Siddipet District News
-
ఉక్కపోత.. జీరో కోత
ఎండలతో తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు సిద్దిపేట పట్టణానికి చెందిన మల్లయ్య రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లు పొందుతున్నారు. మేలో ఎండలు బాగా ఉండటంతో ఉక్కపోతను భరించలేక ఇంట్లో ఫ్యాన్, కూలర్ ఎక్కువగా వినియోగించారు. దీంతో 206 యూనిట్ల విద్యుత్ నమోదైంది. బిల్లు రూ.1,121 వచ్చింది. ఆరు యూనిట్ల విద్యుత్ వినియోగం పెరగడంతో జీరో బిల్లుకు అర్హత సాధించలేక పోయాడు. ఇలా ఒక్క మల్లయ్యనే కాదు, చాలా మంది ఉచిత విద్యుత్కు దూరమవుతున్నారు. – సాక్షి, సిద్దిపేట కొత్త వారికి వర్తించని పథకం ఇలా చేస్తే మేలు కొత్త వారికి వర్తించని పథకం -
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
కొనుగోళ్లు మరింత వేగవంతం మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని అల్వాల గోదాంను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్మిల్లుల్లో స్థల కొరతను అధిగమించడానికి గోదాంల రేకుల ఫిట్టింగ్ సరిచేసి వినియోగంలోకి తేవాలని తహసీల్దార్ను ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా, రైతుల ఇబ్బందులను తీరుస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆమె వెంట ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సీసీలు తదితరులు ఉన్నారు.కలెక్టర్ హైమావతి -
మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు మంజూరు చేయండి
సీఎంకు మంత్రి పొన్నం లేఖ హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ ద్వారా బొగ్గు తవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలలో బీటెక్ (మైనింగ్ ఇంజినీరింగ్) చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థుల్లో ఆసక్తి, సామర్థ్యం ఉందన్నారు. ప్రైవేట్ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారని లేఖలో వివరించారు. మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గంప శ్రీనివాస్ నియామకమైనట్లు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి డాక్టర్ మంకాల నవీన్ కుమా ర్ తెలిపారు. హైదరాబాద్లోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు ని యామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తణుకు ఆంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు అయిత రత్నాకర్, మంచాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను బుక్డిపోల ద్వారా విక్రయించాలనుకునే వ్యాపారులకు జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే జూన్ 5వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని డీఈ ఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విక్ర యాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు రూ. 1,000 డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఈ పాఠ్యపుస్తకాల విక్రయాలకు 2026–2027 ఏడాదికి గాను సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్లను విధిగా చెల్లించిన వ్యాపారులు మాత్రమే అర్హులని ఆయన స్పష్టం చేశారు. టీచర్ల సమస్యలు పరిష్కరించాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం సిద్దిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి.. మరణించిన ఉపాధ్యాయులకు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలన్నీ పోరాటాల ద్వారానే సాధించామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కనకయ్య, విజేందర్రెడ్డి, నరేందర్, రామస్వామి, తిరుపతి, మల్లేశం, అజీజ్, సత్యనారాయణ, సత్యక్రిష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
ఆటంకం లేకుండా నెట్వర్క్ సేవలు
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు సమస్య లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్ హాలులో జిల్లా స్థాయి టెలికాం కమ్యూనికేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఇంటర్నెట్ వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నెట్వర్క్ సేవలు అందించాలని ఆయా టెలికాన్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరెడ్డి, జిల్లా ఇండస్ట్రియల్ అధికారి గణేశ్ రామ్, కలెక్టరేట్ ఏవో రాజ్కుమార్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్లు, టెలికాం కంపెనీల ప్రతినిధులు టీ ఫైబర్, బీఎస్ఎన్ఎల్, జియో, ఇండస్ టవర్ ప్రతినిధులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ -
నేరుగా నోట్ బుక్స్..
జిల్లాలో 938 ప్రభుత్వ పాఠశాలల్లో 81,229 మంది విద్యార్థులున్నారు. అందులో బాలురు 38,508, బాలికలు 42,721 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరి కోసం 7,11,894 పుస్తకాలు అవసరం. అందులో పార్ట్–1కింద.. 5,33,478, పార్ట్–2 కింద 1,78,416 పుస్తకాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ భాషలలో ముద్రించారు. రెండు భాషలలో ఉండే పుస్తకాలు రెండు పార్ట్లుగా విభజించారు. అందులో మొదటి పార్ట్తో పాటు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినవి మొత్తంగా 5,33,478 అవసరం ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 4.92లక్షల పుస్తకాలు చేరుకున్నాయి. ఇంకా 41,478 పుస్తకాలు రావాలి. అలాగే పార్ట్–2కు సంబంధించి 1,78,416 పుస్తకాలు రావల్సి ఉంది. మొదటి విడతలో రావాల్సిన వాటిలో ఇంకా ఐదు టైటిల్స్ రావాలి. అందులో 4వ తరగతి ఇంగ్లిష్, 5వ తరగతి తెలుగు, గణితం, ఆరో తరగతి ఇంగ్లిష్, 8వ తరగతి హిందీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. నేటి నుంచి ఎమ్మార్సీలకు.. మోడల్ స్కూల్స్, బీసీ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు 1,04,500 పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 7వ తేదీ వరకు మండల రిసోర్స్సెంటర్లకు పుస్తకాలు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు జూన్ 12వ తేదీలోగా చేరవేస్తారు. దీంతో పాఠశాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. క్రమసంఖ్య, బార్కోడ్ ముద్రించారు. దీని ద్వారా ఏ మండలానికి ఎన్ని పుస్తకాలు పంపాలో స్పష్టంగా లెక్కతేలుంతుంది. ప్రైవేట్ పాఠశాలలకు చేరే అవకాశం ఉండదు.విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్ బుక్స్ నేరుగా పాఠశాలలు, ఎమ్మార్సీలకు చేరుకోనున్నాయి. 1వ, 2వ తరగతి విద్యార్థులకు మూడు చొప్పున నోట్బుక్స్, 3, 4, 5వ తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున , 6 నుంచి 8వ తరగతి వారికి ఆరు చొప్పున , 8వ తరగతి విద్యార్థికి ఏడు నోట్ బుక్లు, 9, 10వ తరగతి విద్యార్థులకు14 చొప్పున నోట్ పుస్తకాలను అందించనున్నారు.పునఃప్రారంభం రోజే అందిస్తాం పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయనున్నాం. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న 10శాతం పుస్తకాలు సైతం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గురుకులాలు, మోడల్ స్కూల్స్కు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. 901 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎమ్మార్సీలకు శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నాం. – రామ్ప్రసాద్, జిల్లా మేనేజర్, పాఠ్యపుస్తకాలు -
దోసె.. పూరీ.. మిల్లెట్ ఇడ్లీ
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రోజుకో రకం టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. జూన్ 12 నుంచి పథకం ప్రారంభించేందుకు ఇంటర్ విద్యాశాఖ సమాయత్తం అవు తోంది. జిల్లాలో 20 జూనియర్ కళాశాలలు ఉండగా, సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఆకలి తీరుస్తూ.. నమోదు శాతం పెంచుతూ ‘తెలంగాణ బ్రేక్ఫాస్ట్’ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలన్నీ మండల కేంద్రాల్లో ఉన్నాయి. అయితే సుమారు 90 శాతం విద్యార్థులు సమీప గ్రామాలు, తండాల నుంచి వస్తున్నారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఉదయం విద్యార్థులు సరిగా తినకుండానే కాలేజీకి వస్తున్నారు. సాయంత్రం 4.30 వరకు అర్ధాకలితో గడుపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యేక తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాఠాలు కూడా సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో సమయాను కనుగుణంగా పోషకాహరం లేక, బలహీనంగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని చాలా కాలంగా విద్యారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల నమోదు.. హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ జూన్ 12 నుంచి ప్రారంభం జిల్లాలో 20 కళాశాలలు సుమారు 6వేల మంది విద్యార్థులు రోజుకో రకం టిఫిన్.. పాలు, జావ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో రకం టిఫిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దోశ, చట్నీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు) సాంబారు, బుధవారం పూరీ(రెండు), మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, గురువారం బోండా– చట్నీ, శుక్రవారం ఇడ్లీ–చట్నీ, శనివారం ఉప్మా– చట్నీని మెనూగా నిర్ణయించారు. వీటితో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా మొదట కేంద్రీకృత కిచెన్ల ద్వారా వీటిని అందించనున్నారు. -
ముమ్మాటికీ రాజకీయ కక్షే..
చేర్యాల(సిద్దిపేట): ఈడీ, ఐటీ సోదాల పేరుతో సీపీఎంపై కేంద్రం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలని ఆ పార్టీనాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిపై కేంద్ర ప్రభుత్వం జరిపిన కక్షపూరితమైన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ సవాళ్లు ఎదుర్కోలేకే ఇలాంటి కుయుక్తులు పన్నుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దాడులు తీవ్రం చేసిందని విమర్శించారు. కేంద్రం ప్రశ్నించే గొంతుకులపై నేరుగా దాడులకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసే సీపీఎంపై కక్ష ధోరణి మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు బండకింది అరుణ్, రాళ్లబండి నాగరాజు, నాయకులు నర్సిరెడ్డి, ప్రభాకర్, శోభ, శ్రీహరి, భాస్కర్, మల్లేశం, రాజు, మైసయ్య, సిద్ధులు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
తరుగు పేరిట కోత
● మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కు ● వడ్ల కొనుగోళ్ల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు గజ్వేల్: కొనుగోళ్లు సకాలంలో జరగక, అకాల వర్షాలతో ధాన్యం తడిసి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులకు ‘తరుగు’ పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్లు అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 421 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 58,455 మంది రైతులకు చెందిన 3.14లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు అతికష్టమ్మీద జరిగాయి. ఇక్కడ 3.70లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేసిన సంగతి తెల్సింది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం భారీగా ఉంది. కొనుగోళ్లకు నెల రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులకు మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం.. మరింత కుంగదీసింది. దీంతో రైతులు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకొని, అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నిలువుదోపిడీ.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులను తరుగు పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క నట్టేట ముంచుతున్నారు. 40–50కిలోల బస్తాపై 2–3కిలోలు కట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 5కిలోల వరకు కూడా కోత పెడుతున్నారు. కొనుగోళ్లు సక్రమంగా సాగని ప్రస్తుత తరుణంలో ఇదేంటని ప్రశ్నిస్తే తమ వడ్లను కాంటా పెడతారో? లేదోననే భయంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మిన్నకుండిపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతుల తిరగబడితే అప్పటికప్పుడు తప్పులను సరిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాగైనా ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలనే టార్గెట్ వల్ల ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వ్యవహారాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కొన్ని చోట్ల ఇలా... ● గజ్వేల్ మండలంలోని ఓ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు కొన్ని రోజుల క్రితం సుమారుగా 390క్వింటాళ్లకుపైగా ధాన్యం కాంటా అయినట్లుగా ముందుగా ట్రక్ షీట్ ఇచ్చారు. సరుకు మిల్లుకు తరలించగానే తరుగు పేరిట ఇందులోంచి సుమారుగా 4.5క్వింటాళ్లకుపైగా తగ్గించి మరో ట్రక్ షీట్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న ఆ రైతు కొనుగోలు కేంద్రాలతో వాగ్వాదానికి దిగడంతో...ఆ తప్పును సరిచేశారు. ● ఇదే మండలంలోని మరో గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనూ 40కిలోల బస్తాపై తరుగు పేరిట 4కిలోల కోత పెడుతున్నారు. కొన్ని రోజులుగా ఇది సాగుతూనే ఉంది. ● జిల్లాలోని అన్ని మండలాల్లో ఇది పరిస్థితి కొనసాగుతోంది. ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
విద్యుత్ నకిలీలలు
ట్రాన్స్కోలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేసు.. ● విజిలెన్స్ విచారణలో ఆధారాల గుర్తింపు ● కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లిన అవినీతి సొమ్ము ● సీనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటువిద్యుత్శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు ఆశాఖ విజిలెన్స్ విచారణలో తేలింది. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వద్ద నుంచి సీనియర్ అసిస్టెంట్ రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్ విభాగం ఈ ముడుపుల్లో కొంత మొత్తాన్ని తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఆధారాలతో సహా గుర్తించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఆశాఖ ఉన్నతాధికారులకు పంపడంతో సదరు అధికారిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. జేఎల్ఎంలుగా ఉద్యోగంలో చేరి.. 2020లో నలుగురు ఆర్టిజన్లు నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్లు పెట్టి జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లుగా ఉద్యోగాలు పొందారు. గుట్టుచప్పుడు కాకుండా వీరు దాదాపు నాలుగేళ్లుగా ఉద్యోగాల్లో కొనసాగారు. రూ.వేలల్లో జీతభత్యాలు, ఇతర అన్ని సౌకర్యాలు పొందారు. అలాగే ఐటీఐ కూడా పూర్తి చేశామని చెప్పి అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం)లుగా పదోన్నతి కూడా పొందినట్లు తెలుస్తోంది. పదోన్నతుల సందర్భంగా పెట్టిన ఐటీఐ సర్టిఫికెట్లు ఫేక్ అని టెక్నికల్ బోర్డు ధ్రువీకరించింది. దీంతో విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తే వీరివి ఎస్సెస్సీ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనని తేలింది. మరింత కూపీ లాగడంతో ఈ వ్యవహరంలో మరికొందరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నకిలీగాళ్ల నుంచి ఈ అధికారి రూ.లక్షల్లో ముడుపులను తీసుకున్నట్లు తేలింది. ఇలా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ముడుపుల మళ్లింపు ఆధారాలు లభించాయి. ఎంకై ్వయిరీ పెండింగ్ పెట్టి.. సాధారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలన కోసం పంపుతారు. ఈ సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా? అని తెలుసుకుంటారు. ఎస్సెస్సీ సర్టిఫికెట్లను ఎస్సెస్సీ బోర్డుకు, ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపుతారు. సదరు అధికారి వీరి సర్టిఫికెట్లను ఆయా బోర్డులకు పంపకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. పదోన్నతుల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్ బోర్డుకు పంపగా అవి నకిలీవని తేల్చారు. ఇన్నాళ్లు వెరిఫికేషన్ కోసం పంపకుండా పెండింగ్లో పెట్టి వారిని కాపాడినందుకు సదరు సీనియర్ అసిస్టెంట్ ఒక్కోక్కరి వద్ద రూ.లక్షల్లో ముడుపులు పొందినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు. -
తడిసిన ధాన్యాన్ని కొంటాం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొంటామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా 22 మండలాల్లో సుమారు 2,976 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లులో దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. నేటికీ 427 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తంగా 58,455 మంది రైతుల నుంచి 3,14,868 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.457 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ వై్స్ చాన్సలర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావుకు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ చాన్సలర్ జీ.భాస్కర్రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురువారం హర్యానాలోని ఎంపీహెచ్యూ వేదికగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్సింగ్షైనీ చేతుల మీదుగా సీహెచ్ఏఐ(చాయ్) హానరరీఫెలో –2026, అమిత్ కృషి రుషి అవార్డు–2026 లను వీసీ ప్రవీణ్రావు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులు వర్సిటీకి గర్వకారణమన్నారు. వ్యవసాయ, ఉద్యాన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు వరించాయన్నారు. దుబ్బాక: దేశభద్రత, సమగ్ర అభివృద్ధి కోసమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(సర్).. సర్పై ప్రజల్లో సమగ్రంగా అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్గౌడ్ అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు దుబ్బాక మున్సిపాల్టిలో సర్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ గురించి వివరించడంతో పాటు రాబోయే కాలంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దొరగొల్ల శ్రీకాంత్ యాదవ్, సర్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి వంశీకృష్ణాగౌడ్, తిరుమల్రెడ్డి, సుభాష్రెడ్డి, ప్రవీణ్, రమణారెడ్డి, ప్రసాద్, భాస్కర్, రవీందర్, కౌన్సిలర్లు సాయి కుమార్గౌడ్, కనకరాజు తదితరులు ఉన్నారు. దుబ్బాకటౌన్: మాదిగ సామాజిక వర్గం విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ నేత, జిల్లా ఇన్చార్జి మంద పవన్కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక మెడికల్ అసోసియేషన్ భవనంలో మాదిగల్లో అక్షరాస్యతను పెంచేందుకు చేపట్టిన ‘గ్రామాల్లో 40 రోజుల కార్యక్రమాన్ని’ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజుతో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ (ఎస్ఈఈఈపీసీ) సర్వే నివేదికలో అక్షరాస్యతలో మాదిగలు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు విద్య ప్రాముఖ్యతను వివరించి, అక్ష్యరాస్యతను పెంపొందించడం కోసం గ్రామ గ్రామాన చైతన్య సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం, రాజనర్సు, నవీన్, ప్రశాంత్, మహేశ్, తదితరులున్నారు. -
వర్గల్లో భారీ వర్షం
వర్గల్(గజ్వేల్): మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయిలో 48.6 మి.మీటర్ల వర్షం కురిసింది. నాచారం, మజీద్పల్లి, నెంటూరు, మైలారం, వర్గల్, వేలూరు, అంబర్పేట, గిర్మాపూర్, అనంతగిరిపల్లి తదితర చోట్ల రోడ్డుపై ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. గాలి తీవ్రతకు కప్పిన కవర్లు సైతం ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ వైర్లు నేలవాలాయి. మజీద్పల్లిలో జనావాసాలపై కరెంటు స్తంభం ఒరిగిపడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. మండలవ్యాప్తంగా 25 కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని, పలుచోట్ల కరెంటు తీగలు తెగిపోయాయని విద్యుత్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగుల్లో బదిలీ గుబులు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. జిల్లాలో ఉద్యోగులెవరిని కదిలించినా బదిలీల చర్చే వినిపిస్తోంది. ఎవరెవరు సీనియర్లు? ఎక్కడికి బదిలీ అయ్యే అవకాశం ఉంది? ఇతరత్రా విషయాలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఈ నెల 30 వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బదిలీల కోసం కొన్ని శాఖల ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వగా, మరికొందరు ఇస్తున్నారు. 40శాతానికే పరిమితం ఉద్యోగుల బదిలీలు 40శాతానికి మించి చేయవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జూనియర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు శాఖలలో సీనియారిటీ జాబితా ప్రకటించారు. బదిలీ ఎక్కడికి అవుతుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కొందరు ఉద్యోగులు జిల్లా ఆవిర్భావం నుంచి ఇక్కడే తిష్ట వేశారు. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు.. వీఆర్ఏ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు ఒకే మండలం, పని చేసిన చుట్టు పక్క మండలాల్లోనే విధులు నిర్వర్తించడం గమనార్హం. పంచాయతీ కార్యదర్శులకు కౌన్సిలింగ్ 132 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. బుధవారం వీరికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ను నిర్వహించారు. వైద్యారోగ్య శాఖలో ఎంపీహెచ్ఏ(ఎఫ్)లు 23 మంది, స్టాఫ్ నర్సులు 11 మందికి, రెవెన్యూ, వ్యవసాయ శాఖలో బదిలీలు కానున్నాయి. వ్యవసాయ శాఖలో 40 ఏఈవోలు, ఇరిగేషన్ శాఖలో బదిలీల కోసం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంకా ఎక్కడికి బదిలీ అయ్యారో ఉత్తర్వులు జారీ చేయలేదు. పెండింగ్లోనే జీఓ 317 బాధితుల సమస్య గత ప్రభుత్వం అమలు చేసిన జీఓ317 కారణంగా పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం కలిగించేందుకు 3 నుంచి నాలుగేళ్ల వరకు డిప్యుటేషన్ ఇవ్వాలని గతంలో 197 జీఓను జారీ చేసింది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. మూడున్నరేళ్ల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ ప్లేస్ ఆధారంగా ఆయా జిల్లాలకు బదిలీలు చేపట్టి తర్వాత సాధారణ బదిలీలు చేయాలని జీఓ317 బాధితులు కోరుతున్నారు.నాలుగు స్థాయిల ఉద్యోగులకు.. నాలుగు స్థాయిల ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. జిల్లా స్థాయిలో అటెండర్ నుంచి రికార్డు అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్లు బదిలీలు అవుతున్నాయి. రాజన్న జోన్ పరిధిలో(జోన్–3) కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు రానున్నాయి. సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రేడ్–1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, హెచ్డబ్ల్యూవో, ఎంపీహెచ్ఏ(ఏఎన్ఎం), స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నిషియన్, వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగులు ఉండనున్నారు. మల్టీ జోన్–1 పరిధిలోకి కాశేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు రానున్నాయి. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, మండల వ్యవసాయాధికారి, ఏఈలు, ఏఎస్డబ్ల్యూవో బదిలీలు కానున్నారు.ఎవరిని కదిలించినా అదే చర్చ రెండు రోజుల్లో కౌన్సిలింగ్ పూర్తి కోరుకున్న జిల్లాకు బదిలీ చేపట్టాలంటున్న జీఓ317 బాధితులుజీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి. వీరిని బదిలీ చేసిన తర్వాతే మిగతా వారిని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ సంఘాలు, బాధితుల పోరాటాల ఫలితంగా డిప్యూటేషన్ల కోసం ప్రభుత్వం 197జీఓను తీసుకవచ్చింది. డిప్యుటేషన్ల కోసం ఆప్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటికై నా మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించాలి. – విక్రంరెడ్డి, టీఎన్జీఓఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. స్థానిక నాయకత్వంతో మమేకమై ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమన్వయంతో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు ప్రతీ కార్యకర్తకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించామని, ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. స్పాట్లో లైవ్ ఫొటో తీసుకుని ఓటరు వివరాలు కూడా వెంటనే నమోదవుతాయన్నారు. తద్వారా ఈ సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో పదికి పది చోట్ల విజయం సాధించేలా పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో ఆన్లైన్ సభ్యత్వ నమోదు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, శశిధర్రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మెంబర్షిప్ డ్రైవ్ జిల్లా ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.ప్రతీ కార్యకర్తకు సమయం ఇవ్వండి నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలి సభ్యత్వ నమోదు సన్నాహకసమావేశంలో హరీశ్రావు -
టాస్క్ఫోర్స్ తనిఖీలు
● వెంకటరమణ ట్రేడర్స్లో అవకతవకలు ● రూ.26.83లక్షల విలువైన విత్తనాల విక్రయం నిలిపివేతకు నోటీసు గజ్వేల్: పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్లో జిల్లా టాస్క్ఫోర్స్ టీమ్ బుధవారం తనిఖీలు చేపట్టింది. టాస్క్ఫోర్స్ ప్రత్యేకాధికారి ఏడీఏ మల్లయ్య, సీఐ శ్రీధర్, స్థానిక ఏడీఏ బాబునాయక్లు సంయుక్తంగా ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లను పరిశీలించి అవకతవకలు గుర్తించారు. దీంతో రూ.26.83లక్షల విలువైన విత్తనాల విక్రయాలను నిలిపేస్తూ నోటీసులు (స్టాప్ సేల్ నోటీస్) ఇచ్చారు. ఈ తనిఖీల్లో రాయపోల్ వ్యవసాయాధికారి నరేష్, ఎస్ఐ సురేష్ తదితరులున్నారు. ధాన్యం మొత్తం కొనేవరకు పోరాటం గజ్వేల్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో విఫలమైన రేవంత్ సర్కారు రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. కొనుగోళ్ల వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం గజ్వేల్లోని మార్కెట్ యార్డు ఆవరణలో ‘రైతు దీక్ష’ ‘వంటా వార్పు’ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా కూడా 40శాతానికి మించి కొనుగోళ్లు జరగలేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు సైతం రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజ కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రెండ్రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లను పూర్తిగా తరలించాలని, లేనిపక్షంలో రాజీవ్రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన ‘రైతు దీక్ష’ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ప్రతాప్రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, దేవీరవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రైతన్న కష్టం..వర్షార్పణం
తడిసిన ధాన్యం కొంటాంవర్షంలోనే రైతుల పాట్లు ఆగం చేసిన వాన● కొనుగోలు కేంద్రాల్లో తడిసిముద్దయిన ధాన్యం ● కాపాడుకునేందుకు అన్నదాత పాట్లుదుబ్బాక/సిద్దిపేటజోన్: గాలి దుమారంతో కూడిన వర్షం రైతులను ఆగం జేసింది. జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఎండిన ధాన్యం సైతం తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దుబ్బాక, సిద్దిపేట, చిన్నకోడూరు, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, నంగునూరు, గజ్వేల్, వర్గల్, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రధానంగా దుబ్బాక, సిద్దిపేట మార్కెట్యార్డుల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడవడమేకాక, కాంటాలు పెట్టిన వడ్లబస్తాలు సైతం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు చాలా వరకు ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది.వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు దుబ్బాక మార్కెట్యార్డుతో పాటు పలుకొనుగోలు కేంద్రాల్లో రాత్రి వేళ వర్షంలోనే రైతులు పడరానిపాట్లు పడ్డారు. కాంటాలు పెట్టించిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. ఏ రైతును కదిలించినా కన్నీరు పెట్టడమే తప్ప వారినోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు. -
ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనాలి
మాజీ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం చిన్నకోడూరుతో పాటు ఇబ్రహీంనగర్, గోనెపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఆధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రోహిణి కార్తే నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ ప్రభుత్వం ఆన్లైన్ ట్యాగింగ్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వదిలి రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వారం రోజులు ఇసుక రవాణా ఆపి, ఆ లారీలను ఆర్టీఏ అధికారులు వడ్ల రవాణాకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్యరెడ్డి,శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకపోతే చర్యలు
ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ గజ్వేల్రూరల్: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన డ్రంకెన్డైవ్లో 19 మంది పట్టుపడ్డారన్నారు. వారిని న్యాయమూర్తి స్వాతిగౌడ్ ఎదుట హాజరుపర్చగా విచారణ అనంతరం రూ.1.13 లక్షల జరిమానా విధించారని చెప్పారు. వారిలో కొందరికి జైలు శిక్ష విధించారని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన తొమ్మిది మందికి రూ.45 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తాం గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలోని గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లో వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ 22 వరకు 74,554 క్వింటాళ్ల వడ్లు, 26,090 క్వింటాళ్ల మొక్కజొన్న, మరో 3,654 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరిగాయన్నారు. -
ప్రశాంతంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు
వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి యూనివర్సిటీలో టీజీ పీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తుండగా తొలిరోజు ఉదయం సెషన్లో 180 మందికి 141, మధ్యాహ్నం సెషన్లో 180కి 140 మంది హాజరైనట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ వెల్చాల ప్రవీణ్రావు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద గౌరారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రూ.70 వేల విరాళం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గోనెపల్లిలో పోచమ్మ తల్లి ఉత్సవాలకు గాను గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శనివారం రూ.70 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూర మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవడం అభినందనీయమన్నారు. సంఘం నాయకులు కమలాకర్చారి, సంతోష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి నంగునూరు(సిద్దిపేట): గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఇండేన్ గ్యాస్ నంగునూరు డీలర్ జయపాల్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హరిణి గ్యాస్ కార్యాలయంలో వినియోగదారుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ పంపిణీ నిలిచిపోతుందని చెప్పారు. -
అట్రాసీటీ కేసుపై విచారణ
మద్దూరు(ముస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన నాగులపల్లి సంపత్ అదే గ్రామానికి చెందిన మెతుకు పాపిరెడ్డి, మెతుకు భాస్కర్రెడ్డిపై ఫిర్యాదు చేయగా మద్దూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో శనివారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం గ్రామాన్ని సందర్శించి సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపిరెడ్డి, భాస్కర్రెడ్డి కులం పేరుతో తనను ధూషించారని గత 20న సంపత్ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట మద్దూరు ఎస్ఐ ఆసిఫ్ ఉన్నారు. మంటల్లో తుంగచెట్లు హుస్నాబాద్: సిద్దిపేట రోడ్లోని పెట్రోల్ బంక్ వెనుక ఉన్న తుంగచెట్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడటంతో పెట్రోల్ కోసం వచ్చిన వినియోగదారులు భయంతో పరుగులు పెట్టారు. సమీపంలోని ఇళ్లలోకి పొగ వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గతంలో తుంగ చెట్లను తొలగించాలని మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఎవరైనా నిప్పు పెట్టారా? ఎండ వేడిమికి మంటలు చెలరేగాయా అనేది తెలియరాలేదు. మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం చిన్నకోడూరులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సేవల ద్వారానే గుర్తింపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రజలకు చేసే సేవల ద్వారానే మంచి గుర్తింపు లభిస్తుందని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వీరబత్తిని సత్యనారాయణ అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న నందిని శ్రీనివాస్, గణేశ్నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న గడీల శ్రీనివాస్ను ఆలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి కూర శేష్కుమార్, గణేశ్నగర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు రాజేశం, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చైర్మన్ చీకోటి మధు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. లబ్ధిపొందే వరకు పోరాటం బెజ్జంకి(సిద్దిపేట): జనాభా దామాషా ప్రకారం అన్నిరంగాలలో లబ్ధిపొందే వరకు పోరాటం చేస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకుడు సదన్ మహరాజ్ అన్నారు. జూన్ 5న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగసభకు చెందిన పోస్టర్లను బెజ్జంకిలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు కులా ల ప్రజలు అన్నిరంగాలలో అన్యాయానికి గుర వుతున్నారన్నారు. జనాభా ప్రకారం లబ్ధిపొందే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాంకాలి సురేశ్, అంజిబాబు, ఉపసర్పంచ్ దూమాల మహేశ్, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, స్వెరోస్ నాయకులు సురేశ్, నాయకులు లింగయ్య, శంకర్, మక్సుద్, రవీందర్, రాజు, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణకే వైద్య పరీక్షలు
దుబ్బాకటౌన్: కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని, తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు బాలికల్లో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలను గమనిస్తుండాలని మున్సిపల్ చైర్పర్సన్ సంగీ త అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌమార బాలికల ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. తిమ్మాపూర్ పీహెచ్సీ సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యకమ్రంలో మున్సిపల్ కమిషనర్ కె.రమేశ్కుమార్ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళా కుటుంబాల్లోని కిషోర బాలికలకు రక్తహీనత, హిమోగ్లోబిన్, షుగర్ స్థాయిని తెలిపే రక్తపరీక్షలు, ఎత్తు, బరువులను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమారదశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్లో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. పోషకాహారం, పరిశుభ్రత, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. కార్యక్రమంలో మెప్మా సీఓ రేణుక, ఎంఎల్హెచ్ పి.స్రవంతి, హెల్త్ అసిస్టెంట్ గణేశ్, ఏఎన్ఎం పుష్ప, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్ను ప్రారంభించడంలో నిర్లక్ష్యం
గజ్వేల్: పట్టణంలో బస్టాండ్ నిర్మాణం పూర్తయినా.. ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చందనతో కలిసి శనివారం బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల కిత్రమే బస్టాండ్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి తేవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎండల్లో బస్సుల కోసం నిరీక్షిస్తూ ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. ప్రజ్ఞాపూర్లో నిర్మించిన మరో బస్టాండ్ పనులు సైతం వెంటనే పూర్తిచేయాలని, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ నాయకులు కళ్యన్కర్ నర్సింగరావు, నవాజ్మీరా, ఊడెం కృష్ణారెడ్డి, గోలీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి -
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సీటీని రద్దుచేస్తామని ఎమ్మెల్యే హరీశ్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సీటీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో వివిధ కంపెనీలు, ప్యాక్టరీలు నెల కొల్పడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే రాబోయే తరాల వారి జీవితాలు అడ్డుకోవడమే అన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు ఆపకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని, సిద్దిపేట అభివృద్ధి జరగలేదని అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్యాదారి మధు, గాయాజొద్దీన్, హర్షద్, విజయ్ డానియల్, రాజిరెడ్డి, నజ్జు, సంతోష్గౌడ్, బాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇమామ్ -
ఎన్సాన్పల్లిలో హై పవర్ ట్రాన్స్ఫార్మర్
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా జైలు, ఎన్సాన్పల్లి గ్రామానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా అదనపు హై పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్టు డీఈలు రామచంద్రయ్య, పండరి తెలిపారు. మండల పరిధిలోని ఎన్సాన్పల్లిలో వేర్వేరు ఫీడర్ల కోసం ఏర్పాటు చేసిన హై పవర్ ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ నాగుల స్రవంతి తో కలిసి శనివారం వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎన్సాన్పల్లి గ్రామంతోపాటు వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ కళాశాల, జిల్లా జైలుకు ప్రత్యేకంగా ఫీడర్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీధర్రెడ్డి, ఎస్ఎల్ఐ తానాజీ, ఎల్ఐ శ్రీనివాస్రెడ్డి, లైన్మాన్ వెంకట్, పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, హరికిషన్ పాల్గొన్నారు.ప్రారంభించిన డీఈలు -
పచ్చిరొట్టతో భూసారం వృద్ధి
సిద్దిపేటరూరల్: పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ సూచించారు. మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారవంతంగా మారుతుందన్నారు. తద్వారా దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయ విధానాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నరేశ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు రజిత, జానారెడ్డి, మహేందర్, అశోక్, అజ్మత్, అంజిరెడ్డి, బాబు, కనకయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూసారం మెరుగు మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చిరొట్ట సాగుతో భూసారం మెరుగవుతుందని ఏఎంసీ చైర్పర్సన్ బొమ్మెర సంయుక్త అన్నారు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్రోడ్డులోని డీసీఎంఎస్ రైతుసేవా కేంద్రం, అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో శనివారం రైతులకు పచ్చిరొట్ట విత్తలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల మోతాదును తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సత్యాణ్వేశ్, సర్పంచ్ అంకిత, ఉపసర్పంచ్ కందిబాబు, ఏఈఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనేదెప్పుడు?
లారీల కోసం రాస్తారోకో కొండపాక(గజ్వేల్): కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించాలంటూ మండలంలోని దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై టోల్ప్లాజా వద్ద రైతులు రాస్తారోకో చేశారు. మర్పడ్గ, సిర్సనగండ్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాల్లో నింపి వారం రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాహకులను సంప్రదించగా పొంత న లేని సమాధానాలు చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు మూడు వేల బస్తాల ధాన్యం సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా రైతులు నర్సింహులు, కనకయ్య, శ్రీనివాస్రెడ్డి, సెల్ బాల్నర్సు, రాము లు తదితరులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వర్షం కురిస్తే ధాన్యం బస్తాలు తడిసిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.గజ్వేల్/గజ్వేల్రూరల్: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలను విక్రయించేందుకు రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. తాము తీసుకువచ్చిన ధాన్యం ఎప్పుడు కొంటారంటూ రైతులు పలుచోట్ల శనివారం రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. గజ్వేల్తో పాటు మండల పరిధిలోని అహ్మదీపూర్, జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామాల్లో అన్నదాతలు రోడ్లపై బైఠాయించి ఆందో ళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 50 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యం పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందిన పంటను విక్రయిద్దామనుకుంటే కొనుగోళ్లలో జాప్యంతో అవస్థలు పడుతున్నామని, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తమవంతు ఎప్పుడొస్తుందా.. అంటూ ఎదురు చూసి నిరాశతో వెనుతిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. దీంతో రోడ్లపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం కొనండి మహాప్రభు! మర్కూక్(గజ్వేల్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం ఎగుమతులు జరగడం లేదు. ఏదోలా రైతులు ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తే కూలీల కొరతతో రోజుల తరబడి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని నర్సన్నపేట సమీపంలోని రైస్మిల్లు వద్ద మూడు రోజులుగా ధాన్యం బస్తాలతో లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని అంగడికిష్టాపూర్ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఐదు రోజుల నుంచి సెంటర్కు లారీలను పంపిచండం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టింకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి కొమురవెల్లి(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గీస భిక్షపతి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, రైతులతో కలసి మండల కేంద్రంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అసమర్ధతవల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, నాయకులు ముత్యం నర్సింహులు, గొల్లపల్లి కిష్టయ్య, కనకచారి తదితరులు పాల్గొన్నారు.వెల్లువెత్తిన నిరసనలు రోడ్లపై బైఠాయించి అన్నదాతల ధర్నా గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు -
● ఐదేళ్లుగా.. అసంపూర్తిగా
కిష్టాపూర్లో అసంపూర్తిగా నిలిచిన ఫంక్షన్ హాల్ నిర్మాణం పేదకుటుంబాల వారు వివాహ, శుభకార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లో విలేజ్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్లో రూ.30 లక్షలతో ఐదేళ్ల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు చాలక నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఆ నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. త్వరగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
గజ్వేల్: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలను పెంచు తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం గజ్వేల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్రెడ్డి, కార్మికశాఖామంత్రి వివేక్ చిత్రపటాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డితో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే తూంకుంట -
పథకాల అమలుకు ప్రాధాన్యం
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా 766.81టన్నుల వ్యర్థాలను తొలగించామని, అలాగే 3,506 కార్యాలయ భవనాలను శుభ్రపరిచి, 2,913 పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసినట్లు తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా 508 రోడ్ సేఫ్టీ కమిటీలు, జిల్లాలో నాలుగు బ్లాక్ స్పాట్లను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. 1,905 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించామని, 330 భూమి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశామని వివరించారు. ప్రైవేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి షీ బాక్స్ పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. ఈ 99రోజుల కార్యక్రమం జూన్12వ తేదీ వరకు జరగనుందన్నారు. తొలుత వివిధ స్టాళ్లను పరిశీలించారు. వివిధ శాఖల కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల అధికారులు వివరించారు. అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసుకున్నారు. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు జరుగుతున్నా మాజీ మంత్రి హరీశ్రావు రైతులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావులు జిల్లాలో ప్రాజెక్ట్లు నిర్మించడం వల్లే గోదావరి జలాలు వచ్చాయన్నారు. దీంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు ఆయిల్పామ్ పంట సాగుకు అనుకూలంగా మారిందన్నారు. కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడవద్దని, సిద్దిపేట అభివృద్ధి, ప్రణాళిక గురించి మాత్రమే మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంక్షేమం మరింత చేరువ కలెక్టర్ హైమావతి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సమావేశం -
కొనుగోళ్ల ప్రక్రియ వేగిరం: సీపీ రష్మీ
హుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, సాధ్యమైనంత తొందరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు, దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. హుస్నాబాద్ మార్కెట్లో హమాలీల కొరత ఉందని అధికారులు చెబుతున్నారని, హమాలీల సంఖ్యను పెంచి దిగుమతిలో జాప్యం జరగకుండా చూస్తున్నామన్నారు. ఒక ట్రాక్టర్ ధాన్యం అన్లోడింగ్ దిగుమతి కావాలంటే 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఒక్క రోజే దాదాపు 60 ట్రాక్టర్ల ధాన్యం దిగుమతి అయ్యేలా అధికారులు ప్లాన్ చేశారన్నారు. ధాన్యం దిగుమతి విషయంలో లోకల్ పోలీస్లు సహకారం ఉందన్నారు. ఆమె వెంట ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి ఉన్నారు. -
విజయ డెయిరీ పాలు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు బడిలోనే బ్రేక్ఫాస్ట్మెదక్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది. 2,55,059 విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది.జిల్లా పాఠశాలలు విద్యార్థులు మెదక్ 881 68,219 సిద్దిపేట 935 80,541 సంగారెడ్డి 1,222 1,06,299 -
చెక్కులు ఇవ్వరు.. చింత తీర్చరు
‘కల్యాణ లక్ష్మి’ చెక్కులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. పంపిణీ అంశం కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను కలవరపెడుతోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో విసిగిపోయి ఈనెల 1న గజ్వేల్ ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ‘కల్యాణ లక్ష్మి’ కాగితాలకే పరిమితమా’..?, ‘చెక్కులకు మోక్షం ఎప్పుడు’..? పోస్టర్లను అతికించి తమ నిరసన తెలియజేయడం చర్చకు దారితీసింది. అయినా అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. – గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. ‘కల్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీలోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, కుకునూర్పల్లి, జగదేవ్పూర్, మర్కూక్ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి చెక్కులు గజ్వేల్ ఆర్డీఓ పరిధిలో, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన చెక్కులు తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తూప్రాన్ ఆర్డీఓ పరిధిలోని చెక్కుల పంపిణీ ఎప్పటికప్పుడూ సజావుగా సాగుతోంది. గజ్వేల్ ఆర్డీఓ పరిధిలోనే భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నెలల తరబడి పెండింగ్లో ఉండటం లబ్ధిదారులకు ఆందోళన కలిగిస్తున్నది. రెండు నెలల క్రితమే ఇక్కడ వెయ్యి చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ చెక్కుల వాలిడిటీ మూడు నెలలు మాత్రమే. ఒకవేళ పంపిణీ నాటికీ ఎక్స్పైరీ అయితే ఆ చెక్కులను రీవాల్యూ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగక తప్పదు. ఎందుకీ ఈ పరిస్థితి? నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రతి అంశం ఇరు పార్టీల చాలెంజ్గా మారుతోంది. ఇటీవల మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ పనుల అంశం రాజకీయ రంగు పులుముకున్న విషయాన్ని ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. ఇదే రకమైన పరిస్థితి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి అడ్డంకిగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా.. ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే మౌలిక సూత్రాన్ని మరిచిపోవడం విమర్శలకు దారితీస్తున్నది.మంత్రి రాక కోసం..మంత్రి రాక కోసం గజ్వేల్లో చెక్కుల పంపిణీని పెండింగ్లో పెట్టారనే ప్రచారం సాగుతోంది. చెక్కుల పంపిణీలో చోటుచేసుకుంటున్న తీవ్ర జాప్యంపై విసుగు చెందిన లబ్ధిదారులు ఐఓసీలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోస్టర్లు వేసి నిరసన తెలపడం కలకలం రేపింది. తక్షణం అధికారులు స్పందించి చెక్కులు అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా మా కూతురు పెళ్లి తర్వాత 2023లో ‘కల్యాణలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా. చెక్కు కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుడే అవుతుంది. – మహలక్ష్మి (గిరిపల్లి–గజ్వేల్ మండలం) ఇబ్బందులకు గురిచేస్తారా? ‘కల్యాణలక్ష్మి’ చెక్కుల కోసం పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. చెక్కులు సిద్ధంగా ఉన్నా పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. – సందెబోయిన ఎల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడుకల్యాణలక్ష్మికి రాజకీయ గ్రహణం రెండు నెలల క్రితమే చెక్కులు సిద్ధం అయినా పంపిణీ కాని దుస్థితి మరికొన్ని రోజులు గడిస్తే కాలంచెల్లే అవకాశం లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు -
హమాలీల కొరత.. రైతన్న వ్యథ
మార్కెట్ యార్డ్లో ధాన్యం ట్రాక్టర్లతో నిరీక్షణహుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొనడంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలల్లోని ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లోని గోదాంలకు తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తుండటంతో దిగుమతిలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇందుకు హమాలీల కొరతే కారణం. ధాన్యం ట్రాక్టర్లు బారులు మార్కెట్లోని ధాన్యం బస్తాలను కాంటా పెట్టి, గోదాంలలో దిగుమతి చేసేందుకు హమాలీల కొరత ఏర్పడుతోంది. ఉన్న వారితోనే ఒక రోజు కాంటాలు పెట్టడం.. మరో రోజు గోదాంలలో ధాన్యాన్ని దిగుమతి చేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో ధాన్యం దిగుమతి కాకపోవడంతో బయట నుంచి వస్తున్న ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సరిపడా హమాలీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలను కూడా రప్పించి దిగుమతి చేస్తున్నారు. రోజూ వేలాది ధాన్యం బస్తాలు వస్తుంటే, మార్కెట్లో కేవలం 40 మంది హమాలీలే ఉండటంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లోని రెండు గోదాంలలో ఇప్పటి వరకు 26 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలను దిగుమతి చేశారు. ఇప్పటికే మూడు గోదాంలలో రెండు నిండిపోయాయి. నేడో, రేపో అదికూడా నిండిపోతే పరిస్థితి ఏమిటనీ రైతులు దిగాలు చెందుతున్నారు. మాయమవుతున్న ధాన్యం వ్యవసాయ మార్కెట్లో కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు మాయమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ధాన్యం కుప్పల చుట్టూ బస్తాలు అడ్డు పెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చి చూడగా ధాన్యం కనిపించడం లేదని వాపోతున్నారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.గోదాంల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు ధాన్యం దిగుమతిలో తీవ్ర జాప్యం మార్కెట్ యార్డులో వందలాది ట్రాక్టర్లు ఎటు చూసినా వడ్ల బస్తాలే..ప్రతి గింజా కొంటాం రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. హమాలీల కొరత ఉండటంతో బీహార్కు చెందిన హమాలీలను సైతం రప్పించి దిగుమతి చేయిస్తున్నాం. హుస్నాబాద్, అక్కన్నపేటలో 70 శాతం ధాన్యం కొనుగోలు చేశాం. హుస్నాబాద్లోని గోదాంలు సరిపోకపోతే కోహెడ మండల కేంద్రంలోని గోదాంకు తరలిస్తాం. – లక్ష్మారెడ్డి, తహసీల్దార్, హుస్నాబాద్ -
కస్తూర్బాలో అడ్మిషన్లు
వర్గల్(గజ్వేల్): స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరం కోసం ఆరు, ఏడు తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఎల్టీ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారి రజిత తెలిపారు. ఆరోతరగతిలో 40, ఏడో తరగతిలో 13, ఎంఎల్టీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన విద్యార్థినులు వచ్చే నెల 22లోగా నేరుగా వర్గల్ విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలుగజ్వేల్: పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో ఏడీఏ బాబునాయక్, ఇన్స్పెక్టర్ రవికుమార్, రాయపోల్ వ్యవసాయాధికారి నరేష్ సభ్యులుగా ఉన్న టాస్క్ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని జ్యోతి ఆగ్రో మార్కెటింగ్, ఆగ్రో రైతు సేవా కేంద్రం, వరలక్ష్మి, శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణాల్లో ఈ తనిఖీలు జరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్లు, స్టాక్ రిజిష్టర్లు, బిల్లు బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని, రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే..పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, కాలం చెల్లినవి అమ్మినా చర్యలు తప్పవన్నారు. అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులుహుస్నాబాద్: సరస్వతి మాత అంత్య పుష్కరాలకు హుస్నాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు. స్థానిక బస్టాండ్ నుంచి కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వయా కరీంనగర్ మీదుగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. సాగులో మెలకువలు తప్పనిసరి పరిశోధన శాస్త్రవేత్తలు చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో మెలకువలు పాటించాలని పరిశోధన శాస్త్రవేత్తలు లక్ష్మమ్మ, ప్రధుమన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లిలో భారతీయ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. సాగులో సేంద్రియ పద్ధతులను ఉపయోగించాలన్నారు. పంట మార్పిడి చేయాలని సూచించారు. మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ అధికారి నిహారిక, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. డీఆర్ఓగా నాగరాజమ్మసిద్దిపేటరూరల్: జిల్లా రెవెన్యూ అధికారిగా నాగరాజమ్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా భూసేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్ యూనిట్ –2 విధులు నిర్వహిస్తూ ఇన్చార్జి డీఆర్ఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వులతో నూతన డీఆర్ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్గా కరుణాకర్ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్గా మల్కగల్ల కరుణాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కరుణాకర్ గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు. -
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
చేర్యాల(సిద్దిపేట): రోడ్లపై చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సరఫరా, ఇతర సిబ్బంది అందరూ విధుల్లో అశ్రద్ధ చూపవద్దన్నారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా రోడ్లమీద చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత కోసం అందరూ పనిచేయాలి అన్నారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు గీతాంజలి, సుప్రజ, సురేష్, ప్రసాద్, సదానందం, కమిషనర్ నాగేందర్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ అరుణ -
ఆదాయపు పన్ను చట్టం మరింత సరళీకృతం
సిద్దిపేటకమాన్: నూతన ఆదాయపు పన్ను చట్టం ద్వారా పన్ను విధానాలు మరింత సరళీకృతం అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని ఇన్కమ్ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రాకేష్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులకు శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. నూతన ఆదాయపు పన్ను చట్టం కొత్త నిబంధనలు, విధానాలపై వివరించారు. పన్ను చెల్లింపుదారులకు సులభమైన పారదర్శకత, సాంకేతిక ఆధారిత సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల నియంత్రణ ఏదీ?
● రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ● సుప్రీంకోర్టు తీర్పుతోనైనా అధికారుల్లో మార్పు వచ్చేనా? ● జిల్లా వ్యాప్తంగా సుమారు 19,238 శునకాలు సాక్షి, సిద్దిపేట: జిల్లాలో వీధి కుక్కల సమస్య తీవ్రమవుతోంది. బాధితుల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉండగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల బెడదను తొలగించాలి. అవసమైతే కారుణ్య మరణం పరిశీలించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం విదితమే. వీధి కుక్కల బెడదను రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇప్పటికై నా పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల బెడద తొలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామాల్లో సుమారు 19,238 వీధి కుక్కలు ఉన్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. సగటున 12 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్క కాటుకు ఇంజక్షన్లు వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వేసవి కాలంలో కుక్కలు క్రూరమైన ప్రవర్తనను కలిగి ఉంటాయని, దీంతో చిన్నారులు, వృద్ధులను టార్గెట్ చేసుకుని కరుస్తాయని పశు వైద్యులు చెబుతున్నారు. 3,700 వాటికి స్టెరిలైజేషన్ వీధి కుక్కలకు సంతాన నియంత్రణ కోసం ఏప్రిల్ 10, 2021న సిద్దిపేట పట్టణంలోని పశు సంవర్ధక ఆస్పత్రి అవరణలో ఏబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,700 కుక్కలకు స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ శస్త్రచికిత్స) చేశారు. ఒక్కో కుక్కకు ఇలా శస్త్ర చికిత్స చేసినందుకు రూ.1,650 కేటాయించాలి. వీటికి సంబంధించి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్, చేర్యాల మున్సిపాలిటీలు ఎంఓయూ చేసుకు న్నాయి. కానీ గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చే ర్యాల మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.నిధులు కేటాయించాలి పల్లెల్లో వీధి కుక్కల సంతాన నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను పల్లెలకు, మున్సిపాలిటీలకు కేటాయించాలి. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం, నిధులు జీతాలు, మౌలిక వసతుల కల్పనకే సరిపోతున్నాయి.మిగతా పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో ముందుకు వెళ్లడం లేదు.వ్యాక్సిన్ సైతం వేస్తున్నాం కుక్కలకు సంతాన నియంత్రణతోపాటు, వ్యాక్సిన్ వేస్తున్నాం. ఊర కుక్కలకు గ్రామ పంచాయతీ, పట్టణాల్లో సిబ్బంది పట్టి తీసుకవస్తే వాటికి సైతం వ్యాక్సిన్ చేస్తాం. వీధి కుక్కల నియంత్రణకు పంచాయతీలు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలి. – గోపాలకృష్ణ మూర్తి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
ఇతర జిల్లాల ధాన్యాన్ని ఆపండి
● అన్లోడింగ్ వేగవంతం చేయండి ● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం వర్గల్(గజ్వేల్): మిల్లుల్లో వరి ధాన్యం అన్లోడింగ్(దిగుమతి) ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. బుధవారం వర్గల్ మండల కేంద్రం శివారులోని శ్రీరామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమహాదేవి ఇండస్ట్రీలలో ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యాన్ని రెండు, మూడు రోజులపాటు ఆపేసి, జిల్లా నుంచి వచ్చిన లారీలకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దిగుమతి చేసుకోవాలన్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతమైందని తెలిపారు. అంతే వేగంగా మిల్లులలో అన్లోడింగ్ జరగాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మిల్లులో ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, గోదాంలో ఎక్కువ పాయింట్లలో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి మిల్లర్ యజమానులు సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ తనూజ, డీటీ సుజిత, గౌరారం ఎస్ఐ ఆరోగ్యం, పీఏసీఎస్ అధికారి జితేందర్రెడ్డి, తదితరులున్నారు. జీఎంఆర్ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ సెంటర్ గజ్వేల్రూరల్: పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్లోగల ప్రభుత్వ ఆదర్శ గురుకుల (జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేనలు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు హెల్ప్లైన్ సెంటర్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్లైన్ సెంటర్ వల్ల పాలిసెట్తో పాటు ఎప్సెట్, ఐ–సెట్, ఈ–సెట్ తదితర కౌన్సెలింగ్ల కోసం, స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ఆరోపించారు. బుధవారం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సలీమ్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రానికి పొద్దుతిరుగుడు పంట తెచ్చి రెండు నెలలవుతున్నా కొనుగోలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం స్పందించి పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, నాయకులు బాపయ్య, నాగరాజు, శ్రీనివాస్, పరుశరాములు తదితరులు ఉన్నారు. -
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి, మూల్యాంకన కేంద్రం అధికారి రవీందరెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యాపకులు రిపోర్టు చేయాలన్నారు. 21 నుంచి ప్రారంభమయ్యే మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, సివిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ఉంటుందని చెప్పారు. మూల్యాంకన విధులకు హాజరయే అధ్యాపకులను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేయాలని సూచించారు. హాజరు కాని అధ్యాపకులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్ బుధవారం పేర్కొన్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం రంగ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 10న సెలక్షన్ లిస్ట్ను ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. బుధవారం చిన్నకోడూరులోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉన్న సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటు లో ఉంచుతామన్నారు. ఆయన మండల బీసీ సెల్ అధ్యక్షులు చిరంజీవి, నాయకులు సదాశివరెడ్డి, కన్నారెడ్డి, యువకులు ఉన్నారు. పచ్చిరొట్ట ఎరువుల పంపిణీగజ్వేల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 50శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువుల(జనుము, జీలుగ విత్తనాలు)ను పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ భూసారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, నాయకులు పాల్గొన్నారు. అటెండర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం అక్కన్నపేట(హుస్నాబాద్): మండల విద్యావనరుల కేంద్రం(ఎంఆర్సీ)లో ఔట్స్సోరింగ్ విధానంలో అటెండర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ గుగులోతు రంగానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి మెమో, స్టడీ, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలు, రెండు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతో ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్
● జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ● ఒక్కో ఇంటిపై రూ.1.38లక్షల వ్యయం ● 2 కిలో వాట్స్ ఉత్పత్తి చేసే సోలార్ పలకలు హుస్నాబాద్ మండలం రామవరంలో గృహాలపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లుపేదల గృహాల్లో సౌర కాంతులు విరజిమ్మనున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగులు విద్యుత్ విక్రయంతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఇందుకు జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. – సాక్షి, సిద్దిపేట ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకంలో ఎంపికైన కుటుంబాలకు ఉచితంగా వర్తింప జేసి మిగులు విద్యుత్ను టీజీఎస్పీడీసీఎల్ కొనుగోలు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. హుస్నాబాద్ మండలంలో రామవరం, వర్గల్ మండలం తుంకిఖాల్సా, తొగుట, బుర్గుపల్లిలున్నాయి. అందులో గృహజ్యోతి లబ్ధిదారులు 1,936 లబ్ధిదారులున్నారు. ఒక్కో ఇంటికి 2 కిలో వాట్స్ సామర్థ్యం సోలార్ ప్లేట్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిలో వాట్కు రూ.68వేలు ఖర్చు చేయనున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.1.36లక్షల విలువ చేసే సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు రూ. 26,32,96,000 నిధులతో ఆయా గ్రామాల్లో సోలార్ విలేజీగా తీర్చి దిద్దనున్నారు. గృహం స్లాబ్, రేకులతో ఉన్న వాటిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో తొలి విడతలో హుస్నాబాద్ మండలం రామవరం గ్రామంలో 326 గృహజ్యోతి లబ్ధిదారులుండగా అందులో 255 గృహాలు స్లాబ్, రేకులవి ఉన్నాయని గుర్తించారు. వీటిలో 135 గృహాలలో సోలార్ ప్లేట్లను బిగించడం ప్రారంభించారు. మిగతా మూడు గ్రామాల్లో త్వరలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించనున్నారు. జిల్లాలో వివరాలిలా ఇలా.. నియోజకవర్గం గ్రామం గృహాలు హుస్నాబాద్ రామవరం 326 గజ్వేల్ తుంకిఖాల్సా 624 దుబ్బాక తొగుట 677 సిద్దిపేట బుర్గుపల్లి 309 ఉచితంగానే ఏర్పాటు గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేయనున్నాం. లబ్ధిదారులు ఒక్క రూపాయి సైతం చెల్లించనవసరం లేదు. ఒక్కో కిలో వాట్కు రూ.68వేల చొప్పున రూ.1.36లక్షలను ఖర్చు చేయనున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బును వెచ్చించనున్నాయి. – రవీందర్, మేనేజర్, రెడ్కో -
మెడికల్ దుకాణాల బంద్ ప్రశాంతం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ దుకాణాలు బుధవారం బంద్ నిర్వహించాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆలిండి యా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్లు బుధవా రం బంద్ పాటించాయి. మెడిసిన్ కోసం దుకాణాల వద్దకు వచ్చిన వారు విషయం తెలియక నిరాశతో వెనుదిరిగారు. మందులు అవసరమైన వారు ప్రభు త్వాసుపత్రి బాట పట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాప్లు మాత్రం యథావిధిగా విక్రయాలు జరిపాయి. మెడ్ప్లస్ వంటి షాప్లు విక్రయాలు జరిపాయి. మెడికల్ షాప్ల బంద్ నేపథ్యంలో అత్యవసర సమయంలో ఏమైనా మందులు అవసరమైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు వైదాధికారులు తెలిపారు. సిద్దిపేటతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 నుంచి 850 మెడికల్ దుకాణాలు బంద్లో పాల్గొన్నాయి.సిద్దిపేట పట్టణంలో మూసి ఉన్న మెడికల్ షాప్ఆన్లైన్లో విక్రయాలు నిలిపివేయాలి గజ్వేల్రూరల్: పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ దుకాణాల నిర్వాహకులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో ఔషధాల విక్రయాన్ని నిలిపివేయడంతో పాటు జీఎస్ఆర్ 817ను ఉపసంహరించాలన్నారు. అదే విధంగా కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లను నిలిపివేయాలని, జీఎస్ఆర్ 220లను ఉపసంహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల గోస పట్టించుకోరా?
● ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ● రైస్ మిల్లర్స్తో సమావేశందుబ్బాక: ‘ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.. నెలరోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల కొనుగోలు సక్రమంగా లేక కేంద్రాల్లో ఎక్కడికక్కడా ధాన్యం పేరుకపోయిందన్నారు. ఇప్పటి వరకు కనీసం పది శాతం కూడా కొనుగోలు జరగకపోవడంతో రోడ్లపై, కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. అధికారులు, రైస్మిల్లర్స్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైస్మిల్లర్స్ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మిల్లర్స్కు అవసరమైన అనుమతులు, రవాణా అంశాల్లో క్లియరెన్స్ లేకపోవడం వల్లనే ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు చింత రాజు, వేణు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా మండంలోని రామక్కపేటతో పాటు పలు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. రైతులు ఇబ్బందులను తెలుసుకున్నారు. -
పొద్దుతిరుగుడు కొనండి
కేంద్రమంత్రికి ఎంపీ రఘునందన్రావు వినతిదుబ్బాక: యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను ఎంపీ రఘునందన్రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రిని బుధవారం ఎంపీ కలిశారు. తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21,091 నుంచి 27,675 ఎకరాలకు పెరిగిందని, పంట ఉత్పత్తి సైతం 13,935 మెట్రిక్ టన్నుల నుంచి 19,373 మెట్రిక్ టన్నులకు చేరిందని విన్నవించారు. కనీస మద్దతు ధర రూ.7,721 వచ్చేలా చూడాలని కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. వెంటనే పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా సంబంధిత శాఖకు సూచించాలని ఈ సందర్భంగా మంత్రికి రఘునందన్రావు విన్నవించారు. -
రోడ్డెక్కిన అక్కన్నపేట రైతులు
హుస్నాబాద్: రైస్ మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడంలో అధికారులు, మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అక్కన్నపేట మండలానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సిద్దిపేట–హనుమకొండ రహదారిపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువస్తే రోజులు గడుస్తున్న దిగుమతి చేసుకోవడం లేదని మండిపడ్డారు. హుస్నాబాద్ కేంద్రానికి చెందిన ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ, అక్కన్నపేట మండలానికి చెందిన ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అన్లోడింగ్ ఆలస్యం కావడంతో ట్రాక్టర్ల అద్దె పెరిగి పోతుందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. అన్లోడింగ్ వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
కొనుగోళ్లు గందరగోళం
తీవ్ర జాప్యం.. అక్రమాల మయం మొక్కజొన్న, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్ఫెడ్.. వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ).. ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటివి కొనుగోలు చేసే ఆయిల్ఫెడ్ సంస్థలు తమ శాశ్వత కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. ఈ బాధ్యతను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ పర్యవేక్షణకే పరిమితమయ్యాయి. ఫలితంగా కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడం, అక్రమాలు చోటు చేసుకోవడం సహజపరిణామంగా మారుతోంది. సాక్షి’ పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. – గజ్వేల్ వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు ప్రక్రియ ఏటా సంక్లిష్టంగా మారుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు విశ్లేషిస్తే ఎన్నో అంశాలు బయటపడుతున్నాయి. వడ్లను గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత కేంద్రాలను నడిపేవారు. కానీ నేడు కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సోసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమైంది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు వసతులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతోంది. చేతులెత్తేసిన నాఫెడ్ సంస్థ... పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన నాఫెడ్(నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్)ఈసారి చేతులెత్తిసింది. గత నెల 18వరకు జిల్లాలో కేవలం 1800 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి...ఆ తర్వాత కేంద్రాలను ఎత్తేసింది. ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో నెల రోజులుగా 3000 మెట్రిక్ టన్నులకుపైగా పొద్దుతిరుగుడు ధాన్యంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇకపోతే మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ఫెడ్ సైతం కొనుగోళ్లను ఐకేపీ, సహకార సంఘాలకే వదిలేసింది. గతంలో గజ్వేల్తోపాటు మరికొన్నిచోట్ల మక్కల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అక్రమాలు చోటుచేసుకొని .ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొనుగోళ్ల విధానంలో ప్రభుత్వం ఇప్పటికై నా మార్పులు తెస్తేనే రైతులకు ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.గజ్వేల్ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోళ్లుఇప్పటి వరకు 30 శాతమే కొనుగోళ్లు ఇకపోతే జిల్లాలో యాసంగికి సంబంధించి 3.7లక్షల ఎకరాలకుపైగా వరి సాగులోకి వస్తే...5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ లక్ష్యంలో ఇప్పటివరకు అతికష్టం మీద 30శాతం వరకు కొనుగోళ్లను చేపట్టగలిగారు. ఇంకా 70శాతం కొనుగోళ్లు మిగిలివున్నాయి. జిల్లావ్యాప్తంగా అర్భాటంగా 422కుపైగా సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు అనుకున్నంత వేగంగా సాగటం లేదు. ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేసి.. ప్రభుత్వ రంగ సంస్థలుపర్యవేక్షణకే పరిమితం ఈసారి పరిస్థితి మరింత అధ్వానం ధాన్యం అమ్ముకునేందుకురైతుల అష్టకష్టాలు వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లుఏటా అస్తవ్యస్తం -
ధరల మంట.. పచ్చళ్లు ఎట్ట?
ఊరగాయ ఊరిస్తున్నా.. సరుకుల ధరలతో బెంబేలుఈసారి అవకాయ పచ్చళ్ల తయారీ సామాన్యులకు పెనుభారంగా మారింది. పచ్చళ్ల సరుకుల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఏ సరుకు కొనాలన్నా గుబులుపుట్టిస్తున్నాయి. గత ఏడాది కంటే సుమారు 30 నుంచి 40 శాతం వరకు ధరలు పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ధరలు మండుతుంటే పచ్చళ్లుపెట్టేదెట్టా అంటూ గృహిణులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాకటౌన్: వేసవి కాలంలో ఊరగాయలను తయారు చేసుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వాటిని తయారు చేయడానికి పలు రకాల సరుకులు అవసరం. కానీ పెరిగిన నిత్యావసర ధరల ప్రభావంతో పచ్చళ్లు పెట్టడానికి మహిళలు జంకుతున్నారు. గతంలో ఒక్కో కుటుంబంలో 100 కాయల వరకు పచ్చళ్లు పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం 25– 50 కాయల వరకే పరిమితమవుతున్నారు. అలాగే మార్కెట్లలో పలు రకాల పచ్చళ్లు రెడీమేడ్గా లభిస్తుండటంతో సంప్రదాయంగా వస్తున్న తయారీ ఘననీయంగా తగ్గుతోంది. సైజ్ను బట్టి ధర మామిడి కాయల్లో అనేక రకాలున్నాయి. ఊరగాయలు పెట్టడానికి కొన్ని రకాలు మాత్రమే ఉపయోగిస్తారు. రసపురి, నాటు మామిడి తదితర రకాల కాయలను వినియోగిస్తారు. వేసవిలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. గత సీజన్లో రోజుకు రూ. 2 వేలకు పైగా ఆదాయం పొందే రైతులు నేడు రూ.1200 వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. కాయ సైజ్ మేరకు రూ.15 నుంచి రూ. 25వరకు విక్రయిస్తున్నారు. కాయలు కొడుతూ.. మండుటెండల్లో వృద్ధ మహిళలు పనికి వెళ్లలేని పరిస్థితి. దీంతో పచ్చళ్లకు మామిడి కాయలను ముక్కలుగా కొట్టడం జీవనోపాధిగా చేసుకుని ఉపాధి పొందుతున్నారు. గతంలో రోజుకు రూ. 1500 వరకు సంపాదించిన వారు పచ్చళ్లు పెట్టే వారు తగ్గడంతో రూ.800 వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. కాయల సైజ్లను బట్టి ఒక్కో కాయ కొట్టేందుకు రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ఏం కొనేటట్టులేదు.. మా కుటుంబ సభ్యులకు ఊరగాయ అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏటా పచ్చళ్లు తయారు చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు మండి పోతున్నాయి. దీంతో ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం ప్రకారం పరిమిత కాయలతోనే ఊరగాయ పెట్టుకుంటున్నాం. – లక్ష్మి, గృహిణి చాలా తగ్గింది ప్రతీ వేసవిలో మామిడి కాయలను ముక్కలుగా చేస్తూ జీవనం సాగిస్తుంటా.. రోజుకు రూ.600 నుంచి 800 సంపాదిస్తా. గతంతో పోలిస్తే ఈసారి చాలా తగ్గింది. – కనకవ్వ, బల్వంతాపూర్ -
కార్పొరేట్ కళాశాల
సాక్షి, సిద్దిపేట: ఇంటర్మీడియెట్ బోర్డు నూతన కళాశాలలకు గత ఐదేళ్ల నుంచి అనుమతులు నిలిపివేసింది. విద్యారంగాన్ని వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు నూతన కళాశాలలను నెలకొల్పేందుకు కొత్తపంథాను ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా గతంలో అనుమతులు పొందిన కాలేజీలకు తమ పేర్లను తగిలించుకుంటున్నాయి. పైకి కళాశాల పేరు మార్చినా దీని వెనుక క్రయ విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. అయితే కాలేజీలను అమ్మడం గానీ, కొనుగోలు చేయడం కానీ చేయకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా వాటిని ఉల్లంఘించి మరీ కార్పొరేట్ కాలేజీలు జిల్లాలో ఉన్న చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను గుట్టుగా కొనేస్తున్నాయి. ఇటీవలే జిల్లాలో ‘కొత్త తరం’ఇంటర్ కాలేజీ (పేరు మార్చాం)ని కొనుగోలు చేసి ఓ సంఖ్యను సూచించేలా పేరు మార్చారు. అయితే ‘కొత్త తరం’కాలేజీ యాజమాన్యం కూడా గతంలో ఓ కాలేజీని ఇలాగే కొనుగోలు చేసింది. మరో కళాశాల కార్పొరేట్ పేరుతో కోచింగ్ సెంటర్ను సైతం ప్రారంభించింది. ఇలా వరుసగా కళాశాలల పేర్లు, యాజమాన్యాలు మారిపోతున్నాయి. మూతపడే స్థితికి చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలు జిల్లా వ్యాప్తంగా 25 ప్రైవేట్, 83 ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో దాదాపు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల ప్రవేశంతో బడ్జెట్ కళాశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో బడ్జెట్ కళాశాలలను యాజమాన్యాలు నడపలేని, మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న కార్పొరేట్ కళాశాలలు చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను యథేచ్ఛగా కొనేస్తున్నాయి. కార్పొరేట్కు బోర్డు ప్రోత్సాహం! బడ్జెట్ కళాశాలలను డీలా చేసి కార్పొరేట్ కళాశాలను ఇంటర్ బోర్డు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కళాశాలలు సామాన్యులకు అందుబాటులో ఫీజులను వసూలు చేసేవి. కార్పొరేట్ కళాశాలలైతే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికై నా ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించి కళాశాలల విక్రయాలను నియంత్రించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు బడ్జెట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుకుంటూ, విక్రయాలు జరుపుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ఫర్మ్ ఎందుకు మార్చుకుంటున్నారని పరిశీలించకుండానే దరఖాస్తు రాగానే ఎలా కావాలంటే అలా బోర్డు అధికారులు చకచకా పనులు చేస్తున్నారు.గుట్టుగా చేతులు మారుతున్న లక్షల రూపాయలు కార్పొరేట్ స్థాయిలో కళాశాలలను స్థాపించాలనుకునే అంతంతమాత్రంగా సాగుతున్న కళాశాలలను సంప్రదించి వాటిని గుట్టుగా కొనుగోలు చేసి పేర్లను మారుస్తున్నాయి. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనల్లో పేరు మార్చుకునే, స్థలం మార్చుకునే అవకాశం ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కళాశాలలు హైదరాబాద్ సైతం షిఫ్ట్ అవుతున్నాయి.కాలేజీల పేరు మార్పు వెనుక జోరుగా క్రయ విక్రయాలు జిల్లా పరిధిలో పేరు మార్పునకు ఓకే ఒకే జిల్లా, మండల పరిధిలో మాత్రమే పేరు మార్పునకు, తరలింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే వాటికి అనుమతులిస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాలలో మాత్రమే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలి. అనుమతి లేకుండా కళాశాలను నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. –రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి -
పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
అడిషనల్ కలెక్టర్ పాండు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదును పెంచాలని అడిషనల్ కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పాఠశాల ప్రవేశాల నమోదు, డ్రా పౌట్ విద్యార్థుల పునః ప్రవేశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 5 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు సమారు 5,903 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. గతేడాది మొదటి తరగతిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందగా.. ఈ ఏడాది అన్ని తరగతులు కలిపి లక్షా 24 వేల మందిని ప్రవేశాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా డ్రా పౌట్, పాఠశాలకు ఎప్పుడు హాజరు కాని పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, యువజన కమిటీలు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, జూన్ 3వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి పాఠశాల ప్రవేశాలపై ప్రచారం చేపట్టాలన్నారు. జూన్ 4న స్కూల్లలో సమావేశాలు, జూన్ 6న గ్రామస్థాయి, నగర స్థాయి విద్యార్థుల గుర్తింపు కార్యక్రమంతో పాటు జూన్ 8న ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే పాఠశాలలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈఓ స్వప్న, మెప్మా పీడీ రామాచారి, ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్, సోషల్ వెల్ఫేర్ అధికారి అఖిలేష్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, డీటీడీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సన్నాలు సాగు చేయాలి
కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్లో సన్న రకం వరి సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ హైమావతి కోరారు. శనివారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములలో ధాన్యం దిగుమతి ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాములలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు సంబంధించిన ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీలు మిల్లులకు వెళ్లి దిగుమతి చేస్తున్నారని, బయటకు వెళ్లకుండా మార్కెట్లోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ను ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ క్రిష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు, రవాణాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం, అన్లోడింగ్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ రద్దీ, వివాదాలు, రవాణాలో జాప్యం తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, సివిల్ సప్లై, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. -
ఆక్రమణలపై బల్దియా కొరడా
● పట్టణంలో ఆకస్మిక తనిఖీలు ● ఆక్రమణల తొలగింపు, జరిమానాసిద్దిపేటజోన్: నిబంధనలు అతిక్రమించి ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై బల్దియా అధికారులు కొరడా ఝలిపించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ ఆదేశాల మేరకు శనివారం టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలో పలు ప్రధానదారుల్లో పాదచారులకు ఇబ్బందిగా ఫుట్పాత్లపై తోపుడు బండ్లు, టిస్టాల్స్, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలను అధికారులు తొలగించి హెచ్చరించారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల విక్రయాల దుకాణాల్లో తనిఖీ చేసి రూ. 5400 జరిమానా విధించారు. పట్టణ పరిధిలోని ఫుట్పాత్లను వ్యాపారం కోసం ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. కేవలం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ మీద ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని, వ్యాపార సంస్థలు తమ సామగ్రిని రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పెట్టవద్దని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కమిషనర్ పరిశీలించారు. యూజీడీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం అన్లోడింగ్లో జాప్యం చేయొద్దు
దుబ్బాక: ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్మిల్లర్స్ దిగుమతులు వేగంగా చేపట్టి సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం డీఎస్ఓ తనూజతో కలిసి దుబ్బాక, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని రైస్మిల్లుల్లో ధాన్యం దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి పనిచేయించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులను నియమించామన్నారు. వచ్చే ఖరీఫ్లో రైతులు సన్నవడ్లను పండించాలని, సన్నాలకు 500 బోనస్ వస్తుందన్నారు. రేషన్ షాప్లలో సన్నబియ్యం సరిపోక ఇతర జిల్లాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ హైమావతి రైస్మిల్లుల్లో ధాన్యం దించివేత పనుల పరిశీలన -
ఆదాయం పెంపుపై దృష్టేదీ?
ఇంటి పన్నుల అసెస్మెంట్పై కానరాని శ్రద్ధగజ్వేల్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి కరువైంది. ఆయా మున్సిపాటీల్లో ప్రస్తుతం వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులను అసెస్మెంట్ చేయడం ద్వారా ఏటా లక్షల్లో ఆస్తి పన్ను రూపంలో ఆదాయం సమకూరే అవకాశమున్నా.. ఆ దిశగా చర్యలు సాగడం లేదు. ఫలితంగా ఏటా భారీగా రాబడికి గండిపడుతోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకనుణంగా ఆదాయాన్ని పెంచుకొని.. మెరుగైన వసతులను కల్పించాలనే మౌలిక అంశాన్ని మున్సిపాలిటీల్లో యంత్రాంగం మరిచిపోతున్నది. ఫలితంగా పట్టణాల్లో ప్రజలు అరకొర సౌకర్యాల మధ్య కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సిద్దిపేటతోపాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ.18కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రూ.4కోట్లకుపైగా ఆదాయంతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ. 2–3కోట్లలోపు ఆదాయంతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి. వేల సంఖ్యలో పెండింగ్ మున్సిపాలిటీల్లో కొత్తగా ఇంటి నంబర్లు ఇచ్చి ఆస్తి పన్ను జనరేట్ చేయాల్సినవి అన్ని మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సంగుపల్లి, ముట్రాజ్పల్లి, సంగాపూర్, క్యాసారం, రాజిరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. కొత్తగా ఆర్అండ్ఆర్ కాలనీ సుమారుగా 5వేల ఇళ్లతో విలీనమైంది. వీరికి ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. నిజానికి ఈ ఆర్అండ్ఆర్ కాలనీ 2026 జనవరిలో అధికారికంగా విలీనమైతే.. వీరికి 2023కు పూర్వం నుంచే ఇంటి పన్నులు వేశారు. కానీ విలీనమైన తర్వాతే పన్నులు చెల్లిస్తామని...అంతకు పూర్వం భారం మేయలేమని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చి నిర్వాసితులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ శాసీ్త్రయ పద్ధతిలో పన్నులను వసూలు చేయాల్సి ఉన్నది. ఇకపోతే పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో 1200 పైగా ఇళ్లు ఉన్నాయి. సింహభాగం ఇళ్ల కేటాయింపు జరగగా వాటికి సైతం ఇంటి నంబర్లు ఇచ్చి.. మెరుగైన సేవలను అందించాల్సి ఉంది. ఇకపోతే పట్టణంలోని కొత్త కాలనీల్లో మినహా మిగతా చోట్ల వందల సంఖ్యలో వేరుపడిన కుటుంబాలకు కొత్త ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. దీనిపై ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరమున్నది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాల్సిన అధికారులు...మామూళ్ల మత్తులో ఇష్టానుసారంగా చేపట్టి మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేల సంఖ్యలో పెండింగ్ రాబడికి ఏటా భారీగా గండి జిల్లాలోని మున్సిపాలిటీల దుస్థితి -
తాలు పేరుతో కోత.. రైతుల వ్యథ
చేర్యాల(సిద్దిపేట):తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారు. క్వింటాలుకు నాలుగు కిలోల మేర కట్ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి, ఇరవై రోజులుగా పడిగాపులు కాసి, తాలుపట్టి చివరకు కాంటా వేసినా.. మళ్లీ తాలు ఉందంటూ మిల్లర్లు కోత పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. మండల పరిధిలోని నాగపురి ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి గురువారం రామలింగేశ్వర రైస్ మిల్లుకు రెండు లారీల ధాన్యం పంపించారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ చెక్ చేశారు. తాలు ఎక్కువగా ఉందని, క్వింటాలుకు నాలుగున్నర కిలోలు కట్ చేస్తామని కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారు. సదరు నిర్వాహకులు రైతులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైతులు మిల్లు వద్దకు వెళ్లి చెక్ చేయగా 500 గ్రాముల ధాన్యంలో 16 గ్రామల నుంచి 20 గ్రాములు, మరో లారీలో 500 గ్రాములకు 32 గ్రాముల తాలు వచ్చినట్లు గుర్తించారు. తాలు చాలా తక్కువగా ఉన్నా ఎక్కువ ఉందని మిల్లర్ చెబుతున్నారని రైతులు తెలిపారు. చివరగా సదరు మిల్లరు ఒక లారీలో 4 క్వింటాళ్లు, మరో లారీలో 9 క్వింటాళ్ల ధాన్యం కట్ చేస్తామంటూ తెలిపినట్లు రైతులు వాపోయారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంత్రాలతో శుభ్రం చేసినా మళ్లీ తాలు కట్ చేయడం సరికాదన్నారు. మిల్లర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నాచగిరీశుడి సేవలో ఎమ్మెల్సీలు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రాన్ని బుధవారం ఎమ్మెల్సీలు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, అంజిరెడ్డి సందర్శించారు. వారికి ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులుగజ్వేల్రూరల్: బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, ఆర్ఐ రాజు, పోలీసు సిబ్బందితో కలిసి బుధవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానంప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్ బుధవారం తెలిపారు. ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఈ నెల 16 నుంచి జూన్ 6 సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. జూన్ 10న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామస్వామి దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామస్వామి అన్నారు. బుధవారం దుబ్బాక ఐఓసీ సమావేశం మందిరంలో నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యా కార్యక్రమాల వర్క్షాపును మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరాం సంగీత, ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసంతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంఈఓలు, మాస్టర్ ట్రైనర్స్ మధుసూదన్, సాదత్అలీ, ఉమాశంకర్ తదితరులు ఉన్నారు. అక్షరాస్యత పెంచుదాం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటజోన్: అక్షరాస్యతలో నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. బుధవారం విపంచి ఆడిటోరియంలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆర్పీ, ఓబీఎస్లకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని మహిళా సంఘాల్లో 1300 మంది మహిళలను నిరక్షరాస్యులుగా గుర్తించినట్టు తెలి పారు. వారికి స్వచ్ఛందంగా చదువు చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కొక్క ఆర్పీ, ఓబీ పది మంది మహిళలకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మెప్మా అధికారు లు హన్మంతరెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, రేణుక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
సిద్దిపేటఅర్బన్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని, ఏఎంసీలలో మాత్రమే మొక్కజొన్న కొనుగోలు జరుగుతోందని అన్నారు. తేమ శాతం వచ్చి లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్న ధాన్యాన్ని లారీలు వచ్చే వరకు ఆగకుండా అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, టెంట్, యంత్రాలు, కవర్లు, సుతిల్ దారాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. యుద్ధప్రాతిపాదికన ధాన్యం తరలించాలి సిద్దిపేటరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఈ పది రోజులు అత్యంత కీలకమని, ప్రత్యేక ప్రణాళికతో వాహనాలతో యుద్ధ ప్రాతిపాదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. హమాలీ, ట్రాన్స్పోర్టు, సమస్య తలెత్తకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాలవర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, డీసీఎస్ఓ తనూజ, డీఎం గోపికృష్ణ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ అధికారి నాగరాజు, డీఏఓ స్వరూపారాణి పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి మిట్టపల్లిలో కొనుగోలు కేంద్రం పరిశీలన -
పాలిసెట్కు 94.56 శాతం హాజరు
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు నంగునూరు/గజ్వేల్ రూరల్(సిద్దిపేట): పాలిసెట్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 3,932 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,722 మంది హాజరు కావడంతో 94.56 శాతం నమోదైంది. సిద్దిపేటలో ఏడు, గజ్వేల్లో మూడు, హుస్నాబాద్లో ఒకటి కలిపి మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులు మాలతి, ఫయీమొద్దీన్, డీవీఆర్ పాటిల్ అన్ని సెంటర్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పది రోజుల్లో ఫలితాలు వెలువడుతాయన్నారు. కౌన్సెలింగ్కు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. -
అన్లోడింగ్లో జాప్యం తగదు
కో ఆప్షన్ సభ్యుల ఎన్నికఎక్స్–అఫీషియో సభ్యుడిగామంత్రి పొన్నం ● ఏకాభిప్రాయం కుదరకఒక సభ్యుడి ఎన్నిక పెండింగ్ సాక్షి, సిద్దిపేట: ధాన్యం అన్లోడింగ్లో జాప్యం తగదని, మిల్లర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్తో కలిసి సంబంధిత అధికారులతో, మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు. యాసంగిలో అంచనాకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇందు కోసం 427 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిల్లుల వద్ద హమాలీ కార్మికులను ఎక్కువగా నియమించుకుని త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని, లారీలను వెయిటింగ్ చేయించవద్దన్నారు. సీపీ ఆధ్వర్యంలో ఆర్టీఏ, రెవెన్యూ శాఖలు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలనాధికారి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు సన్న బియ్యం పండించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగాలన్నారు. వర్షాకాలంలో 2.5లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 46 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని, ఇప్పటి వరకు 24,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశాన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.విద్యకు అధిక ప్రాధాన్యం హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లకు సర్పంచ్లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లకు సర్పంచ్లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా విధ్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, ఎంఈఓ బండారి మనీల, సర్పంచ్లు పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ -
మున్సిపాలిటీల్లో మంచినీటి తిప్పలు
దూప తీర్చనిభగీరథజిల్లాలోని మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ తెచ్చినా ప్రజల గొంతు తడవడంలేదు. పట్టణ శివార్లకు రెండు, మూడు రోజులకోమారు నీటి సరఫరా చేస్తున్నారు. అదికూడా అరకొరగా జరగుతోంది. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల నీరే దిక్కవుతోంది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. నీటి సరఫరాను పెంచడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రధానంగా నీటి సమస్య చర్చనీయాంశంగా మారింది. శివార్లలో రెండు, మూడురోజులకోసారి సరఫరా దృష్టిసారించని అధికారులు -
ఊరూరా ఇక గ్రంథాలయం
సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీపరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. అంతకు ముందు దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సర్వం సిద్ధం చేసిన అధికారులు సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పరీపక్షల నిర్వహణ కోసం సీఎస్, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్ బృందాలను నియామకం చేసి ఇప్పటికే వారికి అవగాహన సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి చెప్పారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల్లో చేర్చిన ఇంటర్బోర్డునారాయణఖేడ్: ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కళాశాల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు కట్టుదిట్టమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు, ఎకై ్సజ్, విద్యాసంస్థలు కలిసి పని చేస్తున్నాయి. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈగల్ టీంను సైతం ఏర్పాటు చేశాయి. కళాశాలలు, హోటళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ ప్రమాదాలపై సెమినా ర్లు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు
● పసిడే లక్ష్యంగా ఇళ్లలో చోరీలు ● పేట్రేగిపోతున్న చైన్స్నాచర్స్ ● హత్య చేసేందుకు సైతం వెనుకాడని నేరగాళ్లు బంగారం విలువ పెరుగుతుండటంతో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం ఇప్పుడు నేరగాళ్లకు ప్రధాన టార్గెట్గా మారింది. ఇంట్లో బంగారం ఉన్నా.. బయటకు నగలు ధరించి వెళ్లినా.. సామాన్యుల్లో ఆందోళన ఎక్కువైంది. సాధారణంగా ప్రతీ మహిళ మెడలో మంగళసూత్రంతో పాటు బంగారు గొలుసు ఉంటాయి. ఇలాంటి తరుణంలో మహిళలే టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. – సాక్షి, సిద్దిపేట బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం కాలంగా ధరలు పెరుగుతున్నాయి. ఇదే నేరగాళ్లకు పెద్ద టార్గెట్గా మారింది. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశ, ఈజీ మనీ మోజుతో నేరాలకు పాల్పడుతున్నారు. బంగారం దొపిడీకి పాల్పడిన తర్వాత సదరు వ్యక్తులను హత్య చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నిఘా అవసరం చోరీ సొమ్మును వెంటనే నగదుగా మార్చుకునేందుకు కొందరు అక్రమ కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. బిల్లులు లేకుండానే బంగారం కొనుగోలు చేసే షాప్లు నేరాలకు పాల్పడే వారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థపై కఠి న నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు.జాగ్రత్తలు తప్పనిసరి ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంది. మహిళలు, వృద్ధులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనుమానిత వ్యక్తులతో మాట్లాడకూడదు. మాటలతో నమ్మించే అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేసి సమాచారం అందించాలి. –రష్మీ పెరుమాళ్, సీపీ -
ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తూ..
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని నూతన కాలనీల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నప్పటికీ కొన్ని కాలనీల్లో ‘భగీరథ’ నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని కాలనీల్లో భగీరథ పైపులైన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిలాన్ గార్డెన్స్, మహిళా డిగ్రీ కళాశాల, ఎల్లంకి కళాశాల పరిసర ప్రాంతాల్లో భగీరథ నీరు లేకపోవడంతో ప్రజలు ప్రయివేటు వాటర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. రూ.80కోట్లతో అమృత్ పథకం కింద కొత్తగా మిషన్ భగీరథ పనులు చేపట్టారు. పైపులైన్ పనులు పూర్తి అయినప్పటికీ ఇళ్లకు కనెక్షన్ ఇవ్వడంపై జాప్యం జరుగుతోంది. -
డబుల్బెడ్రూం కాలనీల్లో తప్పని గోస
దుబ్బాక: మున్సిపాలిటీలో ప్రధానంగా డబుల్బెడ్రూం కాలనీల్లో నీటిఎద్దడి నెలకొంది. కాలనీల్లో సుమారు 900 కుటుంబాలు నివసిస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతున్నప్పటికీ చాలా కాలనీలకు సరిపడా నీళ్లు రావడం లేదు. జీప్లస్ టూ పద్ధతిలో డబుల్ బెడ్రూంల నిర్మాణం ఉండటంతో పైన ఉన్నవారికి తిప్పలు అన్నీ ఇన్నీకావు. నీటిగోస తీర్చేందుకు ఇటీవలనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోర్లు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 3 వేలకు పైగా జనాభా ఉన్న డబుల్ బెడ్రూం కాలనీల్లో మంచినీటి ఎద్దడి తీర్చాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
దున్నపోతుతో రైతుల నిరసన
తొగుట(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దు తిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తొగుట మండల కేంద్రంలో మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దున్నపోతుతో ర్యాలీ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దున్నపోతును కార్యాలయంలోకి తీసుకెళ్లి అధికారుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి తదితరులు సంఘీభావం తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. -
జై హనుమాన్
● ఘనంగా జయంతి ఉత్సవాలు ● శ్రీరామ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అన్ని హనుమాన్ ఆలయాలలో మంగళవారం భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారులు దీక్ష విరమించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పంచవటిలో హరీశ్రావు పూజలు జిల్లా కేంద్రం రంగధాంపల్లిలోని పంచవటి హనుమాన్ ఆలయంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు, అర్చకులు హరీశ్రావుకు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. -
పొద్దుతిరుగుడు, మక్కలు కొనేలా చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): నిలిచిపోయిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు భరోసా కల్పించారు. మంగళవారం మిరుదొడ్డిలోని పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా కొనుగోళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దళారులను ఆశ్రయించి క్వింటాలుకు సుమారు రూ.3 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. రైతుల సమస్యలను తెలుసుకున్న కోదండరెడ్డి స్పందిస్తూ పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
కొత్త కాలనీలకు నల్లా నీరేదీ?
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని కొత్త కాలనీలకు ఇంకా ‘మిషన్ భగీరథ’ నల్లా నీరు అందడం లేదు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడే ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభించిన సంగతి తెల్సిందే. మున్సిపాలిటీలో ‘మిషన్ భగరీథ’ ద్వారా నిత్యం 39లక్ష లీటర్ల మంచినీటి సరఫరా చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం కలిపి రెండుసార్లు 78లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయడం లక్ష్యం కాగా ప్రస్తుత వేసవిలో సరిపడా మంచినీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా పట్టణ ప్రజలకు దాహార్తి తీరడం లేదు. మరోవైపు కొత్త కాలనీల్లో నల్లా నీరు సరఫరా వ్యవస్థ లేదు. దీంతో ఏడాదిగా ఇక్కడ రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆయా కాలనీల్లో పైపులైన్ పనులు చేపట్టి నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేశారు. ఫలితంగా మంచినీటికి ఇక్కట్లు తప్పడం లేదు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం ● క్షేత్రస్థాయిలో పరిశీలన చిన్నకోడూరు(సిద్దిపేట): రైస్ మిల్లర్లు వరి ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని, మిల్లులకు వచ్చిన వాహనాలు 12 గంటల లోపే దిగుమతి చేయాలని కలెక్టర్ హైమావతి మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని రామునిపట్ల, మల్లారం గ్రామాల్లోని రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలంటే మిల్లులకు పంపించిన ధాన్యాన్ని దిగుమతిలో జాప్యం చేయవద్దన్నారు. ఇందుకు ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోజూ 30 మంది ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతి కాగానే ట్రక్ షీట్ జనరేట్, ఓపీఎంఎస్ అప్లోడ్ పెండిగ్ ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. దిగుమతిలో జాప్యం రాకుండా రెవెన్యూ అధికారులను నియమించినట్లు అన్నారు. ఆమె వెంట జిల్లా సవిల్ సప్లై అధికారి తనూజ, జిల్లా తూనికల కొలతల అధికారి శివరంజని, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెండు రోజులకోసారి 10 బిందల నీళ్లే..
హుస్నాబాద్: మండుతున్న ఎండలకు మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. 7,228 మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న మహ్మదాపూర్ సంపు నుంచి రోజూ 2.4 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు రోజులకోసారి మున్సిపల్ అధికారులు నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత సరఫరా చేస్తుండటంతో చాలా మంది పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అవికూడా 10 నుంచి 15 బిందెల వరకే నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు తాగడానికి, ఇంటి అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల నీటి అవసరాల మేరకు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంక్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పట్టణం విస్తరిస్తుండటం.. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. చాలా మంది మినరల్ వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి నీటిని కొని తెచ్చుకుంటున్నారు. వేసవి కాలంలో రోజూ నీటి సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు..
● కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత ఇద్దరు కలిసి స్థల విక్రయం గురించి మాట్లాడుదామని ఈ నెల 2న కారులో వ్యాపారి విశ్వనాథంను తీసుకెళ్లారు. అతన్ని హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని మృతదేహాన్ని ఇమాంబాద్ కాలువ వద్ద పడేశారు. అంతకంటే ముందు వీరు గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ● ఏప్రిల్ 30న బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని నాగమణి అనే మహిళ అస్వస్థకు గురైనట్లు నటించి పక్కనే ఉన్న మహిళ బ్యాగులోంచి ఏడున్నర తులాల బంగారు నగలను అపహరించింది. వెంటనే సదరు మహిళ చేర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ● ఈ నెల 11న చేర్యాల పట్టణం గట్టుతోటలో పిట్టల శ్రీనివాస్ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ● మెదక్ జిల్లా ఏడుపాయల టీ జంక్షన్ సమీపంలో చేపల దుకాణాన్ని బోల ఎగొండ–లావణ్యలు నడుపుతున్నారు. ఈ నెల 11న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు. స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి లావణ్య మెడలో ఉన్న పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
నంగునూరు(సిద్దిపేట): పాలిసెట్కు సర్వం సిద్ధం చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ వెటర్నరీ కోర్సులో ప్రవేశాల కోసం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 1.30 వరకు పరీక్ష జరుగుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,037 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్లో కలిపి మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉందని, ఓఎంఆర్ షీట్కు రెండు వైపులా విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎప్సెట్ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొదటగా అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించారు. సీబీటీ విధానంలో జరిగిన పరీక్షకు సోమవారం ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు గాను 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు 48 మంది హాజరయ్యారు. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ సింగిత్సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) పనులపై కదలిక వచ్చింది. యూఐడీఎఫ్ ప్రారంభానికి పట్టిన రాజకీయ గ్రహణంపై ‘సాక్షి’లో ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలో కదలిక మొదలైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హైదరాబాద్లోని యూఐడీఎఫ్ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)ని కలిశారు. టెండర్లను వెంటనే ఓపెన్ చేసి, వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఈఎన్సీ తగు చర్యలకు హామీ ఇచ్చారు. యూఐడీఎఫ్ పనులకు ఇక ఆటంకాలు తొలిగిపోయినట్లయ్యింది. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటో తరగతిలో ఆరు ఖాళీలకు గాను అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 18 న సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయంలో అందించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్శర్మ ఆధ్వర్యంలో బొడ్రాయి, పోతలింగేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కనకవ్వ, నేతలు నవీన్కుమార్, నరేందర్, అమరేందర్, పాండురంగం, భూములుగౌడ్, రాములు, శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
పైసలేవీ?
ఎన్నికల● ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా రాని డబ్బులు ● నాడు అప్పులు తెచ్చి పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన అయోమయంలో పంచాయతీ కార్యదర్శులుగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన డబ్బులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు దాదాపు రూ.5.07 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.4 కోట్లే చెల్లించారు. ఇంకో రూ.కోటి వరకు చెల్లింపులు పెండింగ్లో ఉండగా, అందులో ఎక్కువ భాగం గ్రామ పంచాయతీ కార్యదర్శులకే ఉండటం గమనార్హం. మరో పది రోజుల్లో కార్యదర్శులకు బదిలీలు ఉండటంతో పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మూడు దశలలో డిసెంబర్11, 14, 17వ తేదీలలో 508 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాయి. ఓ గ్రామ పంచాయతీలో 12 వార్డులున్న వాటికి దాదాపు 50 మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. వారికి ముందు రోజు బస, భోజనం, పోలింగ్ నాడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీలను పంచాయతీ కార్యదర్శులే ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో టెంట్లు కుర్చీలు, టేబుల్స్ సమకూర్చారు. ఇందుకు దాదాపు రూ.25వేలు వెచ్చించారు. కానీ ఆ కార్యదర్శికి ఇప్పటి వరకు మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) రూ. 10వేలు అందించారు. అదే చిన్న గ్రామ పంచాయతీలకు రూ.18వేలు ఖర్చు అయితే రూ.8వేలు చెల్లించారు. అదేమంటే, ఇంకా నిధులు రావాల్సి ఉందని సమాధానం చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు మండలాల పరిఽధిలో పలువురు వీడియో గ్రాఫర్లకు సైతం డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. మరో పది రోజుల్లో బదిలీలు జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులు వస్తాయా? లేదా? అని వారు అందోళన చెందుతున్నారు. కొందరు జీతం డబ్బుల, మరికొందరు అప్పు తెచ్చి ఎన్నికల నిర్వహణ కోసం వెచ్చించారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నారు. బదిలీలు అయితే డబ్బులు ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఎన్నికల నిర్వహణలో పని చేసివారు కోరుతున్నారు.ఎంపీడీఓల ఆధ్వర్యంలోనే పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కనుక వారికి డబ్బులు ఎప్పుడు ఇచ్చినా ఏమీ కాదు అనే ధోరణిలో పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద మండలాలకు ఎక్కువ, చిన్నవైతే తక్కువ మొత్తాన్ని ఉన్నతాధికారులు ఎంపీడీఓల ఖాతాలలో జమ చేశారు. పంచాయతీ వారీగా విభజిస్తే అర కొర నిధులే వచ్చాయి. పోలింగ్ ఖర్చుల వివరాలను బిల్లులతో సహా పంచాయతీ కార్యదర్వులు ఐదు నెలల కిందటే ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించారు. ఎన్నికల నిర్వహణ కోసం రూ.5.07 కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వం నుంచి రూ.4కోట్లు వచ్చాయి. ఇంకా రూ.1.07కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల కాగానే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగనున్నాయి. – రవీందర్, ఇన్చార్జి డీపీఓ -
జన గణన ప్రక్రియ షురూ..
సాక్షి, సిద్దిపేట: జనాభా గణన–2027 ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. సామాజిక ఆర్థిక సర్వే –2024 ప్రకారం జిల్లాలో 3.31లక్షల కుటుంబాలు ఉండగా 2041 బ్లాక్లుగా విభజించారు. జన గణన కోసం ఎన్యూమరేటర్లు 1,970 మంది, సూపర్వైజర్ల 345 మందిని, ఛార్జ్ సెన్సెస్ అధికారులను 31 మందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణను ఇచ్చారు. ఈ గృహాల గుర్తింపు జూన్ 9వ తేదీ వరకు కానుంది. తొలి రోజు మ్యాపింగ్తో పాటు గృహాల గుర్తించారు. ఆ గృహాలకు నంబర్లును ఎన్యూమరేటర్లు రాశారు. స్వీయ గణనను జిల్లాలో దాదాపు 22వేల కుటుంబాలు వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 2027లో జనాభా గణనను చే పట్టనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు దాదాపు 150 ఇండ్లకు పైగా కేటాయించనున్నారు. ఎన్యూమరేటర్ మొబైల్ యాప్ ద్వారా డేటాను నమోదు చేయనున్నారు. కేవలం నివాసాలే కాకుండా ... కమర్షియల్ భవనాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కాలేజీ ఇలా అన్నింటిని సర్వేలో కవర్ చేయనున్నారు. తొలి రోజు గృహాల మ్యాపింగ్, గుర్తింపు జూన్ 9వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం స్వీయ గణన చేసుకున్న 22వేల కుటుంబాలు సిద్దిపేటఅర్బన్: మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటింటి సర్వే ప్రక్రియను సర్పంచ్లు ప్రారంభించారు. సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు ఆయా గ్రామాలలో తొలి రోజు సర్వే నిర్వహించారు. జనగణనలో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ వివరాలను డిజిటల్ విధానంలో సేకరించనున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ● హాజరు కానున్న 9,142 మంది విద్యార్థులు సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ విద్యాధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోశించనున్న సీఎస్, డీఓలకు సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ఫస్టియర్లో 654, సెకండియర్లో 3,488 మంది మొత్తం 9,142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్న 12గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా గదుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరీక్షల కమిటీ సభ్యులు జ్యోతి, గంగాధర్, దేవయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లుసిద్దిపేటకమాన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద 163బీ ఎన్ఎస్ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. కేంద్రాల సమీపంలో ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండకూడదన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటకమాన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో జిల్లాలో మొత్తం 94 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు మహిళా కేటగిరిలో ఇచ్చే వాహనాలను ఇవ్వడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకువచ్చిన కూడా వాహనాలు ఇవ్వకపోవడం విడ్డూరం. సంబంధిత అధికారులు వాహనాలు ఇప్పించాలి. – బర్ల సత్యనారాయణ, పొన్నాల -
జై శ్రీరాం.. జై హనుమాన్
అనంతసాగర్లోఆలయంలో తహసీల్దార్ నిర్మల, దళితులుగజ్వేల్: జగదేవ్పూర్ మండలం అనంతసాగర్లో దళితులను దుర్గమ్మ ఆలయ బోనాల కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో దళితులచే ఆలయ ప్రవేశం చేయించారు. కులవివక్షత చట్టరీత్య నేరమని, అంతా కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరులో సోమవారం హనుమాన్ మాలధారులు, భక్తులు భారీ హనుమాన్ విగ్రహంతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ.. జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల ఆలయ ప్రవేశం -
పనిచేసే వారికే పదవులు
కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాజ భద్రయ్య ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతీ కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ బందెల రాజ భద్రయ్య అన్నారు. సోమవారం సిద్దిపేటలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ పోస్టుకు దరఖాస్తులను స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజభద్రయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొనసాగిన కొమ్ము విజయ్కుమార్తో పాటు 26 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తులను పార్టీ స్టేట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేస్తామని, పరిశీలించి నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పత్తి కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లపై పర్యవేక్షణ తప్పనిసరి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● అధికారులతో టెలీకాన్ఫరెన్స్ హుస్నాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండటంతో అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. మిల్లుల వద్ద, ధాన్యం తరలింపులో వాహనాల సమస్య, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం అధికంగా వచ్చే కేంద్రాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక నుంచి రోజు విడిచి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఎస్ఓలు, డీఎం, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే పది రోజులు అత్యంత కీలకం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: వచ్చేపది రోజులు అత్యంత కీలకమని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సివిల్ సప్లై, డీఆర్డీఏ, పీఏసీఎస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని లిఫ్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. లారీల కొరత లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఎం మార్కెటింగ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా లాగ్ బుక్ పరిశీలించి, విజిటర్ రిజిస్టర్లో సంతకం చేశారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీసు అధికారుల బందోబస్తు గురించి ఆరా తీశారు. ఈవీఎం గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. -
జనగణనలో భాగస్వాములు కండి
● సిబ్బందికి సహకరించాలి ● నేటినుంచి ఇంటింటికీ ఎన్యూమరేటర్లు ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: జనగణన ప్రక్రియ చాలా కీలకమని, ఇందులో భాగస్వామ్యం అయ్యే బాధ్యత ప్రతి ఒక్కరిదని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల మైదానంలో మొదటి దశ జనగణనపై అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కచ్చితమైన గణాంకాల రూపకల్పనకు జనగణన కీలకమన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మన దేశంలో జనగణన జరుగుతోందన్నారు. కోవిడ్ కారణంగా 2021లో జరగలేదని, స్వాతంత్య్ర సిద్ధించిన తరువాత ఇది 16వ జనగణన అని అన్నారు. మన రాష్ట్రంలో ఇది మొదటి జనగణన అని, మొదటి సారిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 10తో స్వీయగణన పూర్తి అయ్యిందని, సోమవారం నుంచి జిల్లాలో ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. వారికి శిక్షణ అందించినట్లు, ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. జనగణన పేరిట ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్లో పొందిపర్చిన వారి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. ఈ ర్యాలీ ముస్తాబాద్ చౌరస్తా, మెదక్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, అధికారులు హమీద్, రామస్వామి, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానమే వర్తింపజేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం హేయమైన చర్య అని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ(2003) ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మాత్రం అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి -
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
ప్రధాని మోదీ ● వర్చువల్గా స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన ● సభకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు జహీరాబాద్/ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ ప్రాంతం భవిష్యత్తులో పారిశ్రామిక పట్టణంగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో జహీరాబాద్ స్మార్ట్ సిటీ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్లోని నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ ప్రాంతం నిర్మాణం వెనుక ఇదే లక్ష్యం ఉందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ వికసితానికి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల వాటా ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. నాణ్యవంతమైన విద్యుత్ సరఫరా, అత్యాధునిక హైసిటీ నెట్వర్క్ కూడా ఉండనుందన్నారు. దేశవ్యాప్తంగా ఉండే పరిశ్రమల అవసరాల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ తయారుకానున్నాయని తెలిపారు. ఇలాంటి సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేలకోట్లు అవసరమవుతాయని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ ప్రాంతంలోని వేలాది యువకులకు జహీరాబాద్ ప్రాంతం జాబ్ హబ్గా తయారుకానుందని వివరించారు. నిమ్జ్లో తయారయ్యే వాహనాలు, యంత్రాలతోపాటు ఇక్కడ ఉండే ఆహారశుద్ధి ఉద్యోగులకు, తెలంగాణలోని కార్మికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుందన్నారు. ఝరాసంగం–న్యాల్కల్ పరిధిలో స్మార్ట్సిటీ ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలో స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. ఝరాసంగం మండలంలోని మూడు గ్రామాలు,న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల పరిధిలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక వేగంగా స్మార్ట్సిటీ పనులునిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మార్ట్ సిటీ పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఇక పనుల్లో జోరు పెరగనుంది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,369 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్ట నున్నారు. హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్లో భాగంగా పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రకటించింది. బర్దిపూర్లో ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, ఆర్డీఓ దేవుజా, జోనల్ మేనేజర్ విఠల్, రూరల్ సీఐ హనుమంతు, ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేనేజర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన అష్టావధానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని లలిత చంద్రమౌళీశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం అలరించింది. అవధాని శరత్కుమార్ శర్మ పద్యాలతో ఆకట్టుకున్నారు. పృచ్చకులుగా నిషిద్ధాక్షరి పెందోట వెంకటేశ్వర్లు, వర్ణన ఉండ్రాళ్ల రాజేశం, సమస్య కాల్వ రాజయ్య, దత్తపది దుడుగు నాగలత, ఆశువు మచ్చ అనురాధ, వ్యస్తాక్షరి నల్ల అశోక్ తదితరులు అడిగిన అంశాలపై వజ్జల శరత్ కుమార్ శర్మ పద్యాలు అప్పటికప్పుడే చెప్పారు. తెలుగు భాషలో అవధానం గొప్పదని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న టీఎస్ఎప్సెట్ ఇంజినీరింగ్ పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు 52 మందికి 52 మంది హాజరయ్యారు. పరీక్షలను ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ సింగిత్ సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు గజ్వేల్రూరల్: కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేలా లేబర్ కోడ్లు ఉన్నాయని, వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్కోడ్లు వ్యతిరేకిస్తూ, నూతనంగా నోటిఫై చేసిన రూల్స్ ప్రతులను ఆదివారం గజ్వేల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన కోడ్ల వల్ల కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పోతాయని, పనిగంటల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కరువవుతుందని అన్నారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకొని కార్మికులకు మేలు చేసేలా చట్టాలను రూపొందించాలని, లేనిపక్షంలో కార్మికవర్గం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, నాయకులు బండ్ల స్వామి, వేణుగోపాల్, సుధాకర్, చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రావు, భూపతి, పర్శరాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తాగు నీరు వృథా చిన్నకోడూరు (సిద్దిపేట): మండలంలోని మెట్టుబండల నుంచి చంద్లాపూర్ వెళ్లే రహదారి పక్కన పైపులైన్ లీకేజీ అయి తాగు నీరు వృథాగా పోతోంది. అరికట్టాల్సిన యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. లీకేజీలతో నీరు కలుషితమై అదే నీరు ప్రజలు తాగుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థినికి రూ.లక్ష బహుమతి సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మోకు హారిక ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించిన లక్ష రూపాయల నగదు బహుమతికి ఎంపికై నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 994 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ఆ విద్యార్థినికి పారితోషికాన్ని అందించి సన్మానిస్తారని తెలిపారు. హారికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించాలని పిలుపునిచ్చారు. -
మార్మోగిన మల్లన్న ఆలయం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. శనివారం సాయంత్రమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ, ప్రయివేటు వసతి గదులలో బసచేశారు. వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కొంత మంది గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడు పులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు స్తంభం వద్ద కోడెలను కట్టారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.కొమురవెల్లిలో భక్తుల సందడి -
నల్ల బ్యాడ్జీలతో బీసీ నేతల నిరసన
హుస్నాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయకపోవడంపై బీసీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షేడ్యూల్లో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణను చేర్చి లెక్కించాలన్నారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు బీసీ రక్షణ చట్టం చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పునః సమీక్షించి, మండల్ కమిషన్ సిఫార్సులను అమలతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కాంగ్రెస్ నాయకులు వడ్డెపల్లి రమణ, హస్సెన్, శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు వరప్రసాద్, రమేష్, రాజు, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
వేణుగోపాలునికి ఘటాభిషేకం
వర్గల్ కోవెలలో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం వర్గల్(గజ్వేల్): భక్తజనావళికి ఆధ్యాత్మిక పంచిన వర్గల్ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘటాభిషేకం, చక్రతీర్థంతో ముగిశాయి. అర్చకులు ఆలయ ముఖమండపంలో వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. కలశాలు స్థాపన, కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో మూలవిరాట్టులకు మంత్రోక్తంగా ఘట కలశాభిషేకం నిర్వహించారు. దేవతామూర్తులను సర్వాలంకారశోభితులుగా అలంకరించారు. వసంతోత్సవం, కోనేరులో చక్రతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. వేడుకలలో భక్తజనులు పాల్గొని తరించారు. -
హైందవ ధర్మాన్ని మరవద్దు
● ఎంపీ మాధవనేని రఘునందన్రావు ● దుబ్బాకలో హిందూ మహాసమ్మేళనం దుబ్బాక: పాశ్చత్యసంస్కృతి మోజులో పడి మన హిందూ ధర్మాన్ని మరచిపోవద్దని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. శనివారం రాత్రి దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని అనుసరిస్తుంటే మనం దూరం అవుతుండడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం ప్రపంచానికే నడవడిక నేర్పిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే గొప్పగా నిలిచిందన్నారు. హిందువుగా పుట్టడడం మన అదృష్టమన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మ రక్షణకు ప్రతి భారతీయుడు పాటు పడాలన్నారు. దుబ్బాకలో హిందు మహా సమ్మేళనం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ జీ, హిందూ ఽమహాసమ్మేళనం అధ్యక్షులు చింత రాజు, వడ్లకొండ శ్రీధర్, రొట్టె రాజమౌళి తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్ తరహాలో ఇక్కడా..
సిద్దిపేటజోన్: హైదరాబాద్ తరహాలో త్వరలో సిద్దిపేట శ్రీరామకుంట శ్మశానవాటికలో గ్యాస్ ఆధారిత మిషన్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం శ్రీరాంకుంట వైకుంఠధామాన్ని ఆయన పరిశీలించారు. పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలపై అరా తీశారు. చలికాలంలో వేడి నీరు రావడం లేదని వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరింత ఉన్నతంగా ఎదగాలి.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని హరీశ్రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగారెడ్డిపల్లికి చెందిన ప్రియాంక ఇంటర్ ఫలితాల్లో 991మార్కులు సాధించిన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి బలరాంను అభినందించారు. డాక్టరేట్ పొందడం సిద్దిపేట ప్రజలందరికి గర్వకారణమన్నారు. -
స్వీయగణన అంతంతే!
● జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మందే నమోదు ● నేటితో ముగియనున్న గడువు ● రేపటి నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ షురూ.. సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జన గణన చేపడుతోంది. ఇందుకోసం అన్ని సిద్ధం చేస్తోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించకముందే ప్రజలు ఆన్లైన్లో వివరాలు సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కల్పించారు. కానీ స్వీయ గణనకు స్పందన అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటి వరకు 11,115 కుటుంబాలు మాత్రమే ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. ప్రజలకు స్వీయ గణనపై సరైనా అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు దీనిని వినియోగించుకోలేదని తెలుస్తోంది. 3.31 లక్షల కుటుంబాలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ–రాజకీయ, కుల సర్వే(ఎస్ఈఈఈపీసీ–2024) వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,31,438 కుటుంబాలున్నాయి. 10,30,453 జనాభా ఉన్నారు. జనాభా గణన–2027 కోసం జిల్లా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు 1,970, సూపర్వైజర్లు 345 మందికి శిక్షణ పూర్తి అయింది. వీరు రేపటి (ఈ నెల11 తేదీ) నుంచి జూన్ 9వ తేదీ వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో స్వీయ గణనను చేసుకోని గృహాల గుర్తింపును చేయనున్నారు. 3.5 శాతం మాత్రమే.. స్వీయగణనపై జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంది. జిల్లాలో 3.31లక్షల కుటుంబాలుంటే కేవలం 3.5 శాతం మంది మాత్రమే స్వీయ గణన చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల కుటుంబాలే దాదాపు 6వేలకుపైగా ఉంటారు. విద్యావంతులు, రాజకీయ నాయకులు చాలా వరకు ఉంటారు. కానీ పలువురి నిర్లక్ష్యమా.. లేదంటే తెలియక ముందుకు రాలేదా అని తెలుస్తోంది.నేడు ఆఖరు స్వీయ గణన ఆదివారంతో ముగియనుంది. స్వీయ గణన నమోదులో సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబరు 1855లో సంప్రదించాలి. ఎవరికి వారు మాతృబాషలోనూ వివరాలు పొందుపర్చొచ్చు. యజమాని పేరు తప్పుగా రాయొద్దు.డిజిటల్ పద్ధతిలో.. దేశ వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జన గణన జరగనుంది. మొదట ఇళ్ల గుర్తించి జాబితాను సిద్ధం చేస్తారు. తర్వాత జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దీనిని పర్యవేక్షించేందకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో బాధ్యులను నియమించారు. స్మార్ట్ ఫోన్లలో జనగణన యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నమోదు చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో.. ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేయనున్నారు. వివరాలన్నింటిని యాప్లోనే నిక్షిప్తం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం చాలా తక్కువ కనుక ఆఫ్లైన్ నమోదుకు సైతం అవకాశం కల్పించింది.పకడ్బందీగా ప్రక్రియ ఇప్పటికే ఎన్యూమరేటర్ల శిక్షణ పూర్తి అయింది. స్వీయగణన ఈ నెల 10న ముగియనుంది. ఈ నెల 11 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పకడ్బందీగా చేపడతాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేయనున్నారు. – రాజ్కుమార్, ఏఓ, కలెక్టరేట్ -
ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం
● అట్టహాసంగా ప్రోమో రన్ ● హాజరైన న్యాయమూర్తి సంతోష్ కుమార్, అదనపు డీసీపీ సుభాష్సిద్దిపేటజోన్: ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కోమటిచెరువు పైన తెలంగాణ రన్నర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రోమో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ సంతోష్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరి వాకింగ్, రన్నింగ్, వ్యాయాయం, వంటి శారీరక కార్యకలాపాలు అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం, యువతను ఫిట్నెస్ వైపు ప్రోత్సాహించడం లక్ష్యంగా ప్రోమో రన్ ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. జూన్7న హైదరాబాద్ లో నిర్వహించనున్న అవంతిక తెలంగాణ రన్ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రోమో రన్ చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రోమో రన్ లో పెద్ద ఎత్తున రన్నర్స్, యువత, విద్యార్థులు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు జగన్ మోహన్రెడ్డి, రాజు,బాపురెడ్డి, రవి, సుజాత, హరి, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ప్రోత్సాహం.. సివిల్స్ సాకారం
పోలీస్ కమిషనర్ ఎస్ఎం రష్మీ పెరుమాళ్ ‘సాక్షి’తో అమ్మ అనుబంధాన్ని పంచుకున్న సీపీ సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’.. కరుణ, త్యాగానికి ప్రతిరూపమైన అమ్మ గొప్పతనం.. ఆ పిలుపులోని మాధుర్యం వెలకట్టలేనిది. ఆమె జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. తన బిడ్డలను ఉన్నత స్థితిలోనిలిపేందుకు అమ్మ పడే వేదన మాటలకందనిది. అందుకే అమ్మా.. అందుకో మా వందనం. సాక్షి, సిద్దిపేట: ‘సివిల్ సర్వీస్లోకి రావడం అమ్మ ప్రోత్సాహమే.. నాన్న ఆర్మీలో పని చేస్తున్న క్రమంలో టెర్రరిస్ట్ దాడిలో మృతి చెందారు. అప్పటి నుంచే అమ్మే ఇంటి బాధ్యతలు చేపట్టి ఇంతటి వారిని చేశారు.’ అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ఎం రష్మీ పెరుమాళ్ అన్నారు. మదర్స్ డే సందర్భంగా అమ్మతో అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. సీపీ మాటల్లోనే.. మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. నేను సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నది అమ్మ కోరిక. అమ్మ డ్రీమ్ను 2019లో నెరవేర్చా. సివిల్స్ సర్వీస్ కోసం ఐదు మార్లు రాశా. నాలుగు మార్లు మంచి ర్యాంక్ రాకున్నా అమ్మ నన్ను ప్రోత్సహించారు. ఐదో సారి 216 ర్యాంక్ రావడంతో అమ్మ సంతోషానికి హద్దులు లేవు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అంతా అమ్మ చలువే. మాది హైదరాబాద్.. అమ్మానాన్నలు గీతా, కల్నల్ మాధవ్ పెరుమాళ్. అన్నయ్య జయంత్. నాన్న ఇండియన్ ఆర్మీలో పని చేసేవారు. ఆర్మీలో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అస్సాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 2009లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మనే ఇంటి బాధ్యతలు చూశారు. అన్నయ్య, వదిన సైతం ఆర్మీలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఎక్కువ కాలం హాస్టల్లో ఉండి చదువుకున్నా. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చేసిన పప్పన్నం చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అమ్మ వండిన వంటలే ఇష్టంగా తింటున్నా. కరీంనగర్లో ప్రొబిషనరీ ఏసీపీగా, మంచిర్యాల, వైరా, కుషాయిగూడలలో ఏసీపీగా, అదనపు డీసీపీగా రాజేంద్రనగర్, నార్త్జోన్ డీసీపీగా అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చాను. -
రైతుల సమస్యలు పట్టని సర్కార్
● పొద్దుతిరుగుడు, మక్కలు కొనరేం ● మాజీ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి టైమ్ ఉంది.. కానీ రైతులకు గన్నీ సంచులు సరఫరా చేసేందుకు టైమ్ దొరకడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శనివారం చిన్నకోడూరులోని పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 40 రోజులుగా పొద్దు తిరుగుడు కొనలేదని రైతులు చెప్పడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్ చేసి, పొద్దు తిరుగుడు రైతు సమస్యలు వివరించారు. కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వివరించారు. కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హరీశ్రావు మాట్లాడుతూ కనీసం ఒక్కసారి ఏ పల్లెలోనైనా వడ్ల కుప్పల దగ్గరకు పోయి రైతుల బాధలు వినలేదన్నారు. మూసీ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలేదని, ఢిల్లీకి ఉత్తరాలు రాశామని కాలయాపన చేస్తున్నారే తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. నెలల తరబడి వడ్లు కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి పట్టడంలేదన్నారు. మూడు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని, యూరియా అడిగితే యాప్ అంటున్నారని, రైతులు పండించిన పంటలు కొనడంలేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ మూసీ, ఫ్యూచర్ సిటీ కోసం మీటింగ్లు పెడుతున్నారే తప్ప ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్ల మీద ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, శనిగలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. -
విహాన్రామ్కు డీజీపీ అభినందనలు
మద్దూరు(హుస్నాబాద్): అంతర్జాతీయ బాల పర్వతారోహకుడు మాస్టర్ జాటోత్ విహాన్రామ్ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. ఇటీవల అస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ కోషియాస్కోని విజయవంతంగా అధిరోహించడంతో హైదరాబాద్లోని తన కార్యాలయంలో విహాన్రామ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ ఇంత చిన్న వయస్సులో ఆఫ్రికాలోని కిలిమెంజోరో, హిమాచల్ ప్రదేశ్లోని పాతాల్సు, ఆస్ట్రేలియాలోని కోషియాస్కో పర్వతాలను అధిరోహించడం మన రాష్ట్రనికి దేశానికి గర్వకారణమని అన్నారు. మాదకద్రవ్యాలు వద్దు అనే నినాదంతో ఎంచుకోని పద్వతాలను అధిరోహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించినట్లు విహాన్రామ్ తండ్రి తిరుపతి తెలిపారు. ప్రశాంతంగా ఎప్సెట్సిద్దిపేటఅర్బన్: టీఎస్ఎప్సెట్లో భాగంగా ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్ష శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు గాను 50 మంది హాజరు కాగా మధ్యాహ్నం సెషన్కు 48 మంది హాజరయ్యారు. ఆదివారం, సోమవారం సైతం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ సింగిత్ సింగ్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. ఉద్యోగాల కల్పనలో మోదీ విఫలం హుస్నాబాద్: ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగామ రాజ్కుమార్ ఆరోపించారు. శనివారం అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో జరిగిన సమావేశంలో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రధాన హామీలు ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని రాజకీయ లాభాలు పొందడమే తప్ప కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి చేసింది ఏమీలేదన్నారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్, రేవతి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ట్రిపుల్ఐటీ దరఖాస్తుకు నేడే తుది గడువుసంగారెడ్డి క్రైమ్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని బాసర (ట్రిపుల్ ఐటీ)లో 2026–2027 విద్యా ఏడాది లో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. ఈ ఏడాది 180 సీట్లు కేటాయించారు. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సుల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన ప్రతిభ మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలను సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తులను మీసేవ, ఈ సేవ, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ,బీసీ అభ్యర్థులు దరఖాస్తు రూ.500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. విద్యార్థులు 2026 ఎస్ఎస్ఎస్సీ పరీక్షలు రెగ్యులర్లో ఉత్తీర్ణులై ఉండాలి. 10–05–2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. -
నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
నీటిపారుదల శాఖ ఎస్ఈ లక్ష్మణ్ మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నాయని జిల్లా నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్హౌస్ వద్ద నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్లు, కాల్వలు, పంపు హౌజ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయన్నారు. దీంతో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక సాగు విధానాలను అవలంభించాలన్నారు. రైతుల సంక్షేమం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యనిర్వహణాధికారి వీటీటీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సాగునీరు సమర్థవంతంగా అందించడంలో రైతుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. నీటి వినియోగంలో రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే నీటి వనరులను దీర్ఘకాలం సంరక్షించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీధర్, చండీరాం, భాస్కర్, జీవన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజన్ స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మన కర్తవ్యం
● 26 నుంచి రాష్ట్ర కమిటీ సమావేశాలు ● సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు సిద్దిపేటఅర్బన్: దేశంలో ఫాసిస్టు శక్తులు విస్తరిస్తున్న తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అతిముఖ్యమైన రాజకీయ కర్తవ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. స్థానిక కార్మిక, కర్షక భవన్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 26 నుంచి 28 వరకు జరగనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక శక్తులను సమీకరించి విశాల ఉద్యమాలను నిర్మించడమే లక్ష్యంగా ఈ సమావేశాల ఉద్దేశ్యమన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ శక్తుల బలోపేతం కోసం ఐక్యపోరాటాలు నిర్మించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయ రాఘవన్, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. సమావేశాల ఆహ్వాన సంఘం చైర్మన్గా చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఆముదాల మల్లారెడ్డి, కోశాధికారిగా గోపాలస్వామి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా మరో 17 మందిని ఎన్నుకున్నారు. -
ఉచిత సివిల్ శిక్షణకు ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా మైనా ర్టీశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు ఉన్న మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 14న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై నా వారికి హైదరాబాద్లో ఉచిత వసతి, భోజన సౌకర్యంతో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. బెజ్జంకి(సిద్దిపేట): తెలుగు ప్రపంచ సాహిత్య మహాసభల సమన్వయకర్తగా ప్రముఖ కవి ఆచార్యురాలు వెంకటరమణను నియమించినట్లు కళావేదిక జాతీయ అధ్యక్షుడు ప్రతాప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన వెంకటరమణ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయాచార్యులుగా పని చేస్తున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. వెంకటరమణకు అరుదైన గౌరవం ఇవ్వడంపై కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షుడు సంపత్కుమార్తో పాటు మండల సాహిత్య అభిమానులు అభినందించారు. విత్తనాల ఎంపికలో అప్రమత్తం వ్యవసాయ శాస్త్రవేత్త శ్వేత మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట): సాగులో విత్తనాల ఎంపిక చాలా కీలకమని, ప్రతి రైతుకు అవగాహన ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్త డా.శ్వేత అన్నారు. మిరుదొడ్డిలో శుక్రవారం నిర్వహించిన రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వానాకాలం సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కలిగించారు. అధిక మోతాదులో యూరియా వినియోగిస్తే భూ సారం దెబ్బతింటుందని, చీడపీడల బెడద ఎక్కువై దిగుబడులు తగ్గిపోతాయని చెప్పారు. ఉద్యానశాఖ అధికారి రమేశ్, సర్పంచ్ మహేశ్వరి, ఏఈఓలు ప్రశాంత్, అఖిల్, రేఖ, సమజాత తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నకోడూరు మండల పరిధిలోని రామునిపట్లలో సమతుల్య ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు ఉష, శంకరి మీనా, సెంథిల్వేల్ సేతుపతి అవగాహన కల్పించారు. పంట మార్పిడి చేస్తూ సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. నూనె గింజల పరిశోధనాసంస్థ అధికారి నిహారిక, ఏఈఓ స్వర్ణ పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్తో కలిసి ఇరిగేషన్ అధికారులతో జగ్గారెడ్డి సమావేశం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిజాంకాలం నాటి సాగునీటి కాలువ గంగకత్వ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువ మరమ్మతులకు రూ.42 కోట్లు మంజూరుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కాలువ ఆధునీకరణ చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి గతంలో తీసుకెళ్లడంతో ఈ పనులకు మోక్షం లభించింది. నీటి పారుదలశాఖ ఈ కాలువ ఆధునీకరణ పనుల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నీటి పారుదలశాఖ ఈ నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ పనులపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్తో కలిసి జగ్గారెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ గంగకత్వ కాలువ 11 గ్రామాల శివారుల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు పారుతుంది. దీనికి 33 ఫీడర్ చానల్లు ఉన్నాయి. ఈ కాలువను ఆధునీకరిస్తే అదనంగా మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పనుల్లో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపడతారు. కాలువపై అవసరం ఉన్న చోట్ల కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలకు, తూములను మరమ్మతులు చేస్తారు. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. -
సీజన్ ముగిశాక చేప పిల్లల పంపిణీయా?
ప్రభుత్వ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం సిద్దిపేటఅర్బన్: ఉచిత చేప పిల్లల పంపిణీని సకాలంలో చేపట్టాలని, వానాకాలం సీజన్ ముగిసే దశలో చేప పిల్లలను వదలడం ద్వారా తమకు ఏ ఉపయోగం ఉండదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ముదిరాజ్ ఫంక్షన్ హాలులో జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తుందో అధికారులు తెలియజేయకుండా చెప్పకుండా చెరువులు, కుంటలు, సొసైటీల, సభ్యుల లెక్కలు చెప్తే ఏం లాభమని వాపోయారు. గత సీజన్లో సరైన సమయంలో చెరువులు, కుంటలలో చేప పిల్లలను ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. ఈ సారైనా ప్రభుత్వం సకాలంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని, అన్ని చెరువులు, కుంటల్లో వదిలే విధంగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డీఏఓ స్వరూపరాణి మాట్లాడుతూ.. మత్స్యకారుల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, మత్స్య సొసైటీ సభ్యులు, నాయకులు జంగిటి శ్రీనివాస్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంజయ్యకు వరిష్ట పురస్కారం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత కొమురవెల్లి అంజయ్య వరిష్ట పురస్కారానికి ఎంపికయినట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సాహిత్యరంగంలో అంజయ్య చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు. 14న హైదరాబాద్లో రూ.20 వేల నగదు, జ్ఞాపికతో సన్మానించనున్నట్లు తెలిపారు. 11న పీఎం నేషనల్ అప్రెంటీస్ మేళామెదక్ కలెక్టరేట్: ఈనెల 11న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాలో జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 18యేళ్లు నిండి ఏదైనా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. -
కొత్త కనెక్షన్
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు టెన్షన్..సాక్షి, సిద్దిపేట: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఇక్కడి ప్రజలపై పడుతోంది. గ్యాస్ దిగుమతి అంతంత మాత్రంగా అవుతుండటంతో గ్యాస్ సంక్షభం ఏర్పడింది. కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచిపోయింది. ఫలితంగా వినియోగదారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,850 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక సిలిండర్ ఉన్నవారు డబుల్ సిలిండర్ కోసం యత్నిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వెబ్సైట్లో కొత్త కనెక్షన్లు, డబుల్ గ్యాస్ సిలిండర్ దరఖాస్తు ఆప్షన్ను మార్చి 11న క్లోజ్ చేశారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు దాదాపు 50 రోజుల నుంచి నిలిచిపోయాయి. గతంలో ఏ కంపెనీ ఏజెన్సీని సంప్రదించినా కనెక్షన్ వెంటనే మంజూరు చేసేవారు. నూతన కనెక్షన్ల మంజూరు కోసం ప్రత్యేక డ్రైవ్ను సైతం ఏర్నాటు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం లేదు సిద్దిపేట శివారులో ఇటీవల టిఫిన్ సెంటర్ను ప్రారంభించా. గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. కమర్షియల్ గ్యాస్ నూతన కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదు. ఇంట్లో వినియోగించే సిలిండర్ వినియోగిస్తే అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ హోటల్ను నిర్వహిస్తున్నాను. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరుతున్నా. –బైరి శ్రీనివాస్, పొన్నాలఆలస్యంగా డెలివరీ గ్యాస్ సిలిండర్ కోసం ఆన్లైన్లో బుక్ చేసినా డెలివరీ ఆలస్యమవుతోంది. గతంలో జిల్లాకు ప్రతి రోజు 15వేల గ్యాస్ సిలిండర్లో వచ్చేవి ఇప్పుడు దాదాపు 5వేల లోపే సిలిండర్లు దిగుమతి అవుతున్నాయి. బుక్ చేసిన వారం నుంచి 10 రోజులకు డెలివరీ అవుతోంది. దీంతో సింగిల్ సిలిండర్ ఉన్న వారు గ్యాస్ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. కొందరికి కట్టెల పొయ్యే దిక్కవుతోంది. -
చెక్పోస్టులు కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు: సీపీ సిద్దిపేటకమాన్: బక్రీద్ పండగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కమిషనరేట్ పరిధిలో చెక్పోస్టులు కట్టుదిట్టం చేసినట్లు సీపీ రష్మీపెరుమాళ్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం వెటర్నరీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ సమయంలో చట్ట విరుద్ధ రవాణా, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చెక్పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పశువుల రవాణాలో సంబంధిత పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీలు రవీందర్రెడ్డి, సుమన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ములుగు(గజ్వేల్): మండల కేంద్రమైన ములుగులో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రంజిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరీశ్, పోలీస్ శాఖల సిబ్బందితో కూడుకున్న బృందం గురువారం గ్రామానికి చేరుకున్నది. బాల్య వివాహం చేయడం ద్వారా జరిగే అనర్థాలు, చట్టాలపై ఇరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. బాలిక వయస్సు 16 ఏళ్ల కారణంగా యుక్త వయస్సు వచ్చేవరకు పెళ్లి చేయరాదని కుటుంబ సభ్యుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా రాసుకున్నారు. బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల ను అరికట్టేందుకు సహకరించాలని కోరారు. -
పదవుల జాతరే..
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లా వారికి అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పదవుల కోసం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్, మున్నూరుకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్గా హుస్నాబాద్కు చెందిన బొమ్మ శ్రీరాం నియమితులయ్యారు.ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు నియామక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. సుడా చైర్మన్ భర్తీ ఎప్పడో? జిల్లాకు చెందిన పలు చైర్మన్, డైరెక్టర్ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్తీ చేయలేదు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా), సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులను రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తే ఒక మారు పదవీకాలం ముగిసేది. మరికొందరికీ అవకాశం వచ్చేది. ఈ నామినేటెడ్ పోస్టులకు ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అలాగే త్వరలో ఖాళీ అయ్యే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులలో జిల్లాకు అవకాశం కల్పించాలని, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు విన్నవించుకున్నారు. పద్మశాలీల సంక్షేమానికి కృషి పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్గా సిద్దిపేటకు చెందిన గుడూరు శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేశారు. ప్రస్తుతం టీపీసీసీ చేనేత సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి కులస్తులను కలిసి అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల అభివృద్థికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా.. మున్నూకాపు సహకార కార్పొరేషన్ చైర్మన్గా హుస్నాబాద్కు చెందిన బొమ్మ శ్రీరాం చక్రవర్తి నియమితులయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ సొసైటీ చైర్మన్గా పని చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. మున్నూరుకాపు విద్యార్థుల కోసం హాస్టల్ను నిర్వహిస్తూ, సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నియామకంపై సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘం నాయకుడిగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దరిపల్లి చంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ దేవసేనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఎన్ఆర్కేఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడిగా దరిపల్లి చంద్రం కొనసాగుతున్నారు. కార్మిక సంఘం నాయకుడిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా అందరికీ సుపరిచితులు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా విధులు నిర్వహించిన కేడం లింగమూర్తి , హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజీనామా చేశారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాళీగా ఏర్పాడింది. దీంతో దరిపల్లి చంద్రంను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమయ్యారు. జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి చైర్మన్ నామినేటెడ్ పోస్టులు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా గుడూరు శ్రీనివాస్ ‘మున్నూరుకాపు’ చైర్మన్గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దరిపల్లి చంద్రం -
కలెక్టర్ హైమావతి
చేర్యాల(సిద్దిపేట): రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. మరోవైపు కొనుగోళ్లు వేగిరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు, వేచరేణి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు, వరి ధాన్యం ఒకేసారి వచ్చాయన్నారు. మూడు రోజుల్లో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని, అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతోనే ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో 30మంది న్యాయవాదులకు నిర్వహించిన 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మీడియేషన్ ద్వారా ఆస్తి తగాదాలతో పాటు తదితర కేసుల్లో న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, న్యాయవాదులు రవీందర్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి గోల్ షాట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు గోల్ షాట్బాల్ సెక్రటరీ మహేష్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు అక్షయ, అర్చన, కృపారాణి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను పీడీ సుజాత తదితరులు అభినందనలు తెలిపారు. ‘నాచగిరి’ నుంచి మృత్తిక సేకరణ వర్గల్(గజ్వేల్): భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ శాలగ్రామ ఆశ్రమంలో భూవరాహ యజ్ఞం కోసం గురువారం నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం నుంచి మృత్తిక(మట్టి) సేకరించారు. ఆలయ ఈఓ రంగాచారి, అర్చక పరివారం సమక్షంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణచైతన్యస్వామి ప్రాంగణంలోని చెట్టు వద్ద మృత్తికను సేకరించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు క్షేమం కాంక్షిస్తూ ఏరువాక పౌర్ణమి రోజున భూవరాహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణచైతన్యస్వామి అన్నారు. గడప గడపకు నరసింహం అనే మహోన్నత ఆశయంతో నిర్వహిస్తున్న యజ్ఞం కోసం ప్రముఖ పురాతన నరసింహస్వామి క్షేత్రాలను సందర్శించి మృత్తిక సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇరవై రోజులవుతున్నా కొనరేం?
హుస్నాబాద్: పట్టణంలోని ఆరపల్లె కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేయడంలేదంటూ రైతులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బుడిగ జంగాల కాలనీ రహదారిపై ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మరో వైపు లారీల కొరత వల్ల కేంద్రాల వద్ద ధాన్యం నిలువలు పెరిగిపోతున్నాయన్నారు. స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో సీఈఓ ప్రవీణ్ అక్కడికి చేరుకుని కొనుగోలు ప్రక్రియను వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి నంగునూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని, తాలు పేరిట దోపిడీకి పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముండ్రాయి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామం నుంచి రెండు లారీల వడ్లు ముండ్రాయి మిల్లుకు తరలిస్తే తాలు పేరిట క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధించారన్నారు. మిల్లర్లను అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని, డీఎస్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.రహదారిపై రైతుల ధర్నా బస్వాపూర్లో ఆకస్మిక తనిఖీ కోహెడరూరల్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, క్షేత్ర స్థాయిలో సమస్యలను వెంటనే ఎందుకు పరిష్కరించడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అక్కడికక్కడే కలెక్టర్ హైమవతికి ఫోన్ చేసి మాట్లాడారు. -
త్వరలో గ్రామ కమిటీలు
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సిద్దిపేటకమాన్: త్వరలోనే సిద్దిపేటకు వచ్చి గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం సిద్దిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని.. సిద్దిపేట ప్రజలు తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించాలని కోరారు. సామాజిక న్యాయం కోసమే .. మిరుదొడ్డి(దుబ్బాక): బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసమే టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) రాజకీయ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలోని లక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీని రానున్న కాలంలో మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో భాగస్వాములమవుతామన్నారు. -
పోలీసులంటే భయం వద్దు
● మీ కోసమే మేమున్నాం ● సీపీ రష్మీ పెరుమాళ్ ● కోహెడలో ‘మన పోలీస్–మన ఊరు’ కోహెడరూరల్(హుస్నాబాద్): పోలీసులు అంటే భయం వద్దని, మన కోసం పని చేస్తున్నారనే భావన ప్రజల్లో కలగాలని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె కోహెడలో ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీకి గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీపీ మట్లాడుతూ ఏప్రిల్ 1న ప్రారంభమైన మన పోలీస్–మన ఊరు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం, డ్రగ్స్, మద్యం వంటి సామాజిక సమస్యలపై పోలీసులకు వినతులు అందుతున్నాయని వీటిని గ్రామస్తుల సమక్షంలోనే పరిష్కరిస్తామని చెప్పారు. భద్రతకు ప్రాధాన్యం.. కోహెడ పోలీస్స్టేషన పరిధిలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటిన సీపీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని 27 గ్రామాలకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ మ్యాచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాస్ చంద్రబోస్, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, సర్పంచ్ సుజాత తదితరులు ఉన్నారు. -
పల్లె మురవలె
ప్రగతి మెరవలె..మన గ్రామాలు వెనుకబాటు● తాజాగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ● జిల్లా ఫ్రంట్ రన్నరప్గా ముద్దాపూర్ ● తొమ్మిది అంశాలలో జిల్లా టాప్ గ్రామాల వెల్లడి సాక్షి, సిద్దిపేట: మన పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది పంచాయతీ అభివృద్ధి సూచికను(పీఏఐ) విడుదల చేస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఏఐ 2.0ను ఇటీవల కేంద్ర గ్రామీణాబివృద్ధి శాఖ విడుదల చేసింది. జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క పంచాయతీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించలేదు. వచ్చే నివేదికలోనైనా జాతీయ, రాష్ట్ర స్థాయిలలో నిలిచేందుకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రంట్ రన్నర్గా.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలలో కుకునూరుపల్లి మండలం ముద్దాపూర్ పంచాయతీ 76.21 మార్కులు సాధించి జిల్లా ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా ముద్దాపూర్ 88.68 మార్కులు సాధించింది. గ్రామంలో 700 జనాభా ఉంటుంది. వ్యవసాయమే జీవనాధారంగా కొనసాగుతుంది. గ్రామంలో కూరగాయలు సైతం పండిస్తున్నారు. గతేడాది కేంద్ర బృందాలు పర్యటించి గ్రామాలను పరిశీలించాయి. 9అంశాలలో పరిశీలన తొమ్మిది అంశాలలో గ్రామాలను పరిశీలించారు. వర్షం నీటిని ఇంకించడం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం. పచ్చదనం ఏర్పాటు చేయడం. స్వయం సమృద్ధి సదుపాయాలను సమకూర్చుకోవడం. సామాజిక న్యాయం అమలు చేయడం, మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మొత్తంగా పంచాయతీ పాలన మెరుగ్గా ఉండేలా సర్పంచ్లు మరింత చొరవ తీసుకోవాలి. -
ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురండి
● తేమ శాతం తప్పనిసరి ● రైతులతో కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: ధాన్యాన్ని తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ హైమావతి రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ సందర్శించి మక్కలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టడం వల్ల అకాల వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్లో మక్కలు, ధాన్యానికి సరిపడా స్ధలం లేదన్నారు. వరి ధాన్యాన్ని మీకు దగ్గరలోని గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఏఎంసీలో పల్లపు ప్రాంతంలో ధాన్యం ఆరబెట్టకుండా ఫ్లక్సీలు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. ఆగిన కొనుగోళ్లు.. రోడ్డెక్కిన రైతులు మిరుదొడ్డి(దుబ్బాక): చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డు వద్ద నిర్వహిస్తున్న వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. పది రోజులుగా కొనుగోళ్లు పూర్తిగా నెమ్మదించడంతో రోజుల తరబడి ఎండలో నానా అవస్థలు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. అకాల వర్షాల వచ్చి ధాన్యం తడిస్తే ఎవరి బాధ్యత అంటూ రైతులు అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ ఆందోళన వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే క్రమంలో పోలీసులకు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కలెక్టర్తో సహా అధికారుల నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. కొనుగోళ్లు వేగవంతం చేయకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సుమారు గంట పాటు జరిగిన రైతుల ఆందోళనతో గజ్వేల్, మిరుదొడ్డి రహదారులకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే -
టీజీ20 లీగ్ నిలిపివేయండి
టీసీఏ అధ్యక్షుడు నరేందర్రెడ్డి సిద్దిపేటజోన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టీజీ20 ప్రీమియర్ లీగ్ను తక్షణమే నిలిపివేయాలి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నిబంధనలు అతిక్రమించిందని ఆరోపించారు. ముందస్తు అనుమతి లేకుండా టీ20 నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. యువ క్రీడాకారుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో ప్రతినిధులు బాలరాజు, ఉమాపతి, శ్రీనివాస్ హరి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటఅర్బన్: టీఎస్ఎప్సెట్ పరీక్షలో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు మంగళవారం ముగిశాయి. ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీబీటీ విధానంలో జరిగిన ప్రవేశ పరీక్షకు 50 మందికి గాను 49 మంది హాజరయ్యారు. అలాగే ఈ నెల 9 నుండి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ అప్సర్, పీఆర్వో రఘు, సిస్టం అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన కవియిత్రి ఎడ్ల లక్ష్మికి బాలసాహితి మూర్తి పురస్కారం వరించింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో పురస్కారం స్వీకరించినట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఎడ్ల లక్ష్మి రచించిన ‘వెన్నెల వెలుగులు’ పుస్తకావిష్కరణ జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి, వరప్రసాదరెడ్డి, పత్తిపాక మోహన్, గరిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతులు వరి, మొక్కజొన్న, పత్తి లాంటి సాంప్రదాయ పంటలే కాకుండా రైతులు హార్టికల్చర్, సెరికల్చర్ వైపు దృష్టి సారించాలని, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సబ్సిడీ వివరాలు, అధునాతన పద్ధతిలో సాగు, మల్బరీ, పట్టు పురుగుల పెంపకం ఆయిల్పామ్ పంటల గురించి వివరించారు. మల్బరీ సాగుతో నెల నెలా ఆదాయం వస్తుందని రైతులు ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. పంటల మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మహేందర్, ఉద్యాన శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు ఇంద్రసేనారెడ్డి, ఆయా శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సహకారం యథాతథం
దుబ్బాక: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. యథావిధిగా పాత పాలకవర్గాలే కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర స్పెషల్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ కో ఆపరేటీవ్ సొసైటీస్ ప్రసన్న పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మంగళవారం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా తమ తమ సహకార సంఘాల్లో బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘాలకు నామినేటేడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని కోర్టు తీర్పు నిచ్చింది. గత నవంబర్ నుంచి.. పీఏసీఎస్ల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబర్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యేంత వరకు కొనసాగించాలని తీర్పు నిచ్చింది. 6 నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కోర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్యతలు స్వీకరించారు.. 21 ప్రాథమిక సహకార సంఘాలు జిల్లాలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా జిల్లా ఏర్పాటు అయినప్పటికీ ఉమ్మడి మెదక్జిల్లా డీసీసీబీ పరిధిలోనే సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. జిల్లాల వారీగా డీసీసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పీఏసీఎస్లకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎన్నుకునే విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరు నెలల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ పాత పాలకవర్గాలనే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించడం చర్చనీయంశంగా మారింది. కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు వీరే.. సహకార శాఖ ఉత్తర్వులు జారీ బాధ్యతలు స్వీకరించిన సభ్యులు పాలక వర్గాల హర్షం హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం.. వెంటనే అమల్లోకి తేవడంతో పీఏసీఎస్ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసం, వైస్ చైర్మన్ కాల్వ నరేష్ తెలిపారు. -
డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదు
● ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారు ● మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గజ్వేల్రూరల్: రాజకీయాల్లో డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదని, ప్రళయాన్ని సృష్టించే శక్తి ప్రజలకే ఉందని మేడ్చల్–మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈనెల 10న సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మంగళవారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ డబ్బులు ఇస్తేగాని గెలవలేమనే ఈ రోజుల్లో తమిళనాడులో విజయ్ డ్రైవర్ కొడుకు గెలుపొందారని అన్నారు. రాజకీయాల్లో ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారనడానికి తమిళనాడు ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ... నియంతృత్వంగా వ్యవహరించే వారికి బెంగాల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపై విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీని ఓడించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే రేవంత్రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని, ప్రజాపాలన అంటే 32ఏళ్లుగా ఒకే పార్టీని ఆదరిస్తున్న గుజరాత్ రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశభద్రత కోసం ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఈనెల 10న పరేడ్గ్రౌండ్లో జరిగే ప్రధాని బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, పార్టీ నాయకులు, ఆయా మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు
హుస్నాబాద్: వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదమైన తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రికి హుస్నాబాద్ గీత కార్మికులు తాటి ముంజలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో తాటి ముంజలు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తాయన్నారు. ప్రభుత్వం తరుపున తాటి ముంజల మార్కెటింగ్కు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తాటి ముంజలు తిని ఆస్వాదించాలని కోరారు.మంత్రి పొన్నం ప్రభాకర్ -
డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు
● సీట్లు సైతం పెంపు ● ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రక్రియసిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత చెప్పారు. దోస్త్ ప్రక్రియ కొనసాగుతోందని విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం తమ అడ్మిషన్లకై వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సోమవారం కళాశాలలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రెండు నూతన అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ డిగ్రీ ప్రొగ్రాం(ఏఈడీపీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా బీఎస్సీ ఫార్మాస్యూటికల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీఎస్సీ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్(ఏఈడీపీ) కోర్సులను ఆసక్తిగల విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ లైఫ్సైన్సెస్లో మెడికల్ ఫిజియాలజీ అనే నూతన సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో సీట్లను సైతం పెంచినట్లు చెప్పారు. బీఏ(సీబీసీఎస్) ఇంగ్లిష్మీడియంలో ప్రస్తుతం ఉన్న 180 సీట్లతో పాటు మరో 60 సీట్లు, బీస్సీ ఫిజికల్ సైన్స్ (సీబీసీఎస్)లో 300ల సీట్లతో పాటు మరో 60 సీట్లు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం కళాశాలలో మొత్తం 1920 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల 7వరకు మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర అయోధ్యరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లాస్లో ‘ఆర్టీసీ’
ఉమ్మడి జిల్లాలో రూ.32 కోట్ల మేర నష్టాలు ● రెండు డిపోల పరిధిలో అత్యధికం ● అధికారుల దిద్దు‘బాట’మెదక్ కలెక్టరేట్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తోంది. గత ఫిబ్రవరి వరకు రూ.32 కోట్ల మేర నష్టాల్లో ఉంది. సంగారెడ్డి, నారాయణ్ఖేడ్ డిపోల పరిధిలో నష్టం అత్యధికంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 300 కోట్లు కేంద్ర ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నప్పటికీ గట్టెక్కడం లేదు. ప్రతి కిలోమీటర్కు రూ.62 రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 57.52 మాత్రమే వస్తున్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు సరిపోను లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా వారు సెలవులు పెడుతున్నారు. దీంతో కొన్ని రూట్లలో బస్సులను నడపడం లేదు. ఆదాయం వచ్చే మార్గాలపైన అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్టీసీ సంస్థ లాస్లో నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట కలిపి మొత్తం 9 డిపోలు ఉన్నాయి. సమ్మర్ టూర్లు.. తీర్థయాత్రలు ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికులకు ఆహ్లాదం, ఆధ్యాత్మికత కోసం టూర్లకు వెళ్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సైతం సమ్మర్ టూర్లో మెదక్ జిల్లాలోని ఏడుపాయల, ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చి, పోచారం అభయారణ్యం లాంటి ప్రదేశాలు చూపించాలని భావిస్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది సైతం ఈ ప్రణాళిక కొనసాగింది. ఈ ఏడాది సైతం అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ, రామప్ప ఆలయం తదితర ఆలయాలకు సమ్మర్లో ప్రత్యేక ప్యాకేజీలతో సిద్ధం చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా.. డిపోలు 9 బస్సులు 627డ్రైవర్లు 764కండక్టర్లు 1,014 -
16 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు
చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ సాధారణ సమావేశం స్థానిక కార్యాలయంలో చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 20 ఎజెండా అంశాలపై చర్చించిన సభ్యులు 16 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ నాగేందర్ తెలిపారు. ఆమోదం తెలిపిన వాటిలో పారిశుద్ధ్య వాహనాల సర్వీసింగ్, రిపేరింగ్, డీజిల్ బిల్స్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ జీతభత్యాలు, మున్సిపల్ బిల్డింగ్ పునరుద్ధరించుట తదితర అంశాలు తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్థానిక సీఐ రమేష్ పట్టణంలో ట్రాఫిక్, త్రిబుల్ రైడింగ్ వంటి అంశాల నియంత్రణకు పోలీస్ శాఖకు పాలకవర్గం సహకరించాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ ఉమ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు. -
టీఎస్ఎప్సెట్ తొలిరోజు ప్రశాంతం
సిద్దిపేటఅర్బన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ఎప్సెట్ పరీక్ష ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. తొలి రోజు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సీబీటీ విధానంలో నిర్వహించారు. ఉదయం సెషన్కు 50 మంది విద్యార్థులకు 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు సైతం 49 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణను ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ అప్సర్, పీఆర్వో రఘు పర్యవేక్షించారు. నిబంధనలు తప్పనిసరి సిద్దిపేటకమాన్: పురపాలక నిబంధనలను కచ్చితంగా పాటించాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వధశాలలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ, అక్రమ వధను నివారించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా జంతువుల రవాణా వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జంతువులు అక్రమ రవాణా నివారించడానికి కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. జీవన ఎరువులతో సేద్యానికి జీవం ములుగు(గజ్వేల్): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులను ఉపయోగించడంతో భూసారాన్ని పెంచవచ్చని హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె.రామలక్ష్మి సూచించారు. వ్యవసాయ శాఖ రైతు వారోత్సవం సందర్భంగా నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అనే అంశాలపై సోమవారం ములుగు రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలోని సూక్ష్మజీవరాశి నశించి భూమి నిస్సారమవుతోందన్నారు. కూరగాయ పంటలు, వాటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి ఐదుగురు రైతుల చొప్పున మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించి వారికి సాయిల్ హెల్త్కార్డులు అందజేశారు. కార్యక్రమంలో వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్గుప్త, రైతులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కూలీల సమస్యలు పరిష్కరించండి గజ్వేల్రూరల్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి అన్నారు. ఉపాధి హామీ కూలీల పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం మండల పరిధిలోని శ్రీగిరిపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ ద్వారా కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. అదే విధంగా కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలీల పక్షాన ఉంటూ వీబీరామ్జీ బిల్లును రద్దు చేసేలా కృషి చేయాలన్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కారం
● కలెక్టర్ హైమావతి ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 69సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అర్హతల మేరకు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు 69 వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలివచ్చే వారం రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పీఏసీఎస్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు చేపట్టాల్సి ఉందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే 10 వేల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమీపంలోని రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని, దూర ప్రాంతాలకు కూడా అవసరం మేరకు రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.సిద్దిపేటరూరల్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న జాబ్ మేళాకు జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని, ఉద్యోగాలకు సాధించాలని కలెక్టర్ హైమావతి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక జాబ్ మేళా పోస్టర్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 8న ఉదయం 8 గంటల నుంచి సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదన్నారు. 250 పైగా వివిధ రంగాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు పాల్గొని తమ కంపెనీలకు, సంస్థలకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ వీటితో పాటు ఇతర అన్ని రకాల అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పొందాలని కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ, యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఆర్ఓ రవికుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పట్టని సర్కార్
● 22 రోజులుగా వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే ● మాజీమంత్రి హరీశ్రావుసిద్దిపేటరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రూరల్ మండల పరిధిలోని బుస్సాపూర్లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను తిప్పలు పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ బయటకు వస్తేనే రైతు భరోసా వేస్తున్నారన్నారు. వడ్లు, మక్కలు 22 రోజులగా కొనుగోలు కేంద్రాల్లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నపుడు లేని తిప్పలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్నారు. బుస్సాపూర్కు లిఫ్ట్ మంజూరు చేసి 90శాతం పనులు తాను పూర్తి చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి లిఫ్ట్తో పంట పొలాల్లోకి నీళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి, గ్రామ సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు. -
వడ్లకు చోటేదీ...?
గజ్వేల్: వడ్ల కొనుగోళ్లకు మరో కష్టం వచ్చిపడింది. పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డు లు నిండిపోయాయి. దీంతో వడ్లకు చోటు లేకుండా పోయింది. జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వరిధాన్యం ఉత్పత్తులు పోటెత్తుతుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యాసంగికి సంబంధించి జిల్లాలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం 5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఉత్పత్తులు కొనుగోళ్లకు రానున్నాయి. 422 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ అధ్వర్యంలో 214, సహకార సంఘాల ఆధ్వర్యంలో 202, మెప్మా ఆధ్వర్యంలో మరో 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ యార్డుల ఫుల్ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, బెజ్జంకి, హుస్నాబాద్, మిర్దొడ్డి, చిన్నకోడూరు మార్కెట్ యార్డులు పొద్దుతిరుగుడు రాశులతో నిండిపోయాయి. ఎన్నో అశలతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులు.. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా కేంద్రాల్లో కొద్ది రోజులు మాత్రమే కొనుగోళ్లు సాగాయి. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ముగిసిందనే పేరుతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,800 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 18వ తేదీ నుంచే కేంద్రాలను మూసేశారు. ఫలితంగా ఆయా యార్డుల్లో ఇంకా 3,500 టన్నులకుపైగా పొద్దుతిరుగుడు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ నిల్వల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు వస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నా..ఫలితం లేకుండా పోతుంది. దీంతో రైతులు ఆయా మార్కెట్ యార్డుల్లో నెలకుపైగా నిరీక్షణలో ఉన్నారు. ఇప్పటికై నా వీటి కొనుగోలు జరుగుతుందా...? లేదా అనేది అనుమానంగా ఉన్నది. పొద్దుతిరుగుడు ఖాళీ అయితేనే.. పొద్దు తిరుగుడు కొనుగోళ్లు జరిగి...అవి ఖాళీ అయితేనే అయా మార్కెట్ యార్డుల్లో వడ్ల కొనుగోళ్లకు అవకాశం కలగనుంది. ఇప్పటికే వరిధాన్యం మార్కెట్ యార్డులకు పోటెత్తుతున్నది. షెడ్లలో ఖాళీ లేక... రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఆరుబయటే పోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా అదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వడగండ్ల వానకు వరి ధాన్యం తడిసి ముద్దయిన ఘటన ఆందోళన కలిగిస్తున్నది.పొద్దు తిరుగుడు రాశులు ఖాళీ చేయిస్తాం పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు తేదీని పొడగించే అవకాశమున్నది. రాగానే వారంలో కొనుగోళ్లను పూర్తి చేసి మార్కెట్ యార్డులను ఖాళీ చేయిస్తాం. దీనిద్వారా వడ్ల కొనుగోళ్లకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. – మార్క్ఫెడ్ డీఎం సునీత పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డులు ఫుల్ కొనుగోలు తేదీ పొడిగింపు రాక ఈ దుస్థితి అవి ఖాళీ అయితేనే... వడ్ల కొనుగోళ్లకు అవకాశం నిరీక్షణలో పొద్దుతిరుగుడు రైతులు -
మల్లన్న ఆలయంలో భక్తుల రద్ధీ
టేక్మాల్(మెదక్): భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్పల్లి గుట్టపై వెలసిన వీరభద్రుడి కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ అవినాష్, వైస్ చైర్మన్ ఈశ్వరప్పతో పాటు పలువురు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. కాగా బోడ్మట్పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి టాపర్గా నిలిచిన విద్యార్థిని వైష్ణవిని మంత్రి దామోదర సన్మానించి అభినందించారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు
మద్దూరు(హుస్నాబాద్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని, రైతులను ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని సలాఖపూర్ గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. సెంటర్లో ప్యాడీ క్లీనర్లు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించాలన్నారు. మిల్లుల్లో జాప్యం కాకుండా ఒక సెంటర్కు రెండు లేదా మూడు మిల్లులను కేటాయించాలని సివిల్ సప్లయి అధికారులను ఆమె ఫోన్లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.కలెక్టర్ హైమావతి -
అంజన్న దయతో కాళేశ్వరం జలాలు
సిద్దిపేటజోన్: విజయవాడ కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం తరహాలో సిద్దిపేట గోదారి నీటిలో ఘనంగా హనుమాన్ తెప్పోత్సవం జరగడం ఆనందంగా ఉందని, సిద్దిపేట తెప్పోత్సవానికి నెలవుగా మారిందని ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోమటిచెరువులో వైభవంగా హనుమాన్ తెప్పోత్సవం నిర్వహించారు. అంతకుముందు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ విగ్రహప్రతిమతో చెరువులో కలియ తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హనుమాన్ మాల ధారణ విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ తెప్పోత్సవం భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అంజన్న దయతో సిద్దిపేటకు కాళేశ్వరం ద్వారా గోదారి నీరు వచ్చిందన్నారు. సమష్టి కృషితోనే 22 అవార్డులు ప్రశాంత్నగర్(సిద్దిపేట): అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే, సిద్దిపేట మున్సిపాలిటీకి 22 అవార్డులు వచ్చా యని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సరిత, రాములు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, దుస్తుల పంపిణీ, పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండటానికి పారిశుద్ధ్య కార్మికుల కృషి వెలకట్టలేనిదన్నారు. బెల్లె సరిత ఉద్యోగం సాధించిన తర్వాత తన మొదటి జీతంతో మంచి పని చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చంద్రం, రాములు, ఎల్లయ్య, నర్సింహులు, సతీశ్, శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు కోమటిచెరువులో ఘనంగా తెప్పోత్సవం -
‘నీట్’గా రాశారు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షకు 937 మంది అభ్యర్థులకు గాను 916 మంది హాజరయ్యారు. 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్, నీట్ పరీక్షల నోడల్ అధికారి పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో నీట్ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. అధికారుల ముందస్తు సూచనలతో అమ్మాయిలు తమ బంగారు ఆభరణాలను తల్లిదండ్రులకు ఇచ్చారు. గాజులు లేకుండానే పరీక్షకు హాజరయ్యారు. సాధారణ దుస్తులకు అనుమతి లేకపోవడంతో టీషర్ట్, ప్యాంట్లు ధరించాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. జిల్లా కేంద్రం పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన అమ్మాయి 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు రావడంతో అప్పటికే గేటు మూసివేశారు. సిబ్బంది పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశగా వెను తిరిగింది.చెవి కమ్మలు, ముక్కు పొడకలను తొలగిస్తున్న తల్లి 21 మంది గైర్హాజరు క్షుణ్ణంగా తనిఖీ చేసిన సిబ్బంది పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ హైమావతి -
హైందవ ధర్మం కోసం పాటుపడాలి
మాట్లాడుతున్న సునీతారెడ్డి. చిత్రంలో శివాచార్య స్వామిజీజహీరాబాద్ టౌన్: సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ ఐక్యత కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆదివారం నిర్వహించి హిందూ సమ్మేళనానికి ఆమె హాజరై మాట్లాడారు. గడప దాటితే అందరం హిందువులని, కుల,మత భేదాలను వీడి అందరూ ఒక్కటికావాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి చెబుతుండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.వీహెచ్పీ ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి -
ఇక వినతులకు సులువే..
సిద్దిపేటజోన్: ప్రజావాణిలో సమస్యలపై ఫిర్యాదు ప్రక్రియ ఇక సులభతరంగా మారనుంది. ప్రజలకు మరింత చేరువగా చేసే పనిలో భాగంగా జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ప్రజావాణిలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్లో మాత్రమే అర్జీలు స్వీకరించేవారు. కొత్త నిబంధనల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కలెక్టర్ హైమావతి జారీ చేశారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు మున్సిపాలిటీలు, 26 మండలాల్లో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా ప్రాంతానికి చెందిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసింది. ప్రతి వారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలు సమర్పించేవారు. ఈ లెక్కన 90నుంచి 150వరకు వివిధ అంశాలపై దరఖాస్తులు వచ్చేవి. కలెక్టరేట్లో మాత్రమే ఉన్న ప్రజావాణి ప్రక్రియను మరింత విస్తృత పరిచేందుకు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నారు. భూముల సమస్యలు, పింఛన్లు, ఇంటి మంజూరు, ఉద్యోగం తదితర అంశాలపై అర్జీలు అధికంగా వస్తున్నాయి. కొన్ని మండలం, రెవెన్యూ స్థాయిలో ఉండే సమస్యలపై కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రజలకు ఫిర్యాదు ప్రక్రియ సులభంగా మార్చేందుకు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ప్రజావాణిని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం ఉదయం10గంటల నుంచి ఆయా డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజావాణిలో అర్జీలు స్వీకరించనున్నారు. దీని వల్ల సుదూరంగా ఉండే జిల్లా కేంద్రానికి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వెళ్లే ప్రయాస తగ్గుతుంది. ఎక్కడికక్కడ అర్జీలు అధికారులకు ఇచ్చే వెసులుబాటు కల్గనుంది. సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. డివిజనల్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆయా డివిజన్ ప్రజలు ఆర్డీఓ ఆఫీస్లోని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం మరింత చేరువగా ప్రజావాణి జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ఏర్పాటు ఎక్కడికక్కడ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి జిల్లాలో అమలు -
ధాన్యం వర్షార్పణం
హుస్నాబాద్: వడగండ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. చేతికందిన పంట వర్షం పాలు కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కొద్ది సేపు కురిసిన రాళ్ల వర్షంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఽరైతులు ఆరబెట్టిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు దిగాలు చెందారు. మార్కెట్ యార్డులో గ్యాప్ లేకుండా ధాన్యం రాశులు నిండిపోయాయి. మండుతున్న ఎండలకు ధాన్యం మ్యాచర్ వచ్చినా నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేదని రైతులు వాపోయారు. వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. వారం రోజుల నుంచి గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా, ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందారు. మరికొంత మందికి గన్నీ బ్యాగులు ఇచ్చినా కాంటాలు పెట్టకుండా వదిలేశారని తెలిపారు. టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఎండలే ఉన్నాయని ఇప్పుడెందుకు అంటూ నిరాకరించారని చెప్పారు. రోజుల తరబడి మార్కెట్లోనే ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నా... చెడగొట్టు వానతో నిండా ముంచిందని వాపోయారు. రవాణా సౌకర్యం లేకపోవడం, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా పెట్టి మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యమంతా నీళ్ల పాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందు, కౌన్సిలర్ రవీందర్ పరిశీలించారు.తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న రైతులువడగండ్లతో రైతులకు కడగండ్లు అకాల వర్షంతో ఆవిరైన అన్నదాతల ఆశలు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం -
రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని సభ నేపథ్యంలో శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సన్నాహక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని సభకు ప్రతి మండలం నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. త్వరలో సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్ రావు -
దుబ్బాకలో ఉద్రిక్తత
దుబ్బాక: పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశంలోకి దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ మాట్లాడుతుండగా మైక్లు కట్ అయ్యాయి. రైతుల గురించి మాట్లాడుతుంటే కట్ చేస్తారా అంటూ ఆగ్రహంతో మైక్ను నేలకేసికొట్టారు. అనంతరం సభను బహిష్కరించి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బయటకొచ్చి గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులు కష్టాలు పడుతుంటే సంబరాలా? ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్లపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాదని, రైతుల మధ్యకొస్తే పరిస్థితి తెలుస్తుందన్నారు. బీ గ్రేడ్ ధాన్యం కొంటామంటూ అధికారులు షరతులు పెట్టడం సరికాదన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. చివరి గింజకొనే వరకు రైతులకు అండగా ఉండి పోరాడుతామన్నారు. -
ఆందోళన వద్దు.. అండగా ఉంటా
● ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు పోరాటం ● నిరుద్యోగ యువతతో మాజీ మంత్రి హరీశ్సిద్దిపేటజోన్: ‘ఆందోళన వద్దు.. మీకు అండగా ఉంటా.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేవరకు ఊరుకునేది లేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ గురించి వివరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. అనంతరం నిరుద్యోగ యువతతో కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చేపడుతున్న యాత్రపై అడిగి తెలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ప్రతినిధులను అభినందించారు. విలీనం అయ్యాకే రంగధాంపల్లి అభివృద్ధి ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని రంగధాంపల్లి మున్సిపాలిటీలో కలిశాకే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంగధాంపల్లిలో శ్రీ పంచవటి హనుమాన్ దేవాలయం ప్రాంగణం లో నిర్మించిన అన్న ప్రసాద భవనాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మాలధారులతో కలిసి భోజనం(భిక్ష) చేశారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట అన్నదానాలకు, ఆధ్యాత్మికతకు నెలవుగా మారిందన్నారు. హనుమాన్ దీక్షకు, భిక్ష కు బీజం వేసింది మన సిద్దిపేటనేన్నారు. -
రాఘవాపూర్లో రోడ్డెక్కిన రైతులు
సిద్దిపేటరూరల్: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. శనివారం మండల పరిధిలోని రాఘవాపూర్ వద్ద సిద్దిపేట– కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారం రోజులవుతున్నా నేటికీ ధాన్యం కొంటలేరని మండిపడ్డారు. పంటలు కోసి నెల రోజులు దాటుతున్నా కొనుగోళ్లు సాగడం లేదన్నారు. తాలు పట్టే ప్రక్రియలో జల్లి యంత్రాలు సరిగ్గా లేవని దీంతో సమయం వృథా అవుతోందన్నారు. తాలు పట్టే విధానం కాకుండా పాతపద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీను, ఎస్ఐ రాజేష్లు అక్కడికి చేరుకుని ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తహసీల్దార్ రెహమాన్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. రెండురోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సర్పంచులు పద్మ శ్రీనివాస్, భాస్కర్రెడ్డి, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం
సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతో ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో 30మంది న్యాయవాదులకు 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి నందా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 684 మంది అడ్వకేట్లకు ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మీడియేషన్ ద్వారా ఆస్తి వివాదాలు తదితర కేసుల్లో సత్వరం న్యాయం అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేసులను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మెంబర్ పంచాక్షరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, సాధన, తరణి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో చేర్యాల జడ్జికొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని చేర్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లికి సీపీ పూజలుహుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. శనివారం సీపీ రష్మీ పెరుమాళ్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, అమ్మవారి విశిష్టత, జాతర కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు జెడ్పీ సీఈఓ రమేశ్ దుబ్బాక: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని జెడ్పీ సీఈఓ,స్పెషల్ ఆఫీసర్ రమేశ్ అన్నారు. శనివారం దుబ్బాక పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండల మహిళా సమాఖ్యలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.194.89 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సుపరిపాలన అందించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, ఏఎంసీ చైర్మన్లు కొంగరి రవి, సంయుక్త, ఎంపీడీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
గజ్వేల్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో మంత్రి హరీశ్రావు సమక్షంలో గజ్వేల్ మండలం అక్కారం కాంగ్రెస్ నాయకులు సింగర్ ఎల్లంతోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, బాల్చంద్రం, నాయకులు పాల్గొన్నారు. -
ఇక ‘మధురమ్మ’ జ్ఞాపకమే..
తిమ్మాయిపల్లిలో శతాధిక వృద్ధురాలి మృతి నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నారు. -
కొంటరా.. కొనరా..?
తాలు తీసి తీసుకురండి.. దుబ్బాకరూరల్: ధాన్యాన్ని తాలు తీసి తీసుకురావాలని చీకోడ్ మిల్లు యజమాని సతీశ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని రాజక్కపేట ఎల్లాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీ లోడ్ వచ్చిందన్నారు. ధాన్యం బస్తాలను చెక్ చేయగా అంతా తాలు, దుమ్ముధూళి ఉందన్నారు. క్వింటాల్కు 5 కిలోలు కట్ చేస్తున్నారని, కొంత మంది పని గట్టుకుని రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.దుబ్బాకరూరల్: వరి పంట కోసి పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ కొనడం లేదంటూ రైతులు ఆగ్రహించారు. శనివారం మండలంలోని హబ్సిపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏ ఒక్క అధికారి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పాపాన పోవడంలేదన్నారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఐ రాజేశ్, ఎస్ఐ కీర్తిరాజ్ రైతుల వద్దకు చేరుకుని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
గౌరవెల్లి ప్రాజెక్టు బాధ్యత నాదే
● త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తాం ● కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి ● మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి నిర్మాణం తనదే బాధ్యత అని, భూ నిర్వాసితులకు త్వరలో పేమెంట్ చేసి కాలువల నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం పట్టణంలో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మూర్తి ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు. అంతకముందు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు రూ.128 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కులు, కల్యాణలక్ష్మి, నేతన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జూన్ 2 తర్వాత పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. కొత్తపల్లి నుంచి హుస్నాబాద్కు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. హుస్నాబాద్లో హోల్సెల్ కూరగాయల ఏర్పాటు చేస్తామని, త్వరలో కబడ్డి అకాడమీ సైతం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీ సాధన రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆదేశాలు రాలేదని చెబుతుండ్రు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 18 రోజులవుతోంది. తొమ్మిది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నాతోపాటు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మాదిరిగా కొనుగోళ్లు చేపట్టాలి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంది. – రేణికుంట వెంకటేశ్, రైతు, రాఘవాపూర్కొనుగోళ్లు సాగుతున్నాయికొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. ధాన్యంలో తాలు లేకుండా చూడాలని రైతులను కోరుతున్నాం. ధాన్యం డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. – గోపికృష్ణ, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 15 రోజులు అవుతుంది. కేంద్రం ప్రారంభించి పది రోజులైనా ఇప్పటికీ గింజ ధాన్యం కూడా కొనలేదు. అధికారులను అడిగితే ఇంకా ఆదేశాలు రాలేదని సమాధానం చెబుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తాలు తీసే మిషిన్లు లేవు. హమాలీ కార్మికులు కూడా అందుబాటులో లేరు. గన్ని సంచులకూ దిక్కులేదు. – చెరుకూరి మల్లేశం, రైతు, మల్లాయిపల్లి, దుబ్బాక -
సాగని కొనుగోళ్లు..ఆగని కన్నీళ్లు
సాక్షి, సిద్దిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 20 రోజుల నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఽవాతావరణ మార్పులతో వర్షాలు కురవచ్చన్న బెంగ రైతుల్లో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 3.73లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 421 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,100 మంది రైతుల నుంచి 25,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకపోయాయి. ఇప్పటి వరకు రూ.30 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా.. రూ.6.44కోట్లను మాత్రమే రైతులకు చెల్లించారు. ఇంకా దాదాపు రూ.13.56కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కొంత మేరకు తాలుతోనే ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్యాడి క్లీనర్ల ద్వారా ఎంత జల్లి పట్టినా అలాగే ఉంటుందని, పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఽకూలీల కొరతతో జల్లి పట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హమాలీలు, లారీల కొరత తో సైతం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. 18 రోజులుగా పడిగాపులు ధాన్యం అమ్మేందుకు కర్షకుడి కష్టాలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పలుచోట్ల రోడ్డెక్కుతున్న రైతులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 25వేల మెట్రిక్ టన్నులే..ధాన్యం రాశులు ఉన్న ఈ దృశ్యం.. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటికీ తొమ్మిది రోజులవుతున్నా ఒక్క గింజనూ కొనుగోలు చేయలేదు. 60 మందికి పైగా రైతులుకొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఉంచారు. దాదాపు 300 టన్నుల ధాన్యం రాశులు పేరుకపోయాయి. అకాల వర్షాలు కురిస్తే అంతా ఆగమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాలు పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులవుతున్నా కొంటలేరు దుబ్బాక మార్కెట్ యార్డులో వడ్లు పోసి 20 రోజులవుతోంది. వడ్లు ఎండి 12 శాతం తేమ వస్తోంది. అయినా కాంటా పెట్టడం లేదు. బి గ్రేడ్ అయితేనే కొంటామంటూ అధికారులు చెబుతున్నారు. ఎండల్లో నానాపాట్లు పడుతున్నాం. అధికారులు వెంటనే కొనుగోలు చేయాలి. – వంగ శ్రీనివాస్రెడ్డి, చెల్లాపూర్ -
తాలు తీసిన ధాన్యాన్నే కొంటాం
● కలెక్టర్ హైమావతి ● కొనుగోలు కేంద్రాల సందర్శనసిద్దిపేటఅర్బన్: తాలు తీసిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలలో కొంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి, తడ్కపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. పాడీ క్లీనర్ పనిచేయడం లేదని, తాలు తీయడం ఇబ్బంది అవుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రిపేర్ చేయించాలని మార్కెటింగ్ డీఎం నాగరాజును ఫోన్లో ఆదేశించారు. పాడీ క్లీనర్, కాంటాలు, తేమ యంత్రాలు అన్ని సరిగా ఉన్నాయో లేదో పరీక్షించాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం తేమశాతం రాగానే తాలు పట్టించాలని, తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో తాలు తీయకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ జరిగే ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని కేంద్రాలలో టెంట్, తాగునీరు, తాలు తీసే యంత్రాలు, కాంటాలు, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రెండు పంటలు వరి సాగు చేసే రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోందని, అధునాతన కార్మాగారం అందుబాటులో ఉన్న దృష్ట్యా ఆయిల్పామ్ సాగుకు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. -
గుర్రాలగొందిని సందర్శించిన ట్రెయినీ డీపీఓలు
సిద్దిపేటరూరల్: నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామాన్ని ట్రెయినీ డీపీఓలు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో అమలవుతున్న గ్రామస్థాయి మంత్రివర్గ పనితీరు, రుతుప్రేమ, స్టీల్బ్యాంకు నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వంటి వాటిని అధికారులకు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ గ్రామ వార్డు సభ్యులు మంత్రివర్గం మాదిరిగా శాఖలను కేటాయించుకుని సమస్యలు పరిష్కరించుకోవడం బాగుందన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ డీపీఓ అనూష, సిద్దిపేట డీపీఓ వినోద్, జగిత్యాల ట్రెయినీ డీపీఓ రేవంత్, వనపర్తి ట్రైనీ డీపీఓ తరుణ్చక్రవర్తి, డీఎల్పీఓ చందన, ఎంపీఓ విష్ణు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధైర్యపడొద్దు ● ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదు ● సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: పదో తరగతి ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రాణం కంటే మార్కులు ముఖ్యం కాదని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పిల్లలను ఇతరులతో పోల్చి చిన్నబుచ్చవద్దని వారిపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఫలితాల తర్వాత పిల్లలు మౌనంగా ఉన్నా, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించాలని సూచించారు. ఓటమి అనేది తాత్కాలికమని, విద్యార్థులకు జిల్లా పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సహాయం కోసం ఏ సమయంలోనైనా సిద్దిపేట పోలీసు కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. కార్మిక చట్టాలపై అవగాహన అవసరం సిద్దిపేటరూరల్: కార్మిక చట్టాలపై అవగాహనతో పాటు హక్కులను కాపాడుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్ఓ నాగరాజమ్మ , అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్లు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రతీ కార్మికుడికి కనీస వేతనం అందేలా చూడడం, అదనపు వేతనం పొందే హక్కు, భద్రతా ప్రమాణాలు, భీమా సౌకర్యం తదితర పొందేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మిక కార్డు, ఈశ్రమ్ కార్డులను దరఖాస్తు చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలను పొందాలన్నారు. కార్మిక ప్రయోజనాలు పొందేందుకు కార్మిక కార్యాలయాన్ని, మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. అనంతరం కార్మిక చట్టాలు, ప్రయోజనాల వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధంబెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని కల్లెపెల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని శుక్రవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. హార్వెస్టర్ నడిపిస్తుండగా బెల్ట్ నుంచి నిప్పు రవ్వలు రావడంతో మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. ఈ సంఘటనలో కొండల్రెడ్డి, హనుమంతరెడ్డి, రాజయ్యలకు చెందిన మొక్కజొన్న పంటలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా పంటలు అధిక శాతం కాలిపోయాయని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా వేడుకున్నారు. -
నాచ‘గిరి’ ప్రదక్షిణం
ఆధ్యాత్మిక తరంగంగిరి ప్రదక్షిణలో భక్తజన సందోహంస్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. నృసింహ నామంతో మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. శుక్రవారం ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలయ ఉత్తర ద్వారం వద్ద ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. నాచగిరి కొండలు చుడుతూ, హరిద్రానది తీరం దాటుతూ, గోశాల మీదుగా ఉత్తరద్వారం వరకు కొనసాగిన గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. – వర్గల్(గజ్వేల్) -
వైభవంగా ఎల్లమ్మ కల్యాణం
హుస్నాబాద్: పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంబాల పూజారులు అమ్మవారి కథను వినిపించారు. పంబాల కళాకారుల డప్పుకు మంత్రి స్టెప్పులేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని దివ్య కల్యాణం కనులపండువగా సాగింది. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొత్తగా నియమించిన జాతర ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కిషన్ రావు, కౌన్సిలర్లు, గౌడ కులస్తులు, భక్తులు పాల్గొన్నారు.పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం -
ఆర్టీసీ కార్మికులకు వారధిగా ఉంటా
● బాధ్యతగా విధులు నిర్వహించండి ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ఆర్టీసీ కార్మికులు బాధ్యతను హక్కుగా భావించి విధులు నిర్వహించినప్పుడే సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. డిపో ఎదుట కార్మికులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తెచ్చామన్నారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులు, కార్మిక సంఘాల నాయకులతో చర్చించి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా వారధిగా ఉంటానని పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాప సూచికగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ సోలమన్, ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ, ఏసీపీ సదానందం, డిపో మేనేజర్ వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ఈత ఇంపు.. కొలను కంపు
అధ్వానంగా సర్కార్స్విమ్మింగ్ పూల్ ● జిల్లా కేంద్రంలో రూ. కోట్లు వెచ్చించి నిర్మాణం ● అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణం ● వినియోగంలోకి తీసుకురావాలంటున్న ప్రజలు సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో 2016లో రూ.5కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈత కొలను నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్ను సైతం ఏర్పాటు చేశారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడింది. కొన్ని రోజులు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యుజవన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగించారు. సదరు కాంట్రాక్టర్లు నిర్వహణ గాలికి వదిలేశారు. వేసవి కాలంలో, డబ్బులు వచ్చే సమయంలోనే ఓపెన్ చేసే వారు. తర్వాత మూసివేస్తున్నారు. నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమన్వయ లోపం మున్సిపల్ పరిధిలో ఉండటంతో తమకు అప్పగిస్తే వినియోగంలోకి తీసుకువస్తామని కలెక్టర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులకు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. దీంతో మున్సిపాలిటీకి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతో మరమ్మతులకు నోచుకోడం లేదు. పైగా రెండు శాఖల నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి త్వరగా మరమ్మతులు చేసి ఈ వేసవి కాలంలో అందుబాటులోకి తీసుకరావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. భానుడి భగభగలకు ఉపశమనం పొందాలని ఆశించే పట్టణ వాసులకు, శిక్షణ పొందే క్రీడాకారులకు సిద్దిపేట లోని ఈత కొలను నిరాశే మిగులుస్తున్నది. మున్సిపల్, యువజన క్రీడల శాఖాధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాదరణకు గురవుతోంది. 8 నెలలుగాతెరుచుకోకపోవడంతోకంపుకొడుతోంది. మున్సిపాలిటీకి అప్పగించాం కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వారికి స్విమ్మింగ్ పూల్ బాధ్యతలను అప్పగించాం. ఈ మేరకు ఇదివరకే సంతకం చేశాను. విద్యుత్ బిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి. – శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి డీవైఎస్ఓ అప్పగించలేదు జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఈత కొలను ఉంది. కొలను నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని లేఖ రాశాం. ఇంకా అప్పగించలేదు. మా ఆధీనంలోకి రాగానే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీస్తాం. – ఆశ్రిత్ కుమార్, కమిషనర్, సిద్దిపేట పురపాలక సంఘంఅంతా చెత్తాచెదారం ఎనిమిది నెలలుగా స్విమ్మింగ్ పూల్ను తెరవకపోవడంతో దుర్వాసన వస్తోంది. వర్షపు నీళ్లు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఎయిర్ బాల్స్ గొలుసు తెగిపోయింది. మోటార్లు పాడయ్యాయి. కొలను ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ప్రైవేట్ పూల్స్ కోసమే ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. -
జీవించు.. జయించు
ధైర్యం వీడొద్దు.. ఆత్మస్థైర్యం మరవొద్దు సిద్దిపేటకమాన్: విద్యార్థుల అనాలోచిత నిర్ణయాల వల్ల విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ర్యాంకులు, మార్కుల విషయంలో తోటివారితో పోలికలు ఒత్తిడిలోకి నెడుతున్నాయి. విజ్ఞానం కోసం నేర్చుకోవాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. ర్యాంకుల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థుల బలవన్మరణాల ఫలితంగా రేపటి భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలవగానే తాము అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని, ఫెయిల్ అవుతామని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. పరీక్షలు మళ్లీ రాసి గెలవాలే గానీ క్షణికావేశంలో జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. మార్కుల పట్ల ఇతరులతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. మీ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారి జీవితం అత్యంత ప్రాధాన్యమైనదని గుర్తించాలి. ‘చిన్న’కోడూరుకు ‘పది’ంతల కీర్తి ఆత్మహత్య పరిష్కారం కాదు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చాయనో క్షణికావేశంలో విలువైన ప్రాణాలు తీసుకోకూడదు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి. అంతేకాని అనాలోచిత నిర్ణయాల వల్ల జీవితాన్ని కోల్పోవద్దు. విద్యార్థులు ఏవరైనా ఒత్తిడికి లోనైతే తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ద్వారా వారిలో మార్పు తీసుకవస్తా. – డాక్టర్ శాంతి, మానసిక వైద్య నిపుణురాలు, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి -
చట్టబద్ధ దత్తతే చక్కని మార్గం
జిల్లా సంక్షేమశాఖ అధికారి శారదసిద్దిపేటరూరల్: అందమైన కుటుంబం ఏర్పాటు కోసం చట్టబద్ధంగా చిన్నారుల దత్తత చక్కని మార్గమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మిషన్ వాత్సల్య పథకం– డీసీపీయూ విభాగం ఆధ్వర్యంలో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చట్టబద్ధ దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవడానికి గల అర్హతలు, సంబంధిత వివరాలను తెలియజేస్తూ దరఖాస్తుచేసుకోవాలన్నారు. చట్టబద్ధంగా కాకుండా అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోరాదన్నారు. అనంతరం దత్తత తీసుకున్న తల్లితండ్రులకు అనుమానాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్ మమత, డీసీపీఓ రాము, బాలల రక్షణ అధికారులు పాల్గొన్నారు. -
సింహవాహనంపై నాచగిరీశుడి విహారం
వర్గల్(గజ్వేల్): స్వాతి నక్షత్రం వేళ నృసింహావిర్భావం.. సింహవాహనంపై స్తంభోద్భోవుని దివ్యదర్శనం ఆవిష్కృతమైంది. నృసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నాచగిరి భక్తిపారవశ్యమైంది. జయంతి ఉత్సవాలలో భాగంగా విశేష అభిషేకం, సుదర్శన నారసింహ మూలమంత్ర హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అష్టోత్తర శతకలశ పూజ జరిపారు. భక్తజన హర్షధ్వానాల మధ్య సింహవాహనంపై శ్రీవారు ఊరేగారు. అనంతరం స్తంభోద్భవుడు నృసింహుని ఆవిర్భావ ఘట్టంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించడం కోసం దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండల పరిదిలోని లింగుపల్లిలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ బొమ్మెర సంయుక్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు. గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన తాగు నీరు, నీడ, వంటి వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కోదండరాంను కలిసిన టీజేఎస్ నాయకులుగజ్వేల్రూరల్: ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా టీజేఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీజేఎస్(తెలంగాణ జన సమితి) జిల్లా ఇన్ఛార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి గురువారం కోదండరాంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల నష్టపరిహారం తదితర అంశాలను కోదండరాం దృష్టికి తీసుకెళ్లి ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మంత్రి ఇలాకాలో ఏఈ ఏరీ?హుస్నాబాద్: రూ.కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్న మున్సిపాలిటీలో పూర్తి స్థాయి ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్)ని నియమించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట గురువారం బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్గౌడ్, భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ కన్వీనర్ కవ్వ వేణుగోపాల్రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఇలాకాలో పూర్తి స్థాయి ఏఈ లేకపోవడం దారుణమన్నారు. సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవడం, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడేళ్లకే గుంతలు పడి కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయొద్దు
● కలెక్టర్ హైమావతి ● సివిల్ సప్లై, రైస్ మిల్లర్లతో సమావేశం సిద్దిపేటరూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ధాన్యం దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లు ప్రతినిధులతో, సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 12,936 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారి తనూజ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యంతో వచ్చిన లారీలను దిగుమతిలో జాప్యం కాకుండా ఎక్కువ మంది హమాలీలను ఏర్పటు చేసుకోవాలని మిల్లుల యజమానులను ఆదేశించారు. తాలు తీసిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు వచ్చేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. అధికారులు, మిల్లర్ల సమన్వయంతో కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పని చేయాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. -
గణితంలో గ్రహపాటు
● పదో తరగతిలో 401 మంది ఫెయిల్ ● అధికంగా గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోనే..సాక్షి, సిద్దిపేట: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది. అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.85శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో 401మంది ఫెయిల్ అయ్యారు. పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే గణితం, ఇంగ్లిష్లలో అధికంగా ఫెయిల్ అయ్యారు. గణితం పాఠ్యాంశాల్లో సమస్యలను అన్వయించి పరిష్కరించడంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఆంగ్లం స్పష్టంగా చదవడం రాయడం రాకపోవడంతోనే ఫెయిల్ అయ్యారు. మూడు మండలాల్లో.. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు. ధూల్మిట్ట, కోహెడ, కుకునూరుపల్లి మండలాల్లో 100శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం పెరుగుతూ.. తగ్గుతూ పదేళ్లుగా పదో తరగతి ఫలితాలను పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం పెరుగుతూ... తగ్గుతూ వస్తోంది. 2021–22లో 14,869 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14,550 (97.85 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ ఏడాది రాష్ట్రంలో మొదటి స్థానం జిల్లా సాధించింది. 2018–19, 2022–23. 2023–24లలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. -
మెరుగైన ఫలితాలు సాధించాం
● టాపర్స్కు త్వరలో ఐ ప్యాడ్స్ ● మాజీ మంత్రి హరీశ్రావు ● విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్సిద్దిపేటజోన్: ‘పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాం. అందరికీ అభినందనలు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన చిన్నకోడూరు మండల ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు. పదిలో ఉత్తీర్ణత సాధించిన మీ పిల్లల భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీ పిల్లలు బాగా చదివి, ఉన్నతంగా ఎదగాలి అనేది నా తాపత్రయం, నా ప్రయత్నం అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,874మంది విద్యార్థులు పది పరీక్ష రాయగా 2,791మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇదే పట్టుదలతో చదివి భవిష్యత్తుకు మంచి లక్ష్యం ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని అన్నారు. అదేవిధంగా నంగనూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావు పేటలకు త్వరలో బెస్ట్ 30 మంది విద్యార్థులకు ఐ ప్యాడ్స్ గిఫ్ట్గా ఇస్తానని, అదేవిధంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానన్నారు.


