని వీడారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు మరో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీతో పాటు ఆ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం జనరల్ మహిళాకు రిజర్వేషన్ కావటంతో ఆయన అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పాపన్నపేట మండల పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్లీ బీజేపీ వైపు పంజా చూపు! -
గజ్వేల్లో ఆర్ఎస్ఎస్ కవాతు
గజ్వేల్రూరల్: ప్రతి ఒక్కరూ దేశ, దైవ భక్తిని కలిగి ఉండాలని, అలాగే.. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహాఇంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ విధానాలను తీసుకెళ్లాలని సూచించారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరముందని, అందరు విధిగా కుటుంబ విలువలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మంద సాయినాథ్రెడ్డి, సామాజిక సమస్త విధిగా ప్రాంత అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్బాబు పాల్గొన్నారు. -
అమ్మవారి కృపతో అందరూ చల్లగా ఉండాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుర్గామాత కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే మంచి సంస్కృతి ,సాంప్రదాయాలు తరాల నుంచి వస్తుందన్నారు. భక్తి భావంతో పాటు ప్రజలు ఐకమత్యంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యంజాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి గజ్వేల్రూరల్: బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. గజ్వేల్కు చెందిన యాదగిరి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా శనివారం హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సంద ర్భంగా గజ్వేల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరమవుతున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమన్నారు. వారిని చైతన్యం చే స్తూ సంఘటిత పోరాటం చేస్తామని పేర్కొన్నా రు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు. మహిళల రక్షణే ప్రధాన కర్తవ్యం: సీపీ అనురాధసిద్దిపేటకమాన్: మహిళల రక్షణే షీటీమ్ ప్రధాన కర్తవ్యమని పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో షీటీమ్ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో షీటీమ్స్ గత నెలలో 49మంది ఈవ్ టీజర్లను పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా హాట్స్పాట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసి 53 ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలను ఎవరైనా వేధిస్తే డయల్ 100 లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 8712667434కు ఫోన్ చేయాలని సూచించారు. మద్యం షాప్లకు మొదటి దరఖాస్తుసిద్దిపేటకమాన్: జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణ (2023–25)కు శనివారం మొదటి దరఖాస్తు వచ్చినట్లు ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాస్ తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 93 వైన్ షాపుల నిర్వహణకు గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈసారి దరఖాస్తుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. 23న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు. జోరు తగ్గిన మంజీరా పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. -
లక్ష్యాన్ని అధిగమించాలి
● ఈ ఏడాది స్లాట్ బుకింగ్ ప్రక్రియ ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నూతన యాప్ కపాస్ కిసాన్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో కొత్తగా యాప్ ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. పత్తి రైతులు తప్పనిసరి కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. సీసీఐ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలు పత్తికి రూ 8,110 ప్రకటించిందని, అది పొందడానికి యాప్లో స్లాట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పత్తి రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులకు మాత్రం వ్యవసాయ విస్తరణ అధికారులు తమ లాగిన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలని సూచించారు. యాప్ నిర్వహణ, మద్దతు ధర తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ రీజినల్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి స్వరూప రాణి, జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాధనం నేలపాలు!
● ఆస్పత్రి విస్తరణ పేరిట పాత భవనాలు కూల్చివేత ● 250 పడకల ఆస్పత్రి కోసమేనంటున్న అధికారులు, పాలకులు ● మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రోగులు, వైద్య పరికరాలు తరలింపు ఒకే ప్రాంగణంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారు. నాటి ఆనవాళ్లు లేకుండా తుడిచి పెట్టుకుపోయాయి. స్థలం కొరతతో ఇదే ప్రాంగణంలో కొత్తగా 250 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని వీటిని కూల్చివేశారు. కాగా ప్రజాధనం వృథా అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు. – హుస్నాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. తరువాత మరో 20 పడకలకు పెంచారు. రోగుల సంఖ్య పెరగడంతో ప్రత్యేక రాష్ట్రంలో ఈ ఆస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ మే, 30, 2017లో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. మొత్తంగా 100 పడకల ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 400 మంది రోగులు వివిధ చికిత్స కోసం వస్తున్నారు. ప్రసవాల సంఖ్యతోపాటు కిడ్నీ రోగులకు డయాలసిస్, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా సాగుతున్నాయి. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు హుస్నాబాద్లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న వంద పడకల ఆస్పత్రిని ప్రభుత్వం 250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసింది. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.82 కోట్లు మంజూరు చేసింది. అయితే.. ఆస్పత్రి నిర్మాణానికి స్థలం సరిపోదని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే ఉన్న వంద పడకల ఆస్పత్రి భవనాలను పూర్తిగా కూల్చివేసి, నూతన ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలింపు ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవల ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా డాక్టర్లు, సిబ్బంది, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రోగులతో పాటు వైద్య పరికరాలను తరలించారు. నూతన భవనం పూర్తి అయ్యే వరకు ఇక్కడే వైద్య సేవలు అందనున్నాయి. -
● గంటన్నరకు పైగా ఏకధాటిగా.. ● జలమయమైన లోతట్టు ప్రాంతాలు
దంచికొట్టిన వాన దుబ్బాక: దుబ్బాకలో శనివారం సాయంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ నీరు రోడ్లపై నుంచి ప్రవహించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. శనివారం దుబ్బాకలో అంగడి కావడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంతో పాటుగా మండలంలోని చాలా గ్రామాల్లో వర్షం కురిసింది. భారీగా వరద నీరు చేరడంతో పంటలకు నష్టం ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎలా చేతికొస్తాయో అన్న ఆందోళనలో ఉన్నారు. -
డైలమాలో ఆశావహులు!
సాక్షి, సిద్దిపేట: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఆశావహుల్లో ఇంకా డైలమా కొనసాగుతోంది. న్యాయపరమైన చిక్కులను దాటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా.?, లేదా అనే చర్చ పల్లెల్లో సాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్పై ఈ నెల 8వ తేదీన హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని బరిలోనే నిలిచే వారు, అధికారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ స్థానం రిజర్వేషన్ గెజిట్ను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. 2018, 2019 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఈ మూడు వర్గాలకు కలిపి 69.21శాతంకు రిజర్వేషన్లు పెరిగాయి. దీంతో 50 శాతానికి మించవద్దని హైకోర్టును పలువురు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. న్యాయస్థానం ఏమి ఆదేశిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మళ్లీ మారుతాయా? అనే చర్చ అన్ని పార్టీల నాయకుల్లో సాగుతోంది. మరోవైపు 9న ఎంపీటీసీ, జెడ్పీటీసీల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. సమాయత్తం కావాలంటున్న పార్టీలు పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతాయని క్షేత్రస్థాయి నాయకులకు అప్రమత్తం చేస్తోంది. ఎన్నికలపై సందిగ్ధతను పక్కనబెట్టి సమాయత్తం కావడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయా పార్టీల ముఖ్యనేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నారు. స్తబ్దుగా ఉంటే ప్రత్యర్థి పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారే ప్రమాదం లేకపోలేదని శ్రేణులు జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు మారితే..? హైకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు మారితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లు ఏవి అన్ రిజర్వ్ (జనరల్), మహిళా అవుతాయో తెలియని పరిస్థితి ఉండగా ,ఆశావహులంతా మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు పోవాలా ? వద్దా అనే అంశంపై తమ సన్నిహితులతో మాట్లాడుకుంటున్నారు. కోర్టు ఆదేశాలతో మార్చాల్సి వస్తే అందుకు సైతం అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశిస్తే మూడు రోజుల్లో మళ్లీ కొత్త రిజర్వేషన్లు మార్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో అందరూ ఆసక్తిగా 8వ తేదీన ఉన్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్పై చర్చ -
దసరాకు కిక్కెంచారు
● రూ.20కోట్ల మద్యం విక్రయాలు ● వరుస సెలవులు, పండుగల నేపథ్యంలో ఎకై ్సజ్కు భారీ ఆదాయం ముందుగానే కొనుగోళ్లు ఈ ఏడాది దసరా పండుగకు మూడు రోజుల్లో జిల్లాలో రూ.20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఆఖరి వారంలో ప్రారంభం కావడం వరుస దసరా సెలవులు రావడంతో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. దసరా రోజునే గాంధీ జయంతి కూడా రావడంతో ఒకరోజు ముందుగానే మద్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. – శ్రీనివాసమూర్తి, సిద్దిపేట, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా వరుస సెలవుల నేపథ్యంలో మందుబాబులు తెగ తాగేశారు. దసరా పండగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందే మద్యం ప్రియులు మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా గత నెల 29, 30, ఈ నెల 1వ తేదీల్లో రూ. 20 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది తో చూస్తే ఈ దసరా పండగా ముందుగా సెప్టెంబర్ నెలాఖరు నుంచే సేల్ ప్రారంభం కావడంతో అదే నెలలో సేల్ వివరాలు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు దసరా పండగను రెండు రోజులు మందు, మాంసంతో విందులు జరుపుకున్నారు. మూడు రోజుల్లో రూ.20కోట్ల విక్రయాలు జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా దసరా పండగకు మూడు రోజుల్లో రూ.20కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో గత నెల 29న 6,907 లిక్కర్ బాక్సులు, 10,445 బీర్ బాక్సులు, 30న 7,632 బాక్సుల లిక్కర్, 9,796 బాక్సుల బీర్లు, ఈ నెల 1న 3,761 బాక్సుల లిక్కర్, 9,686 బాక్సుల బీర్లు విక్రయించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో మద్యం దుకాణాలు మూసి వేసినప్పటికీ ఒక రోజు ముందుగానే అధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో చూస్తే ఈ ఏడాది అధికంగా మద్యం విక్రయాలు జరిగి ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిద్దాం
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ ప్రశాంత్నగర్(సిద్ధిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా మెదక్ ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ...స్థానిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు గెలుపొందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అందుకోసం నాయకులు, కార్యకర్త ప్రజల్లో మమేకం అవ్వాలని సూచించారు. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. గంగమ్మకు పూజలు చేసి మంజీరా నదిలో ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి నిమజ్జనం చేశారు. కాగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను శుక్రవారం ఏడుపాయల మంజీరా నదిలో నిమజ్జనం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో జనసంద్రంగా మారింది. రెండవ బ్రిడ్జిపై ట్రాఫిక్ జాం అయి వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. భక్తులు రాజగోపురంలోని దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రాజరాజేశ్వరీదేవిగా వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): అమ్మ విజయదర్శనం..శ్రీరాజరాజేశ్వరిదేవిగా సాక్షాత్కారం..వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దసరాశరన్నవరాత్రోత్సవాలు గురువారం విజయ దశమి వేడుకలతో ముగిశాయి. దసరా పర్వదిన వేళ జయములిచ్చే జగన్మాత శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేషాభిషేకం జరిపారు. శమీపూజ అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి భక్తులకు అమ్మవారి విజయదర్శనం లభించింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరునికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు. -
వైభవంగా దసరా ఉత్సవం
ప్రశాంత్నగర్( సిద్దిపేట): జిల్లాలోని ప్రజలు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు తరలివచ్చి శమీ పూజ నిర్వహించి, పాలపిట్టను దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అమ్మవార్లు, హనుమాన్ ఆలయాల వద్ద వాహనాలకు పూజలు నిర్వహించారు. దీంతో ఏ ఆలయం వద్ద చూసినా భారీ లైన్లు కన్పించాయి. జిల్లా కేంద్రంలోని కోటిలింగాల ఆలయం, రంగదాంపల్లి హనుమాన్ ఆలయం, నర్సాపూర్ హనుమాన్ ఆలయం, రూరల్ పోలీస్స్టేషన్ హనుమాన్ ఆలయం, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో శమీపూజ నిర్వహించారు. లాల్కమాన్, నర్సపూర్ హనుమాన్ ఆలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సాయంత్రం ఆలయాల వద్ద రావణ దహనం నిర్వహించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నీరు, పండ్లు, ఆహరపదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. పిల్లలకు సంస్కృతిని నేర్పించాలి జిల్లా కేంద్రంలోని ఆలయాల వద్ద జరిగిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ హనుమాన్ ఆలయంలో వెండి కిరీటాన్ని అందించారు. అనంతరం ఆలయాల వద్ద పాలపిట్టను ఎగురవేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ...చిన్నారులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలన్నారు. దేశానికి మంచినీళ్ల పథానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. సిద్దిపేటకు అన్ని రకాల విద్యా సంస్థలను తీసుకువచ్చామన్నారు. కాళేశ్వరంతో రంగనాయకసాగర్ జలకళతో కళకళలాడుతుందన్నారు. కాశీ పురోహితులు సిద్దిపేటకు వచ్చి హారతి ఇవ్వడాన్ని చూస్తే సాక్షాత్తూ కాశీని తలపించిందన్నారు. -
రేపు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
ప్రశాంత్నగర్(సిద్ధిపేట): సిద్దిపేట ప్రెస్క్లబ్లో ఈ నెల 5న ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగనున్నట్లు, జిల్లా అధ్యక్షుడు అమ్మన చంద్రారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, కొండపాక, మండలాల ఎన్నికలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రెస్క్లబ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గాంధేయ మార్గాన్ని అనుసరించాలిఅదనపు డీసీపీ కుశాల్కర్ సిద్దిపేటకమాన్: మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలని అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పోలీసు కమిషనరేట్లో గాంధీ చిత్ర పటానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినపుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సాయిప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ విజయాలను అందించాలిఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్: దసరా అందరి జీవితాల్లో విజయాలను అందించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఆకాంక్షించారు. గజ్వేల్ పట్టణంలోని డీసీఎంఎస్ గోదాము వద్ద గురువారం మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ గుంటుకు శీరీష రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలపిట్టను ఎగురవేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ చెడుపై మంచి విజయంగా చెప్పుకునే దసరా పండుగ అందరికీ మేలు చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, భరత్నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి: చుక్కా రాములుసిద్దిపేటఅర్బన్: నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే సీపీఎం అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కార్మిక కర్షక భవన్లో గురువారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పాలకులు లేక సమస్యలతో ప్రజలు విసిగిపోతున్నారని, వారికి అండగా నిలుస్తున్న పార్టీ సీపీఎం అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పండగ పూట నీటిగోస కౌడిపల్లి(నర్సాపూర్): పండుగ పూట నీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈసంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. కౌడిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీరు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు భగీరథ నీరు రాక, మరోవైపు గ్రామంలో బోరుబావులు సరిగా లేకపోవడంతో కొత్తకాలనీకి చెందిన పలువురు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పడంతో విరమించారు. -
పేదలకోసమే పరితపించిన రామలింగారెడ్డి
● నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా సాధారణ జీవితమే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ,ఎస్టీ చైర్మన్ వెంకటయ్య దుబ్బాక/దుబ్బాకటౌన్: తుదిశ్వాస విడిచేంత వరకు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేదల కోసమే పరితపించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. రామలింగారెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం చిట్టాపూర్తోపాటు దుబ్బాకలో ఆయన విగ్రహాలకు కొత్త ప్రభాకర్రెడ్డి, బక్కి వెంకటయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా రామలింగారెడ్డి అత్యంత సాధారణ జీవితమే గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన భౌతికంగా లేకున్నా పేదప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలచిపోయాడని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామలింగారెడ్డి కుమారుడు సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజమౌళి, ఎల్లారెడ్డి తదితరులున్నారు. దసరా సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుబ్బాక పట్ణణంలో రెడ్డిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన లైటింగ్, డీజే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతీ, యువకుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. -
గాంధీ మార్గంలో నడుద్దాం
దుబ్బాక: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని ఎంపీ రఘునందన్రావు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...అహింసామార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడు గాంధీ అని ఆయన స్ఫూర్తితో దేశరక్షణకు పాటుపడుదామన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఘనంగా దసరా ఉత్సవాలు దుబ్బాక మండలంలో దసరా ఉత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రఘునందన్రావు తన స్వగ్రామం బొప్పాపూర్లో, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తన స్వగ్రామం పోతారంలో తమ కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా సంబరాల్లో పాల్గొన్నారు.కలెక్టరేట్లో ఘనంగా గాంధీ జయంతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ హైమావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, కలెక్టరేట్ ఏఓ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్రావు -
సామాజిక సేవకు నిలయంగా సిద్దిపేట
ప్రశాంత్నగర్(సిద్దిపేట)/సిద్దిపేటజోన్: సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవ, అన్నదానాలు, వివిధ సేవా కార్యక్రమాలకు నిలయంగా సిద్దిపేట నిలుస్తోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అమర్నాథ్ సేవా సమితి భవనం భూమి పూజ కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట నుంచి ప్రారంభమైన అన్నదానం అమర్నాథ్, అయోధ్య, కేదారినాథ్ వరకు సాగుతోందన్నారు. అమర్నాఽథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గాంధీ ఆశయసాధనకు కృషి చేయాలి గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అహింసామార్గంలో శాంతియుతంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సింహ, సుడా మాజీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు
హుస్నాబాద్: పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలని గాంధీ అడుగు జాడల్లో మనమంతా నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీచౌక్లో గురువారం గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని, రాజ్యాంగం పరిరక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, నాయకులు బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు. దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి గురువారం మున్సిపాలిటి ఆధ్వర్యంలో శివాలయం వద్ద నిర్వహించిన శమీ పూజలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద దసరా సందర్బంగా రామ్ లీలా కార్యక్రమంలో పాల్గొని మంత్రి రావణ దహనం చేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్ పర్సన్ అనిత తదితరులు ఉన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
గెలుపు గుర్రాల వేట
● ‘స్థానిక’ పోరుపై పార్టీలు ప్రధాన దృష్టి ● ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం కసరత్తు ● పార్టీ నేతల అభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ ● దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్ ● ఇన్చార్జులను నియమించిన బీజేపీస్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరిగే వాటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాయి. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలో నిలబడే వారిలో ఎవరికి మద్దతు తెలిపే విషయంపైనా కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాలో జెడ్పీటీసీలు 26, ఎంపీటీసీలు 230, సర్పంచ్లు 508, వార్డులు 4,508 ఉన్నాయి. – సాక్షి, సిద్దిపేట బీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక కోసం ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెజార్టీ గ్రామ నాయకులు, కమిటీ అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ఇప్పటికే ఇంటింటికి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 22 నెలలు అయినా అమలు కావడం లేదని ప్రజలల్లోకి తీసుకవెళ్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ఆయా మండలాల కమిటీలను సూచించారు. ఈ నెల 3 తేదీ వరకు ఆయా నియోజకవర్గ ఇన్చార్జులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పీసీసీ నుంచి వచ్చే ఇన్చార్జి సమక్షంలో ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన నాయకుల పేర్లలను ఈ నెల 5న పంపించాలని సీఎం ఆదేశించారు. పీసీసీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నిర్వహించనున్నారు. వామపక్షాల పొత్తు ఉండేనా? వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా? లేదా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జిల్లాలో భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ సైతం అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. పలువురు ఇండిపెండెంట్లుగా బరిలో దిగేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇన్చార్జిల నియామకం బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు ఇన్చార్జిలను నియమించింది. మండల అధ్యక్షులు, ఇన్చార్జులు, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ను మెదక్ ఎంపీ రఘునందన్రావు నిర్వహించారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. -
‘జమ్మి’వనం..
ప్రత్యేకత చాటుకుంటున్న తున్కిఖాల్సా పల్లెప్రకృతి వనంవర్గల్(గజ్వేల్): అడవిలో ‘జమ్మి’ వనం ఊరందరికి చేరువైంది. పల్లె ప్రకృతికి శోభనిస్తోంది. పూజనీయమైన జమ్మి వృక్షాలతో వర్గల్ మండలం తున్కిఖాల్సా పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత చాటుకుంటున్నది. గ్రామానికి అర కిలోమీటరు దూరంలో 5 జమ్మి వృక్షాలు ఒకేచోట సముదాయంగా పెరిగాయి. అక్కడే దసరా జమ్మీ పూజ నిర్వహించుకునేవారు. 2019లో పల్లెప్రకృతివనం ఆలోచన తెరపైకి వచ్చింది. ఆ వెంటనే రెండెకరాల విస్తీర్ణంలో జమ్మిచెట్లు మధ్యలో ఉండేలా పచ్చనిలాన్, చుట్టూరా వృత్తాకారంలో గద్దె, అక్కడే భారతమాత విగ్రహం, దేశభక్తికి చిహ్నంగా ఎత్తయిన జాతీయ జెండా, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, తెలంగాణ సంస్కృతికి చిహ్మంగా బతుకమ్మ..ఇలా అన్ని కలగలసి పల్లెప్రకృతి వనం శోభాయమానంగా రూపుదిద్దుకున్నది. ఆహ్లాదతకు నెలవుగా, ఊరందరూ దసరా వేళ జమ్మి వృక్షాలు పూజించే ఆధ్యాత్మికతల కొలువుగా ప్రత్యేకత చాటుకుంటున్నది. -
సంగారెడ్డిలో సందడే..
సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సవాల ఏర్పాట్లు..సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పండగను పురస్కరించుకుని పాతబస్టాండ్ రాంమందిర్ నుంచి శావ శోభాయత్ర నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో భజన కీర్తలతో ఈ శోభయాత్ర ఉంటుంది. రాంమందిర్ నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది. అంబేద్కర్ స్టేడియంలో రావణ దహణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. భారీ స్థాయిలో బాణాసంచ కాల్చుతారు. పట్టణ వాసులతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడి దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ వేడుకలను తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుల బృందాలు పాడే భక్తిగీతాలు వేడుకకు హాజరైన వారిలో ఆధ్మాత్మిక భావాన్ని పెంపొందిస్తుంటాయి. -
మహా సరస్వతి హోమం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ అధికారులు, అర్చకులు మహా సరస్వతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మహాపూర్ణాహుతి, విశేషద్రవ్య సమర్పణ, సువాసిని తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: రఘునందన్రావు దుబ్బాక: అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. బుధవారం సాయంత్రం దుబ్బాక పట్టణంలోని తన స్వగృహంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవనామస్మరణతోనే సర్వసుఖాలు కలుగుతాయన్నా రు. అమ్మవారి కరుణతో మంచి పంటలు పండి రైతులు,ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఢోకా కార్డులను ప్రవేశ పెడతాం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీఆర్ఎస్ హామీలను నమ్మి రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ విధంగా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారో అన్నింటిని ప్రతి ఓటరుకు ఢోకా కార్డుల పేరిట పంచుతామని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మీసం నాగరాజు యాదవ్ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులూ రెండు సార్లు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు హరీశ్రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతులకు ఉచిత ఎరువులు, ప్రతి పేద దళితులకు దళిత బంధు, తదితర హామీలను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ,అభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్లూరి నర్సింహులు, కోరిమి రాజు, మహేందర్రెడ్డి, స్వామి , మీసం రాజు, కోడెల నాగరాజు, సురేష్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తనిఖీబెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తోటపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఊరంతా ఏకమై.. సంప్రదాయం వేడుకై
బతుకమ్మ, దాండియా ఆటలతో దుమ్మురేపే ఆడపడుచులుయువకుల అలయ్– బలయ్ దుబ్బాకలో ప్రత్యేకందుబ్బాక/దుబ్బాకటౌన్: పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా గాంధీ విగ్రహం వద్ద ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచుల బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. యువకులు, పెద్దలు అలయ్ – బలయ్ కార్యాక్రమాలు, యువకుల డ్యాన్సులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. పట్టణాలను నుంచి వచ్చిన ఉద్యోగస్తులు, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తుకుంటారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నావరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండల పాల వద్ద వారం పాటు ఆడపడుచుల దాండియా, బతుకమ్మ ఆటపాటలు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. అలాగే దసరారోజున పట్టణంలోని చెల్లాపూర్రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జమ్మిచెట్టు వద్దకు డప్పుచప్పుళ్లతో వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. -
నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం
ఉమ్మడి మెదక్ జిల్లా విభిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం. అనేక ఆచారాలు, అలవాట్లతో కూడిన వైవిధ్యమైన ఉమ్మడి జిల్లా. వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆటపాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. అంతా కలిసి బ్యాండు మేళాలతో వెళ్లి పాల పిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితంగా జరిగే వేడుకల కథనాలు కొన్ని.. -
సిద్ధిధాత్రి నమోస్తుతే..
మహిషాసుర మర్దినిగా వర్గల్ అమ్మవారు వర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రోత్సవాలలో తొమ్మిదోరోజు బుధవారం వర్గల్ శ్రీవిద్యా సరస్వతి అమ్మవారు సిద్ధిధాత్రి మహిషాసుర మర్దినిగా దివ్యదర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు ఆలయ మహామండపంలో 108 కలశాలు, 108 శంఖువులు స్థాపన చేశారు. గర్భగుడిలో మూలవిరాట్టుకు మహా కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిషాసుర మర్దినిగా సాక్షాత్కరించిన అమ్మవారిని భక్తజనులు దర్శించుకుని తరించారు. -
దసరా జోష్
దసరా జోరు అంతాఇంతా కాదు.. దసరా అంటేనే చుక్క, ముక్క అనేలా ఉంటుంది. కానీ దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజున రావడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం వైన్స్ షాప్లు, చికెన్, మటన్ షాప్లు మూసివుంటాయని, ముందస్తుగా బుధవారమే మందు, మాంసాహార ప్రియులు కొనుగోళ్లు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటరావణ దహనానికి ఏర్పాట్లు పూర్తిప్రశాంత్నగర్(సిద్దిపేట): దసర పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పలు ఆలయాల వద్ద ఉత్సవాలను నిర్వహించనున్నారు. అందుకు గాను ఆలయాల వద్ద రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రంగథాంపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, లింగారెడ్డిపల్లి, ఎన్సాన్పల్లిలలో భారీ రావణ కటౌట్లను దహనం చేయనున్నారు. హరీశ్రావు శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనంద, సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను నిర్వహించుకోవాలన్నారు. -
నేతల గురి
స్థానిక బరి..ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో జిల్లాలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. – మొదటి విడతలో 15 మండలాల్లో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావు పేట, చిన్నకోడూరు. నంగునూరు, దుబ్బాక, అక్బర్పేట–భూంపల్లి, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, చేర్యాల, కొమురవెల్లి, రాయపోలు, దూల్మిట్ట, మద్దూరు మండలాలు ఉన్నాయి. పట్టు కోసం కసరత్తు బరిలో నిలిచే అశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ విడతలో ఏ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయో తేలడంతో అశావహులు ఇప్పటికే కార్యకర్తలు, యువజన, మహిళా, కుల సంఘాల నేతలతో సమావేశాలవుతున్నారు. తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే పల్లెలో తిరుగుతూ పట్టును మరింత పెంచుకుంటున్నారు. పల్లెల్లో సందడి నెలకొంది.ఏర్పాట్లలో ఆశావహులు మూడు విడతల్లో ‘పంచాయతీ’ -
ప్రభుత్వాస్పత్రిలో ఆయుధ పూజ
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో దసరా పండుగను పురస్కరించుకుని వైద్యులు, సిబ్బంది మంగళవారం ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, పిడియాట్రిక్ విభాగ హెచ్ఓడీ డాక్టర్ సురేష్బాబు వైద్యులు, సిబ్బందితో పాటు ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా విభాగ హెచ్ఓడీ చందర్, వైద్యులు రాగిణి, రమ్య, రవి, గ్రీష్మ, సునీత, మహేందర్, సౌజన్య, ప్రవీణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. -
గజ్వేల్లో నేడు సద్దుల బతుకమ్మ
గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊరచెరువు వద్ద స్థానిక ఏసీపీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా చెరువుల వద్ద అవసరమైన బారీకేడ్లు, లైటింగ్, వేదిక ఏర్పాటు తదితర అంశాలపై కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలోనే వాహనాలు నిలిపేలా చూడాలని పోలీసులకు ఆదేశాలివ్వనున్నట్లు ఏసీపీ తెలిపారు. రోడ్డుపై రద్దీ ఉండే అవకాశమున్నందువల్ల స్టాపర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలాంటి ఈవ్టీజింగ్ జగరకుండా మఫ్టీలో పోలీసుల నిఘా కొనసాగుతోందన్నారు. అలాగే దసరా పండుగ రోజు మహంకాళీ ఆలయం వద్ద నిర్వహించనున్న రావణ దహనం, ఇతర ఏర్పాట్లను సైతం ఏసీపీ పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాసంగిపైనే ఆశలు
రాబోయే యాసంగి సీజన్లో 4.12లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. వానాకాలంలో అతివృష్టి కారణంగా తీవ్రమైన పంట నష్టానికి గురైన రైతులు యాసంగిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లోనైనా ఊరట పొందాలనే ఆశావహదృక్పథంతో ఉన్నారు. – గజ్వేల్ యాసంగి సీజన్ సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తంగా 4.12లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. వరి 3,64,823 ఎకరాల్లో, 31,416 ఎకరాల్లో మొక్కజొన్న, 12,609 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 455ఎకరాల్లో వేరుశనగ, 579ఎకరాల్లో శనగలు, 54ఎకరాల్లో పత్తి, 968ఎకరాల్లో స్వీట్కార్న్ సాగులోకి వచ్చే అవకాశం ఉంది. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా మొక్కజొన్న కోత తర్వాత దాని స్థానంలో అక్టోబర్ రెండో వారం నుంచి పొద్దు తిరుగుడు, శనగలు ఇతర ఆరుతడి పంటలు విత్తుతారు. గతంలో శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు సబ్సిడీపై ఇచ్చేవారు. కానీ కొన్నేళ్లుగా సబ్సిడీ ఊసే లేకపోవడం వల్ల శనగ పంట సాగు భారీగా పడిపోయింది. ఇదిలావుంటే వానాకాలం సీజన్లో అతివృష్టి కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం సంభవించింది. ఈ కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి ఎక్కడికక్కడా తెగుళ్లు దాడి చేశాయి. ప్రస్తుతం ఈ పంటలను తొలగించి పొద్దు తిరుగుడు, శనగ ఇతర ఆరుతడి పంటలతో ఉపశమనం పొందాలనుకుంటున్నారు. కానీ విత్తన సబ్సిడీ లేకపోవడం కలవరపరుస్తోంది. ఇతర పంటలదీ అదే పరిస్థితి... మొక్కజొన్న 31,416వేల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉండగా 4,200 క్వింటాళ్ల విత్తనం అవసరం. పొద్దు తిరుగుడు 12,609 ఎకరాల్లో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు 2,300 క్వింటాళ్ల విత్తనం, వేరుశనగ 579 ఎకరాల్లో సాగులోకి రానుండగా.. 100క్వింటాళ్లకుపైగా విత్తనం అవసరం ఉంటుంది. యూరియా కొరత తీరేనా? వానాకాలంలో యూరియా దొరక్క తీవ్ర పంట నష్టానికి గురైన రైతులు యాసంగి సీజన్లోనూ యూరియా తీరుతుందా లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. యాసంగి సీజన్ పూర్తయ్యేంతవరకు సుమారుగా 25వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా అవసరముంటుందని అంచనా. కానీ అవసరం మేరకు నిల్వలు వస్తాయా? అనేది అనుమానంగా ఉంది. ఈ పరిస్థితి వల్ల రైతులు పంటల సాగును తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ విషయంలో వ్యవసాయశాఖ రైతుల్లో నమ్మకం పెంపొందిస్తే తప్పా పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు నానో యూరియా వాడకం పెంచేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని కూడా భావిస్తున్నది. కానీ ఈ ప్రయత్నం ఏమేరక ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఊరూరా స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. బరిలో నిలిచే ఆశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా సంఘాల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏఏ విడతల్లో జరగనున్నాయో తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, జెడ్పీటీసీలు 26, ఎంపీటీలు 230 ఉన్నాయి. ఏ మండలం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ఆశావహులు ఆసక్తిగా ఉన్నారు. బరిలో నిలిచే నేతలు కసరత్తు షూరు చేశారు. జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. – సాక్షి, సిద్దిపేట శ్రీదుర్గే.. జయదుర్గేవర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రి ఉత్సవ వైభవంతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం అలరారుతోంది. మంగళవారం అమ్మవారు సకల సద్గతులు ప్రాప్తించే దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచహారతులు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చదువుల తల్లి సన్నిధిలో చిన్నారుల అక్షరస్వీకారాల సందడి నెలకొంది. కనకదుర్గ మాతగా..కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం తొమ్మివ రోజున అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
పంటల నమోదు తప్పనిసరి
నంగునూరు(సిద్దిపేట): రైతులు సాగు చేసిన పంట వివరాలను ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. నంగునూరులోని రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని మంగళవారం ఏఓ గీతతో కలసి గోదాం, రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఎరువులు అమ్మిన వెంటనే రిజిష్టర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం ఘణపూర్లో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ పంట అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పంట నమోదు తప్పనిసరన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. కుకునూర్పల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గుర్రం ఎల్లం తన కార్యకర్తలతో కలిసి మంగళవారం నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బురుజుకు పునరుజ్జీవం నంగునూరు(సిద్దిపేట): చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కాపాడేందుకు యువకులు ముందుకొచ్చారు. నంగునూరు మండలం మగ్ధుంపూర్లో మంగళవారం యువకులు శ్రమదానం చేసి బురుజుపై పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి దసరా ఉత్సవాలను సిద్ధం చేశారు. నార్కోటిక్ డాగ్స్తో తనిఖీలు సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని సీఐ వాసుదేవరావు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్స్తో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు కలిగిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికై నా సమాచారం ఉంటే 100కు ఫోన్చేసి తెలియజేయాలని కోరారు. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● పటిష్ట కార్యాచరణతో ముందుకు ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అదనపు డీసీపీ, డీపీఓలతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలు, విధులపై అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించాలి... ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది నిబంధనలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు 15 కమిటీలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ దేవకిదేవి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా అధికారులు పాల్గొన్నారు. -
యూకేలో పేరిణి సంతోష్ నృత్య ప్రదర్శనలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్లో యూనైటెడ్ కింగ్డమ్ (యూకే) తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేరిణి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన ప్రముఖ పేరిణి నాట్యాచార్యుడు, యువకళా రత్న సంతోష్ మంగళవారం తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నృత్య రూపకం, పేరిణి శివతాండవం నృత్య ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పేరిణి నృత్యంను విదేశీయులు ఇష్టపడుతున్నట్లు సంతోష్ తెలిపారు. -
స్థానిక సమరమే..
కోడ్ కూసె.. పోరు ఎగిసెపల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో బరిలోకి దిగాలని భావిస్తున్న నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు దసరా పండుగల సందర్భంగా విందులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. – సిద్దిపేటజోన్ -
విశ్వబ్రాహ్మణులకూ రిజర్వేషన్లు కల్పించాలి
హుస్నాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే, విశ్వబ్రాహ్మణుల జనాభా ప్రకారం 5 శాతం సీట్లు తమకు కేటాయించాలని విశ్వనాథుల పుష్పగిరి డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయాల్లో తమ వంతు వాటా దక్కాలనే డిమాండ్తో ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం హుస్నాబాద్కు చేరుకుంది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర 13 రోజులుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాజకీయాలలో ఎదిగితేనే జాతి మనుగడ సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సదానందం, కార్యదర్శి శ్రీనివాస్, మనుమయ సంఘం అధ్యక్షుడు సదానందం, సుదర్శనంచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక రూపిణి.. వివేకధాత్రి
వర్గల్ సరస్వతిదేవి నిజరూపదర్శనం ● వైభవంగా ‘మూల’ మహోత్సవం ● లక్ష పుష్పార్చన, మహా పుస్తకపూజ ● భారీగా చిన్నారులకు అక్షరాభ్యాసాలువర్గల్(గజ్వేల్): పుస్తక రూపిణి..వివేకధాత్రి.. విద్యాసరస్వతిదేవి నిజరూప దర్శనం భక్తజనావళిని మంత్రముగ్ధులను చేసింది. శంభుని కొండ అమ్మవారి స్మరణతో మార్మోగింది. విశేషాభరణాలు, నవరత్న మణిమయ స్వర్ణకిరీటంతో పుస్తకరూపిణి దివ్యదర్శనం..ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ అపూర్వఘట్టం సోమవారం వర్గల్ క్షేత్రంలో మూల మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమైంది. పీఠాధిపతులు విద్యాశంకరభారతి స్వామి, మాధవానందసరస్వతి స్వామి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి ఆధ్వర్యంలో మూల నక్షత్ర వేడుకలు కొనసాగాయి. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, మహాపుస్తక పూజ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. పూర్ణకుంభస్వాగతం క్షేత్రం సందర్శించిన పుష్పగిరి, రంగంపేట పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి, మాధవానంద సరస్వతి స్వామిలకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అభిషేకాది పూజలు నిర్వహించి అమ్మవారి సేవలో తరించారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.3,000పైగా అక్షర స్వీకారాలు మూల మహోత్సవం సందర్భంగా సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాల సందడి కొనసాగింది. 3000 పైగా చిన్నారులు అక్షరస్వీకారాలు చేశారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● అక్టోబర్ 23, 27తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ ● నవంబర్11న ఓట్ల లెక్కింపు,ఫలితాలు విడుదల ● మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్.. అదే రోజు ఫలితాలు
జిల్లాలోని గ్రామ పంచాయతీ(సర్పంచ్), మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలింగ్ జరుగనుంది. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు నవంబర్11న విడుదల కానున్నాయి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలను అక్టోబర్ 31, నవంబర్4, 8 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాలను పోలింగ్ రోజనే జరిగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. జెడ్పీటీసీ 26, ఎంపీటీసీ 230.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలతో పాటు 508 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 4508 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంసిద్ధమై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో ఈనెల 27న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ గెజిట్ జిల్లా యంత్రాంగం అధికారికంగా విడుదల చేసింది. విడతల వారీగా ఎన్నికలు.. జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను అక్టోబర్ 23, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 15మండలాల్లో, రెండో విడతలో 11 మండలాల వారీగా ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. 508 పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ వారీగా ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. 23, 27 తేదీల్లో పోలింగ్.. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు.. మొదటి విడత షెడ్యూల్ అక్టోబర్ 9న ఓటర్ల జాబితా, 11న అభ్యర్థుల నామినేషన్ తుది గడువు, 15న అభ్యర్థుల తుది జాబితా విడుదల, అక్టోబర్ 23న ఉదయం7నుంచి సాయంత్రం5 వరకు పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది. అదేవిధంగా రెండో విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 13న ఓటర్ల జాబితా విడుదల, 15 నామినేషన్ దాఖలు చివరి గడువు, 19న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 27న పోలింగ్ జరగనుంది. మూడు విడతల్లో.. జిల్లాలోని 508 సర్పంచ్, 4,508 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ పోలింగ్, అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి. ఈ క్రమంలో మొదటి విడత షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న, రెండో విడత 21న, మూడో విడత 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించనున్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు: కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ రమేష్, పంచాయతీ అధికారి దేవకీదేవి, డీఆర్డీఓ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
సరస్వతి మాతగా విజయదుర్గ
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఎనిదవ రోజున అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ మాతగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేబతుకమ్మకు రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చింది బీఆర్ఎస్సేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతీ తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ విశిష్టతలను పెంచుతున్నారన్నారు. బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, దుర్గా మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేశామన్నారు. -
పూల సింగిడి.. సద్దుల సందడి
● పల్లెపల్లెనా పూల పులకింత ● ఘనంగా బతుకమ్మ వేడుకలు ● ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలుజిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా పూలజాతర కనువిందు చేసింది. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఆడిపాడిన మహిళలు, యువతులు సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు ఆడిపాడారు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుని సద్దులను ఆరగించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వివిధ కాలనీలలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖల అఽధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
పశువైద్యాధికారిపై వేటు
నూతనంగా కొండల్రెడ్డి నియామకం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా ఇన్చార్జి పశువైద్య, పశు సంవర్థకశాఖ అధికారిగా కొండల్రెడ్డిని నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ సూపరింటెండెంట్ పూర్ణిమ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగపూర్ణచందర్రావు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర అంశాలపై వరుసగా సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారించి నాగపూర్ణచందర్రావును బాధ్యతల నుంచి తొలగించారు. ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేసి, కోడ్ ముగిసిన తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ ‘విద్య నా హక్కు. బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం’ అని నినాదంతో ముందుకు వెళదామన్నారు. గత ప్రభుత్వం హయాంలో మూసివేసిన ఆరు వేల పాఠశాలలను తెరిపించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులను విద్య కోసం కేటాయించాలన్నారు. కవికి కీర్తి రత్న పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవులు బస్వరాజ్కుమార్, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు, తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్రావుకు ఆహ్వానం సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియా పరిధిలో రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగే దసరా వేడుకలకు హాజరుకావాలని ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే హరీశ్రావును కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లు గూర్చి అరా తీశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వార్డు ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కనకయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. జోరు తగ్గని మంజీరాపాపన్నపేట(మెదక్): మంజీరా నది వరదలు సోమవారం సైతం కొనసాగుతున్నాయి. ఘనపురం అనకట్టపై నుంచి సుమారు 1.06 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవిహిస్తోంది. దీంతో దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. అయితే ఎల్లాపూర్ బ్రిడ్జి, ఏడుపాయల బ్రిడ్జిపై నీటి ప్రవాహం తగ్గడంతో వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. -
బోర్డులే దర్శనం.. మైదానాలు నిరుపయోగం
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక, సరైన వసతులు లేక బోర్డులకే పరిమితమయ్యాయి. ముళ్ల పొదలు, చెత్తా చెదారంతో దర్శన మిస్తున్నాయి. దీంతో లక్షల నిధులు వృథాగా అయ్యాయి. కొన్ని క్రీడా ప్రాంగణాల్లో వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో క్రీడా సామగ్రి కనిపించక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొనుగోళ్లదారులతో కిటకిటలాడుతున్న సిద్దిపేట పట్టణంలోని సుభాష్రోడ్డు ఊరూరా పూలవనాలు.. ఉవ్వెత్తున సంబురాలుబతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఎటు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పువ్వులనే దేవతగా కొలిచే అరుదైన ఈ పండుగలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా మహిళలు, ఆడపడుచులు పాల్గొంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ సంబరాలు జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన ఈ ఉత్సవాలలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సోమవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఈ మేరకు పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. –ప్రశాంత్నగర్(సిద్దిపేట)/దుబ్బాకఆటపాటలతో హోరెత్తుతున్న పల్లెలు, పట్టణాలు నేడే సద్దుల బతుకమ్మ -
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు గడువు లేదు
జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ప్రశాంత్నగర్( సిద్దిపేట): వాహనాల నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువును ప్రభుత్వం విధించలేదన్నారు. సెప్టెంబరు 30లోగా హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారనే సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వాహనదారులు నమ్మవద్దన్నారు. మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఆదివారం దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్జి జస్టిస్ సాధన, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకిలో నాకాబందీ బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి –కల్లెపెల్లి రోడ్డులో ఎస్ఐ సౌజన్య ఆధ్వర్యంలో ఆదివారం నాకాబందీ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి ధ్రువపత్రాలు పరిశీలించారు. నిబంధన లు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు. గణేశ్కు నిఫా పురస్కారం తొగుట(దుబ్బాక): అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిఫా (నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ జిల్లా స్థాయి అవార్డును మండల పరిధిలోని వెంకట్రావుపేటకు చెందిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త బండకాడి గణేశ్ అందుకున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్ నుంచి ఆదివారం కరీంనగర్లో అందుకున్నారు. గణేష్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన నిఫా రాష్ట్ర అధ్యక్షుడు యాదవ రాజుతో పాటు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పెంపుడు జంతువులపై అప్రమత్తత అవసరం
జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి పూర్ణచందర్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పెంపడు జంతువుల పట్ల అప్రమత్తతంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అఽధికారి పూర్ణచందర్రావు అన్నారు. ప్రపంచ రేబీసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పెంపుడు జంతువులకు వ్యాధులు సంక్రమించినపుడు తప్పనిసరిగా చికిత్స చేయించాలన్నారు. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల వద్ద సిబ్బంది చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. -
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం మహాలక్ష్మి స్వరూపిణిగా.. విద్యుద్దీపాల వెలుగుల్లో వర్గల్ క్షేత్రంవర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి స్వరూపిణిగా దర్శనం ఇచ్చారు. ఉదయం 6 గంటలకు క్షేత్రం నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు లక్ష పుష్పార్పన చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి గజ్వేల్రూరల్: అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎళ్లప్పుడూ ఉండాలని నాచారం క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామివారు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో అమ్మవారు శాంభవిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదనానంద సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కొంత సమయం దైవచింతనకు కేటాయించాలన్నారు. సామూహిక కుంకుమార్చన నంగునూరు(సిద్దిపేట): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహచండీగా దర్శనమిచ్చారు. బద్దిపడగలో వీరసావర్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. -
గొప్ప పండుగ
బతుకమ్మ చాలా గొప్ప పండుగ. పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లల్లో సంబరమే. నాకు 80 ఏళ్లు. అయినా ప్రతి ఏటా తప్పకుండా బతుకమ్మను పేరుస్తా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పాను. 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా. – బిల్ల సరోజన, దుబ్బాక ఘనంగా నిర్వహిస్తాం సద్దుల బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తాం. పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇళ్లన్నీ సందడితో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సంతోషాన్ని నింపుతుంది. – ఎర్రగుంట సుజాత, కవయిత్రి లచ్చపేట పోటాపోటీగా పేర్చేటోళ్లం మేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను పోటీపడి పెద్దగా పేర్చేటోళ్లం. పండుగకు ఒక రోజు ముందే అడవికి వెళ్లి గునుగు పువ్వు కోసుకొచ్చేవాళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. – స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు -
ఊరెళ్తున్నారా?.. జర భద్రం
తీసుకోవాల్సిన జాగ్రత్తలుసిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సెలవులు వచ్చాయి. వివిధ రకాల పనులు, ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, పట్టణాల్లో స్థిరపడ్డారు. వరుస సెలువల నేపథ్యంలో పట్టణాల నుంచి తమ సొంత ఊర్ల బాట పట్టారు. ఇలాంటి సమయంలోనే దుండగులు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలో తాళం వేసిన షెటర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంటికి తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం, నగదు ఇంట్లో ఉంచకూడదు పండుగ సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్తే.. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఉంచకూడదు. బ్యాంకు లాకర్లో భ్రదపర్చుకోవడం ఉత్తమం. పగటి సమయంలో గుర్తు తెలియని దుండగులు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, టార్గెట్ చేసుకుని ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు తాళం వేసిన ఇళ్లు, దుకాణాల షెటర్లు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి వెళ్తే అప్రమత్తంగా ఉండాలి సమాచారం ఇవ్వాలి పండుగల సెలవుల వేళ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరుస సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి ఊరెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. – సీహెచ్ కుశాల్కర్, అదనపు డీసీపీ అడ్మిన్ రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం వరుస సెలవుల నేపథ్యంలో పట్టణంలో, కాలనీల్లో రాత్రి వేళల్లో బ్లూకోల్ట్ సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. అనుమానాస్పద వ్యక్తులను ఫింగర్ ఫ్రింట్ డివైజ్తో పరిశీలించనున్నాం. ప్రజలు సంతోషంగా బతుకమ్మ, దసరా పండగను జరుపుకోవాలి. – వాసుదేవరావు, సిద్దిపేట వన్ టౌన్ సీఐ -
ఉత్కంఠకు తెర
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేన్లు ఖరారుసాక్షి, సిద్దిపేట: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడింది. జిల్లాలోని సర్పంచ్లు 508, ఎంపీటీసీలు 230, వార్డు సభ్యులు 4,508, జెడ్పీటీసీలు 26లకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. శనివారం జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లను కలెక్టరేట్లో, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎదుట 50శాతం మహిళలకు సంబంధించిన డ్రాను తీశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఏమి ఉండబోతున్నాయో అని ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీసీలకు 11 జెడ్పీటీసీలు జిల్లా వ్యాప్తంగా 26 జెడ్పీటీసీలు, ఎంపీపీలుండగా అందులో 11 బీసీలు, ఎస్సీలకు 5, అన్ రిజర్వ్ 9, ఎస్టీలకు ఒకటి కేటాయించారు. జనరల్కు 15, మహిళలకు 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు అన్ రిజర్వ్కు 9 కేటాయించగా జనరల్కు 5, మహిళలకు 4, బీసీలకు 11 కేటాయించగా జనరల్కు 6, మహిళలకు 5, ఎస్సీలకు ఐదు కేటాయించగా జనరల్ 3, మహిళలకు 2, ఎస్టీ జనరల్కు కేటాయించారు.పలువురికి నిరాశ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పలువురు రాజకీయ నాయకులు నిరాశ చెందారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఆశావహులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకున్నారు. పలువురు ఆశావహులకు రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో డైలామలో పడ్డారు. గత ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పట్టుసాధించుకున్న నేతలు.. రిజర్వేషన్లు తారుమారు కావడంతో తలలు పట్టుకుంటున్నారు. అలాగే కొన్ని మండలాల్లో కొత్త లీడర్లు, వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడమే మిగిలి ఉంది. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్ సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో 11 మండలాల్లో గెలిచే జెడ్పీటీసీలలో ఒక్కరికి చైర్మన్ దక్కే అవకాశం ఉండనుంది. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ వేడుకలుసిద్దిపేటరూరల్: జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి మహిళల ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకై క పండగ బతుకమ్మ పండగ అని కలెక్టర్ చెప్పారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగస్లుఉ సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కాగా, బతుకమ్మ పండుగ విశిష్టతపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించిన ఇ.సాయి సంతోషి, డి.సృజన, జి.మనస్వినిలకు, షార్ట్ ఫిలిం కాంపిటేషన్ విజేత గిరిబాబులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ హబ్గా సిద్దిపేట
గజ్వేల్: ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా హబ్గా మారబోతుంది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం కొత్తగా ప్రారంభమైన సాగును క్రమంగా విస్తరించుకుంటూ సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఆయిల్పామ్ సాగును పెంచేందుకు కేంద్రం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్పామ్(ఎస్ఎంఈఓ) పథకంలో భాగంగా నాలుగేళ్లల్లో తెలంగాణ 1,25,300 హెక్టార్ల సా గు లక్ష్యానికి తెలంగాణ ఇప్పటివరకు 78,869 హెక్టార్లకుపైగా లక్ష్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో సాగు పెరుగుతూ వస్తున్న జిల్లాల్లో సిద్దిపేట తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. గడిచిన ఐదేళ్లల్లో ఇక్కడ 12,350 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులోకి వచ్చింది. జిల్లాలోని నర్మెటలో మాజీ మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా రూ.300 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తికాగా, ప్రస్తుతం క్రషింగ్ను ట్రయల్ చేస్తున్నారు. దీని కారణంగా రాబోవు రోజుల్లో జిల్లాలో ఆయిల్పామ్ మరింతగా పెరగనున్నది. నర్మెటలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఆయిల్పామ్ సాగు సమీప జిల్లాలో విస్తరించడానికి అడుగులు పడ్డాయి. ఇంతకాలం మార్కెటింగ్ సౌకర్యాలు సక్రమంగా లేక, సాగుకు వెనుకంజ వేసిన రైతులు ఆయిల్పామ్ సాగును పెంచుకునే అవకాశం కలిగింది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో నిత్యం 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగివున్నది. ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్కు అవకాశమున్నది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి యంత్ర సామగ్రి ఇప్పటికే అమర్చారు. ఈ అంశంపై సిద్దిపేట జిల్లా ఉద్యానవనశాఖాధికారి సువర్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఆయిల్పామ్ సాగుకు సంబంధించి హబ్గా మారే అవకాశమున్నదని చెప్పా రు. జిల్లాలోని రైతులకు ఈ సాగు కొత్తయినా, ఏటా ఈ పంటను సాగుచేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. గణనీయంగా పెరుగుతున్న సాగు -
సిద్దిపేట సీపీగా విజయ్కుమార్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ బదిలీ అయ్యారు. నూతన పోలీసు కమిషనర్గా ఎస్ఎమ్ విజయ్కుమా ర్ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విజయ్కుమార్ను సిద్దిపేట నూతన సీపీగా నియమిస్తూ, ఇప్పటి వరకు సిద్దిపేట సీపీగా కొనసాగిన అనురాధను ఎల్బీ నగర్ డీసీపీగా నియమించారు. పండుగలు సంస్క ృతికి ప్రతీకలుఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని శ్రీ దేవి నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాతను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావనతో పాటు సామాజిక సేవను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్రెడ్డి, జిల్లా నాయకులు సూకూరి లింగం, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మల్లేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ కో అప్షన్ మెంబర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ భైరయ్యపాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీకి నివాళిసిద్దిపేటకమాన్/ ప్రశాంత్నగర్(సిద్దిపేట): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బాపూజీ విగ్రహానికి కలెక్టర్ హైమావతి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, తదితరులు పాల్గొన్నారు. అలాగే.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పాల్గొన్నారు. బాపూజీ బాటలో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ కోదండరాం ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ బాపూజీ అంకిత భావం స్ఫూర్తిగా సమాజ సేవకు యువత నడుం బిగించాలని ప్రొఫెసర్ ఎం.కోదండరాం పిలుపు నిచ్చారు. ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బాపూజీ జీవితం, రాజకీయ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ఉద్యాన వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్.దండా రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు సమగ్ర ప్రణాళిక
● జిల్లా లక్ష్యం 5.03లక్షల మెట్రిక్ టన్నులు ● రైతులకు ఇబ్బందులు కలుగొద్దు ● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలతో యంత్రాంగం ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. వరి ధాన్యం కొనుగోళ్లు–మద్దతు ధర తదితర అంశాలపై శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో వానాకాలం 2025–26 కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3,29 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో రైతుల అవసరాలు, ఇతరత్రా బహిరంగ కొనుగోళ్లకు పోను 5.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం మద్దతు ధర క్వింటాలుకు రూ 2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ 2,369 ప్రభుత్వం ధర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లినర్, వేయింగ్ స్కెల్, తేమ పరీక్ష మిషన్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో పెద్ద కొనుగోలు కేంద్రాలకు ఆటోమేటిక్ ప్యాడి క్లినర్లను ఇస్తామన్నారు. ప్రభుత్వ బోనస్ రూ 500అదనంగా చెల్లింపు ఉంటుందన్నారు. నిర్దేశించిన లక్ష్యం ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగ్లను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సరిపడా హమాలీలు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ తనూజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డిఎం సివిల్ సప్లై,, ఆయా మండల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐలో కొత్త కోర్సులు
● కలెక్టర్ హైమావతి ● అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధునాతన సాంకేతిక కేంద్ర (ఏటీసీ) బోధన తీరులను శనివారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి తే విజయం సాధిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తు న్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. మారుతున్న కాలంతో సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని చెప్పారు. ఐటీఐలో కొత్త కోర్సులను చేర్చి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, విద్యార్థులు చెక్కపై మిషన్తో బొమ్మలు తయారు చేసిన తీరు లను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపల్ రమణ పాల్గొన్నారు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్లో వైద్య సేవ లందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించి వైద్యం అందుతున్న తీరులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 2 వరకు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్ వైద్య సేవలందిస్తామన్నారు. పీహెచ్సీ పరిధిలో ఇప్పటి వరకు 85 మందికి పైగా మహిళలకు వైద్యం అందించామంటూ వైద్యులు శ్రీధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
దుబ్బాకటౌన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఐఓసీ కార్యాలయంలో ఉదయం అక్బర్పేట భూంపల్లి, మధ్యాహ్నం వివిధ మండలాల ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజు నిర్వహించే విధుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జహీరోద్దిన్, ఎంపీఓ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి, రవీందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. సర్వేకు సహకారం అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): పంటల సర్వేకు రైతులు సహకరించాలని ఏడీఏ మల్లయ్య కోరారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సాగైన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ల ప్రకారం పంటలు వివరాలు నమోదు చేయాలన్నారు. దీనివల్ల దిగుబడిని విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటా యని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, ఏఈఓ సాయి కుమార్, రైతులు పాల్గొన్నారు. చెరువు కట్టకు మరమ్మతులు గజ్వేల్రూరల్: మండల పరిధిలోని పిడిచెడ్ గ్రామంలోగల లక్ష్మీదేవి చెరువుకట్టకు గండిపడే అవకాశం ఉండడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ సుశాంత్ పర్యవేక్షణలో శుక్రవారం చెరువుకట్టపై మట్టి పో యించి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడితే సుమారు 200 ఎకరాల పరిధిలోని పంటలు నీటమునిగే ప్రమాదముంటుందన్నారు. వారం రోజుల క్రితం చెరువుకట్ట పొలాలవైపు కుంగిపోతున్నట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టా మని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం మద్దూరు(హుస్నాబాద్): సీజనల్ వ్యాధులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ సూచించారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో నిర్వహించిన స్వస్థ్ నారి సశక్తి అభియాన్ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాధుల సోకిన వారు వెంటనే వైద్యులను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్వర సేవలందించడమే లక్ష్యం వర్గల్(గజ్వేల్): ఖాతాదారులకు సత్వర సేవలందించడమే తమ లక్ష్యమని గౌరారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సీహెచ్ మాతాజీ అన్నారు. ఇందిరా మహిళాశక్తి మిషన్లో భాగంగా ఐకేపీ పర్యవేక్షణలో ఏర్పాటైన ఐదు స్వయం సహాయక వృద్ధుల సంఘాలకు శుక్రవారం బ్యాంకు ఖాతాలు తెరిపించి పాస్ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో పాములపర్తి సీసీ పద్మలత, మహిళలు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా గోపి హుస్నాబాద్: మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా మాటూరి గోపి ఎన్నికయ్యారు. డీలర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం గోపి, యాదగిరి పోటీపడ్డారు. ఒక్క ఓటు తేడాతో మాటూరి గోపి ఎన్నికై నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. కార్యదర్శిగా గూళ్ల మంగ, కోశాధికారిగా మల్లేశం ఎన్నికయ్యారు. -
ప్రజారోగ్యంపై పట్టింపేది?
దుబ్బాకటౌన్: ప్రజలు తినే ఆహార పదార్థాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో పర్యవేక్షణ లేక హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. అసలు పర్యావేక్షణాధికారులు ఉన్నారా? లేరా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఫలితం బయట పెట్టని అధికారులు ఇటీవల దుబ్బాకలోని ఉడిపీ హోటల్లో సాంబా రులో పురుగు వచ్చి కలకలం సృష్టించిన ఘటన తెలిసిందే. జిల్లా ఆహార తనిఖీ అధికారి వచ్చి సాంపిల్ తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా దాని ఫలితం బయట పెట్టక పోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బేకరీల్లో కాలం చెల్లిన కేక్లు పట్టణంలోని కొన్ని బేకరీలలో మున్సిపల్ అధికారుల చేపట్టిన తనిఖీలలో కాలం చెల్లిన కేక్లు బయటపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఎప్పడికప్పుడు సక్రమంగా తనిఖీలు చేపట్టకపోవడంతో బేకరీలు, హోటళ్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని, కాలం చెల్లిన తినుబండారాలను అమ్మతున్నారని వాపోతున్నారు. అదే విధంగా బేకరీలో ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఒక బేకరిలో కుళ్లిన కేక్ విక్రయించగా తిన్న పిల్లలు అనార్యోగం బారినపడ్డారు. అయినప్పటికీ ఆహార తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు ఆహార పదార్థాల్లో ఏ పురుగో, కీటకాలనో గుర్తించినప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వచ్చి శాంపిల్ సేకరించి ఫలితం బయట పెట్టకుండా చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదని వాపోతున్నారు. కాలం చెల్లిన పదార్థాల విక్రయం తయారీలో నాణ్యత కరువు కానరాని పర్యవేక్షణ అధికారులు తీరు మార్చకోవాలి జిల్లాలో కొంత మంది హోటల్, బేకరీ, ఇతర ఆహార విక్రయదారులు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. నాణ్యత లేని, కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుబ్బాకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందు కు తనిఖీలు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలి. – మాడబోయిన శ్రీకాంత్, దుబ్బాక సహించేదే లేదు.. దుబ్బాకలో బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారపదార్థాల తయారు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పరిశుభ్రత పాటించకుంటే జరిమానాలు తప్పవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు. – రమేశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్, దుబ్బాక -
జీవిత లక్ష్యసాధనకు చదువే పునాది
మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు తాము ఎంచు కున్న లక్ష్యాన్ని సాధించాలంటే చదువే పునాది అని డీఐఈఓ కె.రవీందర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర అన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్ కె.శారద, అధ్యాపకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారం అవసరం సిద్దిపేటఎడ్యుకేషన్/ములుగు(గజ్వేల్)/వర్గల్(గజ్వేల్)/నంగునూరు(సిద్దిపేట)/గజ్వేల్రూరల్/హుస్నాబాద్: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశాలలో ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ సత్యనారాయణరెడ్డి, హిమబిందు మాట్లాడారు. కళాశాలలకు అందిస్తున్న నిధులు, సౌకర్యాలు, విద్యార్థుల స్థితిగతులను తల్లిదండ్రులకు వివరించారు. కోఎడ్యుకేషన్ కళాశాలలో అగ్నిమాపక సీఐ వెంకటేశ్వర్లు అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో వివరించారు. ఏజీఎంసీ దేవయ్య, సుధాకర్రెడ్డి, కనకచంద్రం, శ్రీనివాస్రెడ్డి, నగేశ్, అశోక్ పాల్గొన్నారు. అలాగే ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశికళ మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో విలువ పెరుగుతుందన్నారు. వర్గల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విద్యార్థుల అకడమిక్, నాన్ అకడమిక్ అంశాలను చర్చించారు. నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపాల్ శివకోటి మాట్లాడారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ ప్రిన్సిపాల్ కిషన్ నగదు బహుమతులు అందజేశారు. గజ్వేల్ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్గౌడ్, జ్యోతిర్మయి వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలలో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతి బాటలో తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి రావాలన్నారు. అలాగే బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నామని ప్రిన్సిపాల్ లలిత అన్నారు. డీఐఈఓ రవీందర్రెడ్డి -
‘గౌరవెల్లి’ని పూర్తి చేసి తీరుతాం
అక్కన్నపేట(హుస్నాబాద్): మొట్టప్రాంత రైతుల చిరకాల కోరికైన గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాలన్నింటికీ సాగునీరందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. 2016లో అక్కన్నపేట మండలం ఏర్పాటు కాగా అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవన్నారు. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. త్వరలోనే తహసీల్దార్ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్య, నాయకులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వసతులు కల్పించాంహుస్నాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటి ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయా లు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధు లకు పుస్తకాలు, క్యాలిక్యులేటర్స్, ఇతర కిట్స్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి హాస్టల్ వసతి ఏర్పాటు చేశా మన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, ఆర్డీఓ రామ్మూర్తి, ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు వేళాయె..
కొత్త మద్యం పాలసీ(2025–27)ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం నుంచి మద్యం షాప్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2023–25 మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుంది. గత మద్యం పాలసీలో 93 వైన్ షాప్లకు 4,166 మంది దరఖాస్తు చేశారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 93 వైన్ షాప్లకు శుక్రవారం నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. షాప్ల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి అక్టోబర్ 23న లక్ష్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తులను సిద్దిపేటలో ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో స్వీకరించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. దరఖాస్తు ధరను రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. కొత్త షాప్లు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు వేల నుంచి 50వేల జనాభా ఉన్న దుకాణాలకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష మంది వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.65 లక్షల ఫీజును వసూలు చేయనున్నారు. డ్రా తీసిన కలెక్టర్ దుకాణాల కేటాయింపు గౌడ సామాజిక వర్గానికి 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను గురువారం కలెక్టర్ హైమావతి తీశారు. జిల్లాలో 93 వైన్ షాప్లు ఉండగా గౌడ సామాజిక వర్గానికి 16, ఎస్సీలకు 09 షాప్లు కేటాయించారు. గౌడ కులస్తులకు దుబ్బాక పట్టణం( గెజిట్ నంబర్ 19), చిన్నకోడూరు(21), గజ్వేల్ పట్టణం(27), గజ్వేల్ పట్టణం(29), గజ్వేల్ పట్టణం(31), ముట్రాజ్పల్లి(36), ములుగు(42), వేలురు(వర్గల్, (47), గౌరారం(48), మర్కూక్(49), హుస్నాబాద్ పట్టణం(54), పోతారం( హుస్నాబాద్, 56) చేర్యాల పట్టణం(68), దుద్దెడ–1(75), దూల్మిట్ట (80), అక్బర్పేట–1(85)లను కేటాయించారు. ఎస్సీలకు.. సిద్దిపేట పట్టణం(8), సిద్దిపేట పట్టణం(14), దుబ్బాక పట్టణం(16), రాఘవాపూర్(24), గజ్వేల్ పట్టణం(32), గజ్వేల్ పట్టణం( 35), చేర్యాల పట్టణం(70), కొమురవెల్లి–1(81), రాయపోలు(89) కేటాయించారు. ఎస్టీలకు వైన్ షాప్లను కేటాయించలేదు. రిజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ తప్పనిసరి చేశారు. ఎకై ్సజ్ చట్టం 1968 ప్రకారం శిక్షపడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయనివారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. మద్యం వ్యాపారులు, ఆశావహులు సిండికేట్గా మారి దరఖాస్తు చేసేందుకు డబ్బులను సిద్ధం చేసుకుంటున్నారు. తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ల దరఖాస్తుల స్వీకరణ కోసం సిద్దిపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల రెండు చొప్పున, మిరుదొడ్డి ఒకటి కౌంటర్లు ఉండనున్నాయి. దరఖాస్తు దారులు అందరూ ఆయా కౌంటర్లలో దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాస మూర్తి, ఈఎస్నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ -
‘మత్తు’ వదిలించేందుకే బైక్ యాత్ర
● ప్రభుత్వ ఉపాధ్యాయుడి సాహసయాత్ర ● జిల్లాలో విస్తృతంగా అవగాహనసాక్షి, సిద్దిపేట: పండుగ సెలవులు వస్తే చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఫ్యామిలీతో, లేదా ఫ్రెండ్స్తో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాత్రం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా నడుంబిగించారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బైక్ యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 21న సూర్యాపేటలో ప్రారంభమైన యాత్ర 900 కిలో మీటర్ల మేర సాగింది. యాత్ర ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో కొనసాగి.. సిద్దిపేట మీదుగా జనగాం వరకు గురువారం చేరుకుంది. తన బాల్య మిత్రుడి వలే.. బాల్య మిత్రుడు ధూమపానానికి బానిసై క్యాన్సర్ బారినపడి మృతి చెందాడు. మత్తు పదార్థాలతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తన బాల్యమిత్రుడి వలె ఎవరూ బలికావద్దని, మత్తుపదార్థాల నిర్మూలనకు జనచైతన్యమే మార్గమని భావించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పర్యటన జిల్లాలో జనం రద్దీ ఉండే ప్రాంతాలు, బస్టాండ్, టీ స్టాల్, కూలీల అడ్డాల దగ్గర ఆగి.. యువత, ప్రజలు మాదకద్రవ్యాలకు, ధూమపానానికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దంటూ ప్రచారం చేశారు. సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ప్రభాకర్ను కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రం, మోటివేషనల్ స్పీకర్ నాగరాజు, సోషల్ స్టడీస్ ఫోరమ్ అధ్యక్షుడు పూర్ణచందర్ రావులు సన్మానించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే.. మత్తు పదార్థాల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్రను చేపట్టాను. నా బాల్యమిత్రుడు సిగరేట్ తాగి క్యాన్సర్తో మృతిచెందారు. నన్ను కొందరు హేళన చేస్తున్నా.. నా ఆశయం నెరవేరేందుకు ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయకుండా చైతన్యం కల్పిస్తున్నాను. –రాచకొండ ప్రభాకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
బీసీ రిజర్వేషన్లపై జీఓ ఏదీ?
● స్థానిక సంస్థల ఎన్నికలపై రోజుకో మాట ● ఉపాధ్యాయుల సెలవులపై పునరాలోచించాలి ● ఎంపీ రఘునందన్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన జీఓ విడుదల చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభత్వుం రోజుకో మాటమాట్లాడుతోందన్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులు గుంతల మయంగా మారాయన్నారు. రహదారులపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రకృతి కోపిస్తే ఇలాగే ఉంటుందని, అందువల్ల పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు దోచుకున్న డబ్బుతో ఏమి చేయాలో తెలియక ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిని బయటకు తీస్తామన్న కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటోందన్నారు. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు పెద్ద పండుగలని, మహిళా ఉపాధ్యాయులను విధులకు హాజరుకావాలని హుకుం జారీ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్, వెంకట్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉనికి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరాటం వర్గల్(గజ్వేల్): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయని ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం వర్గల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో రోడ్లు ఎక్కడా సరిగాలేవు. నాణ్యత కొరవడ్డాయి. అన్నీ గోతులే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ప్రజల మేలు కోసం పనులను చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రస్థానం ముగిసిందిచిన్నకోడూరు(సిద్దిపేట): స్కామ్లు, స్కీమ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రస్థానం ముగిసిందని.. బీఆర్ఎస్లో ఏ నాయకుడు ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సేవా పక్షంలో భాగంగా గురువారం చిన్నకోడూరులో మొక్కలు నాటి, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపలేదా అని ప్రశ్నించారు. నాడు ఒక మాట, నేడు ఒక మాట మాట్లాడటం బీఆర్ఎస్కు చెల్లుతుందన్నారు. కేటీఆర్కు దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే బీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతామన్నారు. -
నాచ‘గిరి’ ప్రదక్షిణం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికత పంచుతున్న వేళ.. ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో ‘గిరి ప్రదక్షిణ’ క్రతువుకు బీజం పడింది. గురువారం ఉదయం భక్తజన హర్షధ్వానాలు, నారసింహ స్మరణ మధ్య పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభించారు. ప్రముఖులు, అర్చక, వేదపండితులు, సిబ్బంది, భక్తజనులు ఈ మహాక్రతువులో పాల్గొన్నారు. భజనలు చేస్తూ గిరిప్రదక్షిణ చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ గిరిప్రదక్షిణతో శుభాలు కలుగుతాయన్నారు. – వర్గల్(గజ్వేల్) -
స్థానిక పోరు.. చర్చ జోరు
● ఆశావహుల్లో దడ ● మొదలైన ఎన్నికల సందడి ● రాజకీయ పార్టీలు ఫోకస్ రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపైనే జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఇటీవల పూర్తి చేయగా, ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అధికారికంగా రిజర్వేషన్లను ప్రకటించవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రిజర్వేషన్లను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో దడపుడుతోంది. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో స్థానికసమరంపై పల్లెల్లో సందడి మొదలైంది. – సాక్షి, సిద్దిపేట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. గ్రామాల్లో ఎక్కడ నలుగురు కలిసినా సర్పంచ్ రిజర్వేషన్ ఇది అయిందని.. ఎంపీటీసీ ఇలా అయిందని జోరుగా చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు రిజర్వేషన్లపై కుతూహలంగా, మరోవైపు ఆందోళనగా ఉన్నారు. మండల స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ఏ రిజర్వేషన్ ఎవరికి అయిందని తెలుసుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. ఎవరికి చెప్పవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలుండటంతో చెప్పే సహసం అధికారులు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో నేతలే పోటీ చేసే స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తే కొత్తగా ఏ స్థానం ఎవరికి రిజర్వేషన్ అవుతుందోననే చర్చ కొనసాగుతుంది. ఇక బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలైతే మారే రిజర్వేషన్ల తీరుపై కూడా మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. అందుకే మహిళా స్థానాలు ఆయా పదవులకు రిజర్వ్ అయితే నాయకులు వారి సతీమణులు, తల్లులను కూడా బరిలో దించేందుకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పార్టీల నజర్ ఇప్పటికే సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని ఆశిస్తున్న ఆశావహులు వివిధ రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయా పార్టీల నేతలను కలిసి అభ్యర్థిస్తున్నారు. పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్న వారు గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు, కుల పెద్దలు, యువజన, మహిళా సంఘాల నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. మరోవైపు పల్లెల్లో మరింత పట్టు సాధించేందుకు సర్పంచ్ ఎన్నికలు కీలకమని భావిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎవరిని పోటీ చేయించాలి? ఎవరికి పట్టు ఎక్కువగా ఉంటుందని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. గ్రామ పంచాయతీలు: 508 వార్డులు: 4,508 ఎంపీటీసీలు: 230 జెడ్పీటీసీలు: 26 పల్లె ఓటర్లు మొత్తం: 6,55,958మహిళలు: 3,34,186పురుషులు: 3,21,766ఇతరులు: 06 -
విద్యాధరి సేవలో ఎమ్మెల్సీ కవిత
వర్గల్(గజ్వేల్): కంచి పీఠం, కంచి స్వామి ఆశీస్సులతో వేదోక్తంగా, శాస్త్రోక్తంగా కొనసాగుతున్న అద్భుత పూజాకార్యక్రమాలతో రాష్ట్రానికి వర్గల్ క్షేత్రం ఆశీర్వాదమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో వర్గల్ అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం నెరవేరిందన్నారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో ఆడపిల్లలు అందరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఆమె వెంట నాచగిరి ఆలయ మాజీ చైర్మన్, లీగల్సెల్ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి తదితరులున్నారు. -
క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎస్సీసెల్ నేత
మల్లు రవిని కలిసిన విజయ్కుమార్ గజ్వేల్: టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ బుధవారం హాజర య్యారు. ఆగస్టు 3న గజ్వేల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ సమక్షంలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి విజయ్కుమార్ డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఇటీవల నర్సారెడ్డి కమిటీ ఎదుట హాజరై తన వాదనను వినిపించారు. బుధవారం విజయ్కుమార్ సైతం హైదరాబాద్లోని గాంధీభవన్లో కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యుల ముందు హాజరై తన వాదన చెప్పుకున్నారు. ఆయనతోపాటు గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి తదితరులు ఉన్నారు. విజయ్కుమార్కు మద్దతుగా మహిళలు, నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయ్కుమార్కు మద్దతుగా వారు ప్లకార్డులను ప్రదర్శించారు. -
విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి
హుస్నాబాద్: ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో వేర్వేరుగా జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అనేది యువతను సమాజానికి దగ్గర చేసే వేదిక అని అన్నారు. ప్రతి విద్యార్ధి సేవా భావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలోనూ ముందుకు సాగాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్స్ గంగాధర్, లలిత, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు రణధీర్, కరుణాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు నిధులొచ్చే..
దుబ్బాక: నిధులు లేక సవాలక్ష సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మూడేళ్లుగా నిధుల జాడలేకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తాజాగా నగర అభివృద్ధి నిధుల కింద జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. గత జులైలోనే ప్రభుత్వానికి నిధుల ప్రతిపాదనలను ఆయా మున్సిపల్ కమిషనర్లు నివేదించారు. ఈ మేరకు నగర అభివృద్ధి కింద నిధులు మంజూరు కావడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలపై దృష్టి నిధులు లేక అధ్వానంగా తయారైన డ్రైనేజీలు, రోడ్లు, చెరువుకట్టల సుందరీకరణ, వరదనీరు మళ్లింపు, పార్కుల సుందరీకరణ, పారిశుద్ధ్యంతో పాటు పలు ప్రధాన సమస్యల పరిష్కారం కానున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం కాలనీలో స్ట్రీట్ లైటింగ్, డ్రైనేజీలకు రూ.40 లక్షలు, పార్కుకు రూ.40 లక్షలు, వరద నీరు పోయే కాల్వల నిర్మాణానికి రూ.1.60 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే చేర్వాపూర్ అనంతమహాలక్ష్మి టెంపుల్ నుంచి మారెమ్మ దేవాలయం వరకు సీసీ, బీటీ రోడ్డు మరమ్మతులకు రూ.1.40 కోట్లు, దుబ్బాక పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 లక్షలు, జంక్షన్ నిర్మాణానికి రూ.40 లక్షలు, మున్సిపాల్టిలోని 20 వార్డులకు ఒక్కో వార్డుకు రూ.50 లక్షల చోప్పున పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి. సర్వత్రా హర్షాతిరేకాలు దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు కావడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి మార్గం దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి నగర అభివృద్ధి కింద రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులకు మోక్షం కలగనుంది. డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, అసంపూర్తి, అధ్వాన రోడ్లు నిర్మాణం చేపడుతాం. చాలా సమస్యలు తీరే అవకాశం ఉంది. – రమేశ్కుమార్, దుబ్బాక మున్సిపల్ కమిషనర్ వివరాలు ఇలా.. మున్సిపాలిటీ వార్డులు జనాభా దుబ్బాక 20 40,000 హుస్నాబాద్ 20 30,000 చేర్యాల 12 14,000 -
అపురూపం.. అమ్మరూపం
అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా అలంకరించారు. మండపాల వద్ద కుంకుమార్చన, పుష్పార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దివ్య దర్శనమిచ్చారు. వర్గల్తోపాటు జిల్లా కేంద్రంలోనిసంతోషిమాత ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్) -
వేదస్వరూపిణి.. సకల శుభకరి
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా నేత్రపర్వం చేస్తున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం ఆయా మండపాలలో, దేవాలయాలలో అమ్మవార్లను గాయత్రీ దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. వర్గల్ సరస్వతి క్షేత్రంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వర్గల్ ఉత్సవాలకు రావాలంటూ నగరంలో రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను ఆలయకమిటీ ప్రతినిధులు కలిసి ఆహ్వానపత్రికలు అందజేశారు. గజ్వేల్ పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో 400కిలోల కుంకుమతో త్రిమూర్తి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/ వర్గల్(గజ్వేల్)/గజ్వేల్రూరల్ -
ఆయుర్వేదం జీవన విధానం
● ప్రకృతి సహజ మందులు ● కలెక్టర్ హైమావతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆయుర్వేదం అనేది వైద్యం మాత్రమే కాదని, భారతీయుల జీవన విధానమని కలెక్టర్ హైమావతి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మంగళవారం సిద్దిపేట పట్టణం నర్సాపూర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం భారతీయుల జీవితాల్లో భాగమైందన్నారు. సూర్యుని ద్వారా లభించే శక్తిని స్వీకరించి సహజసిద్ధంగా పెరిగే ప్రకృతి సిద్ధమైన మొక్కల నుంచి ఆయుర్వేదిక్ మందులను తయారు చేస్తారన్నారు. ఆయుర్వేదిక్ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నారు. మందులతో వ్యాధులు త్వరగా నయమవుతాయన్నారు. అందువలన అల్లోపతికి బదులుగా ఆయుర్వేదిక్ మందులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ మితాహారం, మసాలాలు తక్కువ తీసుకోవడం వల్ల రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పరీక్షలు చేసుకొని మందులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆయుర్వేదవైద్యం జిల్లా ఇన్చార్జి డాక్టర్ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైద్యు లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఫిర్యాదు
గజ్వేల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్వహణపై మంగళవారం బీజేపీ నేతలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కోసం వాడుకోవాల్సిన క్యాంపు కార్యాలయాన్ని ప్రైవేటు కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుడిక్యాల రాములు, ఎస్సీమో ర్చా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులు,కుంటలపై దృష్టి సారించండి
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● ఇరిగేషన్ అధికారులతో సమీక్షదుబ్బాక: భారీ వర్షాల నేపథ్యంలో నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటల రక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. ఇరిగేషన్ అధికారులతో నీటిపారుదల రంగంపై సమీక్షించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తు న్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదకరంగా ఉన్న చెరువుకట్టల రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. -
నెరవేరుతున్న సొంతింటి కల
● సంతోషంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ● ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ● సిద్దిపేటలో ఇళ్ల పరిశీలనపేద ప్రజల అభివృద్ధే ముఖ్యం సిద్దిపేటకమాన్: పేదల సొంతింటి కల నెరవేరుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇళ్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను ఊరించిందేకాని, ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నేడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామనే సంతోషం కనిపిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసిందన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాయకులు ఇష్టారీతినా భవనాలు నిర్మించారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణం పూర్తయ్యే సరికి విడతల వారీగా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ, తహశీల్దార్, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, వార్డు కౌన్సిలర్ సాకి బాల్లక్ష్మి, మార్క సతీష్, శ్రీనివాస్, అత్తు, ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలోని ప్రతి పేద వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్సాన్పల్లిలో 127 ఇండ్లు మంజూరు కాగా 90 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు క్వాలిటీతో ఇళ్ల నిర్మాణాలను చేసుకుంటున్నారని అభినందించారు. గత బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు స్వంత ఇంటి కల నెరవేరలేదన్నారు. మున్సిపల్ కమిషనర్పై మంత్రి సీరియస్.. మున్సిపల్ నిధుల విషయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు సహకరించడం లేదని నాయకులు కమిషనర్ ఆశ్రిత్కుమార్పై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి కమిషనర్పై సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా ఎలాంటి కేటాయింపులు చేయవద్దని ఆదేశించారు. -
సమన్వయ లోపమే కారణం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు ఆధునీకరణకు పదేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సుమారు రూ.45కోట్ల వరకు వెచ్చించారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుంచి గజ్వేల్లోని తూప్రాన్ రోడ్డు వైపున 133/33కేవీ సబ్స్టేషన్ వరకు 5కిలోమీటర్ల మేర పనులు సాగాయి. 100మీటర్ల విస్తరణతో డివైడర్లు, బట్టర్ఫ్లై లైట్లు, ఫుట్పాత్లతో అందంగా తీర్చిదిద్దారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలను నాటి మరింత శోభను తీసుకొచ్చారు. పదేళ్ల క్రితమే పనులు పూర్తికాగా, అయిదేళ్ల క్రితం నేషనల్ హైవే అథారిటీకి అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ రోడ్డుపై పలు చోట్ల అండర్పాస్లు, బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉండగా.. వాటిని డిజైన్లో మరిచిపోయారు. ఫలితంగా ఈ రోడ్డుకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు. ఆక్రమణలో నాలాలు ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దూకితే...ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. నాలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. నిజానికి ఈ వరద నీరు నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి అక్కడి నుంచి క్యాసారం కుంటలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక అక్కడి నుంచి ఇళ్ల మధ్య నుంచే వరద నీరు కొట్టుకు వస్తోంది. ఇదే నీరు పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద రోడ్డుపైకి వచ్చి జలమయంగా మారుతోంది. దీనివల్ల రోజుల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. తరచూ జలదిగ్బంధంలో ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి ప్రధాన రహదారి కింది భాగంలో అండర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. దానిని మరిచిపోయారు. నీటిపారుదల శాఖ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో ఈ సమస్యపై గతంలో స్పందించి ఉంటే.. కొంతమేరకు నాలాల వ్యవస్థను సరిచేసే అవకాశం ఉండేది. ప్రధాన రోడ్డుపైకి వరద పొంగి పొర్లే పార్ధివేశ్వర కమాన్ వద్ద, తూప్రాన్ రోడ్డు వైపున బ్రిడ్జిలు లేదా అండర్ పాస్ల నిర్మాణం జరిగి ఉండాల్సింది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలు పెట్టారు. కానీ ఆమోదం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ఈ ప్రతిపాదన లకు మోక్షం కరువైంది. ప్రస్తుతం ఈ సమస్య పట్టణంలో హాట్టాపిక్గా మారింది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తున్నది. ఇప్పటికై నా శాశ్వత పరిష్కారం లభించేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు
హుస్నాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని మంగళవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు కలిశారు. పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న ముదిరాజ్ ఫంక్షన్ హాలుకు బోరు మోటారు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన బండి సంజయ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పొన్నం మల్లయ్య, కార్యదర్శి రాగుల శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులుమిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి, 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో మెదక్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రావణి, శరణ్య, అలాగే బాలుర జట్టు నుంచి కృష్ణ సాయి ఎంపికయ్యాడని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు తమిళనాడులో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే టోర్నిలో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రోడ్డెక్కిన హైర్ బస్సులు డ్రైవర్లతో చర్చలు సఫలం సిద్దిపేటకమాన్: వేతనాలు పెంచాలని నిరసన తెలిపిన హైర్ బస్సుల డ్రైవర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సిద్దిపేట ఆర్టీసీ డిపో హైర్ బస్సుల డ్రైవర్లు సోమ, మంగళవారాల్లో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎం రఘు ఆధ్వర్యంలో అద్దె బస్సు యజమానులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం సాయంత్రం అద్దె బస్సులు రోడ్డెక్కాయి. డ్రైవర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంతో పాటు అదనంగా మరో రూ.2వేలు చెల్లించేందుకు నిర్ణయించారు. అలాగే ఏడాదికి ఒక డ్రైవర్కు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నట్లు తెలిపారు.శ్రావణి శరణ్య కృష్ణ సాయి -
వివరాలు నమోదు చేసుకుంటేనే ‘మద్దతు’
● జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి ● గజ్వేల్లో క్రాప్ సర్వే తీరు పరిశీలనగజ్వేల్: రైతులు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేసుకుంటేనే మద్దతు ధరతోపాటు ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మంగళవారం గజ్వేల్లో పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఏఈఓలు క్రాప్ సర్వేలో నిమగ్నమయ్యారని చెప్పారు. సర్వే ముగియగానే ఏఈఓలు సంబంధిత జాబితాను పంచాయతీల్లో ప్రదర్శిస్తామని, అభ్యంతరాలుంటే రైతులు తెలియజేయాలని సూచించారు. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు పప్పుధాన్యాలు సోయాబీన్లాంటి కోత పూర్తయిన పంటలు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌలు రైతులకు సైతం ప్రత్యేక రిజష్టర్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈఓలు పాల్గొన్నారు. -
జోరు వాన.. జనం హైరానా
కొండపాకలో 85 మి.మీ.వర్షం ప్రశాంత్నగర్(సిద్దిపేట)/దుబ్బాక: జిల్లాలో సోమ వారం జోరుగా వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో ఏకధాటిగా రెండు గంటల పాటు వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొండపాకలో 85మిల్లీమీటర్లు, కొమురవెల్లిలో 72 మి.మీ., సిద్దిపేటలో 71.5మి.మీ.వర్షపాతం నమో దు అయ్యింది. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షంతో ప్రజలు, వాహనదారులకు తిప్పలు తప్పలేదు. డీఈ కార్యాలయంపై పిడుగు.. జిల్లా కేంద్రంలోని విధ్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీ ర్ శాఖ కార్యాలయంపై పిడుగు పడడంతో ప్రమా దం చోటు చేసుకుంది. పిడుగు పడే సమయంలో కార్యాలయంలో ఆరుగురు ఇంజనీర్లు విధులు నిర్వ హిస్తున్నారు. పిడుగు పడడంతో విద్యుత్ పరిక రాలు, కంప్యూటర్లు ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయి. కొద్దిసేపు విద్యుత్ సరాఫరాకు అంతరా యం ఏర్పడింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టి సరాఫరాను పునరుద్ధరించారు. ఈ పిడుగు ప్రమాదంలో సుమారుగా రూ. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం -
బతిమిలాడి ఆయిల్పామ్ పంట వేయించా..
నంగునూరు(సిద్దిపేట): ‘ఆయిల్పామ్ పంటకు నేను జిమ్మెదారిగా ఉంటా అని రైతులను బతిమిలాడి పంటను సాగు చేయించా. లాభాలు గడించిన రైతులను, నిర్మాణం పూర్తయిన ఫ్యాక్టరీని చూస్తుంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు బావోద్వేగానికి లోనయ్యారు. నంగునూరు మండలం నర్మేటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్, ప్రతాప్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలసి హరీశ్రావు సందర్శించారు. ఫ్యాక్టరీలో కలియ తిరుగుతూ యంత్రాలను, నీటి స్టోరేజీ ట్యాంక్, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ పని తీరు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్తో మండుటెండలో చెరువులు, చెక్డ్యామ్లు మత్తడి దూకడంతో నాటి కరువు ప్రాంతం నేడు సస్యశ్యామలమైందన్నారు. కేసీఆర్, హరీశ్కు ధన్యవాదాలు చేర్యాల మండలానికి కూతవేటు దూరంగా నర్మేట లో నిర్మించిన ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కరెంటు, విత్తనాలు, ఎరువులు, సాగు నీరందించడంతో పాటు నకిలీ ఎరువులు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టడంతో నేడు 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందన్నారు. కేసీఆర్, హరీశ్రావు కృషి పలితంగా ఈప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఆయిల్పామ్ సాగు చేసే లా కృషి చేస్తామన్నారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణంగా ప్రేమించే సిద్దిపేటను హరీశ్రావుకు అప్పగించడంతో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. యాదవరెడ్డి మాట్లాడుతూ కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను దేశానికే మోడల్గా తీర్చిదిద్దిన ఘనత హరీశ్కే దక్కిందన్నారు. -
సుందరీకరణ వేగిరం చేయండి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఎల్లమ్మ చెరువు కట్ట పనుల పరిశీలన హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట సుందరీకరణ పనులు, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతంలో మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. చెరువు నిండుగా ఉండటంతో కట్ట లోపలికి బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్, స్టేజీ, సౌండ్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు, జాతీయ రహదారి నుంచి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే దసరా పండుగ రోజు నిర్వహించే రాంలీలా కార్యక్రమం విజయవంతం కోసం ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మున్సిపల్ మాజీ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, అఖిలపక్ష నాయకులు ఉన్నారు. -
అర్జీల పరిష్కారానికి కృషి
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● వచ్చిన దరఖాస్తులు 174 సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో గరీమా అగర్వాల్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జిదారులకు న్యాయం జరిగేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, పెన్షన్లు వంటి ఇతర అర్జీలు మొత్తం 174 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం అవే బారులు
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సోమవారం తెల్లవారుజామునుంచే రైతులు పీఏసీఎస్తో పాటు, గోదాం వద్ద బారులు తీరారు. గంటల తరబడి పడిగాపులు పడితే తప్ప యూరియా బస్తా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలం అదను దాటిపోతుండటంతో యూరియా కొరత వల్ల తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరిగతిన యూరియా అందుబాటులోకి తెచ్చి తమను నష్టాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఏ స్థానం ఎవరికో?
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలనే అంశంపై సంబంధిత అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేస్తోంది. ఆయా స్థానాల రిజర్వేషన్ల జాబితాలను రూపొందించి పంపాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో సోమవారం కలెక్టరేట్లో ఆయా ఆర్డీఓలు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓ, ఎంపీఓలు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఎంపీపీ స్థానాలు 26 ఉన్నాయి. ఈ స్థానాలు ఏ సామాజి కవర్గానికి రిజర్వు చేయాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే డాటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేటాయిస్తున్నా రు. డాటాను ప్రభుత్వం నుంచే జిల్లాకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బీసీలకు దాదాపు పది జెడ్పీటీసీలు, 96 ఎంపీటీసీలు కేటాయించే అవకాశం ఉంది. బీసీలకు 213 సర్పంచ్ స్థానాలు? జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే 213 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఏ గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వు అవుతాయి? ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వు అయ్యే పంచాయతీలు ఏవీ? ఎస్టీలకు కేటాయించే పంచాయతీలు ఏవీ? అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ల ఖరారుకు లాటరీ పద్ధతి ద్వారా చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఆయా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ప్రక్రియను చేపట్టనున్నారు. నేడు రిజర్వేషన్ల జాబితా? ఆయా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసి.. సంబంధిత జాబితాలను మంగళవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు పంపనున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ల పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల సూచనల ప్రకారం ఈ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆయా ఎంపీడీఓలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఆర్డీఓలు ఖరారు చేయనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ను పంచాయతీ కమిషనర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.రిజర్వేషన్లపై ఉత్కంఠ! -
అద్దె బస్సు.. కస్సు!
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు తమ జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు. దీంతో అద్దె బస్సులన్నీ సోమవారం డిపోకే పరిమితమయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగ వేళ ఊరెళ్లేవారికి సరిపడా బస్సులు లేక, సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. నిత్యం వేల కిలోమీటర్లు.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో 53 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు సిద్దిపేట డిపో నుంచి నిత్యం జేబీఎస్, హన్మకొండ, కామారెడ్డి, వేములవాడ, మెదక్, రామాయంపేట రూట్లలో తిప్పుతారు. ఈ బస్సులు రోజూ 20వేల కిలోమీటర్ల ద్వారా సుమారు 25వేల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తుంటారు. అద్దె బస్సు యజమానులు హైర్ బస్సు డ్రైవర్లకు ప్రతి నెలా (15రోజులు డ్యూటీ) రూ.15వేలు వేతనంగా చెల్లిస్తుంటారు. కానీ తమకు వేతనం సరిపోవడం లేదని, తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు మరో రూ.5వేలు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం విధులు బహిష్కరించి డ్రైవర్లు నిరసన తెలిపారు. అధికారులు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే తిప్పారు. అద్దె బస్సుల్లో రెండు బస్సులను వాటి యజమానులే నడపగా.. మిగిలిన బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో పలు రూట్లలో సరిపడా బస్సులు లేక, సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పలేదు. నిలిచిన బస్సులు.. వేతనాలు పెంచాలి సిద్దిపేట ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాను. రోజు విడిచి రోజు విధులు నిర్వహిస్తున్నాను. నెలలో 15రోజులు డ్యూటీ చేస్తాను. ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వేతనం రూ.15వేలు మాత్రమే చెల్లిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వేతనాలు పెంచి ఆదుకోవాలి. – ప్రశాంత్, అద్దె బస్సు డ్రైవర్ ప్రయాణికులకు ఇబ్బందులు రానివ్వం హైర్ బస్సు డ్రైవర్లు వేతనాలు పెంచాలని డ్యూటీకి రాలేదు. 53 అద్దె బస్సుల్లో రెండింటిని వాటి యజమానులే (ఓనర్ కమ్ డ్రైవర్) నడుపుతున్నారు. మిగతా బస్సులు నడవట్లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సేవలు అందిస్తున్నాం. హైర్ బస్సు యజమానులు డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. త్వరలో విధుల్లో చేరుతారని భావిస్తున్నాం. – రఘు, సిద్దిపేట డిపో మేనేజర్ -
శక్తి స్వరూపిణి.. త్రిపుర సుందరి
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం ● బాలాత్రిపుర సుందరిదేవీగా అమ్మవారు దర్శనం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా మండపాలలో అమ్మవార్లు కొలువుదీరారు. ఉత్సవాల తొలిరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి మండలపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగన్మాత నామంతో శంభుని కొండ మార్మోగింది. అభిషేకాలు, పారాయణాలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శోభిల్లింది. సరస్వతి అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాచగిరి శ్రీక్షేత్రం పీఠాధిపతి శ్రీమధుసూదనానంద సరస్వతి పర్యవేక్షణ, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్) -
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా గౌరవ వేతనంపై విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంచినీళ్ల బండ, బొంపల్లి, ఆరెపల్లి, తునికిశాల, సంగీత, నంగునూరు, బంజేరుపల్లి, ఆర్అండ్ ఆర్కాలనీ గజ్వేల్ ఆర్అండ్ ఆర్ కాలనీ గజ్వేల్–2లలో ఉపాధ్యాయులుగా, ఆయాలుగా ఖాళీలు ఉన్నాయన్నారు. వీటిలో విధులు నిర్వహించుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేలు గౌరవవేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి దుబ్బాక ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ధర్నా దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలని సీఐటీయూ జిల్లా కోషాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్కు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు అమలుచేయకుండా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారన్నారు. కార్మికులకు న్యాయపరంగా దక్కాల్సిన వేతనాలతో పాటు సౌకర్యాలు అమలుపర్చాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ భాస్కర్, సాజిద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈత చెట్లకు పూజలు గజ్వేల్రూరల్: మండల పరిధిలోని అహ్మదీపూర్లో గౌడ సంఘం నాయకులు ఈత చెట్లకు పూజలు చేశారు. సోమవారం ఈత వనంలో ఈదులు గీసేందుకు ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతియేటా దసరాకు నూతనంగా కల్లు దుకాణాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
చింతమడక.. స్ఫూర్తి మరవక
సిద్దిపేటరూరల్: స్వగ్రామమైన చింతమడక గ్రామస్తుల స్ఫూర్తితోనే జాగృతి పేరిట బతుకమ్మ పట్టుకొని రాష్ట్రమంతటా తిరిగానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఆమెను ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. చింతమడకలోని రామాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం మాదిగ సంఘం గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో బతుకమ్మ పేర్చారు. అనంతరం హైస్కూల్ గ్రౌండ్లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. ఆమె మాట్లాడుతూ చింతమడక చరిత్ర సృష్టించిన గ్రామమన్నారు. అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. సొంత ఊరంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు తనకు గుర్తుందన్నారు. చిన్నప్పుడు అన్ని కులాల వారిని కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగినట్లు గుర్తు చేశారు. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే అదంతా చేయగలిగానన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అంతకుముందు రాఘవాపూర్లో అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు. బతుకమ్మతో రాష్ట్ర మంతటా తిరిగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎంగిలిపూల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ -
కేతకీలో అమావాస్య పూజలు
తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులుఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. ఆదివారానికి తోడు అమావాస్య కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. వేకువ జాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు భక్తులు స్వామి వారికి అభిషేకం, అర్చన, హారతితోపాటు వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా పంచభక్ష పరమాన్నాలు మహా నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
సన్నాహాలు
ధాన్యం కొనుగోళ్లకు● 5.03 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వడ్ల సేకరణ లక్ష్యం ● 439 కేంద్రాలు ఏర్పాటు ● ఇరవై రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ షురూ.. ధాన్యం కొనుగోళ్లకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో 3.6లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 8.28లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం 439 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. – గజ్వేల్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లను చేపట్టడానికి అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఈ అంశంపై ఒక దఫా ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఒకటిరెండ్రోజుల్లో మరోసారి సమీక్ష జరిపి ఏర్పాట్లపై సర్వం సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. వానాకాలం సీజన్కు సంబంధించి 3.60లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. ఇందులో 3.24లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగులోకి వచ్చాయి. మరో 36వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగయ్యాయి. అతివృష్టి.. యూరియా కొరతతో.. ఈసారి అతివృష్టి చాలా ప్రాంతాల్లో వరికి తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. భారీ వరదల కారణంగా వరి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. దీనివల్ల ఆదిలోనే పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. మరోవైపు యూరియా కొరత కూడా వరి దిగుబడులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల పంట ఎదుగుదల లోపించింది. మరోవైపు తెగుళ్లు చుట్టుముట్టి దిగుబడులు పడిపోయేలా చేశాయి. అయినా ఈ సీజన్లో మొత్తంగా 8.28లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 5.03లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు కేంద్రాలకు అమ్మకానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగానే 4.83లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, మరో 20,380 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు వస్తాయని భావిస్తున్నారు. వచ్చే నెల 10 తరువాతే.. అక్టోబర్ 10తర్వాతే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశమున్నందన అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వరికి రూ.2,369మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రూ.69 పెరిగింది. మద్దతు ధరను రైతులకు కచ్చితంగా అందించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రత్యేకించి గన్నీ బ్యాగుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇబ్బందులు రానివ్వం జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొనుగోళ్లకు సర్వం సిద్దం చేస్తున్నాం. మరో 20 రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తాం. – ప్రవీణ్, పౌరసరఫరాల శాఖ డీఎం ఈ సీజన్లో వడ్ల కొనుగోళ్లకు మొత్తంగా 439 కేంద్రాలను ఏర్పాటుచేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో 231ఐకేపీ, 202 సహకార సంఘాలు, మరో 6 మెప్మాకు చెందిన కేంద్రాలు ఉండబోతున్నాయి. అంతేకాకుండా వడ్లను నింపడానికి 1,25,95000 గన్నీ బ్యాగులు అవసరముండగా, ఇందులో 5,79,3700 పాతవి అందుబాటులో ఉన్నాయని, మరో 6,80,1300 కొత్త గన్నీ బ్యాగులను తెప్పించనున్నారు. అదేవిధంగా వడ్లను నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములను సైతం సిద్ధం చేశారు. గోదాముల వద్ద సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. సన్నరకం వడ్లను అమ్మిన రైతులకు వెంటనే బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడానికి అవసరమైన చర్యలు సైతం చేపడుతున్నారు. -
పండుగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త
సీపీ అనురాధసిద్దిపేటకమాన్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అనురాధ సూచించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నామన్నారు. సీసీ కెమరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలన్నారు. శివారు కాలనీలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం కావాలన్నారు. ఖరీదైన వస్తువులు, బంగారం, నగదు ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేయకూడదని, బ్యాంకు లాకర్లో భద్రపర్చాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తొగుట(దుబ్బాక): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్రావు, తొగుట సీఐ ఎస్కే లతీఫ్లు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హైదరాబాద్లో ఆశా గీతాంజలి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): కురుమలు కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారం, రాజకీయాలలో రాణించాలని కురుమ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు కంతుల రాములు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోతుగంటి రవికాంత్, ప్రధాన కార్యదర్శిగా వాసూరి శ్రీకాంత్, కోశాధికారిగా బండారి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఏలేటి రమేష్, బట్టు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కంతుల లక్ష్మణ్, కోల్పుల రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా కంతుల శ్రీశైలం, అంజయ్య, దేవరాజులు వ్యవహరించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవికాంత్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. దుబ్బాకటౌన్: రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. అధైర్య పడవద్దని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, రామచంద్రం గౌడ్, భార్గవ్, లక్ష్మారెడ్డి, నందు తదితరులున్నారు. -
అక్షరాలకు ఆది
● నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ● ముస్తాబైన వర్గల్ క్షేత్రం వర్గల్(గజ్వేల్): తెలుగు రాష్ట్రాల్లో రెండో బాసరగా ఖ్యాతిగడించిన వర్గల్ విద్యా సరస్వతీ క్షేత్రం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. స్వయంభువుగా మహదేవుడు వెలసిన వర్గల్ శంభునికొండపై సప్తస్వరాల గుండు చెంత విద్యా సరస్వతి ఆలయం కొలువుదీరి దినదిన ప్రవర్థమానమై విరాజిల్లుతోంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యం హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలోని వర్గల్ క్షేత్రానికి సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక ట్రిప్ చొప్పున బస్సు బయల్దేరుతుంది. ఇవే కాకుండా కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ వైపు వెళ్లే బస్సులో వర్గల్ క్రాస్రోడ్డు వద్ద దిగి ఆటోలో క్షేత్రానికి చేరుకోవచ్చు. ఉత్సవాలకు నేడు అంకురార్పణ సోమవారం ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. కలశస్థాపన, చతుషష్ట్యోపచార పూజలు, అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు. 29న విశేష మూల సందర్భంగా ఉదయం గిరి ప్రదక్షిణ, 9 గంటలకు లక్ష పుష్పార్చన, 11 గంటలకు పుస్తక పూజ, అక్టోబర్1న మహర్నవమి, ఉదయం 9 గంటలకు అమ్మవారికి అష్టోత్తరశత కలశాభిషేకం, 2న కలశోద్వాసన, అభిషేకం, విద్యాసరస్వతి మాత విజయదర్శనం, శ్రవణా నక్షత్ర సందర్భంగా వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి అర్చన జరుగుతుంది.అన్ని ఏర్పాట్లు చేశాంఅమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందిలేకుండా బారికేడ్లతో క్యూలైన్లు, చిన్నారుల అక్షరస్వీకారాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పీఠాధిపతులను, మంత్రులు తదితర ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తూ ఉత్సవ ఆహ్వానపత్రికలు అందజేశాం. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలి. – యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ -
సంప్రదాయ పంటలకు స్వస్తి
నంగునూరు(సిద్దిపేట): సంప్రదాయంగా సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు స్వస్తి పలకాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్పామ్ ప్యాక్టరీని శనివా రం ఆయన సందర్శించి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గింజల నుంచి ఆయిల్ తీసే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అధికారులు చెప్పడంతో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నర్మేటలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే మొదటి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. నర్మేట ప్యాక్టరీ దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ ప్యాక్టరీ సిద్దిపేట జిల్లాకు ఎంతో కీలకంగా మారనుందన్నారు. రాష్ట్రంలో తయారయ్యే పామాయిల్ను ఇతర రాష్ట్రాలకు పంపితే అక్కడే ప్యాకింగ్ చేశారని, ఇక నుంచి నర్మేటలోనే శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తారన్నారు. నాలుగేళ్లు అంతర పంటలు ఆయిల్పామ్ తోటలోనాలుగేళ్ల పాటు అంతర పంటగా కోకో, జాజి, మొకడామియా, మునగ, వక్క పంటలను సాగు చేయడంతో అధిక లాభాలు గడించవచ్చని మంత్రి అన్నారు. ఆయిల్పామ్ టన్నుకు రూ.20 వేలు అందించేలా కృషి చేస్తామన్నారు. కావున ఆయిల్పామ్ సాగు శాతం పెంచేలా అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు, ఉద్యానవన శాఖ డెరెక్టర్ షేక్ యాస్మిన్బాషా, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సువర్ణ, ఆయిల్ఫెడ్, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కనెక్షన్.. కలెక్షన్!
● విద్యుత్ శాఖలో పైరవీలదే రాజ్యం ● అధికారులు, కాంట్రాక్టర్ల చేతి వాటం ● ఒక్కో కనెక్షన్కు రూ10 వేల నుంచి 20 వేలు వసూలుసాక్షి, సిద్దిపేట: విద్యుత్ శాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారు. పైస లేనిదే పని కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించినా అధికారులు, కాంట్రాక్టర్లకు చేతులు తడపాల్సిందే. దరఖాస్తులు సీరియల్ నంబర్ ప్రకారం కాకుండా పైరవీ చేసిన వారికే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లేకుంటే ఏదో సాకులు చెప్పి విద్యుత్ కనెక్షన్లు జాప్యం చేస్తున్నారు. విద్యుత్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో సాగునీటి సౌకర్యం లేని సన్నకారు రైతులు సైతం బోరు వేసి పంటలను పండిస్తున్నారు. ఒకప్పుడు వర్షాధారం మీదనే పంటలు పండించేవారు. ప్రస్తుతం బోర్ల ద్వారా పంటలు ఎక్కువగానే సాగు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,627 విద్యుత్ కనెక్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాసులిస్తేనే.. కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కొందరు విద్యుత్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కాసులు దండుకుంటున్నారు. సిఫార్సులు, పైరవీలతో పాటు చేతులు తడిపిన వారికే ముందస్తు కనెక్షన్లు ఇస్తున్నారు. సాధారణ రైతులకు మాత్రం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాన్స్ఫార్మర్, ఇతర మెటీరియల్, కనెక్షన్ కావాలంటే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి, అక్రమాలను అరికట్టాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. -
2.24 లక్షల మెట్రిక్ టన్నులబియ్యం ఎగుమతి
గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు.. ● గజ్వేల్ రేక్ పాయింట్ రికార్డు ● ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులపైనే.. ● దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలింపు గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మూడేళ్ల క్రితం ఏర్పాటైన రేక్ పాయింట్ ద్వారా ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ)కు చెందిన బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదికిపైగా ముఖ్యమైన రేక్ పాయింట్లు ఉండగా, వాటికి దీటుగా ఇక్కడ లావాదేవీలు నడుస్తున్నాయి. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు 80కిపైగా రేక్ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. అలాగే.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు రసాయనిక ఎరువుల సరఫరా కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతికి నిలయంగా మారింది. భవిష్యత్లో ఈ రేక్ పాయింట్ మరింత కీలకంగా మారనున్నది. గజ్వేల్లో 2022 జూన్ 27న రేక్ పాయింట్ను ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో సనత్నగర్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, తిమ్మాపూర్, జమ్మికుంట, మహబూబ్నగర్, జమ్మికుంట, మహబూబాబాద్ తదితర రేక్ పాయింట్లు ఉండగా, గజ్వేల్లో కొత్తగా ఏర్పాటైంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైనన్్ నిర్మాణం జరుగుతుండగా.. ఈ లైన్పై గజ్వేల్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ వద్ద రేక్ పాయింట్ను ఏర్పాటు చేశారు. ఎఫ్సీఐకి ప్రధాన వనరుగా.. గజ్వేల్ రేక్ పాయింట్ ఎస్సీఐకి ప్రధాన వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని అక్కారం, అల్లాపూర్ గోదాముల నుంచి బాయిల్డ్ రైస్ను దేశంలోని కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా తరలిస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు సుమారుగా 80 రేక్ల ద్వారా 2.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను ఇక్కడి నుంచి ఎగుమతి చేశారు. ఒక్కో రేక్ సామర్థ్యం 2,800 టన్నులకుపైనే ఉంటుంది. ఇదే కాదు.. ఈ రేక్ పాయింట్కు తమిళనాడు రాష్ట్రలోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి రైలు మార్గం ద్వారా కాంప్లెక్స్ ఎరువులతోపాటు యూరియా నిల్వలు వస్తాయి. ఇలా వచ్చిన నిల్వలను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రితోపాటు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలకు కేటాయింపుల వారీగా వ్యవసాయశాఖ సరఫరా చేస్తున్నది. మక్కలు ఇతర వ్యవసాయోత్పత్తులు సైతం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలను ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఏర్పాటైన ఈ రేక్ పాయింట్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలోని రేక్ పాయింట్లకు ప్రత్యామ్నాయం కావడం వల్ల రాబోవు రోజుల్లో మరింత కీలకంగా మారబోతున్నది. ఈ పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్కు అనుకూలంగా మారింది. -
సీఎంకు ఎంపీ చామల వినతి
వీరబైరాన్పల్లిగా మార్చండి మద్దూరు (హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్పల్లి గ్రామాన్ని ప్రభుత్వం వీరబైరాన్పల్లిగా పేరు మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రజాకార్లకు వ్యతిరేకంగా బైరాన్పల్లిలో జరిగిన పోరాటం చరిత్రలో నిలిపోతుందని, వారి దాడిలో 119 మంది అమరులైనట్లు గుర్తు చేశారు. నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తు గా గ్రామాన్ని వీరబైరాన్పల్లిగా పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్ను విడుదల చేయాలన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని బురుజు, అమరవీరుల స్తూపం మరమ్మతు కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. -
చట్టాలపై అవగాహన అవసరం
సీనియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంబ్లేమిరుదొడ్డి(దుబ్బాక)/సిద్దిపేటకమాన్: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటేనే సమాజంలో క్రైం రేట్ తగ్గుతుందని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మిలింద్ కాంబ్లే అన్నారు. మండల పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే.. సిద్దిపేట జిల్లా జైలును సందర్శించి వంట గది, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. ఖైదీలందరికీ న్యాయవాదుల ఉండాలన్నారు. లేనివారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వికాస్, న్యాయవాదులు యాదయ్య, ఖాజీపురం యోగేందర్, పారా లీగల్ వాలంటీర్ సీహెచ్ కవిత, ప్రొ.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రుణ లక్ష్యాన్ని సాధించాలి
బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశంసిద్దిపేటరూరల్: బ్యాంకర్లకు వివిధ సెక్టార్లో ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ద్వారా ప్రజల్లో డిజిటల్ మోసాల నివారణ, సోషల్ సెక్యూరిటీ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఎక్కువగా రుణాలు అందించాలని కోరారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు అందించాల్సిన రుణాల్లో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. బ్యాంకర్లకు ఇచ్చిన టార్గెట్ను బట్టి రుణాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ జయదేవ్ఆర్యా, ఆర్బీఐ ఏజీఎం గోమతి, నాబార్డు డీడీఎం నిఖిల్, ఎల్డీఎం హరిబాబు, యూబీఐ ఆర్హెచ్ శ్రీనివాస్, ఎస్బీఐ ఆర్ఎం మారుతి, మెదక్ డీసీసీబి డీజీఎం విశ్వేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా పౌష్టికాహారం
దుబ్బాక: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నా.. ఇంకా పౌష్టికాహారం లోపంతో మాతాశిశు మరణాలు చోటుచేసుకుంటుండటం బాధాకరం. ఆర్థిక పరిస్థితులతో చాలా మంది మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోతుండటంతో మధ్యలోనే అబార్షన్లు కావడం.. ప్రసవం అయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లిబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మాతా శిశు మరణాలను నివారించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే పోషణ మాసోత్సవంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించడంతో పాటు గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. పౌష్టికాహారం లోపంపై.. పిల్లల సంరక్షణ, పెంపకంపై సరైన అవగాహన లేకపోవడం, పెరుగుదల, ఆటంకాలు, అనారోగ్యాలకు వెంటనే చికిత్స అందించక పోవడం తదితర అంశాల్లో ఇంకా చాలా ప్రగతి సాధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహార లోపంపై ఐసీడీఎస్ యుద్ధంలా కార్యక్రమాలు చేపడుతూ ప్రగతిని సాధిస్తోంది. 1,150 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,150 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. గర్భిణులు 6,152, బాలింతలు 4,995, ఐదేళ్లలోపు పిల్లలు 60,836 మంది ఉన్నారు. వచ్చే నెల 16 వరకు.. ఈ నెల 17న ప్రారంభమైన పోషణ మాసం వచ్చే నెల 16 వరకు చేపడుతున్నారు. జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరధిలో సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా అఽధికారి లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు చేపట్టడడం పౌష్టికారం లోపం వల్ల జరిగే నష్టాలు తెలియజేస్తున్నారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి తదితర విషయాలపై సంపూర్ణంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికారాన్ని అందిస్తూ అంగన్వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. విస్తృతంగా ప్రచారం గర్భిణులు సరైన పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడంతో పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. పౌష్టికాహారలోపాలు లేకుండా చూసేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. గర్భిణులు పోషకాహారం సక్రమంగా తీసుకుంటనే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారు. – లక్ష్మీకాంతరెడ్డి, జిల్లా మహిళా శిశు, సంక్షేమ అధికారి సీ్త్ర శిశుసంక్షేమ శాఖ చర్యలు విస్తృతంగా పోషణ మాసోత్సవం ఐదు ఐసీడీఎస్ పరిధిలో1,150 అంగన్వాడీ కేంద్రాలు -
కరెంట్ తీగ కాజేస్తుండ్రు
కరెంట్ తీగలను దోచేస్తున్నారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే కరెంట్ వైరును కాజేస్తున్నారు. సాగు నీటిని అందించేందుకు తప్పని పరిస్థితుల్లో విద్యుత్ వైర్లు బయట కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు అందిస్తే బిగిస్తున్నారు. రైతుల ఆపదను ఆసరాగా చేసుకుని విద్యుత్ వైరును పలువురు కాంట్రాక్టర్లు అందించడం లేదు. విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,79,527 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేశారు. అందులో 1,78,900 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా 2,627 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. – సాక్షి, సిద్దిపేట బోర్లు, బావుల కింద పంటల సాగుకు రైతులు కరెంట్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. 5హెచ్పీ మోటార్లకు విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తోంది. 5హెచ్పీ కనెక్షన్కు రైతు రూ.5,350 మీ సేవలో చెల్లించాలి. విద్యుత్ శాఖ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా సర్వే చేస్తారు. లైన్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంచనాలు తయారు చేసిన అనంతరం మంజూరు చేస్తారు. ఒక్కో కనెక్షన్కు రూ.70వేలు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా అవసరమగు సామగ్రిని విద్యుత్ శాఖ కొనుగోలు చేసి కాంట్రాక్టర్కు అందజేస్తుంది. విద్యుత్ శాఖ అందించే వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామగ్రితో రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ఇంకా అదనంగా అవసరమైతే మళ్లీ డీడీ చెల్లించాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీలోనే అంతా సామగ్రి వస్తే అవసరం లేదు. ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని.. దాదాపు గత ఏడాది నుంచి విద్యుత్ కనెక్షన్కు సబ్సిడీ మంజూరు ఆలస్యమవుతుంది. పంటలకు సాగునీటిని అందించకపోతే నష్టపోయే ప్రమాదం ఉండటంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తాం.. విద్యుత్ వైర్ కొనుగోలు చేసి తీసుకవస్తే బిగిస్తాం అని రైతులకు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో వైర్ను కొనుగోలు చేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.70వేల నుంచి కరెంట్ వైర్, ఇతర సామగ్రిని డ్రా చేస్తున్నారు. కానీ వైర్ను తిరిగి రైతులకు అందించడం లేదు. ఇలా చాలా ప్రాంతాల్లో కాసుల కోసం విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారు. దీంతో రైతుల పై భారమవుతోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి అక్రమాలకు చెక్పెట్టాలని రైతులు కోరుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు రైతుల ఆపదను ఆసరా చేసుకుని మోసం విద్యుత్ శాఖ వైరు అందించినారైతులకు ఇవ్వని వైనం -
ఉద్యాన వర్సిటీలో ముగిసిన సదస్సు
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండురోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. సదస్సులో వనరుల పరిరక్షణ, పర్యావరణ మార్పుల ప్రభావం, ఉద్యాన రంగంలో వ్యూహాలు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. వాతావరణ మార్పులకు కారణంగా వచ్చే ఉద్యాన పంటల ప్రభావాలను ఎలా తగ్గించవచ్చు, అనువర్తాల వైవిధ్యాన్ని ఏవిధంగా పెంచుకోవచ్చు, భవిష్యత్తులో ఉద్యాన రంగంలో సాధించాల్సిన లక్ష్యాలపై చర్చించారు. సదస్సులో విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి సందర్శించి ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో యునివర్సిటీ అధికారులు భగవాన్, సురేశ్కుమార్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, శ్రీనివాసన్, విజయ తదితరులు పాల్గొన్నారు.చిన్నకోడూరు(సిద్దిపేట): ఈదురు గాలులతో కూడిన వర్షానికి శుక్రవారం మండల పరిధిలోని మాచాపూర్లో రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల సమీపంలో భారీ చెట్లు పడటంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపడి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గల్(గజ్వేల్): తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన గౌరారం చిన్నారులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పిల్లలను పరామర్శించి ఓదార్చారు. రూ.36,000 ఆర్థికసాయం అందజేశారు. రెండు నెలల వ్యవధిలో చిన్నారుల తల్లిదండ్రులు, అమ్మమ్మ మృతి బాధకరమన్నారు. పిల్లల దైన్యస్థితి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం డిమాండ్ సిద్దిపేట రూరల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పశువైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పశువైద్యాధికారిపై ‘సాక్షి’లో ప్రచురితమైన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో గొర్రెల కాపరుల్లో ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే దర్యాప్తు చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. అండర్ 14 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో సిద్దిపేటఅర్బన్, ద్వితీయ స్థానంలో దౌల్తాబాద్, తృతీయ స్థానం చిన్నకోడూరు, నాల్గవ స్థానంలో నంగునూరు మండలాలు నిలిచాయి. అండర్–17 బాలుర విభాగంలో దుబ్బాక ప్రథమ, హుస్నాబాద్ ద్వితీయ, తృతీయ స్థానంలో జగదేవ్పూర్ నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కూకునూరుపల్లి ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో హుస్నాబాద్, తృతీయ స్థానంలో ధూళ్మిట్ట మండలాలు నిలిచాయి. -
విధుల్లో అలసత్వం తగదు
● విద్యార్థులకు మెనూ ప్రకారంభోజనం అందించాలి ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతోపాటు విధుల్లో అలసత్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా అన్నం, పప్పుచారు, గుడ్డు మాత్రమే అందించినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం మిక్స్డ్ వెజిటేబుల్ కూర వండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హాస్టల్ వార్డెన్, సిబ్బందిని హెచ్చరించారు. ప్రాంగణంలోని కిచెన్ గార్డెన్ పరిశీలించి ఆరోగ్యాన్ని కాపాడే మునగ తప్పనిసరిగా పెట్టాలన్నారు. కిచెన్ గార్డెన్ ను బాగా అభివృద్ధి చేయాలని ప్రిన్సిపాల్ రవీందర్ను ఆదేశించారు. పాఠశాలలో కుట్టుమిషన్ శిక్షణ ఇస్తున్న క్రమంలో కుట్టు మిషన్ నైపుణ్యం పెంచేలా బాలికలకు శిక్షణ ఇవ్వాలని ట్రెయినీ టీచర్కు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
లంచాల కార్యదర్శి మాకొద్దు
అదనపు కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదునంగునూరు(సిద్దిపేట): ప్రతి పనికి పైసలు డిమాండ్ చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని తొలగించాలని గట్లమల్యాల గ్రామస్తులు అదనపు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. గట్లమల్యాలలో నిర్మించిన ప్రభు త్వ ఆస్పత్రిని శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రేవతి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై టీఎస్ఎంఐడీ ఈఈకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఆస్పత్రి భవనం పూర్తయినా వసతులు లేక ప్రారంభానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ను పిలిచి కాంపౌండ్వాల్, పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయకుంటే టెడర్ రద్దు చేసి కొత్త వారిని పిలుస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి లలిత ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. -
ఉత్తమస్థానం ఉపాధ్యాయుల కృషి ఫలితమే
డీఈఓ శ్రీనివాస్రెడ్డిజగదేవ్పూర్(గజ్వేల్): ఉపాధ్యాయుల సహకారంతోనే రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాకు ఉత్తమస్థానం లభించిందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ్పూర్ మండల విద్యాధికారి మాధవరెడ్డి పదవీ విరమణ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాధవరెడ్డి మూడు దశాబ్దలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. నాడు క్లాస్మెంట్.. నేడు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డిలు కలిసి చదువుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు విద్యారంగంలో స్థిరపడ్డారు. శ్రీనివాస్రెడ్డి తరగతి గదిలో క్లాస్మెంట్గా ఉద్యోగంలో జిల్లా అధికారిగా పదవీ విరమణ సభకు హాజరు కావడం విశేషం. మాధవరెడ్డి దంపతులకు డీఈఓ శాలువా కప్పి సన్మానించారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాల్సిందే
సిద్దిపేటకమాన్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే శాసనసభ సమావేశాల్లో రక్షణ బిల్లును ప్రవేశపెట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రమేష్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూలులో, నాంపల్లిలో న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట కోర్టు ఎదుట న్యాయవాదులు నల్లబ్యాడ్జీలతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణ, సాయిబాబ, గోవర్ధన్రెడ్డి, రవిబాబు, పత్రి ప్రకాష్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లో నిరసన హుస్నాబాద్: న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులో అనిల్కుమార్ అనే న్యాయవాదిపై దాడిని ఖండిస్తూ శుక్రవారం న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, వారి హక్కుల రక్షణ కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు చేయడం తగదన్నారు. స్టేషన్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కిరణ్కుమార్, కన్నోజు రామకృష్ణ, జుమ్లాల్నాయక్, కొత్తపల్లి దేవేందర్, బాలకిషన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ సక్సెస్
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. ఆయిల్ యూనిట్లో గింజల నుంచి ఆయిల్ తీస్తూ టెక్నికల్ సిబ్బందితో కలిసి ఆయిల్ఫెడ్ అధికారులు లోపాలను గుర్తించారు. ఇంకా పవర్ప్లాంట్ యూనిట్ను పరీక్షించాల్సి ఉండగా మిగతా పనులు పూర్తి కావడంతో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తి కావడంపై ఎమ్మెల్యే హరీశ్రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఫ్యాక్టరీ నేడు ప్రారంభానికి సిద్ధం కావడం చిరస్మరణీయమన్నారు. -
ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం
● పల్లెల్లో ఆరోగ్య సేవలు అందించాలి ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అక్కన్నపేట(హుస్నాబాద్): మారుమూల పల్లెల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్యబృందం ఎప్పటికప్పుడు సేవలను అందించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్యర్వంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియోన్ ద్వారా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. స్వయంగా అక్కడే బీపీ పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి, దంత, ఘగర్, బీపీ, గర్భ, చర్మ తదితర సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరం పేదప్రజలకు వరంలాంటిదన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్పామ్తో అధిక లాభాలు ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని గరీమా అగర్వాల్ రైతులకు సూచించారు. మండలంలోని మోత్కులపల్లికి చెందిన గొర్ల కొమురయ్య అనే రైతుకు చెందిన మూడెకరాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఆమె మాట్లాడుతూ ఆయిల్పామ్ అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చున్నారు. అలాగే ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి స్వరూప, ఎంపీడీఓ భానోతు జయరాం తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా ఈ స్పాట్ అడ్మిషన్లు కొనసాగనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 20న దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనే విద్యార్థులు రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారి రమేశ్ దుబ్బాక: ఆయిల్పామ్ సాగుతో రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని ఉద్యాన శాఖ అధికారి రమేశ్ అన్నారు. గురువారం పెద్దగుండవెల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు రవి వ్యవసాయ భూమిలో రెండు ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ మల్లయ్య, ఏఈఓ సంధ్య, పంచాయతీ సెక్రటరీ మరళీ, రైతులు ఉన్నారు. డీఈఓ శ్రీనివాస్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయుడే మార్గదర్శకుడని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అబ్దుల్ షరీఫ్ ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులకు తమ ఉద్యోగ జీవితంలో తరగని ఆస్తి వారి వద్ద చదువుకున్న విద్యార్థులేనన్నారు. సమావేశంలో జీడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంఈఓ యాదవరెడ్డి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్గల్(గజ్వేల్): గౌరారంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను గురువారం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పరామర్శించారు. రెండు నెలల వ్యవధిలో తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఇటీవల అనారోగ్యంతో తండ్రి మంజునాథ్ మృతిచెందడంతో పదమూడేళ్లలోపు ఉన్న నయనిక, అక్షయ్ అనాథలుగా మిగిలారు. పిల్లల దయనీయ పరిస్థితి తెలిసి చిన్నారులను పరామర్శించారు. రూ.30,000 ఆర్థికసాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున భవిష్యత్లో అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు. సిద్దిపేటకమాన్: మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మత్తు పదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలన్నారు. -
దంచికొట్టిన వాన
గజ్వేల్: భారీ వర్షాలు కురవడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మరోసారి మత్తడి దూకుతోంది. ఫలితంగా ఆ వరదనీరంతా పార్ధివేశ్వరాలయం రోడ్డువైపు నుంచి ప్రధాన రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డుపై ఉన్న హెచ్పీ పెట్రోల్బంక్లోకి భారీగా వరదనీరు చేరడంతో బంకులో లావాదేవీలు నిలిపేశారు. మళ్లీ జలదిగ్బంధంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రోడ్డు -
పంటకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు
సిద్దిపేటజోన్: ఆయిల్పామ్ సాగుకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పిలుపునిచ్చారు. ఇటీవల ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్పామ్కు అనుసంధానంగా కోకో, వక్క పంట సాగును అధ్యయనం చేసిన రైతులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం జరిగిందని, నాలుగేళ్ల కష్టం ఫలితాలు మీకళ్ల ఎదుటే ఉందన్నారు. ఆయిల్ పామ్ రైతులుగా ఉన్న అనుభవాన్ని ఇతర రైతులకు అవగాహన కల్పించి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటగా కోకో సాగుకు ఎకరాకు రూ.12 వేలు రాయితీ ఉందన్నారు. అదనంగా రూ. 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోకో పంట ఎంతో లాభదాయకంగా ఉందన్నారు. ఇది ఆయిల్పామ్ సాగుకు ముందడుగు లాంటిదని అభివర్ణించారు. రైతులకు మేలు చేసే దిశగా ఆయిల్పామ్ సాగు విస్తరణ పెరిగేలా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 28 శాతాన్ని 18శాతానికి తగ్గించిందని, దీనిపై పోరాటం చేస్తామన్నారు. ఆయిల్పామ్తో పాటు అంతర పంటల సాగుకు మొగ్గుచూపాలి సహచర రైతులకు అవగాహన కల్పించాలి రైతులతో ఎమ్మెల్యే హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్ -
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్కొండపాక(గజ్వేల్): రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హెచ్చరించారు. కుకునూరుపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదు రిజిస్టరును, ఆన్లైన్ నమోదు తీరులను పరిశీలించారు. ఈసందర్భంగా హమీద్ మాట్లా డుతూ త్వరలో భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం పరిష్కార దిశగా ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. సాదా బైనామాల సమస్యల పరిష్కారం విషయంలో చేసుకున్న దరఖాస్తులను పరిష్కారించే దిశగా స్పష్టమైన ప్రకటన రానుందన్నారు. అందుకు అనుగుణంగా సిద్దంగా ఉండాలన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు పేరుకుపోకుండా చూసుకోవాలన్నారు. -
త్వరలో కిశోర బాలికల సంఘాలు
● కలెక్టర్ హైమావతి ● ఆరోగ్య, శిశుసంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం సిద్దిపేటరూరల్: మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరే త్వరలో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి శాఖ, పాఠశాల, ఇంటర్మీడియెట్, లేబర్, ఇండస్ట్రీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లాలోని కిశోర బాలికలతో సంఘాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను తొలగించవచ్చన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు అనేది జీవితంలో అత్యంత కీలక దశ అని, ఈ దశలో సరైన మార్గదర్శకం ఇస్తేనే కౌమార బాలికలు సమాజానికి మార్గదర్శకులుగా మారతారన్నారు. బాల్యవివాహాలు, చదువు నిలిపివేయడం, రక్తహీనత, పోషకాహారలోపం, వేధింపులు వంటి ఎన్నో సవాళ్లు కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్నారన్నారు. బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారతన్నారు. గ్రామాల వారీగా సెర్ప్, ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు సంఘాలు ఏర్పాటు చేసేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏడీఆర్డీఓ సుధీర్, డీఎంహెచ్ఓ, పరిశ్రమల శాఖ అధికారి గణేష్ రామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్రెడ్డి, లేబర్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సెర్ప్ డీపీఎంలు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియపై జూమ్ ద్వారా ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్మెంట్ లెవల్లోకి రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలన్నారు. ఇంకా మార్కింగ్ చేయని వారితో మాట్లాడి సుముఖంగా లేని వారితో లెటర్ రాయించి తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు గృహాల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. -
బియ్యం నాసిరకం.. బువ్వ అదోరకం
● పాఠశాలలకు పురుగుల బియ్యం సరఫరా ● మెత్తటి అన్నంతో విద్యార్థుల అవస్థలు ● అధికారుల పర్యవేక్షణ లోపం ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు దుబ్బాకటౌన్: ప్రతీ పాఠశాలకు నాణ్యమైన సన్న బియ్యంతో విద్యార్థుల కడుపునింపుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ దుబ్బాకలోని పలు పాఠశాలల్లో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. బియ్యం సంచి తెరిస్తే చాలు ముక్క వాసన, తెల్లపురుగులు, లక్క పురుగులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ఘనమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యమైన బియ్యం అందక కింది స్థాయి ఉద్యోగులు, భోజనం మింగుడు పడక విద్యార్థులు నానావస్థలు పడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం పురుగుల బియ్యం సరఫరా చేయడంతో వాటిని తొలగించడానికి వంట పని వారు సైతం నానా తంటాలు పడుతున్నారు. పాఠశాలలో ఓ గదిలో బియ్యం ఆరబెట్టి పురుగులు తొలగిస్తున్నారు. కానీ వారు ఎంత వరకు పురగులు తొలగిస్తున్నారనేదే సందేహించాల్సిన విషయం. పురుగులు పూర్తి స్థాయిలో తొలగించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటని, వారి ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అస్వస్థత బారిన విద్యార్థులు నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రుల వాదన. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1లో నిత్యం తెల్ల పురుగులు, మెత్తటి అన్నంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాసిరకం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని వారు కోరుతున్నారు. బియ్యంలో పురుగులు దుబ్బాక మండలంలో 57 పాఠశాలకు దాదాపు వంద క్వింటాళ్ల బియ్యం ప్రతీ నెల సరఫరా చేస్తున్నారు. ఇందులో అధిక శాతం పురుగుల బియ్యం ఉండటం గమనార్హం. ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం నాసిరకం బియ్యం సరఫరా కాకుండా చర్యలు చేపడతాం. దుబ్బాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెం.1కు అందించే బియ్యం నాసిరకంగా ఉన్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే నాణ్యమైనవి అందించేలా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావద్దు. –ప్రభుదాస్, ఎంఈఓ, దుబ్బాక మెత్తటి ముద్దలాంటి అన్నం -
రాష్ట్రపతి నిలయంలో ‘పూలే’ విద్యార్థుల ప్రదర్శన
వర్గల్(గజ్వేల్): సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం వర్గల్ పూలే గురుకుల డిగ్రీ కళాశాల బాలికలకు దక్కింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధారాణి మార్గదర్శకంలో 22 మంది వలంటీర్ల బృందం రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. ‘తెలంగాణ ఉదయం’ పేరిట తెలంగాణ విమోచన పోరాట చరిత్ర ఘట్టాలను చాటుతూ 15 నిమిషాల నాటక ప్రదర్శనతో ఆహుతులను అలరింపజేశారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, మాడపాటి హన్మంతరావు, ఆరుట్ల కమలాదేవి తదితర పాత్రలతో విద్యార్థులు ఆకట్టుకుని ప్రశంసలు చూరగొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రసిద్ధ గేయరచయిత సుద్దాల అశోక్తేజ, రజాకార్ సినిమా నిర్మాత నరసింహరెడ్డి, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రమేశ్ విద్యార్థుల ప్రదర్శన తిలకించి అభినందించారు. జ్ఞాపికను అందించి సన్మానం చేశారు. -
నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలలో ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిబద్ధత కల్గి ఉండాలని ఎస్సీఈఆర్టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) డైరెక్టర్ గాజర్ల రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్లో నిర్వహించిన విద్యాశాఖ అధికారుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో గాజర్ల రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 15 అంశాలపై సమీక్ష నిర్వహించి, జిల్లా విద్యాధికారి, కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులకు, గాజర్ల రమేశ్ సూచనలు ఇచ్చారు. కొండపాక మండల పరిధిలోని సిరిసినగండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల కనీస సామర్థ్యాలు, ప్రతిభను పెంచుతున్న తీరును ప్రశంసించి సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆదిపితామహుడు విశ్వకర్మ
సిద్దిపేటరూరల్: కర్మయోగం, శిల్పకళ, యాంత్రిక విజ్ఞనానికి ఆదిపితామహుడు విశ్వకర్మ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి పొన్నం, కలెక్టర్ హైమావతి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలను మనం శ్రుతి, స్మృతి, పురాణాల్లో తెలుసుకుంటామన్నారు. మన జీవనోపాధికి, సమాజ అభివృద్ధికి మూలా ధారం అయిన పనిముట్లను కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్మకారులు అందరూ పూజిస్తారన్నారు. ప్రతి పని చిన్నది పెద్దది అని చూడకుండా, కష్టపడి, నిజాయితీతో పనిచేస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, సీపీ అనురాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులే ఆ ఇళ్లల్లో ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● డబుల్బెడ్రూం ఇళ్లపై అధికారులతో సమీక్ష సిద్దిపేటరూరల్: జిల్లాలోని డబుల్బెడ్రూం ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు అప్పగింత, ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరైనా లబ్ధిదారులకు అందించకపోవడం, కొన్ని అన్యాక్రాంతం కావడం వంటి ఘటనలు దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో డబుల్బెడ్రూం ఇళ్లను వేరేవాళ్లు ఆక్రమించిన క్రమంలో వెంటనే అధికారులు క్షేత్రస్తాయిలో తనిఖీలు నిర్వహించి ఖాళీ చేయించి అర్హులకు అప్పగించాలన్నారు. మిగిలిన ఇళ్లను ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హతగల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి మిగిలిన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వెంటనే మానిటరింగ్ కమిటీలను నియమించాలని, నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, చంద్రకళ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ సిద్దిపేటజోన్: ప్రజాపాలన వేడుకల్లో భాగంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ హైమావతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి జగదేవ్పూర్(గజ్వేల్): రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతులకు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జగదేవ్పూర్ మండలంలో 50 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, విడతల వారీగా పంపిణీ చేస్తామన్నారు.ప్రతి రైతుకూ యూరియా అందుతుందన్నారు. -
తెలంగాణ చరిత్ర ఘనం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ సిద్దిపేటకమాన్: తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉందని సిద్దిపేట అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. ప్రజాపాల న దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. మోదీ జన్మదినం పురస్కరించుకొని పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మండల అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో వేర్వేరుగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ విశ్వాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించగా 103 మంది రక్త దానం చేశారు. విమోచన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు, రామ మందిరం నిర్మాణం, జఠిలమైన సమస్యలను మోదీ పరిష్కరించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాం గోపాల్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో ఈ నెల 22 నుంచి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానిస్తూ బుధవారం పలువురి ప్రముఖులకు ఆలయ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తదితరులను హైదరాబాద్లో కలిసి ఆహ్వానపత్రికలు ఇచ్చారు. దరఖాస్తు చేసుకోండి గజ్వేల్రూరల్: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సబ్జెక్ట్లో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులతో, బీసీ, ఓసీలు 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు. అదే విధంగా యూజీసీ, నెట్, సెట్, పీహెచ్డీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో ఈనెల 18న ఉదయం కళాశాలలో జరిగే ఇంటర్వ్యూ(డెమో)కు హాజరు కావాలని సూచించారు.శిక్షణ పొందుతున్న సర్వేయర్లు హుస్నాబాద్రూరల్: పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో కొత్త సర్వేయర్లు భూముల కొలతలపై డిజిటల్ సర్వేలో శిక్షణ పొందుతున్నారు. వీరికి సర్వేయర్ లక్ష్మీనారాయణ మ్యాప్లు గీయడం, పాత రికార్డుల ప్రకారం కొలతలు వేయడంపై శిక్షణ ఇస్తున్నారు. సర్వేయర్లకు డిజిటల్ పరిజ్ఞానం కోసం కంప్యూటర్లో అవగాహన కల్పిస్తున్నారు. -
ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
హుస్నాబాద్: ప్రస్తుతం 90 శాతం రోగాలు ఆహారం ద్వారానే వస్తున్నాయని, మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు, కౌమార దశ బాలికలకు వైద్య శిబిరాలు నిర్వహించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబంలో మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మునగాకు, పప్పులు, ఆకుకూరలు సమపాళ్లల్లో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆస్పత్రిలో ఆయా వైద్య శిబిరాలను ప్రారంభించారు. -
అభివృద్ధి శరవేగం
● బైరాన్పల్లి పోరాట పటిమ.. తెలంగాణ పోరాటానికి మార్గదర్శకం ● ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పించాం ● జిల్లాను ప్రగతి పథంలో నిలుపుదాం ● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ● కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవంసంక్షేమానికి ప్రాధాన్యంసాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన ప్రభుత్వం.. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.5లక్షల నుంచి రూ. పది లక్షలు పెంచామన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 17న భారత దేశంలో తెలంగాణ హైదరాబాద్ విలీనమైన రోజు, ఈ విలీన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జరుపుకొంటున్నామని తెలిపారు. బైరాన్పల్లి పోరాట పటిమ తెలంగాణ పోరాట స్ఫూర్తికి మార్గదర్శకమని కోనియాడారు. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డు కోసం పదేళ్లుగా జనం నిరీక్షించారని, వారందరూ సన్న బియ్యం తినాలన్న ఉద్దేశ్యంతో కొత్త కార్డులు జారీచేశామన్నారు. రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూ భారతిని తీసుకువచ్చామని గుర్తు చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ సమృద్ధిగా నిధులు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళల అభివృద్ధి కోసం ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. 65వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. హైదరాబాద్లో అమరవీరుల స్ఫూర్తిగా స్తూపం నిర్మిస్తున్నామని, ఇది భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రూపకల్పన చేస్తున్నామన్నారు. మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, సీపీ డాక్టర్ అనురాధ, అదనపు కలెక్టర్లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జిల్లా అఽధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో అలసత్వం తగదు
● కలెక్టర్ హైమావతి ● జగదేవ్పూర్లో పర్యటన జగదేవ్పూర్(గజ్వేల్): వైద్య సేవల్లో అలసత్వం తగదని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయా?..అంటూ ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలితో కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. వైద్యులు సూచించిన విషయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆస్పత్రి రికార్డులను తప్పనిసరిగా అమలు చేయాలని, రోగుల వివరాలను నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్కు వైద్యురాలు బీపీ, షుగర్ చూసి సాధారణంగా ఉందని తెలిపారు. భూ భారతి సమస్యలు పరిష్కరించాలి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తుల తీరు తెన్నులపై ఆరా తీశారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను భూ భారతి నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అలాగే దౌలాపూర్లో ఇందిరమ్మ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగవంతం చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దార్ నిర్మల, ఎంపిడిఓ రాంరెడ్డి, వైద్యుడు సత్యప్రకాష్, కార్యదర్శి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు
డీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. సిద్దిపేటలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులును ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజురెడ్డి, ఆర్థికప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దుబ్బాక: దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలు చేసేలా త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని 15వ, 6వ వార్డుల్లో, చేర్వాపూర్లో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, మేసీ్త్రలతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. దుబ్బాక పట్టణం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడి ఉందన్నారు. ముగ్గులు పోసిన చోట వారం రోజుల్లో బేస్మెంట్ లెవల్ పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంతుల శ్రీనివాస్, చంద్రారెడ్డి, వార్డు ఆఫీసర్స్ తదితరులు ఉన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి(ఏఓ) తస్లీమా సుల్తానా మంగళవారం స్థానిక రైతు వేదికలో విలేకరులతో మాట్లాడు తూ వెల్లడించారు. పోతారం(జే) గ్రామంలోని లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణం, మల్లంపల్లిలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం(ప్రహర్ష), కట్కూర్ లోని సహకార సంఘానికి నోటీసులు ఇచ్చిన ట్లు తెలిపారు. యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు టోకెన్లు ఇవ్వగా, రైతులు ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లేలోపే యూరియా బస్తాలను ఇతరు లకు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోతారం(జే)లోని ఎరువుల దుకాణం యజ మాని బ్లాక్లో బస్తా యూరియాను రూ.500ల కు అమ్మిన్నట్లు తెలిసిందన్నారు. దీంతో సద రు దుకాణదారుడికి నోటీస్ జారీ చేశామన్నా రు. యూరియా బ్లాక్లో అమ్మినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి గజ్వేల్: త్వరలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేయడానికి సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారని, షరతుల్లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం లభించనున్నదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గఫార్ ఉద్యోగ విరమణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. మెరుగైన పీఆర్సీ ఇప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ వృత్తిలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగం, రాష్ట్ర నాయకులు వంగ మోహన్రెడ్డి, గుండు లక్ష్మన్, జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా స.హ.చట్టం
సిద్దిపేటరూరల్: సమాచార హక్కు చట్టాన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సమాచార హక్కు చట్టంపై పీఐఓలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, పీవీ శ్రీనివాసరావు, మెహసిన పర్వీన్లు కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్లతో కలిసి పాల్గొన్నారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, దీనికి కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో 17,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్న సందర్భంగా వాటిని పరిష్కరించి జీరోగా మార్చేందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారన్నారు. తెల్లరేషన్ కార్డ్ దారుడు ఉచితంగా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఇతరులు 10 రూపాయల కోర్ట్ ఫీ ద్వారా చెల్లించి సమాచారం పొందవచ్చన్నారు. పౌర సేవలు ఏ సమయంలో అందించాలి, అధికారుల వివరాలను తెలిపే సైన్ బోర్డ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓలు దరఖాస్తులు స్వీకరించి సమాచారం అందించాలని సూచించారు. చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరిగేలా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సందర్భంగా చట్టంపై పీఐఓ,ఏపీఐ లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సమాచార హక్కు చట్టం కమిషనర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వారథులుగా ప్రభుత్వ అధికారులు సిబ్బంది పని చేయాలన్నారు. తప్పుడు సమాచారం అందించినా, ఆలస్యం చేసినా ఆర్ట్టీఐ చట్టం ప్రకారం కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు అనవసరంగా భయాందోళనలకు గురై సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం చాలా దోహదం చేస్తుందన్నారు. జిల్లాలో ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న 170 కేసులను కమిషన్ సభ్యులు శాఖల వారీగా పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్ల తిరకాసు
ఎఫ్డీ చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక ● అయోమయంలో ‘డెయిరీ’ లబ్ధిదారులు ● ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 8.40కోట్ల సబ్సిడీ విడుదల ● ఇప్పటివరకు గ్రౌండింగ్ అయింది 281 యూనిట్లే ● పట్టించుకోని ఉన్నతాధికారులుసాక్షి, సిద్దిపేట: బ్యాంకర్లు తిరకాసు పెడుతుండటంతో ‘డెయిరీ’ లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణాలు ఇవ్వాల్సింది పోయి.. సబ్సిడీ మినహా రుణాన్ని ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తేనే డాక్యుమెంటేషన్ అంటూ మెలిక పెడుతున్నారు. దీంతో యూనిట్ మంజూరైనప్పటికీ ఎఫ్డీ చేయకపోవడంతో గ్రౌండింగ్ కావడం లేదు. ఎస్సీ కార్పొరేషన్లో 2020–21కు సంబంధించి 600 యూనిట్లకు రూ.8.40కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 281 యూనిట్లు గ్రౌండింగ్ కాగా 4.46కోట్ల సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో మూలుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డెయిరీ యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసింది. 2020–21లో 978 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా 600 యూనిట్లకు రూ 8.40కోట్ల సబ్సిడీ విడుదలయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ. 2లక్షలు. అందులో ప్రభుత్వం నుంచి రూ.1.40 లక్షలు (70శాతం) సబ్సిడీ, లబ్ధిదారుడి వాటా బ్యాంక్ నుంచి రుణం రూ.60 వేలు (30శాతం) అందించాలి. ఇప్పటి వరకు 281 యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్లో రెండు పాడి పశువులు అందించారు. ఇంకా 319 యూనిట్లు గ్రౌండింగ్ కాకపోవడంతో రూ.4.46 కోట్లు బ్యాంక్లోనే నిల్వ ఉన్నాయి. బెజ్జంకిలోనే అధికం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులను జమ చేసింది. గ్రౌండింగ్ చేయకుండా బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లుగా లబ్ధిదారులు బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా రుణాలు మంజూరు చేయడంలేదు. బెజ్జంకి మండలంలోని కేడీసీసీ బ్యాంక్లో దాదాపు 80 మంది లబ్ధిదారుల సబ్సిడీ డబ్బులు గతంలోనే జమ అయ్యాయి. ఇదే బెజ్జంకి కేడీసీసీ బ్యాంక్ వారు గతంలో రుణం డబ్బులు ఎఫ్డీ చేస్తేనే యూనిట్ను గ్రౌండింగ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లొద్దు ప్రభుత్వ గైడ్లైన్స్కు విరుద్ధంగా బ్యాంకర్లు ముందుకు వెళ్లవద్దు. ఎస్సీ కార్పొరేషన్ డెయిరీ యూనిట్ల మంజూరుపై బ్యాంక్ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ను నిర్వహిస్తాను. బ్యాంకర్లు రుణాలు ఇవ్వని పక్షంలో వెంటనే సబ్సిడీ డబ్బులను ఎస్సీ కార్పొరేషన్కు రిటర్న్ చేయాలని ఆదేశిస్తాను. – హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్మాకొద్దు యూనిట్లు బ్యాంకర్లు పెట్టే ఇబ్బందులు.. మరో పక్కన తీసుకవచ్చిన పాడి పశువులతో సరిగా పాల ఉత్పత్తి రాకపోవడంతో మాకు వద్దు యూనిట్లు అంటూ రద్దు కోసం ఎస్సీ కార్పొరేషన్లో లేఖలను అందిస్తున్నారు. హర్యానా నుంచి పాడి పశువులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకవచ్చిన పాడి పశువులు ఇక్కడి వాతావరణానికి సరిగా అలవాటు పడటం లేదు. దీంతో పాలు తక్కువగా ఇస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ అయిన, ఆంధ్రప్రదేశ్లోనైనా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని, బ్యాంకర్లే రుణం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
తపాలా.. ఎందుకిలా?
హుస్నాబాద్: పలు ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను ఎత్తేశారు. దీంతో గ్రామీణులకు తిప్పలు తప్పడంలేదు. ప్రముఖ పుణ్య క్షేత్రాలు, టూరిజం స్పాట్లకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే శ్రేయస్కరం. రైలు సౌకర్యం లేని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు పని చేస్తున్నాయి. భారత రైల్వేలు, పోస్టల్ శాఖ సమన్వయంతో ఇండియా పోస్ట్ ప్యాసింజర్ రైల్వే సిస్టమ్ (ఐపీపీఆర్ఎస్) ప్రవేశపెట్టారు. రైల్వే శాఖ, పోస్టల్ శాఖ సమన్వయంతో హుస్నాబాద్ సబ్ పోస్టాఫీస్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా రైతులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు వివిధ ప్రాంతాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు టికెట్ బుకింగ్ చేసుకొనే ప్రయోజనం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసులకు గాను 134 సెంటర్లల్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను ఎత్తివేశారు. ఇందులో తెలంగాణలో హన్మకొండ, భూపాల్పల్లి, హుస్నాబాద్, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి సబ్ ఫోస్టాఫీస్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత వాసులకు తిప్పలు హుస్నాబాద్ సబ్ పోస్టాఫీస్లోని టికెట్ కౌంటర్ నుంచి రోజు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి నగరాలకు రైల్వే రిజర్వేషన్లకు టికెట్లను బుక్ చేసుకుంటారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడేకే వచ్చి రైల్వే రిజర్వేషన్ చేసుకుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలు, నగరాలకు వెళ్లకుండా స్థానిక పోస్టాఫీస్లోని రిజర్వేషన్ల బుకింగ్ కౌంటర్ ద్వారా టికెట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కౌంటర్ను మూసివేయడంతో పట్టణాల్లో కానీ, ఆన్లైన్లో రైల్వే రిజరేషన్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.టార్గెట్ పూర్తికాకపోవడంతో.. పోస్టాఫీస్లో ఏర్పాటు చేసిన ఐపీపీఆర్ఎస్ సెంటర్ ద్వారా రోజు 10 టికెట్లు తగ్గకుండా ఎక్కువగా రిజర్వేషన్లు బుక్ చేసుకోవాలని టార్గెట్ విధించారు. కానీ 5 నుంచి 6 మాత్రమే ఎప్పుడో ఒక్కసారి 10 లోపు టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి. దీంతో టార్గెట్ పూర్తికావడం లేదని పోస్టల్ శాఖ భావించింది. అలాగే సిబ్బంది కొరత, ఇతరత్రా సమస్యలతో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ భారమని పోస్టల్ శాఖ కౌంటర్లను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. రైల్వే బుకింగ్ వల్ల పోస్టాఫీస్కు సంబంధించిన పథకాలు, లావాదేవీలకు ఆటంకం కలుగుతుందని సమాచారం. అందుకే రైల్వే సేవల నుంచి పోస్టల్ శాఖ తప్పుకుంది. హుస్నాబాద్ పోస్టాఫీస్లో రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాసిన విషయం విదితమే. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పూజల
ప్రశాంత్నగర్(సిద్ధిపేట): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హైదరాబాద్లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల పూజల హరికృష్ణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. జిల్లా కాంగ్రెస్లో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలపై పార్టీ చూసుకుంటుందని, పట్టించుకోవద్దని తాను అండగా నిలబడతానని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సిద్ధం
● ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ● త్వరలో సీఎం రేవంత్తో ప్రారంభిస్తాం ● ఫ్యాక్టరీ పనుల పరిశీలన నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రాంరంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించారు. ట్రయల్రన్లో భాగంగా ఆయిల్పామ్ గింజల కొనుగోలు చేసే ర్యాంపు పనులను ప్రారంభించారు. యంత్రాల పని తీరును పరిశీలించి ఆయిల్ఫెడ్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో విధులు నిర్వహించాలి
● పోలీసు కమిషనర్ అనురాధ ● సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్ సందర్శన సిద్దిపేటకమాన్: పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ అనురాధ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్ను సీపీ మంగళవారం సందర్శించారు. పీఎస్ ఆవరణలో మొక్కను నాటారు. పీఎస్లో సీజ్ చేసిన వాహనాలను, పలు రికార్డులను పరిశీలించారు. జిల్లాలో నూతనంగా మహిళా పోలీసు సిబ్బంది నిర్వహించే బ్లూకోల్ట్స్ విధులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్, అక్రమ ఇసుక రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వీపీఓలు తరచూ గ్రామాలను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు ఉపేందర్, వాసుదేవరావు, విద్యాసాగర్, శ్రీను, శ్రీధర్గౌడ్, కిరణ్, ఎస్ఐలు ఆసిఫ్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతులు
జగదేవ్పూర్(గజ్వేల్)/హుస్నాబాద్రూరల్/మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతుల అరిగోస వీడటంలేదు. సోమవారం పలు ప్రాంతాల్లో బారులు తీరారు. యూరియా అందకపోవడంతో కొన్ని చోట్ల ఆందోళనకు దిగారు. జగదేవ్పూర్లోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదను దాటుతున్నా పంటకు యూరియా వేయకపోవంతో ఎదుగుదల ఆగిపోతున్నదని వాపోయారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. – హుస్నాబాద్లో యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహించి ఎరువుల దుకాణం ఎదుట బైఠాయించారు. దుకాణ యజమాని యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్కు తరలించారని మండిపడ్డారు. యజమానిపై చర్యలు తీసుకుని షాప్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఓ వచ్చి నచ్చజెప్పినా వినిపించుకోలేదు, యజమానికి సోకాజ్ నోటీస్ జారీ చేస్తానని, విశాల పరపతి సంఘంలో ఎరువులు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు. – మద్దూరు రైతువేదిక, పీఏసీఎస్ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాశారు. బస్తా యూరియా కోసం రోజంతా నిరీక్షించాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. తీరని యూరియా వెతలు -
ముమ్మరంగా చేపట్టాలి
పారిశుద్ధ్యం పనులు● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలతో నేల చిత్తడిగా మారి, నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించేలా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. ● ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్త్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ, డీఆర్డీఓ, విద్య తదితర శాఖల సమన్వయంతో ఆస్పత్రులలో నిర్వహించాలన్నారు. అన్ని వయస్సు బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ ను ఆదేశించారు. ● స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా ఈనెల 17 నుంచి 2 వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో శ్రమదానం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలు తొలగింపు, పర్యావరణహితమైన పండుగల నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య ను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తో కలిసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. -
సుందరీకరణకు మంగళం
ఎనిమిది పనుల్లో మూడే పూర్తి ● రూ.2కోట్ల నిధుల్లో అరకొర వినియోగం ● మిగిలిన నిధులు ల్యాప్స్ ● తాజాగా రూ.15కోట్లతో ప్రతిపాదనలుగజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సుందరీకరణ పనులకు మంగళం పాడారు. పట్టణంలోని ఎనిమిది జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా.. కేవలం మూడింటిని మాత్రమే అభివృద్ధి చేసి చేతులు దులుపుకొన్నారు. రూ.2 కోట్ల నిధులు గతంలో విడుదల కాగా పావువంతుకుపైగా నిధులు ఖర్చుపెట్టి.. మిగిలిన నిధులు ల్యాప్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులకు ఆమోదం వస్తేనే పట్టణానికి కొత్త కళ రానుంది. – గజ్వేల్ ‘అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని’ అనే సామెత గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది. అభివృద్ధిలో ఆదర్శంగా కీర్తించిన ఈ మున్సిపాలిటీలో ప్రధాన పనులు పూర్తి చేయకపోవడంతో నిధులు సగంలోనే ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. మూడున్నరేళ్ల క్రితం పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని మహనీయుల విగ్రహాల జంక్షన్లను అందంగా తీర్చిదిద్ది, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని, ‘లవ్ జీపీపీ’ పేరిట స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా రూ.2కోట్లు నిధులు కూడా విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, పిడిచెడ్ రోడ్డు చౌరస్తా, అంబేడ్కర్ సర్కిల్, ఇందిరాపార్కు చౌరస్తా, జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తా, తూప్రాన్ రోడ్డులోని బాబుజగ్జీవన్రామ్ వై జంక్షన్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వద్ద గల సర్కిల్, ముట్రాజ్పల్లి సర్కిళ్లను అందంగా తీర్చిదిద్దడానికి సంకల్పించారు. కానీ ఇందులో అంబేడ్కర్ చౌరస్తా, బాబూజగ్జీవన్రామ్ చౌరస్తా, ముట్రాజ్పల్లి చౌరస్తాలో మాత్రమే పనులను పూర్తి చేసి, మిగతా పనులను చేపట్టలేదు. పట్టణంలో సుందరీకరణ పనులను పూర్తి చేయడమేకాకుండా, సెంట్రల్ లైటింగ్, హౌసింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ, డ్రైనేజీలు, వరద కాల్వ నిర్మాణానికి రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఇందిరాపార్క్ కూడలి, ఇతర కూడళ్ల సుందరీకరణకు రూ.కోటి, చిల్డ్రన్స్ పార్కుకు రూ.కోటి, పట్టణంలోని ప్రధాన రహదారులపై పెండింగ్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.5కోట్లు, సుమారు మరో 10కోట్లకుపైగా సీసీ రోడ్లు, ఇతర పనులకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం వస్తేనే పట్టణానికి నయా లుక్ రానుంది. ఈ అంశంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా గతంలో ‘గడా’ ద్వారా వచ్చిన సుందరీకరణ నిధులు ల్యాప్స్ అయిన మాట వాస్తవమేనన్నారు. తాజాగా ఇటీవల రూ.15కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆమోదం రాగానే పనులు పూర్తి చేస్తామన్నారు.ఎందుకీ పరిస్థితి? మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఈ మున్సిపాలిటీకి అడిగిందే తడవుగా నిధులు వచ్చాయి. కానీ నిధులను సకాలంలో వినియోగించి పట్టణ ప్రగతిని పరిగెత్తించడంలో మాజీ పాలకవర్గం పూర్తిగా విఫలమైంది. ప్రత్యేకించి పట్టణంలో సుందరీకరణ పనులు పూర్తి కాకపోవడానికి, సగంలోనే నిధులు ల్యాప్స్ కావడానికి పాలకవర్గంలోని విభేదాలే కారణంగా నిలిచాయి. ఇందిరాపార్కు చౌరస్తాతో ఇతర కూడలిల పనుల ప్రారంభానికి ప్రజాప్రతినిధులే అడ్డంకిగా మారారు. -
రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ను పునరుద్ధరించండి
కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం లేఖ హుస్నాబాద్: పట్టణంలోని సబ్ పోస్టాఫీస్లో రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి మంచి సదుపాయం ఉండేదని, ఈ కౌంటర్ మూసివేయడంతో అందరికీ అసౌకర్యంగా మారిందన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖలోని సంబంధిత అధికారులతో చర్చించి కేంద్రాన్ని త్వరగా పునరుద్ధరించాలని మంత్రి పొన్నం లేఖలో విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్లో బీజేపీ రాస్తారోకో హుస్నాబాద్: పట్టణాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాసీ్త్రయంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలిపిందన్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 20 నెలలు దాటుతున్నా విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంపత్ నాయక్, నాయకులు శ్రీనివాస్, సతీష్, రాజేంద్ర ప్రసాద్, బొల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మంత్రి కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యను అంగన్ వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుస్నాబాద్లోని మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ పోటీ సెంటర్లను ప్రారంభించి అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకే ప్రీ ప్రైమరీ విద్యను అప్పగించాలన్నారు. అనంతరం మంత్రి పీఏకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ తదితరులు ఉన్నారు. సిద్దిపేటరూరల్: మొక్కలను విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పర్యావరణ ప్రేమికుడు, నవ సమాజ నిర్మాణ సమితి జాతీయ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్ వర్మ అన్నారు. సోమవారం రావురూకుల మాజీ ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావుతో కలిసి విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా 10 లక్షల విత్తన బంతులు తయారుచేసి, రోడ్ల వెంబడి, గుట్టలపైన అడవుల్లో చల్లుతున్నామన్నారు. దీని ద్వారా చెట్ల పెంపకానికి దోహదం చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు తెలిపారు. ఎవరికై నా విత్తన బంతులు కావాలంటే ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. విత్తన బంతులలో ముఖ్యంగా మర్రి, మారేడు, వేప, రావి, జువ్వి, చింత, ఉసిరి, సీమసింత, మామిడి లాంటివి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఐలయ్య యాదవు, లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
స.హ.చట్టం..
ఎవరికీ పట్టని చుట్టం● సమాచార హక్కు చట్టం కింద సిద్దిపేట పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఇంటి నిర్మాణాల గురించి డిసెంబర్ నెలలో మున్సిపాలిటీలో ప్రవీణ్ దరఖాస్తు చేశారు. మే నెల వరకు వేచి చూసినా అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదు. దీంతో సదరు దరఖాస్తు దారుడు అప్పీల్ కోసం రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ను ఆశ్రయించారు. ● జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్రీడా ప్రాంగణాలు నిర్మించారు? ఎన్ని వినియోగంలో ఉన్నాయని సిద్దిపేటకు చెందిన వ్యక్తి ఆర్టీఐ కింద డీఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం సరిగా లేదని రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ను ఆశ్రయించారు. సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ సంస్థల్లో, పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనం పెంచడమే సమాచార హక్కు చట్టం లక్ష్యం. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా భారత పౌరసత్వం కలిగిన వ్యక్తులు అవసరమైన సమాచారాన్ని కోరవచ్చు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం అరకొరగా ఇవ్వడం, దరఖాస్తు చేసిన తర్వాత నిర్ణీత సమయం దాటినా సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్కు అప్పీల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2022 నుంచి ఇప్పటి వరకు 137 మంది దరఖాస్తు దారులు అప్పిల్కు వెళ్లారు. దీంతో మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అప్పీల్ కేసులు పరిష్కరించేందుకు సమాచార హక్కు కమిషనర్లు వస్తున్నారు. కన్పించని బోర్డులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులలో పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నంబర్ ముద్రించి ఉండాలని చట్టం చెప్తుంది. కానీ పలు కార్యాలయాల్లో నిబంధనలు అధికారులు ఉల్లంగిస్తున్నారు. అధికారులు బదిలీ అయినా పాత వారి పేర్లే దర్శనమిస్తున్నాయి. నేడు ఆర్టీఐ కమిషనర్లు రాక స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఐదుగురు కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోహిసినా పర్వీన్, భూపాల్, వైష్ణవిలు మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించనున్నారు. పక్క ఫొటోలో కన్పిస్తున్నది మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు లో భాగంగా ఏ అధికారిని సంప్రదించాలని తెలిపే బోర్డు. ఈ బోర్డులో ఉన్న అప్పీల్ అధికారి, ఈఈ గిరిధర్ గత నెల 31న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి బోర్డులో అధికారి పేరు మార్చలేదు. అలాగే ప్రత్యేకంగా బోర్డు కాకుండా వైట్ పేపర్లో ప్రింట్ తీసి అతికించడం గమనార్హం.సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని 30రోజుల్లోగా పీఐఓ సమాచారం ఇవ్వాలి. లేనిపక్షంలో దరఖాస్తు దారుడు మొదటి అప్పీల్ చేసుకోవచ్చు. 90 రోజుల్లోగా సమాచారం రాకుంటే రెండో అప్పీల్గా రాష్ట్ర సమచార హక్కు కమిషన్ను ఆశ్రయించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 137 మంది రెండో అప్పీల్కు వెళ్లారు. అందులో రెవెన్యూ అప్పీల్ కేసులే అధికంగా ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించనవి 88, ఆర్ ఆండ్ ఆర్కు 15, వ్యవసాయశాఖ 4, ట్రాన్స్పోర్టు 4, వైద్యారోగ్య శాఖ 2, విద్యుత్ శాఖ 2, ట్రైబల్ వెల్ఫేర్ 2, ఇతర శాఖలకు చెందినవి 20 కేసులున్నాయి. జిల్లా వ్యాప్తంగా రెండో అప్పీల్లో 137 కేసులు పలు కార్యాలయాల్లో కన్పించని బోర్డులు నేడు జిల్లాకు సమాచార హక్కు కమిషనర్లు