breaking news
Siddipet District News
-
12న జాతీయ లోక్ అదాలత్
సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ వచ్చే నెల 12న నిర్వహిస్తున్నట్లు, రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ పడదగినవి 1,776 కేసులు గుర్తించినట్లు వీటిలో 518 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన లోక్ అదాలత్లో 756 కేసులు పరిష్కరించామని, వీటిలో మోటారు వాహనాల సంబంధిత కేసుల్లో రూ.92లక్షల 26వేల నష్టపరిహారం ఇప్పించామని తెలిపారు. అలాగే గత జూన్లో నిర్వహించిన లోక్ అదాలత్లో 814కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య, న్యాయమూర్తి జయప్రసాద్ పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి జిల్లా న్యాయమూర్తి సౌజన్య సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సౌజన్య తెలిపారు. జిల్లా జైలును న్యాయమూర్తి శనివారం సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్ను పరిశీలించి, ఖైదీలకు కల్పిస్తున్న భోజన వసతి గురించి జైలు సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ప్రతి వారం జైలును సందర్శిస్తారన్నారు. అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి ఎంపీ రఘునందన్రావు దుబ్బాకరూరల్: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్రావు అన్నారు. అక్బర్పేటభూంపల్లి మండలం పోతారెడ్డిపేట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రహరీ నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక ఏసురాజ్, బీజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో తగిన వసతులు లేవని ఎంపి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ధ్యాన్ చంద్ యువతకు స్ఫూర్తిహుస్నాబాద్: నేటి యువత ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది కలిసి క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇస్తూ.. ఆయనను గౌరవించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలకు నిధులు
● ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.35.25 లక్షలు విడుదల ● విద్యార్థుల సంఖ్య ప్రకారం కేటాయింపు ● తప్పనున్న నిర్వహణ ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.35.25లక్షలు కేటాయించారు. ఈ నిధులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు చేశారు. ఇందులో జనరల్ ఫండ్గా రూ.25,38,000, ఎస్సీ ఫండ్గా 5,99,250, ఎస్టీ నుంచి 3,87,750 నిధులు ఉన్నాయి. మౌలిక వసతుల కోసం.. 30 మందిలోపు ఉన్న కళాశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101– 250 వరకు రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మంది ఉన్న కాలేజీలకు రూ.లక్ష వరకు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కళాశాలకు కావాల్సిన స్టేషనరీ, ల్యాబ్ నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. చాక్పీసులు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు, బుక్లెట్లు ఇతర వాటికి వినియోగించనున్నారు. నిధులు మంజూరుతో కాలేజీలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నిధుల విడుదల ఇలా.. జిల్లా కళాశాలలు నిధులు సిద్దిపేట 20 రూ. 12,00,000 మెదక్ 16 రూ. 10,50,000 సంగారెడ్డి 20 రూ. 12,75,000 -
సిద్దిపేటలో హైటెన్షన్!
కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లు అభివృద్ధి పనులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తమ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఇరు పార్టీల నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు చేపట్టగా.. పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. – సాక్షి, సిద్దిపేట ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సిద్దిపేట నియోజకవర్గానికి అధికంగా నిధులు వచ్చాయి. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదు. దీనిపై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని’ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సవాల్ విసిరారు. ఈ చర్చకు నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సైతం వస్తారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ సవాళ్లతో పలు మార్లు ఉద్రిక్త వాతవరణం నెలకోంది. దీంతో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సైతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు అత్తు ఇంటికి ఉదయమే పోలీసులు చేరుకున్నారు. అత్తును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎవరు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.ఏ మంత్రి వస్తారో రండి.. ‘చర్చకు ఎండిపోయిన రంగనాయకసాగర్ వద్దకు ఏ మంత్రి వస్తారో రండి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి’ అని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆరోపించారు. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల రద్దు, కోమటి చెరువు దగ్గర శిల్పారామం, చిన్నకోడూరు రహదారి, కాళేశ్వరం నుంచి నీళ్లు పంపింగ్ చేయకపోవడంతో రంగనాయకసాగర్ ఎండిపోతుందని బీఆర్ఎస్వీ నేతలు పేర్కొంటున్నారు. దీనిపై చర్చకు ఎవరు వస్తారో రావాలని యువజన నాయకులు సాయిప్రేమ్, యాదగిరి, రమేష్, శేఖర్లు సవాల్ విసిరారు. దీంతో శనివారం ఉదయమే బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు అందరూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రంగనాయకసాగర్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 1000 రోజులవుతుండగా, అన్ని రంగాల్లో వైఫ్యలాలను మూటగట్టుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి 8వరకు ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తూ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● కలెక్టర్ హైమావతి ● పాఠశాల, కళాశాలల ఆకస్మిక తనిఖీ మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురైతే సహించేది లేదని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శనివారం చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను ఆమె ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆమె పరిశీలించారు. కూరల్లో మరింత నాణ్యత మెరుగు పరిచేలా పాటు పడాలన్నారు. వంట గది అపరిశుభ్రంగా ఉండటాన్ని పరిశీలించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజనం ఎలా ఉందనీ, మెనూ ప్రకారం పెడుతున్నారా, రుచిగా ఉంటుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలను అందించాలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కింది స్థాయి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మిరుదొడ్డిలోని పీహెచ్సీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్, ల్యాబ్, ఓపీ, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ నుండి, కింది స్థాయి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యం అందుతున్న విధివిధానాలపై రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు ధీర్ఘకాలిక వ్యాధులకు గురైతే అందుబాటులో ఉన్న యునానీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అధనంతో అక్రమాలు!
ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రైతుల నుంచి రూ.1.57 కోట్లు అదనపు వసూళ్లు బ్యాంకు నిర్వహణ పేరుతో నిధులు స్వాహా! గత పాలకవర్గం నేత, బదిలీపై వెళ్లిన ‘ముఖ్య’అధికారి కలిసి దందా! జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వ్యవహారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతలను నిండా ముంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ డీసీసీబీల్లో లేనివిధంగా పంట రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ చార్జీల పేరుతో ఏకంగా రూ.1.57 కోట్లు వసూలు చేసేశారు. ఈ డబ్బును నిర్వహణ ఖర్చుల పేరుతో స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకవర్గంలో ఓ కీలక నాయకుడు, ఏళ్ల తరబడి బ్యాంకులో పాతుకుపోయి..ఇటీవల బదిలీ అయిన ఓ ‘ముఖ్య’అధికారి కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలపై అదనపు భారం మొపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ఉన్న డీసీసీబీల్లో లేనివిధంగా ఇక్కడ ఈ అదనపు చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7% వడ్డీని వసూలు చేయాలి. కానీ ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు అదనంగా 1% ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేశారు. అంటే రూ.లక్ష రుణం తీసుకున్న రైతు రూ.7వేల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యిమంది రైతుల వద్ద ఈ అనధికారిక వసూళ్ల దందా సాగింది. అన్నదాతలను నిండా ముంచేశారు. రైతులు తిరగబడటంతో వెనక్కి! అమాయక రైతులు, నిరక్షరాస్యుల వద్ద వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. కానీ కాస్త చైతన్యం ఉన్న రైతులు ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించారు. ఎక్కడా లేనిది అదనంగా చార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. దీంతో దాదాపు నాలుగు నెలలపాటు సాగిన ఈ వసూళ్ల దందాను గుట్టు చప్పుడు కాకుండా నిలిపివేశారు. రైతుల వాటాధనంగా నడుస్తున్న ఈ బ్యాంకు అదే రైతులకు ఇచ్చే పంట రుణాలపై అదనపు వసూళ్లు చేసి వారిని నిండా ముంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముగిసిన పాలకవర్గం తీర్మానాలు ఈ అదనపు చార్జీల వసూళ్లకు మేనేజింగ్ కమిటీ (ఎంసీ) తీర్మానాలున్నాయని డీసీసీబీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ బ్యాంకు మేనేజ్మెంట్ కమిటీ (పాలకవర్గం) పదవీకాలం 2025 ఫిబ్రవరిలోనే ముగిసింది. కానీ అదనపు వసూళ్లకు 2025 జూన్ 12న తీర్మానం చేశారు. అంటే పదవీకాలం ముగిన పాలకవర్గం తీర్మానం ఎలా చెల్లుతుందో అధికారులకే తెలియాలి. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం వారి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారని డీసీసీబీ అధికారులు చెబుతున్నారు. పొడిగించిన ఈ తాత్కాలిక పాలకవర్గానికి రైతులపై భారం మోపే తీర్మానాలు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. 2025 జూన్ 12 నుంచి 2025 అక్టోబర్ 8 తేదీ వరకు ఈ రూ.1.57 కోట్లు వసూళ్లకు తెగబడ్డారు. రైతులు తిరగబడకపోతే ఈ వసూళ్ల దందా మరింత సాగే అవకాశాలుండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా బ్యాంకు తీర్మానాలు చేసిన రైతులందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. కానీ వసూళ్ల తీర్మానాలను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్క్యూలర్లు ఇచ్చేశారు. ఎంత లాభాలుంటే అంత స్వాహా బ్యాంకుకు ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంతే మొత్తంలో స్వాహా చేయవచ్చనే ఈ అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ డబ్బులు చాలా మట్టుకు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలు ఇదే బ్యాంకులో పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’అధికారి, గత పాలకవర్గంలోని కీలక నాయకుడు కలిసి చేసిన ఈ స్వాహా పర్వంలో గత పాలకవర్గంలోని మరికొందరికి వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గుట్టుగా నిలిపివేత -
యాప్ ద్వారానే ఎరువులు విక్రయించాలి
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి వర్గల్(గజ్వేల్): ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే డీలర్లు ఎరువుల అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ఆదేశించారు. గురువారం వర్గల్ మండలం గౌరారం, మజీద్పల్లి, అంబర్పేట, మీనాజీపేట గ్రామాలలో ఎరువుల విక్రయకేంద్రాలు తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం వర్గల్ మండలంలో 22 మంది సర్వేయర్లను నియమించామన్నారు. రైతులు విధిగా తమ పంటల వివరాలు సర్వేయర్లతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు సన్న వరి రకాలు, ఇతర సన్న వరి రకాలు సాగుచేస్తే సెప్టెంబర్ 10 లోపు సంబంధిత ఏఈఓ, సర్వేయర్లకు తెలిపి నమోదు చేయించుకోవాలన్నారు. ఉద్యోగుల జేఏసీ మహాధర్నా సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ సిద్దిపేటరూరల్: పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాదరి పరమేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాదరి పరమేశ్వర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జయశ్రీ, వలిహమ్మద్, ఇంద్రసేనారెడ్డి, విక్రమ్ రెడ్డి, శ్రీధర్, మైపాల్ రెడ్డి, విజేందర్రెడ్డి, రాజిరెడ్డి, రాములు, మధుసూదన్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ లింగయ్య అన్నారు. మండలంలోని పాములపర్తి పీఎంశ్రీ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలో సైన్స్ ల్యాబ్, పాఠశాల గ్రంథాలయం, మధ్యాహ్న భోజన పథకం, స్పోర్ట్స్ మెటీరియల్ వివిధ అంశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. కార్యక్రమంలో మర్కూక్, ములుగు మండల విధ్యాధికారులు వెంకట్రాములు, ఉదయ్ భాస్కర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు -
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
● మాజీ మంత్రి హరీశ్రావు ● బీఆర్ఎస్లో చేరిన వర్గల్ వార్డు సభ్యులుసిద్దిపేటజోన్: మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ వర్గల్ గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో చెరగని త్యాగం
● బైరాన్పల్లి గ్రామాభివృద్ధికి కృషి ● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిమద్దూరు(హుస్నాబాద్): రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన గ్రామం వీర బైరాన్పల్లి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం దూల్మిట్ట మండలం బైరాన్పల్లిలో స్తూపం, బురుజు వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళుర్పించారు. గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైరాన్పల్లి పోరాటం ఒక్క గ్రామానికి పరిమితమైనది కాదన్నారు. మద్దూరు, లింగాపూర్, కూటిగల్, బెక్కల్, దూల్మిట్ట తదితర చుట్టూ పక్కల గ్రామాల ప్రజలను రజాకార్ల దాడుల నుంచి రక్షించడంలో బైరాన్పల్లి యువకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామానికి అధికారంగా వీర బైరాన్పల్లి పేరు మార్చాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కకు ఇప్పటికే వినతి పత్రం అందజేశామన్నారు. అభివృద్ధి పనులన్నింటిని రాబోయే ఆరునెలల్లోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి పోరాట గాథను భవిష్యత్ తరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కృషి చేస్తాన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను శాలువాలతో సన్మానించారు. అలాగే డాక్టర్ చందా రామయ్య రచించిన తెలంగాణ సాయుధ పోరాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్మ రాజమల్లయ్య,బీఆర్ఎస్ నాయకులు గ్రామా సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. -
మీ భద్రతే మా బాధ్యత
● మహిళల భద్రత కోసం షీటీమ్స్ ● ‘సాక్షి’తో సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ సిద్దిపేటకమాన్: మీ భద్రతే మా బాధ్యత అంటూ జిల్లాలో మహిళలు, బాలికల రక్షణ కోసం షీటీమ్స్ పనిచేస్తున్నాయని సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యార్థులు, ఉద్యోగిణులు టీజింగ్కు గురయ్యే ప్రదేశాల్లో ఆకతాయిల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఐ దుర్గ గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో కళాశాలలు, ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, కోమటిచెరువు, రద్దీ ప్రాంతాల్లో సుమారు 50 ప్రాంతాలు హాట్ స్పాట్లుగా గుర్తించామని తెలిపారు. షీ టీం సిబ్బంది మఫ్టీలో ఉండి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో మూడు షీ టీం బృందాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ఒక్కో టీంలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళ పోలీసు కానిస్టేబుళ్లు మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. బాలికలు, మహిళలను వేధించే పోకిరిలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. బాలికలు, మహిళలు ఏవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 112, షీటీం నంబర్ 87126 67434కు ఫోన్ చేసి తెలపాలని సీఐ దుర్గ సూచించారు. -
ఇదేం తీరు?
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితుల పట్ల రోజుకో తప్పిదం జరుగుతోంది. తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో నిర్వాసితుల గ్రామాల పేర్లను మాయం చేశారు. కార్డుల్లో ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఈ పరిణామం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అవరోధమని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. – గజ్వేల్ స్మార్ట్ రేషన్ కార్డుల్లో నిర్వాసిత గ్రామాల పేర్లు మాయం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాలైన ఏటిగడ్డకిష్టాపూర్లో 1,253, లక్ష్మాపూర్లో 388, వేములగాట్లో 1252, పల్లెపహాడ్లో 921, రాంపూర్లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలున్నాయి. ఆయా గ్రామాల్లో 14వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. కాలనీకి వచ్చినప్పటి నుంచి వీరిని నిత్యం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో తమ గ్రామాల పేర్లు మాయం కావడం కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముట్రాజ్పల్లి, సంగాపూర్ పేరిట స్మార్ట్ రేషన్ కార్డులు ఆర్అండ్ఆర్ కాలనీవాసులు అధికారికంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొన్ని నెలల క్రితమే విలీనమయ్యారు. అయినా తమ గ్రామాల పేర్లనే ఆర్అండ్ఆర్ కాలనీలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ రకంగా కాలనీలో గ్రామాల బోర్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీరి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు సైతం వారి సొంత గ్రామాల పేరిటే ఉన్నాయి. కానీ తాజాగా స్మార్ట్ రేషన్ కార్డులను అధికారులు మున్సిపాలిటీలోని భౌగోళిక లొకేషన్ పేరిట ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లో కార్డుల పంపిణీ కూడా ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి అవరోధమా? ముంపు బాధితుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్యాకేజీలు, పరిహారాలే కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీకి గుడి, బడి, అంగన్వాడీ కేంద్రాలు అవసరమైన స్థాయిలో లేకపోవడం, శ్మశాన వాటికలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా వీరి సమస్యల పరిష్కారానికి ఒక్క పైసా విడుదల కాలేదు. ఇలాంటి తరుణంలో తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో వారి సొంత గ్రామాల పేర్లు మాయమైపోవడం.. ఈ పరిణామం ఇదేవిధంగా కొనసాగితే చిరునామాలు మారిపోయి పెండింగ్ సమస్యల పరిష్కారానికి సాంకేతికంగా అవరోధం కలగనున్నదని నిర్వాసిత కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేకుండా చేస్తారా? నిర్వాసిత కాలనీవాసులకు మా సొంత గ్రామాలు కాకుండా ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి మాకు గుర్తింపు లేకుండా చేస్తారా? ఇది సహించేది లేదు. వెంటనే మా గ్రామాల పేర్లను పునరుద్ధరించాలి. – దామరంచ ప్రతాప్రెడ్డి, ఏటిగడ్డకిష్టాపూర్, మాజీ సర్పంచ్, ఆర్అండ్ఆర్ కాలనీ ఆందోళనకు సిద్ధం నిర్వాసిత కాలనీ ప్రజల హక్కులను కాలరాసేలా చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రతి అంశంలోనూ ఏదోరకంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. ఈ తప్పును సరిచేయకపోతే గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం. – కొలిచెలిమె స్వామి, మాజీ సర్పంచ్, లక్ష్మాపూర్, ఆర్అండ్ఆర్ కాలనీ -
ఆశక్తి లేదు!
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనియేటివ్స్) విభాగంలోకి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం 97జీఓను విడుదల చేసింది. దీంతోపాలిటెక్నిక్తో జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీఓతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి వివేక్ చెప్పినా, రద్దు చేయాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగుతుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలున్నాయి. వీటన్నింటికీ సాంకేతిక విద్యామండలి అనుబంధ గుర్తింపు ఉంది. వీటిలో సుమారు 5వేలకు మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పీ–సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులందరూ మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తికాగానే ఉన్నత చదువు కోసం ఈ సెట్ పరీక్ష రాసి లెటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఎక్కువగా విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై మక్కువ చూపుతున్నారు. సిలబస్, బోధన ప్రణాళిక కూడా సాంకేతిక విద్యా మండలినే రూపొందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. దీంతో పాలిటెక్నిక్ ప్రవేశాలు సైతం ఇదే రీతిలో ఉంటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫీజులు పెరిగితే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉన్నత చదువులకు బ్రేక్ పాలిటెక్నిక్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.. లేదంటే ఉన్నత విద్య చదువుకోవచ్చన్న ఉద్దేశంతో పాలిటెక్నిక్ విద్యను ఎక్కువగా చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈసెట్ లేకపోతే తాము ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే అవకాశం ఉండదని, దాంతో తాము ఉన్నత చదువులు చదవకుండా ద్వారాలు మూసుకుపోతాయని పాలిటెక్నిక్ విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా సీఎం, మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించి 97 జీవోను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆ రెండూ ఒక్కటి కాదు.. ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమాను ఒక్కటి చేయాలన్న ఉద్దేశంతో శక్తి స్కీంను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రెండు ఒక్కటి చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పించే దాని విషయపై మంత్రి వివేక్ స్పష్టమైన జీవోను విడుదల చేయాలి. – పవన్కుమార్, విద్యార్థి, ద్వితీయ సంవత్సరం పాలిటెక్నిక్ సిలబస్ వేరు.. పాలిటెక్నిక్ సిలబస్, ఐటీఐ సిలబస్ రెండు వేరు వేరు. ఈ రెండింటినీ కలిపేందుకు 97జీఓవోను ప్రభుత్వం తీసుకువచ్చింది. వెంటనే ఈ జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసాను కల్పించాలి. –స్నేహ, విద్యార్థి, తృతీయ సంవత్సరంవిద్యార్థులు, అధ్యాపకుల నిరసన నంగునూరు(సిద్దిపేట): శక్తిలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకుల నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీ జేఏసీ పిలుపు మేరకు అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అలాగే విద్యార్థులరు ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం తెచ్చిన జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 97 వెనక్కు తీసుకోవాల్సిందే -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
జీఓ 97 రద్దు చేయాలంటూ బీఆర్ఎస్వీ నాయకుల ఆందోళన కలెక్టరేట్ చాంబర్ ఎదుట విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకుల బైఠాయింపు.. సిద్దిపేటరూరల్: పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ 97 రద్దు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ఎదుట మొదట ధర్నా చేపట్టిన విద్యార్థులు, నాయకులు.. ఆ తరువాత గేట్పైకి ఎక్కడం, తోసుకుంటూ కలెక్టరేట్ చాంబర్ వద్దకు పరుగులు పెట్టారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. కలెక్టర్ చాంబర్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీపీ కుశాల్కర్ చేరుకుని వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి నిరసనను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జీఓ 97తో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు యాదగిరి, శ్యామ్, ప్రశాంత్, రమేశ్, మాధవ్, శేఖర్, రమేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. -
భూ రీసర్వే కీలకం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమం ఎంతో కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హలులో పలు అంశాల పైన ఆర్డీవోలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రీ–సర్వే ప్రక్రియ నిర్ణీత కాలవ్యవధిలోపు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో రీ–సర్వే లో సర్వే అధికారులు, తహసీల్దార్లు, గ్రామ సభలు నిర్వహించి అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సాదబైనామా అప్లికేషన్లు పూర్తిగా వెరిఫై చేసుకొని, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోవాలన్నారు. 22(ఏ) నాన్ అగ్రికల్చర్ సంబంధించిన వాటిని కరెక్ట్గా పరిశీలించాలని తహసిల్దార్ లను, ఆ రిపోర్ట్లను ఆర్డీఓ పూర్తిగా చెక్ చేశాకే కలెక్టరేట్కి పంపించాలని ఆదేశించారు. -
వినూత్నంగా రక్షాబంధన్..
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి మాట్లాడుతూ.. వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికి వేయడం వల్ల అనేక దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. వలంటీర్లు నాటిన చెట్లకు రాఖీలు కట్టి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను పెంచే బాధ్యతను తీసుకున్నారని తెలిపారు. కళాశాల ఆవరణలో 150 మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లను అభినందించారు. -
31 వరకే ఎల్పీజీకీ ఈకేవైసీ
నారాయణఖేడ్: వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ (ఎల్పీజీ) వినియోగదారులకు ఈ– కేవైసీ గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 16 తర్వాత 23వ తేదీ నాటికి ఈ– కేవైసీ పూర్తి చేయని వినియోగాదారులకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్ యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్ కంపెనీలు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాయి. ఆయా కంపెనీలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 6 లక్షల పైచిలుకున్నాయి. ప్రతీ రోజు 10వేల సిలిండర్ల వినియోగం జరుగుతుంది. బోగస్ ఏరివేతకే! బోగస్ కనెక్షన్లు, అర్హత లేని లబ్ధిదారులు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న కనెక్షన్లు, ఒకే కుటుంబానికి ఉన్న డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు కేంద్రం ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఎల్పీజీ కనెక్షన్కు ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇకపై రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీ నిలిచిపోనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కనెక్షన్ రద్దు చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా ఈ–కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో పలుమార్లు గడువు విధించినప్పటికీ వంద శాతం ఈ–కేవైసీ పూర్తి కాలేదు. ఫలితంగా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తిరిగి ఈనెలాఖరుగా చివరి అవకాశం కల్పించాయి. ఎల్పీజీ కనెక్షన్లు క్రమబద్దీకరించడంతోపాటు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని అందించేందుకు ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. కొన్ని ప్రాంతాల్లో మరణించిన వ్యక్తుల పేర్లతోనే గ్యాస్ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. అర్హతలేని వ్యక్తులు, ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కొనసాగుతున్న సందర్భాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి కనెక్షన్లను ఈ–కేవైసీ ద్వారా ఫిల్టర్ చేసి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియలో వినియోగదారుల గుర్తింపు నిర్ధారించేందుకు ఆధార్ వివరాలతోపాటు బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటున్నారు. వేలిముద్ర, ఐరిస్ వంటి వివరాలను ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్లకు అనుసంధానం చేయడం ద్వారా అసలైన వినియోగదారులను గుర్తించవచ్చని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ముందుగా రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఇప్పటికే బుక్ చేసిన సిలిండర్లు కూడా రద్దయ్యే పరిస్థితి ఉండొచ్చు. భవిష్యత్తులో కనెక్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేని సిలిండర్ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అనుసంధానించని పక్షంలో కనెక్షన్ తొలగింపు -
అంతా మా ఇష్టం!
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్లపై గుర్తు తెలియని వ్యక్తి టెండర్ లేకుండా, మున్సిపల్ అనుమతి తీసుకోకుండానే గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేశాడు. దాదాపు వందకు పైగా బోర్డులు ఏర్పాటు చేసి, వ్యాపార ప్రకటనలు తీసుకుంటున్నాడు. కనీసం మున్సిపల్కు ఒక్క రూపాయి చెల్లించకుండా ఆదాయానికి గండికొడుతున్నారు. దాదాపు ఒక బోర్డుకు నెలకు రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్లోసన్ బోర్డులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినా బోర్డులు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనల కోసం బోర్డులు ఎలా ఏర్పాటు చేస్తారని, టెండర్ వేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు. చర్చ లేకుండానే తీర్మానం గ్లోసన్ బోర్డుల విషయంలో సర్వత్రా విమర్శలు రావడంతో అధికారులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో గ్లోసన్ బోర్డుల ఏర్పాటుపై పెద్ద సారు చెప్పారని ఎలాంటి చర్చ లేకుండా రూ.2లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో చర్చించకుండానే సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తికే నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్యకు పుల్స్టాప్ పెట్టి కొత్త భాష్యానికి తెరలేపారు.వ్యాపార ప్రకటనల బోర్డు అనుమతి, టెండర్ లేకుండానే గ్లోసన్ బోర్డులు మార్చి వరకు అనుమతివ్వాలని తీర్మానం కొత్త భాష్యం చెబుతున్న అధికారులు, పాలకవర్గం -
ఆలస్యమేనా?
అమృతం..నత్తనడకన అమృత్ 2.0 పనులుజిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్–2.0 పథకం పనులు సాగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రూ.28కోట్లు, సిద్దిపేటలో రూ.85కోట్లు, చేర్యాలలో సుమారు రూ.9కోట్లు ఈ పథకం కింద వెచ్చిస్తున్నారు. పట్టణాల్లో దాహార్తి సమస్య శాశ్వత పరిష్కారమే ఈ పనుల లక్ష్యం. ఏడాదిన్నర కిందట ప్రారంభమైన పనులు ఆగుతూ..సాగుతున్నాయి. ఆయా పట్టణాల్లో మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్తకాలనీలకు పైప్లైన్ల విస్తరణ, కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. మార్చి 2027 డెడ్లైన్ మున్సిపాలిటీల్లో అమృత్–2.0 పనులు నత్తనడకన సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అంశంపై ఇటీవలే హైదరాబాద్లో ఓ ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పట్టణాల్లో ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ విధించారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో పనులు తీరు పరిశీలిస్తే గడువులోగా పనులు జరగటం అనుమానంగా మారింద. గజ్వేల్ పట్టణంలో భారత్నగర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ల వద్ద 25లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా వ్యవస్థను తీసుకొచ్చేందుకు 15కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నది. ఈ పనులు 70శాతానికిపైగా పూర్తి చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ పైప్లైన్ల పనులు కొంతవరకు పూర్తయినా, ఇంకా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. పైప్లైన్ల కోసం రహదారులపై గుంతలు తవ్వి అలాగే వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు నెలల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.మున్సిపాలిటీల్లో నత్తనడకన సాగు..తున్న అమృత్ 2.0 పనులు పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ పనులను ఎట్టిపరిస్థితుల్లో 2027మార్చిలోగా పూర్తి చేయాలని ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో పనుల తీరు చూస్తే గడువులోగా పూర్తికావడంపై సందేహం నెలకొంది. – గజ్వేల్పట్టణంలో అమృత్–2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని పనులు చేపడుతున్న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను కోరాం. ప్రస్తుతం చాలా చోట్ల పనులు పెండింగ్లో ఉన్న విషయం చెప్పాం. స్పందించి పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. – గణేశ్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ -
తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే తమ తోబుట్టువులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. అనంతరం ఆశీర్వాదాలు తీసుకున్నారు. వివిధ రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలు, అధికారులకు రాఖీలను కట్టారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక జంధ్యధారణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శివపార్వతులు, మార్కండేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ఆర్టీసీ బస్సులో పొన్నం..
హుస్నాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 5 వేల ఆర్టీసీ బస్సులను నడిపించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పందిల్ల గ్రామం నుంచి హుస్నాబాద్ బస్టాండ్ వరకు మంత్రి బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ప్రయాణికులకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రయాణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో రక్షాబంధన్ హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు మంత్రికి రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీలు కట్టిన మహిళా ప్రయాణికులు -
మూడు రోజులే గడువు
‘చేయూత’కు ఈ నెలాఖరు డెడ్లైన్ ● జిల్లాలో ఇప్పటివరకు 9,611దరఖాస్తులు ● సింహభాగం బల్దియాల్లోనే ● అత్యధికంగా వితంతువు కేటగిరీలో.. ● అత్యల్పంగా ఒంటరి మహిళ.. సిద్ధిపేటజోన్: చేయూత పథకం కింద సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. కొత్తగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలు పెరిగాయి. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో 9,611దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ స్వీకరించింది. వీటిలో సింహభాగం జిల్లాలోని బల్దియాల్లోనే దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా వితంతువు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులతో పాటు పైలేరియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మొదట మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగానే ఆయా కేటగిరీల్లో దరఖాస్తులను స్వీకరించారు. కొన్ని రోజులుగా జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని వెంటవెంటనే ఆన్లైన్ ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు ఆగస్టు31 గా ప్రకటించారు. బల్దియాల్లో 1,872 అప్లికేషన్లుజిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు చేయూత పథకం కింద కొత్తగా 1,872 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 840 రాగా అత్యల్పంగా చేర్యాల మున్సిపాలిటీలో 152 వచ్చాయి. వీటిని నిర్ణీత గడువు పూర్తి అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందించేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. -
రాఖీలుగా..
పుష్పాలే..హుస్నాబాద్: ప్రకృతి సిద్ధంగా లభించే పంచపాండవుల పుష్పాలతోనే ప్రతిఏటా ఆ కుటుంబం రక్షాబంధన్ జరుపుకొంటోంది. ఈసారి కూడా ఆ పుష్పాలతోనే రక్షాబంధన్ పండుగను సంతోషంగా జరుపుకొన్నారు. హుస్నాబాద్లోని ఆరపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య నర్సరీ పెంచుకుంటున్నారు. నర్సరీలో తీరొక్క కూరగాయలు, పండ్లు, పూలు మొక్కలు ఉన్నాయి. 22 ఏళ్లుగా తన నర్సరీలో ప్రకృతి సిద్ధంగా పూసిన పంచపాండవుల పుష్పాలను రాఖీలుగా తన అక్కాచెల్లెళ్లు కడుతున్నారు. రాఖీ మాదిరిగానే పంచపాండవుల పుష్పం ఉండటం విశేషం. మార్కెట్లో రెడీమేడ్గా లభించే రాఖీల కంటే పంచపాండవుల పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం శ్రేయస్కరంగా భావిస్తున్నారు. ఇలా పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం దేవుడిచ్చిన వర మని అయిలయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
నిర్వాసితుల సమస్యలు సీఎం దృష్టికి..
గజ్వేల్: మల్లన్నసాగర్ ఉద్యమం ఇంకా కళ్లెదుట కదులుతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల వ్యవహరించిన తీరు మరిచిపోలేనని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపై ఉపాధ్యాయుడు పులి రాజు, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్రెడ్డిలు సంయుక్తంగా రచించిన ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వాసిత కాలనీలో ఆవిష్కరించారు. చేసిన గోరంత పనిని కొండంత చేసి 14గ్రామాలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన కొట్లాడితే తనను రెండుసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపారని గుర్తు చేశారు. నిర్వాసితుల పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను తమ పుస్తకంలో రచయితలు కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. ప్రశ్నించేతత్వం అలవాటుచేసుకున్నప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ మల్లన్నసాగర్ నిర్వాసితుల గోసలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలుసునని చెప్పారు. బాధితుల పక్షాన తన పాట ద్వారా పోరాటం చేస్తానన్నారు. అవసరమైతే సీఎం కలిసి సమస్యలను వివరిస్తానని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు విష్ణువర్ధన్రెడ్డి, వెల్దెండి నర్సింహ్మారెడ్డి, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రవక్త సందేశం.. మానవత్వానికి మార్గం
● సిద్దిపేటలో ముస్లింల శాంతి ర్యాలీ ● భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని ముస్లిం మత పెద్దలు అన్నారు. బుధవారం మిలాద్ ఉన్ నబీని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈద్గా మైదానం వద్ద ఉన్న జనుల్లా షా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త చేసిన ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని తెలిపారు. మనుషుల్లో కుల, మత తారతమ్యాలు చూడొద్దని, మనుషులు మానవత్వం కలిగి ఉండాలని తెలిపారన్నారు. నేటి యువత ప్రవక్త చూపిన బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. -
2,29,433 మందికిసర్ నోటీసులు
నేటి నుంచి జిల్లాలో సభలు సిద్దిపేటజోన్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)ప్రక్రియలో భాగంగా జిల్లాలో నోటీసుల పర్వం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,29,433 మందికి నోటీసులు అందించనున్నారు. మ్యాపింగ్ కానీ వాటికి, అనామలిస్ జాబితాలోని వాటికి అధికారులు డిక్లరేషన్ ప్రక్రియ కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు మొబైల్ ద్వారా ఫొటోగ్రఫీ ప్రక్రియ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి సభలను నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం ఓటరు వివరాలను వార్డు. గ్రామ సభలో బూత్ లెవల్ అధికారులు చదివి వినిపించాల్సి ఉంటుంది. ప్రధానంగా చనిపోయిన వారి, అందుబాటులో లేని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను సభ సమక్షంలో చదివి వినిపించాలి. మరోవైపు ఫార్మ్ 6, 7, 8 లను అందుబాటులో ఉంచి, ఏదైనా అభ్యంతరాలు వస్తే వాటి వివరాలు నోట్ చేసుకోవాలి. ఇప్పటికే అనామలిస్, మ్యాపింగ్ కానీ జాబితా వివరాలను ఆయా రాజకీయ పార్టీలకు అధికారులు పంపిణీ చేశారు. దింతో రెండు రోజులుగా ఆయా మున్సిపాలిటీల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నోటీసులు జారీ అయినటువంటి జాబితాలపై సమీక్షలు చేపడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,99,179 ఓటర్లకు అనామాలిస్ కింద అదేవిధంగా 27254 ఓటర్లకు మ్యాపింగ్ కానీ విభాగం కింద మొత్తంగా 2,26,433 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. నియోజకవర్గం అనామలిస్ మ్యాపింగ్ కానివి మొత్తం 1. హుస్నాబాద్ 49,217 4,046 53,263 2. సిద్దిపేట 50,062 7,734 57,7963. దుబ్బాక 38,924 6,704 45,628 4. గజ్వేల్ 60,976 8,770 69,7461,99,179 27,254 2,26,433 -
అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యం
● డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ● ఆహ్మదీపూర్లో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షు రాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమీటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆశోక్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని 55 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి రూ.5.50 కోట్లు, సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి రూ.5.41 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీ, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ లాంటి కార్యక్రమాలు గొప్ప మార్పునకు నాందిపలికాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు కొండల్రెడ్డి, నాయకులు అంజాగౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. -
నమోదు చేస్తేనే బోనస్
● వచ్చే నెల 10 వరకు అవకాశం ● జిల్లాలో 70 వేల ఎకరాల్లో సన్నాల సాగునారాయణఖేడ్: సన్నవడ్ల సాగుకు సంబంధించి క్వింటాల్కు రూ.500 చెల్లించే బోనస్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకువచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కొత్తగా విధించిన నిబంధన క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయం, ఆందోళనకు గురిచేస్తుంది. సాగు చేసిన విత్తనాల వివరాలను విత్తన దుఖాణాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనే షరతును విధించింది. దీంతో ఇప్పటికే వానాకాలం పంట సాగు చేసిన రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఏడు రకాల విత్తనాలకే ఈ బోసన్ వర్తిస్తుంది. కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించి డీలర్ల వద్దకు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ పేర్కొంది. సెప్టెంబరు 10వ తేదీలోపు ఈ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లాలో ఈ ఏడాది వానాలంలో 1,28,967 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఇందులో దాదాపు 65 వేల నుంచి 70 వేల ఎకరాల్లో రైతులు సన్నవడ్లను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఏడు రకాలకే బోనస్ ప్రభుత్వం ఈ ఏడాది ఏడు రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. అందులో ఆర్ఎస్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం 1638 (కూనారకం వరి–2), జై శ్రీరామ్, కేఎస్ఎం 7715, బీపీటీ 5204 (సాంబ మసూరు), హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ది) ఉన్నాయి. కాగా రైతులు సీజన్ కోసం నెల రోజుల క్రితమే విత్తనాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం బోనస్ కావాలంటే కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను సదరు దుకాణంలో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. బోనస్ పొందాలంటే విధిగా విత్తన కొనుగోలు బిల్లు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకంతో సంబంధిత విత్తన దుకాణానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నమోదు సమాచారం ఆధారంగానే క్షేత్రస్థాయి పంటల నమోదు జరుగుతుందని, లేని పక్షంలో బోనస్ దక్కదనే సంకేతాలు ఇవ్వడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎరువుల కోసం ఎఫ్ఎఫ్ఎస్ యాప్తో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరో తలనొప్పిగా పరిణమించింది. నిబంధనలు వెలువడగానే రైతులు గ్రామాల నుంచి మండల కేంద్రాల్లోని విత్తనాల దుకాణాలకు పరగులు పెడుతున్నారు. -
అండర్–17 క్రీడాకారుల ఎంపిక పోటీలు
సిద్దిపేట జోన్: పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం అండర్–17 బాలబాలికల విభాగంలో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో చిన్నకోడూరు జట్టు ప్రథమ స్థానంలో, దుబ్బాక జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలోనూ చిన్నకోడూరు ప్రథమ స్థానంలో, తొగుట పాఠశాల జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు నిర్మల్లో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
బ్రహ్మాండనాయకుడి వైభవం
ఘనంగా శ్రవణ నక్షత్ర మహోత్సవం వర్గల్(గజ్వేల్): శుభకర శ్రావణ మాస వేళ బుధవారం వర్గల్ క్షేత్రంలో వేంకటేశ్వరుని జన్మ నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రవణ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతులై కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామివారి మూలవిరాటుకు విశేషాభిషేకం నిర్వహించారు. పూలమాలికలు సర్వాభరణాలతో కమనీయంగా అలంకరించారు. లక్ష తులసి అర్చన, విశేష పుష్పార్చన, పారాయణాది పూజలు జరిపారు. శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. మహాప్రసాదం స్వీకరించారు. అంగన్వాడీ టీచర్కు సేవారత్న అవార్డు దుబ్బాక: సామాజిక సేవకురాలు, అంగన్వాడీ టీచర్ మహ్మద్ సుల్తాన ఉమర్కు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో న్యూలైఫ్ థియాలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ గౌరవ డాక్టరేట్తో పాటు మధర్ థెరిస్సా సేవారత్న అవార్డు, బంగారు పతకం అందజేశారు. రాయపోల్ మండలం ఇందుప్రియాల్కు చెందిన సుల్తాన ఉమర్ దశాబ్ద కాలంగా పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అంగన్వాడీ టీచర్గా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్తో పాటు మధర్ థెరిస్సా అవార్డు రావడంపై తనపై మరింతగా బాధ్యత పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు డాక్టర్ రోనాల్డ్జాన్, డాక్టర్ జీవన్ తదితరులు ఉన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెండి హరీశ్రావుకు ముదిరాజుల వినతి సిద్దిపేటజోన్: హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు మాజీమంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సంఘం నాయకులు కలిసి సమస్యలు వివరించారు. ముదిరాజ్ హక్కులపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ముదిరాజ్లను బీసీ డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీ అమలు అయ్యిందని, నేటి కాంగ్రెస్ హయాంలో పథకం నిర్వీర్యంగా మారిందన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా అసెంబ్లీలో ముదిరాజ్ల తరపున గళం విప్పాలని కోరారు. కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. మండల పరిధిలోని చంద్లాపూర్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు, నాయకులు చిరంజీవి తదితరులు ఉన్నారు. -
యూరియా కోసం వినూత్న నిరసన
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం మిరుదొడ్డి మండల పరిధిలోని రైతులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సెల్ ఫోన్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్లో యూరియా బుక్ చేసుకునేలోపే నిమిషాల్లోనే యూరియా అయిపోయిందని చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ వద్దు ఎరువుల దుకాణాల ద్వారానే యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. పంటలకు కీలక సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యాప్ విధానాన్ని రద్ధు చేసి నేరుగా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రంగనబోయిన రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాగా నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు సైతం పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. -
బాల్య వివాహం అడ్డుకున్న అధికారులు
ములుగు(గజ్వేల్): మండలంలోని తున్కిబొల్లారం గ్రామంలో జరగనున్న బాల్యవివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాలికకు పెళ్లి నిశ్చయమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్నతనంలోనే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలు, చట్టాల గురించి వివరించారు. మెనూ ప్రకారం భోజనం తప్పనిసరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్ అక్కన్నపేట(హుస్నాబాద్): విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. వంట గదితో పాటు తదితర పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. పాఠశాల ఆవరణంలోని వరండాతో పాటుగా పరిసరాలను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. భోజనంతో పాటు తదితర సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్చైర్మన్ ఐల్లయ్య, ఆత్మకమిటీ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, ఏపీఓ ప్రభాకర్, ప్రత్యేక అధికారి సరిత తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం సిద్దిపేటకమాన్: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య విభజన సృష్టించే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాలను ఎలా పంచుతారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ ఐక్యంగా స్పందించి శాంతియుత పోరాటానికి సిద్ధం కా వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సతీష్, శ్రీనివాస్, బాలరాజ్, కిరణ్ పాల్గొన్నారు.యాజమాన్య పద్ధతులతో సాగు లాభదాయకం జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి కొండపాక(గజ్వేల్): యాజమాన్య పద్ధతులతో సాగు లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి అన్నారు. ఈ మేరకు వ్యవసాయ సాగు విషయాల్లో రైతులకు అవగాహన కల్పిండంలో భాగంగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రసారం చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని కుకునూరుపల్లి మండలం మేదినీపూర్లోని రైతు వేదిక ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల వ్యవసాయాన్ని చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేలా సలహాలు సూచనలు అందించనున్నట్లు తెలిపారు. మోతాదుకు మించి యూరియాను ఉపయోగించడ వల్ల ఎక్కువ శాతం తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందన్నారు. -
పకడ్బందీగా భూ రీసర్వే
● కలెక్టర్ హైమావతి ● గడువులోగా పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ● ఇర్కోడులో మొక్కలు నాటిన కలెక్టర్ సిద్దిపేటరూరల్: జిల్లాలో భూముల రీ–సర్వేను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి సర్వే–ల్యాండ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో భూమి రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రీ సర్వే పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతి లైసెన్స్డ్ రీ–సర్వేయర్కు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సర్వే పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న భూమి రికార్డులను, సరిహద్దులను, విస్తీర్ణాన్ని ఆధునిక సర్వే పద్ధతులతో మళ్లీ కొలిచి, రికార్డులతో సరిపోల్చేలా పగడ్బందీగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా వనమహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ మొక్కను నాటారు. జిల్లాలో 17 లక్షల మొక్కలను గాను ఇప్పటివరకు 12 లక్షల మొక్కలు నాటినట్లున్నారు. ఈనెల చివరి నాటికి పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ ఏడీ సుదర్శన్, మండల సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామన్ డైట్ మెనూ పాటించాలి.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పకుండా పాటించాలని కలెక్టర్ హైమావతి పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నగుండవెల్లిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో మెనూ పాటించడంలేదని, ప్రధానోపాద్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. -
ఉద్యమకారుల సంక్షేమం పట్టని సర్కార్
మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణ ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మిరుదొడ్డి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రకారం ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, రూ.25 వేల పింఛన్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని తెలంగాణ ఉద్యమకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేశారు. కార్యక్రమంలో టీయూ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, సూకూరి లింగం, వల్లాల సత్యనారాయణ, పూడూరి శ్రీనివాస్, కాలేరు శ్రీనివాస్, కోల విజయ్, నర్సింహులు, మల్లేశం, రమేష్ గౌడ్, మల్లయ్య, స్వామి, రమేష్, శంకర్, రవి, భిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద పెద్ద మేడలు
ఇరుకు గల్లీలు.. హైదరాబాద్ ఘటనతోనైనా.. హైదరాబాద్లో జరిగిన ఘటనతోనైనా మున్సిపల్ అధికారులు మేల్కొంటారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. కాసులకు ఆశపడి అక్రమ కట్టడాలపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ కట్టడాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అనుమతులు లేకుండా 48 గజాల్లో ఏడంతస్తుల భవన నిర్మాణం ఈ నెల 22న కూప్పకూలిన విషయం విదితమే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకముందే అధికారులు మేల్కొవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. నిబంధనలు గాలికి.. అంతస్తులు ౖపైపెకి హైదరాబాద్ ఘటనతోనైనా మేల్కోని జిల్లా యంత్రాంగం సెట్ బ్యాక్లు లేకుండానే నిర్మాణాలు దృష్టిసారించాలంటున్న ప్రజలునిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుండటం క్షేత్రస్థాయిలో టౌన్ప్లానింగ్ అధికారులకు కనిపిస్తున్నా.. చర్యలు మాత్రం నోటీసులకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నిర్మాణం ప్రారంభం దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు.. భవనం పూర్తయ్యేవరకు వేచి చూస్తున్నారనే విమర్శలున్నాయి. పునాది దశలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. టౌన్ప్లానింగ్ సిబ్బందిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే నచ్చినన్ని అంతస్తులు నిర్మించుకునేందుకు అనధికారికంగా సహకరిస్తున్నట్లు సమాచారం. వీరికి కొందరు రాజకీయ నేతల అండదండలూ ఉన్నట్లు ప్రచారం. ముందుగా మేల్కొనాలి ప్రతి భవనానికీ అనుమతులు ఉన్నాయా? అనుమతించిన విస్తీర్ణం ఎంత? నిర్మించిన అంతస్తులు ఎన్ని? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? అత్యవసర వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉందా? అన్న అంశాలను పరిశీలించాలి. అక్రమ నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూల్చివేతలు చేపట్టడంకంటే.. నిర్మాణం ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇరుకు గల్లీల్లో ఆస్పత్రులు సిద్దిపేట పట్టణంలో భరత్నగర్, పారిపల్లి స్ట్రీట్, శివాజీనగర్, సుభాష్ రోడ్డు, బొర్ర హనుమాన్ గల్లీలలో ఎక్కువగా ఆస్పత్రులు, బట్టల దుకాణాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్న స్థలాలను సైతం వదలకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీలలో 75 గజాల్లోపు స్థలాలకు మున్సిపాలిటీ అనుమతుల విషయంలో వెసులుబాటు ఉండటంతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఒకప్పుడు నివాస ప్రాంతాలుగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు ఎక్కువగా వాణిజ్య భవనాలతో నిండిపోతున్నాయి. అయితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువగా అంతస్తులు నిర్మించడం వల్ల జనసాంద్రత పెరగడంతో అత్యవసర సమయంలో అంబులెన్సులు వెళ్లేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిద్దిపేట పట్టణం సుడా కార్యాలయం సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ ఈ ఏడాది ప్రారంభమైంది. ఈ భవనానికి మున్సిపల్ అనుమతులు తీసుకున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. అగ్నిమాపక వాహనం తిరిగేందుకు వీలుగా భవనం చుట్టూ దాదాపు 4మీటర్ల స్థలాన్ని వదిలిపెట్టాలి. అలాగే భవనం కూడి వైపు, వెనుకవైపు సెట్బ్యాక్ వదలలేదు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీటీఎఫ్ను ఏర్పాటు చేస్తున్నాం అక్రమ కట్టడాలను గుర్తించేందుకు డీటీఎఫ్ టీం ఏర్పాటు చేస్తున్నాం. ఏరియా మేరకు సెట్ బ్యాక్కు వదిలిపెట్టి ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా చుట్టూ వదలాలి. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేయకపోతే ఓసీలు సైతం ఇవ్వడం లేదు. – మల్లికార్జున్, ఇన్చార్జి కమిషనర్, సిద్దిపేట మున్సిపాలిటీహైదరాబాద్లోనే కాదు.. జిల్లాలోని మున్సిపాలిటీలలోనూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు అటకెక్కిస్తున్నారు. బహుళ అంతస్తుల చుట్టూ కనీసం అగ్నిమాపక వాహనం తిరిగేందుకు కూడా స్థలాన్ని వదిలి పెట్టడం లేదు. ఇరుకు గల్లీల్లో పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో కొన్ని చోట్ల అతి తక్కువ విస్తీర్ణంలో రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం తనిఖీలు చేసి కట్టడి చేసేవారే లేరు. –సాక్షి, సిద్దిపేట -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని వెంకట్రావుపేటలో మిరుదొడ్డి ఎకై ్సజ్ సీఐ సునీత ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులతో కలిసి మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ఈత మొక్కలను నాటారు. మొక్కలను నాటి సంరక్షించే విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్గించారు. హరిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహారెడ్డి సర్పంచ్ కవిత, నాయకులు స్వామి గౌడ్, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆదర్శనీయం
మాజీ మంత్రి హరీశ్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం, శాంతి, దయ, సోదరభావాన్ని ప్రవక్త చాటారని ఆయన కొనియాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రజలకు ఐక్యత, మానవ సేవ సందేశాన్ని అందించారన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు, మత సామరస్యం సమాజానికి ఆదర్శమన్నారు. అల్లా దయతో ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, దిలాల్పూర్ సర్పంచ్ వెంకన్నగారి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ గొప్ప పరివర్తనకు నాంది పలికిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే రేషన్ కార్డులు అందుతున్నాయని చెప్పారు. కాగా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
పీజీ, పీహెచ్డీ విద్యార్థుల నిరసన
ములుగు(గజ్వేల్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్(ఉద్యాన) సీట్లను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రధాన గేటును మూసివేసి, ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రత్యేక హోదాను కాపాడాలంటూ, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నప్పటికీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ సీట్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ఈ అంశంపై పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. దీంతో ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందన్నారు. హార్టికల్చర్ సీట్ల భర్తీపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ములుగు తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎస్ఐ రఘుపతి విశ్వవిద్యాలయానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. -
పిల్లలు బాగా చదువుకోండి
సిద్దిపేటజోన్: పిల్లలు ఎలా ఉన్నారు.. వసతులు ఎలా ఉన్నాయి? బాగా చదువుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సౌజన్య ఆప్యాయంగా పలకరించారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ఆదేశాల మేరకు స్థానిక బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల యోగక్షేమాలు, విద్య, వసతుల గూర్చి ఆరా తీసి, చట్టాలపై అవగాహన కల్పించారు. చదువు ప్రాముఖ్యత గూర్చి వివరించారు. అలాగే శిశు గృహాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు పండ్లు అందజేశారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ హానర్ (1), ఎకానామిక్స్ (1), ఫైనాన్స్ (1), తెలుగు (1) ఆధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 27న ఉదయం 10.30గంటల నుంచి కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల కోసం.. ప్రశాంత్నగర్(సిద్దిపేట): జాతీయ ఉపాధ్యా య దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఆదర్శ, కేజీబీవీ, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈ నెల 29లోగా దరఖాస్తులను స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో అందించాలన్నారు. సవరణలు చేపట్టాలి దుబ్బాక: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులతో కలిసి సోమవారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్మక్వానను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989లో కీలక సవరణలు చేయా లని కోరారు. దీంతో కిషోర్మక్వాన సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చినట్లు వెంకటయ్య తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకవుతాం ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చేబర్తి యాదగిరి గజ్వేల్: అణగారిన వర్గాల పక్షాన భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో భాగస్వాములమవుతామని మాదిగ ఉద్యోగుల సమాఖ్య(ఎంఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చేబర్తి యాదగిరి అన్నారు. ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై న సందర్భంగా సోమవారం గజ్వేల్లో విలేకరులతో మాట్లాడారు. గౌతమబుద్ధుడు, పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్, జగ్జీవన్రామ్ లాంటి మహనీయుల ఆకాంక్షించిన నవ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ, ఉద్యోగులు పీఆర్సీ, డీఏ, సీపీఎస్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారానికి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. జక్కనపల్లి రాముకు జాతీయ పురస్కారం చేర్యాల(సిద్దిపేట): పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాముకు మరో అరుదైన జాతీయ అవార్డు వరించింది. సోమవారం తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పురస్కారాలను ట్రస్టు వ్యవస్థాపకుడు గౌరిశంకర్ ప్రదానం చేశారు. సుద్దముక్కలపై తెలుగు భాష వర్ణమాల చేయడంతో జక్కనపల్లి రాముకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాహితి బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కలిపించి, సన్మానం, ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సాహితి సామ్రాట్ సూరేంపల్లి విజయ, పొదిల విశ్వనాథ శాస్త్రి, మహిళ కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ వ్యవస్థ నిర్వీర్యం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఓ 97 ద్వారా పాలిటెక్నిక్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అభిషేక్ ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను పెంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. -
యువతకేదీ భరోసా?
స్వయం ఉపాధి అరకొరే.. స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కు కోవాలనుకున్న నిరుద్యోగుల ఆశలు.. యూనిట్ల పరిమితితో డోలాయమానంగా మారాయి. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు స్వీకరించడంతో భారీ సంఖ్యలో వచ్చాయి. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య మాత్రం అందులో పదో వంతుకు కూడా లేపోవడం గమనార్హం. దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. – సాక్షి, సిద్దిపేటనిరుద్యోగులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎలక్ట్రికల్ టూ వీలర్, ఎలక్ట్రికల్ త్రీ వీలర్, సోలార్ పంప్ కంట్రోల్, పాడి పశువులను సబ్సిడీ ద్వారా అందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మండలాల్లో ఎంపీడీఓలు దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎంపికై న వారికి 70 శాతం నుంచి 100 శాతం సబ్సిడీ ద్వారా అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,191 దరఖాస్తులు రాగా 361 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. రూ. 5.37 కోట్లు ఈవీ టూ వీలర్కు రూ.లక్ష యూనిట్ కాగా 90 శాతం సబ్సిడీ, ఈవీ త్రీ వీలర్ రూ.3లక్షలు. దీనికి 70 శాతం సబ్సిడీ. సోలార్ పంప్నకు రూ.3.7 లక్షలు కాగా వంద శాతం సబ్సిడీ. పాడి పశువులకు రూ.2లక్షలకు 80 శాతం సబ్సిడీని అందించనున్నారు. జిల్లాకు 361 యూనిట్ల టార్గెట్ కాగా వీటికి రూ. 5.37 కోట్లు మంజూరు కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో 11 శాతం మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. మిగిలిన వారంతా ఎంపిక ప్రక్రియ పై ఆశలు పెట్టుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపికపైనే ఉత్కంఠ స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ వస్తే ఉపాధి పొందవచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దాని పై ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తీవులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా యూనిట్ల సంఖ్యను పెంచితే మరింత మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ‘రాజీవ్ యువ వికాసం’ ఏమాయె.. యూనిట్ల సంఖ్య పెంచాలి నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ ద్వారా వివిధ వాహనాలు అందజేసేందుకు దరఖాస్తులను స్వీకరించారు. మంజూరు టార్గెట్ తక్కువ ఇవ్వడంతో తక్కువ మందికే లబ్ధిచేకూరనుంది. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి యూనిట్ల సంఖ్య పెంచాలి. – ఉమేశ్, సిద్దిపేట ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది స్వయం ఉపాధి కల్పించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. బడ్జెట్ రాగానే ఎంపికై న లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్నాం. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా ఎంపీడీఓలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాలకు టార్గెట్లు ఇచ్చాం. ఎంపిక బాధ్యత అంతా ఎంపీడీఓలదే. – విజయ్ భార్గవ్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేశ్ చిన్నకోడూరు(సిద్దిపేట): ఎస్సీ కార్పొరేషన్లో ఆశించిన స్థాయిలో పథకాలు అమలు కావడం లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేశ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పేరుతో దరఖాస్తులు స్వీకరించినా అమలు మాత్రం కాగితాలకే పరిమితమైందన్నారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు అందిస్తామని చెప్పి మరోసారి దరఖాస్తులు తీసుకున్నా వాటి అమలుపై స్పష్టత లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా ఎస్సీ నిరుద్యోగ యువతకు అందలేదన్నారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
● మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం ● ‘సర్’లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోవద్దు ● ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ మెదక్జోన్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారని, అర్హులకు పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం మెదక్లో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని తనతో పాటు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో ఢిల్లీ పెద్దలు చర్చించారని తెలిపారు. ప్రాదేశిక సహకార సంఘాల్లో (పీఏసీఎస్లు) నామినేటెడ్ కాబోతున్న పదవులు ముఖ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఆరు గ్యారంటీల అమలు సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఓటరు సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో ఎంతో మంది ఓట్లను కేంద్రం తొలగిస్తుందని, అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కార్యకర్తలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. వర్గ రాజకీయాలతో పార్టీకి నష్టం అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యకర్తలతోనే పార్టీ మనుగడ సాగుతుందని, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే బలోపేతం అవుతుందన్నారు. వర్గ రాజకీయాలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిని పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడి నామినేటెడ్ పదవుల గురించి చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రావు, సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల డుమ్మా! పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి దూరంగా ఉన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారిద్దరు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరైనప్పటికీ ఆయన వేదిక పైన ఎక్కడో మూలన కూర్చుండి పోయారు. సమావేశం ముగియకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్లోని వర్గ విభేదాలపై ద్వితీయ శ్రేణి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. -
మరింత మెరుగైన వైద్య సేవలు
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన హుస్నాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 250 పడకల ఆస్పత్రి భవనం పూర్తయితే ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువకానున్నాయని మంత్రి తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, కౌన్సిలర్లు ఉన్నారు. -
ప్రతీ గ్రామంలో 1000 మొక్కలు నాటాలి
● నేడు జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం ● కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో మంగళవారం 1000 మొక్కలు నాటాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరో రెండు, మూడు రోజులు వర్షం కురవనున్న క్రమంలో మొక్కలు నాటేందుకు సరైన సమయమన్నారు. వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో 17 లక్షల 68వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొక్కటు నాటేందుకు 2లక్షల గుంతలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇరిగేషన్ శాఖ ఖాళీ ప్రదేశాల్లో మ్కొలు నాటాలన్నారు. లింగ నిర్ధారణపరీక్షలు చేస్తే చర్యలుజిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్పై జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్, డయాగ్నోస్ సెంటర్ల, ఆస్పత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్కై కావాల్సిన ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ అన్ని ఆసుపత్రుల్లో పీసీ అండ్ ిపీఎన్డీటీ యాక్ట్కు సంబంధించిన రిజిస్టర్స్ నిర్వహణ చేయాలన్నారు. -
ఐరన్ పరిశ్రమ వద్దే వద్దు
తూప్రాన్: ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఐరన్ పరిశ్రమను తొలగించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్, కాలుష్య నియంత్రణ మండలికి గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమను చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమను తొలగించే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు. -
వర్షాలతో రైతన్న ఖుషి
జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖుషిగా తమ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా మేఘావృతమై చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో ఆరుతడి పంటలతో పాటుగా వరి నాట్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 15 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుబ్బాక , అక్బర్పేట–భూంపల్లి మండలాల్లో 31మిల్లీమీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 30మి.మీ., మర్కూక్లో 28మి.మీ., అక్కన్నపేటలో 25మి.మీ., సిద్దిపేట రూరల్ మండలంలో 22మి.మీ., రాయిపోల్లో 18మి.మీ., మిరుదొడ్డి, కొండపాక మండలాల్లో 17మి.మీ., నారాయణరావుపేట, గజ్వేల్ మండలాల్లో 16 మి.మీ., హుస్నాబాద్ మండలంలో 14మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తగ్గిన ఉష్ణోగ్రతలు: వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు మేఘావృతమైన ఆకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. జిల్లాలో గరిష్ట 27 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండగా, కనిష్టంగా 21 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. దీంతో పాటుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో శీతలగాలులు వీస్తున్నాయి. పత్తిచేను కళకళపట్టణంలో కురుస్తున్న వర్షం -
సత్వరమే అర్జీల పరిష్కారం
● కలెక్టర్ హైమావతి ● అందిన అర్జీలు 90 సిద్దిపేటరూరల్: ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 90 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శక్తి పాలసీ వెనక్కి తీసుకోవాలి.. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను గందరగోళానికి గురి చేసే శక్తి పాలసీని వెనక్కి తీసుకుని యూఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర సాంకేతిక విద్యను అందిస్తూ పాలిటెక్నిక్ కళాశాలల స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భవన నిర్మాణాన్ని నిలిపివేయండి సిద్దిపేట పట్టణం పాతబస్టాండ్ దగ్గర జిల్లా మత్స్యశాఖకు చెందిన 150 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని చేపడుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని మత్స్యసహకార సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు బాల్రంగం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంఘంలో ఎంతో మంది మత్స్య పారిశ్రామిక సభ్యులు, మహిళా సభ్యులు ఉన్నారన్నారు. శిక్షణ, నైపుణ్యం, జీవనోపాధి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సభ్యులకు అందుబాటులో ఉండేలా భవన నిర్మాణం చేపట్టాలన్నారు.వర్షం ఎఫెక్ట్: తగ్గిన వినతులు సాక్షి, సిద్దిపేట: మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగిన ప్రజావాణిలో అర్జీలు అంతంత మాత్రమే వచ్చాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం నుంచి వర్షం కురవడంతో ప్రజావాణికి దరఖాస్తు దారులు ఎక్కువగా రాలేదు. దీంతో వినతులు తగ్గాయి. గత సోమవారం 238 వినతులు రాగా ఈసారి 131 వినతులు వచ్చాయి. దూల్మిట్ట, మద్దూరు, రాయపోల్, వర్గల్ మండల కేంద్రాల్లో ఒక్క వినతి సైతం రాలేదు. అత్యధికంగా బెజ్జంకి మండలంలో వినతులు వచ్చాయి. ఆయా శాఖలకు చెందిన 456 మంది అధికారులు పాల్గొన్నారు. -
ఔటర్ రింగు రైలు
హైదరాబాద్ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ త్వరలో ప్రారంభించనున్న ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు 3.5కి.మీ. నుంచి 11 కిలోమీటర్ల దూరంలో రింగు రైల్ మార్గం నిర్మాణం చేపట్టాలని ముందుగా అనుకున్నారు. కానీ తాజాగా డీపీఆర్లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్కు కొద్ది దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు కలిసి రానుంది. – గజ్వేల్ ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి రంగం సిద్ధమైన వేళ.. మరో భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రైలు వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)తోపాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, యాదాద్రి జిల్లాల మీదుగా రింగు రైలు అలైన్మెంట్ ఖరారైంది. ముందుగా ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగు రోడ్డు)కు సమాంతరంగా చాలా చోట్ల 3.5కిలోమీటర్ల దూరంలో, ఒకటి రెండు చోట్ల 11కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ను సిద్ధం చేశారు. కానీ నేడు అలైన్మెంట్లో మార్పులు చేసి ట్రిపుల్ఆర్ పక్కనే అంటే.. కొద్ది దూరంలోనే రింగు రైలు నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంబంధించిన డీపీఆర్ (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపొర్ట్)కు కేంద్రం ఆమోదం పలికినట్లు వార్తలొస్తున్నాయి. అలైన్మెంట్ మారటం వల్ల గతంలో మాదిరిగా కాకుండా ట్రిపుల్ఆర్కు దగ్గరగా, సమాంతరంగా ఔటర్ రింగు రైలు వెళ్లనుండటం అన్ని రకాలుగా కలిసి రానుంది. ఈ రెండు ప్రధాన భారీ అభివృద్ధి ప్రాజెక్ట్లు పక్కనే పక్కనే ఉండటం ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుంది. రవాణా ఆధారిత వాణిజ్యానికి ఊతం ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రధానంగా రవాణా ఆధారిత వాణిజ్యం అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండటం వల్ల ట్రిపుల్ఆర్తోపాటు ఔటర్ రింగు రైలుతో ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార రంగాలు భారీగా విస్తరించనున్నాయి. కాగా అవుటర్ రింగు రైలు ప్రాజెక్టులో భాగంగా ఆరు చోట్ల ఆర్ఓఆర్(రైల్ ఓవర్ రైల్) వంతెనలు రానున్నాయి. ఈ ఆర్ఓఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని గజ్వేల్లో రానుందని ప్రకటనలు వెలువడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల మీదుగా ఈ రింగు రైలు 120 కిలోమీటర్లపైనే విస్తరించే అవకాశాలున్నాయి. -
గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కోహెడలో పలు గ్రామాల్లో మంత్రి పర్యటనకోహెడరూరల్(హుస్నాబాద్): గ్రామాలను అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడ మండలం శనిగరం, తంగళపల్లి, గుండారెడ్డిపల్లి, కూరెళ్ల, వెంకటేశ్వరపల్లి గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం.. పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శనిగరం గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ పంచాయతీ వద్ద ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధుల నుంచి సమస్యలు, వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు. శనిగరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం, గంగమ్మ కాలువ, బెజ్జంకి కాలువల సీసీ పనులు పూర్తి చేయడం వంటి అంశాలను సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే తంగళ్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుండారెడ్డిపల్లి, కూరెళ్ల, వెంకటేశ్వరపల్లిగ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మిప్రసన్న, సర్పంచ్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూమికి ఎసరు
● కాసాల శివారులో కబ్జా ● రూ. 20 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పరం ● చోద్యం చూస్తున్న అధికారులు హత్నూర(సంగారెడ్డి): రూ. కోట్లు విలువ చేసే అసైన్డ్ భూమికి కొందరు అక్రమార్కులు ఎసరుపెట్టారు. సుమారు 9 ఎకరాలను కబ్జా చేసి దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హత్నూర మండలం కాసాల శివారులో పట్టా భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 226, 227లో 48 ఎకరాల పట్టా భూమి ఇతర ప్రాంతానికి చెందిన పెద్దలు కొనుగోలు చేశారు. ఈ భూమిలో మామిడి తోటతో పాటు వరి, కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే దీనికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 336లోని సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి–దౌల్తాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం ప్రభుత్వ భూమి ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే నంబర్ 336లోని ప్రభుత్వ భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైనట్లు తేలితే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ షేక్ పర్వీన్ వివరణ కోరగా.. సంగారెడ్డి– దౌల్తాబాద్ రహదారికి పక్కన ఉన్న మామిడి తోటలో అసైన్డ్ భూమి కబ్జాకు గురైన విషయం తమ దృష్టిలో ఉందని తెలిపారు. వారం క్రితం సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సర్వేయర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. -
రోస్టర్ విధానం రద్దు చేయాల్సిందే
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ దుబ్బాక:: రోస్టర్ విధానం వల్ల మాలలకు తీరని అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్లను పునఃరుద్ధరించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాకలో ‘హలో మాల.. చలో దుబ్బాక’ కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 31న నిర్వహించతలపెట్టిన రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి కాల్వ నరేష్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ర్యాకం శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి సిద్దిపేట న్యాయశాఖ ఉద్యోగులు సిద్దిపేటకమాన్: ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాకేష్ దేశ్పాండే, రాష్ట్ర కార్యదర్శి కరుణశ్రీ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి న్యాయశాఖ ఉద్యోగులు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కరువైందన్నారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు శ్రీనివాస్, వంశీ, సోమశేఖర్, శ్రీనివాస్రెడ్డి, వినయ్, రవిందర్, విజేందర్, ఉదయ్శ్రీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్రెడ్డితొగుట(దుబ్బాక): బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని గుడికందుల మాజీ ఉప సర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ నియామక పత్రాన్ని ఆదివారం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషిచేస్తానన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియామకానికి సహకరించిన ఎంపీ రఘు నందన్రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. కో–ఆపరేటివ్ సెల్ కన్వీనర్గా వేణుగోపాల్రావు అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన జనగామ వేణుగోపాల్రావు బీజేపీ జిల్లా కో–ఆపరేటివ్ సెల్ కన్వీనర్గా నియమితులయ్యారు. ఆదివారం ఆయన తనపై నమ్మకంతో నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘనందన్రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
వామ్మో.. వయ్యారి భామ
వయ్యారి భామ ఇది ఒక విషపు కలుపు మొక్క. పొలాల్లో పెరిగితే పంటల దిగుబడులు తగ్గిపోతాయి. ఇవే మొక్కలు ఇళ్ల మధ్య పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్రామీణుల పరిభాషలో వయ్యారి భామగా పిలిచే ఈ కలుపు మొక్కలను పార్ధినియంగా పిలుస్తారు. ఇవి వర్షాకాలంలో పెరిగి పుష్పిస్తుంటాయి. గాలి ద్వారా ఒక్కో మొక్క 80 వేల వరకు విత్తనాలను వెదజల్లుతుంటాయి. దీంతో ఈ మొక్కలు కోట్లలో పెరిగి సమస్యకు దారి తీస్తుంటాయి. ఇవి ఎక్కడ పెరిగితే అక్కడ సమస్యలను సృష్టిస్తాయని డాక్టర్లు, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. కనీసం పశువులు కూడా మేయని ఈ వయ్యారి భామ కలుపు మొక్కలను రైతులు, గ్రామీణ ప్రాంత వాసులు సమూలంగా నిర్మూలించుకోవాలని వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
పూజల పేరుతో ఇద్దరి కిడ్నాప్
12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు కొండపాక(గజ్వేల్): పూజల పేరుతో నమ్మించి ఇద్దరిని కిడ్నాప్ చేసిన ఘటన కుకునూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. 12 గంటల్లో నే పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి బాధితులను రక్షించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగ ర్ జిల్లా గన్నేరువరానికి చెందిన మఠం శ్రీనివాస్, అనిల్, శివశంకర్లు పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట కల్వకుర్తి జూపల్లి గ్రామంలో పూజలు చేయాలంటూ శివ, పర్వతాలు ఫోన్ చేయగా వీరు వెళ్లి పూజలు చేశారు. ఈనెల 22న కొమురవెల్లి దేవస్థానం వద్ద మళ్లీ పూజలు చేయాలంటూ శివ, పర్వతాలు అనే వ్యక్తులు అనిల్కు ఫోన్ చేసిరమ్మన్నారు. దీంతో అనిల్, రాజు, శ్రీనివాస్లు కారులో అదే రోజు మధ్యాహ్నం కొమురవెల్లి కమాన్ వద్దకు చేరుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తితో పాటు మరి కొందరు కలిసి పూజలు చేసేందుకు వెళ్లిన ముగ్గురిపై దాడి చేశారు. రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తూ కిడ్నాప్ చేసి హై దారాబాద్ వైపునకు తీసుకె ళ్లారు. కిడ్నాప్కు గురైన వారిలో శ్రీనివాస్ తప్పించుకొని కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ఎస్ఐ బాలకృష్ణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కిడ్నాప్నకు గురైన వ్యక్తులు నాగర్కర్నూల్ జిల్లా వైపు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మరో నలుగురు పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన కిడ్నాపర్లు ఇద్దరు వ్యక్తులకు వదిలేసి పారిపోయారు. దీంతో రాజు, అనిల్లను కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కిడ్నాపర్లను త్వరలో పట్టుకుంటామన్నారు. -
రచయితలకు పురస్కారాలు
సిద్దిపేటకమాన్: కవులు, రచయితలకు పురస్కారాలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆచార్య సంపత్కుమార్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన పెందోట సభలో ఆయన పాల్గొని రచయితలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట సాహిత్యానికి బాలకిషన్ పెట్టని కోట వంటివారన్నారు. పెందోట పురస్కారాలు అందించడం సిద్దిపేట సాహిత్య రంగానికి విశేషమైన విషయమన్నారు. బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పురస్కారాలు అందించినట్లు తెలిపారు. అనంతరం పెందోట వెంకటేశ్వర్లు రచించిన ‘ప్రేరణ కావాలి’ పుస్తకాన్ని ఆవిష్కరించి, కవి సమ్మేళనం నిర్వహించారు. విశ్వతేజ కావ్యశ్రీలకు బాలసాహిత్య పురస్కారాలు, నగదు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో శ్యామల, వెంకటేశం, ఉమారాణి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు. -
తుట్టెలు కట్టి.. పురుగులు పట్టి
● రేషన్లో ముక్కిన బియ్యం ● లబ్ధిదారుల ఆగ్రహంమర్కూక్(గజ్వేల్): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం ముక్కిపోయి తుట్టెలు కట్టి, పురుగులు పట్టినవి రావడంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. రేషన్ దుకాణాల్లోకి 3 నెలల బియ్యం ఒకే సారి రావడంతో పురుగులు పట్టినవి వస్తున్నాయని వాపోతున్నారు. మర్కూక్ మండలంలో 14 రేషన్ షాపులు ఉండగా ఆదివారం మర్కూక్ రేషన్ షాపుతో పాటు కొన్ని షాపులకు సరఫారా అయిన బియ్యం పురుగులు, ముక్కిపోయినవి వచ్చాయి. అంతేకాక దొడ్డుబియ్యం, రాళ్లు, దుమ్ము ఉండటంతో ఎలా వండుకుని తినాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బియ్యం వండుకుని తింటే రోగాల బారిన పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యం సరఫారా చేయాలని ఆయా గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు. -
నాచగిరిలో పవిత్రోత్సవాలు
నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ రంగాచారి తెలిపారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఆదివారం ఉదయం 8.30 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభస్థాపన, పవిత్ర అధివాసం, మూలమంత్ర హోమం, ద్రావిడ ప్రబంధ పారాయణం జరుగుతాయి. సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, మంగళవారం ఉద యం 8.30 గంటలకు హోమం, మహాపూర్ణాహుతి పూజలు జరుగుతాయన్నారు. పవిత్రోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. భయాందోళనలో ప్రజలు దుబ్బాక: పట్టణంలోని 14వ వార్డులో ఓ మహిళ డెంగీ బారిన పడింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహిళకు పరీక్షల్లో డెంగీ నిర్ధారణ కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన కౌన్సిలర్ తునికి సురేష్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ పీహెచ్సీ వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఆ కాలనీలో ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాగా మహిళకు డెంగీ బారిన పడటంతో కాలనీలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జిల్లా సంక్షేమ అధికారి శారద దుబ్బాక: అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఆయాల నియామకాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శారద తెలిపారు. శుక్రవారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో ధ్రువ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 78 టీచర్స్ పోస్టులకు 1999 దరఖాస్తులు.. 13 ఆయా పోస్టులకు 62 వచ్చాయన్నారు. ఈ నెల 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతామన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): స్థానిక రైల్వేస్టేషన్ను దక్షిణమధ్య రైల్వే వైద్యాధికారుల బృందం డాక్టర్ శారద ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన రైల్వేస్టేషన్లో వీల్ చైర్, స్ట్రెచర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు లేవని గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అలాగే స్టేషన్లోని తాగునీటి శాంపిల్స్ ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. సిద్దిపేటఎడ్యుకేషన్: జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేట ప్రభుత్వ మహిళాడిగ్రీ కళాశాల నుంచి ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, చరిత్ర విద్యార్థినుల బృందాలు పాల్గొని తమ స్టడి ప్రాజెక్టులను వివరించారు. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్కుమార్ పర్యవేక్షక అధ్యాపకులతో పాటు విద్యార్థినులను అభినందించారు. కళాశాల నుంచి నాలుగు బృందాలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆగి ఉంటాయి.. ఆయువు తీస్తాయి
● రోడ్డుపైనే ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ ● ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు చిన్నకోడూరు(సిద్దిపేట): భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిబంధనల తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగ వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతోంది. కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై మండల పరిధిలోని అనంతసాగర్, చర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, ఇబ్రహీంనగర్, మందపల్లి తదితర గ్రామాల సమీపంలో వాహనాలు రోడ్డుకు ఆనుకుని నిలుపుతున్నారు. ఈ రహదారిపై 24 గంటలు వాహనాల రద్దీ ఉంటోంది. వాహనాలు మరమ్మతులకు గురైతే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పక్కనే నిలిపేస్తున్నారు. వెనుక నుంచి వచ్చే వాహనదారులు ముందున్న వాహనం కనిపించకపోవడంతో నేరుగా వెళ్లి ఢీకొంటున్నారు. రాజీవ్ రహదారిపై తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజీవ్ రహదారిపై .. రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న హోటళ్ల సమీపంలో పార్కింగ్ స్థలాన్ని దాటి వాహనాలను రోడ్డుపైనే ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. ఇవి వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరిక, రేడియం బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. వేగంగా వచ్చే వాహనాలు డ్రైవర్లకు ముందున్న వాహనం నిలిపి ఉందా లేక ప్రయాణిస్తుందా తెలియక గందరగోళానికి గురవుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరగడంతో పోలీసులు, సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఇలా.. ● కరీంనగర్లో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు ప్రైవేటు వాహనంలో సిద్దిపేట తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అనంతసాగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ బీసీ కాలనీలో డ్రైనేజీ పైకప్పు ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం ఆదమరిచినా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. డ్రైనేజీ పై కప్పు ధ్వంసమై ఏడాది గడుస్తున్నా పట్టించుకునే వారే లేరు. నిత్యం కాలనీ వాసులు ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
మహారాష్ట్ర తెలుగులో మన పాఠం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, రిటైర్డ్ ఉపాధ్యాయులు చొప్పదండి సుధాకర్ రచనకు చోటు లభించింది. మహారాష్ట్రలో తెలుగు రెండో భాషగా విద్యార్థులు అభ్యసిస్తారు. దీంతో 6వ తరగతి పాఠ్యపుస్తకంలో సుధాకర్ రచించిన మన చేతుల్లో మన ఆరోగ్యం రచనను పాఠ్యాంశంగా చేర్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చొప్పదండి సుధాకర్ 30 ఏళ్లుగా కవిగా, రచయితగా కొనసాగుతున్నారు. సిద్దిపేట కవి రచనకు చోటు -
ఊరికో వెబ్సైట్
అర చేతిలో పల్లె సమస్త సమాచారం● ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్ట్లో మూడు గ్రామాల్లో రూపకల్పన ● సిద్దిపేట జిల్లాలో కూరెళ్ల, సంగారెడ్డిలో చిన్నలోని, మెదక్లో నందగోకూల్ జీపీలు ● ప్రత్యేక అధికారుల నియామకం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్లో ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీల వెబ్ సైట్లను రూపొందించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల, మెదక్ జిల్లా నందగోకూల్ గ్రామ పంచాయతీ, సంగారెడ్డి జిల్లా చిన్నలోని గ్రామ పంచాయతీలను పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా వెబ్సైట్ల రూపకల్పన చేశారు. వెబ్సైట్లో పంచాయతీ కోడ్, వైశాల్యం, జనాభా, కుటుంబాలు, గృహాలు, రేషన్ కార్డులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, పంచాయతీ, మండల, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు, రహదారులు, నల్లాలు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, మహిళా సంఘాలు ఇలా సమస్త సమాచారం ఉండనుంది. మూడేళ్ల ప్రణాళిక గ్రామ పంచాయతీలో 2026–27, 2027–28, 2028–29 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చేసే సమగ్ర అభివృద్ధి సమాచారం పొందుపరచనున్నారు. ఇందులో గ్రామీణాభివృద్ధి, వీబీ రామ్జీ ఆధ్వర్యంలో చేసే పనులు, స్వచ్ఛభారత్ మిషన్, జీపీకి అభివృద్ధికి అవసరమైన అంచనా బడ్జెట్కు సంబంధించిన నివేదికను తయారు చేసి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. అధికారుల నియామకం ప్రత్యేకంగా వెబ్ సైట్లను రూపొందించేందుకు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించింది. సంగారెడ్డి, సిద్దిపేటలకు రూరల్ డెవలప్మెంట్ విజిలెన్స్ అధికారి ఉమారాణి, మెదక్ జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ విజయరావులను నియమించారు. వీరు పల్లెలకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన కోసం కసరత్తు చేస్తున్నారు. కూరెళ్ల పంచాయతీ వివరాలు సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామ జనాభా 2,586. అందులో పురుషులు 1,236, మహిళలు 1,350 మంది ఉన్నారు. కుటుంబాలు 623, రైతులు 854, వాటర్ సోర్స్ ఐదు చెరువులు, అంతర్గత రోడ్లు 9.9కిలో మీటర్లు, బీటీ రోడ్లు 1.5కిలో మీటర్లు, సీసీ రోడ్లు 2.4కిలో మీటర్లు, గ్రావెల్ రోడ్లు4.5కిలో మీటర్లు, విద్యుత్ స్తంభాలు 252, ఎల్ఈడీ లైట్లు 238, ఓపెన్ సీసీ డ్రైనేజీ 1.5కిలోమీటర్లు, కచ్చా డ్రైన్ 45మీటర్లు, ఆర్సీసీ హౌస్లు 319, రేకుల ఇళ్లు 71, పెంకుటిళ్లు 228, స్వయం సహాయక సంఘాలు 65, ట్యాప్ కనెక్షన్లు 601 ఇలా పలు వివరాలతో సమగ్ర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రస్తుతం వెబ్సైట్ అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పబ్లిక్ డోమైన్గా అందుబాటులోకి రానుంది. ఒక్క క్లిక్తో గ్రామ సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. పల్లెలోని ప్రతి అంశం.. వీధిదీపాల నుంచి వార్షిక బడ్జెట్ కేటాయింపుల దాకా క్షణాల్లో తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలోని ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్సైట్ను తయారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మూడు గ్రామాల వెబ్సైట్లు రూపొందించారు. – సాక్షి, సిద్దిపేట -
పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం తెచ్చిన జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాంకేతిక విద్యను స్కిల్ యూనివర్సిటిలో విలీనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులను సాంకేతిక విద్య నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. నిరుపేద విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉన్నందున జీఓను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలల ఐఖ్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు అద్యాపకులు నల్లబ్రాడ్జీలు దరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో అధ్యాపకుల నిరసన -
సరికొత్త ఒరవడి
సర్కారు బడి..సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై శిక్షణ అందిస్తున్నారు. తొలుత ఏఐ నేర్చుకోవాలనుకునే ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 168 మంది ఉపాధ్యాయులున్నారు. వచ్చే నెల 5 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐ శిక్షణ బాధ్యతలను అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విద్యాశాఖ అప్పగించింది. వీరికి వచ్చే నెల 5వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రోజు రాత్రి 7 గంటల నుంచి 8:30గంటల వరకు జూమ్లో శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేషన్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లో ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. విద్యార్థుల డేటాగోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత శిక్షణ తోపాటు త్వరలో ఏఐ వినియోగంపై ప్రాక్టికల్ వర్క్షాపులు నిర్వహించనున్నారు. కేవలం 168 మందే ఆసక్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులున్నారు. ఇందులో కేవలం 168 మందే ఏఐ శిక్షణకు ముందుకు రావడం చూస్తుంటే.. కొత్త పరిజ్ఞానం నేర్చుకోవాలని మక్కువ ఎంతమందికి ఉందో తెలుస్తోంది. త్వరలో నిర్వహించే మరో విడత శిక్షణకైనా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వినియోగించుకోవాల్సిన అసవరం ఉందన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 168 మంది ఉపాధ్యాయులు -
ఐశ్వర్యప్రదం.. వరలక్ష్మీ వ్రతం
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభశ్రావణ మాసం శుక్రవారం, వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో శ్రావణ శోభ సంతరించుకుంది. పలు ప్రాంతాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీదేవి, రేణుకా ఎల్లమ్మ, మహమ్మాయి అమ్మ వార్ల ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు. దీంతో జిల్లా అంతటాపండుగ వాతావరణం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
22ఏ జీఓతో పేదల భూముల దోపిడీ
సిద్దిపేటరూరల్: పేదల భూములు దోచుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ జీఓ తెచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం జీఓ 22ఏ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బైరి శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు దోచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పేరుతో పేదలను దోచుకుంటోందన్నారు. కార్యక్రమంలో తుంగ కనకయ్య, విభీషణ్రెడ్డి, వెంకటేశం, రాంగోపాల్రెడ్డి, భిక్షపతి, రజనీకర్రెడ్డి, ఉమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ -
రాజీవ్ సేవలు చిరస్మరణీయం
సిద్దిపేటఅర్బన్: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పొన్నాల శివారులోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. హరికృష్ణ మాట్లాడుతూ రాజీవ్ సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలో సమాచార, సాంకేతిక రంగాల అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నాయకుడు అని అన్నారు. సాంకేతిక సంస్కరణల కారణంగానే భారతదేశం నేడు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంప మహేందర్, అత్తుఇమామ్, ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ, యాదగిరి, కలీముద్దీన్, దాస అంజయ్య, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని.. పాదయాత్ర
వాంకిడి టూ ఎర్రవల్లి సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఎర్రవల్లి బాట పట్టారు. ఆసిఫాబాద్ జల్లాలోని వాంకిడి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి గురువారం ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను కలవగా వారిని సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. వారి నిస్వార్థ సంకల్పానికి అధినేత భుజం తట్టి అభినందించారు. వాంకిడి మండలానికి చెందిన జాడే తిరుపతి (ఆటో డ్రైవర్), దుర్గం శంకర్ (హోటల్ కార్మికుడు) అనే ఇద్దరు గిరిజన ఆదివాసీ బిడ్డలు, కేసీఆర్ పె ఉన్న అభిమానంతో ఈ పాదయాత్ర చేపట్టారు. రోజుకు సగటున 25 కిలో మీటర్ల చొప్పున 11 రోజులుగా పాదయాత్రగా కేసీఆర్ ఫాం హౌస్కు చేరుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని,. అప్పుడు తప్పకుండా తనను వచ్చి కలవండి అని కేసీఆర్ చెప్పారు. అనంతరం వారికి కేసీఆర్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయగా, తిరిగి సొంత ఊరికి బయలు దేరి వెళ్లారు. చౌడారంలో మద్య నిషేధం గ్రామస్తుల తీర్మానం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చౌడారంలో మద్యం అమ్మవద్దని, మద్యం తాగవద్దని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం తీర్మానం చేశారు. ఆ పత్రాన్ని ఎకై ్సజ్ సీఐకి, చిన్నకోడూరు ఎస్ఐ చంద్రమోహన్కు అందజేశారు. గ్రామంలో మద్యం విక్రయించే వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాసుదేవాచారి మాట్లాడుతూ గ్రామంలో మద్యం అమ్మితే రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గ్రామస్తుల బాగుకోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని కోరారు. వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. జానపద కళల అకాడమీ ఏర్పాటు చేయాలి హుస్నాబాద్: తెలంగాణ జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని సకల కళల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రపంచ జానపద దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న సిద్దిపేటలో జిల్లా సకల కళల జేఏసీ కళాకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడటం, కళాకారుల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వీరస్వామి, జగదీశ్వర చారి, ఎర్రంరాజు దేవరాజ్, బత్తుల చంద్రమౌళి, ముక్కెర సంపత్ తదితరులు ఉన్నారు. చట్టాలపై అవగాహన అవసరం సిద్దిపేటఎడ్యుకేషన్: చట్టాలను గౌరవించాలని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్కుమార్, ఏఎస్ఐ కిషన్లు విద్యార్థినులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో షీటీమ్ ఆధ్వర్యంలో గురువారం ‘ఫర్ యూ.. విత్ యూ..’ అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమకు తాముగా సొంత రక్షణ కల్పించుకోవాలన్నారు. విద్యార్థినులు, మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటు, చదువులో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్వేత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ స్రవంతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సువర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ఆలయ బుకింగ్లో గోల్మాల్!
● సుమారు రూ.25 వేలకు పైగా పట్నాల దుస్తులు మిస్సింగ్ ● పట్టించుకోని అధికారులుకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని బుకింగ్లో పట్నాల దుస్తుల విషయంలో గోల్మాల్ జరిగింది. స్వామి వారికి రెండు రకాల పూజలు జరుపుతారు. అర్చుకులు స్వామి గర్భగుడిలో పూజలు నిర్వహిస్తే, ఒగ్గు పూజారులు ఆలయ పరిసరాలలో పంచవన్నెల రంగుతో పట్నం రచించి జానపద రీతిలో స్వామికి కల్యాణం జరిపిస్తారు. పట్నం వేయడానికి బుకింగ్లో డబ్బులు చెల్లించి రశీదు తీసుకుంటే ఒగ్గుపూజారులు పట్నం రచిస్తారు. బుకింగ్లో రశీదుతో పాటు భక్తులకు పట్నం వేయడానికి తెల్లని వస్త్రాన్ని ఆలయం అందిస్తుంది. ఆలయం వాటిని టెండర్ ద్వారా విక్రయిస్తుంది. ఒక్క పట్నం వేసేందకు కావాల్సిన తెల్లని వస్త్రాన్ని రూ.5 లకు కొనుగోలు చేస్తుంది. వీటి నిర్వహణ అంతా బుకింగ్లో పనిచేసే ఉద్యోగులు నిర్వర్తిస్తారు. ఇటీవల స్టాక్ పరిశీలిస్తే ఆ వస్త్రాలు సుమారు 25 వేలకుపైగా తక్కువ ఉన్నట్లు సమాచారం. వాటి విలువ సుమారు రూ.1.25 లక్షలు వరకు ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యాదగిరి గుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఓ ఉద్యోగిని బుకింగ్ ఇన్చార్జిగా నియమించడంతో బయట పడినట్లు, పూర్తిస్టాక్ అప్పగిస్తేనే బాధ్యతలు చేపడతానని సదరు ఉద్యోగి తెలిపినట్లు సమాచారం. వస్త్రాలకు సంబంధించిన డబ్బులు రికవరీ చేస్తారా? ఆ ఉద్యోగినిపై చర్యలు తీసుకుంటారా? లేదా వేచిచూడాల్సిందే. -
ప్రయాణ చెంత..
ప్రమాదం చింత తోర్నాలబంధువు దశ దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లిలో జరిగిన విషాదకర ఘటనలో దంపతులు, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృత్యువాత పడ్డారు. దుబ్బాక మండలం బల్వంతపూర్కు చెందిన రాజు ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజు సిద్దిపేటలోని వడ్డెర కాలనీలో బంధువు (వరుసకు బావ) దశదినకర్మకు బుధవారం హాజరయ్యారు. తిరిగి సాయంత్రం కారులో (టీఎస్02ఈఎఫ్ 7997) ఇంటికి బయలు దేరారు. తోర్నాల మీదుగా బల్వంతాపుర్కు వెళ్తున్న క్రమంలో అప్పనపల్లి దాటిన తర్వాత మూల మలుపు దగ్గర అదుపు తప్పి (డ్రైవర్కు) కుడి వైపు ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. సెల్ఫోన్ సిగ్నల్తో సిద్దిపేట నుంచి సుమారు సాయంత్రం 5గంటలకు బయలు దేరిన రాజు కుటుంబం స్వగ్రామం బల్వంతాపూర్కు రాత్రి 8గంటలైనా చేరుకోలేదు. దీంతో సోదరుడు ఫోన్ చేస్తే సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశారు. రాలేదు అని చెప్పడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రాజేష్, ఎస్ఐ కీర్తిరాజులు అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్ నెట్వర్క్ సిగ్నల్ ఆధారంగా అప్పనపల్లి శివారు దాటే వరకు మాత్రమే చూపిస్తోంది. అక్కడి నుంచి ఫోన్ సిగ్నల్ లేదు. పోలీసులు, కుటుంబ సభ్యులు దారి వెంట చెక్ చేస్తుండగా అర్ధరాత్రి 12గంటలకు బావిలో పడిపోయి ఉన్న కారు గుర్తించారు. ఫైర్ అధికారులు, పోలీసులు క్రేన్ను సహాయంతో గురువారం తెల్లవారుజామున 4గంటలకు కారును బయటకు తీశారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నం మరో 8కిలో మీటర్లు అయితే ఇంటికి చేరుకుంటాం అనుకున్న వీరికి ఊహించని పరిణామం ఎదురైంది. కారులో ఉన్న కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. క్షణాల వ్యవధిలోనే నలుగురు నీట మునిగి శవాలుగా మారారు. రాత్రి సమయం కావడంతో ఈ మార్గం గుండా రాకపోకలు తక్కువగా సాగుతుంటాయి. కారు బావిలో పడినప్పుడు ఎవరైనా చూసిఉంటే చనిపోయే వారు కాదని.. స్వల్ప గాయాలతో బయటపడేవారని పలువురు చర్చించున్నారు.అప్పనపల్లి శివారులో బావిలోకి దూసుకెళ్లిన కారు భార్యభర్తలు, కుమారుడు, కూతురు మృతి దశదినకర్మకు వెళ్లి వస్తుండగా ఘటన కుటుంబానికి శాపంగా మారిన నీళ్లు.. బాధిత కుటుంబానికి నీళ్లు శాపంగా మారాయి. రాజు తల్లి కనకవ్వ 4 నెలల క్రితమే పొలానికి మోటార్ ద్వారా నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్తో కెనాల్నీళ్లలో పడి మృతి చెందింది. తండ్రి దుర్గయ్య ఐదేళ్ల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా రాజు కుటుంబం సైతం బావిలోనే మునిగి చనిపోవడం శోచనీయం.సిద్దిపేట వడ్డెర కాలనీ -
జీఓ నంబరు 97ను వెంటనే రద్దుచేయాలి
సిద్దిపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనసిద్దిపేటకమాన్: జీఓ నంబరు 97ను వెంటనే రద్దుచేయాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పాలిటెక్నిక్ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్లొమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, విద్య నిపుణులతో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘పార్థినియం’ నిర్మూలిద్దాం
అనర్థాలు నివారిద్దాంవర్గల్(గజ్వేల్): మానవాళి ఆరోగ్యానికి, పంటలకు, పశుసంపదకు చేటుకలిగించే పార్థినియం కలుపు మొక్కల నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ విద్యా ర్థులు పిలుపునిచ్చారు. గురువారం నెంటూరులో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియనన్స్ ప్రోగ్రామ్లో భాగంగా వర్సిటీ విద్యార్థు లు తేజశ్రీ, లావణ్య, వైష్ణవి, లక్ష్మీప్రియ, కీర్తన, గ్రీష్మశ్రీ బృందం సర్పంచ్ నాగరాజు, హెచ్ఎం కనకరాజు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి సామూహిక పార్థీనియం కలుపుమొక్కల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ మొక్కతో మానవాళి అలర్జీలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడతారని, పంటలకు, పశుసంపదకు ఎంతో నష్టం కలిగిస్తుందన్నారు. మొక్కలను చిన్న దశలోనే గుర్తించి తొలగించాలని, వాటి విత్తనాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో విస్తరించిన పార్థినియం మొక్కలను తొలగించారు. -
విద్యార్థి ఉద్యమాలపై అణచివేత తగదు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సిద్దిపేటకమాన్: విద్యార్థి ఉద్యమాలపై అణచివేత తగదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన 50 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సర్కారు బడులు మూసివేత అంటే పేద విద్యార్థులకు చదువులను దూరం చేయడమే అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పీడీఎస్యూ స్థాపించ నుంచి నేటి వరకు పోరాటాల పునాదులపై నడిచిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పీడీఎస్యూ ఒక చరిత్రాత్మక బాటలోనే నడిచిందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ పూర్వ విద్యార్థులు తిరుపతి, విష్ణు, నాగరాజు, స్వామి, శనిగరం సత్యనారాయణ, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ... గజ్వేల్రూరల్: టీయూడబ్ల్యూజే(తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు)ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని విమలక్క పరామర్శించారు. ఈ సందర్భంగా బాషారత్ ఉన్నిసాబేగం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విరాహత్అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్యతో పాటు పలువురు నాయకులు విరాహత్ అలీని పరామర్శించారు. -
లోక్ అదాలత్లో త్వరితగతిన న్యాయం
● 12న జాతీయ లోక్ అదాలత్ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో కక్షిదారులకు త్వరితగతిన, తక్కువ ఖర్చుతో న్యాయం అందడంతో పాటు, పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ అన్నారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కోర్టులో పెండింగ్ కేసులు తగ్గుతాయన్నారు. పోలీసులు రాజీ పడదగిన కేసులను గుర్తించి పరస్పర అంగీకారంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, అదనపు డీసీపీ కుశాల్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జీవన్రెడ్డి, ఆత్మరాములు, నర్సింహులు, లావణ్య, కనకయ్య, ఏసీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమాజాన్ని జాగృతం చేసేదే ఫొటోగ్రఫీ
ఎంపీ రఘునందన్రావు గజ్వేల్: సమాజాన్ని జాగృతం చేసే సత్తా ఫొటోగ్రఫీకి ఉందని ఎంపీ రఘునందన్రావు అన్నారు. బుధవారం గజ్వేల్లో నిర్వహించిన ప్రపంచ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపన్యాసాలు మదిలో ఉండకపోయినా, ఫోటోలు మదిలో నిలిచిపోతాయన్నారు. మనిషి, మనసును కదిలించడమే ఫోటోగ్రఫీ లక్షణమన్నారు. ఈ వృత్తిలో కొనసాగే వారి కృషి అభినందనీయమని కొనియడారు. గజ్వేల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి సహకారం అందించనున్నట్లు ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, గజ్వేల్ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి బాకీ సురేష్, సంయుక్త కార్యదర్శి మహేందర్, కోశాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకమాన్: జిల్లా కోర్టులో వచ్చే నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట కోర్టులో బ్యాంకు మేనేజర్లు, బీమా కంపెనీలు, న్యాయవాదులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు, కక్షిదారుల సమయం, డబ్బులు ఆదా అవుతాయన్నారు. వాహన ప్రమాద పరిహార కేసులు, బీమా సంబంధిత, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన రాజీ పడదగిన కేసులను గుర్తించి, వారితో చర్చలు జరిపి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోశ్కుమార్, తరణి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్క పౌరుని బాధ్యతని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం పట్టణంలోని 4, 5, 6 వార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఆయన సైకిల్ పైన తిరుగుతూ పర్యవేక్షించారు. ఈసందర్భంగా రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి రూ. వెయ్యి జరిమానా విధించారు. అనంతరం డంప్యార్డు తనిఖీ చేశారు. రిజిస్టర్ పరిశీలించి సూచనలు చేశారు. తడి చెత్త పరిమాణం, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. బయో గ్యాస్ తయారీ ప్లాంట్ తనిఖీ చేశారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు అన్వేష్, మహేష్ తదితరులు ఉన్నారు. సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించినట్టు త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు బుధవారం తెలిపారు. అయిదుగురికి రూ.20,500 జరిమానా విధించగా, ఇద్దరికి మూడు రోజుల జైలుశిక్ష, ఒక్కరికి అయిదు రోజుల జైలుశిక్ష విధించినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. -
ప్రతిపక్షాల గొంతునొక్కుతారా?
దుబ్బాక: ప్రతిపక్షాల గొంతునొక్కే చర్యలు సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అరాచకమా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకునే చర్యలు సిగ్గుచేటన్నారు. బుధవారం నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్లోని తన ఇంటి నుంచి బయలు దేరిన ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డిని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సనత్నగర్లోని టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆగ్రహం -
విలీనం వద్దే వద్దు..
చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ మండల పరిధిలోని పెద్దకోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులు బుధవారం రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీరి ధర్నాకు బీఆర్ఎస్వీ నాయకులు మద్దతుగా నిలిచారు. విద్యార్థి నాయకులు రెడ్డి యాదగిరి, విద్యార్థినులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను ఇతర నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతో విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీఓ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన -
తోటపల్లిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు
హుస్నాబాద్రూరల్: మండలంలోని తోటపల్లి శివారు గుడిబండ దేవాలయం సమీపంలో ఆదిమానవులు ఆహార సేకరణలో రాతి పనిముట్లను నూరుకున్న సూరుడు గుంతలను చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బుధవారం గుర్తించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తరాతి యుగం నాటి ఆదిమానవులు రాతితో పనిముట్లు తయారు చేసుకొని జీవనం సాగించేవారన్నారు. రాతి పని ముట్లతో వ్యవసాయం, వేట సాగించేవారని, గుడి బండ మీద 30కి పైగా (గూవ్స్) రాతి పనిముట్లు నూరిన గుంతలు ఉన్నాయన్నారు. ఇక్కడే ఒక డోల్మెన్ సమాధిని పోలిన ఆకృతి ఉందని వివరించారు. -
గంజాయి విక్రయదారులకు అడ్డాగా స్కూళ్లు, కాలేజీలు
సాక్షి, సిద్దిపేట: పసి వయసులోనే మత్తు మాయలో పడుతున్నారు. ఆట పాటలతో గడపాల్సిన మైనర్లు, యువత.. మత్తు పదర్థాల కోసం తిరుగుతున్నారు. మొదట స్నేహితుల ద్వారా పరిచయం.. ఆ తర్వాత అలవాటు.. చివరకు మత్తు కోసం ఏదైనా చేసేందుకు వెనకాడని పరిస్థితి. ఈనేపథ్యంలో పాఠశాలలో యాంటి డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో టీచర్, హెచ్ఎం, పోలీస్ కానిస్టేబుల్, విద్యార్థి ఉన్నారు. 25 ఏళ్లలోపు వారే.. జిల్లాలో వ్యసనపరులుగా మారుతున్న వారిలో 25 ఏళ్లలోపు వారు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యువకులు బానిసలుగా మారడటంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలు సైతం ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇటీవల డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రద్దీ లేని ప్రాంతాలే అడ్డాలు.. సిద్దిపేట పట్టణంలో ఎక్కువగా రద్దీ ఉండని ప్రాంతాలే గంజాయి విక్రయదారుల అడ్డాలుగా మారినట్లు తెలుస్తోంది. రంగనాయకసాగర్ కట్ట పైన, కోమటి చెరువు, సుడా రోడ్డు, సిరిసిల్ల, కరీంనగర్ రోడ్, పొన్నాల ఆటోనగర్ సమీప ప్రాంతాల్లో ఒక్కో సమయంలో ఒక్కో దగ్గరకు వ్యాపారులు వచ్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారి వచ్చే సమయానికి గంజాయి సేవించే వారు, చాక్లెట్లు తినే వారు అక్కడికి చేరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాక్లెట్లు తిన్న యువత, సిగరేట్లో గంజాయి ఆకులను పెట్టుకుని తాగి మత్తులో తూగిపోతున్న సంఘటన కన్పిస్తున్నాయి. మూలాలు పట్టుకోవాలి విద్యార్థి చేతిలో గంజాయి కనిపించినప్పుడు అతడిని మాత్రమే నిందిస్తే సమస్య పరిష్కారం కాదు. ఆ గంజాయి అతడి చేతికి ఎలా చేరింది? ఎవరు ఇచ్చారు? ఎక్కడ విక్రయిస్తున్నారు ? వెనక ఉన్న ముఠా ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి. మైనర్లను మత్త నుంచి బయటపడేయడంతో పాటు.. వారిని మత్తులోకి తాగుతున్న వారిని సైతం ఛేదించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పిల్లల ప్రవర్థనలో ఆకస్మిక మార్పులు, చదవుపై ఆసక్తి తగ్గడం తరచూ డబ్బులు అడగడం, కొత్త స్నేహితుల విషయంలో గోప్యత పాటించడం వంటి మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి. కాగా గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతోంది. పల్లెలకు సైతం పాకింది. ఏ ప్రాంతం నుంచి సరఫరా అవుతుంది ? రవాణాకు సహకరిస్తున్నవారెవరు గుర్తిస్తే దందాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు చెబుతుంటాం పాఠశాలలో విద్యార్థులకు జాగ్రత్తలు చెబుతున్నాం. మొబైల్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతుంది. తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ చేయాలి. పిల్లలలో ఏదైనా మార్పులు కన్పిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలకు సమీపంలో పాన్ షాప్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – జగ్గు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, బడ్జెట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్గుట్కాలు విక్రయించొద్దు స్కూల్ల సమీపంలో పాస్ షాప్లలో గుట్కాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం వల్ల చెడు మార్గంలో వెళ్లకుండా చేయవచ్చు. గంజాయి విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలి. – ఇంద్రసేనా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ సిద్దిపేట పట్టణంలో గత నెల 20న గంజాయి విక్రయిస్తూ మైనర్ బాలుడు పట్టుపడ్డాడు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి సిద్దిపేటలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ మైనర్ బాలుడి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జనవరి 2026లో కుకునూరుపల్లి పోలీస్స్టేషన్ పరిఽధిలో పశ్చిమబెంగాల్కు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కాడు. మొక్కలను ధ్వంసం చేసి ఎండబెట్టిన 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2024లో చేర్యాలలోని ఓ పాన్షాప్లో గంజాయి చాక్లెట్లను బీహార్కు చెందిన వ్యకి విక్రయిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో చేర్యాలలో చాక్లెట్ల రూపంలో విక్రయాలు తొలుత సరదాగా.. ఆపై వ్యసనం తల్లిదండ్రులూ.. ఓ కన్నేయండి -
నాచ‘గిరి’ తన్మయం..
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి క్షేత్రం స్వాతి నక్షత్ర మహోత్సవంతో అలరారింది. గిరి ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. బుధవారం లక్ష్మీనృసింహుని జన్మనక్షత్ర వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. మహోత్సవంలో భాగంగా ఉదయం ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో ఉత్తర ద్వారం నుంచి గిరి ప్రదక్షిణ సంరంభం ప్రారంభమైంది. మాజీ చైర్మెన్ రవీందర్గుప్త, మాజీ ధర్మకర్తలు, వేలాది భక్తజన సందోహం నారసింహుని స్మరిస్తూ, నృత్యాలు చేస్తూ నాచగిరి కొండలు, హరిద్రానది తీరం, గోశాలను దాటుతూ గిరి ప్రదక్షిణ చేశారు. ఉత్తర ద్వారం వద్ద శ్రీవారికి హారతి అనంతరం జన్మ నక్షత్రవేళ శ్రీవారిని దర్శించుకుని తరించారు. మల్కాజిగిరి డీసీపీ నర్సింహారెడ్డి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేశారు. భక్తజన ప్రదక్షిణం.. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగిరం చేయండి
సిద్దిపేటరూరల్: రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్ల గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ప్రక్రియపై జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెరిఫికేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదకన పూర్తి చేయాలని ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ ఏఈ లను ఆదేశించారు. గ్రామాల వారీగా వారి ప్రస్తుత ఇంటి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. విచారణ పూర్తయిన వెంటనే మంజూరు కోసం కలెక్టరేట్ కి సమర్పించాలన్నారు. సిద్దిపేటకమాన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జ్యుడీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ దేశ్పాండే, రాష్ట్ర కార్యదర్శి కరుణశ్రీలు తెలిపా రు. ఈనెల 23న జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరాజ్, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
మా సమస్యలు పరిష్కరించండి
గజ్వేల్రూరల్: మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం పంచాయతీ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఓసీ వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీఓ చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న జీపీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు స్వామి, జీపీ నాయకులు మహలక్ష్మి, బాబు, స్వామి, నాగరాజు, అనిల్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్కు సాంకేతిక సొబగులు
నారాయణఖేడ్: పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఇంటర్ విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కంప్యూటర్ బోధనను చేరువ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో రూ.20 కోట్లతో 80 కళాశాలల్లో అవకాశం కల్పించగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 కళాశాలలకు అవకాశం దక్కింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లాలోని 12 కళాశాలలకు రూ.3 కోట్లు విడుదల అయ్యాయి. వీటితో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ను గదులను ఏర్పాటు చేయనున్నారు. 6 నెలల్లోపు ల్యాబ్ల నిర్మాణం ఒక్కో కళాశాలో కంప్యూటర్ గది నిర్మాణం, ఆయా ఏర్పాట్లకు గాను రూ. 25 లక్షల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో గదుల నిర్మాణం, ఫర్నీచర్, విద్యుదీకరణ, ఇతర వసతులను కల్పిస్తారు. పనుల బాధ్యతను తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లు పిలిచి త్వరలో పనులు చేపట్టనున్నారు. టెండరు ప్రక్రియ పూర్తయ్యాక ఆరు నెలల్లోపు కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి రానున్నాయి. విద్యా సంవత్సరం చివరి వరకు విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందుబాటులోకి రానుంది. సంగారెడ్డి జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 3 కళాశాలలకు ఈ దఫాలో అవకాశం కల్పించారు. సాకేతిక నైపుణ్యం అందించేలా.. ఇంటర్ విద్యలో కంప్యూటర్ బోధన ప్రాథమిక హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పరిచయంతో పాటు ఆఫీస్ టూల్స్, ఇంటర్నెట్ వినియోగం, ప్రాథమిక ప్రొగ్రామింగ్ భాషలపై ప్రధానంగా బోధన సాగనుంది. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేలా ఈ సిలబస్ ఉండనుంది. మంజూరైన కళాశాలలు ఇవే.. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంగారెడ్డిలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, మెదక్ జిల్లాలోని మెదక్, పాపన్నపేట, కౌడిపల్లి, నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గజ్వేల్లోని బాలికల కళాశాలలకు కంప్యూటర్ ల్యాబ్లు కేటాయించారు. కళాశాలలకు కంప్యూటర్ ల్యాబ్లు ఉమ్మడి జిల్లాలో 12 కేటాయింపు రూ.3 కోట్ల నిధులతో ఏర్పాటు ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు విడుదల -
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
కలెక్టర్ హైమావతిసిద్దిపేటరూరల్: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీపీలు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తూ బాల్య వివాహాల నిరోధానికి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. విద్యార్థులపై గైర్హాజరుపై.. పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కాకపోతే, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని డీఈఓ కు సూచించారు. బాల్య వివాహాలకు ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణంగా ఉన్నందున, కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పిల్లలకు కల్పించిన హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన వాయిస్ ఓవర్, వాల్ పోస్టర్లను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, జిల్లా సంక్షేమ అధికారి శారద, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి సీతక్కకు వినతి
సిద్దిపేటజోన్: చేయూత పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర పద్మశాలీ సహకార సంస్థ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్ రమణ మంగళవారం మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని మంత్రి ఛాంబర్లో కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. జియోట్యాగ్ నిబంధనల మేరకు చేయూత పెన్షన్ మంజూరు కాకుండా నేత వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన కార్మికుడికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య తొగుట(దుబ్బాక): మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని బండారుపల్లిలో ప్రత్యామ్నాయంగా సాగుచేసిన కంది, అలసంద పంటలను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, నేల స్వభావం పరిగణలోకి తీసుకుని తక్కువ నీటితో సాగుచేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపికచేసుకోవాలన్నారు. ఆరుతడి పంటలైన కంది, అలసంద, పెసలుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామిగౌడ్, ఎవో మోహన్, ఎఈవో నాగార్జున, రైతులు పాల్గొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం ఖాయం ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభిమానుల పాదయాత్ర ప్రశాంత్నగర్(సిద్దిపేట): కేసీఆర్ మళ్లీ తెలంగాణకు సీఎం అవుతారని, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభిమానులు అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో తిరుపతి, శంకర్లు పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు. ఇందులో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ సీఎం కావాలన్నారు. అధికారుల విచారణ దుబ్బాకటౌన్: రాయపోల్ ఎంపీడీఓ శ్రీనివాస్ పై ఇటీవల వచ్చిన అభియోగాల నేపథ్యంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సంధ్య, ఏపీడీ ఆనందమేరి, గజ్వేల్ డీఎల్పీఓ లత విచారణ చేపట్టారు. మంగళవారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లను విడివిడిగా విచారణ చేపట్టారు. ఎంపీడీవో శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సర్పంచుల అభిప్రాయాలను డిప్యూటీ సీఈవో సంధ్య నమోదు చేసుకున్నారు. అలాగే మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసిమెలిసి పనిచేస్తేనే అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ కొనసాగుతాయని ప్రభుత్వం అందించే పథకాలు అభివృద్ధి పనులు గ్రామాలలో ప్రజలకు చేరాలంటే అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. చేపల పంపిణీ ఉత్తిదేనా? చిన్నకోడూరు(సిద్దిపేట): మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉన్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద సంఘం నేతలతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో నీటి వనరులు పెంపొందించి మత్స్యకారులను ఆదుకోవడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. -
హంతకురాలు రాజమణి అరెస్ట్
హుస్నాబాద్: కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కోటి వెంకటేశ్వర్లను హత్య చేసిన కేసులో భార్య రాజమణి అరెస్ట్ అయ్యారు. సీఐ శ్రీధర్ తెలిలిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేశ్వర్లకు రాజమణికి 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల కిత్రం భర్త వెంకటేశ్వర్లు.. భార్య రాజమణి, పిల్లలను దూరంగా ఉంచి మరొక మహిళను రెండో వివాహం చేసుకొని ఆమెతోనే ఉంటున్నారు. భర్త పదవీ విరమణ సందర్భంగా లభించే ప్రయోజనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను రెండో భార్యకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. తనను, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంతో హత్య చేసినట్లు నేరస్తురాలు ఒప్పుకున్నారు. నేరస్తురాలు రాజమణిని హుస్నాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు సీఐ శ్రీధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థులకు రక్త పరీక్షలు
మద్దూరు(హుస్నాబాద్): స్థానిక కేజీబీవీలోని విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. రెండో రోజులుగా ఫుడ్ పాయిజన్తో 25 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మంగళవారం మండల వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో పరీక్షలు చేపట్టారు. వైద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎవరూ ఆందోళ న చెందనవసరం లేదన్నారు. 250 మంది విద్యార్థులలో 120 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, శాంపిళ్లను ల్యాబ్కు పంపించామన్నారు. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు సైతం శాంపిళ్లను సేకరించినట్లు తెలిపారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పరామర్శ చేర్యాల(సిద్దిపేట): ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్దూరు కేజీబీవీ విద్యార్థినులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గిరి కొండల్రెడ్డి పరామర్శించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఆయన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. -
96 జీఓ రద్దు చేయాల్సిందే
సిద్దిపేటకమాన్: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 96ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ జీవో వల్ల ఇంజనీరింగ్ చేయాల్సిన తాము పరిశ్రమల్లో కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఎంట్రెన్స్ రాసి బీటెక్ అడ్మిషన్ పొందేవాళ్లమని కానీ శక్తి పథకం వల్ల ఇలాంటి అవకాశాన్ని కోల్పోతామన్నారు. -
‘కల్యాణ లక్ష్మి’ని రద్దు చేసే కుట్ర
గజ్వేల్లో బీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ గజ్వేల్: ప్రైవేటు వ్యక్తులచే కేసులు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్లో ర్యాలీ, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్, ఇందిరాపార్కు చౌరస్తాల మీదుగా ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఐఓసీ గేటు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భగా వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అడబిడ్డల పెళ్లి కోసం అండగా నిలవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీనిని నిర్వీర్యం చేసి పేదల ఆశలపై నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక అసమర్థతను చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. పేదల కోసం ఎంతటి పోరాటాలకై నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం ఐఓసీలో ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, వైస్ చైర్పర్సన్ పద్మబాయి, మాజీ ఎంపీపీ అమరావతి, మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో చతికిలబడి..
మున్సిపాలిటీల అభివృద్ధికి కీలకమైన కేంద్రప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పన్నుల వసూళ్ల గ్రోతింగ్ రేట్ గండంగా పరిణమించింది. గతంతో పోలిస్తే.. పన్నుల వసూళ్ల శాతం 12.9శాతం పెరిగితేనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో ఈ అంశంలో వెనుకబడటం శాపంగా మారుతోంది. – గజ్వేల్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. పన్నుల ద్వారా వచ్చే రాబడే ఈ మున్సిపాలిటీలకు ఆయువుపట్టు. ప్రత్యేకించి ఏటా కేంద్రం నుంచి విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులకు పన్నుల వసూళ్ల గ్రోతింగ్ రేట్ ఈసారి ఆటంకంగా మారింది. ఈ అంశంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు ఈసారి వెనుక బడ్డాయి. ఫలితంగా ఈ మూడు మున్సిపాలిటీలకు ఈసారి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా లేవు. ఈ పరిణామం అభివృద్ధికి శాపంగా మారింది. గ్రోతింగ్ రేట్లో వెనుకబాటు.. సాధారణంగా మున్సిపాలిటీలు ఏ యేటికాయేడు పన్నుల వసూళ్లల్లో 12.9శాతం గ్రోతింగ్ రేట్ సాధిస్తేనే ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. కానీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ గ్రోతింగ్ రేట్ కనిపించడం లేదు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ గతంలో పెండింగ్లో ఉన్న రూ.1.22కోట్లతో కలుపుకొని ఈసారి రూ.5.78 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. కానీ కేవలం 4.07కోట్ల వసూళ్లు మాత్రమే జరిగాయి. 2024–25 ఏడాదిలో ఈ మున్సిపాలిటీలో 3.97కోట్ల పన్నుల వసూలు జరిగింది. ఈ లెక్కన 12.9 శాతం గ్రోతింగ్ రేట్ ప్రకారం 2025–26లో రూ.4.48కోట్ల పన్నుల వసూలు జరగాలి. కానీ 4.07కోట్ల వద్దే పన్నుల వసూలు ఆగిపోయింది. ఫలితంగా ఈసారి ఈ మున్సిపాలిటీకి రూ.3కోట్లకుపైగా వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాగా నెలకు ఈ మున్సిపాలిటీలో వేతనాల పేరిట రూ.30లక్షలు, విద్యుత్ బిల్లుల పేరుమీద రూ.16లక్షలు, పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర పనుల కోసం రూ.24లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన నెలసరి ఖర్చు సుమారు రూ.70లక్షల వరకు ఉంటుంది. దీని ప్రకారం ఈ మున్సిపాలిటీకి ఏటా సరాసరి గ్రాంట్లతో కలుపుకొని ఏడాదికి రూ.8కోట్లకుపైగా ఆదాయం ఉంటేనే.. అన్నీ వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉంది. కానీ నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి రూ.3కోట్లకుపైగా 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం లేకపోవడం, పన్నుల వసూలు అంతంతమాత్రంగానే ఉండటం గుదిబండగా మారింది. అభివృద్ధిలో వెనుకబడి మున్సిపాలిటీకి ఉనికికి ప్రధాన ఆధారమైన పన్నుల వసూళ్లపై రెండేళ్లుగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో నిర్లక్ష్యం నెలకొంది. ప్రధానంగా గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు తమకు కమీషన్లు వచ్చే పనులపై శ్రద్ధ పెట్టి పన్నుల వసూలును పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ఫలితంగా ఈసారి 15వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకోలేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటిల్లోనూ ఇదేరకమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. -
హత్యలు చేయడం సరికాదు...
క్షణికావేశంలో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. హత్యలు చేయడం సరికాదు. సమస్యకు ఇది పరిష్కారం కాదు. తెలిసిన సర్కిల్లోనే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. హత్యలు చేయడం వల్ల జైలు, మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ అనిత, సైక్రియాట్రి విభాగం హెడ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సిద్దిపేట వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దు భూంపల్లిలో మహిళ చేసిన హత్యకు సంబంధించిన విషయాలు చూస్తే షాక్ అయ్యాం. వ్యక్తిగత విషయాలను బయటి వారితో షేర్ చేసుకోవద్దు. భద్రత కోసమే కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. సీసీ కెమెరాల ద్వారానే కేసును ఛేదించాం. – రష్మీ పెరుమాళ్, సీపీ -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలోనూ ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మొత్తంగా 135 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, ట్రైనీ కలెక్టర్ భవ్య, అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్: ప్రభుత్వం వెంటనే జీఓ నంబర్ 97 రద్దు చేసి సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటి సభ్యుడు సావుల ఆదిత్య డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యా వ్యవస్ధను పరిరక్షించాలని సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్ధులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ విలీనం చేయకుండా మరింత బలోపేతం చేసి మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక కోర్సులు కల్పించాలని వారు కోరారు. -
పోతారం.. మద్యానికి దూరం
గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.2లక్షల జరిమానా విధించాలని తీర్మానం దుబ్బాకరూరల్: మండలంలోని పోతారం గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, మద్యపానం నిషేధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. సర్పంచ్ రేణుక మల్లేశం మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల కొంత మంది మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వచ్చిన కూలీ డబ్బును మద్యానికి ఖర్చు చేయడంతో కుటుంబాలను పోషించలేక పోతున్నారని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం అమ్మితే రూ.2లక్షల జరిమానాతో పాటు, నల్లా కనెక్షన్ బంద్, గ్రామ పంచాయతీ సేవలు నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
1.99 లక్షల ఓటర్ల పేరులో అక్షర దోషాలు
● పుట్టిన తేదీలు సైతం తప్పుగా గుర్తింపు ● సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ ● అక్టోబర్ 19న తుది జాబితా విడుదల ఓటర్ల వివరాలిలా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం హుస్నాబాద్ 1,13,501 1,16,715 06 2,30,222 సిద్దిపేట 1,00,978 1,04,324 35 2,05,337 దుబ్బాక 90,940 95,888 01 1,86,829 గజ్వేల్ 1,23,442 1,28,346 05< 2,51,793 సాక్షి, సిద్దిపేట: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 9,92,167 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలలను అందించిన 8,74,181 మంది పేర్లతో ఓటరు ముసాయిదాను రూపొందించారు. ఇందులో 1,18,786 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించకపోవడం, డెత్, పర్మినెంట్ షిఫ్ట్, డబుల్ ఓట్లు ఉండటంతో తొలగించారు. అలాగే 1,99,180 మంది ఓటర్ల పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేదీలు తప్పుగా ఉండటంతో వారికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులకు సెప్టెంబర్ 16వ తేదీలోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి పరిశీలించి అక్టోబర్ 19న తుది జాబితాను విడుదల చేయనున్నారు. సిద్దిపేటలోనే అధికం జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించకపోవడం, డెత్, పర్మినెంట్ షిఫ్ట్, డబుల్ ఓట్లు ఉండటంతో తొలగించారు. సిద్దిపేటలో 39,170, గజ్వేల్ 37,460, హుస్నాబాద్లో 24,321, దుబ్బాకలో 17,835 ఓటర్లను తొలగించారు. అలాగే గజ్వేల్లోని 60,979 ఓటర్లు, సిద్దిపేటలో 50,061, హుస్నాబాద్ 49,216, దుబ్బాకలో 38,924 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం, షిఫ్టింగ్కు సైతం దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
కాంగ్రెస్ పతనం ఖాయం
సిద్దిపేటజోన్: పేద మహిళలకు ఆర్థిక భరోసాగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మాజీ జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్లు మాట్లాడారు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి అనేది పథకం కాదని, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే మంచి కార్యక్రమమన్నారు. ఎన్నికల్లో తులం బంగారం హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉన్న పథకాన్ని రద్దు చేసే కుట్ర చేయడం తగదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ సదానందానికి అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట మున్సిపల్లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ధర్నాను ప్రజలు నమ్మడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు సూర్యవర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు యాదగిరి, మహేందర్, మాజీ కౌన్సిలర్లు ఆనంద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకుల నిరసన నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని నిరసిస్తూ సోమవారం రాజగోపాల్పేట కళాశాల అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీల్లో విలీనం చేస్తే విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తీరని నష్టం జరుగుందన్నారు. మిరుదొడ్డి(దుబ్బాక): తాగు నీటి కోసం అల్వాల పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీ వాసులు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బిందెలు, బకెట్లు, డ్రమ్ములు, ముళ్లకంచెలను రోడ్డుకు అడ్డంగా వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. గుక్కెడు నీటి కోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తాగు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా మని అధికారులు హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. ఉచిత శిక్షణనుసద్వినియోగం చేసుకోండి సిద్దిపేటజోన్: ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ జాదవ్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ సెంటర్ను ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావుతో కలిసి ప్రారంభించారు. యోగేశ్వర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు -
రుణ మాఫీ కాలేదు
పంటల సాగు కోసం యూనియన్ బ్యాంక్లో రుణం తీసుకున్న. రుణ మాఫీ ఇప్పటి వరకు కాలేదు. రూ.2లక్షల లోపే రుణం తీసుకున్నా ఇప్పటి వరకు మాఫీ కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాఫీ చేయాలి. –మందల రాజు, కిష్టాపూర్, చిన్నకోడూరు వుద్దూరు మండలం మర్మములలోని 160, 161 సర్వే నెంబర్లు గల 20 గుంటల భూమి, 129 సర్వే నంబర్లో 1.16ఎకరాల భూమిని అక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే మా నాన్న వెంకటయ్యకు చెందిన 158 సర్వే నంబర్లోని 28 గుంటల భూమిని పక్కన ఉన్న వారు ఆక్రమించుకున్నారు. భూమిని సర్వే నిర్వహించి మా భూమి మాకు ఇప్పించాలి. – సుందరగిరి బాలరాజు, మర్మాముల -
సమాజాభివృద్ధికి కృషి: కలెక్టర్
సిద్దిపేటరూరల్: ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితమే నేటి స్వాతంత్య్ర దినోత్సవమని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటి త్యాగదనులందరినీ గుర్తు చేసుకుంటూ వారి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు , కలెక్టరేట్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 16లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ప్రతి రేషన్ కార్డులో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, తదితరుల నూతన పెన్షన్కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ , పద్మశాలి ఫెడరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, లైబ్రరీ చైర్మన్ దరిపల్లి చంద్రం , ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ , మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలన.. ప్రగతి పథాన
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జిల్లా ప్రగతిపథాన ముందుకు సాగుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో పారదర్శకత, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని అన్నారు. శనివారం పోలీస్ కమిషనరేట్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రసంగించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండటంతో ఆరు తడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాలో భాగంగా 3.25లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.1,476కోట్లను అందజేశామన్నారు. మల్లన్నసాగర్ వరకు అదనపు టీఎంసీ పనులు కొనసాగుతున్నాయన్నారు. గౌరవెల్లి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగిందన్నారు. 2025–26లో జిల్లాలోని రిజర్వాయర్లలో చేపలు పట్టేందుకు లైసెన్స్లు 989 జారీ చేశామని వివరించారు. జలసిరి పేరుతో.. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా జలసిరి పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఇంటింటికీ ఇంకుడు గుంత, పంట పంటకూ కుంట, ఊరు ఊరుకు ఊట కుంటల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను బస్సులకు ఓనర్లను చేశామని, ఒక్కో బస్సు ద్వారా మండల సమాఖ్యలకు రూ 70వేలు అద్దెను అందజేస్తున్నామని చెప్పారు. హ్యామ్ రోడ్లు రూ.670కోట్ల వ్యయంతో 158 కిలోమీటర్ల మేర 13 రోడ్ల పనులను హ్యామ్ కింద చేపట్టినట్లు తెలిపారు. బీసీ అభివృద్ధి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.38లక్షల డైట్ చార్జీలు, సెప్టెంబర్ 2026 వరకు రూ.17లక్షల కాస్మోటిక్ చార్జీలను విడుదల చేశామని చెప్పారు. 10,754 ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.255 కోట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. యువత కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం మరింత చేరువ పారదర్శకత, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం పరేడ్ గ్రౌండ్లో పంద్రాగస్టు వేడుకలు చెక్కుల పంపిణీ మెప్మా ద్వారా 64 పట్టణ మహిళా సంఘాలకు రూ.9.25కోట్ల చెక్కును మంత్రి అందజేశారు. డీఆర్డీఏ ద్వారా 821 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రూ.78కోట్ల చెక్కు, తొమ్మిది మంది హార్టికల్చర్, సెరికల్చర్ లబ్ధిదారులకు రూ.8.55 లక్షల చెక్కును అందజేశారు. జిల్లాలోని పలు శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 169 మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసా పత్రాలతో అభినందించారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పోలీసు, వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, డీఆర్డీఏ, మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధ్దుల, చేనేత, డీఎంహెచ్ఓ, పురపాలక, లీడ్ బ్యాంకు, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, సీపీతో కలిసి మంత్రి పరిశీలించారు. -
ప్రాధాన్యం
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026సంక్షేమానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఊసే ఎత్తని సీఎం టూరిజం ప్రాజెక్టుగా సింగూరు: మంత్రి దామోదర సింగూరు ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా మార్చాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యా, వైద్య, ఆరోగ్య పరంగా దేశంలోనే అత్యున్నతస్థాయిలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2005 అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సింగూరు కాలువ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఆ కాల్వ ద్వారా పంటలకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1.68కోట్లతో సీసీ లైనింగ్, సింగూరు మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 వేల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయనున్నామన్నారు. విప్లవాత్మకమైన మార్పులతో స్మార్ట్ కార్డులు: మంత్రి ఉత్తమ్ నిరుపేదలకు అవసరమయ్యే ఆహార భద్రత కార్డు 10 సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 85% జనాభాకు 3.42కోట్ల మందికి ఒక కోటి ఆరు లక్షల కార్డులు ఇవ్వనున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు: మంత్రి వివేక్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామని త్వరలో మరో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యో గాలు కల్పించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ... ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీరుపై ఘాటైన విమర్శలు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం సాగింది. రాష్ట్రంలో 1.06 లక్షల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యాక్రమాన్ని సంగారెడ్డి వేదికగా సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో పలువురు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి సుమారు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీని జిల్లా వాసులు గెలిపిస్తే..దేశానికి ప్రధానమంత్రి అయి.. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పొందుతున్న లబ్ధిని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హాయాంలో అమలైన డబుల్బెడ్రూం ఇళ్ల పథకం వైఫల్యాలను రేవంత్రెడ్డి ఎత్తి చూపారు. మాజీ సీఎం కేసీఆర్పై, మాజీ మంత్రి హరీశ్రావుపై ఘాటైన విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీపై హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులు ప్రతిపక్ష పార్టీల ట్రాప్లో పడొద్దని హితువు పలికారు. ఊసేలేని జిల్లా అంశాలు.. సీఎం పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారని అందరూ భావించారు. అయితే ఈసారి సీఎం జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్క హామీని కూడా ఇవ్వకపోవడం జిల్లా వాసులను ఒకింత నిరాశకు గురి చేసింది. సింగూరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ బహిరంగసభ వేదికగా సీఎం దృష్టికి తెచ్చినా కూడా..ఈ అంశంపై సీఎం ఎలాంటి హామీ గానీ, ప్రకటన కానీ చేయలేదు. జగ్గారెడ్డి పోటీపై.. నిర్మల పదవిపై సీఎం స్పష్టత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పదవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఒకింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. రూ.వెయ్యి కోట్లు పెట్టినా ఇలాంటి సేవ చేసే నాయకుడు సంగారెడ్డికి లభించరని కితాబిచ్చిన సీఎం..జగ్గారెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టతనిచ్చారు. మరోవైపు నిర్మలరెడ్డి టీజీఐఐసీ పదవి అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. వీరిద్దరికి ఇచ్చే పదవులేవో ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఐఐటీహెచ్లో హెలీప్యాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఐబీ చౌరస్తాకు చేరుకుని అక్కడ దివంగత ప్రధానులు నెహ్రు, రాజీవ్గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఓపెన్టాప్ వాహనంలో సభా వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. మాట్లాడుతున్న సీఎంయువతకు ఉద్యోగాలు: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ విదేశీ పెట్టుబడులు రాక, యువతకు 80 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పించనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే కార్డు మాత్రమే కాదు కుటుంబానికి గౌరవంతో పాటు ఆహార భద్రత, గ్రామానికి గుర్తింపు కార్డు అన్నారు. -
చేర్యాల నకాశీ చిత్రకళకు గవర్నర్ ప్రశంసలు
చేర్యాల(సిద్దిపేట): ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చేర్యాల నకాశీ చిత్రకళను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జానపద కళా సంప్రదాయ నకాశీ మాస్క్లు శనివారం సాయంత్రం లోక్భవన్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నకాశీ మాస్క్లను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, గవర్నర్ సతీమణి జానకీ శుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు. నకాశీ కళలోని కళాత్మకత, ప్రత్యేకతలకు గవర్నర్ ముగ్ధులయ్యారు. నక్షత్రమాల ధరించిన మంత్రి పొన్నం హుస్నాబాద్: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి వీరభద్రస్వామి 27 రోజుల నక్షత్ర మాలను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ధరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో కూడా నక్షత్రమాలను ధరించానని, ఈ ఏడాది కూడా ధరిస్తున్నట్లు తెలిపారు. 27 రోజుల పాటు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయిరారోగ్యాలతో, సమృద్ధిగా జీవించాలని కోరుకుంటున్నాని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ మాతాకి జై.. ఎల్లమ్మ చెరువులో జాతీయ జెండా రెపరెపలు హుస్నాబాద్: ఎల్లమ్మ చెరువులో జాతీయ జెండాను ఎగురవేసి భారత్ మాతాకీ జై అంటూ తమ జాతీయ భావాన్ని ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో మార్నింగ్ మానిటరింగ్ డ్యూటీ (ఎంఎండీ) ఆధ్వర్యంలో ఎల్లమ్మ చెరువులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెరువులో జాతీయ జెండాను ఎగురవేశారు. కొంత కాలంగా ఎంఎండీ సభ్యులు ఎల్లమ్మ చెరువు కట్టపై రోజూ మార్నింగ్ వాకింగ్ చేస్తూ, చెరువులో స్విమ్మింగ్ చేయడం దినచర్యగా కొనసాగిస్తున్నారు. అందరికీ సమ న్యాయం ప్రశాంత్నగర్(సిద్దిపేట): సమాజంలోని అందరికీ సమన్యాయం ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సంతోష్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవేర్నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంతోష్కుమార్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితన న్యాయ సహాయం అందుతుందన్నారు. కోమటిబండలోసంపూర్ణ మద్య నిషేధం గజ్వేల్: మండల పరిధి కోమటిబండలో ఇక నుంచి సంపూర్ణ మద్యనిషేధం పాటించాలని స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. శనివారం తీర్మానించారు. సర్పంచ్ తూమ్ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పంచాయతీలో తీర్మానం చేసి ఆమోదించారు. గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ.2లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. బెల్ట్షాపులు నిర్వహిస్తున్నవారి సమాచారం ఇస్తే రూ.5వేల పారితోషికం అందజేయనున్నట్లు కూడా తెలిపారు. -
ఇకపై స్మార్ట్గా రేషన్
రేపు సిద్దిపేటలో కార్డులు పంపిణీ చేయనున్న మంత్రి పొన్నంరేషన్ పంపిణీలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే సరుకుల పంపిణీలో అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఈ పాస్ను అమలు చేస్తోంది. కొన్నేళ్లుగా రేషన్ కార్డులు పేపర్పై ప్రింట్తోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఏటీఎం కార్డు తరహాలో రూపొందించిన స్మార్ట్ కార్డులను అందించనుంది. వీటిని ఆగస్టు 15న అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, సిద్దిపేట ఇప్పటి వరకు రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు వీటిని ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని లబ్ధిదారులు వినియోగించుకునేవారు. పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తోంది. అయితే ఈ కాగితం స్థానంలో స్మార్ట్ కార్డు తరహాలో తయారు చేసి అందించేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. కొత్తగా అందజేసే కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్ కార్డు నంబర్ ముద్రించారు. కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ రేషన్ షాప్లోనైనా బియ్యం తీసుకోవచ్చు. క్యూర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సైతం తెలుసుకోవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు ఆకర్షణీయంగా ఉంది. 15 నుంచి లబ్ధిదారుల చేతికి.. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. అదేరోజున మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట పట్టణంలో ఆర్యవైశ్య సంక్షేమ భవనంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లాకు చేరిన కార్డులు ప్రభుత్వం అందించే స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,36,869 రేషన్ కార్డులున్నాయి. ఆధునిక సాంకేతిక కార్డు ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం... స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. జిల్లాకు స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకున్నాయి. ఈనెల 15న మధ్యాహ్నం 2గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నాం. –తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
రోడ్డెక్కిన కాసులాబాద్ వాసులు
దుబ్బాకరూరల్: మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామస్తులు గురువారం రోడ్డెక్కారు. కొన్నేళ్లుగా గుంతలమయమైన రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఆగ్రహించి హబ్సిపూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. రాత్రి వేళలో రోడ్డుపై వెళ్లాలంటే భయపడాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రమాదాల బారినపడ్డారని తెలిపారు. వర్షం పడితే రోడ్డంతా బురదగా మారుతోందన్నారు. 15 ఏళ్ల క్రితమే రోడ్డుకు నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు ఖరారు కాక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. పోలీసులు చేరుకుని ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి విరమింపజేశారు. -
రేషన్ కోసం నడవాల్సిందే
‘హర్ ఘర్ తిరంగా’.. బీజేపీ నాయకులు గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగాఘనంగా నిర్వహించారు. వివరాలు 8లో uదుకాణం.. బహుదూరం ● మూడు కిలోమీటర్లకుపైగా నడక యాతన ● కొత్త పంచాయతీలు ఏర్పాటైనా తప్పని తిప్పలు ● వృద్ధులు, ఒంటరి మహిళల పాట్లు మర్కూక్(గజ్వేల్): రేషన్ బియ్యం తీసుకురావాలంటే కిలో మీటర్లు నడవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు. మూడు కిలోమీటర్లకుపైగా నడుచుకుంటూ వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆయా గ్రామాల ప్రజలు ఇప్పటికీ రేషన్ కోసం పాట్లు తప్పడంలేదు. ఇందుకు కొత్తగా రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయకపోవడమే కారణం. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు రేషన్కోసం కిలోమీటర్ల దూరం నడక కొనసాగిస్తున్నారు. రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయకపోవడంతో.. మర్కూక్ మండలంలోని గంగాపూర్– యూసుఫ్ఖాన్పల్లి, గణేశ్పల్లి గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ప్రతి గ్రామంలో 150పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి. గంగాపూర్– యూసుఫ్ఖాన్పల్లిలో 900 వందల మంది జనాభా ఉండగా 190 రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే గణేశ్పల్లిలో 150 రేషన్ కార్డులు, 800 మంది జనాభా ఉంది. ప్రభుత్వం నూతనంగా ఈ రెండు గ్రామ పంచాయతీల ఏర్పాటు చేసింది. అయితే ఈ గ్రామాలకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయక పోవడంతో పక్క గ్రామాలైన మర్కూక్, చేబర్తికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానంతో.. నడవలేని వృద్ధులు, ఒంటరి మహిళల కార్డులను ఇతరులకు ఇస్తే.. సరుకులు తీసుకునే అవకాశం ఉండేది. కానీ బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో రేషన్ పక్కదారి పట్టకుండా కార్డుదా రులే రేషన్ సరుకులకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు 3 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లడమే సమస్య అయితే.. సరుకులు తీసుకురావడం మరో సమస్యగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు నివేదించాం ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజను వివరణ కోరగా.. నూతన పంచయతీలలో రేషన్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్నారు. గణేశ్పల్లిలో రేషన్ దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆర్డీఓకు నివేదించాం. ఉత్తర్వులు రాగానే రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తాం. -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్గజ్వేల్: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా ప్రభుత్వాస్పత్రుల ఇన్చార్జి కో ఆర్డినేటర్(డీసీహెచ్ఎస్), స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఆస్పత్రి తీరుపై తరుచూ వస్తున్న విమర్శలు, ‘సాక్షి’లో ఈనెల 10న ‘రెఫరల్ దందా’ పేరిట ప్రచురితమైన కథనం నేపథ్యంలో గురువారం గజ్వేల్లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఆస్పత్రి పరిధిలో 100 పడకల సాధారణ ఆస్పత్రి, మరో 100 పడకలతో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్) అందుబాటులో ఉండగా వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సాధారణ ఆస్పత్రిలో అత్యవసర వైద్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, నేత్ర వైద్యం, అనస్తీషీయా, రెడియాలజీ, డెంటల్, పాథాలజీ తదితర విభాగాల్లో రోగులకు సేవలందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా డయాలసిస్, ఆరోగ్యశ్రీ సేవలు అందించడమే కాకుండా రక్త నిల్వ కేంద్రం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ అందుబాటులోలేని కారణంగా సీరియస్గా ఉన్న కేసులను మాత్రమే రెఫర్ చేస్తున్నాన్నారు. ఇటీవల సాధారణ బదిలీల్లో నర్సింగ్ విభాగం నుంచి 13మంది ఏకకాలంలో బదిలీ కావడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
భక్తులకు భద్రతేదీ?
● మల్లన్న ఆలయంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని అధికారులు కొమురవెల్లి(సిద్దిపేట): నిత్యం వేలాది మంది దర్శించుకునే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు రక్షణ కరువైంది. ఆలయలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేదు. ఏటా వాటి నిర్వహణకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఆలయ అధికారులు నిర్వహణపై సరియైన దృష్టి సారించడంలేదు. ఆలయంతో మొత్తం 40 సీసీ కెమెరాలు ఉండగా, ఆలయ పరిసరాలలో 32 కెమెరాలు, హుండీ లెక్కింపు జరిగే ముఖమండపంలో 8 కెమెరాలు ఉన్నాయి. వాటితో ఆలయ పరిసారాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. కానీ కొందరి అధికారుల పని తీరుతో వాటిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆన్నదాన సత్రం, భక్తుల రద్దీగా ఉండే ప్రాంతాలలో, ఆలయంలో కొన్ని కెమెరాలతో పాటు డీవీఆర్ పనిచేయడం లేదు. దీంతో ఆలయానికి భద్రత, భక్తుల రక్షణ కరువైంది. వెంటనే పని చేయని సీసీ కెమెరాలు బాగు చేయించి భక్తుల రక్షణ, ఆలయానికి భద్రత కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా సీసీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయం మాదృష్టికి వచ్చిందన్నారు. వాటిని రిపేర్ చేయించేందుకు టెండర్ పిలుస్తున్నమని, త్వరలోనే అన్ని సీసీ కెమెరాలు పని చేసేవిధంగా చూస్తామని తెలిపారు. -
కథలు రాయడం ఒక కళ
బెజ్జంకి(సిద్దిపేట): కథలు రాయడం ఒక కళ అని బాల సాహితీవేత్తలు వర్కోలు లక్ష్మయ్య, బైతి దుర్గయ్య అన్నారు. బెజ్జంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాల సాహిత్య కార్యశాల కార్యక్రమాన్ని ఇన్చార్జి హెచ్ఎం నాగయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ కథలు రాయడం ద్వారా సృజనాత్మకత వికాసం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర సారస్వత పరిషత్ ముద్రించిన రచనా కళ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్ హుస్నాబాద్: సాధారణ విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేశ్కుమార్ అన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్యాలీ ఈఆర్పీ సాంకేతిక పరిజ్ఞానంపై నిర్వహించిన వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కేవలం డిగ్రీ పట్టాలు కలిగి ఉంటే ఉపాధి అవకాశాలు పొందలేరన్నారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని, కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలని తెలిపారు. పరిశోధనా రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత విధ్యాభ్యాసం ద్వారా విద్యార్థులు పరిశోధనా రంగాలను ఎంచుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి మిరుదొడ్డి(దుబ్బాక): హమాలీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి కోరారు. ఈ మేరకు గురువారం మిరుదొడ్డి తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి హమాలీకి రూ.6 వేల పెన్షన్ అందించాలన్నారు. విధి నిర్వహణలో మరిణించిన కార్మికుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్గ్రేసియా అందించాలన్నారు. హమాలీ కార్మికుల హక్కుల సాధన కోసం ఈ నెల 24న తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మద్దెల అంజయ్య, హమాలీ కార్మికులు లింగం, భిక్షపతి, చంద్రం, పోచయ్య, యాదయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డి(దుబ్బాక): సబ్ జూనియర్ అండర్ 15 బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 15న బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీలో ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య, జనరల్ సెక్రటరీ పీవీ రమణ తెలిపారు. గురువారం వారు మిరుదొడ్డిలో మాట్లాడుతూ ఎంపిక కోసం వచ్చే క్రీడాకారులు ఆధార్, బోనాఫైడ్ జీరాక్స్లతో పాటు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు వెంట తెచ్చుకోవాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడా టీంలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వాణి విద్యానికేతన్ హై స్కూల్, సంకల్ప్ వెల్ఫేర్ గ్రౌండ్ రామచంద్రాపురంలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 97047 46511 నంబర్ను సంప్రదించాలని సూచించారు. మద్దూరు(హుస్నాబాద్): కొండాపూర్, కూటిగల్ గ్రామాల్లోని చెరువు, కుంటల్లోంచి అక్రమంగా తవ్వి నిల్వ చేసిన మట్టి డంప్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ శ్యామ్ తెలిపారు. ఇటుక బట్టీల కోసం అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. తవ్వకాలను నిలిపి వేయడంతో పాటు కొండాపూర్లో ఒకటి, కూటిగల్లో నాలుగు డంప్లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీకి చెందిన చెన్నకేశవులు, నర్సింహరావులు అక్రమంగా మట్టిని తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
ఒకరి మృతి మర్కూక్(గజ్వేల్): అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మర్కూక్ మండలం గణేశ్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యూనస్ హైమద్ అలీ వివరాల ప్రకారం.. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన మార్కంటి రామ్రెడ్డి(45) గురువారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రామ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బయోగ్యాస్ ప్రక్రియ వేగిరం చేయండి
● పెండింగ్ పనులు పూర్తి చేయాలి ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని శ్రీరామ వైకుంఠధామంలో చేపట్టిన బయోగ్యాస్ ఆధారిత ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని, త్వరితగతిన ప్రారంభానికి సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. గురువారం ఆయన వైకుంఠధామాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచనలు చేశారు. శోకాన్ని మరిచేలా శ్మశానవాటిక అర్థం మారేలా సుందరీకరణ ఉండాలన్నారు. మరిన్ని మొక్కలు నాటాలని, సీసీ రోడ్లు వేయాలని, రాత్రి వేళల్లో దహన సంస్కారాలకు లైటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్స్కు మరమ్మతులు చేపట్టి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మాజీ కౌన్సిలర్ సత్తయ్య, వైకుంఠధామం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రత్నాకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పొన్నంకు నమస్కరించి..
●సిద్దిపేట పట్టణంలో లోకల్ బస్సులు నడపాలి ●ఆటో ఎక్కి దిగితే రూ.20లు వసూలు చేస్తుండ్రు ●పాత బస్టాండ్లోకి కరీంనగర్ బస్సులు వచ్చేలా చూడాలి ●సమస్యలు పరిష్కరించాలంటూ పట్టణ ప్రజల లేఖ సాక్షి, సిద్దిపేట: గౌరవనీయులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు నమస్కరించి రాయునది.. మేము సిద్దిపేట పట్టణ ప్రజలం.. మా ప్రాంతంలో లోకల్ ఆర్టీసీ బస్సులు నడపాలని విన్నపం. ప్రస్తుత సిద్దిపేట పట్టణం 25కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరించి ఉన్నాయి. కొత్తకొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. పల్లె వెలుగు బస్సు ఎక్కుదామంటే డ్రైవర్ ఆపడం లేదు.. ఎక్కితే ఇది లోకల్ బస్సా అని టికెట్ ఇచ్చే సమయంలో కండక్టర్ దింపేస్తున్నారు. ఈ రూట్లలో నడపాలని.. పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు, కొత్త బస్టాండ్ నుంచి బూర్గుపల్లి, పాత బస్టాండ్ నుంచి మిట్టపల్లి, కొత్త బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, కొత్తబస్టాండ్ నుంచి చిన్నకోడూరు, చింతమడక, తడ్కపల్లి, పొన్నాల వరకు ఇలా రూట్లలో లోకల్ బస్సులను నడిపితే మాకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే కోమటి చెరువుకు ప్రత్యేక బస్సులను నడిపితే మరింత పర్యాటకుల సంఖ్య పెరుగనుంది. ఆటో ఎక్కి దిగితే రూ.20 మున్సిపాలిటీ పరిధిలో శ్రీనగర్ కాలనీ, భారత్నగర్, కోమటి చెరువు, ప్రశాంత్నగర్, అంబేడ్కర్ కాలనీ, లింగారెడ్డిపల్లి, నర్సాపూర్ చౌరస్తా, వ్యవసాయ మార్కెట్, రైల్వేస్టేషన్, రాఘవేంద్రనగర్, కోటి లింగాల దేవాలయం, ముస్తాబాద్ చౌరస్తా, విక్టరీ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, బ్లాక్ఆఫీస్ చౌరస్తా, మారుతీ నగర్, రంగధాంపల్లి, మైత్రీవనం.. ఇలా చాలా కాలనీల ప్రజలంతా ఏదైనా పని నిమిత్తం వెళ్లాలంటే ఆటోలోనే వెళ్లాల్సి వస్తోంది. ఆటో ఎక్కి దిగితే రూ.20 వసూలు చేస్తున్నారు. పిల్లలు కాలేజీలకు వెళ్లాలంటే రోజుకు రూ.50 చెల్లించాల్సి వస్తోంది. రైలులో సికింద్రాబాద్కు వెళ్లాలన్నా.. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోకు ఒక్కరికి రూ.30 చెల్లించాల్సి వస్తోంది. అది సైతం రైలు వెళ్లే సమయం.. వచ్చే టైంకు ఆటోలు లేకపోవడంతో బైక్ల ద్వారా చేరుకోవాల్సి వస్తోంది. పాత బస్టాండ్లోకి కరీంనగర్ బస్సులు రావాలి.. జేబీఎస్ నుంచి కరీంనగర్, అలాగే కరీంనగర్ నుంచి జేబీఎస్కు వెళ్లే ఆర్టీసీ బస్సులు సిద్దిపేట కొత్త బస్టాండ్లోకి మాత్రమే వెళ్తున్నాయి. పాత బస్టాండ్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలుపుతున్నారు. బస్సుల కోసం రోడ్ల మీదనే ఎదురుచూడాల్సి వస్తోంది. ఎండకు ఎండుతూ... వర్షానికి తడుస్తూనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా బస్సులు రోడ్డుపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ జాం సైతం అవుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మీరు మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రత్యేక చొరవ తీసుకుని మాపై దయవుంచి సిద్దిపేట పట్టణంతో పాటు సమీప గ్రామాలకు లోకల్ బస్సులను నడపాలని కోరుతున్నాం. ఇట్లు సిద్దిపేట పట్టణ ప్రజలు బస్టాండ్ బయటే బస్సులు ఆపుతుండటంతో ఏర్పడిన ట్రాఫిక్ జాం కరీంనగర్కు వెళ్లే బస్సు పాత బస్టాండ్ బయటే ఆపడంతో ప్రయాణికుల పాట్లు -
విద్యతోనే సమాజ వికాసం
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని ఎన్ఎస్డీసీ జిల్లా మేనేజర్ శిరీష అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. న్యాక్ కోఆర్డినేటర్ లక్ష్మినర్సింహులు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హుస్నాబాద్: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ కో ఆప్షన్ (క్రిస్టియన్) సభ్యురాలిగా కాతా అలియాస్ మారుపాక గ్లోరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రకటించారు. గత మే నెలలో మొత్తం నలుగురు కో ఆప్షన్ సభ్యులకు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. కౌన్సిలర్ల ఏకాభిప్రాయంతో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గ్లోరినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించి మద్దతు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లకు, మంత్రి పొన్నంకు గ్లోరినా ధన్యవాదాలు తెలిపారు. పాలకవర్గ సభ్యులతో కలిసి మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గజ్వేల్రూరల్: ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటుతో ఎన్నుకోబడిన నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించి తమ బాధ్యతను నిర్వర్తించాలని గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్లోగల పీఎంశ్రీ మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెసా అన్నారు. శుక్రవారం పాఠశాలలో స్కూల్ కేబినెట్ ఎలక్షన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో 560మంది విద్యార్థులతో పాటు 20 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పాఠశాల కెప్టెన్, కల్చరల్ కెప్టెన్, స్పోర్ట్స్ కెప్టెన్తో పాటు మరో 4 విభాగాలలో కెప్టెన్లను, కార్యవర్గాన్ని విద్యార్థులు ఎన్నుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడడంతో పాటు సమస్యల పరిష్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. జిల్లా ఉపాధికల్పన అధికారి ప్రియాంక సిద్దిపేటరూరల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని భవిష్యత్ను నిర్మించుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి, ప్రియాంక విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండల పరిధిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ పాఠశాలలోని 9వ,10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రియాంక హాజరై మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారని, డిప్లొమా కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించే ఉన్నాయన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ,కెమికల్ ఇండస్ట్రీ వంటి నైపుణ్య కోర్సులలో ఉత్తీర్ణులైతే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మూరి పద్మ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. -
భూ సర్వేను అడ్డుకున్న రైతులు
హుస్నాబాద్రూరల్: మండల పరిధిలోని తోటపల్లి శివారులో సర్వే నంబరు 444లో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకొవడానికి రెవెన్యూ అధికారులు భూ సర్వే చేస్తున్నారు. శుక్రవారం అధికారులను రైతులు అడ్డుకోవడంతో సర్వే చేయకుండా వెనుతిరిగి వెళ్లారు. ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉండటంతో ఇక్కడ వ్యవసాయ మార్కెట్ గోదాముల నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు భూ సర్వే చేస్తున్నారు. సర్వే నంబరు 444లో ఇదివరకే 3 ఎకరాలను పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వడంతో రైతులు సాగు చేసుకుంటున్నారు. మా జీవనాధారమైన భూములను ఏట్లా తీసుకుంటారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్వం సిద్ధం
పంద్రాగస్టు వేడుకలకుసిద్దిపేటకమాన్: స్థానిక పోలీసు కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. మంత్రి పొన్నం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ పరిశీలించనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి తన సందేశం ద్వారా వివరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్న వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి పొన్నం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిద్దిపేటకమాన్: పంద్రాగస్టు వేడుకలు జరగనున్న పోలీస్పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ హరికిరణ్ అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
సిద్దిపేటకమాన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణం లింగారెడ్డిపల్లి బస్తీ దవాఖానను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇందిరమ్మ కాలనీలో జ్వర సర్వేతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో స్ప్రేయింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు డెంగీ, మలేరియా వ్యాధులపై అవగహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ధనరాజ్ -
వైరల్ ఫీవర్
వణికిస్తున్న● ముగ్గురికి డెంగీ పాజిటివ్ ● ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులుహుస్నాబాద్: వాతావరణంలో వస్తున్న మార్పులు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా జనం వైరల్ ఫీవర్తో మంచాన పడుతున్నారు. ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడిన జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి జ్వరపీడితులతో కిటకిట లాడుతోంది. 35 మందికి పైగా వైరల్ ఫీవర్తో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజు 350 మందికిపైగా రోగులు వివిధ ఆరోగ్య సమస్యలతో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో దాదాపు 40 మందికి పైగా వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. పడకేసిన పారిశుద్ధ్యం హుస్నాబాద్లో పారిశుద్ధ్య లోపించడంతో దోమలు వ్యాప్తి చెంది జనం రోగాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో నీరు నిలవడం, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలకు స్థావరాలుగా మారాయి. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో జనం వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫొటోలకు పోజులు .. హుస్నాబాద్లో మున్సిపల్ అధికారులు ప్రతిరోజు వార్డుల వారీగా ‘సఫాయి అప్నా.. భీమారీ బగావో’ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కేవలం ఫొటోలకే పరిమతమై డ్రైనేజీలు శుభ్రం చేయించడం లేదని, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు ఆర్బాటంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొంటున్న అధికారులు పారిశుద్ధ్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు వందలాది మందికి రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ముగ్గురికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పట్టణానికి చెందిన ఒకరు, అలాగే పోతారం(ఎస్), మహ్మదాపూర్కు చెందిన మరో ఇద్దరికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తాగునీటి కలుషితం, పరిసరాల అపరిశుభ్రత, వాతావరణ మార్పులతో జనం జ్వరాల బారిన పడుతున్నారని వైద్యాధికారులు అంటున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్లు సోకే ప్రమాదం ఉంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. మరిగించిన నీటినే తాగాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్నిరకాల మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. వైరల్ ఫీవర్ లక్షణాలు కనబడగానే వెంటనే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రమేశ్రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆస్పత్రి -
నిమ్స్ న్యూరో సర్జన్ తిరుమల్కు అరుదైన గౌరవం
● యూసీఎఫ్ ఇండియా సెంటర్ సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్గా ఎంపిక ● లచ్చపేటలో సంబరాలు దుబ్బాక: నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్(నిమ్స్)లో అడిషనల్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జన్గా పనిచేస్తున్న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన డాక్టర్ తిరుమల్ యెర్రగుంటకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా(యూసీఎఫ్)ప్రతిష్టాత్మక సైంటిస్టు ఇన్ రెసిడెన్స్ కార్యక్రమానికి ఎంపికై న తొలి భారతీయ డాక్టర్గా తిరుమల్ నిలిచారు. ఈ నెల 13 నుంచి 16 వరకు ప్రత్యేక అకడమిక్ కార్యక్రమంలో తిరుమల్ యూసీఎఫ్ అధ్యాపకులు , మెడికల్, ఫ్రీ మెడికల్ విద్యార్థులు, వైద్య నిపుణులతో న్యూరోవిభాగానికి సంబంధించిన సమావేశాల్లో చర్చించనున్నారు. ఆధునిక న్యూరో సర్జరీపై ప్రత్యేక ఉపన్యాసం యూసీఎఫ్ కాలేజీ ఆఫ్ మెడిసిన్లో గురువారం డాక్టర్ తిరుమల్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. వైద్య విద్య, ఆధునిక న్యూరో సర్జరీ, భారతీయ వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అండ్ ఏఐ పాత్ర, భారత్–అమెరికా వైద్య విద్యాసంస్థల మధ్య సహకారం వంటి అంశాలపై ప్రసంగించారు. అలాగే ఇండియా డాక్టర్ల బృందంతో కలిసి టెంపుల్ క్లీనింగ్ కార్య్రక్రమంలో పాల్గొన్నట్లు డాక్టర్ తిరుమల్ సాక్షికి ఫోన్లో తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రత్యేక అతిథి ఆగష్టు 15న యూసీఎఫ్ ఇండియా సెంటర్ నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకల్లో డాక్టర్ తిరుమల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కడంపై ఆయన స్వస్థలం దుబ్బాక మున్సిపల్ లచ్చపేటలో సంబురాలు జరుపుకొన్నారు. తిరుమల్ తల్లిదండ్రులు సుజాత ప్రసాద్తో పాటు ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఆరుతడి పంటలే సాగు చేయండి
ఎల్నినోతో లోటు వర్షపాతం l కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ఎల్నినోతో లోటు వర్షపాతం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లా స్థాయి ఇరిగేషన్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలోని ప్రాజెక్టులలో కొత్తగా నీరు చేరలేదన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అందువల్ల వరి పంటలు పండించరాదన్నారు. గత సంవత్సరం 4.82 లక్షల ఎకరాల్లో పంట వేయగా వాటిలో 3.68 లక్షల ఎకరాలలో వరి పంట పండించినట్లు తెలిపారు ఈ యేడు అవగాహన కల్పించిన క్రమంలో నేటికీ 70వేల ఎకరాల్లో పంట మార్పిడి జరిగి కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేశారన్నారు. ఆగస్టు 15 తర్వాత ఆముదం, పత్తి, నూనె గింజల పంటలను పండించవచ్చన్నారు. వర్షాలు కురిస్తే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్శాఖ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ వర్షాబావ పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల ద్వారా నీటిని వదిలితే వ్యవసాయం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు పంపిన లేఖను కలెక్టర్ హైమావతి చదివి వినపించారు. గోదావరి నంది నుంచి నీరు వృథా పోకుండా లిఫ్ట్ చేసి ప్రాజెక్టులను నింపి సాగు నీరు అందించి అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అంతకుముందు అన్నపూర్ణ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, శనిగరం ప్రాజెక్టులలోని నీటి సామర్థ్యం ఉన్న నిల్వలపై ఇరిగేషన్ అధికారులు వివరించారు.కార్యక్రమంలో కరీంనగర్ సర్కిల్ సీఈ సత్యనారాయణరెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్ సర్కిల్ ఎస్ఈలు సూర్యకిరణ్, లక్ష్మణ్, పల్లంరాజు, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, డీఏఓ మల్లయ్య, ఉద్యానశాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం వెంటాడటంతో గాలిలో కలిసిన కూలీల ప్రాణాలు
● సత్వార్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ● రాజగిరిలో విషాదఛాయలు ● నెత్తురోడిన రహదారులు ఆటోను ఢీకొన్న ట్యాంకర్జహీరాబాద్ ఆసుపత్రిలో మృతదేహాలు..జహీరాబాద్ టౌన్/సంగారెడ్డి క్రైమ్: సొంత ఊరులో పనులు లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చి బతుకు జీవుడా అంటూ సొంతూరుకు వెళ్తుంటే ప్రమాదం వెంటాడటంతో కూలీల నిండు ప్రాణాలు గాలిలో కలిపోయాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలో 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రతీ రోజు జహీరాబాద్ ప్రాంతంలో కూలీ పనులకు వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన నిర్మల,నిఖిత,తుల్జమ్మ,చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ, రేఖ,శ్రీదేవి, కవిత, రేష్మలు ఆటో డ్రైవర్ దేవిదాస్తో కలిసి కోహీర్ గ్రామానికి వచ్చారు. సోయాబిన్ పంటలో కలుపు పనులు ముగించుకుని పాటలు పాడుకుంటూ తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. 65వ జాతీయ రహదారిపై సత్వార్ సమీపంలో వెనుకనుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారు కొంతమంది చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దేవిదాస్, కూలీలు శ్రీదేవి,రేఖ,కవిత,రేష్మలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన వారితో గాయపడిన వారి రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహమైంది. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య నిఖిత మృతి చెందింది. విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చనిపోయిన వారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన భార్య పిల్లలు విగత జీవులుగా మారడం కలచివేసింది. ఘటనా స్థలంలో గాయపడిన కూలీలు -
హామీల అమలుకు పోరాటం
గజ్వేల్: కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గీతన్నల చైతన్యయాత్ర మంగళవారం గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుంది. ఈ యాత్రకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి గీత కార్మికులు వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400మంది కార్మికులు మృతిచెందారని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెడతామన్నా హామీ కూడా అమలు చేయాలన్నారు. మరోవైపు హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో కల్తీ పేరుతో కల్లుదుకాణాలపై దాడులతో భయోత్పాతానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మరికొందరిని జైళ్లపాలుజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాడులు ఆపేసి దుకాణాలు తెరవాలన్నారు. లేనిపక్షంలో పోరాటం ఆగదన్నారు. సభలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రమణ, వెంకటేశ్తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కొమురవెల్లి(సిద్దిపేట): గౌడ సంఘాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గీతన్నల చైతన్య బస్సుయాత్ర కొమురవెల్లికి చేరుకుంది. సందర్భంగా యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్రకు కొమురవెల్లి గౌడసంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నాయకులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు బూడిద గోపి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికుల సంక్షేమాన్ని మరిచిన సర్కార్ కల్లు దుకాణాలను పునరుద్ధరించాలి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గజ్వేల్కు చేరుకున్న గీతన్నల చైతన్యయాత్ర -
13న స్పాట్ కౌన్సెలింగ్
● సద్వినియోగం చేసుకోండి ● అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సిద్దిపేటరూరల్: గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయడానికి ఈనెల 13న కలెక్టరేట్లో నిర్వహించనున్న స్పాట్ కౌన్సెలింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు మార్కుల మెమో, కులం, ఆదాయ, స్టడీ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తీసుకుని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్కు ఉదయం 10.30 గంటలకు రావాలని తెలిపారు. అర్హత, సీట్ల ఖాళీల ఆధారంగా భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్కుమార్ హుస్నాబాద్: చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి తప్పనిసరి అని శాతవాహన యూన్సివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ద్వారా అకౌంటింగ్పై మూడు రోజుల వర్క్షాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీశ్కుమార్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిరంతరం వస్తున్న మార్పులను గమనించాలని, దానికి అనుగుణంగా సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. దార్శనికత, స్పష్టత లేని చదువుతో పోటీ ప్రపంచంలో రాణించలేమని తెలిపారు. డిజిటల్ విప్లవం వల్ల లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖాతాలు, జీఎస్టీ, వ్యాపార కార్యకలాపాల నిర్వాహణ కోసం విద్యార్థులు ట్యాలీ సాఫ్ట్వేర్ను తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు హరికాంత్, చంద్రమౌళి తదితరులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): ప్రతీ విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. చైర్మన్ వెంకటయ్య మనవరాలు శ్రేహాన్వి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చుతో క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితానికి చదువే ఆయుధంగా మార్చుకోవాలన్నారు. ప్రభు త్వం అందిస్తున్న స్కాలర్షిప్పులు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యం వైపు దూసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, సర్పంచ్ జెన్నారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కోహెడరూరల్(హుస్నాబాద్): లండన్లో ఇటీవల బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ్యుడిగా నియామకం తర్వాత సొంతూరుకు చేరుకున్న ఉదయ్ నాగరాజును అభినందనలతో ముంచెత్తారు. కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు మంగళవారం గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు, పలువురు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహెడ మండలాన్ని ప్రపంచ దేశాలు శనిగరం గ్రామం వైపు చూసేలా చేసిన గొప్పు వ్యక్తి అని కొనియాడారు. అలాగే బ్రిటన్ ఎగువ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడం హర్షిణీయమన్నారు. శనిగరం గ్రామం నుంచి ఎవరైనా విద్యార్థులు, ఉద్యోగ రీత్యా వచ్చిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మన బిడ్డలుగా గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్లు నింపండి
● తాగు, సాగు నీటి కొరత లేకుండా చూడాలి ● కలెక్టర్, ఇరిగేషన్ సలహా కమిటీలకు ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ సిద్దిపేటజోన్: ‘గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎల్నినో ప్రభావంతో 65శాతం మందే వానాకాలం పంటలు సాగు చేశారు. మిగతా రైతులు సాగునీరు లేదని బీడు భూములుగా ఉంచారు. ప్రస్తుతం సాగు అవుతున్న పంటలు గట్టెక్కేందుకు రిజర్వాయర్లు నింపడమే శరణ్యమని’ మాజీ మంత్రి హరీశ్రావు కలెక్టర్, నీటిపారుదల శాఖ సలహా కమిటీకి బహిరంగంగా లేఖ రాశారు. కలెక్టరేట్లో మంగళవారం నీటిపారుదల సలహా కమిటీ సమావేశం సందర్భంగా లేఖ ద్వారా పలు సూచనలు, అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో జిల్లా కమిటీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కొన్ని సూచనలు, అంశాలను లేఖ రూపంలో తెస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణం 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం వల్ల వచ్చే వానాకాలం వరకు రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. అవసరమైన నీటిని వేసవికాలంలో కూడా మిడ్ మానేరు ద్వారా ఎత్తిపోయడం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ ఉందని, వాటిని వెంటనే నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ద్వారా నీటిని ఎత్తిపోయడం జరిగేదని గుర్తు చేశారు. ఇప్పటికీ ఈసారి ఇంకా ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. జూలై 2027 వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అప్పటివరకు తాగు, సాగునీరు కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటికై నా రిజర్వాయర్లకు ఎత్తిపోతల ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 6నుంచి7 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాల్సి ఉంటుందని, వరి, పామాయిల్ ఇతర పంటలు సాగుచేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లాలోని రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
సంగారెడ్డి నుంచే స్మార్ట్కు శ్రీకారం..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తెల్ల రేషన్కార్డులు పంపిణీ చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్రెడ్డిల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం, మంత్రులకు ఘన స్వాగతం పలుకుతాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన వారికి రేషన్కార్డులు అందలేదని విమర్శించారు. – జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ఈనెల 15న బహిరంగ సభను నిర్వహించి.. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. సీఎం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బహిరంగసభ నిర్వహించాలని తలపెట్టిన అంబేద్కర్ స్టేడియాన్ని సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ పరితోష్లు పరిశీలించారు. సభా వేధిక, సభకు హజరయ్యే వారికి కుర్చీలు, ఇతర సౌకర్యాలపై జగ్గారెడ్డి కలెక్టర్తో చర్చించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు.. ఇలా భద్రత పరమైన ఏర్పాట్లను ఎస్పీ పరితోశ్పంకజ్ పరిశీలించారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్లో జిల్లాకు రానున్న నేపథ్యంలో తారా డిగ్రీ కాలేజీ హెలీప్యాడ్ను కూడా సందర్శించారు. జిల్లాకు వచ్చిన 4.46 లక్షల స్మార్ట్ కార్డులు.. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేందుకు ప్రభుత్వం కార్డుదారులకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఏటీఎం కార్డు తరహలో ఉండే ఈ కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, కార్డు నెంబర్తో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే కార్డుదారుని కుటుంబసభ్యుల సమగ్ర వివరాలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 4.46 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ 4.46 స్మార్ట్ కార్డులు ఇప్పటికే సంగారెడ్డి జిల్లాకు చేరుకున్నాయి. భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు సీఎం సభకు భారీగా జన సమీకరణ చేయాలని ఇటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఈ సభకు జనసమీకరణ చేపట్టనున్నాయి. సంగారెడ్డితో పాటు, మెదక్, సిద్దిపేట జిల్లాలకు నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ సభకు తరలించే అవకాశాలున్నాయి. ఈనెల 15న జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణకు సమాయత్తం కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి -
మంత్రులకు ఘన స్వాగతం
హుస్నాబాద్: మంత్రులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ఎల్కతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్లు హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కొద్ది సేపు ఆగారు. కాంగ్రెస్ నాయకులు వారికి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి మంత్రి పొన్నం కాంగ్రెస్ నాయకులను పరిచయం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మంత్రులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, మండల అద్యక్షుడు వెన్న రాజు తదితరులు ఉన్నారు. -
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించి, దోమల నివారణకు పిచికారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణను వారు పరిశీలించారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, సిబ్బందికి సూచించారు. అనంతరం పట్టణంలోని మూడో వార్డులోని రంగధాంపల్లి బతుకమ్మ కుంటను కమిషనర్ పరిశీలించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నీరు కుంటలో కలవడంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు కుంటను సందర్శించారు. డ్రైనేజీ నీరు కుంటలోకి చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వంగ తిరుమల్రెడ్డి, ముత్యల కనకయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య ● గజ్వేల్లో ర్యాలీ, రాస్తారోకో గజ్వేల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందెబోయిన ఎల్లయ్య అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం గజ్వేల్లో ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సందెబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. కనీస వేతనాలు పెంచకపోవడం, 12గంటలపాటు పని గంటలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం, పంటలు కొనుగోలు చేయకుండా చట్టాలను మార్చడం దారుణమన్నారు. ఈ విధానాలపై రాజీలేని పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి, నాయకులు రంగారెడ్డి, వేణుగోపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పీఎఫ్ ఆఫీస్ ఎదుట ఆందోళన.. సిద్దిపేటజోన్: నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని పీఎఫ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంతకుముందు సీఐటీయూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకదశలో కార్మిక సంఘాల నాయకులు ప్రతిఘటించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలోని 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సిద్దిపేట డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్, అర్బన్, రూరల్, నారాయణరావుపేట మండలాల్లోని అన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. -
లక్ష ఓట్లు గల్లంతు!
● లెక్కతేల్చేపనిలో యంత్రాంగం ● అనామలిస్ (తేడాలు) జాబితాపై నజర్ ● 82,125 ఓటర్లకు నోటీసులు జిల్లాలో సర్ ప్రక్రియ ఆధారంగా 1,19,500 ఓట్లు జాబితా నుంచి ఔట్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా.. ముఖ్యంగా వీటిలో చనిపోయిన వారు 33,256 కాగా, శాశ్వతంగా వలస వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకొని వారు 59,084 మంది ఉన్నారు. అందుబాటులో లేని వారు 11,460 మంది, ఇతర ప్రాంతాల్లో డబుల్ ఓట్లు ఉన్న వారు 6,047 మందితో పాటు వివిధ కారణాలతో 1,19,500 ఓటర్లను డిజిటలైజేషన్ చేయలేకపోయినట్లు సమాచారం. – సిద్దిపేటజోన్ ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం వాస్తవ లెక్క తేల్చేపనిలో నిమగ్నమైంది. షెడ్యూల్ మేరకు ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ ఆఫీసర్లకు ఇచ్చే ఆఖరి గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లే. దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో 9,92,967 మంది ఓటర్లకు గాను 8,73,647 ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. వివిధ కారణాలతో 1,19,500 ఓట్లు అందుబాటులో లేకపోయినట్లు గుర్తించారు. వీటికి తోడు ఎన్యూమరేషన్ పత్రాలలో నమోదు చేసిన వివరాల్లో తేడాలు (అనామలిస్) ఉన్న వారి సంఖ్య 82,125గా తేలింది. వీరందరికి అధికారులు ఈనెల 17తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. పొంతన లేని వివరాలు నమోదు చేసిన వారందరూ అక్టోబర్ 15వరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి నిర్ధారించుకోవాలి. అప్పుడే ఓటరు జాబితాలో ఓటు ఉన్నట్లు. లేనిపక్షంలో ఓటుహక్కు పోయినట్టే. నియోజకవర్గ వర్గాల వారీగా వివరాలు.. ● సిద్దిపేట నియోజకవర్గంలో చనిపోయిన వారు 7,942 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 23,037. అలాగే 5,586మంది అందుబాటులో లేకపోవడం, 1377 డబుల్ ఓట్లు కల్గి ఉండడం తదితర కారణాలతో 39,538 మంది ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ నోచుకోలేదు. ● హుస్నాబాద్లో చనిపోయిన వారు 8091 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 10,614, అందుబాటులో లేని వారు 1234, అలాగే డబుల్ ఓట్లు ఉన్న వారు 1,747మొత్తంగా 24,385 ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ కాలేదు. ● దుబ్బాకలో చనిపోయిన వారు 6130 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు 8,513 మంది. అందుబాటులో లేని వారు 473, డబుల్ ఓట్లు ఉన్న వారు 803తో పాటు వివిధ కారణాలతో మొత్తంగా 17,900 పత్రాలు డిజిటలైజేషన్ నోచుకోలేదు. ● గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో చనిపోయిన వారు 10,093 మంది. శాశ్వతంగా వలస వెళ్లిన వారు16920, అందుబాటులో లేని వారు 4167, డబుల్ ఓట్లు ఉన్న వారు 2120తో పాటు వివిధ కారణాలతో మొత్తంగా 37,677 ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ కాలేదు. అత్యధికంగా సిద్దిపేటలో.. ఆయా నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అనంతరం వివరాలు పరిశీలిస్తే.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా ఓట్లు తగ్గే అవకాశం ఉంది. అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నట్లు అంచనా. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హరీశ్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగార్థులకు శిక్షణ శిబిరం సిద్దిపేటజోన్: నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే హరీశ్రావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి సోయి వచ్చిందన్నారు. అందులో భాగంగానే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. సిద్దిపేట ప్రాంత యువత కోసం మాజీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూపు, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. నిరుద్యోగలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోచింగ్ సెంటర్ అడ్మిషన్ల కోసం త్వరలోనే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ మోహిజ్, నాయకులు సోమిరెడ్డి, పాపయ్య, నరేష్, నరేందర్ రెడ్డి, దేవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్తో రైతుల్లో సంతోషాలు
● రాబోయే రోజుల్లో సాగులో సిద్దిపేట అగ్రస్థానమే.. ● మాజీ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు(సిద్దిపేట): ఆయిల్పామ్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని, రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగులో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో సిద్దిపేట నిలుస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేడిపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. రైతు పాపిరెడ్డి సాగు చేసిన తోటలో ఆయిల్ పామ్ గెలలు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల జీవితాల్లో మార్పు రావాలన్న తన ఐదేళ్ల కల ఆయిల్ పామ్ సాగుతో సాకారమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను చూసినప్పుడు సిద్దిపేట రైతులు కూడా ఇలా ఆర్థికంగా ఎదగాలని తాను కోరుకున్నానన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాక తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అద్భుతం సాధ్యమైందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 5,322 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, 301 ఎకర్లాలో పంట కటింగ్ మొదలైందన్నారు. భవిష్యత్లో సిద్దిపేటలో 50 వేల ఎకరాలకు విస్తరించి రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచిగా మారుస్తామన్నారు. ఆయిల్ పామ్ రైతుకు మాత్రమే కాకుండా సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అనంతరం కస్తూరిపల్లిలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్లు, నాయకులు తదితరులు ఉన్నారు. రైతులకు డబ్బులే డబ్బులు సిద్దిపేటరూరల్: సంప్రదాయ పంటలు కాకుండా అధిక ఆదాయం, నెలనెలా జీతం మాదిరిగా డబ్బులు వచ్చే ఆయిల్పామ్ పంటను సాగు చేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు రైతులకు సూచించారు. ఆదివారం నారాయణరావుపేట మండల పరిధిలోని గోపులాపూర్లోని రైతు సోప్పరి రవి వ్యవసాయ భూమిలో ఆయిల్పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ గోపాలపూర్లో 54 మంది రైతులు 120 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారన్నారు. నేడు రైతులే వచ్చి మొక్కలు ఇప్పించండి.. పంట సాగు చేసుకుంటామని ఆడుగుతుండటంతో గొప్పమార్పు వచ్చిందన్నారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మారుమోగాయి. ఉదయమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు అభిషేకాలు, నిత్యకల్యాణం, ప్రత్యేకపూజలు చేశారు. పట్నాలు వేసి, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, ప్రధానార్చకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్.. మల్లికార్జున స్వామిని ఆదివారం రాష్ట్ర ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ పార్వతీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో డీటీఓ చంద్రు, ఎస్టీఓ నర్సింహులు, ఆలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు సిద్దిపేటరూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ దృష్ట్యా నేటి సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆతర్వాత సోమవారం యథావిధిగా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. -
డైవర్షన్ కోసమే క్షుద్రపూజల పంచాయితీ
● కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే ● మెదక్ ఎంపీ రఘునందన్రావుగజ్వేల్: ప్రజా సమస్యలు పక్కదోవపట్టించేందుకే టీపీసీసీ చీఫ్ క్షుద్రపూజల పంచాయితీని తెరపైకి తెచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్లో పద్మశాలిభవన్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు నిజంగానే క్షుద్రపూజలు చేసినట్లు రుజువైతే ఎందుకు కేసులు పెట్టి లోపలేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు, కార్ల కేసులు ఉత్తగనే ఇడిసిపెడితెరి? అంటూ దుయ్యబట్టారు. నువ్వు తిట్టినట్లు చేయి, నేను కొట్టినట్లు చేస్తా అనే విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యతో అల్లాడుతుండగా, దానిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తే రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకే అంశంపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో మీడియా దృష్టి ఆకర్శించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఆయన కూతురు డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళలు భారీగా పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శిబిరాన్ని సందర్శించి పరీక్షలకు వచ్చిన మహిళలతో మాట్లాడారు. దుబ్బాక: ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణలో) రాష్ట్రంలోనే వంద శాతం పూర్తి చేసుకున్న మొదటి నియోజకవర్గంగా దుబ్బాక నిలవడం గర్వకారణంగా ఉందని ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త పల్లెవంశీ కృష్ణాగౌడ్తో పాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా ముందంజలో ఉండాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీయువకుల నూతన ఓటు హక్కును బీజేపీ శ్రేణులు ముందుండి నమోదు చేయించాలన్నారు. -
సమస్యలు పరిష్కరించుకుందాం
కాశిరెడ్డిపల్లి గ్రామస్తులతో మాజీ సీఎం కేసీఆర్ మర్కూక్(గజ్వేల్): మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి సమస్యల పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్రెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ ఆదివారం తన వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తున్న క్రమంలో కాశిరెడ్డిపల్లి వద్ద గ్రామ యువకులు అభివాదం చేయడంతో తన కాన్వాయిని ఆపారు. గ్రామస్తులతో కారులోంచి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యలు విన్నవించుకున్నారు. ఇటీవల సాక్షిలో నాడు కళకళ.. నేడు వెలవెల శీర్షికన కల్యాణమండపం దుస్థితిపై ప్రచురితమైన కథనాన్ని సైతం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సానుకులంగా స్పందించిన కేసీఆర్.. అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. -
కాలువ దాటితేనే సాగు
వంతెన లేక రైతుల అవస్థలు ● పట్టించుకోని అధికారులు ● అప్పాయపల్లిలో దుస్థితి దుబ్బాకటౌన్: సాగునీటి కోసం అధికారులు కాలువ తవ్వడం రైతన్నలకు శాపంలా మారింది. పొలాలకు వెళ్లే దారిని విభజిస్తూ కాలువ నిర్మాణం చేపట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువ అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్కు సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా అధికారులు కాలువను నిర్మించారు. అప్పాయపల్లికి చెందిన పలువురు రైతుల పొలాలు.. కాలువ అవతలి వైపు ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది. కాని కాలువ నిర్మాణంతో రైతులు పొలాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ దారి వెంబడి పొలాల వద్దకు వెళ్లే వృద్ధుల పరిస్థితి దుర్బరంగా మారింది. యువకులు మోసుకెళ్తే గానీ కాలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. వీరు యువకులను బతిమాలి కాలువ ఆవలి వైపు వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు వెంటనే స్పందించి కాలువపై అవసరమైన చోట వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇచ్చిన మాట తప్పారు.. కాలువ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పెద్దసార్లు ఇచ్చిన మాట తప్పిండ్రు. అసలే వానకాలం కాలువ దాటాలంటే భయామేస్తుంది. నీటి ప్రవాహం లేనప్పడు కాలువ దాటుతున్నాం. కానీ నీరు ఉన్నప్పుడు సుమారు 3 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సివస్తోంది. –పెద్దలచ్చు అశోక్ అధికారులు స్పందించాలి వంతెన నిర్మించాలని ఎన్నో సార్లు విన్నవించినా అధికారులు స్పందించడంలేదు. కాలువ నిర్మాణం చేసేటప్పడు రైతులకుఅండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రైతులు అవస్థలు పడుతున్నా కనీస స్పందన కరవైంది. అధికారులు వెంటనే స్పందించి వంతెన నిర్మించాలి. –కేశబోయిన ప్రభాకర్, మాజీ ఉపసర్పంచ్, అప్పాయపల్లి మాట తప్పిన అధికారులు 2018 సంవత్సరంలో అధికారులు కాలువ నిర్మాణం చేపట్టారు. కాలువ నిర్మాణం పూర్తవడంతో రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. కాలువ నిర్మాణ సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు, కాంట్రాక్టర్కు గ్రామస్తులు విన్నవించారు. కాలువ పైన అవసరమైన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ కాలువ నిర్మాణం పూర్తి చేసి వంతెనలు నిర్మించకుండానే చేతులు దులుపుకొన్నారు. దీంతో ప్రతీరోజు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ఇష్టారాజ్యం
గజ్వేల్ జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షల పేరుతో నిలువుదోపిడీ జరుగుతోంది. ఆస్పత్రిలోరెఫరల్ దందా.. మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘునందన్రావుఆదివారం ఇక్కడ చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఎన్నో అంశాలు వెలుగు చూశాయి. పట్టణంలోని ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లనిర్వాహకులు ఒక్కొక్కరూ.. ఒక్కో బ్రోకర్ను నియమించుకొని రోగులను తమవైపు తిప్పుకుంటూ, స్కానింగ్లు, ఇతరముఖ్యమైన వైద్య పరీక్షల పేరిట రోగులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడంగమనార్హం. – గజ్వేల్ గజ్వేల్లోని జిల్లా ఆస్పత్రి పనితీరుపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్పత్రిలో వైద్య సేవలపై ఈనెల 3న ‘సాక్షి’లో ‘ఆస్పత్రికి సమస్యల సుస్తీ’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెల్సిందే. ఈ కథనంలో వైద్యులు, సిబ్బంది కుమ్మకై ్క స్కానింగ్లు, ఎక్స్రేల కోసం రోగులను ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. తాజాగా ఆదివారం మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆస్పత్రిని తనిఖీ చేసిన సందర్భంగా మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో రెఫరల్ దందా సాగుతున్నా.. కట్టడి చేయాల్సిన వైద్యాధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ఈ అంశంపై ప్రభుతాసుపత్రిలో బ్రోకర్ల సంచారం నిజమేని ఒప్పుకున్నారు. తాము అలాంటి వ్యక్తులను ప్రశ్నిస్తే.. బంధువులను చూడటానికి వచ్చినట్లు చెబుతున్నారని ఎంపీకి వివరించారు. ఇకనుంచి ఆస్పత్రిలో సీసీ టీవీ ఫుటేజీలను నిత్యం పరిశీలించి, రెఫరల్ దందా కారకులపై చర్యలు తీసుకోవాలని, బ్రోకర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో తానూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సెంటర్కో బ్రోకర్ స్థానిక జిల్లా ఆస్పత్రి పరిధిలోని ఎంసీహెచ్ (మాతా శిశుసంరక్షణ ఆస్పత్రి)లో 100పడకలు, సాధారణ ఆస్పత్రిలో మరో 100 పడకలు ఉన్నాయి. నిత్యం ఈ రెండు ఆస్పత్రులకు 500–700కుపైగా ఓపీ ఉంటుంది. ఇక్కడికి గజ్వేల్ నియోజకవర్గంలోని రోగులేకాకుండా సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి జిల్లాలకు చెందిన రోగులకు వస్తుంటారు. కానీ రోగుల అవసరాల ఆసరాగా చేసుకొని నిలువుదోపీడీ చేస్తున్నారు. ఎంసీహెచ్లో టిఫా స్కానింగ్, గ్రోతింగ్ స్కానింగ్, అల్ట్రా సౌండ్ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా చాలావరకు వీటిని బయట డయాగ్నోస్టిక్ సెంటర్లకే రాస్తూ రెఫరల్ ‘దందా’కు తెర తీశారు. ఇకపోతే జనరల్ ఆసుపత్రిలో ఎక్స్రే, ఈసీజీ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నా.. వీటితోపాటు స్కానింగ్లను బయటకే రాస్తున్నారు. గాయాలతో వచ్చే వారిని ఎక్స్రేల కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిప్పుతూ దండుకుంటున్నారు. ఒక్కో డయగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఒక్కో బ్రోకర్ను జీతమిచ్చి మరీ పెట్టుకొని రోగులను తమవైపు తిప్పుకుంటున్నారు. విపరీతంగా కమీషన్లు పంచుకుంటున్నారు. వైద్యులు, సిబ్బంది కనుసన్నల్లోనే ఈ ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది. వైద్య పరీక్షల పేరుతో నిలువుదోపిడీ గజ్వేల్ జిల్లా ఆస్పత్రిలోని జనరల్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న ఎక్కువమంది వైద్యులు, సిబ్బందికి బయట ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లుఉండటమే ఈ ‘దందా’కు మూల కారణమని స్పష్టమవుతోంది. ముందుగా ఇక్కడ పనిచేస్తున్న వారిని కట్టడి చేయడంతోపాటు ప్రేవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి వస్తున్న బ్రోకర్లను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోగలిగితేనే పరిస్థితి గాడిన పడే అవకాశం ఉంది. -
గండం గడిచింది
దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం, శనివారం తెల్లవారు జామున జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి జోరుగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే జిల్లాలోని చాలా చెరువులు, కుంటల్లో సగానికి పైగా నీరు నిలువ ఉండటంతో ఈ వర్షాలకు పెద్ద ఎత్తున వరద చేరడంతో చెరువులు, కుంటలకు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. పొలాల్లో ఎటు చూసినా వరద ప్రవహిస్తోంది. భారీ వర్షానికి మురికి కాలువల్లో వరద రోడ్లపై నుంచి ప్రవహించింది. వరిపంటలు నీటిలో మునిగిపోయి నష్టం వాటిల్లింది. చాలా రోజుల తర్వాత మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు,కుంటల్లోకి వరద మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కాలువల ద్వారా వేసవిలో జిల్లాలోని సిద్దిపేట, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, దుబ్బాక, నంగునూర్, చిన్నకోడూర్, కొండపాక, గజ్వేల్, తొగుట మండలాల్లోని పలు చెరువులు నింపారు. దీంతో ఇప్పటికే చాలా చెరువుల్లో సమృద్ధిగా నీరు నిల్వ ఉండగా భారీ వర్షానికి వరద చేరడంతో చాలా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంది. సంతోషంలో రైతన్నలు.. వానకాలం ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడటంతో వ్యవసాయ పనులు నత్తనడకన సాగాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా జోరువానలు పడుతుండటంతో రైతులు సంతోషంలో ఉన్నారు. వరినాట్లు వేసుకోవడ, కొత్తగా నార్లు పోసుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు జిల్లాలోని 26 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుబ్బాకలో శనివారం 5.9 .శుక్రవారం 7, సిద్దిపేట అర్బన్లో 7.7, శనివారం 4.2, సిద్దిపేట రూరల్లో 7.5, 3.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు,మర్కూక్ మండలాల్లో శనివారం 6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం 3.9 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లాలోని 10 మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.జిల్లాలో రెండు రోజుల నుంచి మంచి వర్షం కురిసింది. భారీ వర్షంతో చెరువులు, కుంటల్లోకి వరద భారీగా చేరడం సంతోషం. మంచి వానలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. –మల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి -
సహకారంలో సందడి
పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవులపై కాంగ్రెస్ నేతల గురి సహకార సంఘాల్లో సందడి షురూవైంది. పీఏసీఎస్ (సహకార సంఘాలు) పాలకవర్గాలకు పదవులు ఆశిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభ్యత్వాలు లేని నాయకులు ఆయా పీఏసీఎస్లలో కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సభ్యత్వం ఉంటేనే చైర్మన్, డైరెక్టర్ పదవులకు అర్హత కావడంతో లేనివారు కొత్తగా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయా పీఏసీఎస్ల పరిధిలో వ్యవసాయ భూమి లేకపోతే.. కొనుగోలు చేసి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల్లో తప్పనిసరిగా భూమి ఉండాల్సి ఉండటంతో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ పదవుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు విచారణలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో మాత్రం ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
సోమవారం ప్రజావాణి రద్దు
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికై న ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ దృష్ట్యా సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె. హైమావతి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించిన ఎవరూ ప్రజావాణి దృష్ట్యా కలెక్టరేట్కు రావద్దని సూచించారు. ఆ తర్వాత సోమవారం యథావిధిగా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వదేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రసమయిఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు బెజ్జంకి(సిద్దిపేట): అమెరికా పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ వచ్చిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు మండల బీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, లక్ష్మణ్, శేఖర్బాబు, స్వామి, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. పంటపొలాలకు వెళ్లే దారిని ఆక్రమణ చేస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న మాజీమంత్రి షబ్బీర్ అలీ గెస్ట్హౌజ్ వద్ద నిర్మిస్తున్న ప్రహారీని గ్రామస్తులు ధ్వంసం చేశా రు. పంటపొలాలకు వెళ్లేదారిని ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు ఆగ్రహంతో గోడను కూలగొట్టారు. జాతీయ రహదారి నుంచి చెరువుకట్టపై తాము పంటపొలాలకు వెళ్లేందుకు దారి ఉందని తెలిపారు. ఇంతకుముందు కూడా ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని చెప్పినా వినకుండా అడ్డుగోడ పెట్టారని చెప్పారు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రహారీని ధ్వంసం చేశారు. వడ్డెరల ఉపాధికి అనుమతులివ్వాలి కొల్చారం(నర్సాపూర్): వడ్డెరల ఉపాధికి ప్రభుత్వం చట్టపరమైన అనుమతి ఇవ్వాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గ సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్ అధ్యక్షతన శనివారం జిల్లా వడ్డెరల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాయిలు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి తమ కుటుంబాలు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
పారదర్శకత కోసమే ఎఫ్ఎఫ్ఎస్ యాప్
జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య గజ్వేల్: ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసమే ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్స్)యాప్ను తీసుకొచ్చినట్లు జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీనివాస ట్రేడర్స్, శారదా ట్రేడర్స్, తెలంగాణ అగ్రోస్ ఫర్టిలైజర్స్ దుకాణాల్లో శనివారం యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యూరియా, డీఏపీ, ఎంఓపీ ఎరువులను యాప్ ద్వారా అందిస్తున్నామన్నారు. బుకింగ్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు, ఫర్టిలైజర్స్ యాజమానులు రైతులకు సహకరించాలని ఆదేశించారు. -
నకిలీ లెక్చరర్ల గుట్టు రట్టు!
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్ అయిన లెక్చరర్ల గుట్టురట్టయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూన్ 2, 2014 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన లెక్చరర్లను గత ప్రభుత్వం మే 2023లో రెగ్యులరైజ్ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు. కొందరు ఆయా యూనివర్సిటీలలో ఆ కోర్సులు లేకున్నా ఆ యూనివర్సిటీలో చదవకుండానే ఆ కోర్సులు చదివినట్లుగా సర్టిఫికెట్లను అందజేసినట్లు ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పలువురు నకిలీ సర్టిఫికెట్లను అందించినట్లు ముందే చెప్పిన సాక్షి..గతేడాది అక్టోబర్ 15న ‘సాక్షి’లో ‘అమ్మో నకిలీ లెక్చరర్లు’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో సర్టిఫికెట్లను వేగంగా ఇంటర్మీడియెట్ అధికారులు తనిఖీలు చేసి గుర్తించారు. సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారిలో జిల్లా నుంచి 172 జూనియర్ కళాశాల అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్దీకరించారు. అందులో దాదాపు 15 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో అభ్యసించినట్లు ధ్రువపత్రాలను అందజేశారు. వాటిని పరిశీలన కోసం ఆయా వర్సిటీలకు లేఖలు రాశారు. ప్రస్తుతానికి జిల్లాకు చెందిన ముగ్గురు అధ్యాపకుల సర్టిఫికెట్లు, ఆ యూనివర్సిటీతో సంబంధం లేనట్లు తేలినట్లు సమాచారం. అలహాబాద్ యూనివర్సిటీలో చదివినట్లు చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రసాద్, లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో అభ్యసించినట్లు చేర్యాలలోని జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ పరుశరాములు, బుందేల్ఖండ్ యూనివర్సిటీలో చదివినట్లు ధ్రువపత్రాలను గజ్వేల్లోని జూనియర్ కళాశాలలో ఓకేషనల్ అధ్యాపకుడుగా పనిచేస్తున్న అష్రాఫ్ అందజేశారు. ఈ ముగ్గురు అధ్యాపకులకు ఇంటర్ బోర్డు షోకాజు నోటీసులను జారీ చేసింది. శుక్రవారం రాత్రికి జిల్లాకు రాగా ఆ ముగ్గురు అధ్యాపకులకు నోటీసులు అందించాలని ఆయా ప్రిన్సిపాల్లకు పంపించారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి కొందరిలో మొదలైన గుబులు రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులలో మరికొంత మంది సైతం ఫేక్ సర్టిఫికెట్లు అందించిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఫేక్ సర్టిఫికెట్లను అందించిన వారిలో గుబులు మొదలైంది. తమపై సైతం వేటు పడుతుందా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో విధులు నిర్వర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి ఇంటర్ బోర్డు నుంచి వచ్చి షోకాజు నోటీసులను ఆయా కళాశాల ప్రిన్సిపాల్లలకు పంపించాం. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు ఆ ముగ్గురు అధ్యాపకులకు అందించనున్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి ఉంటుంది. –రవీందర్రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ అధికారి -
చేనేత వస్త్రాలే వాడుదాం
● పాలిథిన్ శాలువాలు బంద్ చేద్దాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ● జిల్లాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం హుస్నాబాద్: అతిథులకు పాలిథిన్ శాలువాలు బంద్ చేసి నేతన్నలు ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలను వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత వస్త్రాలు ప్రొత్సహించాలని, చేనేత వస్త్రాలు ధరించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంభానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చేనేత వస్రాలను వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పవర్ లూమ్ క్లస్టర్ పెట్టుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రకృతిని కాపాడుదాం ప్రకృతిని సమతుల్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచడం భవిష్యత్ తరాలకు మనమిస్తున్న వరమన్నారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ గ్రంధాలయ సంస్ధ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు వెంకటరమణ. కౌన్సిలర్లు పాల్గొన్నారు.చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం గజ్వేల్: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వేల్లో చేనేత మగ్గం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత రంగంలోకి కార్పొరేట్ సంస్థల రంగ ప్రవేశంతో కార్మికుల జీవితాలు దయనీయంగా మారుతున్నాయని చెప్పారు. కేంద్రం కార్పొరేట్ సంస్థల ప్రమేయాన్ని తగ్గించి, చేనేతకు అవసరమయ్యే ముడి సరుకుకు జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాజేశం, గజ్వేల్ మార్కెట్ కమీటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మజీద్ కమీటీ అధ్యక్షుడు మతిన్ తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ వస్త్రాలనే ధరిద్దాం దుబ్బాక: చేనేత రంగాన్ని రక్షించుకునేందుకు స్వదేశీ వస్త్రాలనే ధరించాలని చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దుబ్బాకలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నల బలోపేతానికి అందరూ పాటుపడాలన్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన దుబ్బాక నేత కార్మికులకు చేతినిండా పనికల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు ఉన్నారు. -
పారదర్శక ఓటరు జాబితానే లక్ష్యం
సిద్దిపేటరూరల్: పారదర్శక ఓటరు జాబితాను తయారు చేయడమే ‘ఎస్ఐఆర్’ ముఖ్య ఉద్దేశ్యమని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా స్పెషల్ అబ్జర్వర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బీఎల్ఓలతో అబ్జర్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం నాణ్యమైన ఓటర్ జాబితా తయారు చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తారని అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టి బోగస్ ఓటర్లు లేకుండా పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేస్తోందన్నారు. ఓటర్లను గుర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని క్షేత్రస్థాయిలో రెండు, మూడు సార్లు పరిశీలించి పక్కింటి వారి సంతకం తీసుకొని నిర్ణయానికి రావాలన్నారు. సేకరించిన వివరాలు ఆన్లైన్లో పొందుపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను తెలియజేశారు. జిల్లాలో వందశాతం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన పూర్తయిందని తెలిపారు. 87.97 శాతం ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలు వైభవంగా నిర్వహించాలి జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, విద్యార్థులు, ప్రజలు సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహణ, ముఖ్య అతిథి ప్రసంగం, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వివిధ శాఖల ద్వారా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయం సిబ్బంది తప్పక పాల్గొనాలని సూచించారు. ఉమ్మడి జిల్లా స్పెషల్ అబ్జర్వర్ గౌరవ్ ఉప్పల్ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం -
తరచూ శుభ్రం తప్పనిసరి
ఏ ట్యాంక్ అయినా తరచూగా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి రెండు నుంచి మూడు మార్లు బ్లీచింగ్ చేయాలి. ట్యాంక్లలో నిల్వ ఉండే నీటినే దినచర్యలో వినియోగిస్తాం. వాటర్ ట్యాంక్లు శుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలుంటాయి. – డాక్టర్ మధన్మోహన్, మైక్రోబయాలజీ విభాగాధిపతి, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, సిద్దిపేట సిమెంట్ ట్యాంకుల్లోనే నాచు ఎక్కువ సిమెంట్ ట్యాంక్లలో నాచు ఎక్కువగా వస్తుంది. అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ ట్యాంకులు తక్కువ కెమికల్తో తయారు చేసేవి వినియోగిస్తే మంచిది. – తిప్పర్తి రేష్మ, విద్యార్థిని, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ ఫైనల్ ఇయర్ -
మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి...
కొండపాక(గజ్వేల్): మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు మంత్రి వివేక్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి , పార్టీ మండల అధ్యక్షుడు మంచాల కనకరాములు ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి సర్పంచ్ కర్ణాకర్ రెడ్డి, రాంపల్లి సర్పంచ్ బొమ్మ మల్లయ్య లతో పాటు పలువురు వార్డు సభ్యులు, పలు గ్రామాల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చేరారు. వీరికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసరి లింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గజవెల్లి సుదర్శన్, బందారం సర్పంచ్ కొలుపుల గంగాధర్ , వెలుకట్ట గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు, జప్తి నాచారం సర్పంచ్ పావని శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్లకొండ రాజు, అడ్వకేట్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
బాబోయ్.. బ్యాక్టీరియా!
సాక్షి, సిద్దిపేట: పల్లెలు, పట్టణాల్లో నీటి నిల్వ కోసం చాలా మంది సిమెంట్ ట్యాంకులే వినియోగిస్తుంటారు. అయితే ఈ వాటర్ ట్యాంక్లలో అధికంగా బ్యాక్టీరియా ఉంటోందని పరిశోధనలో తేలింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ మెక్రోబయాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తిప్పని రేష్మ ప్రాజెక్ట్లో భాగంగా ఆ విభాగ హెడ్ డాక్టర్ మదన్మోహన్ మార్గదర్శకత్వంలో ప్లాస్టిక్, సిమెంట్ వాటర్ ట్యాంక్లలో నీటి నాణ్యతపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రిసెంట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్లో పబ్లిష్ కోసం అమోదం పొందింది. త్వరలో పబ్లిష్ కానుంది. పరిశోధన ఇలా.. గతంలో డ్రమ్ములు, గోళాల్లో నీటిని నిల్వ చేసుకునేవారు. ప్రస్తుతం చాలా ఇళ్లల్లో వాటర్ ట్యాంక్ల వినియోగం పెరిగిపోయింది. సిద్దిపేట పట్టణంలో 100 ప్లాస్టిక్, సిమెంట్ వాటర్ ట్యాంక్లలో నీటి నమూనాలను సేకరించారు. ప్లాస్టిక్, సిమెంట్ ట్యాంకుల నుంచి స్టైరెల్ బాటిళ్లలో నీటి నమూనాలను తీసుకున్నారు. ట్యాంకుల లోపల గోడలపై పేరుకుపోయిన బ్యాక్టీరియాలను గుర్తించేందుకు కాటన్ స్వాబ్ నమూనాలు తీసుకున్నారు. గ్రామ్ స్టెయినింగ్, స్టాండర్డ్ ప్లేట్ కౌంట్, కొలిఫామ్ పరీక్షల ద్వారా సూక్ష్మజీవుల ఉనికిని విశ్లేషించారు. ప్లాస్టిక్ ట్యాంక్ నమూనాలో 50 కాలనీ ఫార్మింగ్ యూనిట్లు (సీఎఫ్యూ) మాత్రమే నమోదయ్యాయి. అయితే సిమెంట్ ట్యాంకులో సేకరించిన నమూనాలలో ఒక్కో దానిలో 300 సీఎఫ్యూల కంటే ఎక్కువగా లెక్కించలేనంతగా సూక్ష్మజీవులు ఉన్నట్లు పరిశోధనలో నిర్ధారించారు. నీటి నాణ్యత పై ప్రభావం సిమెంట్ ట్యాంక్ల లోపల ఉపరితలం గరుకుగా ఉండటం, సూక్ష్మ రంధ్రాలు అధికంగా ఉండటంతో బయోఫిల్మ్ ఏర్పడి బ్యాక్టీరియా వేగంగా పెరుగుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ప్లాస్టిక్ ట్యాంకుల ఉపరితలం మృదువుగా ఉండటంతో సూక్ష్మజీవులు అంటుకునే అవకాశం తక్కువగా ఉందన్నారు. సిమెంట్ ట్యాంకుల్లో నిల్వ ఉండే వాటర్లో అధికంగా బ్యాక్టీరియా ఉండటంతో నీటి నాణ్యత దెబ్బతినే అవకాశముందని పరిశోధనలో తేల్చారు. ప్రజలకు సూచనలు.. ఏ వాటర్ ట్యాంక్ అయినా మూడు నుంచి నాలుగు నెలలకు ఒక సారి శుభ్రం చేయాలి. ట్యాంకు మూతలను ఎప్పుడూ బిగుతుగా ఉంచాలని, కాలానుగుణంగా నీటి నాణ్యతను పరీక్షించుకోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిమెంట్ ట్యాంకులను వినియోగించే వారు నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే నీటి ద్వారా వ్యాపించే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. సిమెంట్ వాటర్ ట్యాంకులతో ముప్పు ప్రమాదంలో ప్రజారోగ్యం ట్యాంకులోని నీరంతా కలుషితమే.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పరిశోధన ఆసక్తికర అంశాలు వెలుగులోకి.. -
దుబ్బాక అసెంబ్లీ బరిలో ఉంటా
● దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆశయాలు నెరవేరుస్తా ● సతీమణి సుజాతక్క దుబ్బాక: నక్సలైట్గా.. జర్నలిస్టుగా.. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన రామలింగారెడ్డి తుదిశ్వాస విడిచేంతవరకు పేదల మధ్యలోనే గడిపారని ఆయన ఆశయాల సాధన కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని సోలిపేట సుజాతక్క తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని దుబ్బాక పట్టణంతో పాటుగా స్వగ్రామం చిట్టాపూర్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రామలింగారెడ్డి సతీమణి సుజాతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పెద్దలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తామన్నారు. ఆయన కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీశ్రెడ్డి మాట్లాడుతూ జీవితమంతా పేదల కోసమే పరితపించిన గొప్ప నాయకుడన్నారు. కార్యక్రమంలో నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
విలువలతో కూడిన విద్య అవసరం
జడ్జి రేవతి హుస్నాబాద్: ప్రస్తుత సమాజంలో మానవ విలువలు, నైతికతను పెంపొందించే విద్య అవసరమని హుస్నాబాద్ ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ జడ్జి రేవతి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రేవతి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, భాషను అందరు గౌరవించాలన్నారు. ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. కార్యక్రమంలో అదనపు జడ్జి ప్రమీద, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, పాఠశాల అద్యాపక బృందం పాల్గొన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకం చేపడితే లాభాలు గడించవచ్చని ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ శాఖ ఏడీ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శుక్రవారం చంద్లాపూర్, గంగాపూర్లో పట్టు పురుగుల షెడ్లను, తోటలను, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకం చేపడితే నెల నెలా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. మల్బరీ సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు పట్టు రైతులు పాల్గొన్నారు. చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో దళితుల ఇళ్ల కూల్చివేతను ఆపాలంటూ పలువురు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడినట్లు వారు తెలిపారు. కమిషన్ను కలిసిన వారిలో బాధితులు వెంకటేశం, అంజయ్య, గునిగంటి శివ తదితరులున్నారు. హుస్నాబాద్రూరల్: మండల పరిధి మాలపల్లి, కూచనపెల్లి గ్రామాల మధ్య మర్రివాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసింది. శుక్రవారం రైతులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు ఆధ్వర్యంలో వాగు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు మెరుగు పడతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, కాంగ్రెస్ నాయకులు చందు, బొమ్మగాని రాజ్కుమార్, మహేందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నంగునూరు(సిద్దిపేట): ట్రైబల్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) తెలంగాణ చాప్టర్ జిల్లా కోఆర్డినేటర్గా బుక్యా భిక్షపతినాయక్ నియమితులయ్యారు. నంగునూరు మండలం జేపీతండా సర్పంచ్గా, జిల్లా బంజారా కమిటీ సభ్యునిగా పని చేసిన భిక్షపతినాయక్కు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్ నియామక పత్రం అదజేశారు. భిక్షపతినాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. -
జయశంకర్ వ్యక్తి కాదు శక్తి
● సిద్దిపేటతో అవినాభావ సంబంధం ● మాజీ మంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్: ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. గురువారం జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన భారీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాంతం పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. సిద్దిపేటతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమరుల త్యాగాల స్ఫూర్తిగా సిద్దిపేటలో అమరుల స్తూపం ఆయన చేతుల మీద ప్రారంభం చేసినట్లు గుర్తు చేశారు. ఆయన పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. నేడు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది అంటే అది జయశంకర్. కేసీఆర్ పోరాటం వల్లేనన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్. పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం,మాజీ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు భూపేష్, మోహన్ లాల్, మోహిజ్, బిమసేన పాల్గొన్నారు. -
నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
సిద్దిపేటరూరల్: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కలెక్టర్ హైమావతి అధ్యక్షతన సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు ఆశించినంతగా జిల్లా ప్రజలకు అందడం లేదని అన్నారు. వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు, వైద్యులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పరిశీలించి, వాటి భర్తీకి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మంత్రికి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలోని 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలను మరింత విస్త్రృతంగా నిర్వహించాలన్నారు. అనవసరంగా సీ–సెక్షన్ ప్రసవాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగుల ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అంటే నమ్మకం కలిగేలా పనిచేయాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.18 కోట్లతో ఎంఆర్ఐ స్కాన్ మంజూరు చేశామని, వెంటనే సేవలను ప్రజలకు అందించాలన్నారు. ఆస్పత్రిలో సరైన శానిటేషన్ లేదని, హానికర చెత్త కుప్పలు, దోమలు, ఈగలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన సమయానికి రోగులకు భోజనం, టిఫిన్ అందించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలో భాగంగా రోగులకు ఇవ్వాల్సిన మందులు ప్రైవేట్ ఫార్మసిలో లభిస్తున్నాయన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్స కోసం పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్థో సేవలు మెరుగు పరిచి నెలకు 100 సర్జరీలు చేయాలన్నారు. గతంలో మోకాలు చిప్ప ఆపరేషన్లు జరిగేవని, నేడు ఎందుకు చేయడం లేదని హరీశ్రావు అన్నారు. గతంలో రక్తనమూనాలు సేకరించిన అనంతరం రిపోర్టులు 18 గంటల్లో వచ్చివని, నేడు 36 గంటలు దాటినా రావడం లేదన్నారు. ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు ఉన్నారని సూపరింటెండెంట్ను అడగగా సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. కాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.5 కోట్ల 49 లక్షలతో వైద్య పరికరాల కొనుగోలుకు అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. అనంరతం ప్రొ.జయశంకర్ జయంత్రి సందర్భంగా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగీత షా, వైద్యాధికారి ధనరాజ్, అధికారులు పాల్గొన్నారు.వైద్యులు సమష్టిగా కృషి చేయాలి -
విద్యాధరి సేవలో ట్రెజరీ జాయింట్ డైరెక్టర్
వర్గల్(గజ్వేల్): వర్గల్ విద్యాధరి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ నాగరాజు అన్నారు. గురువారం సతీసమేతంగా వర్గల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ‘అమ్మ‘ను దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆయన వెంట గజ్వేల్ ఎస్టీఓ లింగం ఉన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణ చేర్యాల(సిద్దిపేట):కొల్లాపూర్ కోర్టు పరిధిలోని పెంట్లవెల్లిలో న్యాయవాది మల్లయ్య హత్యకు నిరసనగా గురువారం చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరమల్లయ్య మాట్లాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదిపై దాడిచేసి హత్యచేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇది న్యాయవాదుల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్సెక్రటరీ రమేశ్, ఉపాధ్యక్షుడు సురేందర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన అక్కన్నపేట(హుస్నాబాద్): అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలోని పలువురు రైతులు గురువారం స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కనీసం ఐదారు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. సమయంపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి, పగలు తేడా లేకుండా వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు. ఒక పక్క ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని, మరోపక్క కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇకనైనా 24గంటల పాటు కరెంట్ సరఫరా ఇవ్వాలని, లేనిపక్షంలో రైతులతో ఆందోళన బాటపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. విస్తృత తనిఖీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గురువారం సిద్దిపేట పట్టణంలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుతున్న ఆటోల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. -
పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు
సిద్దిపేటఎడ్యుకేషన్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్లో ిసిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన జ్యోతి ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్లో 5వ, సాయితేజ ఎంఏ పొలిటికల్ సైన్స్లో 16వ, ఎమ్మెస్సీ ఫిజిక్స్లో అనూష 28వ, ఎమ్మెస్సీ డేటా సైన్స్లో మధు 31వ, ఎమ్మెస్సీ బాటనీలో ఆర్ వర్ష 38వ, ఎంఏ చరిత్రలో అంజిరెడ్డి 39వ, మైక్రోబయాలజీలో ఎండీ సాధిక్ 39వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. మనోహర్కు 50వ ర్యాంక్ దుబ్బాక: పీజీ ప్రవేశ పరీక్షలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మనోహర్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇంగ్లిష్ విభాగంలో స్టేట్ 50 ర్యాంక్ సాధించారు. వంద మార్కులకుగాను 60 మార్కులు వచ్చాయి. అనూష (28వ ర్యాంకు) అంజిరెడ్డి (39వ ర్యాంకు)జ్యోతి (5వ ర్యాంకు) సాయితేజ (16వ.. ) -
‘గౌరవెల్లి’ని త్వరలోనే పూర్తి చేస్తాం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కోహెడ మండలంలో విస్తృత పర్యటన ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కోహెడరూరల్(హుస్నాబాద్): హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోహెడ వ్యవసాయ మార్కెట్లో రూ.1.61 కోట్ల వ్యయంతో నిర్మించే పనులకు, ధర్మాసాగర్పల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణ కోసం రూ.250 కోట్లు విడుదల చేశామన్నారు. రైతులు భూసేకరణకు సహకారించాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయాయని, కుడి, ఎడమ కాలువ పనులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నాని అన్నారు. ఈప్రాజెక్టు పూర్తయితే ఈప్రాంత రైతాంగానికి సాగు నీటి పరంగా ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.అంతకుముందు తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా మార్కెట్ కమిటీ అధికారి దుర్గం ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతిరెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
డీఐఈఓ రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యలో అమలవుతున్న సిలబస్, మూల్యాంకన విధానంపై అధ్యాపకులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి సైన్స్ విద్యార్థులకు ఽథియరీ 60 మార్కులు, ప్రాక్టికల్స్ 15 మార్కులు, ఆర్ట్స్ విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందన్నారు. అధ్యాపకులు ప్రతి పాఠ్యాంశంపై ముందస్తుగా సిద్ధమై బోధించాలని చెప్పారు. మారిన సిలబస్పై నిర్వహిస్తున్న వర్క్షాప్న్ పూర్తి స్థాయిలో వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం ఫిజిక్స్, సివిక్స్, జువాలజీ, ఎకనామిక్స్ అధ్యాపకులకు డిస్టిక్ రోసోర్స్పర్సన్లు ఏఐ టూల్స్ను ఉపయోగించుకుని విద్యార్థులకు పీపీటీల ద్వారా సులభంగా బోధించే పద్దతులను గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవయ్య, మాస్టర్ ట్రైనల్ విజయలక్ష్మి, డీఆర్పీలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ మండిపడ్డారు. గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరి శంకర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా, ఫీజుల బకాయి–బీజేపీ లడాయి ఉద్యమాల నిర్వహణపై విస్తృతంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ముందుండి పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడాలన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల విడుదల ఆలస్యం కావడం వల్ల కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలేష్, విభీషన్ రెడ్డి, మల్లేశం, వెంకట్ రెడ్డి, భాస్కర్, ఉమా రెడ్డి, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్లో డ్రై రన్
తొగుట(దుబ్బాక): మల్లన్న సాగర్ రిజర్వాయర్లో అధికారులు బుధవారం డ్రై రన్ నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్లోకి మోటార్లను రన్ చేసి నీటిని వదులుతారు. ఇలా అన్ని మోటార్లను అధికారులు పరిశీలిస్తారు. అందులో భాగంగానే ఒకటవ నంబర్ మోటార్ ద్వారా పంపింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలించారు. వర్షాలు కురిసి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో మల్లన్న సాగర్లో గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రిజర్వాయర్లో 13.83టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దు చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దంటూ పలువురు బాధితులు కోరారు. పట్టణంలోని అంగడి బజారు నుంచి ఆకునూరు వెళ్లే రోడ్డును విస్తరిస్తుండటంతో కూల్చి వేతకు గురయ్యే ఇళ్ల యజమానులు బుధవారం రోడ్డుపై నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను కూల్చడం తగదన్నారు. వెంటనే విస్తరణ పనులు నిలిపివేసి, బైపాస్ రోడ్డును వినియోగంలోకి తేవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. పిల్లలందరికీ టీకాలు వేయించాలి జిల్లా వైద్యాధికారి ధనరాజ్ కొండపాక(గజ్వేల్): అర్హులైన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం వేయించేలా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధనరాజ్ వైద్యులకు సూచించారు. కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దుద్దెడ సబ్ సెంటర్ను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అలాగే వ్యాధి నిరోధన టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ధనరాజ్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలు విధులు సమర్థంగా నిర్వహించేలా వైద్యులు చూసుకోవాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమయ్యే మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వైద్యులు శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రసాయన ఉత్పత్తులపై వర్క్షాప్ సిద్దిపేటఎడ్యుకేషన్: గృహ వినియోగ రసాయన ఉత్పత్తుల తయారీ నైపుణ్యాల అభివృద్ధిపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. రిసోర్స్ పర్సన్ జయంతి గృహ రసాయన ఉత్పత్తుల తయారీ విధానాలు, నాణ్యాతా ప్రమాణాలు, భద్రతాజాగ్రత్తలు, స్వయం ఉపాధి అవకాశాలపై కల్పించారు. వర్క్షాప్ కన్వీనర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుందని చెప్పారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ సేవాభారతి ట్రస్ట్, కెమిస్ట్రీ విభాగాల మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.


