breaking news
Siddipet District News
-
డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తాం
చేర్యాల(సిద్దిపేట): చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించే వరకు ఉద్యమిస్తామని స్థానిక బార్ అసో సియేషన్ అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య అన్నారు. చేర్యాలలో కోర్టు ఏర్పాటై యేడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం న్యాయవాదులు కలిసి కేక్ కట్చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చర్చ జరుగుతున్న తరుణంలో మౌనంగా ఉంటే గతంలో జరిగిన అన్యాయమే జరుగుతుందన్నారు. గతంలోఅన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో చూపిన పోరాట పటిమతో మరోసారి ప్రజల మద్యకు వచ్చి అన్ని వర్గాల మద్దతుతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటించేలా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మనోహర్, యాదగిరి, మహేందర్, సురేందర్, రమేష్, ప్రణీత్, వెంకటేశ్, సురేష్, సంతోష్ పాల్గొన్నారు. -
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: జిల్లాలను కుదిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు యఽథాతథంగా కొనసాగుతాయన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలని ఈ అంశంపై దుష్పప్రచారం చేస్తున్నారని వాపోయారు. మరోవైపు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిరాధార ఆరోపణలను ప్రచారం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి పాత్ర గొప్పదని, అలాంటి నాయకునిపై తప్పుడు ప్రచారం సహించరానిదన్నారు. -
ఉన్నట్టా.. లేనట్టా!
సిద్దిపేట మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన జరిగేనా? జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక పాలకవర్గం గడువు మూడు నెలలే ఉండటంతో వార్డులపునర్విభజన అంశం తెర మీదకు వచ్చింది. ఈక్రమంలో విభజన ఉన్నట్లా.. లేనట్లా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. వార్డుల పునర్విభజన జరిగి నాలుగేళ్లు కావడం, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు వార్డుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాజకీయపదవులు ఆశిస్తున్న వారిలోనూ ఆశలు పెరిగాయి. – సిద్దిపేటజోన్సిద్దిపేట బల్దియా ఏర్పడి సరిగ్గా నేటికి 72 ఏళ్లు. అప్పట్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో లోకల్ ఫండ్గా పరిగణించి 1954లో మున్సిపల్గా ఆవిర్భావించింది. తర్వాత 1956లో 13 వార్డులతో మాజీ ఎమ్మెల్యే ఖాజా మోహినొద్దీన్ చైర్మన్గా తొలి పాలకవర్గం ఏర్పడింది. తర్వాత 1981లో పదహారు వార్డులుగా మారింది. సిద్దిపేట పట్టణ విస్తీర్ణం పెరగడంతో 1987లో 28 వార్డులుగా పునర్విభజన చేపట్టారు. అనంతరం 2005లో మళ్లీ వార్డుల్లో పునర్విభజన చేసి 34వార్డులుగా మార్చారు. తర్వాత 2021 మార్చిలో సిద్దిపేట బల్దియా సమీపంలో ఉన్న ఆరు గ్రామ పంచాయతీల విలీనంతో పునర్విభజన ప్రక్రియ తెర మీదకు వచ్చింది. ఎట్టకేలకు అప్పట్లో 43 వార్డులుగా పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య నిర్ణీత ప్రమాణాల కంటే అధికంగా ఉంది. 2021జనాభా లెక్కల ప్రకారం ఉన్న సంఖ్య కంటే 50వేల జనాభాపెరగడంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో వార్డుల పునర్విభజన అనేది తప్పనిసరి అనేది తెర మీదకు వచ్చింది. అప్పట్లో లక్ష ఓటర్లు మాత్రమే.. 2021 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట బల్దియాలో 1,00,658 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో జనాభా 50వేలకుపై చిలుకు పెరిగింది. అలాగే ఓటర్ల సంఖ్య 12వేలు పెరిగి.. ప్రస్తుతం మున్సిపాలిటీలో 1,12,000 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన ఓట్ల ఆధారంగా వార్డుల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దే క్రమంలో వార్డుల పునర్విభజన తప్పనిసరి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆరు వార్డుల్లో.. అప్పట్లో బల్దియా పరిధిలో వార్డుల్లో కనిష్టంగా 2,100 గరిష్టంగా 2,560 ఓటర్లతో వార్డుల రూపకల్పన జరిగింది. కానీ ప్రస్తుతం పెరిగిన జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చూస్తే పట్టణంలో ఉన్న ఆరు వార్డుల్లో లెక్కలకు పొంతన లేదు. పట్టణంలోని 1, 2, 3, 4, 15, 16 వార్డుల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి, నర్సాపూర్ , ఇమాంబాద్ గ్రామాల విలీనం ప్రక్రియ సమయంలో సమీప వార్డుల్లో కలిపి వార్డులుగా పునర్విభజన జరిగింది. ఒక్క రెండవ వార్డులోనే ఏకంగా నాలుగేళ్లలో 1500 ఓటర్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఆశలు చిగురించేనా? మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 43వార్డుల్లో పునర్విభజన జరిగితే అదనంగా మరో మూడు వార్డులు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. దీంతో కలిసి వచ్చే వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశవహులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా పునర్విభజన ప్రక్రియ సిద్దిపేటలో జరుగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. రాజకీయ నేతల్లో జోరుగా చర్చ ప్రస్తుతం 43 వార్డులు ప్రక్రియ జరిగితే మరో మూడు పెరిగే అవకాశం మూడు నెలల్లో ముగియనున్న పాలకవర్గం గడువు -
ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్: తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక వడ్డే ఓబన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. తెలంగాణ వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లింగమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఓబన్న అని కొనియాడారు. ప్రతీ ఊరికి మంచి నీటి బావులు, రాజుల కోటలు, చెరువుల నిర్మాణాలు వడ్డెర సోదరుల శ్రమ ఫలితమేనన్నారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధుడు ఓబన్న అని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జేఏసీ నియో జకవర్గ కో ఆర్డినేటర్ వీరన్న యాదవ్, వడ్డెర జన చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): క్రీడల్లో గెలుపోటములు సహజమని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపుకోసం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మండల పరిధి అంతక్కపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటమి చెందిన వారు నిరుత్సాహ పడకుండా భవిష్యత్తులో మరింత కృషి చేయాలన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, సర్పంచ్ సృజన్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): డెమోక్రటిక్ టీచర్చ్ ఫ్రంట్ జిల్లా శాఖను బలోపేతం చేద్దామని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిష్టయ్య, లింగారెడ్డిలు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జిల్లా పరిధిలోని మండలాల్లో ఎన్నికలు నిర్వహించి, సభ్యత్వ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకులు తిరుపతిరెడ్డి, రాములు, చంద్రబాబు, మల్లయ్య, ప్రభాకర్రెడ్డి, మనీష్కుమార్, రాజయ్య, వెంకటరమణరెడ్డి, ప్రవీణ్కుమార్, రాజయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నాచగిరిలో భక్తుల కిటకిట వర్గల్ (గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ వర్గాలు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. -
జిల్లా రద్దుకు రేవంత్ సర్కార్ కుట్ర
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ సిద్దిపేటకమాన్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో సిద్దిపేట జిల్లా రద్దుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్ర కు తెరలేపుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయి రాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో జిల్లాను రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని జిల్లా నుంచి వేరు చేస్తామనడం వెనక సిద్దిపేట జిల్లా రద్దుకు కుట్ర దాగి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా ఏర్పాటుకు పోరాటాలు జరిగాయన్నారు. కేసీఆర్ హయాంలో జిల్లా ఏర్పాటు కావడమేకాకుండా.. సమీకృత కలెక్టరేట్ను నిర్మించారన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి జిల్లా రద్దుచేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. జిల్లా రద్దు విషయంపై మంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేనట్లయితే కాంగ్రెస్ నాయకులను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పూల బాలకృష్ణారెడ్డి, మోహన్లాల్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎవరికి చెప్పుకునేది?
● ఆస్పత్రికి వస్తే చెప్పులు మాయమే? ● జీజీహెచ్లో సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం సిద్దిపేటకమాన్: వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. లోపలికి వెళ్లి బయటికి వచ్చే సరికే చెప్పులు కనిపించని దుస్థితి నెలకొంది. ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఓపీ సేవల నిమిత్తం రోజూ సుమారు 1500మందికిపైగా పేషెంట్లు వస్తుంటారు. అలాగే చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు, బంధువులు సైతం వస్తుంటారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో లోపలికి వెశ్లే సమయంలో చెప్పులు (పాదరక్షలు) బయట విడిచిపెట్టి వెళ్లేలా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్లి వచ్చే సరికే.. ఆస్పత్రి లోపలికి వెళ్లిన వారు తిరిగి బయటకు వచ్చి చూసే సరికే చెప్పులు ఉండటం లేదు. సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ చెప్పులను ఆస్పత్రి ఆవరణలో ఒక పెద్ద కుప్పలా వేస్తున్నారు. దీంతో రోగులు, వారి సహాయకులు తమ చెప్పుల కోసం గంటల తరబడి వెతుక్కోవాల్సి వస్తోంది. ఎంత వెతికినా దొరక్క పోవడంతో తీవ్ర అసహనంతో వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం చుట్టు పక్కల గ్రామాల నుంచి పేద ప్రజలే ఎక్కువగా వస్తుంటారు. వారు ఆస్పత్రికి వచ్చి చెప్పులు పోగొట్టుకోవడంతో వారిపై ఆర్థికభారం కూడా పడుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చెప్పులు సక్రమంగా పెట్టేలా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. -
దుబ్బాకకు పైసా విదల్చని సర్కార్
● రెండేళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యమే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నయాపైసా విదల్చలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులను రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దుచేసిందన్నారు. ఎన్నికల ముందు ఆ నిధులతోనే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 13న దుబ్బాకలో మంత్రి వివేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ అభివృద్ధి పేరిట కొత్త డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. మంత్రి వివేక్కు నిజంగా చిత్త శుద్ధి ఉంటే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, రాజమౌళి తదితరులు ఉన్నారు. తొగుట(దుబ్బాక): మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి సింగరాల మల్లన్న స్వామిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి జాతర ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పండక్కి.. బస్సెక్కి..
బస్టాండ్లలో సంక్రాంతి సందడి మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రంకొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గంగిరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్న వారితో జిల్లాలోని బస్టాండ్లు సందడిగా మారాయి. ఆదివారం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్.. ప్రయాణికులతో ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ఆకట్టుకున్న రంగవల్లులు
గజ్వేల్: మండల పరిధి ఆహ్మదీపూర్లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. 200మందికిపైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు శైలజ, మహిళా డిగ్రీ కళాశాల లెక్చరర్ భవానీ, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నపూర్ణ, సర్పంచ్ ప్రభాకర్ పాల్గొని మహిళలను అభినంధించారు. ఈ సందర్భంగా గెలు పొందిన వారికి బహుమతులను అందజేశారు. కాగా పోటీలో ప్రతి ఒక్కరికీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున్లు గిఫ్ట్లు అందజేశారు. -
యూత్పార్లమెంట్లో ప్రతిభ
ఎనిమిది మంది వర్గల్ విద్యార్థులకు ఢిల్లీలో బహుమతులువైశాలిఅభినవ్ రామ్చరణ్ బెన్హర్పాల్ ఆదినాథ్నక్షత్ర శ్రీమణి వైష్ణవివర్గల్(గజ్వేల్): యూత్పార్లమెంట్ పోటీలో చక్కని ప్రతిభతో ఎనిమిది మంది ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు బహుమతులకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో నిర్వహించిన 26వ జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలో వర్గల్ విద్యార్థులు పీ వైష్ణవి, అభినవ్, కే వైశాలి, బెన్హర్పాల్, రామ్చరణ్, పీ శ్రీమణి, ఆదినాథ్, టీ నక్షత్ర.. బహుమతులకు ఎంపికైనట్లు వివరించారు. ఈనెల 15న న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అర్జున్రామ్ మేఘవల్ నుంచి వీరు బహుమతులు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. -
జిల్లాను రద్దు చేస్తే ఉద్యమమే
గజ్వేల్: సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చూస్తే మరో ప్రజా ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ కార్య నిర్వాహక అధ్యక్షుడు దేవి రవీందర్ హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాలను కుదిస్తామని వ్యాఖ్యానించడంపై శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం మాజీ సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాపై కుట్రలను చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు మధు, మాజీ కౌన్సిలర్లు బాలేష్, చందు, బీఆర్ఎస్ నాయకులు పంబాల శివకుమార్, కళ్యాణ్కర్ నర్సింగరావు, గొడుగు స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట జిల్లా రద్దు కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా సాధన ఫోరం సభ్యులు హెచ్చరించారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవద్దని సూచించారు. సమావేశంలో ఫోరం ప్రతినిధులు రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, జనార్దన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సిద్దిపేటకమాన్: విద్యా సంస్థలకు వరుస సెలవులు రావడం, సంక్రాంతి నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు పట్నం నుంచి పల్లె బాట పట్టారు. వివిధ పనులు, విద్యా, ఉద్యోగ రీత్యా పట్టణాల్లో ఉంటున్నవారు పండుగకు సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సిద్దిపేట ఆర్టీసీ మోడ్రన్, నూతన బస్టాండ్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏ బస్సు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. 48 అదనపు సర్వీసులు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ డిపోల పరిధిలో బస్సుల ద్వారా ప్రతి రోజు ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. సిద్దిపేట డిపోలో 63 ఆర్టీసీ, 53 అద్దె, దుబ్బాక డిపోలో 29 ఆర్టీసీ, 08 అద్దె, గజ్వేల్ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో 42 ఆర్టీసీ, 28 అద్దె, హుస్నాబాద్ డిపో పరిధిలో 40 ఆర్టీసీ, 22 అద్దె బస్సులతో కలిపి నాలుగు డిపోల పరిధిలో మొత్తం 285 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ప్రతిరోజు జేబీఎస్, హైదరాబాద్, వరంగల్, హుస్నాబాద్, కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, యాదగిరిగుట్ట, కామారెడ్డి, రామాయంపేట, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, భువనగిరి, బీదర్ వంటి పలు దూర ప్రాంతాలతోపాటు పలు గ్రామాలకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ.. 48 అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. సిద్దిపేట నుంచి జేబీఎస్కు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. పండగ అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ 285 బస్సులతో ప్రయాణికులకు సేవలు పండుగకు 48 అదనపు సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సెలవులతో పల్లెలకు వెళ్తున్న విద్యార్థులు -
ఏర్పాట్లలో రాజీపడొద్దు పుల్లూరు బండ స్వయం భూలక్ష్మీనరసింహస్వామి జాతర ఘనంగా నిర్వహించాలని హరీశ్రావు సూచించారు. వివరాలు IIIలో u
స్టడీ టూర్కు మున్సిపల్ కమిషనర్సిద్దిపేటజోన్: కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పుణేలో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన అమృత్.2లో భాగంగా చెరువుల సంరక్షణ, నిర్వహణ, జలాశయాల మ్యాపింప్ ప్రక్రియ, మురికి నీటి శుద్ధీకరణ, సంప్రదాయ నీటి వనరుల పునర్జీవనం తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈనెల 7నుంచి 9 వరకు జరిగిన శిక్షణ తరగతులకు దేశ వ్యాప్తంగా 28 బల్దియాల కమిషనర్లకు అవకాశం దక్కింది. -
పర్యాటకంగా హుస్నాబాద్
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జిల్లెలగడ్డ అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నుంచి పర్యాటకులు వస్తారన్నారు. పర్యాటకంగా అభివృద్ధి అయితే ఈ ప్రాంత యువతకు టూరిజంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఉమ్మాపూర్లో మహాసముద్రం, సర్వాయి పాపన్న కోటలు, కాలభైరవ క్షేత్రం, రాయికల్ వాటర్ పాల్స్ ఉన్నాయని, గుట్టల సమీపం నుంచే జాతీయ రహదారి ఉండటం వల్ల పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. అటవీలో వాచ్ టవర్తో పాటు, పిల్లల పార్కు, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి పనులకు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి పనుల్లో వేగం పెంచుతామన్నారు. అనంతరం పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతూ... యువత ట్రెక్కింగ్ చేయడానికి ఎత్తయిన గుట్టలు ఉన్నాయని, హరిత నిధుల నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కు నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, డీఎఫ్ఓ పద్మజ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, శివయ్య, సర్పంచ్లు స్వరూప, ప్రశాంత్లు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు. గౌరవెల్లి బాధ్యత నాదే గౌరవెల్లి ప్రాజెక్టుకు నీరు తీసుకొచ్చే బాధ్యత తనదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాల్వను 15 కి.మీలు దూరం బైక్పై వెళ్లి పరిశీలించారు. నియోజకవర్గంలో మైనర్ కాల్వలకు 1200 ఎకరాల భూ సేకరణకు రూ.250 కోట్ల నిధుల విడుదల చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తే 57 వేల ఎకరాలు, గండిపెల్లి ప్రాజెక్టు ద్వారా మరో 14 వేల ఎకరాలకు సాగు నీరు అందుతాయని పేర్కొన్నారు. చెరువులు నింపితే మరో 35 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు శంకుస్థాపన -
జీరామ్జీతో 120 పనిదినాలు
హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ సిద్దిపేటకమాన్: గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు వంద రోజుల పని మాత్రమే కల్పించేవారని, జీరామ్జీ చట్టం ద్వారా 120 పని దినాలు కల్పించినట్లైందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో శనివారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న జీరామ్జీ చట్టం గ్రామీణ కూలీలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కూ లీల వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖా తాల్లోనే జమ చేసే విధంగా చట్టం రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాంచంద్రారెడ్డి, జనార్థన్, చందు తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కోహెడరూరల్(హుస్నాబాద్): కోహెడ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీసీఈటీ–2026) నోటిఫికేషన్ వెలువడింది.4వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, ఆర్థికంగా వెనుబడిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి అడ్మిషన్లతో పాటు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సైనిక్ స్కూల్, ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లలో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయన్నుట్లు ప్రిన్సిపల్ తెలిపారు. జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారులు ఎదగాలిచెరుకు శ్రీనివాస్రెడ్డి తొగుట(దుబ్బాక): క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని లింగాపూర్లో ఆత్మ కమిటీ చైర్మన్ గాందారి నరేందర్రెడ్డి నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో యువత క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. ఈ పోటీల్లో 50 జట్లు పాల్గొంటున్నా యని నిర్వాహకులు తెలిపారు. మొదటి బహు మతి రూ.20వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు నగదు అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గౌసొద్దీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు భూపాల్రెడ్డి, మహిపాల్రెడ్డి, సురేందర్రెడ్డి, రాములు, కిష్టాగౌడ్ పాల్గొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలిటీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి యాదగిరి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్న్ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు కొడిపల్లి ప్రశాంత్ కుమార్, శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు జక్కుల నరసింహులు, శ్రీకాంత్, పరశురాములు, త్రినాస్, తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలి శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర విధా నాలపై ఈనెల 8 నుంచి 11 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోరుయాత్ర శనివారం శివ్వంపేటకు చేరుకుంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీబీ జీరామ్జీ, జాతీయ విత్తన సవరణ, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19న జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నర్సయ్య, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. -
డైట్ మెనూ పాటించాల్సిందే
చిన్నకోడూరు(సిద్దిపేట): కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. నాణ్యమైన ఆహారపదార్థాలను వాడుతూ రుచికరంగా వండాలని సూచించారు. విద్యార్థులు కడుపునిండా లినాలని, అప్పుడే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. ఆమె వెంట హెచ్ఎం జ్యోతి, టీచర్లు ఉన్నారు. -
ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ
● వార్డుల విభజనలో అన్ని లోపాలే ● ఊసులేని కొత్త వార్డులు ● పాత వార్డుల్లోనే సర్దుబాటు ● గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలో దుస్థితి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్అండ్ఆర్ కాలనీ) వార్డుల విభజన గందరగోళంగా మారింది. ఈ కాలనీకి చెందిన 14వేలకుపైచిలుకు ఓట్లను 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో చేర్చారు. చాలావరకు ఇళ్లు ఒక వార్డులో ఉంటే.. ఓట్లు మరో వార్డులో కేటాయించారు. దీనివల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ అంశంపై మున్సిపల్ కార్యాలయానికి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమ కాలనీకి పది వరకు వార్డులు వస్తాయని భావిస్తే.. పాత వార్డుల్లోనే సర్దుబాటు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. – గజ్వేల్ ఓట్ల గజిబిజి ఇలా.. ● గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీలోని ఏటిగడ్డ కిష్టాపూర్కు సహకార సంఘం మాజీ చైర్మన్ కురాకుల మల్లేశంతోపాటు ఆయన కుటుంబీకులు 21మంది ప్రస్తుతం మున్సిపల్ వార్డు విభజనలో భాగంగా 12వ వార్డులో నివాసముంటున్నారు. కానీ 3 ఓట్లు మినహా మిగతా 18 ఓట్లను 10వ వార్డులో కలిపారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ● పదో వార్డులోని 200మంది ఎస్సీ కుటుంబాలకు చెందిన ఓట్లను 12వ వార్డులో కలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ రెండే కాదు.. ఆర్అండ్ఆర్ కాలనీకి కేటాయించిన మిగతా 7, 8, 9, 11వార్డుల్లోనూ ఇదే దుస్థితి. ● కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబానికి చెందిన భా ర్యది ఒకచోట, భర్తది మరో చోట, పిల్లల ఓట్లు వేరే ప్రాంతంలో ఉండటం సమస్యగా మారింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన విషయం కూడా విదితమే. ఆయా గామాలకు చెందిన సుమారుగా 14వేలకుపైగా ఓట్లు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యాయి. కానీ మెజార్టీ నిర్వాసితులు మున్సిపాలిటీలో విలీనం కోరుకోవడం లేదు. తమ గ్రామాలను పంచాయతీలుగా కొనసాగించాలని కోరుతూ వస్తున్నారు. మున్సిపాలిటీ విలీనం ఏమైనా సక్రమంగా ఉందా..? ఆ పరిస్థితి లేకపోవడం నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇంటి నంబర్లు లేకపోవడమే కారణం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ వార్డుల విభజనలో లోపాలు తలెత్తడానికి ఇప్పటివరకు ఈ కాలనీకి ఇంటి నంబర్లు లేకపోవడమే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. 2020లో ముంపు గ్రామాలను ఇక్కడికి తరలించిన అధికారులు వీరిని గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని తొలుత భావించారు. దీంతో వీరికి పాత ఇంటి నంబర్లే కొనసాగాయి. కానీ నేడు పంచాయతీలను రద్దు చేసి.. మున్సిపల్ వార్డుల విభజనలో భాగంగా ఈ గ్రామాలను విలీనం చేసిన సందర్భంలో ఇంటి నంబర్లు లేక...వరుస క్రమంలో వార్డుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది. పది వార్డులొస్తాయని భావిస్తే... మున్సిపాలిటీలో ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన 14వేల పైచిలుకు ఓట్ల విలీనంతో ప్రస్తుతమున్న 20వార్డులకు మరో 10వార్డులు పెరిగి 30కి చేరుకుంటాయని భావించారు. ఆ పది వార్డులు కూడా తమకు ప్రత్యేకంగా ఉంటాయని, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనని అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మమ్మల్ని ఆగం జేసిండ్రు గ్రామ పంచాయతీలను రద్దు చేసి మమ్మల్ని ఆగం జేసిండ్రు. ఇప్పుడైనా వార్డుల విభజన సక్కగా చేస్తరనుకుంటే అది జరగలేదు. ఇల్లు ఒక దగ్గర ఉంటే.. ఓటు మరో దగ్గర ఇచ్చిండ్రు. మాకు 10 వార్డులు వస్తే బాగుండేది. మా సమస్యలను చెప్పుకునే అవకాశం కలిగేది. కానీ పాత వార్డుల్లోనే సర్దుబాటు చేస్తే ఎట్ల? –కురాకుల మల్లేశం, సహకార సంఘం మాజీ చైర్మన్, ఆర్అండ్ఆర్ కాలనీ -
మధ్యాహ్న భోజనంలో కానరాని గుడ్డు
శుక్రవారం సాక్షి పరిశీలనలో.. పాఠశాల సంఖ్య మొత్తం హాజరైన విద్యార్థులు వారు ప్రాథమిక 567 28,396 23,280 ప్రాథమికోన్నత 112 6,959 5,706 ఉన్నత 261 45,767 37,530 విద్యార్థులకు పౌష్టికాహారం కరువు పాటించని డైట్ మెనూ కొన్ని చోట్ల అరటి పండు, బిస్కెట్ ప్యాకెట్... వంట కార్మికుల్లో నిర్లక్ష్యం సాక్షి పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు -
విశ్వతేజకు బాలరత్న
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నవయస్సులోనే అద్భుత కథలు రాసిన అనంతసాగర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి విశ్వతేజకు బాలరత్న అవార్డు వరించింది. ఇటీవల కెనడా దేశం ఆధ్వర్యంలో జరిగిన కథల పోటీల్లో విశ్వతేజ మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్కు చెందిన కమలాకర ట్రస్టు వారు శుక్రవారం ఈ అవార్డును బహూకరించారు. అవార్డు పొందిన విశ్వతేజను కలెక్టర్ హైమావతి అభినందించి సన్మానించారు. పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి ఆంగ్లభాష ప్రతిభా పోటీలను ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో భాగంగా టెడ్, ఎడ్, స్టూడెంట్ టాక్ పోటీలు చేపట్టారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని డీఈఓ శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి ముండ్రాతి రమేశ్, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎల్పీఓ చందన చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తేనే వ్యాధులు దరి చేరవని డీఎల్పీఓ చందన అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామునిపట్లను సందర్శించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిశీలించారు. మురికి కాలువల్లో చెత్తవేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ సమస్యను త్వరలోనే అందరి సహకారంతో పరిష్కరిస్తామన్నారు. వర్గల్(గజ్వేల్): శ్రవణానందానికే పరిమితం కాకుండా ఏకీకృతమయ విధానంలో మన శాస్త్ర ధర్మాలు, ప్రాంతీయ ఆచారాలను సంరక్షించుకోవాలని గురుమదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. శుక్రవారం నాచగిరి టీటీడీ కల్యాణ మండపం వేదికగా లక్ష్మీ గణపతి బ్రాహ్మణ సేవా సమితి, ఆలయ అర్చక, పురోహిత వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ వైతాళికులు శాస్త్రుల విశ్వనాథశాస్త్రి శతజయంతి సభకు హాజరయ్యారు. ప్రముఖ పండితులు యాయవరం రామశర్మ, డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మలను ఘనంగా సత్కరించారు. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ మన ప్రాంతంలో సంస్కృతం, శాస్త్రం, వేదం పరిఢవిల్లాలన్నారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులను మినహాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2012 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులను నుంచి మినహాయించేందుకు ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. -
జిల్లా జోలికి వస్తే ఊరుకోం..
● సంగారెడ్డిలో కలపాలని కుట్రలు ● సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ ఆగ్రహం సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి జిల్లాలు ఎక్కువ అయ్యాయని సాకు చూపి జిల్లాను రద్దు చేసి, సంగారెడ్డిలో కలపాలని కుట్రలు చేస్తున్నారు. జిల్లా జోలికి వస్తే ఉరుకోం’ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు... కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీలో అడిగితే నా మీద కోపం పెట్టుకున్నారన్నారు. ఏదైనా ఉంటే నాపై కోపం చూపించు కానీ సిద్దిపేట ప్రజల మీద కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన సిద్దిపేట అస్థిత్వాన్ని కాపాడుకుంటామని, అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పేదవారికి సేవ చేయాలి.. సేవా భావం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ పేదవారికి సేవ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. స్థానిక కంచరీ బజార్లో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజల దీవెనలతో నాయకులు అవుతారని, వారికి లాభాపేక్ష లేకుండా సేవా చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శర్మ. రాజనర్స్, సంపత్ రెడ్డి, సాయిరాం, సికిందర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
● ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్బక్కి వెంకటయ్య సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దని, అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్, అట్రాసిటి కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు. -
అందరికీ మెరుగైన వైద్య సేవలు
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కోహెడలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రజలందకీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో ఆర్వీఎం ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య శిబిరంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి, పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. ‘మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా.. పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్కు తీసుకెళ్లి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం చేయిస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. పరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేయాలని వైద్యులను ఆదేశించారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అనంతరం జూనియర్ కళాశాల విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశయ్యారు. కళాశాలలోని మౌలిక సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం..మీరు పట్టుదలతో చదవి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఎంహెచ్ఓ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్: డాక్టర్లు దేవుడితో సమానమని, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వారితో చెప్పుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేటలో శుక్రవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో, హుస్నాబాద్లో సురభి వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్కన్నపేట మండలాన్ని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దత్తత తీసుకొని అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏడు మెడికల్ కళాశాలలు దత్తత తీసుకొని మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో తెచ్చినట్లు వెల్లడించారు. హుస్నాబాద్కు పీజీ మెడికల్ కళాశాల వస్తోందని డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీటీచర్లు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సేకరించాలన్నారు. డాక్టర్లు దేవుడితో సమానం -
పరిష్కారమా.. అవరోధమా!
నిర్వాసితుల నెత్తిన విలీనం పిడుగుమున్సిపల్ ఎన్నికల వేళ.. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీవాసులకు మరో టెన్షన్ మొదలైంది. ఈ కాలనీలోని 14 వేలకు పైచిలుకు ఓటర్లను గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో చేరుస్తూ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. వీటిపై నామమాత్రంగా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈనెల 12వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుండగా.. ఈ పరిణామం పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారుతుందా..? అనే ఆందోళన నిర్వాసితులను వెంటాడుతోంది. గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాలైన ఏటిగడ్డకిష్టాపూర్లో 1253, లక్ష్మాపూర్లో 388, వేములఘాట్లో 1252, పల్లెపహాడ్లో 921, రాంపూర్లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలు ఉన్నాయి. ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7.5లక్షలు, ఇల్లు. ఇల్లు వద్దంటే వారికి ఓపెన్ ప్లాటు, మరో రూ.5లక్షలు అందజేశారు. అనేక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్యాకేజీలు, పరిహారాలే కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీకి గుడి, బడి, అంగన్వాడీ కేంద్రాలు అవసరమైన స్థాయిలో లేకపోవడం, శ్మశాన వాటికలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక్క రూపాయి కూడా విదిల్చ లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వీరి సమస్యల పరిష్కారానికి ఒక్క పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల్లో చేర్చడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందేనా?మున్సిపల్ వార్డుల విభజనలో ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన ఓట్లను 7, 8, 9, 10, 11, 12వార్డుల్లో చేర్చి స్థానిక మున్సిపల్ అధికారులు ఈనెల 2న జాబితాను ప్రకటించారు. అయితే.. ఈ జాబితా ప్రకటనపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలను ఆదరాబాదరాగా రద్దు చేసిన అధికారులు.. మున్సిపాలిటీలో అధికారికంగా వార్డుల విలీనం తర్వాత... పెండింగ్ సమస్యలను ఇక ప్రభుత్వం పట్టించుకోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ గ్రామ పంచాయతీలను యథాతథంగా కొనసాగించి, మున్సిపాలిటీలో విలీనం చేయకుండా గజ్వేల్ మండలంలో కలపాలని 2023లో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని గుర్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నిర్వాసిత కాలనీ వాసులు ఈనెల 5న స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఈ అంశాలపై తమ అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు. తమ గ్రామాలను వార్డుల్లో మున్సిపల్ విలీనం చేయడం తప్పనిసరిగా భావిస్తే.. పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాతే వార్డుల విభజన చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకుండా ముందుకు వెళితే.. సమస్యల పరిష్కారానికి సాంకేతిక అంశాలు అడ్డుగా మారొచ్చని ఆవేదన చెందుతున్నారు. ఎంతకాలం ఎదురుచూడాలిపెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏళ్లతరబడి అధికార యంత్రాంగం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సర్వం పోగొట్టుకొని వచ్చిన మాపై ఇంత చిన్నచూపు తగునా..? ఇప్పుడేమో మున్సిపల్ వార్డుల విభజన జరిగిందని చెబుతున్నారు. కానీ మా ఇబ్బందుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. –హయాతొద్ధీన్, ఆర్అండ్ఆర్కాలనీసమస్యలు తీరే వరకు పోరాడుతాంమా సమస్యలను పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉంటాం. గ్రామ పంచాయతీలను యథాతథంగా కొనసాగించాలి. మా అభిప్రాయాలను తెలుసుకోకుండానే మున్సిపల్ వార్డుల విభజన చేశారు. ఇదేం తీరు..? –ఆశోక్, అర్అండ్ఆర్ కాలనీ -
ఇష్టం లేకుంటే వెళ్లిపోండి
సాక్షి, సిద్దిపేట: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఈజీఎస్ పనుల ప్రగతిపై మండలాలు, గ్రామాల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనిచేయడానికి ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కల్పించాలన్నారు. పంచాయతీ, అంగన్వాడీ భవనాలు ఇతర నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రెండు రోజుల్లో టెక్నికల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తామన్నారు. గ్రామాల వారీగా ఉపాధి హామీ కూలీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కొండపాక(గజ్వేల్): సమగ్ర ఓటరు జాబితా సవరణలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. కుకునూరుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ తీరులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన పనులన్నీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని కోరారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ పట్ల నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని చ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ సుజాత, ఆర్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి 15లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి కలెక్టర్ హైమావతి ఆదేశం -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదో తరగతి విద్యార్థులకు డీఈఓ శ్రీనివాస్రెడ్డి సూచన కొండపాక(గజ్వేల్)/గజ్వేల్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యార్థులు దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కుకునూరుపల్లి మండలం మాత్పల్లి, హనుమాన్నగర్, కోనాయిపల్లి, వడ్డెర కాలనీ, కాశీనగర్, కోలోనివంపు, రామునిపల్లి, పీటీ వెంకటాపూర్లో.. అలాగే.. గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి పదోతరగతి కీలకమని చెప్పారు. భవిష్యత్లో రాణించడానికి ఇది తొలిమెట్టు అవుతుందని చెప్పారు. విద్యార్థుల్లో చదవడం, రాయడంతో పాటు గణిత భావాలు పెంపొందేలా కృషి చేసుకోవాలని సూచించారు. జాతీయ విద్యా సర్వేలో భాగంగా ఫిబ్రవరిలో జరిగే ప్రతీ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో విద్యారంగ తీరును గుర్తిస్తారన్న విషయాన్ని ఉపాధ్యాయులు మర్చిపోవద్దన్నారు. ఎఫ్ఎల్ఎస్ ఫౌండేషన్ లర్నింగ్ స్టడీపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. టెన్త్లో ర్యాంకు సాధించడం ద్వారా తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. -
రిజర్వేషన్.. టెన్షన్!
సాక్షి, సిద్దిపేట: పుర పాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండటంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం గతేడాది జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సిద్దిపేట పురపాలక సంఘం పాలక వర్గం ఈ ఏడాది మే వరకు ఉంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేస్తోంది. పదవీ కాలం ముగిసిన నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులుండగా 1,01,090 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఓటరు ముసాయిదాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 12న ఓటరు తుది జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలను టీ పోల్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. గత మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు గజ్వేల్ మున్సిపాలిటీ ఓసీ జనరల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు జనరల్ మహిళకు కేటాయించారు. పలువురు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఆయా వార్డుల్లో గ్రౌండ్ వర్క్ను ప్రారంభించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఏ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే దానిని నుంచి పోటీ చేయాలని ముందస్తు జాగ్రత్తతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనం మధ్యనే ఉంటున్నారు. ఆయా కాలనీలలో ఏదైనా సమస్యను ప్రజలు దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ప్రజల మన్ననలు పొందాలని ఆశావహులు ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. కీలకంగా మారనున్న చైర్మన్ స్థానం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం రిజర్వేషన్ కీలకంగా మారనుంది. ఈ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలోని ప్రధాన నాయకులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన ఆయా సామాజిక వర్గాల నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా చూడాలని అధికార పార్టీ నేతలను ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. పుర ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితా విడుదల రిజర్వేషన్పై ఆశావహుల్లో ఉత్కంఠ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఎలా ఉంటాయో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రిజర్వేషన్లలో మహిళ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపు రొటేషన్ పద్ధతిలో ఉంటాయా?.. కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసి రాకపోతే జనరల్ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
మీ పిల్లల భవిష్యత్కు ఇదే నాంది
● ఎమ్మెల్యే హరీశ్రావు ● పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేటజోన్: ‘‘కొద్దీ రోజుల్లో మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇది అత్యంత కీలకమైన ఘట్టం. మంచి మార్కులతో గట్టెక్కితే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంది. మీ పిల్లల భవిష్యత్కు పదవ తరగతి ఫలితాలు నాంది’’ లాంటివని ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదవ తరగతి ఫలితాల్లో నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలనాం్నరు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చూడాలని, విందులు, వినోదాలు, సినిమాలు, టీవీల జోలికి పోకుండా వారిని పరీక్షలు పూర్తయ్యే వరకు జాగ్రత్తగా గమనించాలని సూచించారు. వ్యవసాయ పనులు, ఇంటికి సంబంధించిన పనులు చెప్పొద్దని సూచించారు. నియోజకవర్గ పరిధిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తన ఆకాంక్ష అని, ఇందుకు మీరు సహకరించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో 169 సిద్దిపేట పిల్లలు సీట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
జిల్లా ఉద్యానశాఖ అధికారి, సువర్ణ సిద్దిపేటరూరల్: కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెంకటాపూర్లోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ రైతులకు వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ కూరగాయలు సాగు చేస్తున్న రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులలో నీటి వినియోగం పెంచుకోవచ్చన్నారు. మల్చింగ్, ట్రెల్లిస్ పద్ధతులు, సేంద్రియ పద్ధతుల ఉపయోగాలను గురించి వివరించారు. అనంతరం కూరగాయల సాగు రైతులకు ప్లాస్టిక్ పెట్టెలు, వర్మీకంపోస్టు బెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారిణి కౌసల్య, ఉద్యాన విస్తరణ అధికారి రమేశ్, ఏఈఓ నవ్య తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఓ నాగరాజమ్మ సిద్దిపేటరూరల్: ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా రెవెన్యూ అధికారి డి.నాగరాజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేసే పద్మ శాలి ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందువరుసలో ఉండాలన్నారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ మరింత ఉన్నత పదవులకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, గౌరవ అధ్యక్షులు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. ములుగు(గజ్వేల్): విద్యా, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు విశ్వవిద్యాలయ క్యాలెండర్ మార్గదర్శకంగా నిలుస్తుందని వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలనతో అకడమిక్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు భగవాన్, చీనానాయక్, వీరాంజనేయులు, లక్ష్మినారాయణ, సురేష్కుమార్, శ్రీనివాసన్, రాజశేఖర్, సైదయ్య, అశ్విన్, వీరన్న, రామయ్య, రాజేశ్వరి, రోజారాణి, సతీష్ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి బాలలక్ష్మి దుబ్బాకటౌన్: తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలలక్ష్మి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో చలో సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు వెంటనే గుర్తింపు కార్డులివ్వాలని, 250 గజాలలో ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు రూ.30 వేల పెన్షన్, వందెకరాలలో అమరవీరుల స్మృతిమనం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనలక్ష్మి, నాయకులు రాజు, ఇంద్ర, లలిత, చిత్తార, సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
అద్దెకు స్వస్తి సాధ్యమేనా..!
ఆ భవనాలను షిఫ్ట్ చేయాలని సర్కార్ ఆదేశం● ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ ఫుల్ ● ఏదో భవనం కేటాయించండి ● కలెక్టర్కు వినతుల వెల్లువ అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా షిఫ్ట్ కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలెట్టారు. గడువులోగా కార్యాలయాలను తరలించడం సాధ్యమవుతుందా? లేదా అని ఆయా శాఖల అధికారులకు టెన్షన్ పట్టుకుంది. సాక్షి, సిద్దిపేట: జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. 2022 జూన్లో దాదాపు 40 ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టరేట్లోకి షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ ఇంకా పలు శాఖల జిల్లా కార్యాలయాలు అద్దె భవనాలు, ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్కు ఆయా శాఖల అధికారులు విన్నవించుకుంటున్నారు. ఒకే గదిలో ఐదు కార్యాలయాలు సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖల కార్యాలయాలు ఇరుకుగా ఉండటంతో అనేక ఇక్కట్లుకు గురవుతున్నారు. ఒకే గదిలో ఐదు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా భూగర్భజల అధికారి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం, పరిశ్రమల ఇన్స్పెక్టర్ కార్యాలయాలు అన్ని ఒకే గదిలోనే కొనసాగుతున్నాయి. ఈ ఽశాఖల అధికారులకు ప్రత్యేక చాంబర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏ కార్యాలయం అధికారి ఎక్కడున్నారో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. అలాగే.. మత్స్య, గృహనిర్మాణ సంస్థ, కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్లు ఒకే గదిలో కొనసాగుతున్నాయి. ఎస్సీ, గిరిజన, మైనార్టీ శాఖలు, ఆహార భద్రత కార్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 20 నెలల అద్దె పెండింగ్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట అద్దె భవనంలో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఈ కార్యాలయ భవనానికి అద్దె దాదాపు ప్రతి నెల రూ.40 వేలు చెల్లిస్తున్నారు. ఆ భవన యజమానికి సుమారుగా 20 నెలల అద్దె పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ భవనం ఖాళీ చేస్తే పూర్తిగా బకాయి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రి పక్కన ఉన్న పశువైద్యశాల పైన భవనం ఖాళీ ఉందని, దానిని కేటాయించాలని కలెక్టర్ను కోరినట్లు సమాచారం. హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ అద్దె భవనంలో తూనికల కొలతల కార్యాలయం కొనసాగుతోంది. ఈ కార్యాలయాన్ని ఎక్కడి షిఫ్ట్ చేయాలో ఇంకా కలెక్టర్ నిర్ణయం తీసుకోలేదు. మూడు తహసీల్దార్ కార్యాలయాలు, ఇతర డివిజన్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొమురవెల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని దేవాలయానికి చెందిన భవనంలోకి తరలించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 30లోగా షిఫ్ట్ చేస్తాం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ నెల 30వ తేదీలోగా షిఫ్ట్ చేస్తాం. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని పశువైద్యశాలలో ఖాళీగా ఉన్న భవనంలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – రాజ్ కుమార్, ఏవో, కలెక్టరేట్ -
నీరివ్వకపోతే సచివాలయం ముట్టడి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు మూలంగా ఇక్కడి రైతులు సర్వం కోల్పోయారని, దుబ్బాక నియోజకవర్గానికి నీరిచ్చిన తర్వాతనే వేరే ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. లేకుంటే రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బుధవారం దుబ్బాక మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు మల్లన్నసాగర్ 4 ఎల్ఈడీ కాల్వ పూర్తి చేయించి సాగు నీరందించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలు కూడా నిర్మించడం లేదని విమర్శించారు. రెండేళ్లుగా ఉప కాల్వలు నిర్మించాలని, అసెంబ్లీ సాక్షిగా గళమెత్తామని, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాసంగిలో పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగుచేస్తున్నారని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి కూడవెల్లి వాగుతో పాటు చిన్నశంకరంపేట, రామాయంపేట, ఉప్పరిపల్లి, దుబ్బాక కాల్వలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇర్కోడ్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.111 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు రూ.93 కోట్లు ఖర్చు అయ్యాయని, మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులు వెంటనే పూర్తి చేసి యాసంగి పంటలకు నీళ్లు అందించాలని కోరారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
ఇదేం భోజనం..?
● మొక్కుబడిగా వండి పిల్లలకు పెడతారా..? ● కలెక్టర్ హైమావతి ఆగ్రహం ● కస్తూర్బా పాఠశాల ఆకస్మిక తనిఖీదుబ్బాక: కలెక్టర్ హైమావతి బుధవారం రాత్రి దుబ్బాకలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గదిలో ఆహార పదార్థాలను, విద్యార్థులకు అందించిన భోజనాన్ని పరిశీలించారు. ఏదో మొక్కుబడిగా కూరగాయలు తీసుకొచ్చి పిల్లలకు సగం కడుపు భోజనం పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. మీరంతా ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వంటకు, రిజిస్టర్లో రాసిన వాటికి ఏమైనా సంబంధం ఉందా అంటూ ఇన్చార్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ డైట్ పాటించకుండా ఇష్టానుసారంగా రిజిస్టర్ రాసుకుంటే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.బాధులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్ఫెషల్ ఆఫీసర్, అకౌంటెంట్ తన దగ్గరికి వచ్చి రిజిస్టర్ మెయింటేన్ గురించి వివరించాలని టీచర్ను ఆదేశించారు. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయక పోవడం, లైటింగ్ సరిగ్గా లేక చీకటిగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహించారు. విద్యార్థుల చదువు తదితర విషయాలపై ఆరా తీశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. తనిఖీలు ముమ్మరం చేయండి సిద్దిపేటరూరల్: ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందేలా ఆహార భధ్రత అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ కె.హెమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తనిఖీలో భాగంగా నిత్యావసర పాలు, నూనెలు ఇతర పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఆహార వ్యాపారులు విధిగా అనుమతులు పొంది నియమ, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సురక్షితమైన మంచి ఆహారాన్ని ప్రజలకు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పాఠశాలలో పనిచేసే వంట వారికి, చిన్నారులకు ఆహారం అందించే అంగన్వాడీ కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో మద్యాహ్న భోజనం అందించేవారికి, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి, అమృత, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ ధనరాజ్, డీపీఓ రవిందర్, ఫుడ్సేఫ్టీ అధికారి జయరాం తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనుల్లో వేగం పెంచండిఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, సబ్ సెంటర్, గ్రామ మహిళా సమాఖ్య, ఫుడ్ గ్రేన్ స్టోరేజ్, పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాలన్నారు. స్థలం దొరకని గ్రామాల్లో పనులను రద్దు చేయాలన్నారు. స్థలం ఉండి పనులు మొదలు పెట్టని ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలని చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, సీఈవో రమేష్, డీపీఓ రవీందర్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిరంజీవులు పాల్గొన్నారు. -
ఉద్యోగి సేవలతోనే గుర్తింపు
● ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ● జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి దుబ్బాకటౌన్: ప్రతి ఒక్క ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరని, ఉద్యోగ సమయంలో చేసిన సేవలే గుర్తింపు తెస్తాయని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఇందుప్రియల్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పనిచేసిన అఫ్జల్ హుస్సేన్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనుభవం నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు మాక్ టెస్ట్లు నిర్వహించాలని, విద్యార్థుల విద్య నైపుణ్యాలను అంచనా వేయడానికి ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీని అందించాలన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్, షకీల్ పాషా, ప్రధానోపాధ్యాయులు కరీమొద్దీన్, వలీఅహ్మద్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్తో అధిక ఆదాయం
● సిద్దిపేట బ్రాండ్తో ప్యాకింగ్ ● రైతులతో హరీశ్రావు టెలీ కాన్ఫరెన్స్ సిద్దిపేటఅర్బన్: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మూడేళ్లుగా ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతులతో, ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మొదట్లో ఆయిల్పామ్ సాగు అంటే భయం, అనుమానం ఉండేదని, ఇప్పుడు చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. మూడేళ్లుగా ఆయిల్పామ్కు మంచి దిగుబడి రావడం శుభసూచకమని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ తుది దశకు చేరుకుందన్నారు. నర్మెట రిఫైనరీలో తయారయ్యే నూనెను సిద్దిపేట బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసేలా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కేంద్రం ఆయిల్పై 50శాతం సుంకం తగ్గించిందని, దీంతో రైతులకు సుమారు 2 వేలకు పైగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అంతర పంటగా కోకో వేసుకొని సంవత్సరానికి రూ. 80 వేల అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్స్ నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. -
సిద్దిపేట సీపీగా రష్మి
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ విజయ్కుమార్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ నార్త్జోన్ డీసీపీగా పనిచేస్తున్న 2019 బ్యాచ్కు చెందిన సాధన రష్మి పెరుమాళ్ను నూతన పోలీసు కమిషనర్గా నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విజయకుమార్ గతేడాది అక్టోబర్ 6న సిద్దిపేట పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయ్కుమార్.. తన దైన శైలిలో విధులు నిర్వహిస్తూ తన మార్కును చూపారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అక్రమ ఇసుక, గంజాయి, డ్రగ్స్ రవాణ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారిపై ఉక్కుపాదం మోపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన మందుబాబులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.10వేల జరిమాన, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టారు. పట్టణంలోని సుభాష్రోడ్డులో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఇబ్బందులు తొలగింపచేశాడు. బస్టాండ్ చౌరస్తా నుంచి పాత కూరగాయల మార్కెట్ ప్రాంతం వరకు తోపుడు బండ్లు, పుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిని మార్కింగ్ లోపల పెట్టి వ్యాపారాలు చేసుకునేలా చేశారు. ఇటీవల జిల్లాలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మద్యం సరఫరా, నగదు పంపిణీ అరికట్టి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాప్లను మూసి వేయించి, నిర్వాహకులను తహసీల్దార్లు ఎదుట బైండోవర్ చేశారు. సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించారు. విజయ్కుమార్ రాజకీయ నేతలకు సైతం దూరంగా ఉండేవారు. -
ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్ పార్లమెంట్’
● వాడీవేడి చర్చలు.. వాదోపవాదాలు ● పోటీపడిన సభ్యులతో అట్టుడికిన సభ ● మోడల్ పార్లమెంట్ సెషన్ అబ్బురం ● కొల్లాం, వల్సాడ్ విద్యార్థుల విశేష ప్రతిభ ‘యూత్ పార్లమెంట్’కు హాజరయ్యేందుకు వస్తున్న అతిథులను స్వాగతిస్తున్న కళాకారులు, చిత్రంలో డూడూ బసవన్న, హరిదాసు వేషధారణలువర్గల్(గజ్వేల్): వాడీవేడి చర్చ.. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు.. సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు.. ప్రధాని, మంత్రుల సమాధానాలు.. సంతృప్తి చెందని సభ్యుల నిరసనలు.. సభ వాయిదా.. ఇలా.. మంగళవారం వర్గల్ నవోదయ వేదికగా జాతీయ స్థాయి ‘యూత్ పార్లమెంట్’ ఆద్యంతం రసవత్తరంగా.. ఆసక్తికరంగా సాగింది. యూత్ పార్లమెంట్ పోటీలలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొల్లాం, గుజరాత్ రాష్ట్రం వల్సాడ్ నవోదయ విద్యార్థులు 55 మంది చొప్పున వేర్వేరుగా గంట పాటు వాడీవేడి ప్రసంగాలతో అదరగొట్టారు. పార్లమెంటేరియన్ల మాదిరి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్, ప్రధానమంత్రి, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులుగా పాత్రలు పోషిస్తూ 55 మంది సభ్యులతో కూడిన ఒక్కో విద్యాలయ జట్టు సభను కొనసాగించారు. వల్సాడ్ విద్యార్థులు ఇలా.. మొదట వల్సాడ్ నవోదయ బృందం సెషన్ జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సభలో యూత్ పార్లమెంటేరియన్లుగా విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్సభ, అసెంబ్లీకి జరిగే జమిలి ఎన్నికలపై క్వశ్చన్ అవర్లో ప్రస్తావించారు. జీరో అవర్లో పర్యావరణ సమస్య, నీటి కాలుష్యంపై సభ్యులు చర్చించారు. విద్యా బిల్లుపై సమగ్ర చర్చ జరిపారు. అనంతరం బిల్లును సభలో ఆమోదింపజేశారు. సభ వాయిదా వేసి ప్రదర్శన ముగించారు. కొల్లాం విద్యార్థుల ప్రదర్శన.. కొల్లాం నవోదయ విద్యార్థుల యూత్పార్లమెంట్ సెషన్లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. క్వశ్చన్ అవర్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష విధానం, భారత విదేశాంగ విధానం, రైతుల సమస్యపై ప్రశ్నలతో ప్రస్తావించారు. జీరోఅవర్లో విదేశాల్లో భారతీ య విద్యార్థుల వెతలను సభ్యులు ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ అనంతరం సభలో ఆమోదింపజేశారు. రెండు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ చాటిన 16 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. జ్యోతిప్రజ్వలనతో ప్రారంభం విద్యాలయ వేదికగా మంగళవారం నిర్వహించిన జాతీయస్థాయి యూత్ పార్లమెంట్ పోటీలకు ముఖ్యఅతిథులుగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు, భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనిల్కుమార్, నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్లు చక్రపాణి, దేవేందర్కుమార్, ఏఎస్ఓ అంకిత్ ముద్గల్, ఆతిథ్య విద్యాలయ ప్రిన్సిపాల్ రాజేందర్ హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. సంస్కృతి, సంప్రదాయాలు చాటుతూ.. నవోదయ సందర్శించిన అతిథులను తెలంగాణ సంస్కృతి చాటుతూ, నృత్యాభినయాలతో నవోదయ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రంగురంగుల ముగ్గులు, డూడూ బసవన్నలు, హరిదాసులు, సంక్రాంతి పర్వదినాన్ని మేళవించి అతిథులను స్వాగతించారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఇలాంటి యూత్పార్లమెంట్ కార్యక్రమాలు దోహదపడతాయని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. నిజ జీవితంలో కూడా ఈ యువ పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు కావాలని ఆకాంక్షించారు. భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనీల్కుమార్ మాట్లాడుతూ చిన్నచిన్న లోపాలు మినహా విద్యార్థుల ప్రదర్శన బాగుందన్నారు. పలు సవరణలు సూచించారు. ఇరుజట్ల ప్రదర్శనలు బాగున్నాయని ఏసీ దేవేందర్కుమార్సింగ్ కితాబునిచ్చారు. ఏసీ ృచక్రపాణి మాట్లాడుతూ యూత్పార్లమెంట్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. -
జిల్లా పరిధి తగ్గనుందా?
● హుస్నాబాద్ను కరీంనగర్జిల్లాలో కలుపుతారా..! ● అంతటా జోరుగా చర్చ సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటనతో జిల్లాలో మండలాలు తగ్గుతాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2016లో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ మండలాలను కలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలో కలిపారని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్లో కలుపుతామని గతంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్లో కలపాలని హుస్నాబాద్, బెజ్జంకిలలో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. తాజాగా మంత్రి శ్రీనివాస్రెడ్డి ప్రకటనతో కరీంనగర్లో హుస్నాబాద్ కలుస్తుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. 23 మండలాలతో జిల్లా ఆవిర్భావం 23 మండలాలతో 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించింది. తర్వాత పలు చోట్ల ప్రత్యేక మండలం కావాలని ప్రజలు ఉద్యమాలు చేయడంతో కుకునూరుపల్లి, అక్బర్పేట–భూంపల్లి, దూల్మిట్ట మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో 26 మండలాలకు చేరింది. తొమ్మిదేళ్లుగా ప్రజలకు చెరువై పాలన విజయవంతంగా కొనసాగుతోంది. అయినప్పటికీ పలు మండలాలకు చెందిన కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెజ్జంకిలో ఉద్యమం బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో బెజ్జంకి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండటంతో గతంలో ఎన్నికల్లో ఇద్దరు హామీలు ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు కరీంనగర్లో కలిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పునర్విభజన అవుతుందా?.. లేక ఇలానే కొనసాగిస్తారా వేచిచూడాల్సిందే. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అప్పట్లో కరీంనగర్ జిల్లా నుంచి తమను వేరుచేయడంపై హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ప్రజలు ఆందోళనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అలాగే గతంలో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరీంనగర్లో హుస్నాబాద్ను కలుపుతామని సీఎం రేవంత్రెడ్డి సైతం హామీ ఇచ్చారు. -
గణితంపై భయం వీడాలి
● ఇష్టపడి చదివితే అంతా సులభమే.. ● టీఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గజ్వేల్రూరల్: గణితంపై భయం వద్దని, ఇష్టపడి చదివితే ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం(టీఎంఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్ అన్నారు. టీఎంఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల మోడల్స్కూల్లో రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గణితంపై విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దన్నారు. గణితం పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతియేటా శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్లను నిర్వహిస్తున్నామన్నారు. టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ రాయల్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రమేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, టీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్రెడ్డి, కోశాధికారి సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్లో ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ స్థానంలో ముదాసీర్(వరంగల్), ద్వితీయ స్థానంలో మురారి(రంగారెడ్డి), తృతీయ స్థానంలో శివసాయి(కరీనంగర్)లు నిలవగా, తెలుగు మీడియంలో ప్రథమస్థానంలో రాంచరణ్(కామారెడ్డి), ద్వితీయ స్థానంలో విజయలక్ష్మి(జోగులాంబ గద్వాల), తృతీయ స్థానంలో హరీశ్(సూర్యాపేట) నిలిచారు. అదే విధంగా ఉర్దూ మీడియంలో ప్రథమస్థానంలో ఆస్మాబేగం(మహబూబ్నగర్), ద్వితీయస్థానంలో సుహానా(జనగామ), తృతీయస్థానంలో రహీమున్నిసా(హనుమకొండ) నిలవగా, గురుకులాల విభాగంలో ప్రథమస్థానంలో శ్రీసాయిహర్ష(మంచిర్యాల), ద్వితీయస్థానంలో సాహిత్య(మంచిర్యాల), తృతీయస్థానంలో ఆయేషా(నిజామాబాద్) నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు నగదు బహుమతితో పాటు మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేశారు. -
పీఎంశ్రీపై నిర్లక్ష్యం తగదు: డీఈఓ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పీఎంశ్రీ పథకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రధానోపాధ్యాయులను హెచ్చరించారు. పథకంలో భాగంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు, స్పోర్ట్స్ మీట్లకు సంబంధించి బిల్లులను బుధవారం అందజేయాలని హెచ్ఎంలను ఆదేశించారు. ‘పీఎంశ్రీపై నిర్లక్ష్యం.. నెరవేరని లక్ష్యం’ పేరుతో సాక్షిలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో డీఈఓ స్పందించి సంబంధిత హెచ్ఎంలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ మీట్కు సంబంధించి మోడల్ స్కూల్ ఇర్కోడ్, హుస్నాబాద్, మద్దూరు, చేర్యాల (ముస్త్యాల), టీఎస్డబ్ల్యూఈఐఎస్ కోహెడ, జిల్లెలగడ్డ.. అలాగే బతుకమ్మకు సంబంఽధించి మోడల్ స్కూల్ ఇర్కోడ్, ఇబ్రహీంనగర్, కోహెడ, అక్కెనపల్లి, మద్దూరు, చేర్యాల హెచ్ఎంలు అందించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ వేడుకకు సంబంధించి ఎక్కువగా ఖర్చు చేయకుండా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ డబ్బులు డ్రా చేసేందుకు బిల్లుల కోసం హెచ్ఎంలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫెక్ట్ -
రేవంత్ పాలనలో కంపుకొడుతున్న పల్లెలు
● సమస్యలే రాజ్యమేలుతున్నాయి ● గ్రామాలకు సరిపడా నిధులివ్వాలి ● మాజీ మంత్రి హరీశ్రావు సాక్షి, సిద్దిపేట: పల్లెల ప్రగతి కోసం కేసీఆర్ అధికంగా నిధులు ఇచ్చి ముత్యంలా తీర్చిదిద్దితే.. సీఎం రేవంత్ పాలనలో మురికి కూపాలుగా మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పల్లెలకు ట్రాక్టర్లు, గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించారని గుర్తు చేశారు. సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ సంఘంలో సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్లను మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీశ్రావు హాజరై మాట్లాడారు. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల హక్కు అన్నారు. కేసీఆర్ ఇచ్చినట్లు పల్లెలకు రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం వల్లే గ్రామాల్లో సమస్యలు పేరుకపోయాయన్నారు. రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పదవి అభరణం కాదు.. బాధ్యత, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశం అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ సమన్వయంతో పని చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి దీపమే ఇల్లు కాల్చినట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కరెంట్ ఉత్పత్తి పేరుతో నిర్మించి, తెలుగు గంగ పేరుతో లక్షల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అలాగే కొండపాక మండలంలోని బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లను హరీశ్ సన్మానించారు. -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి దుబ్బాక: విద్యార్థులు ఎలాంటి, ఒత్తిడి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు, రోజూ నిర్వహించే యోగా తదితర సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా రోజూ 20 నిమిషాల పాటు యోగా తరగతులతో పాటు వివిధ రకాల అంశాలపై చైతన్యపరుస్తున్నామన్నారు. వార్షిక పరీక్షలు ఏ విధంగా ఉంటాయన్న విధానాన్ని ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలతో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయేందర్రెడ్డి, లెక్చరర్లు తదితరులు ఉన్నారు. మద్దూర్(హుస్నాబాద్): మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, రెవెన్యూ సేవల పురోగతి పరిశీలించారు. సాదా బైనామా దరఖాస్తులు, రెవెన్యూ సదస్సుల పరిష్కారాలు, భూ భారతి దరఖాస్తులపై అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటన సిద్దిపేటజోన్: పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ మేరకు పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్లోని ఎస్సీ కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తిపై ఆరా తీశారు. తాగునీటి, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 23వ వార్డులో పర్యటించిన కమిషనర్ మురికి కాలువల్లో చెత్త పడకుండా జాలీలను ఏర్పాటు చేయాలన్నారు. రైతు బజార్ వద్ద వాహనాలు నిలపడం వల్ల పార్కింగ్ సమస్యలతో కూరగాయల వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం 6వ వార్డు హనుమాన్ నగర్లో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వనవాసి కో కన్వీనర్గా పరశురాం నాయక్ను ఎన్నుకున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మంగళవారం తెలిపారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్లో జరిగాయని, ఈ మహాసభల్లో విద్యారంగ అభివృద్ధికి అనేక తీర్మానాలు చేసినట్లు తెలిపారు. చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కొమ్మూరి మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత అభివృద్ధి చేసే దిశగా తన వంతు సహకారం అందిస్తానన్నారు. త్వరలో జరిగే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆయన వెంట మండల, పట్టణ నాయకులున్నారు. -
పదిలో జిల్లా మెరవాలి
● వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి ● కలెక్టర్ హైమావతి ● విద్యాశాఖ అధికారులతో సమావేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వివిధ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో సాధించిన ఉత్తీర్ణత శాతం, ఈసారి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే విధంగా ఈసారి కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. నేటి నుంచి ప్రత్యేక స్టడీ అవర్స్ ప్రతి పాఠశాలలో బుధవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు వెనకబడి ఉన్న సబ్జెక్టులలో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. అంతకుముందు రహ దారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు తెలపండి ఓటరు జాబితాలో అభ్యంతరాలను తెలపాలని కలెక్టర్ హైమావతి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పురపాలక ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లాస్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నా బాద్, దుబ్బాక, చేర్యాల, ప్రజ్ఞాపూర్– గజ్వేల్ మున్సిపాలిటీలలో త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా వార్డులలో ఓటర్ జాబితాను రూపొందించినట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. -
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి హిందూ సంఘాల నిరసన నంగునూరు తహసీల్దార్గా ప్రవీణ్రెడ్డినంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్రెడ్డి నంగునూరు తహసీల్దార్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణరావుపేట డిప్యూటీ తహసీల్దార్గా పని చేసిన మాధవికి నంగునూరు తహసీల్దార్గా పూర్తి బాధ్యతలు అప్పగించగా ఆమె తిరిగి స్వస్థలానికి బదిలీ అయ్యారు. -
నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం
నిధులు మంజూరైనా ఖర్చు చేయకుండా పీఎంశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 33 పాఠశాలను ఎంపిక చేశారు. 2025–26 మొదటి క్వార్టర్లో రూ.2.29కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.19.64లక్షలు మాత్రమే ఖర్చు చేయగా రూ.2.09కోట్ల నిధులు మూలుగుతున్నాయి. మంజూరైన నిధులు ఖర్చు చేస్తేనే మరో విడత మంజూరుకానున్నాయి. పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ఆ పథకం లక్ష్యం నెరవేరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిద్దిపేట రూ.2.29 కోట్లు మంజూరు 8.57 శాతం నిధులే వినియోగం వేగిరం చేస్తాం.. – శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ -
లిమ్కా బుక్లోకి అన్నదమ్ముల ‘కిక్స్’
గజ్వేల్రూరల్: ఆ ఇద్దరు అన్నదమ్ములు కరాటేలో సత్తాచాటారు. గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు–పుష్ప దంపతుల కుమారులు రామకృష్ణ, రఘురాంలు హైదరాబాద్లో జరిగిన కరాటే పోటీల్లో 30 నిమిషాల్లో 600 కిక్స్ చాలెంజ్లో ప్రతిభ చాటారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకోవడంతో పాటు బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన పలువురు అభినందించారు. రేపు మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ గజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ను ఈనెల 6న గజ్వేల్లో నిర్వహించనున్నట్లు టీఎంఎఫ్ (తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం) జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి వెంకటేశ్వర్లులు తెలిపారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల మోడల్స్కూల్లో టెస్ట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, డైరెక్టర్ ఎస్సీఈఆర్టీ రమేష్, కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు. డ్రైవర్లూ.. ఆరోగ్యం జాగ్రత్తఎంవీఐ శంకర్ నారాయణ సిద్దిపేటకమాన్: డ్రైవర్లు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) శంకర్ నారాయణ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. భారీ వాహనాల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ.. డ్రైవర్లు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారికి చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో మెడికల్, ఆర్టీసీ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గొల్ల, కురుమలకు అవకాశాలివ్వాలిదుబ్బాక: మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని పార్టీలు జనాభా ప్రతిపాదికన గొల్ల, కురుమలకు అవకాశాలివ్వాలని అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. ఇటీవల గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను గొర్రెల కాపరుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దుబ్బాక పట్టణంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, చిర్ర తిరుపతి, శ్రీనివాస్యాదవ్, ప్రశాంత్, పోచమల్లు, ఎల్లయ్య, మల్లేశం, శ్రీకాంత్ యాదవ్,చంద్రం, నాయకులు ఉన్నారు. -
సీఎం ఇంటి ఎదుట ధర్నా చేయండి
గజ్వేల్: నియోజకవర్గంలో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటిముందు ధర్నా చేయాల్సిన కాంగ్రెస్ నేతలు.. మతి భ్రమించి కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద చేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ను అభివృద్ధిలో 30ఏళ్ల ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేయడానికి రూ.250కోట్ల నిధులు గత ప్రభుత్వం మంజూరు చేస్తే.. సీఎం రేవంత్రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో గజ్వేల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. రేవంత్రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద కొందరు రాజకీయ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు పాల్గొన్నారు.ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మండిపాటు -
పల్లెలు గాడిన పడేనా?
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో పంచాయతీ నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అధికారుల పాలనలో సాగాయి. నిధుల లేమితో చాలా గ్రామాల్లో సమస్యలు నెలకొన్నాయి. వీటి పరిష్కారానికి కొత్త పాలకవర్గాలు కృషి చేయడం కత్తిమీద సాములాంటిదే. మండలంలో 80 శాతానికి పైగా సర్పంచ్లు రాజకీయాలకు పూర్తిగా కొత్తవారే కావడం విశేషం. అందరూ రిజర్వేషన్ల పరంగా పోటీ చేసి సర్పంచ్లుగా గెలుపొందారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వీరు ఏమేరకు కృషి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. 14 మంది మహిళలే.. చిన్నకోడూరు మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 14 మంది మహిళలు సర్పంచ్లుగా గెలుపొందారు. వీరిలో అంతా కొత్తవారే. రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అత్యవసర పనులకు సొంత డబ్బులు ఖర్చు చేసినప్పటికీ బిల్లులు రాలేదు. కొత్త పాలకవర్గాలకు సమస్యలు తలనొప్పిగా మారనున్నాయి. చాలా గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఇతర భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ ఎల్లమ్మజాలు, శంకరాయకుంట, కమ్మర్లపల్లి గ్రామాలకు జీపీ భవనాలు లేక కుల సంఘాల భవనాల్లో పాలకవర్గాలు కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో జీపీ భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇతర భవనాల్లో కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, అభివృద్దికి కొత్త పాలకవర్గాలు ఏమేరకు కృషి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువ మంది సర్పంచ్లు కొత్తవారే గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యేనా? -
చైతన్యపరుస్తున్నాం
ఆన్లైన్ గేమ్ మాయలో... క్యాసినోతోపాటు ఆన్లైన్ గేమ్ మాయ ఎంతోమందిని ఆగాధంలోకి నెట్టేస్తున్నది. రూపాయి పెట్టుబడిగా పెడితే.. పది రూపాయలు ఇస్తామంటూ ఇందులోకి దింపుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని అన్ని వయసులు వారు ఈ గేమ్ల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. గేమ్లు ఆడటానికి ఆన్లైన్ యాప్ల్లోనే అప్పులు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికి యాప్ల నిర్వాహకులు రకరకాలుగా వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. మరికొందరూ యాప్ల నిర్వాహకులైతే మరో అడుగు ముందుకేసి.. ఆన్లైన్లో నగ్న చిత్రాలు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు.ఆన్లైన్ గేమ్ల వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి కళాబృందాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ కోసం మా సహకారాన్ని అందిస్తాం. ఇవీ పూర్తిగా చట్టవ్యతిరేకమైనవి. – నర్సింహులు, గజ్వేల్ ఏసీపీ -
విద్యార్థిని మరణంపైవిచారణ జరిపించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని ఘటనపై ఉన్నతాఽధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అభిషేక్ భాను, రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిట్టపల్లి కేజీబీవీ విద్యార్థిని అనుమాస్పదంగా మరణించిందన్నారు. అందువల్ల కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించి, నిందుతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
బెల్టు జోరు!
జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరందుకుంది. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ధరలు పెంచి విక్రయాలు సాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిరాణం, పాన్ షాపులలో అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేట: ● ఒక్కో వైన్షాప్.. కొన్ని గ్రామాలు పంచుకున్న వ్యాపారులు ● బెల్ట్ షాపులకే మద్యం అందించేందుకు వైన్ షాపుల మొగ్గు ● పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జిల్లాలో 93 వైన్ షాప్లు కొనసాగుతున్నాయి. మండల కేంద్రం, పట్టణం, ప్రధాన గ్రామాల్లో ఉన్న వైన్ షాప్ల వారు కొన్ని గ్రామాలు, కాలనీల చొప్పన సిండికేట్ అయి పంచుకున్నారు. ఉదాహరణకు ఒక మండల కేంద్రంలోని వైన్ షాప్ దాదాపు 12 గ్రామాల్లోని బెల్ట్ షాప్లకు మద్యాన్ని సరఫరా చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కొన్ని వైన్ షాపుల వారు నేరుగా ఆటోల ద్వారా ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పంపించి అమ్ముతున్నారు. ఆ గ్రామాల్లోని బెల్ట్ షాప్ల వారు మరొక వైన్ షాప్ నుంచి తీసుకురాకుండా పరిశీలిస్తున్నారు. బెల్ట్ షాప్లకు స్టాక్ ఇచ్చేందుకే మొగ్గు క్వార్టర్ మద్యానికి రూ.10 అధికంగా, ఫుల్బాటిల్కు రూ.40 అధిక ధరల వరకు బెల్ట్ షాప్లకు వైన్ షాపు యజమానులు విక్రయిస్తున్నారు. అయితే.. బెల్ట్షాప్ల వారు రూ.20 నుంచి రూ.100 వరకు ఽఅధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో బెల్ట్ షాప్లకు స్టాక్ను అందించేందుకు వైన్ షాపుల యజమానులు మొగ్గు చూపుతున్నారు. బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. మరింత ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎకై ్సజ్ అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వైన్ షాపులో రాత్రి 10గంటల వరకే మద్యం లభిస్తుంది. అదే బెల్ట్ షాపులలో 24గంటలు లభిస్తోంది. మద్యం తాగి చాలా మంది ఇళ్లలో గొడవలు పడుతూ అర్థరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 80కి పైగా కేసులు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 271 మద్యం కేసులు నమోదు కాగా 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 80కి పైగా కేసులు బెల్ట్ షాప్లకు సంబంధించినవి ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ గ్రామాల్లో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. -
వార్డుల విభజనలో శాసీ్త్రయత ఏదీ..?
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదంటూ పట్టణ ప్రజలు, నాయకుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. భౌగోళికంగా దూరంగా ఉండే కాలనీలను ఒకే వార్డులో చేర్చడం వల్ల అభివృద్ధికి అవరోధంగా మారే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వార్డుల పెంపుపైనా ప్రభుత్వంపై రోజురోజూకూ ఒత్తిడి పెరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని మిగితా మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, ఇతర కార్యక్రమాలు సాఫీగా సాగుతుండగా.. ఇక్కడ భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మున్సిపల్ అధికారులు శుక్రవారం రాత్రి ముసాయిదా ఓటర్ల జాబితా అధికారికంగా ప్రకటించారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 46,740మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళలు 24,001మంది, పురుషులు 22,738 మంది ఉన్నారని తేల్చారు. వార్డుల విభజనపై కూడా ప్రకటన చేశారు. కానీ వారు ప్రకటించిన వార్డుల విభజనలో శాసీ్త్రయత లోపించడం, కొత్త కాలనీలు విలీనమై ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా వార్డుల సంఖ్య పెరగకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వార్డుల పెంపుపై పెరుగుతున్న ఒత్తిడి మున్సిపాలిటీలో కొత్తగా ఆర్అండ్ఆర్ కాలనీ విలీనమై.. ఓటర్ల సంఖ్య 32వేల నుంచి 46వేల పైచిలుకు పెరిగినా.. వార్డుల పెంపు జరగకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఉన్న 20 వార్డుల్లోనే ఆర్అండ్ఆర్ కాలనీ ఓటర్లను సర్దుబాటు చేయడం వల్ల పట్టణంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ప్రస్తావించడంపై మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. పరిశీలన చేస్తామని ప్రకటన కూడా చేశారు. కానీ ఎన్నికల లోపు ఈ ప్రక్రియ జరుగుతుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.దూరంగా ఉన్న కాలనీలు ఒకే వార్డులోకిమున్సిపాలిటీలో వార్డుల విభజనకు సంబంధించి శాసీ్త్రయత లోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రత్యేకించి భౌగోళికంగా దూరంగా ఉన్న కాలనీలను ఒకే వార్డులోకి చేర్చడం..అభివృద్ధికి అవరోధంగా ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు పట్టణంలోని శివాలయం కాలనీ గతంలో 14వ వార్డులో ఉండేది. అప్పట్లోనూ విభజన సక్రమంగా లేక కాలనీవాసులు నష్టపోయారు. తాజాగా 6, 13 వార్డుల్లో ఈ కాలనీని కలిపారు. 6వ వార్డులో శివాలయం కాలనీకి భౌగోళికంగా దూరంగా ఉండే... ప్రజ్ఞాపూర్ బీసీ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, సిరి ఎన్క్లేవ్, లక్ష్మీప్రసన్న కాలనీ, వాసవీనగర్కాలనీతోపాటు ముట్రాజ్పల్లి గ్రామం ఉన్నది. 13వ వార్డులోనూ అదే తరహాలో పాత ముట్రాజ్పల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, జీడీఆర్ పాఠశాల, భారత్నగర్ కాలనీలు ఉన్నాయి. దీనివల్ల అభివృద్ధికి అవరోధం ఏర్పడనుందని ఆ కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఇరవై వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.భౌగోళికంగా దూరం ఉండే కాలనీలు ఒకే వార్డులోకి.. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు అభివృద్ధికి అవరోధమవుతుందని అందోళన వార్డుల పెంపునకూ ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పరిస్థితి -
పిల్లలు ప్రయోజకులైతేనే సంతృప్తి
సిద్దిపేటరూరల్: విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. శనివారం సావిత్రి బాయి పూలే 195 జయంతి, మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వకాలం గురువులు ఏమి ఆశించకుండా విద్యను బోధించేవారన్నారు. బోధించే ప్రతి వాక్యం విద్యార్థిని ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. చదివే పిల్లలు గొప్పవారైతే ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. సావిత్రి బాయిని ఆదర్శంగా తీసుకొని మహిళలు ఉన్నత విద్యావంతులు కావాలని చెప్పారు. అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఏంఈఓలు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం వైద్యశిబిరం ఏర్పాటు చేయాలి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతి ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. మందులు, పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సదుపాయాలకై నా డీఎం అండ్ హచ్ఓ దృష్టికి తీసుకురావాలని, రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వైద్యాధికారి హరితను ఆదేశించారు. శిక్షణ కోసం వచ్చిన సర్సింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తకాలలో చదివిన జ్ఞానాన్ని నేరుగా చూస్తూ మంచి శిక్షణ పొందాలని, ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని కోరారు. కలెక్టర్ హైమావతి ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు -
మెరుగైన పాలన అందించండి
గజ్వేల్: గ్రామాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్లపై ఉందని ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. జగదేవ్పూర్ మండలం తీగుల్ సర్పంచ్ రజితతోపాటు పాలకవర్గం బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో హరీశ్రావును కలిశారు. ఈ సందర్భంగా రజితను హరీశ్రావు అభినందించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సర్పంచ్తోపాటు పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సుధాకర్రెడ్డి, సహకార సంఘం మాజీ డైరెక్టర్ భూమయ్య, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు తీగుల్ సర్పంచ్, పాలకవర్గానికి అభినందనలు -
హామీలను అమలు చేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేటలోని కేసీఆర్నగర్ డబుల్బెడ్ రూం కాలనీ ప్రభుత్వ పాఠశాలలో టీపీటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 2023 నుంచి రావాల్సిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, సిద్దిపేట అర్బన్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, నాయకులు మల్లేశం, సలీం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.టీపీటీఎఫ్ అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి -
ఆందోళన వద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి చిన్నకోడూరు(సిద్దిపేట): యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని స్వరూప రాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని రామంచలో రైతులకు యూరియా కార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక ఎకరానికి మూడు బస్తాలు, రెండు ఎకరాలకు ఐదు బస్తాలు, నాలుగు ఎకరాలకు 10 బస్తాల యూరియా అందజేస్తామన్నారు. నాలుగు విడతల్లో రైతులకు యూరియా అందజేస్తామని, కొరత రాకుండా పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకొచ్చి యూరియా కార్డులు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులు భూ యాజమాని పాసుపుస్తకం జిరాక్స్ తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ పద్మ, ఏఓ జయంత్ కుమార్, సర్పంచ్ భవాని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండిబాలల సంక్షేమ సమితి చైర్మన్ నర్సింహులు వర్గల్(గజ్వేల్): గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, వాటి అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ దేశబోయిని నర్సింహులు పేర్కొన్నారు. శనివారం శేరిపల్లి సర్పంచ్ ఎర్ర పావని, ఉపసర్పంచ్ బీరయ్యలను సన్మానించారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పారదర్శక సుపరిపాలనతో గ్రామాభివృద్ధికి అంకితం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు నివారణ, బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్రెడ్డి, కొండల్రెడ్డి, మొగిలి తదితరులు పాల్గొన్నారు. ‘ఇందూరు’ అసోసియేట్ ప్రొఫెసర్కు డాక్టరేట్ సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శనిగరం పోచయ్య డాక్టరేట్ పట్టా పొందారు. ‘సింథసిస్ అండ్ థర్మల్ మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఫేస్ చేంజ్ మెటీరియల్స్ రీఇన్ఫోర్స్డ్ విత్ నానో కాంపోజిట్ మెటీరియల్స్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయనను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.పి.రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బెనర్జీ, పీఆర్వో రఘు అభినందించారు.నేడు రాచబాట శతక పుస్తకావిష్కరణప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి రాజయ్య యాదవ్ రచించిన రాచ బాట శతకం పుస్తకావిష్కరణ ఆదివారం నిర్వహించనున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఉదయం 10 గంటలకు సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, భానుప్రకాశ్, అశోక్, చంద్రయ్య, ఐలయ్య యాదవ్ తదితరులు హాజరవుతారన్నారు. -
ఈ గడుగ్గాయ్.. విశ్వ‘తేజం’
అంతర్జాతీయ స్థాయి కథల పోటీల్లో విశేష ప్రతిభ చిన్నకోడూరు(సిద్దిపేట): కెనడాకు చెందిన ‘గడుగ్గాయ్ అనే మాస పత్రిక’ సంక్రాంతి సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి విశ్వతేజ విశేష ప్రతిభ చూపారు. విశ్వతేజ రాసిన చందమామ రావే అనే కథకు ద్వితీయ బహుమతి వచ్చింది. సంక్రాంతి పడుగ రోజున నగరంలో నగదుతో పాటు మెడల్ అందజేయనున్నట్లు పాఠశాల హెచ్ఎం జ్యోతి తెలిపారు. అదే పాఠశాలకు చెందిన అఖిల, కీర్తి రాసిన కథలకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారన్నారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. మల్లన్న సన్నిధిలో సినీ దర్శకుడు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అ నంతరం ఆలో ఆలయ ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిజిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఐడీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ములుగు(గజ్వేల్): విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో కృషి చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అమర్నాథ్రావు సూచించారు. హైదరాబాద్లో నర్సింగ్ కోర్సు చదువుతున్న ములుగు మండలం నర్సంపల్లికి చెందిన కటికల రమ్య విద్యాభాస్యానికి సహాయంగా రూ.92 వేల చెక్కును శుక్రవారం ఆమె సోదరికి అందజేశారు. అలాగే ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఆరవ తరగతి విద్యార్థులకు 75 డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మాణమవుతుందన్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో సేవలు అందించడమే లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయబాస్కర్రెడ్డి, ఉపాధ్యాయులు, లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
దళితులను వేధిస్తే సహించం
దుబ్బాకటౌన్: దళితులను వేధిస్తే సహింబోమని, రాయపోల్ మండలం అనాజిపూర్ దళితుల పై మూకుమ్మడిగా దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. రాయపొల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన యాదగిరి కుటుంబంపై ఇటీవల దాడి జరిగిందని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బక్కి వెంకటయ్యకు వినతి పత్రం అందించారు. దీంతో ఆయన పొలీస్ అధిఅకారులకు, రెవెన్యూ అధికారులకు పోన్చేసి నిందితుల అరెస్టులో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి -
రూ.19 కోట్లు.. తాగేశారు
సిద్దిపేటకమాన్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్స్ పేరిట మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది డిసెంబర్లో రూ.117.86కోట్ల విక్రయాలు జరగగా.. ఈఏడాది డిసెంబర్లో రూ.144.76కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడు విక్రయాలు భారీగా పెరిగాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ముందస్తుగా హెచ్చరించినా మందుబాబులు తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తించారు. డిసెంబర్ 31న రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడిన 145మంది వాహనదారులపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మాంసానికి భారీ గిరాకీ మద్యంతో పాటు మాంసానికి భారీ గిరాకీ జరిగింది. డిసెంబర్ 31న ఉదయం నుంచే మాంసం దుకాణాలన్నీ కిటకిటలాడాయి. నూతన సంవత్సర వేడుకల పేరుతో మూడు రోజుల పాటు మాంసం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు ముక్కతో యువత వేడుకల్లో మునిగితేలారు. పలు హోటళ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలు, మహిళలు, యువత కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరికొంత మంది బైక్లు, కార్లు, బంగారం, నూతన వస్తువులను కొనుగోలు చేశారు.జిల్లాలో నయా కిక్కు ఈ ఏడాది పెరిగిన మద్యం విక్రయాలు డ్రంకెన్ డ్రైవ్లో 145కేసులు నమోదు జోరుగా సాగిన మాంసం అమ్మకాలురెండు రోజుల్లోనే.. నూతన ఏడాది ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కరోజే రూ.11కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 30, 31వ తేదీల్లో రెండు రోజుల్లోనే రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, 16 బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా రెండు రోజుల్లో రూ.19కోట్ల విలువగల 16,686 కేసుల లిక్కర్, 14,555 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గత నెలలో మొత్తం రూ.144కోట్ల76లక్షల విలువగల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది డిసెంబర్లో 1,15,188 కేసుల లిక్కర్, 1,69,014 కేసుల బీర్లు మొత్తం విలువ రూ.117.86కోట్ల మద్యాన్ని విక్రయించారు. గత నెలలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. -
టైం వేస్ట్ వద్దు.. సీరియస్గా చదవండి
● నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు ● ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ రవీందర్రెడ్డి సూచనసిద్దిపేటఎడ్యుకేషన్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇంటర్మీడియెట్ విద్యార్థులు టైం వేస్ట్ చేయకుండా సీరియస్గా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి సూచించారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు స్థానిక కార్యాలయంలో డీఐఈఓను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో దాదాపు సిలబస్ పూర్తయిందని, ఇంటర్నల్ పరీక్షలు సైతం నిర్వహించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు నమోదు చేసినట్లు చెప్పారు. శనివారం నుంచి మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు తప్పని సరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ నెల 21న ఫస్టియర్కు, 22న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు సమయం ఎంతో విలువైనదని దానిని వృధా చేసుకోకుండా పరీక్షలకు చక్కని ప్రణాళికతో సన్నద్ధం కావాలన్నారు. అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేయించాలన్నారు. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం, రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి దరిపలి నగేష్, ప్రచార కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇవేం వంటలు?
మీకు నచ్చినట్లు చేసి పిల్లలకు వడ్డిస్తారాదుబ్బాక: ‘నాణ్యత లేని పప్పుచారు.. అరకొరగా కూరతో విద్యార్థులకు వడ్డిస్తారా?.. మీకు నచ్చిన వంటలు చేసి సగం కడుపుకే పెడతారా.. పౌష్టికాహారం అందించకుండా ఇవేం వంటలు’ అంటూ కలెక్టర్ హైమావతి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటగదిలో ఉన్న వంకాయ కూర, పప్పుచారు, గుడ్లు వండిన వంటలను చూసి ఇదేం పప్పుచారు? ఈ కూర ఎంత మందికి సరిపోతుంది? అంటూ వంట సిబ్బందిపై మండిపడ్డారు. హాజరైన 373 మంది విద్యార్థులకు సరిపడా వండలేదని, రోజు వారి విద్యార్థుల హాజరు ప్రకారం స్టాక్ రిజిష్టర్ రాయకుండా ఏదో మొక్కుబడిగా రాసినట్లుగా ఉండటం గమనించి ప్రిన్సిపాల్ బుచ్చిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన విధంగా వంటచేసి పెడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ ప్రతి విద్యార్థికి ఆహారం సరిపోయేలా వంటలు రుచికరంగా వండాలని ప్రిన్సిపాల్, వంట సిబ్బందిని ఆదేశించారు. ప్రిన్సిపాల్ బుచ్చిబాబుపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫోన్లో కలెక్టర్ ఆదేశించారు. అలాగే బాలికల వసతిగృహాన్ని పరిశీలించి మెనూ ప్రకారం వంటలు లేకపోవడంపై హాస్టల్ వార్డెన్ కవిత, వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు.రెవెన్యూ విభాగంపై నమ్మకం పెంచాలి నీళ్లచారు.. అరకొర కూరతో సరిపెడతారా? కలెక్టర్ హైమావతి మండిపాటు వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఆదేశం లచ్చపేట మోడల్స్కూల్, కళాశాల ఆకస్మిక తనిఖీసిద్దిపేటరూరల్: రెవెన్యూ డిపార్ట్మెంట్ పై గౌరవం, నమ్మకం మరింతగా పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు కలెక్టర్ కె. హైమావతిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ట్రెసా క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి సేవ అవసరమైన మొదటగా సంప్రదించేది రెవెన్యూ అధికారులనేనన్నారు. మీపై నమ్మకంతో మీ వద్దకు వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలందించి రెవెన్యూ విభాగానికి మరింతగా మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, ట్రెసా నాయకులు పాల్గొన్నారు. -
హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలంలోని మాత్పల్లిలోని కాంగ్రెస్ నాయకులు కనకారెడ్డి, బ్యాగరి శ్రీనివాస్, సిలివేరు సుధాకర్, జంగిటి సుధాకర్ తదితరులు ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని, మూడేళ్ల అధికారంలో ఉన్నా ఆ పార్టీ పనితీరు నచ్చక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి చెంప పెట్టులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ బచ్చలి మహిపాల్, నాయకులు కృష్ణాగౌడ్, బాలయ్య, సాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ బోధన చేయాల్సిందే
డీఈఓ శ్రీనివాస్రెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డిజిటల్ బోధన చేయాలని, మండలాల విద్యాశాఖ అధికారులకు డీఈఓ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ‘బడుల్లో డిజి‘డల్’’ కథనానికి స్పందించిన జిల్లా విద్యాశాఖ, జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి పాఠశాలలో డిజిటల్ బోధనలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని మండల అధికారులకు డీఈఓ సూచించారు. నేటి నుంచి ముగ్గుల పోటీలు హుస్నాబాద్: నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం నుంచి మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తుది దశకు కొనుగోళ్లు
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. బహిరంగ మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మూడేళ్లలో ఈసారి కొనుగోళ్లు పెరిగాయి. జిల్లాలో 3,86,083 ఎకరాల్లో వరి సాగు చేయగా 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 365 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయి. 95వేల మంది నుంచి 3.70లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. – సాక్షి, సిద్దిపేట ఐదు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా జిల్లా యంత్రాంగం 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వానాకాలంలో 95.690 మంది రైతుల నుంచి రూ.886.31 కోట్ల విలువ చేసే 3,70,994 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.861.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. ఇందులో దొడ్డు రకం 3,51,300 టన్నులు, సన్నరకం 19,694 టన్నుల ధాన్యం ఉన్నాయి. ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని గతంలోనే ప్రకటించింది. బోనస్ రూ.9,87,08,400 కాగా ఇప్పటి వరకు 3,83,28,800 రైతులుకు అందించారు. ఇంకా రూ.5,54,39,400 బోనస్ పెండింగ్లో ఉంది. ఇంకా 56 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆ కేంద్రాలు సైతం మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు ముగియనున్నాయి. పెరిగిన కొనుగోళ్లు గత ఏడాది వానాకాలంతో పోలిస్తే భారీగా కొనుగోళ్లు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. దీంతో గతేడాది వానాకాలం కంటే ఈ ఏడాది 1.09లక్షల టన్నుల పెరిగాయి.వానాకాలంలో కొనుగోళ్ల వివరాలు సంవత్సరం టన్నులు రైతుల సంఖ్య రూ.కోట్లల్లో 2022–23 3,62,193 89,971 746.11 2023–24 3,09,026 74,160 680.77 2024–25 2,61,445 65,335 611.39 2025–26 3,70,994 95,690 886.31 3.70లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఇప్పటికే 365 కేంద్రాల్లో ముగిసిన కాంటా రూ.861కోట్లు రైతుల ఖాతాల్లో జమ -
భూ సర్వేకు శాటిలైట్ టవర్లు
హుస్నాబాద్రూరల్: భూ సర్వే చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా భూ సర్వే చేయడానికి 70 కి.మీల దూరంలో ఒక శాటిలైట్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఒకటి సిద్దిపేట, మరోటి హుస్నాబాద్ డీఐఓసీ ఆవరణలో నిర్మించడానికి శుక్రవారం పనులు ప్రారంభించారు. శాటిలైట్ ఆధారంగా గ్రామాల్లో సర్వే సులభం కానుంది. పాత భూ రికార్డుల టీపాన్లు (కొలతలు) ఎక్కువ సంఖ్యలో దొరకకపోవడంతో భూముల హద్దుల పంచాయితీలు తెగడం లేదు. శాటిలైట్ ఆధారంగానే నక్షా హద్దులను గుర్తించి భూ విస్తీరణం చెప్పనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు కింద హుస్నాబాద్ డివిజన్ పరిధిలో అక్కన్నపేట మండలంలోని కేశ్వాపూర్, మల్లంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. రెండు గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసిన తర్వాత మిగతా గ్రామాల్లో సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు.శాటిలైట్ టవర్ నమూనా.. -
600 మందికి ఒక్కటే గీజర్
సిద్దిపేటఅర్బన్: గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు చలికాలంలో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. సరిపడా గీజర్లు లేక చన్నీటి స్నానాలే దిక్కవుతున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని గురుకుల పాఠశాల, ఎన్సాన్పల్లిలోని సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ స్కూల్, ఎల్లుపల్లిలోని కేజీబీవీ, వెల్కటూరులోని కేజీబీవీలో విద్యార్థినులు చల్లటి నీటితోనే స్నానాలు చేస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. మిట్టపల్లి గురుకుల పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. వీరందరికీ ఒక్క గీజర్ మాత్రమే ఉంది. అదీకూడా ప్రిన్సిపాల్ పదోన్నతిపై వెళ్తూ సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన గీజరే.. విద్యార్థినుల ఇబ్బందులను గమనించి మరో రెండు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి గీజర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. గురుకులంలో విద్యార్థినుల గజగజ చన్నీటి స్నానాలే దిక్కు.. దృష్టిసారించని అధికారులు -
‘మన బడి’ బకాయిలు చెల్లించాలి
● ఎంపీ రఘునందన్రావు డిమాండ్ ● వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలుగజ్వేల్రూరల్: పెండింగ్లో ఉన్న ‘మన ఊరు – మన బడి’కి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా గురువారం గజ్వేల్ పట్టణంలోని వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మించిన ‘మన ఊరు–మన బడి’కి సబంధించిన బిల్లులు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశా రు. ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు, స్కూల్ కమిటీ చైర్మన్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా అసెంబ్లీని నడిపిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొంటున్న ముఖ్య మంత్రి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ‘మన ఊరు–మన బడి’కి సంబందించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇందులో ఏవైనా అవకతవకలు జరిగినట్లు తెలితే ఈ అంశంపై శాసనసభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం అహ్మదీపూర్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షు డు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషిదుబ్బాకరూరల్: అక్బర్పేట భూంపల్లి మండలంలోని తన స్వగ్రామమైన బొప్పాపూర్లో ఎంపీ రఘునందన్రావు ఓపెన్ జిమ్, ఉచిత వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతన సర్పంచ్లు అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఇళ్లపైన సోలార్ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.70వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ పెట్టు కోవడం వల్ల ప్రతి ఇంటికి రెండు కిలో వాట్ల విద్యుత్ సరఫరా చేసుకోచ్చాన్నారు. దీంతో విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ఎనగుర్తి నుంచి శిలాజినగర్ వరకు రోడ్డు వేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రసాద్, ఉప సర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
సిద్దిపేట రూరల్: ప్రతి ఒక్కరూ విధిగా రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ హైమావతి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మసోత్సవాలు, సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సంబంధించి ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్టీఏ కమిటీ సభ్యుడు డాక్టర్ సూర్య వర్మ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బడుల్లో డిజిడల్
అంతంత మాత్రంగానే డిజిటల్ బోధనజిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అంతంతమాత్రంగానే డిజిటల్ బోధన అందుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యార్థులకు సులభంగా అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్పీ)లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోధన అందుబాటులోకి తీసుకురాగా 3,684 మంది ఉపాధ్యాయులకుగాను 1,467 మంది మాత్రమే బోధన చేస్తున్నారు. మిగతా వారు పాత పద్ధతిలోనే చాక్పీస్తో బోర్డుపై రాస్తూ వివరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు వృథాగా మారుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 266 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులకు బోధించేందుకు ఒక్కో పాఠశాలకు మూడు చొప్పున 798 ఐఎఫ్పీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ టీవీల ద్వారా బోధన అందుబాటులోకి తెచ్చింది. దృశ్య శ్రవణ బోధనోపకరణాల ద్వారా ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశంలోని విషయాన్ని ప్రత్యక్షంగా అనుభూతి పొందడంతో అభ్యసన వేగవంతం అవుతుంది. అలాగే నేర్చుకున్న జ్ఞానం గుర్తుండిపోతుంది. ఈ అభ్యాసన లక్ష్యాలు విద్యార్థి సాధించేందుకు డిజిటల్ టీవీల ద్వారా విద్యా బోధన ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో.. ఐఎఫ్సీలో ప్రతి ఉపాధ్యాయుడు బోధించేందుకు ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసి బోధించాలి. ఇలా ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 860 గంటలు మాత్రమే విద్యా బోధన చేశారు. కొన్ని పాఠశాలలు అసలే డిజిటల్ బోర్డులపై బోధించలేదని ఆ పోర్టల్లో నమోదైంది. మరి కొన్ని పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఐఎఫ్సీ ద్వారా బోధించడమే బంద్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అప్పుడప్పుడు ఉపాధ్యాయుల మొబైల్ నెట్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకొని బోధిస్తున్నారు. అత్యల్పంగా నారాయణరావు పేట మండలంలో మొత్తంగా ఒక గంట మాత్రమే బోధించారు. అత్యధికంగా చేర్యాల మండలంలో బోధించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఐఎఫ్పీల ద్వారా బోధించేలా కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మద్దురు మండలం లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయురాలు మొబైల్ ఫోన్ హాట్స్పాట్తో బోధిస్తున్నారు. అప్పుడప్పుడు నెట్ సరిగా రాకపోవడంతో అంతరాయం ఏర్పడుతుంది. నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది పాఠశాలలో ఉపాధ్యాయులు లాగిన్ కాకుండానే బోధిస్తున్నారు. దీంతో ఆన్లైన్లో ఏర్పాటు చేసిన పాఠాలను బోధించలేకపోతున్నారు.హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతిలో ఏర్పాటు చేసిన ఐఎఫ్సీ పని చేయకపోవడంతో మళ్లీ సాధారణంగా బ్లాక్ బోర్డు పైనే బోధిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది. వినియోగించని వారిపై చర్యలు ఉత్తమ బోధనలు అందించాలన్న ఉదేశ్యంతో ప్రభుత్వం ఐఎఫ్పీ బోర్డులను 8, 9,10వ తరగతులలో ఏర్పాటు చేసింది. ఐఎఫ్పీ ద్వారా బోధించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని పాఠశాలల్లో పనితీరును త్వరలో పరిశీలిస్తాను. – శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
కోటి ఆశలతో..మేటి సంబరాలతో..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): కోటి ఆశలతో.. మేటి సంబరాలతో సరికొత్త సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు. ఎన్నో మధురజ్ఞాపకాలను, మరపురాని సంగతులను అందించిన 2025కు వీడ్కోలు పలికి.. 2026 సంవత్సరాన్ని ఆత్మీయంగా ఆహ్వానించారు. గురువారం యువతులు, మహిళలు తమ ఇంటి ముంగిట్లో వేసిన అందమైన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం కుటుంబ సభ్యులకు, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద తమ మిత్రులతో కలిసి కొత్త ఏడాది తొలిరోజును ఆనందంగా జరుపుకొన్నారు. -
వేదికలు కావవి.. రైతు వేదనలు
నంగునూరు(సిద్దిపేట): రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికల్లో పలు సమస్యలు వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యా రు. కనీసం తాగడానికి నీరు లేక, మరుగుదొడ్లు వినియోగంలోకి రాక అన్నదాతల పాట్లు అన్నీఇన్నీకావు. క్లష్టర్ పరిధిలో నిర్వహించే సమావేశాలకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివిధ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల సౌలభ్యం కోసం ప్రభుత్వం 2021లో జిల్లా వ్యాప్తంగా 126 రైతు వేదికలు ఏర్పాటు చేసింది. అందులో 76 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు (వీసీయూ) ఉన్నాయి. గ్రామాలకు దూరంగా.. చాలా రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉండడంతో నీటి సరఫరా లేక ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా మహిళ ఏఈఓలు ఎక్కువగా ఉండడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి వసతి లేక.. టాయిలెట్లను శుభ్రం చేసే వారు లేక నిరుపయోగంగా మారాయి. రైతు వేదికలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీటి సమస్య వేధిస్తోంది. అలాగే వీటి నిర్వహణ గ్రామపంచాయతీ పరిధిలో లేకపోవడం, ఏఈఓ ల పర్యవేక్షణలో ఉండడంతో సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. 5 వేల ఎకరాల్లో పంట సాగు ఆధారంగా సమీప గ్రామాలను క్లష్టర్ పరిధిలో చేర్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) రైతుల వేదికలో అందుబాటులో ఉంటూ సీజన్ల వారీగా పంటల నమోదు, పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధిస్తున్న నీటి సమస్య రైతు వేదికలో పంటల సాగు, చీడ పీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు, ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వసతులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్లు చాల గ్రామాల్లో ధ్వంసం కావడంతో నల్లాలు, టాయిలెట్లు, వాష్బేసిన్లు పని చేయక చెత్త, చెదారంతో నిండిపోయాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం రైతు వేదికల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాటర్ ట్యాంక్లను కోతులు ధ్వంసం చేయడంతో నీటి సమస్య నెలకొంది. దీంతో టాయిలెట్లు, వాష్రూమ్స్ నిరుపయోగంగా మారాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. – గీత, వ్యవసాయ అధికారి, నంగునూరువసతులు లేక తప్పని అవస్థలు -
డిగ్రీ కళాశాలలో నేడు అంతర్జాతీయ వెబినార్
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ వెబినార్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే ఈ వెబినార్లో నేపాల్ త్రిభువన్ యూనివర్సిటీ ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ అంజనాసింగ్ పాల్గొంటారన్నారు. మైక్రోబయాలజీ సొసైటీ ఆప్ ఇండియా సహకారంతో కళాశాల సూక్ష్మజీవశాస్త్రం, హెల్త్కేర్ మేనేజ్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వెబినార్లో శస్త్రచికిత్స అనంతరం గాయసంక్రమణల్లో అనారోబిక్ బ్యాక్టీరియా అనే అంశంపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ వెబినార్తో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు శాసీ్త్రయపరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ స్థాయి అవగాహన పెంపొందుతుందన్నారు. -
యూరియా కోసం ఆందోళన వద్దు
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో నిర్వహిస్తున్న యూరియా కార్డుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత రాకుండా పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టా పాసు బక్కులను తీసుకువచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున, యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు. కౌలు రైతులు సైతం అసలు పట్టాదారు పాస్ బుక్కు లేదా జీరాక్స్ను తీసుకువస్తే యూరియా అందజేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న యూరియా కొరత కథనాలను రైతులు నమ్మెద్దన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లేశం, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీహెచ్సీ కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య విధానాలపై ఆరా తీశారు. కాలం చెల్లిన మందులను వాడరాదని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులను నెలవారిగా మానిటరింగ్ చేసి ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు సరిపడా నిల్వలు కలెక్టర్ హైమావతి -
విభేదాలు వీడుదాం.. సమష్టిగా సాగుదాం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అందరం సమష్టిగా కృషి చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిద్దామని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. విభేదాలు వీడుదాం.. గతం వదిలేద్దామన్నారు. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఆర్టీఏ జిల్లా మెంబర్ సూర్యవర్మ బుధవారం తన నివాసంలో ఆంక్షా రెడ్డిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, బైక్ ర్యాలీ ద్వారా సూర్యవర్మ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం ఇష్టంగా పనిచేయాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో 94 మంది సర్పంచ్ లను గెలిపించుకున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి శుభసూచికమన్నారు. సిద్దిపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి ఉత్తమ ఫలితాలు సాధిద్దామన్నారు. అంతకుముందు సూర్యవర్మ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు ఆమెను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం కావాలి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి -
నూతనోత్సాహం
ప్రశాంత్నగర్(సిద్దిపేట)/దుబ్బాక: కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికారు. హాటళ్లు, బేకరీ దుకాణాలన్నీ కిటకిటలాడాయి. మద్యం దుకాణా వద్ద కూడా సందడి కనిపించింది. మహిళలు గ్రూప్లుగా ఏర్పడి కేక్లు కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. పర్యాటక ప్రదేశాలు కోమటిచెరువు, రంగనాయకసాగర్తో పాటుగా ఇతర ప్రాంతాల్లో న్యూ ఇయార్ జోష్ కనిపించింది. కొన్ని పాఠశాలల్లో ముందస్తుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. గురువారం జిల్లాలోని ఆలయాలకు భక్తులు భారీగా తరళిరానున్న నేపద్యంలో నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు -
కొంగొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి
జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులుకొంగొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో జిల్లా వాసులు 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది సాధించిన విజయాలు, ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను సాక్షితో పంచుకున్నారు. వెల్లడించిన అంశాలు.. వారి మాటల్లోనే.. – సాక్షి, సిద్దిపేటనూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సూర్యాస్తమయ వేళ కోమటి చెరువులో బోటు షికారు చేస్తూ యువతుల కేరింతలు ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువస్తా.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో పూర్తిగా అమలు అయ్యేందుకు కృషి చేస్తా. పాఠశాల విద్య పదో తరగతి అయిపోగానే చదువును చాలా మంది ఆపివేస్తున్నారు. ఇంటర్ నుంచి పీజీ వరకు తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగికి రూ25లక్షల ఇన్సూరెన్స్ చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడిని తీసుకవస్తాను. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతా. – చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్సీఅన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి అందరి సహకారంతో జిల్లా అన్ని రంగాల్లో ముందుండే విధంగా అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రభుత్వ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులకు చేరే విధంగా చూస్తాను. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ద్వారా సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తాను. జిల్లా ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. – హైమావతి, కలెక్టర్సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగి.. లక్ష్యాలను చేరుకోవాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా విద్యార్థులు, యువత, నూతన లక్ష్యాలు ఎంచుకుని వాటిని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగాలి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. – తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యేగౌరవెల్లితో సాగు నీటిని అందిస్తా.. గౌరవెల్లి రిజర్వాయర్కు అనుబంధంగా కాలువలు నిర్మించి సాగు నీటిని అందించి మూడు పంటలు పండేలా కృషి చేస్తా. హుస్నాబాద్లో ప్రారంభమైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తా. సర్వాయి పాపన్న నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గానికి ట్రీపుల్ఐటీ బ్రాంచ్ను, నవోదయ వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. – పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికాలువల నిర్మాణానికి కృషి దుబ్బాక నియోజకవర్గం తొగుటలో ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఇతర ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందిస్తోంది. కానీ దుబ్బాక నియోజకవర్గంలో కాలువల నిర్మాణం లేకపోవడంతో సాగు నీరు అందడం లేదు. మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలకు కాలువల నిర్మాణం చేయించేందుకు కృషి చేస్తాను. దుబ్బాక పట్టణం రింగ్ రోడ్, వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మించేందుకు ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తీసుకువస్తా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా – కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ,దుబ్బాకరోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు అవగాహన కల్పిస్తాను. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రమాదాల్లో చనిపోకుండా కంట్రోల్ చేస్తాను. అలాగే సైబర్ క్రైంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచి కట్టడికి కృషి చేస్తాను. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ కృషి చేస్తోంది.– విజయ్ కుమార్, సీపీ ఉద్యాన పంటలను విస్తరిస్తా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు విస్తరించేందుకు కృషి చేస్తాను. అలాగే యూనివర్సిటీ ద్వారా కొత్త వంగడాల కోసం పరిశోధనలు చేపిస్తాను. ఉద్యాన పంటలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాను. పంటల సాగులో రసాయన మందుల వినియోగం తగ్గించాలి. – డి.రాజిరెడ్డి, వీసీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ -
సుబ్రహ్మణ్యేశ్వరునికి లక్ష పుష్పార్చన
వైభవంగా కృత్తిక మహోత్సవం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక మహోత్సవ వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అర్చకులు స్వామివారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుని నామాలు పఠిస్తూ లక్షపుష్పార్చన చేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
రాజకీయాలు.. మలుపులు
ఏడాదంతా రసవత్తరంసాక్షి, సిద్దిపేట: ఏడాదంతా రాజకీయాలు రంజుగా సాగాయి. కీలక మలుపులు చోటుచేసుకున్న 2025 సంవత్సరానికి జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా గుర్తిండిపోనుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు అత్యధిక సర్పంచ్ స్థానాలు సాధించి బీఆర్ఎస్ కంచుకోట అని మరోసారి నిరూపించుకున్నారు. గతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు రెండు బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జిల్లా సారఽథులను నియమించారు. దుబ్బాక నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలకు మార్కెట్ పదవులు దక్కాయి. మొత్తానికి ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన 2025 ఏడాది జిల్లాపై ప్రత్యేక ముద్ర వేసింది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, 4,508 వార్డు సభ్యులకు మూడు విడతలలో డిసెంబర్ 11, 14, 17వ తేదీలలో ఎన్నికలు జరిగాయి. వీటిలో బీఆర్ఎస్ మద్దతుదారులు 266, కాంగ్రెస్కు చెందిన వారు 171, బీజేపీ 21, ఇండిపెండెట్లు 50చోట్ల గెలుపొందారు. జిల్లాలో అత్యధికంగా బీఆర్ఎస్ మద్దతు దారులు గెలుపొంది సత్తాను చాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా బీజేపీ మద్దతు దారులు విజయం సాధించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా కొమురయ్యలు గెలుపొందారు. ఈ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులను బరిలో ఉన్న వారు ఈ ఓట్లకు డబ్బులను జోరుగా పంపిణీ చేశారు. ఈ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ఎన్నికలను తలపించాయి. డీసీసీ అధ్యక్షురాలిగా.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం దాదాపు 127 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీ పదవిని ఆశించిన వారి దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదేశ్వరరావు, నజీర్ హుస్సేన్లు పరిశీలించి ఆశావహులతో నేరుగా సమావేశాలు నిర్వహించారు. తర్వాత ఏఐసీసీకి మూడు పేర్లను సూచించగా అందులో నుంచి తూంకుంట ఆంక్షారెడ్డిని ఎంపిక చేసి నవంబర్ 22న ప్రకటించారు. రాష్ట్రంలో అఽధికారంలో ఉన్నప్పటికీ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు వెంటాడుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా.. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా శంకర్ ముదిరాజ్ను ఫిబ్రవరి 18న పార్టీ అధిష్టానం ప్రకటించింది. బీజేపీలో మూడు వర్గాలు విడిపోయారు. మోహన్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల వర్గీయులు జిల్లా కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు అంతంతమాత్రంగానే హజరవుతున్నారు. జిల్లా అధ్యక్షున్ని నియమించి 10 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా కార్యవర్గాన్ని నియమించలేదు. జిల్లా పరిధిలో ఇద్దరు ఎంపీలు బీజేపీకి చెందిన వారు ఉన్నప్పటికీ కేవలం 21 చోట్లనే సర్పంచ్లు గెలుపొందారు. ‘స్థానిక’ంగా సత్తా చాటిన బీఆర్ఎస్ గతం కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ వికసించని కమలం కాంగ్రెస్, బీజేపీ జిల్లా సారఽఽథుల నియామకంవరించిన నామినేట్ పదవులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేట్ పదవులు కొందరి కాంగ్రెస్ నాయకులను వరించాయి. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీలను, కొమురవెల్లి దేవాలయ కమిటీ నవంబర్ 24న నియమించారు. పల్లె ఎన్నికల వేళ స్థానిక నేతలకు తీపి కబురు అందింది. సిద్దిపేట నియోజకవర్గంలో మార్కెట్ పదవుల్లో నియమించకపోవడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్నారు. రెండేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు నామినేట్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. -
న్యూ జోష్కు రెడీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నూతన సంవత్సరాన్ని న్యూ జోష్తో ప్రారంభించేందుకు యువత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2025 సంవత్సర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా యువత తమ మిత్రులతో కలసి బుధవారం రాత్రి వేడుకలు చేసుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని బేకరీలు, హోటళ్ల నిర్వాహకులు వివిధ రకాలైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీల వద్ద విద్యుత్ అలంకరణలు ఆఫర్ బోర్డులతో ఆకర్షిస్తున్నాయి.ఉపాధ్యాయుడు దుర్గయ్యకు అవార్డు చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులలో సాహిత్యాభిలాషను పెంపొందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు భైతి దుర్గయ్యకు తోట ఫౌండేషన్ హైదరాబాద్ వారు మంగళవారం అవార్డుతో పాటు రూ.5 వేల నగదు అందజేశారు. మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల టీచర్ దుర్గయ్య అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ, విద్యార్థులలో సాహిత్యం పెంపొందిస్తున్నారు. అందుకు గాను అవార్డును బహూకరించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు శ్రావణ్, నిరంజన్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు. వార్డుల సంఖ్య పెంచండి ● ప్రభుత్వంతో మాట్లాడండి ● వేం నరేందర్రెడ్డికి నర్సారెడ్డి వినతి గజ్వేల్: మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ విలీనమై ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 20వార్డులకు మరో 15 వార్డులను పెంచడానికి ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ప్రస్తుతం పాత వార్డుల్లోనే నిర్వాసిత కాలనీ ఓట్లను విలీనం చేయడం వల్ల ఒక్కో వార్డులో 2,300–2,500వరకు ఓటర్ల సంఖ్య పెరిగి పరిపాలనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని కోరారు. సేంద్రియం వైపు మొగ్గు చూపాలి జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ మరూక్(గజ్వేల్): రైతులు సమీకృత, సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపి అధిక లాభాలు గడించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ సూచించారు. మర్కూక్ రైతుల వేదికలో మంగళవారం వర్షాధారిత ప్రాంత అభివృద్ధి పథకంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పామాయిల్ పంట వేయడంతో 30 ఏళ్ల పాటు దిగుబడి పొంది అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ప్లాస్టిక్ బుట్టలు, వార్మీబెడ్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాము, ఉద్యాన శాఖ అధికారి సౌమ్య, మౌనిక, సుబ్బారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల వేట
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ భవనాల్లో కార్యాలయాల ఏర్పాటు కోసం అధికారులు వేట ప్రారంభించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు అయోమయంలో పడ్డారు. అద్దె భవనాలు ఖాళీ చేయక వాటిల్లోనే కార్యాలయాలు కొనసాగిస్తే అలాంటి భవనాలకు వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అద్దె చెల్లించడాన్ని నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల అధికారులు ప్రభుత్వ భవనాల కోసం వేట మొదలు పెట్టారు. ఈ చిత్రంలోని భవనం.. ఆర్టీఏ కార్యాలయం. జిల్లాల ఏర్పాటు అనంతరం చేర్యాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రారంభం నుంచి ఇదే అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి ప్రతి నెలా రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు.వీటితో పాటు కొమురవెల్లి మండలంలో తహసీల్దార్, ఐకేపీ, దూల్మిట్ట మండల తహసీల్దార్, విద్యుత్ శాఖ, జిల్లా వ్యాప్తంగా పలు కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లింపును నిలిపివేయనుంది. వీటి ఏర్పాటు కోసం ఏమేరకు ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతాయో వేచి చూడాల్సిందే. నేటితో ముగియనున్న అద్దె భవనాల గడువు ఖాళీ చేయాలని ఉన్నతాధికారుల ఉత్తర్వులు అయోమయంలో అధికారులు -
ఉడకని కూర.. నీళ్ల చారు
● ప్రభుత్వ బడిలో ఇదీ మధ్యాహ్న భోజనం ● నాసిరకం కూరగాయలతో వంటలు ● కలెక్టర్ హెచ్చరించినా మారని తీరుకొమురవెల్లి(సిద్దిపేట): సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడుతోంది. ఉడకని అన్నం, ఉడికీఉడకని కూర.. నీళ్ల చారుతో విద్యార్థులు సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాక్షాత్తు కలెక్టర్ పలు మార్లు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హెచ్చరిస్తున్నా నిర్వాహకుల తీరు మారడంలేదు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనం తినలేక విద్యార్థులు పస్తులతో ఉంటున్నారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు 222 మంది ఉన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోగా ఉడకని కూర, నీళ్ల చారు అందిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. నాసిరకం కూరగాయలతో వంట చేయడంతో అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇందేంటి అని విద్యార్థులు అడిగితే ‘మీ ఇష్టం ఉంటే తినండి.. లేదంటే ఊరుకోండి’ అని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి వంట చేసే నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.పురుగులు పట్టిన కూరగాయలతో.. పురుగులు పట్టిన కూరగాయలతో వంట చేస్తున్నారు. దానికి తోడు కూర ఉడకక ముందే వడ్డిస్తున్నారు. దీంతో అరగడం లేదు. చాలా మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. – పి.రక్షిత, టెన్త్ విద్యార్థిని అడిగితే బెదిరిస్తున్నారు కూరలు రుచిగా లేవని అడిగితే.. మీ ఇష్టం ఉంటే తినండి లేదంటే ఇంటినుంచి బాక్స్ తెచ్చుకోండి అంటూ బెదిరిస్తున్నారు. చాలా మంది ఇంటి నుంచే టిఫిన్ బాక్సు తెచ్చుకుంటున్నాం. – దుర్గ ప్రసాద్, టెన్త్ విద్యార్థి చర్యలు తీసుకుంటాం ఎంఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. కొమురవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నాసిరకంగా వంట చేస్తున్నట్లు నాదృష్టికి వచ్చింది. విచారణ జరిపి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. – రవి, ఎంఈఓ -
ముక్కోటి.. తరించిన భక్తకోటి
ఉత్తరద్వారంలో స్వామివారు దివ్యదర్శనం ● గోవిందనామస్మరణతో మారుమోగిన ఆలయాలు ● పుణ్యక్షేత్రాల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మికతప్రశాంత్నగర్(సిద్దిపేట): పుణ్య క్షేత్రాలు ‘ముక్కోటి’ వైభవంతో అలరారాయి. ముక్కోటి ఏకాదశిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. స్వామి వారి పల్లకీ సేవ చేపట్టారు. మోహినిపుర ఆలయంలో కలెక్టర్ హైమావతి, న్యాయమూర్తులు, మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు, సినీ హిరో సంపూర్ణేష్బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ నిర్వాహకులు సన్మానాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు ఆలయాలకు భారీగా తరలిరావడంతో అన్ని ఆలయాలు కిటకిటలాడాయి. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. -
రిజర్వాయర్లపై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రిజర్వాయర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది తగదని ఎమ్మెల్యే హరీశ్రావు.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో కొత్త ఆయకట్టు భూసేకరణకు నిధులు విడుదల చేయాలని మంగళవారం ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. 2020 నుంచి 2023 వరకు ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తిచేసి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించుకున్నామన్నారు. దీని ఫలితంగా పంట దిగుబడి సైతం భారీగా పెరిగిందని, కానీ 2023 తర్వాత ఈ రిజర్వాయర్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు కేటాయించడం లేదన్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సి ఉందని ఈ విషయంపై మీకు పలుమార్లు లేఖల రూపంలో, ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగానూ కలిసి వివరించానని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం ప్రకారం ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు‘ అనే మీ మాట ఉత్తదేనా అని విమర్శించారు. తక్కువ ఖర్చు ఎక్కువ సాగు అనే పదం సిద్దిపేట జిల్లాలో సాధ్యమవుతుందని లేఖలో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్నపూర్ణ(అంతగిరి) రిజర్వాయర్ ప్యాకేజ్–10కి సంబంధించి రూ.15కోట్లు, రంగనాయకసాగర్ (ప్యాకేజీ–11)కు సంబంధించిన రూ.15 కోట్లు కేటాయించాలని, ఈ లేఖలో పేర్కొన్నారు. రూ.30కోట్లతో భూసేకరణ పూర్తయితే అదనంగా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు పెరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొత్త ఆయకట్టు ముందు కు సాగడం లేదని, ప్రభుత్వ నిర్ణయం కోసం వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాలువల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టేందుకు రూ. 30 కోట్ల నిధులు మంజురు చేయాలని రైతు ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు. కొత్త ఆయకట్టు భూసేకరణకు రూ.30 కోట్లు కేటాయించాలి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ -
గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు
● కలెక్టర్ హైమావతి ● ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ సిద్దిపేటరూరల్: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల పరీక్షకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రవేశపరీక్షకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6నుంచి 9వ తరగతుల ఖాళీలకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు.http://tgcet.cgg.gov.in ద్వారా వచ్చే నెల జనవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కులం, ఆదాయం, ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫొటోలు అవసరమని తెలిపారు. సర్టిఫికెట్ల సత్వర జారీకి కలెక్టరేట్లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
నాచగిరి క్షేత్రంలో సర్వం సిద్ధం
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం, వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయాలు ‘ముక్కోటి’ ఏకాదశి పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని నాచగిరి చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ విజయరామారావు పేర్కొన్నారు. వర్గల్ కోవెలలో.. వర్గల్ వేంకటేశ్వరాలయంలో తెల్లవారుజాము 3.00 గంటలకు అభిషేకం, 5.30 గంటల వరకు అలంకార సేవ, 5.45 గంటల వరకు ఉత్తర ద్వార పూజ, 6.00 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి తులసి అర్చన, పంచసూక్త పారాయణాలు జరుగుతాయని ఆలయ మేనేజర్ రఘుపవన్రావు తెలిపారు.ఆలయంలో కొలువైన శ్రీవారువర్గల్లోని వేంకటేశ్వరాలయం -
యాసంగి పంటలకు నీరందించండి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలు పూర్తయినప్పటికీ మిగిలిన పంట కాల్వలు త్వరగా పూర్తిచేసి యాసంగికి నీరందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అసెంబ్లీలో విన్నవించారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అనుసంధానంగా నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి చెరువులు, కుంటలు నింపే ప్రధాన కాల్వలు పూర్తయినా పంట కాల్వలు పూర్తికాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి, అధికారులకు పలుసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. యాప్లు పెట్టి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. గత వానాకాలంలో యూరియా కొరతతో పంటల దిగుబడి చాలా తగ్గిందని, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంట్ కష్టాలు సైతం రైతులకు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు సోమవారం హాజరైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వేగిరంగా కాల్వలు పూర్తిచేయండి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
తగ్గని నేరాలు
గతేడాది కంటే పెరిగిన 291 కేసులుసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే 4శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,144 కేసులు నమోదు కాగా 2024లో 6,853 కేసులు నమోదయ్యాయి. దీంతో గతేడాదికంటే 291 కేసులు పెరిగాయి. ఆస్తి కోసం హత్యలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీ కేసులు పెరిగాయి. అత్యాచార, పోక్సో చట్టం, మహిళలపై నేరాలు తగ్గాయి. జిల్లాలో స్వల్పంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నేరాల శిక్షలను పరిశీలిస్తే గతేడాది వివిధ కేసుల్లో నేరస్తులకు 48శాతం పడగా ఈ ఏడాది పలు కేసుల్లో 42శాతం శిక్షలు విధించారు. – సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్ రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు మరణాలు సైతం తగ్గాయి. ఈ ఏడాది 716 రోడ్డు ప్రమాద కేసులు నమోదుకాగా అందులో 274 మరణాలు, 599 మంది గాయపడ్డారు. 2024లో 718 కేసులు, 315 మరణాలు కాగా 645 మందికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. ఈ ఏడాది 4,52,776 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా వారికి రూ. 16,73,29,000 జరిమానా విధించారు. గతంతో పోలిస్తే 14శాతం పెరిగింది. రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా 61,147 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేయగా రూ. 6,32,67,845 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా వేస్తున్నారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు వాహనదారులు జంకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, గ్రామాలలో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలకు ట్రాఫిక్, రహదారి భద్రతా సమస్యలు, డ్రైవింగ్ నిబంధనలు, అవగాహన కల్పించారు. సిద్దిపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ సిహెచ్ బాలమల్లయ్య రహదారి భద్రతా సమస్యలపై వివిధ రహదారి భద్రతా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. తగ్గిన దొంగతనాలు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు తగ్గినప్పటికీ చైన్ స్నాచింగ్లు పెరిగాయి. గతేడాది 759 దొంగతనాలు జరగగా ఈ ఏడాది 731 నమోదయ్యాయి. ఈ దొంగతనాల్లో 5,07,67,840 విలువైన ఆస్తి, నగదు పోగా అందులో రూ. 1,42,69,301 విలువైన ఆస్తిని రికవరీ చేశారు. దోపిడీ కేసులు 2024లో 7 నమోదు కాగా ఈ ఏడాది 12కి పెరిగాయి. పలు ముఖ్యప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా చైన్ స్నాచింగ్లు ఆగడం లేదు. చైన్ స్నాచింగ్లు 2014లో 9 కాగా ఈ ఏడాది 13 జరిగాయి. గేమింగ్ యాక్ట్ కింద 77 కేసులు ఈ ఏడాది గేమింగ్ చట్టం కింద 77 కేసులు నమోదు చేసి రూ. 11,25,700 సీజ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా సిటిజన్ క్లబ్ పై మెరుపు దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్న 50 మంది పై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాప్లను కట్టడిలో భాగంగా ఎకై ్సజ్ చట్టం 440 కేసులు, అక్రమ ఇసుక రవాణా 203 కేసులు నమోదు అయ్యాయి. కోడ్ ఉల్లంఘన.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, మోడల్ కోడ్ కండక్ట్ను పకడ్బందీగా చేపట్టారు. కోడ్ ఉల్లంఘనలో 507 కేసులు నమోదయ్యాయి. అందులో 271 మద్యం కేసులు నమోదు చేసి 5,181 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సరియైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 30,36,620 నగదును సీజ్ చేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం వీధి రౌడీలు, మోసగాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించేవారితో పాటు, అక్రమార్కుల పై కఠినంగా వ్యవహరించి ఉక్కు పాదం మోపుతాం. పారదర్శకంగా, అవినీతి రహితంగా, బాధ్యతాయుతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్వహిస్తాం. సాధారణ పౌరులకు భద్రతా కల్పిస్తూ, కఠినమైన పద్ధతిలో చట్టాన్ని అమలు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు అవగాహనపెంచుతాం. – విజయ్ కుమార్, సీపీనిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాటరీలు, వాహనాలుమహిళలపై తగ్గిన వేధింపులు జిల్లాలో మహిళలపై వేధింపులు తగ్గాయి. షీ టీంలు నిఘా ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్కు పాల్పడే పోకిరీల ఆటకట్టించారు. 2024లో అత్యాచార కేసులు 80 నమోదు కాగా ఈ ఏడాది 53 అయ్యాయి. దీంతో గతేడాదిలో పోలిస్తే 27 తగ్గాయి. పోక్సో చట్టం కేసులు గతేడాది 97 కాగా ఈ ఏడాది 79 అయ్యాయి. గతేడాది కంటే ఇప్పుడు 18 తగ్గాయి. మహిళలపై నేరాల కేసులు 2024లో 589 నమోదు కాగా నుంచి 572 కేసులు నమోదయ్యాయి. పెరిగిన హత్యలు, చైన్ స్నాచింగ్లు, దోపిడీలు రోడ్డు ప్రమదాలు, మరణాలు తగ్గుముఖం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 507 -
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి
చేర్యాల(సిద్దిపేట): సుమారు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం మరోసారి అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా జీరో అవర్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరేరాల ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజాభీష్టం నెరవేర్చాలన్నారు. ఈ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహారాష్ట్రలో ఈ నెల 30 నుంచి జనవరి 2వరకు నిర్వహించనున్న జాతీయ యోగాసన పోటీలకు ముగ్గురు ఎంపికై నట్లు, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆదివారం తెలిపారు. వినయ్కుమార్, తోట సుధాంశ్, తోట సంధ్య ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యక్షుడు విక్రమ్రెడ్డి, హరిప్రసాద్, చీఫ్ ప్యాట్రన్ ప్రభాకర్, గౌరవాధ్యక్షులు అంజయ్యతో పాటు యోగాసనా సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. చెకుముకి పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలో జిల్లా ప్రఽథమ స్థానంలో నిలిచినట్లు సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సానియా, రక్షిత, రామ్చరణ్లు రాణించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందారన్నారు. అద్భుత ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, గైడ్ టీచర్ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ దుబ్బాకరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలి సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే నూతనంగా మండల కార్యవర్గం ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా బెల్లె రమేశ్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు సిద్దిపేటకమాన్: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు వాసుదేవరావు, ఉపేందర్ హెచ్చరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోని గాలిపటాలు, మాంజా విక్రయ దుకాణాల్లో ఆదివారం వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాంజా వల్ల ప్రజలకు, వాహనదారులు, పశువులు, పక్షులకు ప్రమాదకరంగా మారిందన్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వ్యాపారులు విక్రయించకూడదని సూచించారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
రాజగోపురం ఎదుట భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలోఆదివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. స్వామివారిని దర్శించుకున్న అనంతరం గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనంతో నైవేద్యం సమర్పించారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.నాచగిరి.. భక్తజన ఝరివర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. విశేషమైన ధనుర్మాసంలో గర్భగుడిలో కొలువైన లక్ష్మీనృసింహులను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. -
రైతుల గోస పట్టని సర్కార్
దుబ్బాక: రైతుల కష్టాలు పట్టడంలేదని, కనీసం యూరియా కూడా అందించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం రఘోత్తంపల్లి శివారులో వరినాట్లు వేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా యూరియా దొరకడం లేదని, సాగు చేయాలంటే ఇబ్బందులు తప్పడంలేదని రైతులు ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే రైతులు ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని రైతులకు అప్పుడే మంచిరోజులు వస్తాయన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని తప్పకుండా మంచి రోజులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నాట్లేస్తున్న రైతులతో మాటామంతి -
బతుకులు గొయ్యి పాలాయె.. వంతెన కోసం తవ్విన గొయ్యిలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు 8లో u
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నేడు సాక్షి ఫోన్ ఇన్..సిద్దిపేటకమాన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వర పీడిత బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ధనరాజ్తో ఈనెల 29న (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్ఓతో మాట్లాడవచ్చు. 29వ తేదీ (సోమవారం) సమయం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 98668 98692, 98669 84788 రైతులను ముంచిన భారీ వర్షాలు ● జిల్లాలో అధిక వర్షపాతం నమోదు ● యూరియా కోసం తప్పని అవస్థలు ● దిగుబడిపై తీవ్ర ప్రభావం ● ప్రారంభానికి సిద్ధమైన పామాయిల్ ఫ్యాక్టరీజిల్లాలో పంటల సాగుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. కాలం కలిసిరాక ఒక వైపు.. పాలకులు సరియైన సమయంలో యూరియా అందించక మరోవైపు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలు ఆగమాగం చేశాయి. చెరువులు, వాగులు తెగి పంటలు నీటిపాలయ్యాయి. వరి దిగుబడి తగ్గింది. పత్తి పంట చేతికి వచ్చే సమయంలోనూ వానలు పడటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సన్న ధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందజేస్తుండటంతో రైతులకు కొంత ఊరట కలిగింది. మొత్తానికి జిల్లాలో ఈ ఏడాది సాగు ఇలా సాగింది. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో సాధారణ వర్షపాతం సగటున 716 మిల్లీమీటర్లు.. కాగా 1,252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానాకాలం మొదట్లో తక్కువగా కురవగా.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసిన అతి భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో అన్నదాత ఆశలన్నీ నీటి పాలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చిన తర్వాత కూడా వర్షాలు వెంటాడాయి. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో అత్యధికంగా వడ్లు తడిశాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకువచ్చిన ఇద్దరి రైతుల ధాన్యం పూర్తిగా కొట్టుకపోయాయి. దిగుబడిపై ప్రభావం.. వర్షాలతో పంటల దిగుబడిపై ప్రభావం పడింది. వానాకాలంలో మొత్తం 5,42,382 ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. వరి 3,86,083 ఎకరాలకు దాదాపు 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావాలి. ఒక్కో ఎకరానికి 18 నుంచి 21 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి 1,18,785 ఎకరాల్లో సాగుకాగా మిగతా పంటలు 37,514 ఎకరాల్లో సాగు చేశారు. 5.5లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. 94వేల మంది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ కేంద్రాల ద్వారా 3,63,487 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 3,44,633 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18,853 టన్నుల సన్నాలు కొనుగోలు చేశారు. సన్నాలకు ప్రభుత్వం బోనస్గా ఇవ్వడంతో కొంత మంది రైతులు ఊపిరిపిల్చుకున్నారు. వర్షాల నేపథ్యంలో పొలాల దగ్గరనే పలువురు కాంటాలు పెట్టారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేశారు.పామాయిల్ ఫ్యాక్టరీ నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. పామాయిల్ గెలల నుంచి ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ట్రయల్ రన్ సైతం పూర్తి అయింది. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. జిల్లాలో 12,600 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు దిగుబడి ప్రారంభమైంది. జిల్లాలో పామాయిల్ పరిశ్రమ అందుబాటులోకి వస్తే మరింత సాగు పెరిగే అవకాశాలున్నాయి. -
గాంధీ పేరును రూపుమాపే కుట్ర
హుస్నాబాద్రూరల్: కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును రూపుమాపేందుకు కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును మార్చిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం పట్టణంలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ గ్రామీణ రైతు, కూలీలకు వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఉపాధి పథకం తెచ్చారన్నారు. ఉపాధిహామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో కూలీలకు పని దొరకడంతో పాటు కూలీ రేట్లు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు తెస్తే స్వాగతిస్తామని, కానీ పథకాలకు పేర్లు మార్చడం సరికాదన్నారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బంక చందు, చిత్తారి రవీందర్, పద్మ, హసన్, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసన -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్, నియోజకవర్గ పార్టీ క్యాంప్ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నియోజకవర్గ కార్యాలయంలో హరికృష్ణలు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమాలలో టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, దాస అంజన్న, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు -
వార్డుల పెంపు లేనట్లే?
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల పెంపు లేనట్లే కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ మున్సిపాలిటీలోని మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్అండ్ఆర్ కాలనీ) కొత్తగా విలీనం కావడంతో వార్డుల సంఖ్య 30కి పెరగొచ్చనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతమున్న 20వార్డుల్లోనే ఈ కాలనీ విలీనం కానుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాజకీయ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. – గజ్వేల్ మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలైన తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్లతోపాటు కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మరిన్ని మధిర గ్రామాలు ఉన్న సంగతి తెల్సిందే. ఈ పంచాయతీలను గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్లకు తరలించి ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించారు. 2020 నుంచి ఇటీవలీ కాలం వరకు ఇవీ పంచాయతీలగానే కొనసాగాయి. ఈ పంచాయతీలను కొన్ని రోజుల కిందట రద్దు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో సుమారు 20వేల జనాభా, మరో 14వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలో ఇదివరకే 32వేల ఓటర్లు ఉన్నారు. ఈ రెండు కలిపితే.. ఓటర్ల సంఖ్య 46వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో ప్రస్తుతం 1500 ఓటర్ల చొప్పున మరో 10వార్డులు పెరుగొచ్చని వార్తలొచ్చాయి. కానీ అందుకు భిన్నంగా 2,300ఓటర్లకు ఒక వార్డు చొప్పున గతంలో 20వార్డులనే కొనసాగించాలని మున్సిపల్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు నిర్వాసిత కాలనీ ఓటర్లను ప్రస్తుతమున్న వార్డుల్లోనే చేర్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలోనూ ఒక్కో వార్డులో 2,200–2,500మంది ఓటర్లు ఉండగా, అదే తరహాలో ఇక్కడ కూడా 20వార్డులు సరిపోతాయని భావిస్తున్నారు. దీంతో వార్డుల పెంపు ఇప్పట్లో లేనట్టేనని సమాచారం. రాజకీయ నేతల ఆశలపై నీళ్లు.. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సంఖ్య పెరిగితే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని భావించి ఎంతోమంది కౌన్సిలర్లుగా పోటీచేయడానికి ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి భిన్నంగా మారే అవకాశముండటం వల్ల వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రస్తుతమున్న వార్డుల్లోనే నిర్వాసిత గ్రామాలు విలీనమయ్యే అవకాశముంటడం వల్ల రాజకీయ సమీకరణలు మారనున్నాయి. పార్టీల బలాబలాలపై ఈ పరిణామం ప్రభావం చూపనుంది. త్వరలోనే ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది. పాత వార్డుల్లోనే నిర్వాసిత గ్రామాల విలీనం మున్సిపల్ ఎన్నికల వేళ.. ఆశావహుల్లో నిరాశ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిస్థితిసీఎం వద్దకు వెళ్తేనే.. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగాలంటే ఈ అంశాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారుల వర్గాల తెలుస్తోంది. సీఎంను ఒప్పించి తీర్మానం ఆమోదించగలిగితేనే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. కానీ ఇక్కడ ఆ స్థాయి ప్రయత్నానికి అవకాశం లేకపోవడం వల్ల వార్డుల పెంపు అంశం మరుగున పడనుంది. -
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం గొల్లపల్లి–ఉదయపూర్ ఉపసర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, వార్డు మెంబర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామస్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నది బీఆర్ఎస్ మా త్రమే అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఆర్థిక సదస్సుకు డాక్టర్ రమేష్
కోహెడరూరల్(హుస్నాబాద్): చైన్నెలోని వేల్స్ యూనివర్సిటీలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సుకు ఎకనామిక్స్ అధ్యాపకుడు డాక్టర్ జాలిగం రమేష్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక రంగ నిపుణులు, మేధావులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనుంది. కాగా, సదస్సులో భాగంగా డాక్టర్ రమేష్ భారతదేశంలో పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయంపై నీటిపారుదల వ్యవస్థల ప్రభావం అనే పత్రాన్ని సమర్పించనున్నారు. దేశంలోని సాగునీటి వసతులు, పంటల దిగుబడిని పెంచడంలో నీటి పారుదల పాత్ర, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై ఆయన చేసిన లోతయిన విశ్లేషణను వివరించనున్నారు. జాతీయ స్థాయి వేదికపై పరిశోధన పత్రాన్ని సమర్పించే అవకాశం రావడం పట్ల పలువురు విద్యావేత్తలు డాక్టర్ రమేష్ను అభినందించారు. -
హుస్నాబాద్ మినహా.. మిగతా చోట్ల ప్ర‘గతి’తప్పింది
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రేపు సాక్షి ఫోన్ ఇన్.. జిల్లాలో యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కోటి ఆశలతో రైతులు పొలం బాట పట్టారు. వరినాట్లు వేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో పొలాల వద్ద సందడి కనిపిస్తోంది. నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామ సమీపంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం సాక్షి కెమెరాతో కిక్ల్మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సిద్దిపేటకమాన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వర పీడిత బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ధనరాజ్తో ఈనెల 29న (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డీఎంహెచ్ఓతో మాట్లాడవచ్చు. తేదీ 29.12.2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 98668 98692, 98669 84788 వరి నాట్లు వేస్తున్న మహిళలుఎరువులు చల్లుతూ.. కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తుల సందడిఆశల సాగు.. -
గాంధీ పేర్లు లేకుండా బీజేపీ కుట్ర
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ పేర్లు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మహాత్మాగాంధీ పేరును అవమానపర్చే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్ జీ పేరును పెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ నాయకులు శివయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు సమర్పించాలిఅక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతకపేటలో డీఎల్పీఓ వెంకటేశ్వర్లు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, మద్దూరు, దూల్మిట్ట మండలాల పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన గ్రామాలలో బ్యాంక్ అకౌంట్లను తెరవాలన్నారు. సర్పంచ్ అభ్యర్ధుల ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి సంజీవ్ ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి సంక్రాంతి విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ‘సర్వేజనా: సుఖినో భవంతు’ అధ్యక్షులు నారాయణ తెలిపారు. సమాజ సేవకులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, యోగ, మెడిటేషన్, సంగీత, నృత్య గురువులు, సినీ, టీవీ, రంగస్థల కళాకారులు, కవులు, రచయితలు, క్రీడాకారులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 18న హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు సర్వేజనాః సుఖినో భవంతు, డోర్ నెం. 1–20–164, పోస్టు: తిరుమలగిరి, గోకుల్నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్ – 500015కు జనవరి 5లోగా దరఖాస్తులు పంపాలన్నారు. పూర్తి వివరాలకు 9652347207 నంబర్లో సంప్రదించాలన్నారు. -
హాజరు శాతం పెంచాలి
● తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ● కలెక్టర్ హైమావతి చిన్నకోడూరు(సిద్దిపేట): తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ను, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాంత పెంచాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. కాగా, ఇబ్రహీంనగర్లోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. వీది కుక్కలను నియంత్రించండి సిద్దిపేటరూరల్: జిల్లాలో వీధి కుక్కల నియంత్రణతో పాటుగా వాటికి షెల్టర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారులతో కుక్కల నియంత్రణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ..కుక్కల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల షెల్టర్ హోమ్ను నిర్మించి అక్కడికి తరలించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి కొండల్రెడ్డి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీపీఓ రవీందర్, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, డీటీఓ లక్ష్మణ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులు కల్పిస్తా
ఎంపీ రఘునందన్ రావు జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పాల్గొన్నారు. కూల్చడం తప్ప.. కట్టడం తెలియదు: ఎమ్మెల్యే జహీరాబాద్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్కు చెందిన బేగరి రాములుకు ఎమ్మెల్యే కె.మాణిక్రావు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. రాములుకు సంబంధించిన రేకుల ఇంటిని కూల్చి వేయించడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద బాధితుడికి ఆర్థిక సహాయం అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే ఇంటిని కూల్చివేయించారని, కాంగ్రెస్ నాయకులకు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. బాధిత కుటుంబానికి నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, భూమయ్య, మచ్చేందర్, రవికిరణ్, రాజశేఖర్, సంపత్, నర్సింహులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కంచుకోట బద్దలు కొట్టాం
● హరీశ్ను ఓడించేందుకు తానే బరిలోకి దిగుతా ● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని, త్వరలో హరీశ్రావును ఓడించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు సర్పంచ్లు కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్ను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. హరీశ్రావు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నాడన్నారు. గత ప్రభుత్వంలో 90 శాతం సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కులాలతో రాజకీయం చేయొద్దన్నారు. నిజాంపేట మండలంలో మంచి మెజార్టీ సాధించినట్లు పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
‘సంక్షేమం’తో గొప్ప పరివర్తన
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తుందని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్లోని ఎస్ఎమ్ గార్డెన్స్లో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రూ.2లక్షల రుణమాఫీతోపాటు ఇతర పథకాలతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తమ సత్తాను చాటుకున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మన సొంతం కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా శ్రమించాలన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నిధుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదనంగా ఇందిరమ్మ ఇళ్లు కూడా కావాలని కోరుతామన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే గెలిచిన సర్పంచ్లతో సీఎంను కలిసేలా అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమోహన్, సర్ధార్ఖాన్, ప్రభాకర్గుప్త తదితరులు పాల్గొన్నారు. మెస్ బిల్లులు విడుదల చేయండి కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు కస్తుర్బా హాస్టళ్లల్లో ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మంత్రికి వినతి పత్రం అందజేశారు.బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయం: మంత్రి వివేక్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోవడంతో భయానికి గురైన కేసీఆర్ తోలు తీస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత ‘ఇలాకా’గజ్వేల్లో కాంగ్రెస్ రోజురోజుకూ పుంజుకుంటున్నదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల అత్యధిక సర్పంచ్ స్థానాలను ఇక్కడ గెలుచుకోగలిగామని చెప్పారు. రాబోవు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయమని జోస్యం చెప్పారు. -
కూర్పు.. కావాలి మార్పు
శనిగరం సింగారం మండలంలోని శనిగరం జలాశయాన్ని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్సందర్శించారు. వివరాలు 8లో uకాంగ్రెస్ కమిటీలపై కసరత్తుసాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోల్చితే ఎక్కువ సర్పంచ్లు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షురాలుగా టి.ఆంక్షారెడ్డిని నియమించగా.. తనకు తోడుగా గట్టి టీంను నియమించాలని కసరత్తు ముమ్మరం చేశారు. ఈ కమిటీల నియామకం కోసం పీసీసీ నుంచి పరిశీలకులు మల్లాది వపన్, రోహిత్ రావులను నియమించారు. జిల్లా కమిటీ, పట్టణ కమిటీలు ఉంటే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎక్కువ మంది పనిచేయడానికి వీలు కలుగుతుందని, అందుకే నోటిఫికేషన్కు ముందుగానే పదవులను భర్తీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగాయి. అదే పరిషత్, పురపాలిక సంఘాల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండటంతో ఫలితాలపై ప్రభుత్వం, పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. పోటీ ఎక్కువే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాల ని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. ఇప్పటికే మంత్రు లు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.నేడు సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ పరిశీలకులు పవన్, రోహిత్ రావు శనివారం సమావేశం నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోగా పరిశీలకులు జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపిస్తే వాటిని పరిశీలించి సంక్రాంతిలోగా ఆమోదముద్ర వేయనున్నారు. -
రైతులు ఇబ్బంది పడొద్దు
సిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. -
పులి సంచారం
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుమిరుదొడ్డి(దుబ్బాక): పులి సంచరిస్తోందని, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. మిరుదొడ్డి, తొగుట మండలాల శివారులోని పంట పొలాల్లో శుక్రవారం పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సందీప్ కుమార్ నేతృత్వంలో సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పులి పాద ముద్రలను గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, తొగుట మండలంలోని గోవర్ధన గిరి, ముత్యం పేట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆయా గ్రామాల రైతులు తమ వ్యవసాయ పొలాలకు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం కాగానే తమ ఇళ్లలోకి చేరుకోవాలని కోరారు. పాడి పశువులను వ్యవసాయ పొలాల వద్ద కాకుండా ఇండ్ల వద్ద కట్టేసుకోవాలని అవగాహన కలిగించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను పసిగట్టి పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.అధికారులు గుర్తించిన పులి పాద ముద్ర -
బలహీనవర్గాల సత్తా చాటాలి: నవీన్
బెజ్జంకి(సిద్దిపేట): వచ్చే ఎన్నికలలో బలహీనవర్గాల సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొంకటి నవీన్ పిలుపునిచ్చారు. బెజ్జంకిలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమష్టిగా కృషి చేసి అన్ని రంగాలలో రాణించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు. గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు జనవరి 23న బెజ్జంకిలో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం, బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీదర్, ఉపసర్పంచ్ దూమాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జెండాను ఎగురవేయాలిఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ గజ్వేల్రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్లో శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారానికై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్, రాములు, మధు, శివకుమార్, బోసు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. -
రెండో రోజు జన జాతరే..
మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులుప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండోరోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు. మెదక్ కలెక్టరేట్: -
కాంగ్రెస్ది ప్రజా వ్యతిరేక పాలన
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
పేదల పక్షాన పోరాటం
● సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్ ● గజ్వేల్లో పార్టీ జెండావిష్కరణగజ్వేల్రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా, పేదల పక్షాన నిరంతరం సీపీఐ పోరాటాలను కొనసాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ పేర్కొన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. చట్టసభల్లో కార్మికులు, కర్షకులు, విద్యార్థుల కోసం అనేక చట్టాలను చేయించిన ఘనత సీపీఐకే ఉందన్నారు. దేశ స్వాతంత్య్రంలో, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర ఉందన్నారు. సీపీఐ పార్టీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే శతజయంతి ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానందరెడ్డి, జనార్ధన్, నియోజకవర్గ ఇన్చార్జి శివలింగు కృష్ణ, సభ్యులు రాజేశం, పోచయ్య, సాయిలు, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ. 3.37 లక్షలు
హుస్నాబాద్రూరల్: పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయ హుండీ కానుకలను బుధవారం లెక్కించినట్లు ఈఓ కిషన్రావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.3,37,476 వచ్చిందన్నారు. సంగారెడ్డి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం పరిశీలకుడు వెంకటరమణారెడ్డి సమక్షంలో హుండీ కానుకలను లెక్కించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ తనిఖీ చిన్నకోడూరు(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్ 108 అంబులెన్స్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 వాహనంలో ఉన్న అత్యవసర మందులు, పరికరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చిన్నకోడూరు పీహెచ్సీని సందర్శించారు. 102 వాహనం వినియోగంపై వైద్యురాలు ఐశ్వర్యను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా కోఆర్డినేటర్ హరిరామ కృష్ణ, సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఉపాధ్యాయుడు నరేశ్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయు డు వెంగళ నరేశ్ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ మేరకు అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్షుడు బైతి దుర్గయ్య బుధవారం తెలిపారు. నరేశ్.. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య వీరన్న పర్యవేక్షణలో ‘రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు.. సిద్దిపేట జిల్లాపై కేస్ స్టడీ’ అనే అంశంపై పరిశోధన (పీహెచ్డీ) చేస్తున్నారన్నారు. కళింగ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో అంతర్జాతీయ సదస్సు జరగనుందని, ఈ సదస్సులో నరేశ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ట్రాఫిక్పై అవగాహన గజ్వేల్రూరల్: విద్యార్థులు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి పేర్కొన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలుర పాఠశాలలో బుధవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రాఫిక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
చరిత్ర ఘనం.. చర్చిలు అబ్బురం
నేడే క్రిస్మస్ పండుగ.. వేడుకలకు సర్వం సిద్ధంప్రశాంత్నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్ మిషనరీలు జిల్లా కేంద్రంలో నిర్మించిన తొలి సీఎస్ఐ చర్చి ఇది. చర్చికి 137 ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకముందే నిర్మించిన ఈ చర్చి జిల్లాలోనే అతి పెద్దది, విశాలమైనది. ఒకేసారి వెయ్యి మందికి పైగా భక్తులు ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. క్రిస్మస్ రోజున జిల్లాతో పాటుగా, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన భక్తులు ఈ చర్చికి అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సిద్దిపేట ప్రాంతంలో ఎలాంటి చర్చి లేనందున ప్రత్యేక శ్రద్ధతో సీఎస్ఐ చర్చి నిర్మాణం చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. పట్టణం మధ్యలో మొదట చిన్న పాకగా.. ఆ తరువాత రేకుల షెడ్డుగా.. అనంతరం భారీ చర్చిని నిర్మించారని వారు తెలిపారు. వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం జిల్లాలోనే పురాతనమైనది సీఎస్ఐ చర్చి. ఇంగ్లండ్ మిషనరీలు ఈ చర్చిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సిద్దిపేట పరిసరాల ప్రజలకు చర్చి అందుబాటులో లేనపుడు ఇక్కడ నిర్మించారు. ఈ చర్చికి వేలాది భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ చర్చిలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం. – రెవరెండ్ ఆంథోని, సీఎస్ఐ చర్చి జిల్లాలోనే ప్రథమం.. 137 ఏళ్ల ప్రస్థానం -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● ప్రజ్ఞాపూర్లో గురుకుల పాఠశాల తనిఖీగజ్వేల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదీలేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. బుధవారం ప్రజ్ఞాపూర్లోని సాంఘిక గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటల తీరు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి కామన్ డైట్ను ఎందుకు పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదుల్లో, వరండాలో విద్యార్థుల సామగ్రి, ఎక్కడపడితే అక్కడే చెత్త ఉండటం చూసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారకులైన ప్రిన్సిపాల్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులకు అక్కడి నుంచే ఫోన్లో ఆదేశించా రు. అనంతరం మైనార్టీ బాలికల గురుకులం, జూనియర్ కళాశాలను సైతం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. తీగుల్ పీహెచ్సీ సందర్శన.. జగదేవ్పూర్ మండలం తీగుల్ పీహెచ్సీని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పీహెచ్సీ పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. -
ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేస్తుండ్రు
జిల్లాకు రానున్న 60 మంది ● ఇటీవల మెరిట్ జాబితా విడుదల ● డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, డీహెచ్కు కేటాయింపులుసిద్దిపేటకమాన్: జిల్లాకు 60 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లు రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ల్యాబ్ టెక్నీషియన్లను రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈ ఏడాది నవంబర్ 17న తుది జాబితాను వెలువరించింది. ఎంపికైన అభ్యర్థులకు మూడు రోజుల క్రితం పోస్టింగ్లను కేటాయించారు. వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రులకు వచ్చే వారిలో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందించే అవకాశం ఉంది. జిల్లాలో పోస్టుల భర్తీ జిల్లాలో ఖాళీగా ఉన్న 60 గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద ల్యాబ్ టెక్నీషిన్లను నియమించింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 15మంది, అనుబంధ జనరల్ ఆస్పత్రికి ఆరుగురు, డీహెచ్ పరిధిలోని పలు పీహెచ్సీల్లో 25మంది, వైద్య విధాన పరిషత్ పరిధిలో 14మందిని నియమించారు. వీరు రెండు, మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయనున్నారు. ఈ క్రమంలో నియామక ప్రక్రియలో 20మార్కుల వెయిటేజీ కల్పించారు. నూతనంగా జిల్లాకు 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారు రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రైవేటుకు వెళ్లకుండా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అదేవిదంగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.సంతోషంగా ఉంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి, బ్లడ్ బ్యాంకులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 18ఏళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. గత ఏడాది నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో ఉద్యోగానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – కనకచంద్రం, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 -
టెన్త్లో టాప్గా నిలవాలి
● మాజీ మంత్రి హరీశ్రావు ● విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలుప్రశాంత్నగర్(సిద్దిపేట): త్వరలో జరగనున్న టెన్త్ పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట టాప్లో నిలవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. పలు సూచనలు చేశారు. చదువును నమ్ముకున్న వారంతా తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారన్నారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి మంచి చదువులు చదివి దేశాలను పాలించే స్థాయికి ఎదిగారన్నారు. ప్రణాళిక బద్దంగా చదివితే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. ‘కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదని తెలిపారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. మార్కులు సాధించేందుకు కంటెంట్ పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పారు. -
కాంగ్రెస్లోకి విఠలాపూర్ సర్పంచ్
చిన్నకోడూరు(సిద్దిపేట): విఠలాపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ దాసరి నాగరాణి బుధవారం మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో సర్పంచ్ నాగరాణి, ఉప సర్పంచ్ యాదవరెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు సర్పంచ్, వార్డు సభ్యులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయండి ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కృషి చేయాలని మంత్రి వివేక్ సూచించారు. బుధవారం హైదరాబాద్కు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
విజ్ఞానం పంచి.. చైతన్యం పెంచి
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025దుబ్బాక: అక్షరజ్ఞానం లేని ఎందరో పేదప్రజలకు విజ్ఞానం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాదేవాలయం.. 125 ఏళ్ల చరిత్ర గల పెద్దగుండవెల్లి సీఎస్ఐ చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. స్వాతంత్య్రానికి పూర్వమే పెద్దగుండవెల్లిలో ఇంగ్లండ్ దేశానికి చెందిన వారు 1901లో చర్చిని నిర్మించారు. ఆ చర్చిస్థానంలోనే 2001 లో అన్ని హంగులతో పునఃనిర్మించారు. ఈ చర్చిలో ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున క్రైస్తవులు ప్రార్థనలు చేస్తుంటారు. ప్రతి ఏటా ఘనంగా సంబరాలు పెద్దగుండవెల్లి సీఎస్ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతాక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. ఏసుక్రీస్తు నామస్మరణ చేస్తూ గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. కేక్ కట్చేసి ప్రజలకు పంపిణీ చేస్తారు. చర్చిలో 100 కుటుంబాలకు పైగా ఒక్కచోట చేరి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు: హరీశ్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని క్రైస్తవులకు మాజీ మంత్రి హరీశ్రావు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
త్వరలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం
దుబ్బాక: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రీస్మస్ సంబరాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.27 వేల కోట్లు అందించామన్నారు. పేదలకు అండగా నిలవాలన్న సంకల్పంతోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. -
పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుద్దాం
● మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు ● పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయండి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్రూరల్: నియోజకవర్గాన్ని పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏడు మండలాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కావడంతో రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తారన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలల ఆవరణలో మద్యం సేవించే వారిపై రౌడీ షీటు ఓపెన్ చేయాలని సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా సీపీలను ఆదేశించారు. గ్రామాల్లో ఏడు మెడికల్ కాలేజీల ద్వారా సంక్రాంతి లోపు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యాసంగి పంటల సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులకు పంటల సాగుపై అవగహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మరిన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేసి అదనపు గోదాములను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమవేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.గొర్రెలకు నట్టల మందు వేయండిహుస్నాబాద్రూరల్: గొర్రెల మంద పెరిగితే ఆదాయం వృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం తోటపల్లిలో గొర్రెలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొర్రెల మంద ఎదగాలంటే జీవాల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి సమీపంలోని పశువైద్యులను సంప్రదించి వైద్యం అందించాలన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉంటే మంద పెరుగుతుందన్నారు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. జీవాల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఊరూర గొర్రెల మందలను గుర్తించి గొర్రెల పెంపకముదారులకు అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
జూనియర్ కళాశాలలో వీర్బాల దివస్ సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో–ఎడ్)లో బుధవారం వీర్బాలదివస్ను పురస్కరించుకుని కేంద్ర సీ్త్ర శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, పీఎఫ్ కార్యాలయ అధికారి వేణుగోపాల్లు మాట్లాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ వీర్ బాలదివస్ను 2022లో ప్రారంభించారన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు. గురుగోవింద్ సింగ్ కుమారులు బాబాజోరావర్ సింగ్, ఫతే సింగ్ల ధైర్యం, త్యాగాలకు గుర్తుగా జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు అర్షియా తబుస్సుమ్, జ్యోతి, అభిలాష్రెడ్డిలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్రమశిక్షణా కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్, స్టూడెంట్ కౌన్సిలర్ తహసీన్ఫాతిమా, పీఎఫ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ లక్కిరెడ్డి సునీల్రెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
కామన్ డైట్ మెనూ పాటించాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కస్తూరిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పిల్లల ఆట వసువులను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. అదనపు తరగతి గదులు కావాలని టీచర్లు కొరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
యేసు బోధనలు ఆచరణీయం
హుస్నాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బాగుండాలని ఏసుప్రభు చేసిన బోధనలు ఆచరణీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని లక్ష్మి గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుడే స్వయంగా ఏసుక్రీస్తు అవతారం ఎత్తి.. ప్రజలు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేశారన్నారు. ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పారని తెలిపారు. స్థానికంగా క్రైస్తవ కమ్యూనిటీ హాల్కు స్థలం చూపించి భవన నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయి, కాలువలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, మెడికల్ పరంగా పీజీ కళాశాలతో పాటుగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో ఈ ప్రాంతం బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్లు, పాస్టర్లు పాల్గొన్నారు. హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీ హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీతోపాటు స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో విడుదల అవుతాయన్నారు. జనవరి మొదటి వారంలో సర్పంచ్లు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
యేసయ్య కోవెల ముస్తాబు
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లుమెదక్జోన్: పరలోక ప్రభువు ఏసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబవుతోంది. ఇప్పటికే పర్యాటకులు, భక్తుల తాకిడి మొదలైంది. దీంతో మెదక్లో సందడి నెలకొంది. అపురూపం.. కట్టడం మెదక్ సీఎస్ఐ చర్చి నిర్మించి 101 సంవత్సరాలు అవుతోంది. గతేడాది జరిగిన శత జయంతి వేడుకలకు గవర్నర్, సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. చర్చి అభివృద్ధికి రూ. 29.50 కోట్లు మంజూరు చేయటంతో, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండడంతో అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తోంది. సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో ఇంకా సుభాగా విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 590 మందితో బందోబస్తు క్రిస్మస్ నేపథ్యంలో 590 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. ఇందులో మెదక్తో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. 4 గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో పాటు 5 సెక్టార్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఐడీపార్టీలు, క్యూఆర్టీంలు, షీటీంలతో పాటు 100 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. చర్చి ఎదుట పోలీస్ కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతుల్లో చర్చి -
నేడు మంత్రి వివేక్ రాక
దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ బుధవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో నియోజకవర్గంలో మంత్రి పర్యటనల్లో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు బందోబస్తు చేశారు. దౌల్తాబాద్, చేగుంట మండల కేంద్రాల్లో మంత్రి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంటలోని రైతు వేదికలో, దౌల్తాబాద్లోని వీఆర్ఆర్ గార్డెన్లో 11 గంటలకు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించనున్నారు. -
పాఠశాలల బలోపేతం అవశ్యం
● జనగామలో 28, 29న రాష్ట్ర విద్యా సదస్సు ● యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరగాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి అన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29న జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత్త స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర సమావేశాలకు సంబంధించిన ల్పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, యూటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సదస్సు సందర్భంగా ఒక నివేదికను సమర్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యా సదస్సుకు వక్తలుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరవుతున్నారన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్ మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లు హాజరవుతారన్నారు. ఈ సదస్సును సిద్దిపేట జిల్లాలోని ఉపా ధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల విద్యాధికారి రాజిరెడ్డి, కొమరవెల్లి మండల విద్యాధికారి రవీందర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తుడుం శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులిచ్చుకో.. దందా చేస్కో!
ఎకై ్సజ్ అధికారుల అక్రమ వసూళ్లు ‘ఊరూరా బెల్టుషాపులు నడుపుకోండి.. ఎమ్మార్పీపై ఎంతైనా అదనంగా వసూలు చేసుకోండి.. అక్రమాలు ఎన్ని ఉన్నా మీపై ఈగ వాలనివ్వం.. మేం అడిగిన డబ్బులు ఇచ్చుకోండి.. ’ జిల్లాలో ఇదీ ఎకై ్సజ్ అధికారుల తీరు. కప్పం కడితే అన్నీ మేం చూసుకుంటాం అంటూ కొత్త ఎకై ్సజ్ పాలసీలో (2025–27) మద్యం వ్యాపారులకు చెప్పి భారీగా డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం. ఒక్కో దుకాణం నుంచి ఏకంగా రూ.2.5లక్షలు వసూలు చేస్తుండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసి నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే వసూళ్లు ఏమిటంటూ వ్యాపారులు వాపోతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభమైంది. మద్యం తెప్పించుకున్నారు.. సర్పంచ్ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలోనే రెండేళ్లకు కొంత డబ్బు.. మళ్లీ నెల నెల రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు.. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.32 కోట్లు!కింది స్థాయి నుంచి పైవరకు.. వసూలు చేసిన డబ్బును కింది స్థాయి నుంచి పై అధికారి వరకు పంపకాలు జరుగుతాయని తెలిసింది. గతంలో రూ.1.5 లక్షలు వసూలు చేశారని పాత మద్యం వ్యాపారులు చెబితే.. ఈసారి జిల్లాలో ఇద్దరు అధికారులు పెరిగారని, అందుకే ఎక్కువ వసూలు చేస్తున్నామని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షాప్ ప్రారంభంలోనే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, దీనికి తోడు అధికారులకు అక్రమ వసూళ్లతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నామని చెబుతున్నారు. కాస్త సమయం ఇవ్వండి అని అడిగినా పట్టించుకోవడం లేదని కొందరు మద్యం వ్యాపారులు వాపోతున్నారు.కొత్తగా వైన్ షాప్ దక్కించుకున్న సంతోషం.. మద్యం వ్యాపారుల్లో ఉండటం లేదు. ఇప్పటికే షాప్ కోసం అద్దెకు తీసుకోవడం.. ఫస్ట్ క్వార్టర్ డబ్బులు చెల్లించడం, ఫర్నిచర్ తయారు చేయించడం ఇలా ఇప్పుడే సర్దుకుంటున్న సమయంలోనే ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు కప్పం కట్టాలని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో వైన్ షాప్ నుంచి రూ.2.5లక్షలు ఇవ్వాలని మద్యం వ్యాపారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 93 వైన్ షాప్ల వద్ద వసూలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.32కోట్లు వసూలు చేయనున్నారు. అధికారులతో ఇబ్బంది ఎందుకని.. ఇబ్బంది పడుతూనే డబ్బులను ఎకై ్సజ్ అధికారులకు ముట్టచెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే కాకుండానే ప్రతి నెలా ఒక్కో వైన్ షాప్ రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు చెప్పతున్నట్లు మద్యం వ్యాపారుల్లో జోరుగా చర్చసాగుతోంది. నా దృష్టికి రాలేదు మద్యం దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. అలాంటి తప్పుడు పని చేయవద్దు. స్టేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్గా వార్నింగ్ ఇస్తాను. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసమూర్తి, ఈఎస్, సిద్దిపేట -
ఆకట్టుకున్న గణిత నమూనాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అన్ని పాఠశాలల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణితవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు కూడికలు, తీసివేత, గుణకారాలు, భాగహారాలు, త్రిభుజాలు, రేఖాగణిత, అల్జీబ్రాతో పాటుగా వివిధ రకాల గణిత శాస్త్ర నమూనాలను ప్రదర్శించారు. సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు అభినందనీయం సిద్దిపేటఅర్బన్: సాంఘిక శాస్త్రం ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు మామిడి పూర్ణచందర్రావు చొరవతో సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు చేశారు. డీఈవో శ్రీనివాస్రెడ్డి ల్యాబ్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్ చూడటం ఇదే ప్రథమమని దీని స్ఫూర్తి తో జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్సీ కొమురయ్య కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామిని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళంగా ఈఓ వెంకటేశ్కు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు ఆంజనేయులు, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ హుస్నాబాద్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 21న హన్మకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–10 బాలికలు కటాస్ విభాగంలో హర్షిత గోల్డ్ మెడల్, కృతిక, అనుదీపిక, ప్రసన్నలు సిల్వర్ మెడల్ సాధించారు. అండర్–12 కటాస్ విభాగంలో అక్షయ, బాలుర విభాగంలో శశివర్ధన్ గోల్డ్ మెడల్తో మెరిపించారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, కరాటే మాస్టర్ కంటే రాజు అభినందించారు. టెట్ వాయిదా వేయాలి బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఎస్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం లంచ్ అవర్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధుల వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ప్రిపేర్ కాలేకపోయారన్నారు. కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరాములు, ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి రామంచ రవీందర్, మండల అధ్యక్షుడు శంకరాచారి, రాజేందర్, రజనీష్రెడ్డి, చందన, రఘునాథ్ పాల్గొన్నారు. -
సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
దుబ్బాక: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఒక్కరోజైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగట మండలాల్లోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ వంటి మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కనీసం పంటలకు నీరందించే కాల్వల నిర్మాణాలు కూడా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యలపై కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి ప్రస్తుతం ఎన్నికై న సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సర్పంచ్లు, పాలక వర్గాలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. -
విపత్తు నిర్వహణ సమన్వయంతో చేపట్టాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులతో మాక్డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలు రావడం, వాగులు ఉప్పొంగడం, ప్రజలు, పశువులు నీటిలో చిక్కుకుపోవడం వంటి విపత్తు పరిస్థితుల్లో కాపాడేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఓటరు జాబితా సవరణ చేపట్టాలి ప్రభుత్వం సూచించిన గడువు లోగా సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. -
నిరాకరిస్తున్న రైస్ మిల్లర్లు
గట్లమల్యాల కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వడ్లను ఆరు రైస్ మిల్లులకు కేటాయించడంతో దిగుమతి చేసుకున్నారు. నిల్వ ఉన్న 1,500 బస్తాలు పది రోజులు గడిచినా తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే బస్తాలు వేయడంతో రాత్రి పూట కాపు కాయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా రైస్ మిల్లుకు వెళితే తమ వద్దకు రావొద్దని, ఐకేపీ నిర్వాహకులను అడగాలని సమాధానం ఇస్తున్నారు. ఈవిషయమై కొనుగోలు కేంద్రం నిర్వహకులను వివరణ కోరగా పది రోజుల నుంచి లారీలు రావడంలేదన్నారు. మిల్లర్లకు ఫోన్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తున్నాయని, తమ టార్గెట్ పూర్తయి. గోదాములు ఖాళీగా లేకపోవడంతో దిగుమతి చేసుకోవడం లేదన్నారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్కు ఫోన్ చేయగా స్పందించలేదు. -
సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు విడ్డూరం
● మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ● గజ్వేల్లో సైదయ్య విగ్రహానికి నివాళిగజ్వేల్: బీఆర్ఎస్ హయాంలో పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కేసీఆర్, నేడు సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. సోమవారం గజ్వేల్లో దివంగత ఎమ్మెల్యే సైదయ్య, దివంగత ఎమ్మెల్సీ మాదాడి రంగారెడ్డి విగ్రహాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్లతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్లు, పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం వివిధ సంస్థల్లో పెట్టుబడులను పెట్టిందని ఆరోపించారు. వాటిని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులకు.. కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తీలు కట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. నిర్వాసితులను బీఆర్ఎస్ నేతలకు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇక కేసీఆర్ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. వారు చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ప్రభుత్వం వద్ద ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ మండల, పట్టణ శాఖ నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చేర్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బోల్తాపడిన సిమెంట్ బస్తాల ట్రాక్టర్పల్లె సారథులు వచ్చేశారు..సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీల్లో సోమ వారం నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిబ్రవరి 2, 2024న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీలకు సర్పంచ్లు వచ్చారు. ప్రత్యేక అధికారుల నుంచి బాధ్యతలను సర్పంచులు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలో 508 సర్పంచ్లకు గాను 507 మంది సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించారు. కోహెడ మండలం తంగళ్లపల్లి సర్పంచ్ సంపత్ తండ్రి మృతి చెందడంతో ప్రమాణస్వీకారం చేయలేదు. బడిలో ప్రమాణం వర్గల్(గజ్వేల్): చాంద్ఖాన్మక్త పంచాయతీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో మదిర గ్రామమైన లింగారెడ్డిపల్లి స్కూల్ బిల్డింగ్లో కొనసాగుతోంది. విద్యార్థులు లేకపోవడం.. స్కూల్ పొరుగు పాఠశాలలో విలీనమవడంతో ఆ భవనాన్ని పంచాయతీకి వినియోగిస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ మేదిని సజనిత, ఉపసర్పంచ్ కనకయ్య, వార్డుసభ్యులు లింగారెడ్డిపల్లి పాఠశాల భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా సామలపల్లి పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో ఇరుకై న అద్దెగదిలోనే సర్పంచ్ భాస్కర్రెడ్డి, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.జగదేవ్పూర్లో పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంగజ్వేల్: కుర్చీల లొల్లితో జగదేవ్పూర్ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వార్డు సభ్యులు నినాదాలతో వాగ్వాదానికి దిగారు. ఒకనొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలో సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి పనగట్ల శ్రీనివాస్గౌడ్ ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డుల్లో 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, 5స్థానాల్లో కాంగ్రెస్, మరొక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. సోమవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా పంచాయతీ భవనం వెలుపలా కుర్చీలు ఏర్పాటుచేశారు. పరిమితంగా ఏర్పాటు చేయడం వల్ల అప్పటికే బీఆర్ఎస్ వార్డు సభ్యులు, నాయకులు వచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వార్డు సభ్యులకు కుర్చీలు లేవు. దీంతో ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతూ.. జై కాంగ్రెస్, జై బీజేపీ అంటూ నినాదాలు మొదలెట్టారు. ఈ సందర్భంగా పార్టీల నేతల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నేతలు సైతం పోటీగా జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు. ఫలితంగా ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పార్టీల నేతల మధ్య వాగ్వాదాలు తోపులాటకు దారి తీసి.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి తన సిబ్బంది అక్కడికి చేరుకొని నేతలను సముదాయించి ఉద్రికత్తకు తెరదించారు. ఆ తర్వాత వార్డు సభ్యుల వారీగా కుర్చీలను ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.చాలా చోట్ల మాజీ సర్పంచ్లు ఓటమిపాలకవర్గాలు కొలువుదీరాయ్.. -
అధికారుల అలసత్వం.. నిలిచిన ధాన్యం
● పది రోజులు గడుస్తున్నా పట్టని దైన్యం ● కొనుగోలు కేంద్రంలో 1,500 ధాన్యం బస్తాలు నంగునూరు(సిద్దిపేట): అధికారుల నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ రైతులకు శాపంగా మారింది. వడ్లను తూకం వేసి పది రోజులు గడిచినా మిల్లుకు తరలించపోవడంతో ధాన్యం బస్తాల వద్ద రైతులు వడిగాపులు కాస్తున్నారు. ఈవిషయమై అధికారులు, రైస్మిల్లు యజమానులకు మొర పెట్టుకున్నా కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల రెండు నెలల కిందట ఐకేపీ ద్వార వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 237 మంది రైతుల ద్వారా 6,700 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసి మిల్లుకు తరలించారు. కొనుగోళ్లను నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడంతో చివరి రోజు వరకు పది మంది రైతుల నుంచి 1,500 బస్తాల ధాన్యాన్ని తూకం వేశారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం
వర్గల్(గజ్వేల్): ప్రమాణస్వీకారాల వేళ వర్గల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలతో వేడెక్కింది. వర్గల్ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వాములవుదామని పంచాయతీ వేదికగా సర్పంచ్ దేవగణిక జయభారతి, ఉపసర్పంచ్ టేకులపల్లి గోవర్ధన్రెడ్డి ప్రకటించారు. అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరుపార్టీల శ్రేణుల మధ్య తోపులాటకు దారితీసింది. వెంటనే గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. ఆ తరువాత సన్మానాల కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. -
మల్లన్నకు పట్నాలు.. భక్తుల మొక్కులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది పట్నాలు వేశారు. ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టి వేడుకున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
మల్లన్న జలాలు ఇక బిరబిర
మంచినీటి పథకానికి శ్రీకారం● నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ● హైదరాబాద్ మహానగరానికి తరలింపు పనులు ప్రారంభం ● ఏటా 20 టీఎంసీల నీటి తరలింపే లక్ష్యం మల్లన్న జలాలు ఇక పరుగులు పెట్టనున్నాయి. నీటి పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది. హైదరాబాద్ మహా నగరం మంచినీటి అవసరాలను తీర్చేందుకు, అలాగే మూసీ సుందరీకరణకు ఆధారమైన మల్లన్నసాగర్ జలాల తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ ప్రాంతంలోని పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో ఇందుకు సంబంధించిన పైప్లైన్ పనులు కొన్ని రోజుల కిందట మొదలుపెట్టారు. రూ.4500కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర జరగనున్నాయి. – గజ్వేల్ జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు కల్పతరువుగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 50టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్... తాజాగా రాజధానికి గొంతు తడపటానికి ఉపయోగపడబోతోంది. ప్రస్తుతం కృష్ణ, మంజీర నదులు, ఎల్లంపల్లిబ్యారేజీతోపాటు గండిపేట రిజర్వాయర్ల నుంచి మంచినీటి సరఫరా జరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న నగర నీటి అవసరాలను అంచనా వేస్తూ.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(హెచ్ఎండబ్ల్యూఎస్) ఆయా వనరుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఇందులోభాగంగానే జంటనగరాల్లోని వివిధ ప్రాంత్లాల్లో తాగనీటి పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పన్నెండేళ్ల క్రితమే రూ.3,375కోట్ల అంచనాల వ్యయంతో పనులు చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10టీఎంసీల నీటిని హైద్రాబాద్కు తరలిస్తున్నారు. అయినా మహానగర దాహార్తికి తిప్పలు తప్పడం లేదు. క్రమంలోనే మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి ఇటీవల రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి సంబంధించిన పనులు గజ్వేల్ ప్రాంతంలో పాతూరు కూరగాయల మార్కెట్ పక్కన కొన్ని రోజుల కిందట ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న ఎల్లంపల్లి పైప్లైన్కు సమాంతరంగా ఈ పనులు చేపడుతున్నారు. -
మల్లన్నసాగర్ పథకం తీరు ఇదీ..
మల్లన్నసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీల్లో హైదరాబాద్ మహానగర అవసరాలకు ఏటా 20 టీఎంసీలను వాడుకోవాలని పథకం రూపొందించారు. రూ.4,500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తున్న ఎల్లంపల్లి లైన్కు సమాంతరంగా మరో కొత్త పైప్లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ముందుగా మల్లన్నసాగర్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనపూర్ వరకు సమారుగా 100 కిలోమీటర్ల మేర 4 డయామీటర్ల పైప్లైన్ నుంచి నిర్మించి అక్కడ ప్రత్యేక డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నగరంలోని ఉస్మాన్నగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నింపాలనుకుంటున్నారు. ఇందుకోసం అవుటర్ రింగు రోడ్డు గుండా పైప్లైన్ నిర్మాణం జరగనుంది. దీంతోపాటు మూసీ నది సుందరీకరణకు సైతం ఈ జలాలను తరలించే ప్రత్యేక కార్యాచరణ ఈ పథకంలో ఉంది. మొత్తంగా 198కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. -
కామన్ డైట్ మెనూ అమలు చేయాలి
కోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, రోజూ కామన్ డైట్ పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఆదివారం సాయంత్రం కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. రాత్రి భోజనం, వసతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను తనీఖీ చేశారు. విద్యార్ధుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించరా?, సన్నబియ్యం నాణ్యతపై ఆరా తీశారు. విద్యాలయ ప్రాంగణంలో వెలుతురు సరిగ్గా లేదని, ఎక్కువ వెలుతురు వచ్చే లైట్లు అవర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. -
రాజీమార్గమే ఎంతో మేలు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● జాతీయ లోక్ అదాలత్లో 2,420 కేసులు పరిష్కారంసిద్దిపేటకమాన్: రాజీయే రాజ మార్గమని లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో 2,420కేసులు పరిష్కారమైనట్లు వీటిలో 45 సివిల్, 16 మోటారు ప్రమాద కేసుల్లో రూ.1,34,75,000 పరిష్కరించినట్లు తెలిపారు. 67బ్యాంకు పీఎల్సీ కేసుల్లో రూ.26,97,267 పరిష్కరించారన్నారు. లోక్ అదాలత్ సందర్భంగా పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సుధాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంపులో 62యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కోహీర్లో చలిమంట కాచుకుంటున్న ప్రజలుపల్లెకు పట్టాభిషేకంనేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు దుబ్బాకటౌన్/చిన్నకోడూరు(సిద్దిపేట): కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. సోమవారం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట, హుస్నాబాద్ డివిజన్లలో 508 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకాధికారుల పాలనకు తెర ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు మార్గం సుగమం కానుంది. రెండేళ్లుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాలనా వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారిందని ప్రచారం. గ్రామ పాలకులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, తాగునీరు, ఇతర అవసరాలకు డబ్బు లేకపోవడంతో కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వడ్డీలకు డబ్బు తెచ్చి జీపీలను నడిపించారని జోరుగా ప్రచారం సాగింది. వీటిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్లు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అద్దె భవనాల్లో ఏర్పాట్లు.. చిన్నకోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో అద్దె భవనాల్లో ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో గ్రామాల్లో సందడి నెలకొంది. -
చేయిచేయి కలిపారు.. ‘మురుగు’ తరలించారు
● దశాబ్దాల పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం ● ఆదర్శంగా చౌదరిపల్లి వాసులు వర్గల్(గజ్వేల్): మురుగుకాలువ సదుపాయం లేక సతమతమయ్యారు. మురుగు దుర్గంధంతో తల్లడిల్లిపోయారు. పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందారు. తలో పైసా పోగేసుకున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న పారిశుధ్య సమస్య పరిష్కరించుకున్నారు. గజ్వేల్–వర్గల్ రోడ్డు మార్గంలో వర్గల్ మండలం చౌదరిపల్లి చౌరస్తా ఉంది. మెయిన్రోడ్డు ఆనుకుని చాలా ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్ల నుంచి వృథానీరు వెళ్లేందుకు సైడ్ డ్రైయిన్లు (మురుగు కాలువలు) లేవు. ఇంట్లో నీరు ఇంటి ప్రాంగణంలోనే నిలిచిపోయి, వర్షకాలంలో వరదనీరు తోడై దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సివచ్చేది. పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా, దశాబ్దాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ ఇళ్ల యజమానులు రూ. 40,000 దాకా పోగేశారు. పైపులు, ఛాంబర్లు తెప్పించారు. ఇళ్ల ముందు నుంచి చౌరస్తా వద్ద మెయిన్లైన్లోకి మురుగునీరు వెళ్లిపోయేలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. తమ సమస్య తామే పరిష్కరించుకుని ఆదర్శంగా నిలిచారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం చౌదరిపల్లి చౌరస్తాలో చాలా ఇళ్లకు మురుగు నీరు వెళ్లే మార్గం లేదు. వానపడితే ఇళ్లల్లోకి నీరు వస్తుండే. వాసన, దోమలతోని బాధలు పడ్డాం. ఎవరికీ చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు జమ చేసి రోడ్డు పక్కన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం. మురుగు బాధ నుంచి బయటపడ్డాం. – తుమ్మ వెంకటేశ్, చౌదరిపల్లి చౌరస్తా -
దేవుడి కృపతో అందరూ బాగుండాలి
డీఈఓ శ్రీనివాస్రెడ్డి దుబ్బాక: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన దుబ్బాక బాలాజీ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఆలయాన్ని సుందరంగా నిర్మించడం, స్వామి వారు భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతుండడం అద్భు తమని అన్నారు. ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, బాధ్యులు చింత నాగేందర్ ఆధ్వర్యంలో డీఈఓతో పాటు ఎంఈఓ ప్రభుదాసును వేదపండితులు సన్మానించారు. తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా చిలుముల మురళీధర్, ప్రధాన కార్యదర్శిగా వంగ నర్సిరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా దేశ్ భాస్కర్, హరిపురం రఘులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిలుముల మురళీధర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తపస్ నిస్వార్థ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మండలాల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన నాయకులు కోహెడరూరల్(హుస్నాబాద్): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలుపొందిన తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాక స్వర్ణలత, నాయకులు కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్ను కలిశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. బీజేపీని బలోపేతం చేద్దాం ఎంపీ రఘునందన్రావు తొగుట(దుబ్బాక): గ్రామీణ ప్రాంతంలో బీజే పీని బలోపేతం చేద్దామని మెదక్ ఎంపీ రఘునందన్రావు కార్యకర్తలకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లను సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన కా ర్యక్రమంలో సన్మానించారు. ఎంపీ మాట్లా డు తూ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజే పీ సత్తాచాలన్నారు. కార్యక్రమంలో చందాపూ ర్ మాజీ సర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ జాయింట్ సెక్రటరీగా శివకుమార్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చారకొండ శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్కు గాంధీపై ప్రేమ లేదు..
సిద్దిపేటజోన్: ‘రామరాజ్యం అనేది మహాత్మాగాంధీ కల, అది పీఎం నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ గాంధీ కలలను పట్టించుకోవడం లేదు, వారికి గాంధీ మీద ప్రేమ లేద’ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటీవల గెలుపొందిన బీజేపీ సర్పంచ్. ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేశంలో బీజేపీ మార్పు కోరుతోందన్నారు. కాంగ్రెస్ అనేక మాట లు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. భవిష్యత్తులో సిద్దిపేట జెడ్పీ పీఠం, మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కేంద్రానివి కుట్ర పూరిత చర్యలు
సిద్దిపేటజోన్: మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధి హామీ పథకం నుంచి తొలగించాలని చూస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకాంక్షరెడ్డి, ఓబీసీ సెల్ కన్వీనర్ సూర్యవర్మలు ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు ఆదివారం గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలు, ఆయన పేరుతో ఉన్న పథకాలను కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని కాంగ్రెస్ ఉరుకోదని అన్నారు. అంతకుముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, నాయకులు చంద్రం, బుచ్చిరెడ్డి, రియాజ్, రవితేజ, సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధైర్యంగా పని చేయండి
● వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ● అన్ని పనులు చేసుకుందాం ● మా సర్పంచులను తన ఖాతాలో వేసుకుంటున్న సీఎం ● ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవాసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ సర్పంచులు ధైర్యంగా పనిచేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సంగారెడ్డిలో శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. డబ్బులు పంచి గూండాయిజం చేసినా బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా ఎదుర్కొని సర్పంచులుగా విజయం సాధించారని చెప్పారు. మరో రెండేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ సర్పంచులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచులు ఐదేళ్లు పదవిలో ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను తాను దగ్గరుండి చేయిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ సర్పంచులకే ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పడైనా అధికార పార్టీ 90 శాతం స్థానాలను గెలుచుకుటుందని, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతానికి మించి సుమారు నాలుగు వేల సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుందని హరీశ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. కొత్త సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు కొత్తగా సర్పంచులుగా ఎన్నికై న వారికి అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటుందని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
మురుగుతో సతమతం
గుంతలమయంగా రోడ్డు గజ్వేల్ రూరల్: గజ్వేల్ మండలం బయ్యారం గ్రామ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాత్రి సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మార్గం గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిలిచిన జీపీ భవన నిర్మాణం అక్కన్నపేట: అక్కన్నపేట మండలం కన్నారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. అది ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొగుట: తొగుట మండల కేంద్రంలో పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్లుగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే గుంతలు తవ్వి మురుగు నీటిని పంపిస్తున్నారు. దీంతో దోమలతో సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
432 కేసుల ఉల్లంఘన
సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఇటీవల నూతన పోలీసు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయ్కుమార్ తన మార్క్ చాటుకున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, మద్యం పంపిణీని అడ్డుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఎవరు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 17న మూడవ విడత పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో మొత్తం 432 కేసులు నమోదు చేశారు. వీటిలో 271 మద్యం కేసులు నమోదయ్యాయి. రూ.37,89,530 విలువగల 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా వివిధ రకాల వస్తువులను పంపిణీ చేసేందుకు పలువురు ప్రయత్నించగా తనిఖీ బృందాలు పట్టుకుని 35 కేసులు నమోదు చేసి రూ.2,29,560 విలువగల వస్తువులను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.30,36,620 నగదును పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. అనుమతి లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై 27కేసులు, బాణసంచా కాల్చడంపై 15కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 2,729 మందిని అధికారుల ముందుగానే బైండోవర్ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. -
‘ఉపాధి’ చట్టాన్ని కొనసాగించాలి
చేర్యాల(సిద్దిపేట): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్మావో అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి వీబీ జీ రాం జీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి సాధారణ పథకంగా అమలు చేయాలని చూస్తుందన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం మహాత్ముడిని అవమానపర్చడమే అన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అరుణ్, నర్సిరెడ్డి, శ్రీహరి, శోభ, రాజు, మైసయ్య, రవీందర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్మావో -
పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలు
సాక్షి, సిద్దిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్) ప్రస్తుత పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పర్సన్ ఇన్చార్జీలుగా కొనసాగనున్నారు. పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. వాటినే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలలు పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 14న నిరవధికంగా పొడిగింపు ఇచ్చింది. తాజాగా శుక్రవారం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జిలను జిల్లా సహకార అధికారి వరలక్ష్మి నియమించారు. కొండపాక పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జిగా డీసీఏవో నాగేశ్వర్ రావు, చేర్యాల, రేబర్తికి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సతీశ్ రెడ్డి, ములుగు, వర్గల్లకు శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్, కట్కూర్లకు గౌతమ్, సిద్దిపేట, గంగాపూర్కు అమృతసేనారెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డిలకు రాజశేఖర వర్మ, గజ్వేల్, జగదేవ్పూర్లకు రఘోత్తమ్రెడ్డి, కోహెడ, బెజ్జంకిలకు రాజమౌళి, పాలమాకుల, నంగునూరులకు సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, దౌల్తాబాద్, కానుగల్కు రవి, మిట్టపల్లి, అల్లీపూర్లకు యాదగిరి నియమితులయ్యారు. శనివారం వీరంతా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతల స్వీకరణ -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గజ్వేల్రూరల్: జాతీయ స్థాయి నెట్బాల్ పోటీల్లో రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి అన్నారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాసాల వైష్ణవి ఎంపికయింది. ఈ నెల 25 నుంచి 30 వరకు కర్ణాటకలోని మంగుళూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్–19 బాలికల విభాగంలో జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో ఆడానుంది. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు కళాశాల పీడీ సమ్మయ్యలను డీఐఈఓ రవీందర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయిలు అభినందించారు. -
పల్లె ప్రగతి మారేనా..!
సాక్షి, సిద్దిపేట: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు పల్లెల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య లోపం, నీటి సరఫరాలో అంతరాయం, పాఠశాలలు, అంగన్వాడీలకు ప్రహరీ లేకపోవడం, వీధిలైట్లు... ఇలా అనేక సమస్యలు సవాల్గా మారాయి. పన్నుల ద్వారా సమకూరే ఆదాయం కేవలం సిబ్బంది జీత భత్యాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, ఇతర పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోవడం లేదు. పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేశారు. జిల్లాలోని 508 సర్పంచ్లు, 4,508 వార్డులకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన సర్పంచ్లకు సమస్యల స్వాగతం రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవర్గాలు జిల్లాలో 508 జీపీలు, 4,508 వార్డులు రేపు బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్లు


