breaking news
Siddipet District News
-
చర్యలు తీసుకోవాలని వినతి
హుస్నాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిప్యుటీ ఇంజనీర్ శ్రీనివాస్కు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. అలాగే కుంటలోని కొంత భూమిని ఆక్రమించారని, అధికారులు హద్దులు నిర్ణయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రహదారుల పేరిట గుట్టలను తవ్వి మట్టిని తరలించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి కుంటను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, విజయభాస్కర్, తిరుపతి నాయక్, రమేశ్ పాల్గొన్నారు. ‘జబర్దస్త్’ నటి ఫైమా సందడి దుబ్బాకటౌన్: జబర్దస్త్ హాస్యనటి ఫైమా దుబ్బాక మైనారిటీ గురుకులంలో మంగళవారం సందడి చేశారు. ఈ గురుకులం ప్రత్యేకత తెలుసుకొని తన అక్క కొడుకుని చేర్పించారు. అనంతరం విద్యార్థులకు జోకులు చెప్పి నవ్వించారు. ఈ మైనారిటీ గురుకులాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సన్మానించారు. విద్యార్థులకు షూస్ అందజేత గజ్వేల్రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండలంలోని అహ్మదీపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం సుగుణాకర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గజ్వేల్కు చెందిన ఎర్ర సత్యం మంగళవారం షూస్ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియో గం చేసుకుంటూ ఉన్నతులుగా ఎదగాలన్నా రు. కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆ పాపం బీఆర్ఎస్దే.. బెజ్జంకి(సిద్దిపేట): ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతినిచ్చి పాపం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షుడు శ్రీకాంత్తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధన లు పట్టించుకోకుండా వారి సర్పంచ్లు తీర్మానాలు చేయడం వల్లే మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫ్యాక్ట రీ అనుమతులపై ఎమ్మెల్యేను కానీ, పార్టీని కానీ విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం చిన్నకోడూరు(సిద్దిపేట): పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పద్మశాలి కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, ఆర్టీఏ మెంబర్ డా.సూర్యవర్మ, ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ శంకర్, నాయకులు సాకి ఆనంద్, చంద్రశేఖర్, పరశురాములు, రాజేశ్ పాల్గొన్నారు. -
రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏబీవీపీ నాయకుల డిమాండ్సిద్దిపేటఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) మంగళవారం కళాశాలల బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సావుల ఆదిత్య, జిల్లెల ఫణీందర్ తదితరులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి వివరించి బయటకు పంపించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారన్నారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు తరుణ్, లోకేశ్, శ్రావణ్, శ్రీకాంత్, అశ్వల్, పవన్, సాత్విక్, చరణ్, ఆదిత్య, శ్రీషన్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తి వేసేందుకు కుట్ర బెజ్జంకి(సిద్దిపేట): విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సాయిరాం ఆరోపించారు. బెజ్జంకిలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. బకాయిల కారణంగా కళాశాలల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్, రవి, వీరేశం, సాయిలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కు హుస్నాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వ భిక్ష కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణను చేపడతామన్నారు. నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు రాజేశ్, చరణ్, అంజి, రంజిత్ తదితరులు ఉన్నారు. బంద్ విజయవంతం నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నంగునూరులో జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ బంద్ నిర్వహించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
డీఎస్ఓ తనూజదుబ్బాక: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్ఓ) తనూజ అన్నారు. మంగళవారం కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం హబ్షీపూర్లో పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలతోపాటు పలు కాలనీల్లో సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలంలోని 21 గ్రామాలలో పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీడీవో సోమిరెడ్డి, ఎంపీఓ మురళి, కార్యదర్శి వజ్ర తదితరులు ఉన్నారు. -
సుల్తానా ఉమర్కు జాతీయ సేవారత్న అవార్డు
దుబ్బాకటౌన్: సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. జనసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేబీరాజు, జనసాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పాముల రమణ ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో పేదలు, మహిళలు, అనాథలు, సంచార జాతుల సంక్షేమం కోసం సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నారు. అనంత రం సుల్తానా ఉమర్ తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన జనసాహిత్య అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మత్తు పదార్థాలపై అవగాహన అవసరం
రాజన్న జోన్–3 డీఐజీ సున్ప్రీత్సింగ్సిద్దిపేటకమాన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగంపై యువత, ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాజన్న జోన్ 3 డీఐజీ సున్ప్రీత్సింగ్ ఆదేశించారు. పోలీసు కమిషనరేట్ను మంగళవారం ఆయన సందర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, కమిషనర్ కార్యాలయ ఆవరణలో సీపీతో కలిసి మొక్కను నాటారు. శాంతిభద్రతలు, నేరాలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. షీ టీమ్స్ పనితీరుపై మహిళలు, విద్యార్థినులకు మరింత అవగాహన కల్పించాలని, ఎస్హెచ్ఓలు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జల సంరక్షణ అందరి బాధ్యత
మున్సిపల్ చైర్ పర్సన్ అరుణచేర్యాల(సిద్దిపేట): నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు. జాతీయ జల మిషన్లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో కలిసి జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటిని సేకరించడం, ప్రతి నీటి చుక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత రాకుండా చూడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల శక్తి అభియాన్ – క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భూ గర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలి హుస్నాబాద్రూరల్: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీఓ సతీశ్ అన్నారు. బంజేరుపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లో ఆయన పర్యటించి బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. బంజేరుపల్లి బోరుబావి వద్ద ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. రైతులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించి ఉపాధి హామీ పథకంలో పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ మనీల, సర్పంచ్లు చంద్రకళ, లత తదితరులు ఉన్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్దుబ్బాకటౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తసేకరణ వాహనాలకు అందించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎ.మహేశ్కుమార్ సూచించారు. 16వ వార్డులోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవుని రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సిబ్బందితో చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా చేపట్టే సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాలి చేర్యాల(సిద్దిపేట): వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమ పిలుపునిచ్చారు. డ్రై డే కార్యక్రమంలలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిలిచిన నీటిని తొలగించడం, పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా, వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలకరి చినుకు.. జీవాలు బెరుకు
● చిటుకు వ్యాధితో మొదటికే మోసం ● అప్రమత్తతతోనే రక్షణ సాధ్యం ● పశు సంవర్థకశాఖ డాక్టర్ నిహారిక దుబ్బాకటౌన్: వర్షాకాలంలో తొలకరి చినుకులు మూగజీవాల పాలిటి శాపాలు. వాటి వల్ల జీవాల పెంపకందారులు తరచూ నష్టాలకు గురవుతారు. తొలకరి చినుకులకు మొలిసిన గడ్డిని గొర్రెలు, మేకలు తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. దీనిని పలురకాల పేర్లతో పిలుస్తుంటారు. నెత్తిపిడుగు, గడ్డిరోగం, పాటురోగం అనే పేర్లు కూడా ఉన్నాయి. బలిష్టంగా ఉన్న గొర్రెలకే.. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని తిమ్మాపూర్ పశు సంవర్థకశాఖ వైద్యురాలు డాక్టర్ నిహారిక సూచించారు. బలిష్టంగా పెరిగిన గొర్రెలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఆమె తెలిపిన కొన్ని సూచనలు, సలహాలు. అకస్మాత్తుగా మరణిస్తాయి ఈ వ్యాధి సోకిన గొర్రెలు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. చనిపోయే ముందు చాలా నీరసంగా ఉంటాయి. ఎగిరి కిందపడి కాళ్లు కింద కొట్టుకుంటూ, పళ్లు కొరకుతూ.. బిగుసుకుని కొన్ని క్షణాల్లో చనిపోతాయి. ఈ వ్యాధి సోకిన మరికొన్ని గొర్రెలు చొంగ కారుస్తుంటాయి. శ్వాస అధికంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి మందకు చికిత్స చేయించాలి. నివారణే ముఖ్యం చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం. ఏటా ఏప్రిల్, మే నెల మధ్యలో మందలో ఉన్న జీవాలన్నింటికీ వ్యాధి నిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పకుండా వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశువైద్యాధికారికి తెలియజేసి చికిత్స, జాగ్రత్తలు పాటించాలి. తొలకరి వర్షాలకు మొలిసి వాడిపోయిన గడ్డిని మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో జీవాలను మేపకూడదు. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరుచేయాలి. జాగ్రత్తలు పాటిస్తే చిటుకు వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చు. నిహారిక, పశు సంవర్థకశాఖ డాక్టర్, తిమ్మాపూర్ ఇలా సోకుతుంది మేత కోసం వలస వెళ్లే గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల ప్రేవుల్లో అభివృద్ధి చెందుతాయి. అవి వదిలిన విషపదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. తొలకరి చినుకులకు పెరిగిన లేతగడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. దీనివల్ల వాటి ప్రేవుల్లో గాలిలేని వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడినప్పటి నుంచి జూలై నెలాఖరు మధ్య ఎక్కువగా సంభవిస్తుంది. -
డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం
ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ హైస్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కల్లెపల్లి శ్రీనివాస్కు హెచ్ఎంగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీనివాస్కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన భైరయ్య 30న పదవీవిరమణ పొందారు. అనంతరం సీనియారిటీ ప్రకారం హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ సీనియారిటీ ఉన్న వ్యక్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా జాప్యం జరిగింది. దాడులను అరికట్టాలని కోరుతూ సీఎంకు వినతి మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందించినట్టు డీబీఎఫ్(దళితబహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అత్యాచా రాల నిరోధక చట్టాలపై హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. అత్యాచారాలు, దాడులపై చర్చించి వాటిని అరికట్టా లని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంకు వినతిపత్రం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్పన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై అవగాహన హుస్నాబాద్రూరల్: ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు జ్యోతిరావ్ఫూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీణాచందన చెప్పారు. పోతారం(ఎస్)లో గురుకుల పాఠశాల విద్యార్థి కౌన్సిల్, హెడ్ గర్ల్ ఎంపికకు మంగళవారం ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ స్వేచ్ఛ, పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవు వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఒడ్డెర, యాదవ కులస్తుల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో మంగళవారం ఆయన వర్గల్ శివారులోని సర్వే నంబర్ 1045 ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట గిర్ధావర్ ప్రవీణ్, భగత్ తదితరులున్నారు. ఓపీ సేవల సమయం పెంచండి సిద్దిపేటకమాన్: ప్రభుత్వాసుపత్రిలో ఓపీ సేవల సమయాన్ని పెంచి, సకాలంలో వైద్య సేవలందించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ప్రభు త్వ ఆస్పత్రి సందర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. -
కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిగజ్వేల్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఎంఎస్ పనిచేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా.. వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా సాయికిశోర్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్ తదితరులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మరాఠి కృష్ణమూర్తి, తిరుపతిగౌడ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
● ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు ● కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ధర్నాప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని కేసీఆర్నగర్ డబుల్బెడ్రూం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కోట్ల రూపాయలతో భవనాలు నిర్మిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. కలెక్టర్ హైమావతి తక్షణమే స్పందించి కేసీఆర్నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించాలని, శాశ్వత పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతే ధ్యేయం
మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిహుస్నాబాద్: పారిశుద్ధ్య, వ్యర్థాల సేకరణ కార్మికుల ఆరోగ్య భద్రతే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యర్థాల సేకరణ కార్మికులకు మంగళవారం ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నమస్తే పథకం ద్వారా వ్యర్థాల సేకరణ కార్మికుల సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం, వృత్తి పరమైన రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దపేటలో.. సిద్దిపేటజోన్: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచనల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ అన్వేష్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీటీ కిట్లు పంపిణీ చేశారు. వారు మాట్లా డుతూ విధుల నిర్వహణలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలన్నారు. చెత్త సేకరణ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ఘనంగా శీత్లాభవానీ పండుగ
అక్కన్నపేట(హుస్నాబాద్): గిరిజనులు ప్రతియేటా నిర్వహించుకునే శీత్లాభవాని పండుగను మండలంలోని కెప్టన్చౌడుతండా గ్రామంలో మంగళవారం సర్పంచ్ గుగులోతు స్వరూపరాజు నేతృత్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజలు పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన మహిళలు, యువతులు శీత్లా భవానీకి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళ లు తమ సంప్రదాయ దుస్తులు ధరించి డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేసుకుంటూ తరలివెళ్లా రు. గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పతకాలు భేష్
సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: పోలీసు సిబ్బంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్లో ఇటీవల జరిగిన తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని సీపీ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో కమిషనరేట్ నుంచి పాల్గొన్న ఆర్ఎస్ఐ పి.రోహిత్ పవర్లిఫ్టింగ్ 83 కేజీల విభాగంలో బంగారు పతకం, అలాగే ఎస్ఐ అంజయ్య కరాటే 84 కేజీల విభాగంలో బంగారు పతకం, కానిస్టేబుల్ ఎన్.అనిల్కుమార్ కరాటే 75 కేజీల విభాగంలో కాంస్య పతకంసాధించారన్నారు. ఏఆర్ పీసీ భరత్ త్వైకాండో 74కేజీల విభాగంలో కాంస్య పతకం, ఏఆర్ మహిళా కానిస్టేబుల్ డి.శ్రావణి యోగాలో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని గెలు చుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రాజెక్టు సిద్ధి కార్యక్రమంలో యోగా నేర్చుకుని మొదటి ప్రయత్నంలోనే పతకం సాధించడం అభినందనీయమన్నారు. -
భూనిర్వాసితులకు పరిహారం చెల్లించండి
గజ్వేల్: రాయపోల్ మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోగల టెంకంపేట కొండపోచమ్మసాగర్ కాల్వ భూనిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందెబోయిన ఎల్లయ్య కోరారు. అదేవిధంగా ఆహ్మద్నగర్ నుంచి ముత్యంపేట వరకు కాల్వ నిర్మాణం చేపట్టాలన్నారు. సోమవారం గజ్వేల్లోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ సమస్యపై రైతులతో కలిసి అధికారులకు ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెంకంపేటకు చెందిన 19మంది రైతులకు చెందిన 15ఎకరాల భూమిలో కొండపోచమ్మసాగర్ కాల్వను మూడేళ్ల క్రితం నిర్మించారని, అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆహ్మద్నగర్– ముత్యంపేట వరకు కాల్వను నిర్మించాలని రైతులు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు. -
నులిపురుగులను నివారిద్దాం
కొండపాక(గజ్వేల్): నట్టల నివారణ కోసం 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని పురస్కరించుకొని కొండపాక మండలంలోని దుద్దెడలో గల హైస్కూల్ల్లో విద్యార్థులకు మాత్ర లు వేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎదిగే వయస్సులో పిల్లలు వ్యాధులకు గురైతే సరైన ఎదుగదల ఉండకపోవడంతో వివిధ రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య విషయంలో పిల్లలు తగు జాగ్రత్తలు తీసు కునేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. కడుపు లో నులిపురుగులు ఉంటే.. ఆకలి మందగించడంతో పాటు ఎప్పుడూ నీరసంగా కనిపించే లక్షణా లుంటాయన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధన్రాజ్, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం లక్ష్మి, సర్పంచ్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.94 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ.94లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 47రోజులలో భక్తుల కానుకల రూపంలో రూ.94,93,627 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. సోమవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.94,93,627, మిశ్రమ బంగారం 56 గ్రాముల 600మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 500గ్రాములు, విదేశీ కరెన్సీనోట్లు 32 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. పరిహారం ఇవ్వకుండానే రోడ్డు పనులా? అడ్డుకున్న గ్రామస్తులు కోహెడరూరల్(హుస్నాబాద్): మండల పరిధి నాగసముద్రాల గ్రామ శివారులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారి (765 డీజీ) మెదక్–ఎల్కతుర్తి విస్తరణ రోడ్డు పనులను సోమవారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఎలా ప్రారంభిస్తారని వారు ప్రశ్నించారు. మా భూములు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ బాధితుల గోడును పట్టించుకోని అధికారులు తీరుపై మండిపడ్డారు. పరిహారం అందే వరకు ఇంచు భూమి కూడా వదలమని బాధితులు తెగేసి చెప్పారు. ‘చేనేత’ సలహా మండలి చైర్మన్గా శ్రీనివాస్హుస్నాబాద్: చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్గా చింతకింది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పద్మ శాలి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో అభినంద సభ ఏర్పాటు చేశారు. చేనేత వృత్తిదారుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతకారుల సమస్యల పరిష్కారంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చేనేత, పద్మశాలి సంఘ నాయకులు భగవాన్, వెంకటరమణ, లక్ష్మీపతి, లక్ష్మయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి నేటి నుంచి 28 వరకు టీకాలు జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి గోపాలకృష్ణమూర్తి ప్రశాంత్నగర్(సిద్దిపేట): గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి (పారుడు రోగం) వ్యాపిస్తోందని, పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. పీపీఆర్ వ్యాధి వైరస్ వలన వ్యాపిస్తోందన్నారు. గొర్రెలు, మేకలలో తీవ్ర జ్వరం, నోటిలో పొక్కులు రావడం, పల్చటి విరేచనాలు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, ముక్కు, కళ్ల నుంచి స్రవాలు కారడం, డీ హైడ్రేషన్కు గురి అవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వలన 4 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు మరణిస్తాయన్నారు. ఈ వ్యాధి నివారణకు గాను పీపీఆర్ టీకాలు వేయాలన్నారు. వ్యాధిని గమనించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి, చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధి నివారణకు మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. -
‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’
సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’ అంటూ రక్తదానం చేశారు. సేకరించిన రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి పంపిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం నాయకులు మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు. – సిద్దిపేటజోన్ -
సర్పై అలసత్వం వద్దు
● యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ● ఒక్క ఓటూ తప్పిపోవద్దు ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: సమగ్ర ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపుని చ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిద్దిపేట పట్టణ పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్ను లు, ప్రస్తుత పరిస్థితులు గూర్చి సమీక్ష నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అధికారులు, సిబ్బందిని కలెక్టర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ శాతం నమోదైన సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఒక్క ఓటు తప్పిపోవద్దని, అదేవిధంగా రెండు చోట్ల ఒకరికి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులను నిర్వహించకపోతే ,అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరి ఇంటింటికి వెళ్లి పూరించిన ఎన్యుమరేషన్ పత్రాలను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఆర్డీఓ సదానందం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహశీల్దార్ హరి కిరణ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు.. అందని చివరి బిల్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల శోభ. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతోంది. ఇల్లుతో సొంతింటి కల నెరవేరింది కానీ.. అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బిల్లులు సరిపోవడం లేదని, దీంతో అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఫైనల్ బిల్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. అప్పులు తెచ్చిన వాటికి వడ్డీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఫైనల్ బిల్లు త్వరగా ఇప్పించాలని శోభ కోరుతున్నారు. గృహ ప్రవేశమైనా పైసలు అందలే.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.4లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటీవల గృహ ప్రవేశం సైతం పూర్తయింది. అయినప్పటికీ ఫైనల్ బిల్లు రాలే. ప్రభుత్వం అందించిన డబ్బులే సరిపోవడంలేదు.. మరో వైపు బిల్లు ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం. –గీకురు సుమలత, హుస్నాబాద్సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చివరి బిల్లు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పలువురు పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,244 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. ఇందులో 2,567 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిలో 491 వాటికే పూర్తి బిల్లులు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 10,244 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా అందులో బేస్మెంట్ స్థాయిలో 1,489, గోడల నిర్మాణం 821, స్లాబ్ వేసినవి 3,998, నిర్మాణం పూర్తి అయినవి 2,567 ఉన్నాయి. వీటిలో చివరి బిల్లు కేవలం 491 ఇళ్లకు మాత్రమే చెల్లించగా మిగతా 2,076 ఇళ్లకు ఇంకా రూ.33.21కోట్లను లబ్ధిదారులకు చెల్లించాలి. గృహ ప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా.. చివరి బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొందరి ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడంతో అప్పులు చేసి పనులు చేపడుతుండటం గమనార్హం. దీనికి తోడు ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసిన బిల్లులు సైతం ఆలస్యమవుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం మొత్తంగా దాదాపు రూ.12లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం అందించే సాయంలో నిర్మాణం చేసే మేసీ్త్రకే రూ.3.5లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే డబ్బుల్లో మిగిలేది రూ.1.5లక్షలు మాత్రమే. మెటీరియల్, ఇతర ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ వారికి ఇలా దాదాపు మొత్తంగా అదనంగా రూ.7లక్షలు లబ్ధిదారుల మీద డబ్బులు పడుతున్నాయి. వడ్డీల భారం ఓ వైపు బిల్లులు రాకపోవడం.. ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి బిల్డర్లు డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేక లబ్ధిదారుల తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు. మరికొందరు గ్రామాల్లో రూ.2 వడ్డీకి అప్పులు తెస్తూ.. ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన వారికి బిల్లు చెల్లింపుల్లో జాప్యం కారణంగానే అనేక చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఫైనల్ బిల్లు ఆలస్యమవుతోంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఫైనల్ బిల్లు ఆలస్యమయ్యేది వాస్తవమే. త్వరలో ఫైనల్ బిల్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చే యించిన వారికి మిగతా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. – భగవాన్ రావు, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
మరో ముందడుగు
స్వచ్ఛ దిశగా● మున్సిపాలిటీకో వార్డు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక ● పూర్తిస్థాయిలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలు ● విజయవంతం కాగానే అన్ని వార్డుల్లో అమలు ● త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో శ్రీకారంకొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు మున్సిపాలిటీల్లో కొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్ఐఆర్ కార్యక్రమం పూర్తవగానే ఓ వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జీరోవేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నాం. పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా అందుబాటులో వారితో కార్యక్రమాలు జరిగేలా ప్రయత్నిస్తాం. – గణేశ్రెడ్డి, కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ గజ్వేల్: మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ తీరు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ శాసీ్త్రయంగా జరగకపోవడం వల్ల ఈ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త పంథాలో చెత్త సేకరణ చేపట్టడమే కాకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల 9న గజ్వేల్లోని డంపు యార్డు వద్ద జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతోపాటు అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట కమీషనర్లు, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త తరహా పద్ధతులపై దిశానిర్వేశం చేశారు. సిబ్బంది కొరతే శాపమా? పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కొరత ఆయా మున్సిపాలిటీలకు శాపంగా మారాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. ఇక్కడ ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 60మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పది వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టింట్, ఏఈల పోస్టులు కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలకు సవాలుగా మారిన వ్యర్థాల నిర్వహణ కొంత పుంతలు తొక్కనుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి కొత్త తరహాలో స్వచ్ఛత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయనున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మిగతా వార్డుల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం త్వరలో అమలు కానుంది. వ్యర్థాల నిర్వహణలో కొత్త పంథాఈ సదస్సులో మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. వార్డులో పూర్తిస్థాయిలో జీరోవేస్ట్ మేనేజ్మెంట్, అక్కడ ఉత్పత్తయిన తడి, పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరు చేసి కంపోస్ట్ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని అనుకున్నారు. ఇలా చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా స్వచ్ఛతకు బాటలు పడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల చెత్తను ప్రత్యేకంగా వేరు చేసి.. కులియబెట్టడం ద్వారా కంపోస్ట్ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డంపు యార్డుల్లో అగ్గి రాజుకోకుండా తీసుకోవాల్సిన శాసీ్త్రయ చర్యలపైనా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ కార్యక్రమాలు కొంత పరిచయమున్నా.. మిగతా మున్సిపాలిటీల్లో సాగడం లేదు. ఇక అన్నీ మున్సిపాలిటీల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు. -
కేవైసీ.. పరేషన్!
ప్రహసనంగా ఐడెంటిటీజిల్లా పౌర సరఫరాల శాఖలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. రేషన్ కార్డుదారుల కేవైసీ ప్రక్రియకు రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరంగా ఉండటంతో నిర్దేశించిన వందశాతంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేవైసీ చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయాల్సి వస్తుందని సంబంధించిన శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ లబ్ధిదారుల్లో స్పందన కనబడకపోవడంతో రేషన్ డీలర్లు, శాఖ అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – సిద్దిపేటజోన్ జిల్లాలోని 688 రేషన్ షాప్ల ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 3,36,976 రేషన్ కార్డులు ఉండగా వీటి ద్వారా 1,04,9021 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ క్రమంలో రేషన్ పక్కదారి పట్టకుండా అర్హులైన వారిని గుర్తింపు నేపథ్యంలో కేవైసీ అంశం తెర మీదకి వచ్చింది. రేషన్ షాప్ వారీగా లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ చేపట్టి వారి ఐడెంటిటీ నిర్దారణ మొదలుపెట్టారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటివరకు 3,23,100 రేషన్ కార్డులకు సంబంధించి 8,48,106మంది లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ సేకరణ జరిగింది. ఇంకా 13,876కార్డులకు చెందిన 2,00,915మంది బయోమెట్రిక్, ఐరిష్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం కొన్ని నెలలుగా రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నా వారిలో స్పందన నామమాత్రంగా ఉందని చెప్పాలి. వందశాతంపై ప్రభావం.. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరి కేవైసీ వందశాతం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలక్ష కారణాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కార్డుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ సమస్యగా మారుతోంది. అదేవిధంగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో లబ్ధిదారులు చనిపోయారు. అయినప్పటికీ వారి పేర్లను కార్డుల నుంచి తొలగింపు ప్రక్రియ లేకపోవడం, అలాగే వన్ నేషన్.. వన్ రేషన్ నినాదంతో లబ్ధిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు అంతే ఆసక్తిగా గుర్తింపు ప్రక్రియకు రావడం లేదు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం కేవైసీ నిర్దేశించిన లక్ష్యం పై ప్రభావం పడుతోంది. ఐడెంటిటీ ప్రక్రియకు రాకుండా రికార్డులలో పెండింగ్ అంశంగా ఉన్న లబ్ధిదారుల ఆచూకీ కోసం రేషన్ డీలర్లు నెలల కొద్దీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంకా రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరం నెలలు గడిచినా స్పందన కరువు కష్టతరంగా వందశాతం ప్రక్రియ వెతుకులాటలో రేషన్ డీలర్లు 20శాతం మిగిలింది.. జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ నిరంతరం.. ఇప్పటివరకు 80శాతం పూర్తి అయింది. ఇంకా 20శాతం మిగిలి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ చేయించుకోవాలి. –తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
రైతులపై నోటీసుల పిడుగు
యూరియా కష్టాలు వీడేనా మీసేవలో యూరియా బుకింగ్ ఉపయోగకరంగా ఉండదని రైతులు వాపోతున్నారు. వివరాలు 8లో uపారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. వివరాలు 9లో uసోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026పంట రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రోజూ ఇంటికి వస్తుండ్రు. నోటీసులు కూడా ఇచ్చారు. గత యాసంగిలో కడదామంటే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈసారైనా పంటలు పండుతాయనుకుంటే.. వానలు కురుస్తలేవు. ఈ కరువు కాలంలో రుణం ఎలా కట్టేది?.. ఎలా బతికేది? – ఎల్లవ్వ, మహిళ, రైతు దుబ్బాకరూరల్: పంట రుణాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడం.. మరోవైపు కరువు కమ్ముకొస్తున్న ఈ తరుణంలో రుణాలు ఎలా చెల్లించేది అంటూ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రైతుల రుణాలను మాఫీ చేసింది. అందరికీ మాఫీ చేస్తారని గంపెడాశతో ఎదురు చూసినా చివరకు కొందరికి నిరాశే మిగిలింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం రైతు ఇంటికి వచ్చి రుణం చెల్లించాల్సిందేనని నోటీసులు ఇచ్చి వెళ్తున్నారు. రుణం మాఫీ చేస్తారనుకుంటే బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి ఫొటోలు, నోటీసులు ఇవ్వడంతో రైతులు కంగుతింటున్నారు. యాసంగిలో దెబ్బతిన్న పంటలు యాసంగిలో వేసిన పంటలు అకాల వర్షాలు.. వడగళ్లవానలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు నేల మట్టమయ్యాయి. మరి కొన్ని చోట్ల మొక్కజొన్న పంటలు, వరి పంటలు అగ్నికి దగ్ధమయ్యాయి. దీంతో పంట రాబడి రాకుండా పోయింది. సాగుకు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే.. చేతి కొచ్చిన పంట రైతు కళ్లెదుటే దెబ్బతినడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల హుకుం అయోమయంలో అన్నదాతలు మరోవైపు కమ్ముకొస్తున్న కరువు -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆత్యాపాత్యా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముకేష్, చైర్మన్ జంగిటి శ్రీనివాస్లు అన్నారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆత్యా పాత్యా క్రీడలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఆత్యా పాత్యా లక్ష్యమన్నారు. క్రీడల ద్వారా యువతలో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు మహేశ్, వెంకట్రెడ్డి, రాజు, కనకారెడ్డి, రజిత, రజినీ, రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు. గజ్వేల్రూరల్: కౌలు రైతులను గుర్తించే వరకు సంఘటితంగా ఉద్యమిస్తామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కౌలు రైతులను గుర్తిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కౌలు రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, యూరియా సరఫరాకు ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వేణు, మండల అధ్యక్షుడు చంద్రం, కౌలు రైతులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. ఆదివారం పట్టణంలో హెల్ప్ డెస్క్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందుబాటులో ఉండని సూపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరి విధులకు హాజరుకావాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సర్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ, ఆన్లైన్ ప్రక్రియ గూర్చి సమీక్షించారు. మాజీ మంత్రి హరీశ్రావు పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీమంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు మీ వైపు చూసేలా చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. -
నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు పంపిణీ చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల వారు 2,12,569మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 2,461 పంపిణీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నేడు మాత్రలు తీసుకోలేని పిల్లలకు ఈ నెల 20న నిర్వహించే మాప్ అప్ డే కార్యక్రమంలో భాగంగా మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సూచించారు. -
శాలివాహన సంఘాల అభివృద్ధికి కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): శాలివాహన సంఘాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో హుస్నాబాద్, చిన్నకోడూరు మండలాలకు చెందిన శాలివాహన కుల సంఘాల నాయకులు దరిపల్లి చంద్రాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాలివాహనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ శాలివాన సంఘం అధ్యక్షుడు బెక్కంటి భీమయ్య, ఇటికాల స్వామి, నాంపల్లి సమ్మయ్య, నమిలి కొండ ఐలయ్య, తిరుపతి, భూపతి, ప్రదీప్, పరశురాములు, శ్రీధర్, కుంటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గోదారిలో నీళ్లున్నా.. మోటార్లు ఆన్ చేయని సర్కార్
నంగునూరు(సిద్దిపేట): గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లున్నా కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయించడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. తిమ్మాయిపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో శనివారం హరీశ్రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంతటి కరువు వచ్చినా రైతాంగానికి సాగునీరు ఇచ్చేలా కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించారన్నారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి సిద్దిపేట నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రేవంత్రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా అధిక లాభాలు వస్తున్నందున రైతులు ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం పడితే ఆయిల్పామ్ రైతులకు 20 రోజులకో మారు ఏడాదిలో 15 సార్లు డబ్బులు పడుతున్నాయని చెప్పారు. ప్రతీ ఓటరును కలవండి సిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజంట్లు అత్యంత కీలకమని, ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతీ ఓటరును క్షేత్ర స్థాయిలో కలవాలని, ఎన్యూమరేషన్ పత్రాలు నింపేలా బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును బూత్ లెవల్ ఏజెంట్లు కలిసి ఓటుహక్కు విలువ గూర్చి వివరించి చైతన్యం చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేది రాజ్యాంగ సూత్రమని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసు మాజీ మంత్రి హరీశ్రావు -
సర్వర్ డౌన్
మొరాయిస్తున్న భూ భారతి సైట్ మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్లో సర్వర్ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనేది అంచనా వేసుకోవచ్చు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి భూభారతి పోర్టల్ సర్వర్ సమస్య కారణంగా రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులుగా రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు తమ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. దీంతో మిగతావారు రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఇదే సమస్య నెలకొంది. మెయింటెనెన్స్ పేరుతో... భూభారతి పోర్టల్ను యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట జూన్ 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు రెవెన్యూశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ 12 రోజులవుతున్నా..ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. సాఫ్ట్వేర్ను అప్గ్రేడేషన్ జరుగుతోందని, సర్వర్ సామర్థ్యం కూడా పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక..రానున్న రోజుల్లో పోర్టల్ మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సమస్య లేదు భూభారతిలో పోర్టల్లో ట్రాన్సక్షనల్ సర్వీస్ మాత్రమే సమస్య కొనసాగుతోంది. సాధారణ ప్రజలు సెర్చ్ చేసే సమాచార సేవలకు మాత్రం ఎ లాంటి సమస్య రావడం లేదు. మార్కెట్ వ్యాల్యూ, భూమి వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఈసీ వివరాలు (ధరణికి ముందు), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు వంటి సేవలుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. కేవలం భూలావాదేవీలకు సంబంధించిన లాగిన్లోనే సమస్య కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు -
సర్ను సమర్థంగా నిర్వహించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో నిర్వహిస్తున్న సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డిజిటలైజేషన్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం నేరమన్నారు. మరణించిన ఓటర్లు, నకిలీ ఓట్లు, రెండు ఓట్లు కలిగి ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. బీఎల్ఓ వారిగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభు త్వ భూమిని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల తహసీ ల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన -
వాన లేకపాయె.. స్ప్రింక్లర్లే దిక్కాయె
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు మాత్రం కురవడంలేదు. ఇటీవల కురిసిన కొద్ది పాటి జల్లులకు దుక్కులు దున్ని మొక్కజొన్న విత్తనాలు విత్తుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్నను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నీటి వసతి లేని రైతులు ఆకాశంలోని మేఘాలవైపు చూస్తున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
ఎక్స్పో అదుర్స్..
సిద్దిపేటజోన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ఢిల్లీ సౌజన్యంతో శనివారం జిల్లా కేంద్రంలోని మెరీడియన్ పాఠశాలలో నిర్వహించిన ఎక్స్పో అండ్ గైడెన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న 58 సీబీఎస్ఈ విద్యాసంస్థలు ఈ ఎక్స్పోలో పాల్గొని వందకు పైగా నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాలపై ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, సోలార్ వ్యవస్థ, పర్యావరణ, పారిశ్రామిక విధానం, పర్యాటక, గ్రామీణాభివృద్ధి, తదితర అంశాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, సాంకేతిక నమూనాలు ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమంలో సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్, తిరువనంతపురం ప్రాంతీయ డైరెక్టర్ విగ్నేష్, మెరీడియన్ విద్యాసంస్థల డైరెక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శంకర్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తప్పెట శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణలు శనివారం నియామక పత్రాన్ని ఢిల్లీలో అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వర్గల్(గజ్వేల్): ప్రభుత్వం 50% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. శనివారం వర్గల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, నర్సింహారెడ్డితో కలిసి పలుపాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు నెలలలోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులు తీరుస్తాం గజ్వేల్: చేనేత కార్మికుల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని గజ్వేల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం అన్నారు. శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రామచంద్రం డైరెక్టర్లు భాగ్యలక్ష్మి, అమృతమ్మ, ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కొత్త పంట
ఎల్నినో తంట..ఆయిల్పామ్ వైపు రైతుల మొగ్గు ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యం ఊపందుకున్న ప్లాంటేషన్ఇప్పటికే 710ఎకరాల్లో పూర్తి.. గతంతో పోలిస్తే రికార్డే.. జిల్లాలో 2021–22లో ప్రారంభమైన ఆయిల్పామ్ సాగు ప్రస్తుతం 15వేల ఎకరాలపైచిలుకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 7 టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయిల్ఫెడ్ సంస్థ నుంచి జిల్లా రైతులకు రూ.18కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని నర్మెటలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం, ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్కు అవకాశముంది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లే అవకాశం కలిగింది. వర్షపాతం తగ్గడంతో.. ఆయిల్పామ్ సాగుకు సంబంధించి ఈసారి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షపాతం తగ్గడం, గత సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా యాతన పడటం వల్ల ఈసారి రైతులు ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే.. గతంలో రూ.17,500 ఉన్న ఆయిల్పామ్ గెలల టన్ను ధర ఆరునెలలుగా అమాంతంగా రూ.23వేల పైచిలుకు పలుకుతుండటం.. ప్రస్తుతం రూ.23,837కు చేరుకోవడం కూడా కలిసి వస్తున్నది. జోరుగా ప్లాంటేషన్.. సహజంగా ఏటా ఆయిల్పామ్కు సంబంధించి అధికారులు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. అది అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈసారి 4వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రైతులు 500ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశారు. తాజాగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్లో మరో 210ఎకరాల్లో సాగు కొత్తగా చేరింది. దీంతో ఈ సీజన్లో 710ఎకరాల్లో ఇప్పటివరకు సాగులోకి వచ్చింది. నిజానికి ఏటా ప్రతి సీజన్లో ఈ సమయానికి 100ఎకరాల్లోపు ప్లాంటేషన్ అవడమే గగనం. కానీ ఈసారి ప్లాంటేషన్ రికార్డు స్థాయిలో ఊపందుకున్నది. అంతేకాకుండా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకురావడం వల్ల మరో 2,631ఎకరాల్లో ప్లాంటేషన్కు అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నారు. త్వరలోనే ప్లాంటేషన్ను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఆయిల్ఫామ్ రైతుల అవసరాల కోసం 1200ఎకరాల్లో డ్రిప్ ఇవ్వడానికి సైతం కార్యాచరణ సిద్ధం చేశారు. ఎల్నినో ఎఫెక్ట్.. జిల్లాలో రైతుల ఆలోచన విధానాన్ని మార్చింది. ఆయిల్పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా చేసింది. ఈ ఏడాది అధికారులు 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్లాంటేషన్ ఊపందుకుంది. 710 ఎకరాల్లో పూర్తికాగా, మరో 2,631 ఎకరాలకుపైగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే ఇది రికార్డు. ప్రస్తుతం జిల్లాలో సాగు 15వేల ఎకరాల పైచిలుకు చేరుకున్నది. – గజ్వేల్మారుతున్న ఆలోచన విధానం జిల్లాలో సాధారణంగా వానాకాలం సీజన్లో 5.50లక్షల ఎకరాల్లో, మరో 2.50లక్షల ఎకరాల్లో యాసంగిలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. మూస పద్ధతుల్లో సాగు కొనసాగటం వల్ల రైతులకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్పామ్ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. దీంతో రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది.రైతుల్లో మార్పు.. ఎల్నినో పరిస్థితులు, వరి సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి రైతులు ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. 4వేల ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటికే 710ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశాం. మరో 2,631ఎకరాల్లో సాగు చేపట్టబోతున్నాం. – సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
వ్రత నాచగిరి.. సేవలతో తరించి
యువతరం ప్రైవేటు ఉద్యోగాలు వదిలి.. సాగుకు జైకొట్టి.. సిరులు రాబడుతున్నారు. సరికొత్త పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వినూత్న ఎవుసం చేస్తూ నాణ్యత గల ఉత్పత్తులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురి యువరైతుల వ్యవసాయంపై.. ఈ వారం ప్రత్యేక కథనాలు. భక్తులతో కిటకిటలాడినపుణ్యక్షేత్రంసుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలతో అలరారింది. సేవలు, కల్యాణాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారి కల్యాణం, సేవలు నిర్వహించి తరించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. –వర్గల్(గజ్వేల్) -
చెత్త నుంచి కంపోస్ట్ తయారీపై గజ్వేల్లో ప్రాంతీయ సదస్సు
మున్సిపల్ శాఖ సీడీఓ హేమలత స్వచ్ఛతకు బాటలు గజ్వేల్: ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛతకు బాటలు వేస్తాయని మున్సిపల్ శాఖ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత అన్నారు. గురువారం గజ్వేల్లోని డంపు యార్డు వద్ద ‘వేస్ట్ టూ కంపోస్ట్ విండ్రో’(వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ) అంశంపై మున్సిపాలిటీల ప్రాంతీయస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హేమలత మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి కంపోస్ట్ తయారీ అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, కమిషనర్ గణేశ్రెడ్డితోపాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, ముడిచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కమీషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్
సిద్దిపేటరూరల్: జిల్లాలో శుక్రవారం చేపట్టనున్న ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలోనీ వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓ లతో కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమాల పనితీరు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల్లో గుర్తించిన వ్యవసాయ క్షేత్రాలలో ఆయిల్పామ్ మొక్కలను నాటాలన్నారు. ఎల్నీనో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి లభ్యత ఉన్న రైతులే వరి పండించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఎకరానికి 2 బ్యాగులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా అక్రమంగా అమ్మినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సైతం వేగవంతం చేయాలని, ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్షం వహించవద్దన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో మందకొడిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సెలవులు తీసుకోకుండా వచ్చే మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఏఈఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ స్వరూప రాణి, డిహెచ్ఓ సువర్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. డ్రైవ్ను సక్సెస్ చేయాలి కలెక్టర్ హైమావతి -
సెపరేటు!
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026రూటు..రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. గతుకుల రోడ్లు గాలికి వదిలేసి.. మెరుగ్గా ఉన్న రోడ్లనే మళ్లీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారు. ఇది హ్యామ్ రోడ్ల ఎంపికలో మన ఇంజనీరింగ్ అధికారుల తీరు. ఓ పక్క ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇవేమి పట్టించుకోకుండా కమీషన్ల కోసమే ఇలా ప్రతిపాదించారన్న చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే హ్యామ్ రోడ్లను ప్రతిపాదించారని ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపించడం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట పల్లెల్లో రోడ్డు మార్గాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో భాగంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా రూ.711.36కోట్ల వ్యయంతో 146 రోడ్లు 659.09 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ(ఆర్అండ్బీ) 17 రోడ్లు 195.75కిలో మీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 129 రోడ్లు 463.34కిలో మీటర్లు నిర్మాణం చేయనున్నారు.. డీడీఆర్సీ సమావేశంలో.. ఇంజనీరింగ్ అధికారులు గతుకుల రోడ్లను కాకుండా మరో ఐదేళ్ల వరకు ఢోకా లేని రోడ్లను హ్యామ్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెల 3న ఇన్చార్జి మంత్రి వివేక్ నిర్వహించిన డీడీఆర్సీ సమావేశంలో రోడ్ల విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రస్తావించారు. హ్యామ్ రోడ్లను ఎవరిని అడిగి ప్రతిపాదించారని అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించకుండా అక్రమ మార్గానికి తరలించేందుకే మెరుగైన రోడ్లనే తిరిగి ప్రతిపాదించారని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేసినట్లు చూపించి కాంట్రాక్టర్ల లాభం కోసమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి హ్యామ్ రోడ్ల నిర్మాణం చేసే రోడ్లను పునఃపరిశీలించి, అవసరం ఉన్న చోట్ల తప్పక నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. మర్కుక్ మండలం ఎర్రవల్లి నుంచి గంగాపూర్ రోడ్డును 2020లో రూ.5.5కోట్ల వ్యయంతో డబుల్ రోడ్గా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మెరుగ్గా ఉన్నప్పటికీ తిరిగి హ్యామ్ రోడ్ కింద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంపిక చేశారు. 2.55 కిలో మీటర్ల రోడ్ను నిర్మించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి నుంచి మర్రిముచ్యాల రోడ్ నిర్మాణంను 2020లో చేశారు. ఇటీవల మంజూరైన హ్యామ్ రోడ్లలో ఇదే రోడ్ను 5.70 కిలోమీటర్ల రోడ్ను తిరిగి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డులో ఎలాంటి గుంతలు లేకున్నా తిరిగి నిర్మాణం చేయాలని నిర్ణయించడంతో పలువురు విమర్శిస్తున్నారు.టెండర్ దశలో ఉన్నవిఎంపిక చేయలేదు గతంలో మంజూరై టెండర్ దశలో ఉన్న రోడ్లను ఎంపిక చేయలేదు. నిర్మించి ఐదు సంవత్సరాలు దాటిన వాటిని హ్యమ్ రోడ్ల కింద ఎంపిక చేశాం. రెండో ఫేస్లో మరి కొన్ని హ్యామ్ రోడ్లు మంజూరు కానున్నాయి. – దీపక్, ఎస్ ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ ఫొటోలో కనిపిస్తున్నది గౌరారం నుంచి తూప్రాన్ వెళ్లే రహదారి. ఇది దాదాపు 16 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో వర్గల్ మండల కేంద్రం ఎల్లమ్మ దేవాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల గ్రామ ప్రజలు, సర్పంచ్ ఒక రోజు దీక్షను చేపట్టి నిరసన తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే..
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్, పాపయ్య, వెంకట్రెడ్డి, కనకరాజు, దుర్గారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా రైతులకే ప్రాధాన్యత.. జిల్లా రైతులకు సరిపడా ఆయిల్ పామ్ మొక్కలు అందాక ఇతర జిల్లాల రైతులకు మొక్కలు అందజేయాలని మాజీ మంత్రి హరీశ్రావు జిల్లా ఆయిల్ఫెడ్ అధికారి బాస్కర్ రెడ్డికి సూచించారు. రంగనాయక సాగర్ కట్ట వద్ద ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్రెడ్డితో ఫాన్లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. ముందు జిల్లాలో రైతులకు మొక్కలు అందించాలన్నారు. నర్సరీ నిర్వహణ సరిగా లేదని, మొక్కల్లో ఇసుక ఉందని, నీళ్లు కూడా సరిగా పట్టడం లేదని చెప్పారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు. సర్లో భాగస్వామ్యం కావాలిసిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తప్పనిసరి ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా బూత్ లెవల్ ఆఫీసర్ నుంచి ఎన్యుమరేషన్ పత్రం తీసుకుని దాన్ని పూరించి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ పత్రం నింపాలని సూచించారు. ఇప్పుడు నింపితేనే మీ ఓటుహక్కు జాబితాలో భద్రంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఇండ్లకు వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్లకు, బూత్ లెవల్ ఏజెంట్లకు సహకరించాలని సూచించారు. ఇందిరానగర్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం సీలింగ్ ఎత్తివేసి సరిపడాయూరియా అందజేయాలి మాజీ మంత్రి హరీశ్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఐప్యాడ్లను గురువారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాలు సాధించిన 31 మందికి ఐప్యాడ్లు అందించానని, 2026–27 విద్యాసంవత్సరంలో 50 మందికి ఐప్యాడ్లు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా, కేవలం స్టడీ మెటీరియల్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేలా ఈ ఐప్యాడ్లను రూపకల్పన చేశామన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ ఐప్యాడ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే 1234మంది విద్యార్థులతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందిరానగర్ పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటడానికి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు. -
దేశంలోనే చేనేతకు దుబ్బాక ప్రసిద్ధి
దుబ్బాక: దేశంలోనే చేనేత పరిశ్రమకు దుబ్బాక ప్రసిద్ధి చెందిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న దుబ్బాక చేనేత సహకార సంఘం పాలక మండలిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలన్నారు. గొల్లభామ చీరలతో పాటు చాలా రకాల వస్త్రాలు నేయడంలో అందెవేసిన కార్మికులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే పెద్ద చేనేత సొసైటీలో ఒకటైన దుబ్బాక పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం కొత్త పాలకవర్గం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, చేనేత సొసైటీ అధ్యక్షులు అంకం మధు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
హుస్నాబాద్లో నేడు మంత్రుల పర్యటన
కేసీఆర్ను కలిసిన డీసీసీబీ డైరెక్టర్ ములుగు(గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్ను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్కు పూల మొక్కను అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన ములుగులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి మొక్కలు నాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మిట్టపల్లి విద్యార్థిని సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర స్థాయి అత్యా పాత్యా పోటీలకు అర్బన్ మండలం మిట్టపల్లి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.ప్రణీత ఎంపికయ్యారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో ప్రణీత ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11, 12 తేదీలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు. ఉన్ని సహకార ఎన్నికలు ఏకగ్రీవంమిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ధర్మారంలో ఉన్ని సహకార ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కంతుల కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా గుట్టయ్య, కార్యదర్శిగా బీరయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, లక్ష్మి, మల్లవ్వ, స్వామి, శ్రీనివాస్, మల్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి రవి నియామక పత్రాలను సంఘం సభ్యులకు అందించారు. -
దుబ్బాక చేనేత పాలకవర్గం ఏకగ్రీవం
దుబ్బాక: చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గం ఎన్నికలో.. చైర్మన్గా అంకం మధు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయనను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్గా గాజుల భాస్కర్, జనరల్ సెక్రటరీగా బోడ చంద్రమోహన్, కోశాధికారిగా కారంపురి గురుచరణ్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్, పాలకవర్గంతో పాటు డైరెక్టర్లు సిరిగాధ నర్సింలు, మెత్కు కవిత, చెలిమెల రాజేశం, రాపెల్లి నాగరాజు, గడ్డం రాజమణి లతో ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పాలకవర్గం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. పలువురు అభినందనలు.. పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, నందాల శ్రీకాంత్, బడుగు రాజుతో పాటు రామక్కపేట సర్పంచ్ విఠోభ, పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య, నీలకంఠ సంఘం అధ్యక్షులు బోడ శ్రీహరి,నాయకులు, పలువురు సన్మానించి అభినందించారు.సిద్దిపేట చేనేత సహకార సంఘం సైతం.. సిద్దిపేటజోన్: సిద్దిపేట చేనేత సహకార సంఘం పాలకవర్గం సైతం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా రాధా కిషన్, ఉపాధ్యక్షుడిగా సుధాకర్, కోశాధికారిగా ప్రభాకర్తో పాటు డైరెక్టర్లుగా దత్తాత్రేయ, నగేష్, శ్రీనివాస్, భాగ్య, సరళ నియమితులయ్యారు. అమృతసేనా రెడ్డి ఎన్నికల అధికారి, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రాజెక్టు ఎన్నికల్లో 11మంది అభ్యర్థులకు ఏడుగురు ఉపసంహరణ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చేనేత జౌళి శాఖ ఏడీఓ రమ్య ధ్రువీకరించారు. సహకార సంఘం చైర్మన్గా అంకం మధు ప్రమాణస్వీకారం చేయించినఎన్నికల అధికారి -
నేడు పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. ఏఐలో నాలుగు సీట్లు, ఈఈఈలో రెండు సీట్లు, సివిల్లో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణణ సాధించిన విద్యార్థులు పాలిటెక్నిక్లో ప్రవేశం పొందుటకు అర్హులన్నారు. జూలై 8న ఒరిజనల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి జెండా ఊపి ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 విభాగాల్లో మహిళలు, పురుషులకు పరుగు, జంప్స్, వివిధ రకాల త్రోస్ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అత్యంత ప్రతిభ చూపిన వారు ఈనెల 12న పటాన్చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులకు చర్యలు వర్గల్ను సందర్శించిన ఆర్అండ్బీ ఎస్ఈ వర్గల్(గజ్వేల్): గతుకులమయమైన వర్గల్ రోడ్డును మంగళవారం ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సారంగపాణి పరిశీలించారు. సర్పంచ్ జయభారతి, డిప్యూటీ ఈఈ రేణుక, ఏఈఈ చంద్రశేఖర్తో కలిసి క్షేత్రస్థాయిలో రోడ్డుపై గోతులను, దెబ్బతిన్న రోడ్డును పరిశీలన చేశారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గోతులు దాటిన నిర్లక్ష్యం–రోడ్డెక్కిన నిరసనగళం’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెల్సిందే. ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, డిప్యూటీ ఈఈ, ఏఈలకు పలుసూచనలు చేశారు. రోడ్డు బాగుకోసం చర్యలు చేపడతామని, ఉన్నతాధికారులకు ఎస్టిమేట్లు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా రోడ్డు మీద గోతులను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్రెడ్డితొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్పల్లికి చెందిన కూచి మహిపాల్రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తాను పార్టీకి అందించిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ భూములు కాపాడాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ డంపింగ్ యార్డు వద్ద భూమిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల రికార్డులు పరిశీలించి, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎంత? ఆక్రమణకు గురైన పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణకు గురికావొద్దుకొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కలెక్టర్ హైమవతి తహసీల్దార్ దివ్యను ఆదేశించారు. సోమవారం కొమురవెల్లి పాత కమాన్, కేజీబీవీ పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం ఆమె మట్లాడుతూ ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా ఆక్రమించడం చట్టవిరుద్ధమన్నారు. హౌసింగ్ పీడీగా భగవంతరావు సిద్దిపేటజోన్: జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా భగవంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పీడీ శ్రీనివాస్ పదవీ విరమణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పీడీగా పనిచేస్తున్న భగవంతరావును ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ హైమావతి పలు ప్రాంతాల్లో పరిశీలన -
అవగాహన కల్పించాలి
సర్కు సంబంధించిన ఫారాలు బీఎల్ఓ ఇంటికి వచ్చి ఇచ్చారు. 2002 నాటి ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ లభించడం లేదు. దరఖాస్తు ఫారం నింపేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఫారాలు ఎలా నింపాలో చెప్పే వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి. – బోడ చందు, దుబ్బాక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం ఇంటింటికీ తిరిగి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. కలెక్టర్ ప్రతీ రోజు సర్ పై రివ్యూ చేస్తున్నారు. ఫారాలు నింపే సమయంలో సందేహాలు ఉంటే బీఎల్వోలు నివృత్తి చేస్తున్నారు. – చంద్రశేఖర్, సెక్షన్ సూపరింటెండెంట్, కలెక్టరేట్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
సిద్దిపేటకమాన్: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ ప్రజలకు సూచించారు. అంటువ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ చేపడుతున్న ముందస్తు చర్యలపై డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ముస్తాబాద్ చౌరస్తాలోని టీ స్టాళ్లు, పరిసర ప్రాంతాల్లో సిబ్బంది చేపడుతున్న ఫాగింగ్ను డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నివారణ చర్యలు, కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్, ఏఎన్ఏంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి డీఎంహెచ్ఓ ధనరాజ్ -
రూ.870 కోట్లు..
9.33 లక్షలమంది రైతులుఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద 9,33,950 మంది రైతులకు రూ.8,70,25,44,519లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతనెల జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎకరాకు 6వేల చొప్పున ఈ నిధులను విడుదల చేసింది. నిత్యం విడతల వారీగా ఈనెల 7వ తేదీ వరకు 7 ఎకరాల వరకు భరోసా నిధులను జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో 3,50,560 మంది రైతులకు రూ.348 కోట్లు, సిద్దిపేట జిల్లాలోని 3,19,601మంది రైతులకు రూ.317 కోట్లు, మెదక్ జిల్లాలో 2,63,789 మంది రైతులకు గాను రూ.204 కోట్ల కు పైగా విడుదలయ్యాయి. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేసింది. రైతులకు ప్రయోజనం రైతు భరోసా పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సీజన్ ప్రారంభంలోనే నిధుల విడుదల వల్ల రైతులు వడ్డీకి అప్పులు చేసే బాధ తప్పినట్లైంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకొన్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఆయా పంటలు విత్తుకునేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన నిధులు ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత, ఇతరత్రా ప్రయోజనాలకు రైతులకు ఉపయుక్తంగా మారనుంది. సీజన్ ప్రారంభం కాగానే ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఏడెకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం విడతల వారీగా విడుదల -
సవాలక్ష సందేహాలు
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విషయంలో ఓటర్లకు సవాలక్ష సందేహాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడం.. అందుకు అవసరమైన వివరాలు లభించక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలను పూరించేందుకు నిరక్షరాస్యులు ఇతరులపైనే ఆధారపడుతున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఫారాలు అందజేయడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 99.74శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. 14.27శాతం మందే ఫారాలను నింపి అధికారులకు ఇచ్చారు. ఎస్ఐఆర్పై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – సాక్షి, సిద్దిపేట కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసేందుకు 1,157 మంది బీఎల్ఓలను, సూపర్వైజర్లు 133 మంది, ఏఈఆర్ఓలు 33 మందిని నియమించారు. ఇంటింటికీ తిరిగి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. ఓటర్లు ఫారాలు నింపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా తప్పుగా నమోదు చేస్తే ఓటు హక్కు రద్దయితే తమనే బాధ్యులు చేస్తారని కొందరు నింపేందుకు ముందుకు రావడం లేదు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు. వివరాలపై సందేహాలు ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకాలంలో ఏ వివరాలు రాయాలన్న సందేహం చాలా మందిని వెంటాడుతోంది. దీనిపై స్పష్టత ఇచ్చే వారు లేరు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలే సర్లో కీలకంగా మారాయి. నాటి వివరాలు అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న వారి ఫారాలు నింపడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక 2002 నాటికి ఓటు హక్కులేని వారు, లేదా ఆ తర్వాత జన్మించిన వారి విషయాల్లోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 24 ఏళ్ల కిందటి వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు సేకరించడం సవాలుగా మారింది. నాటి పోలింగ్కేంద్రం నంబర్, ఓటరు సీరియల్ నంబర్, ఏపిక్ కార్డు నెంబర్లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. డిజిటలైజేషన్ 14.27శాతమే జిల్లా వ్యాప్తంగా 9,92,967 మంది ఓటర్లుండగా అందులో 9,90,396 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. 99 శాతం పంపిణీ పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి డిజిటలైజేషన్ 14.27శాతమే అయ్యింది. అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 10.24 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2002 ఓటర్ల వివరాలు అందజేస్తేనే సర్ వేగం పుంజుకునే అవకాశం ఉంది.సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో ఓటర్ల వివరాలు తెలుసుకుంటూ ఫారాలు నింపుతున్న బీఎల్ఓలునియోజకవర్గం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ నింపి ఇచ్చినవారుహుస్నాబాద్ 2,54,543 2,53,226 53,795సిద్దిపేట 2,44,507 2,44,135 25,049దుబ్బాక 2,04,664 2,04,487 25,980గజ్వేల్ 2,89,253 2,88,548 36,911మొత్తం 9,92,967 9,90,396 1,41,735బీఎల్ఓల తిప్పలు ఆరుబయటే ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ చిన్నకోడూరు(సిద్దిపేట): బీఎల్ఓలు ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపుతూ ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. కాగా మండల పరిధిలోని మల్లారంలో మంగళవారం బీఎల్ఓలు ఆరుబయట ఫారాలు నింపుతూ ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు ప్రక్రియ చేపట్టవద్దని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో ఆరుబయటే ఫారాలు నింపుతూ.. వర్షానికి తడుస్తూ ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సలీమ్ను అడుగగా గ్రామ పంచాయతీల్లో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. మల్లారం విషయం తన దృష్టికి రాలేదన్నారు. అలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 99.74శాతంఫారాల పంపిణీ 2002 ఓటర్ల వివరాలు లభించక అవస్థలు -
నాణ్యమైన విద్య అందించండి
సిద్దిపేటఎడ్యుకేషన్: కళాశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకు లంతా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్టియర్లో 500లకు పైగా విద్యార్థులను చేర్చుకుని జిల్లాలో నంబర్వన్గా నిలిచారని ప్రశంసించారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కోర్సులన్నీ మంచివేనని అన్నింటిలో విద్యార్థులు చేరేలా పోత్సహించాలని సూచించారు. అధ్యాపకులు సమయ పాలన పాటిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో అధికశాతం పేదలేనని వారందరికీ స్కాలర్షిప్లు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కళాశాలకు నాలుగు తరగతి గదులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రమీల మాట్లాడుతూ కళాశాలలో సుధీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులున్నారని వారిని సేవలను ఉపయోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధిస్తామన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పా టు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని పరిశీలించారు. డ్రై డేలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి పరిసరాల పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనకచంద్రం, డిసిప్లీన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలల్లో ఉత్తమ ఫలితాలుసాధించాలి డీఐఈఓ రవీందర్రెడ్డి -
ఆరుద్ర కనబడలె.. నేల మురవలె
మెదక్ అర్బన్: తొలకరి జల్లు కురియగానే పంట పొలాల్లో కనిపించే అరుదైన అందమైన జీవి ఆరుద్ర పురుగు. ఇవి విరివిగా కనిపిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలు దండిగా కురుస్తాయని రైతుల నమ్మకం. కానీ రాను రాను ఆరుద్ర పురుగులు అంతరిస్తున్నాయి. రైతు నేస్తాలుగా భావించే పర్యావరణ మిత్రలు కనుమరుగవుతున్నాయి. ఆరుద్ర కార్తె ముగిసినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు సైతం సాగు పనులు చేపట్టలేదు. పుడమి తల్లికి సింధూరం శాసీ్త్రయంగా ‘ట్రాంబిడియం గ్రాండిస్సిమం’గా పిలిచే ఈ పురుగులు చిన్న పరిణామంలో మక్మల్ బట్టలాగా, ముదురు ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకొని కాస్సేపు కదలకుండా బొమ్మలా నిలబడిపోతాయి. తమ జీవిత కాలంలో ఎక్కువగా భూమి లోపలే ఉంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి కోసం భూమి పైకి వస్తాయి. రైతు నేస్తం.. పర్యావరణ మిత్ర రైతు మిత్రగా పిలువబడే ఆరుద్ర పురుగులు భూమిలో ఉండే చిన్న చిన్న హానికరమైన కీటకాలు. లార్వాలను తిని పంటలకు రక్షణగా నిలుస్తాయి. ఈ మధ్య వీటిని ఔషధాల తయారీలో కూడా వాడుతున్నారు. ఆయుర్వేద వైద్య గుణాలున్నాయని అంటారు. కిలోకు రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో పర్యావరణానికి ఉపయోగపడే ఆరుద్ర పురుగుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. ఇవి శివునికి ప్రీతి పాత్రమైన జీవులని వేద పండితులు చెబుతారు. చిన్పపిల్లలు వీటిని పట్టుకొని, అగ్గిపెట్టెలో వేసుకొని ఆడుకుంటారు. -
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026
రోగులకు పరీక్షే!సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడంలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు నర్సింగ్ హోంలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం సెల్లార్లు.. పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సి ఉండగా పలు ఆస్పత్రులు సొంత అవసరాలకు వినియోగిస్తున్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి కోసం వచ్చే సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని చోట్ల సెల్లార్లను ల్యాబ్లు, రోగుల బంధువులు వసతి పొందేందుకు వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా విరుద్ధమని అధికారులకు తెలిసినా అటు మున్సిపాలిటీ.. ఇటు వైద్యారోగ్య శాఖ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపైనే వాహనాల నిలిపివేత ● జిల్లా వ్యాప్తంగా 390 అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగిస్తామంటూ మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. తర్వాత నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. అధికారులు అందిన కాడికి దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అధిక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోడ్ల పైనే వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నారు. రోగులతో పాటు సహాయకులు, వైద్యుల వాహనాలు సైతం రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే అంబులెన్స్లను సైతం బయటే నిలుపుతున్నారు. రోడ్ల పైకి వచ్చిన భవనాలతో పాటు సెల్లార్లలో వైద్య సేవల నిర్వహణ, ట్రాఫిక్ ఇక్కట్లు, అగ్నిమాపక శాఖ నిబంధన ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తనిఖీలు కరువు పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారు. ఇంటి నిర్మాణం నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా ? లేదా? పరిశీలించడం లేదు. సెల్లార్లలో పార్కింగ్ కాకుండా ఇతర అవసరాలకు యథేచ్ఛగా వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి సెల్లార్లలో ల్యాబ్లు, వైద్య సేవలు కాకుండా పార్కింగ్ కోసం వినియోగించుకునే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం సెల్లార్లో ల్యాబ్ నిర్వహిస్తుండటమే కాకుండా.. రోగులు వేచి ఉండేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు వాహనాల పార్కింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. చేసేదిలేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. -
దుబ్బాక అభివృద్ధికి సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్త
దుబ్బాక: నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం నివాసంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణం వరకు ఉన్న డబుల్ రోడ్డును ఫోర్లేన్ చేయాలని విన్నవించామన్నారు. మున్సిపాలిటీలో నిర్మించనున్న ఆధు నిక నాన్వెజ్ మార్కెట్ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆర్అండ్బీ, పీఆర్ రోడ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరామన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరడంతో సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, రణం శ్రీనివాస్గౌడ్, కొత్త కిషన్రెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. సీపీ ఆకస్మిక తనిఖీలు సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో బల్దియా కమిషనర్ మల్లికార్జున్తో కలిసి ప్రధాన కూడళ్లలో రహదారులు, గుంతలను పరిశీలించారు. ప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన గుంతలను పూడ్చాలని సూచించారు. విక్టరీ టాకీస్ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వర్షాలకు వరద నీరు మడుగుగా మారుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపకులకు దరఖాస్తులుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది (అతిథి అధ్యాపకుల) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజమ్మ తెలిపారు. పీజీటీ ఫిజికల్ సైన్స్ (మహిళ), పీజీటీ ఇంగ్లిష్, బాటనీ జూనియర్ లెక్చరర్ (మహిళ), కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వరకు గజ్వేల్ బాలికల మైనార్టీ గురుకులంలో దరఖాస్తులు అందించాలని, అదే గురుకులంలో ఈ నెల 9న సంబంధిత సబ్జెక్ట్లో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరుతడి సాగుతో ఆర్థికాదాయం మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుతడి సాగుతో మంచి ఆర్థికాదాయం సాధించవచ్చని హార్టికల్చర్ అధికారి రమేశ్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెప్యాలలో సాగవుతున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడిని తట్టుకుని ముందుకు సాగాలంటే పప్పుధాన్యాలు, కూరగాయలను పండించాలన్నారు. కొద్దిపాటి నీటి వనరులు ఉన్న చోట నీటిని పొదుపుగా వాడుతూ బీర, కాకర, సొర, చిక్కుడు, దొండ వంటి పంటలను పండించవచ్చన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నులిపురుగులను నిర్మూలిద్దాం
సిద్దిపేటకమాన్: ‘నులిపురుగులను నిర్మూలిద్దాం.. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదాం’ అని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఈ నెల 13న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిపోయిన వారికి ఈనెల 20న మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నర్సింగ్ కళాశాల, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలన్నారు. విద్యా, మహిళ, శిశు సంక్షేమ శాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వీడని ఉద్యమ కేసులు
విముక్తి కల్పించాలనిఉద్యమకారుల వేడుకోలుచేర్యాల(సిద్దిపేట): రాష్ట్రం సిద్ధించినా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదు. నాటి రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విచారణ ఏళ్లు గడుస్తున్నా ముగియడం లేదు. దీంతో విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు.. ప్రభుత్వం స్పందించి కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారు. సోమవారం కేసు విచారణలో భాగంగా పలువురు ఉద్యమకారులు చేర్యాల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నమోదైన ఉద్యమ కేసులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. దీంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కేసులను పూర్తిగా ఉపసంహరించి న్యాయం చేయాలని కోరారు. కోర్టుకు హాజరైన వారిలో హైదరాబాద్ జలమండలి చైర్మన్ మొగుళ్ల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత్రెడ్డి, బూరుగు సురేష్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మేకల కళింగరాజు, మాజీ సర్పంచులు వల్లూరి శ్రీనివాస్, కోనేటి స్వామి, నాయకులు బూడిద కిష్టయ్య, రఘువీరారెడ్డి, తిప్పారపు ఆనంద్, ముషిని బాబు తదితరులున్నారు. -
దుబ్బాక ‘చేనేత’ డైరెక్టర్లు ఏకగ్రీవం
దుబ్బాక: జిల్లాలో అతిపెద్ద చేనేత సహకార సంఘంగా ప్రసిద్ధి చెందిన దుబ్బాక సహకార సంఘానికి డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లకు 20 మంది నామినేషన్లు వేయగా సోమవారం 11 మంది పోటీ నుంచి వైదొలిగారు. దీంతో డైరెకర్లుగా అంకం మధు, కారంపురి గురుచరణ్, సిరిగాధ నర్సింహులు, బోడ చంద్రమోహన్, రాపెల్లి నాగరాజు, గాజుల భాస్కర్, చెలిమెల రాజేశం, మెత్కు కవిత, గడ్డం రాజమణి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. డైరెక్టర్లకు ఎన్నిక పత్రాలను అందించారు. దుబ్బాక చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికావడంపై దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్పేట మండలాల్లోని పద్మశాలి, నీలకంఠ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నేడు చైర్మన్, పాలక వర్గం ఎన్నిక దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్తో పాటు పూర్తి స్థాయి పాలకవర్గం ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
సొంతింటి కల కాంగ్రెస్తోనే సాకారం
ములుగు(గజ్వేల్): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ములుగులో మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సొంతిల్లు లేని పేద కుటుంబం ఉండకూడదనే లక్ష్యంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిసహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నిధులు ఇస్తూ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం, హౌసింగ్ ఎండీ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి వివేక్ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత -
దేవుడి పేరుతో బీజేపీ స్కాం
హుస్నాబాద్: అయోధ్య రామమందిరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దేవుడి పేరుతో బీజేపీ భారీ స్కాంకు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జిల్లెల్లగడ్డలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. చందా బుక్కులు పట్టుకొని ఊరూరా తిరిగారని, వసూలు చేసిన డబ్బులు ఎవరికి పోయాయో, ఎవరి వద్ద ఉన్నాయో లెక్కలు లేవన్నారు. రాముడి పేరిట చందాలు వసూలు చేసిన కోట్లాది రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. ప్రతి ఊరిలో జైశ్రీరాం అంటూ అక్షింతలు పంచి ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు అదే రామమందిరంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఆలయంలో జరిగిన అవినీతిపై మోదీ, అమిత్షా, ఆ రాష్ట్ర సీఎంతోపాటు తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదన్నారు. అయోధ్య ఆలయంలో సొమ్ములు దొంగిలించడంపై హిందువులందరికీ అవమానకరమన్నారు. రామమందిరంలో జరిగిన అవినీతి పై తప్పును ఒప్పుకొని బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో అద్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆత్మ డివిజన్ అధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు తదితరులు ఉన్నారు. భక్తి, అక్షింతల పేరిట రాజకీయాలు మంత్రి పొన్నం ప్రభాకర్ -
గోతులు దాటిన నిర్లక్ష్యం
వర్గల్(గజ్వేల్): నిర్లక్ష్యం గోతులు దాటింది. నిరసన గళం రోడ్డెక్కింది. గోతుల బాటలో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రయాణికులు గాయాలపాలవుతున్న ఘటనలు నిత్యకృత్యమైనా వర్గల్ రోడ్డు బాగోగులు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అధికారులకు వినతులు చేసినా స్పందన లేకపోవడంతో సోమవారం ఏకంగా గ్రామ సర్పంచ్ దేవగణిక జయభారతి రోడ్డు పక్కన బైఠాయించి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వర్గల్ ప్రధానరోడ్డును పునర్ నిర్మించాలని కోరారు. ఆర్అండ్బీ అధికారుల హామీతో దీక్ష విరమించారు. ఖ్యాతి ఘనం.. రోడ్డు అధ్వానం రాష్ట్రస్థాయిలో పేరొందిన విద్యాసరస్వతి క్షేత్రం, వెయ్యి ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న పారిశ్రామిక వాడ, నవోదయ విద్యాలయంతో వర్గల్ ఖ్యాతి ఇనుమడిస్తుంటే, గతుకులతో రోడ్డు ధ్వంసమై పరువుతీస్తోంది. రాజీవ్రహదారి నుంచి తూప్రాన్ జాతీయ రహదారికి బైపాస్గా నిలుస్తున్న ఈ రోడ్డుపై రాకపోకలకు సవాల్గా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే.. రోడ్డును బాగుచేయాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తెచ్చామని వర్గల్ సర్పంచ్ జయభారతి తెలిపారు. అయినా ఎవరూ స్పందించలేదన్నారు. చేసేదిలేకే రోడ్డు కోసం దీక్ష చేపట్టామని చెప్పారు.గోతులతో రోడ్డు ధ్వంసం గ్రామ ఎల్లమ్మ ఆలయం నుంచి దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం దాకా ప్రధాన రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. ట్రాక్టర్, లారీలు తదితర వాహనాలు గోతులలో దిగబడుతున్నాయి. అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు గాయాలపాలవుతున్నారు. ౖపైపె మరమ్మతులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వర్షం పడితే తారు లేచిపోయి సమస్య మొదటికే వస్తుంది. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మిస్తేనే వర్గల్రోడ్డుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రతిపాదనలు పంపుతాం వైఎస్సార్ విగ్రహం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు 400 మీటర్ల పొడవున సీసీ రోడ్డు రెన్యూవల్ కోసం, ప్యాచ్వర్కుల కోసం ఎస్టిమేట్లు పంపుతాం. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలకు మార్గం సుగమం చేస్తాం. అడ్మినిస్ట్రేటివ్ మంజూరు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. – రేణుక, (ఆర్అండ్బీ డిప్యూటీఈఈ)రోడ్డెక్కిన నిరసన గళం వర్గల్ రోడ్డు కోసం సర్పంచ్ దీక్ష -
కేంద్రంపై పోరాటం ఉధృతం చేస్తాం
రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ చిన్నకోడూరు(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ పేర్కొన్నారు. చిన్నకోడూరులో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా తెచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులకు మేలు జరగదన్నారు. కంపెనీల యజమానులకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మారుస్తుందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా, యూరియా యాప్ ప్రవేశపెట్టి, ఎరువుల ధరలు పెంచిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుందని విమర్శించారు. సమావేశంలో నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దశరథం, బాలయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్లో రేపు స్పాట్ అడ్మిషన్లుహుస్నాబాద్రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డీసీఓ శ్యామలత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారుఉ. బాలుర కళాశాల వర్గల్, కొండపాక, చిన్నకోడూరు, అల్వాల్, చేర్యాల, హుస్నాబాద్, బాలికల కళాశాలలు ములుగు, జగదేవ్పూర్,రామక్కపేట, సిద్దిపేటరూరల్, మిట్టపెల్లి, బెజ్జంకి,తొగుట,గజ్వేల్ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు నాలుగు పాసు పోర్టు సైజ్ ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. బాలురకు మిరుదొడ్డి మండలం అల్వాల్ గురుకుల కళాశాలలో, బాలికలకు ములుగు బాలికల గురుకుల కళాశాలలో 6వ తేది ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నాం 1–00 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేయండిమున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలోని 43 వార్డుల్లో ఆయన సర్ ప్రక్రియ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి వాటి పనితీరును ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెల్ప్ డెస్క్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజల అనుమానాలను నివృతి చేయాలని సూచించారు. విధులకు గైర్హాజరు అయినా, అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అండగా కాంగ్రెస్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను జమ చేసిందని ఆయన వెల్లడించారు. పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 21 వేలమంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అంజయ్యరాజు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొన్నారు. -
అక్షర విద్యాధరి.. వ్రత నాచగిరి
ప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాధరి, నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతిమాత సన్నిధానం చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. తమ తల్లిదండ్రుల సమక్షంలో 650 మంది చిన్నారులు అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అక్షరాలు దిద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మరోవైపు నాచగిరి క్షేత్రాన్ని పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించి అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాది మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని తరించారు. సరస్వతి క్షేత్రాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వేదపండితులు మహదాశీర్వచనం చేసి, శేషవస్త్రం అందజేశారు. –వర్గల్(గజ్వేల్) -
నామమాత్రంగా అమలు
పకడ్బందీగా అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ప్రభుత్వం నామమాత్రంగా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 1.18లక్షల ఎకరాల సాగు అంచనాకు ఇప్పటికే 70 వేల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చేసింది. జూలై 15లోగా పత్తి విత్తన గడువు కూడా ముగియనున్నది. ఈ దశలో మూడు రోజులుగా ఉచిత పత్తి విత్తనాల పంపిణీ ప్రక్రియ కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమైంది. జిల్లాకు కేవలం 7వేల ఎకరాలలోపు అవసరమయ్యే విత్తనాలు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇవీ కూడా హడావిడిగా రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న రైతులను పిలిచి పంపిణీ చేస్తూ...‘మమ’అనిపిస్తున్నారు. -
అసలే ఆలస్యం.. ఆపై అరకొర
సీజన్ ముగుస్తున్న సమయంలో ఉచిత పత్తి విత్తనాల పంపిణీ జిల్లాలో జాతీయ పత్తి ఉత్పాదకత పథకం (మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ) ఆధ్వర్యంలో సాగుతున్న ఉచిత పత్తి విత్తనాల పంపిణీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజన్ ముగిసే సమయంలో విత్తనాలను పంపిణీ చేయడం, అదీ కూడా అరకొరగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మూడు రోజులుగా హడావిడిగా సాగుతున్న ఈ పథకం సత్ఫలితాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్ – గజ్వేల్ పత్తి సాగు అధికంగా ఉండే రాష్ట్రంలోని 19 జిల్లాలను జాతీయ పత్తి ఉత్పాదకత పథకానికి ఎంపిక చేశారు. ఇందులో సిద్దిపేట జిల్లా కూడా ఒకటి. అధిక సాంద్రత లేదా క్లోజర్ స్పేస్ విధానాల్లో పత్తి సాగును ఈ పథకంలో ప్రోత్సహిస్తారు. అధిక సాంద్రత విధానంలో ఎకరాకు 29 వేల మొక్కలను విత్తే అవకాశం ఉంటుంది. క్లోజర్ స్పేస్ విధానంలో ఎకరాకు 15వేలకు పైగా మొక్కలను విత్తుతారు. అధిక సాంద్రత పద్ధతికి ఎకరాకు 6 ప్యాకెట్లు, క్లోజర్ స్పేస్ పద్ధతికి 4 విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. సాధారణ పద్ధతిలో అయితే రైతులు కేవలం 2నుంచి రెండున్నర ప్యాకెట్ల విత్తనమే వాడతారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ విధానంలో మొక్కకు, మొక్కకు మధ్యన దూరం తగ్గిపోయి అధిక దిగుబడులకు అవకాశం కలగనుంది. ఈ క్రమంలోనే రైతులకు ప్రభుత్వం ఈ రెండు పద్ధతులను అనుసరించే రైతులకు అవసరమైన విత్తనాలను అధికారులు అందజేయనున్నారు. పత్తి ఎదుగులకు అవసరమయ్యే మందులు, క్రిమిసంహారకాలు కూడా పంపిణీ చేయనున్నారు. అధిక సాంద్రత పద్ధతి పాటించే రైతులకు ఎకరాకు రూ.7వేల వరకు, క్లోజర్ స్పేస్ పద్ధతికి విత్తనాలతో కలుపుకొని రూ.5,500వరకు ఇన్పుట్స్ ఇస్తారు. ప్రణాళికబద్ధంగా జరిగి ఉంటే... ఈ పథకానికి సంబంధించి ప్రణాళికబద్ధంగా మే నెల నుంచే కార్యాచరణ అమలు చేసి ఉంటే మంచి ఫలితాలకు అవకాశం ఉండేది. జిల్లాలో పత్తి సాగులో రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. ఇష్టానుసారంగా సాగుచేయడం వల్ల దిగుబడులు నానాటికీ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ పద్ధతులవైపు రైతులను మళ్లించి, ఉచిత విత్తనాలను, ఇన్పుట్స్ను సకాలంలో పంపిణీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా, అరకొరగా అమలవుతున్న జాతీయ పత్తి ఉత్పాదకత పథకం వల్ల సత్ఫలితాలు అనుమానంగా ఉన్నాయి. -
అభివృద్ధికి సహకరించండి
డిప్యూటీ సీఎం భట్టిని కోరిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీనిచ్చినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నార్సింగ్ మండలానికి కొత్తగా తహసీల్దార్ కార్యాలయం భవనం మంజూరు చేయడంతోపాటు అక్బర్పేట–భూంపల్లి, రాయపోల్, నార్సింగ్ మండలాలకు ఎంపీడీఓ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అవసరమైన పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ, పీఆర్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. ఈ అంశాలపై మంత్రి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. -
రిజర్వాయర్ రద్దయినా ప్రభుత్వం దగ్గరే భూమి
తోటపల్లి రిజర్వాయర్ రద్దయి 11 ఏళ్లు గడుస్తున్నా అందుకు సేకరించిన భూమి ఇంకా ప్రభుత్వ అధీనంలోనే ఉంది. రిజర్వాయర్ ఎలాగు రద్దయింది కాబట్టి తమ భూమిని తమకిచ్చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు సాగు చేస్తున్నా రికార్డుల్లో లేనందున సదరు రైతులకు రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలేవీ వర్తించడం లేదని వాపోతున్నారు. – సాక్షి, సిద్దిపేటఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో 29 రహదారుల నెట్వర్క్ బలోపేతం కోసం హ్యామ్ ద్వారా ఆర్అండ్బీ రోడ్లకు రూ.137 కోట్లు, పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లకు రూ.67.95 కోట్లు కలిపి మొత్తం రూ. 204.95 కోట్లు విడుదలైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పట్టుబట్టి నిధులను సాధించామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రవాణా ఇబ్బందులు తొలగి నియోజకవర్గ ముఖచిత్రం మారుతుందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్: జహీరాబాద్ ఐసీడీఎస్ కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు ఆయాలుగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుశీల తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోని 15 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, గిరిజన ప్రాంతాల్లో గల 20 ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణి, కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమన్నారు.మా భూములు మాకే ఇవ్వాలి... తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల మా ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని భూము లు ఇచ్చాం. రిజర్వాయర్ రద్దయింది కాబట్టి మా భూములు మాకివ్వాలని కొన్నేళ్లుగా తిరుగుతున్నాం. భూమి మా పేరు మీద లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధికి దూరమవుతున్నాం. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు స్పందించి మా భూములు మాకు ఇవ్వాలి. –బీనవేణి లక్ష్మణ్, రాంచంద్రపూర్, రైతు రెండెకరాలు తీసుకున్నారు రిజర్వాయర్ నిర్మాణం కోసం మాకున్న రెండెకరాలు తీసుకున్నారు. అప్పుడు నామమాత్రంగా పరిహారం ఇచ్చారు. మా భూముల్లో రిజర్వాయర్ నిర్మాణం కాలేదు. కాబట్టి మా భూములు మాకివ్వాలి. పెద్ద కంపెనీలకు అయితే భూమి తిరిగి ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వరు? –బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు, గాగిల్లాపూర్అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2007లో శంకుస్థాపన చేసిన ఈ రిజర్వాయర్కోసం దాదాపు 510 మంది రైతుల దగ్గర నుంచి 1,603 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు సేకరించారు. అక్కన్నపేట మండలంలో గౌరవెల్లిలో నిర్మించాలనుకున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.04 టీఎంసీల నుంచి 8.23 టీంఎంసీలకు పెంచి తోటపల్లి రిజర్వాయర్ను 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. 1,603 ఎకరాల భూమి సేకరణ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో 0.950 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించి దాదాపు 49వేల ఎకరాలకు సాగు నీరందించాలని డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్, తోటపల్లి, కోహెడ మండలంలోని రాంచంద్రాపూర్, వరికోలు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓబులాపూర్, నారాయణపూర్ గ్రామాల నుంచి 1,603 ఎకరాల భూమిని సేకరించారు. గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో ఈ రిజర్వాయర్పై ఇంజనీరింగ్ అధికారులతో అధ్యయనం చేయించింది. తోటపల్లి రిజర్వాయర్ 0.3 టీంఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండేందుకు అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. తక్కువ సామర్థ్యం ఉండటంతో బెజ్జంకి, కోహెడ, చిగురుమామిడి మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురికాకుండా గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగుపై గ్రావిటీ కెనాల్ నిర్మించి అక్కన్నపేటలోని గౌరవెల్లి రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్రణాళికను రూపొందించింది. తోటపల్లి రిజర్వాయర్ను మార్చి తోటపల్లి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చుకోవాలని నిర్ణయించింది. దీంతో తోటపల్లి రిజర్వాయర్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూములు ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఈ భూములను సదరు రైతులు సాగు చేస్తున్నప్పటికీ రికార్డుల్లో వారి పేరిట భూములు లేకపోవడంతో వారికి రైతు భరోసా, రైతు బీమా వర్తించడం లేదు. బ్యాంక్ రుణాలకు సైతం దూరమవుతున్నారు. 100 ఎకరాల్లో గ్రావిటీ కెనాల్స్.. తోటపల్లి రిజర్వాయర్ కోసం 1,603 ఎకరాల భూమిని సేకరించగా అందులో 100 ఎకరాలు గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం కోసం వినియోగించాలని, మిగతా 1,503 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎకరానికి రూ.2.10లక్షలు పరిహారం ఇవ్వగా ప్రభుత్వం మార్కెట్ ధర ఇచ్చి భూములు తిరిగి తీసుకోవాలని అప్పటి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రకటించారు. అయితే అప్పుడు నామమాత్రపు పరిహారం తీసుకున్న రైతులు మార్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులు ముందుకు రాలేదు. అనంతరం జిల్లాల విభజన జరగడంతో బెజ్జంకి, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రాగా, చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుంది. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీకి చెందిన 124 ఎకరాల భూమిని సేకరించగా దానిని 2021లో తిరిగి ఇచ్చారు. తమ భూములు తమకు ఇవ్వాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. -
ప్రాణం గుప్పిట్లో పాఠాలు
● శిథిలావస్థలో పాఠశాల భవనం ● భయాందోళనలో విద్యార్థులు దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. భవనం పైకప్పు పలుచోట్ల పెచ్చులు ఊడిపోవడం, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడలకు భారీ పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని లేదా ప్రస్తుత భవనానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, కోరుతున్నారు. -
కష్టపడే వారికి చేయూత
● మాజీమంత్రి హరీశ్రావు ● రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీసిద్దిపేటజోన్ /ప్రశాంత్నగర్(సిద్దిపేట): కష్టపడి పనిచేసుకునే వారికి ఎల్లప్పుడూ తనవంతు సహకారం ఉంటుందని వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తానని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి నెక్ (ఎన్ఈసీసీ)సహకారంతో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాళ్లను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.... మీ కష్టానికి తనవంతు తోడుగా ఈ స్టాళ్లను అందిస్తున్నానన్నారు. టీ స్టాల్తో పాటు గ్యాస్ సిలెండర్, స్టౌవ్, ఎల్ఈడీ లైట్స్, వాటర్ బాటిల్స్, హోటల్కు అవసరమైన సామగ్రి అందించారు. బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన హరీశ్రావు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్లీన్, గ్రీన్, సేఫ్ సిద్దిపేట పట్టణాన్ని నిర్మించుకున్నామని, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజారక్షణగా చేసుకున్నామన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెట్లు నాటడం లాంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి, కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమవుతుందనడానికి బృందావన్ కాలనీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వ్రతశోభితం.. భక్తిపారవశ్యం
సుశిక్షితులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో సర్కారు బడి మొత్తంగా నిలబడింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల నిలువెత్తు దోపిడీలను తప్పించుకుంటూ చాలామంది ప్రభుత్వ బడివైపు అడుగులేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పిస్తూ మిగిలిన వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్న వారిపై ఈ వారం సండే స్పెషల్.భక్తులతో నాచగిరి క్షేత్రం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవుని వ్రతాలతో అలరారింది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో, ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు శ్రీవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. భక్తులు గర్భగుడిలో విశేషాలంకృతులైన శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకుని తరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయసిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
సిద్దిపేటకు రేవంత్ గ్రహణం
● ఎమ్మెల్యే హరీశ్రావు ● కాంగ్రెస్ పాలనలో ‘రియల్’ రివర్స్ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇది సిద్దిపేటకు మాత్రమే కాదని, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. దీంతో వ్యాపారులు రోడ్డున పడుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్రెడ్డి అనే గ్రహణం పట్టిందని.. ఇంకో రెండేళ్లు ఆ గ్రహణం ఉంటుందన్నారు. ఆ తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు. ఒకప్పుడు బంగారం కంటే సిద్దిపేటలో ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం భూములు కొనుగోలు చేయాలన్న, విక్రయించాలన్న ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, మీ కళ్ల ముందే సినిమా రీల్లా అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని కాపాడాలిప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించే అలవాటు చేసుకోవాలని సూచించారు. శనివారం ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు పాల్గొని, అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణంగా మెకానిక్లలో చదువుకున్నవారు తక్కు వ, ఐక్యత కూడా తక్కువగా ఉంటుందని కానీ మన సిద్దిపేట మాత్రం మీ ఐక్యత రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 20 ఏళ్ల ప్రయా ణం తర్వాత నూతన భవనం ఫంక్షన్ హల్లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వేగంగా నడిస్తే, 60–70 ఏళ్ల వరకు డాక్టర్ అవసరం రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. అంతకుముందు అసోసియేషన్ సభ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్సిద్దిపేటకమాన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా టాస్క్ఫోర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జ్వర తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకోవా ల ని సూచించారు. ఇంటి పరిసరాల్లో, వినియోగంలో లేని టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి తాజా ఆహారం తీసుకోవాలని సూచించా రు. జ్వర లక్షణాలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని, చికిత్స తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. -
కొను‘గోల్మాల్’పై విచారణ చేపట్టిన అధికారులు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ధాన్యం గోల్మాల్పై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం డీపీఎం విద్యాసాగర్ అల్వాల గ్రామ పంచాయతీ వద్ద విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఐకేపీ క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ ట్రాక్ షీట్లు సృష్టించి 109 క్వింటాళ్ల ధాన్యం సొమ్మును కాజేయడానికి ప్రయత్నించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని రైతులు మండిపడ్డారు. కాగా ఈ విషయంపై రైతులు, గ్రామస్తులు కలిసి జిల్లా పీడీ జగదేవ్ ఆర్యకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేశారు. జరిగిన విషయంపై పీడీ స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీపీఎం విద్యాసాగర్కు రైతులు వినతి పత్రాన్ని అందించారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్సిద్దిపేటకమాన్: చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఈ నెల 18న జరగనున్న స్పెషల్ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా న్యాయవాదులతో ప్రధాన న్యాయమూర్తి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 1,324 చెక్ బౌన్స్ (ఎన్ఐ యాక్టు) కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. స్పెషల్ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేట్లు చూడాలని న్యాయవాదుల కు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కుమారస్వామి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్బాబు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. చేర్యాల కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి చేర్యాల(సిద్దిపేట): చేర్యాల కోర్టును జిల్లా జడ్జి సుదర్శన్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా కోర్టు పరిసరాలను పరిశీలించి న్యాయవాదులతో కలసి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత కేసులు త్వరగా పరిష్కరించాలని చేర్యాల కోర్టు జడ్జి బానోత్ శ్రీరామ్ను ఆదేశించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్, ఆరే మహేందర్, జిల్లా న్యాయవాదులు, పోలీసు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.సన్నరకం వడ్లను యాప్లో నమోదు చేయాలిగజ్వేల్ ఏడీఏ బాబునాయక్ గజ్వేల్: ప్రభుత్వం సూచించిన విధంగా ఏడు సన్న రకాల వడ్లను సాగుచేసిన రైతుల వివరాలను టీ–అగ్రిసీడ్ యాప్లో నమోదు చేయాలని గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ సూచించారు. శనివారం గజ్వేల్లోని రైతు వేదికలో స్థానిక వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి టీ–అగ్రిసీడ్ యాప్పై విత్తన డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతువారీగా ఏడు రకాల సన్నరకం విత్తన అమ్మకం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. దీని ద్వారానే కొనుగోళ్ల సమయంలో అందుబాటులో కచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పారు. ఇంకా ఈ సదస్సులో కొండపాక, కుకునూర్పల్లి, రాయపోల్ వ్యవసాయాధికారులు శివరామకృష్ణ, గోవిందరాజులు, నరేష్, ఏఈఓలు సచిన్, రమ, గణేష్లతోపాటు విత్తన డీలర్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలితపస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ తొగుట(దుబ్బాక): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుముల మురళీధర్ హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఉపాధ్యాయులకు 51% పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్ను రద్దుచేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 190జీవోను అమలు పరచాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్కార్డుల విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు రవీందర్రెడ్డి, రాజేశం, నాయకులు భగవాన్, శ్రీనివాస్, మల్లేశం, కనకయ్య, నర్సింహరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కోర్టును తరలించవద్దు
హుస్నాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలుహుస్నాబాద్: హుస్నాబాద్ కోర్టును జిల్లెల్లగడ్డ శివారుకు తరలించవద్దని పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. మండలంలోని జిల్లెల్లగడ్డ శివారులో కొత్తగా కోర్టు భవనాల సముదాయ నిర్మాణం కోసం సర్వే నంబర్ 265లో 5.20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులతో కలిసి జడ్జి రేవతి కేటాయించిన స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఈ స్థలాన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి కేటాయించినట్లుగా బోర్డును ఏర్పాటు చేశారు. కోర్టును తరలిస్తే హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల పేద ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, ప్రస్తుత హుస్నాబాద్ కోర్టు పరిధిలో 1.32 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, దానిలోనే సబ్ కోర్టు నిర్మాణం చేయాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని స్థానికులు కోరుతున్నారు. -
వాన కురిసె.. మడి మురిసె
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగులో భాగంగా ఇప్పటివరకు వర్షం కోసం దిగాలుగా చూసిన రైతులు వర్షం రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, శనివారాల్లో కురిసిన వర్షంతో రైతులకు ఊరట లభించినట్లైంది. ఈ వానాకాలం సాగు నుంచి రైతుతో దోబుచులాడుతున్న వర్షం రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. పత్తి, మొక్కజొన్న, కందులు, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 3,85,338 ఎకరాలకుగాను 2,130 ఎకరాల్లో వరి, 1,18,772 ఎకరాల పత్తికి గాను 70,402 ఎకరాల్లో, 28,027 ఎకరాలకు గాను 8,421 ఎకరాల్లో మొక్కజొన్న, 7,431 ఎకరాలకు గాను 1,312 ఎకరాల్లో కందులు, 14 ఎకరాల్లో పెసర్లకు గాను 36 ఎకరాల్లో, ఇతర ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 5,41,550 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా వర్షంతో పరేషాన్ ప్రతీ సంవత్సరం వానాకాల పంటలు ప్రారంభం కాగానే వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో రైతులు దిగాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విత్తనాలు విత్తాక వరుణుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇప్పటివరకు జిల్లాలో 5,41,550 ఎకరాలకుగాను 82,356 ఎకరాలు మాత్రమే సాగైంది. శుక్ర, శనివారాల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఈ వానాకాలంలో వర్షాల సాగుకు అనుగుణంగా వర్షాలు కురవడం లేదు. శుక్రవారం, శనివారాలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం జిల్లా సగటున 10.46మిల్లిమీటర్లు, శనివారం జిల్లా సగటున 32 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. దీంతోపాటుగా మరో మూడు రోజుల పాటుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అధికారులు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొండపాకలో అత్యధికంగా 54 మిల్లిమీటర్ల వర్షపాతం శనివారం జిల్లాలో కొండపాక మండలంలో 54 మిల్లిమీటర్లు, మద్దూరు మండలంలో 50, దుబ్బాక మండలంలో 49, సిద్దిపేట రూరల్ మండలంలో 48, మిరుదొడ్డి మండలంలో 47, అక్బర్పేట–భూంపల్లి మండలంలో 45 , దౌల్తాబాద్ మండలంలో 41, తొగుట మండలంలో 41, చేర్యాల మండలంలో 40, నారాయణరావుపేట మండలంలో 36, ధూళ్మిట్ట మండలంలో 35, కొమురవెల్లి మండలంలో 34, సిద్దిపేట అర్బన్ మండలంలో 34, కుకునూరు మండలంలో 32, చిన్నకోడూరు మండలంలో 30 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
ఈ వర్షాలు లబ్ధి చేకుర్చుతాయి
శుక్రవారం, శనివారం కురిసిన వర్షాలు రైతులకు లబ్ధి చేకుర్చుతాయి. ఈ వానాకాలం నుంచి వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఈ రెండు రోజులు కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వానాకాలం ప్రారంభమై నెల రోజులైంది. తిరుపతిరెడ్డి, మెట్పల్లి, చిన్నకోడూరు మండలం భయాందోళనలు నెలకొన్నాయి ఈ వానాకాలం నుంచి సక్రమంగా వర్షాలు కురవ లేదు. దీంతో దుక్కిలు దున్ని విత్తనాలు విత్తడం కోసం ఎదురు చూశాం. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలంగా మారాయి. వరుణుడు సరైన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచాడు. దీంతో ఇప్పుడు మేమందరం తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాం. దండ్యాల వెంకట్రెడ్డి, ఐనాపూర్, కొమురవెల్లి మండలం -
సమన్వయంతో పనిచేయాలి
జిల్లా యంత్రాంగానికి సీఎస్ జాజు సూచన సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవసాయ, తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, ఉద్యానవన, ఆయిల్పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, మధ్యాహ్న భోజనం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించారు. వ్యవసాయ సీజన్ విజయవంతం చేసేందుకు సమిష్టిగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...జిల్లాలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామని, కొరత లేకుండా సకాలంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు సరఫరా అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని,వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు స్వరూప రాణి, సువర్ణ, ధనరాజ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
కయ్య పడితే కష్టమే!!
దుబ్బాక: పట్టణంలోని మిషన్ భగీరథ సిబ్బంది పైప్లైన్ గేట్ వాల్ ఎయిర్ తీయడంతో నీటి ఒత్తిడికి ఏదుల్లచెరువు కట్ట కొట్టుకుపోయి పెద్ద కయ్యపడింది. సుమారుగా పదిగజాలకు పైగా కట్ట మట్టి కొట్టుకు పోయింది. దీంతో కట్టపై నుంచి ఉన్న దుబ్బాక–దుంపలపల్లి–సిద్దిపేట ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. చెరువుకట్ట చాలావరకు పెద్దకయ్య పడి రోడ్డు అంచువరకు రావడంతో ఏదైనా భారీ వాహనం వెళ్లినా, లేక వర్షానికి తడిసినా రోడ్డు దిగబడిపోయే ప్రమాదముంది. వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పొలాల్లో మట్టి, కంకర కుప్పలు నీటి ఒత్తిడికి కట్ట కొట్టుకుపోయి రైతు గన్నె శ్రీనివాస్రెడ్డికి చెందిన పొలంలో పెద్ద ఎత్తున మట్టి, కంకర కుప్పలు పెట్టడటంతో రైతుకు నష్టం ఏర్పడింది. వెంటనే చర్యలు చేపట్టాలి.. ప్రమాదం జరగకముందే అధికారులు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.చర్యలు తీసుకుంటాం మిషన్ భగీరథ పైప్లైన్ నిర్వహణలో భాగంగా ఎయిర్వాల్ విప్పడంతో ఘటన జరిగింది. కట్ట వద్ద ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – విశ్వేశ్, మిషన్ భగీరథ ఏఈ -
ప్రజా సమస్యలు చెప్పేందుకు వేదిక ఏదీ?
జిల్లా పరిషత్, మండల పరిషత్, సిద్దిపేట మున్సిపాలిటీలలో పాలక వర్గాలు లేకపోవడంతో సమావేశాలు జరగడం లేదని, దీంతో ప్రజా సమస్యలు చెప్పేందుకు వేదిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా అభివృద్ధిపై రివ్యూ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని కోరారు. గత సమావేశంలో చర్చించిన మినెట్స్ ఇవ్వడం లేదని, ఏజెండాను సమావేశానికి రెండు రోజుల ముందు ఇవ్వకుండా సమావేశంలో ఇస్తే ఎలా చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాక్ పీస్లకు డబ్బులు లేవని, సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్లను ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఆయిల్పామ్ సాగు చేసేందుకు డ్రిప్ లేకపోవడంతో ముందుకు రావడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుతున్నారని, క్షేత్ర స్థాయిలో 11 గంటలు కూడా రావడం లేదని ఆరోపించారు. యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు. -
దూర విద్యలో ప్రవేశాలు ప్రారంభం
చేర్యాల(సిద్దిపేట): టెన్త్, ఇంటర్మీడియెట్ చదివేందుకు సార్వత్రిక దూర విద్యలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు పెద్దమ్మగడ్డ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 ఏళ్ల వయస్సు నిండి మధ్యలో చదువు మానేసిన యువతీయువకులకు ఇది గొప్ప అవకాశమన్నారు. ఈ సార్వత్రిక దూర విద్యా విధానంలో 10వ తరగతి, లేదా ఇంటర్మీడియెట్ సింగిల్ సిట్టింగ్ ద్వారా ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యలో సంపాధించిన సర్టిఫికెట్కు సమానమ ని తెలిపారు. ప్రవేశాలకు ఈ నెల 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 9949106117, 9666274952 నంబర్లను సంప్రదించాలన్నారు. గజ్వేల్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు డిజిటల్ టెర్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ అనిత అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన 215 మంది విద్యార్థినులు మొత్తం 54 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 30 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్న–అక్క మెంటార్ షిప్ ఏఐ డిజిటల్ తరగతుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కృత్రిమ మేథస్సు(ఏఐ), డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ ప్రాథమికాలు, ఇంటర్నెట్ వినియోగం, సైబర్ భద్రత, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. సిద్దిపేటజోన్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి శుక్రవారం సిద్దిపేట మండల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఫర్టిలైజర్స్ షాప్స్ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. యూరియా యాప్ ద్వారా పంపిణీ ప్రక్రియ, స్టాక్ వివరాలు, తదితర అంశాలపై అరా తీశారు. మండలంలో ఇప్పటివరకు 8,169 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా యాప్ ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భవ్యశ్రీ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 25వార్డులో 116పోలింగ్ కేంద్రం పరిధిలో సర్ ప్రక్రియ పరిశీలించారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, వివరాల నమోదు, పత్రాల సేకరణ తదితర అంశాలపై అరా తీశారు. ప్రజల సహకారం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డి, బూత్ లెవల్ ఆఫీసర్ శ్రీలత, వార్డు ప్రతినిధి బాలకిషన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థుల ర్యాలీ గజ్వేల్: ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం మెడికల్ కళాశాల విద్యార్థులు శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ‘రైతు భద్రతా’ ర్యాలీ నిర్వహించారు. ‘పురుగు మందులు... పురుగులకు చేటు కలిగించాలి’...మనుషుల కు కాదు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి ర్యాలీని నిర్వహించారు. పంటలు పండలేదనే ఆవేదనతో రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. రైతులు మనోధైర్యంతో ముందుకుసాగాలని నినదించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చందన, కళాశాల డీన్, వైద్యులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వాడీవేడి చర్చ
ఐదు గంటలు.. 26 శాఖలు సాక్షి, సిద్దిపేట: జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఐదు గంటల మేర 26 శాఖల అభివృద్ధిపై సమీక్షించారు. కలెక్టరేట్లో ఇన్చార్జి మంత్రి వివేక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హైమావతితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పలు సమస్యలపై హరీశ్రావు, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ప్రశ్నల వర్షం కురపించారు. వీటిని పలువురు అధికారులు సమాధానం చెప్పారు. మరి కొందరు నెల రోజుల క్రితం.. 20 రోజుల క్రితం.. అంటూ బదిలీపై వచ్చిన అధికారులు సమాధానం ఇచ్చారు. గంట ఆలస్యంగా.. మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 2:15గంటలకు ప్రారంభమైంది. రాత్రి 7:25గంటల వరకు సమావేశం సాగింది. వ్యవసాయ శాఖ, ఉద్యాన, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, పంచాయతీ రాజ్ ఇంజనీర్, ఆర్ అండ్ బీ, విద్యా, ఇంటర్మీడియెట్, వైద్య ఆరోగ్య, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ, హౌసింగ్, పశు సంవర్థక, మత్స్య, మైనింగ్, ట్రాన్స్కో, కార్మిక, ఉపాధి, ఫైర్, దేవాదాయ, రెడ్కో, లీడ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్లలో జరుగుతున్న అభివృద్ధి, సమస్యల పై చర్చించారు. జిల్లాలో జరిగిన యూరియా అక్రమ రవాణాపై చర్చ సాగింది. సమీక్షకు హాజరైన జిల్లా అధికారులుజిల్లా అభివృద్ధిపై సమీక్ష యూరియా ఇబ్బందులు రావొద్దు: మంత్రి వివేక్ పలు సమస్యలపై నిలదీసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూంలకు లబ్ధిదారులను ఎంపిక చేసి అందించాలన్నారు. -
నాల్గింటా ఏకగ్రీవమే..
● నాలుగు చోట్ల ప్రక్రియ పూర్తి ● మిగతా సొసైటీల్లో నామినేషన్ల ప్రక్రియ సిద్దిపేటజోన్: జిల్లాలో చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ మేరకు నాలుగు సొసైటీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో భాగంగా 50 ఓట్ల లోపు ఉన్న సొసైటీల్లో శుక్రవారం చేతులెత్తి ఓటింగ్ ప్రక్రియ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈమేరకు ఒకేరోజు నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ఉండటంతో ఎన్నికల అధికారులు సజావుగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ చేనేత సహకార సంఘానికి గూడూరు శ్రీనివాస్, పోట్లపల్లి సొసైటీకి సబ్బని వెంకటేశం, చెర్ల తోటపల్లి సొసైటీకి గాజుల భగవాన్, గజ్వేల్ ఉన్ని సొసైటీకి పులి బాలచంద్రంలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం తొమ్మిది మంది ఆఫీస్ బేరర్స్తో కూడిన కార్యవర్గాన్ని ప్రకటించారు. -
రైతన్న వర్షాతిరేకం
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వర్షాలు కురిశాయి. సగటున 10.46మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొమురవెల్లి 30మిల్లీమీటర్లు, తొగుటలో 28మి.మీ., కొండపాకలో 24మి.మీ., మద్దూరులో 22మి.మీ., దౌల్తాబాద్, మిరుదొడ్డిలలో 20మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిలను సిద్ధం చేసుకున్న రైతన్నలకు శుక్రవారం కురిసిన వర్షం గొప్ప ఊరటనిచ్చింది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ అన్నదాతల దుస్థితి ఇది. కొంత కాలంగా రైతు బజార్ క్లీనింగ్ పేరిట అధికారులు ప్రతి శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో వందలాది మంది రైతులు ఆరుబయటే రోడ్డు పక్కన కూరగాయలు, ఆకు కూరలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. చేసేదిలేక ఇలా తడుస్తూనే విక్రయాలు సాగించారు. – సిద్దిపేటజోన్● జిల్లా వ్యాప్తంగా వానలు ● కొమురవెల్లిలో 30 మి.మీ. వర్షపాతం నమోదు -
ధాన్యం కొనుగోల్మాల్
● అల్వాలలో 109 క్వింటాళ్ల ధాన్యం మాయం ● గ్రామ పంచాయతీ వద్ద రైతుల ఆందోళన ● ఐకేపీ సీఏల చేతివాటం అంటూ ఆరోపణ మిరుదొడ్డి(దుబ్బాక): అధికారుల కనుసన్నల్లో ఐకేపీ సీఏలు ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసి 109 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం మండల పరిధిలోని అల్వాల రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల గ్రామంలోని గోదాం వద్ద వడ్ల కొనుగోలు కేంద్రంలో పొల్లు పేరిట, వర్షానికి తడిసి మొలకెత్తడంతో పాటు రంగు మారిందన్న సాకుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి అధిక తూకం వేశారని రైతులు ఆరోపించారు. అలా అధిక తూకం వేసి సేకరించిన 254 ధాన్యం సంచులకు గానూ 109 క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతుల పేరును నమోదు చేయించారని మండిపడ్డారు. అనంతరం చెప్యాల క్రాస్ రోడ్డులోని చందన రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని వేయింగ్ బిల్లు వేయించారని మండిపడ్డారు. రూ.2.58 లక్షల విలువైన ధాన్యానికి సంబంధం లేని కౌలు రైతుల పేరిట బిల్లులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అమాకులైన రైతులను ఆసరాగా చేసుకుని అధిక తూకం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల సమక్షంలో రైతులు తీర్మానించారు. అధికారుల నిర్లక్ష్యం, ఐకేపీ సీఏల చేతి వాటం వల్ల అల్వాల కోనుగోలు కేంద్రంలో జరిగిన గోల్మాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఐకేపీ సీఏలపై వచ్చిన ఆరోపణలపై ఏపీఎం లక్ష్మీనర్సమ్మను వివరణ కోరగా రైతుల ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామ తెలిపారు. -
మహిళా సంఘాల సొమ్ము రికవరీ చేయాలి
చేర్యాల(సిద్దిపేట): దానంపల్లి మహిళా సంఘంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టాలని, సొమ్మును రికవరీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్మావో డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం బృందం గ్రామంలో పర్యటించి మహిళా సంఘాల సభ్యులు, గ్రామైక్య సంఘం అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడి వాస్తవ విషయాలను తెలుసుకున్నారు. అనంతరం వెంకట్మావో మాట్లాడుతూ గ్రామంలో 27 మహిళా సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలకు సీఏగా ఉన్న మమత సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గ్రామైఖ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శుల కళ్లుగప్పి బ్యాంకు అధికారుల కను సన్నలలో లక్షలాది రూపాయలు కాజేసినట్లు ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తిరుపతి, మైసయ్య, రేకులు గ్రామైఖ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు కళావతి, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లన్న’ నిర్వాసితులకు మరో కష్టం
మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఆర్అడ్ఆర్ కాలనీ నిర్మించిన సంగతి తెల్సిందే. ఆయా గ్రామాల పరిధిలో 600 ఎకరాలకుపైగా భూమిని సేకరించి నిర్వాసిత గ్రామాలకు చెందిన సుమారు 2,500 ఇళ్లతోపాటు మరో 3వేలమందికి ఓపెన్ ప్లాట్లను అందజేశారు. ఇక్కడ సేకరించిన భూమిలో సుమారు 18వేల గుంటలు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఇందులో 10 నుంచి 12వేల గుంటల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, మిగతా భూమిని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫంక్షన్హాల్, షాపింగ్కాంప్లెక్స్, పార్కు, దేవాలయాలు ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇండ్ల నిర్మాణాల కోసం రూ.250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. వంద కోట్లకుపైగా వెచ్చించారు. ప్రధాన రోడ్లు 80, 60ఫీట్లతో అంతర్గత రోడ్లు 40 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. లే అవుట్ అనుమతులేవీ? డీటీసీపీ(డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్) తరహాలో రూపుదిద్దుకున్న ఈ కాలనీ లే–అవుట్కు డీటీసీపీ నుంచి కలెక్టర్ నుంచి అప్రూవుడ్ లే–అవుట్గా అనుమతులు లేవు. అనుమతి తీసుకోవాలన్న విషయాన్ని కూడా అధికారులు మరిచిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకవేళ ఉన్నా.. అధికారికంగా ధ్రువీకరించే ఫైలును అధికారులు బయటపెట్టడం లేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితులపై ఇలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో నిరసన వెల్లువెత్తుతోంది. చార్జీలు తడిసి మోపెడు.. ఈ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలంటే అనుమతి లేని కారణంగా ముందుగా ఎల్ఆర్ఎస్ ఆ తర్వాత బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సుమారుగా 200గజాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే లే–అవుట్ అనుమతి ఉంటే.. సుమారుగా రూ.80వేలవరకు చార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఎల్ఆర్ఎస్ కూడా తప్పనిసరిగా మారటంతో సుమారు రూ.2లక్షలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ చార్జీలు ఏరియా బట్టి మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు బిల్డింగ్ పర్మిషన్, ఎల్ఆర్ఎస్ లేకుండా కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా...మున్సిపల్ అధికారులు కూల్చేయడం తరుచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవహారంపై కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవకు దారితీసిన సంగతి తెల్సిందే. ఈ పరిస్థితుల్లో అధికారులు ఈ అంశంపై ఎలాంటి పరిష్కారం చూపుతారనే అంశంపై నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఇల్లు కట్టాలంటే.. ఎల్ఆర్ఎస్ తప్పనిసరి ఆర్అండ్ఆర్ కాలనీ లే–అవుట్కు అనుమతుల్లేకే కష్టాలు పర్మిషన్ పేరిట మున్సిపల్ అధికారుల కూల్చివేతలు కాలనీలో తరచూ ఉద్రిక్తతలు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితిమల్లన్నసాగర్ నిర్వాసితులకు మరో కష్టం వచ్చిపడింది. గతంలో ఈ కాలనీ లే–అవుట్ చేసిన అధికారులు అనుమతుల విషయాన్ని మరిచిపోవడం నేడు సమస్యలను సృష్టిస్తోంది. కొత్తగా ఈ కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలంటే బిల్డింగ్ పర్మిషన్తోపాటు ఎల్అర్ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేయించుకోవడం అనివార్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీల భారం మోయలేమని నిర్వాసితులు చెబుతున్నారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించుకోవడం, ఇదే క్రమంలో మున్సిపల్ అధికారులు కూల్చేయడం.. ఉద్రిక్తతలకు దారితీస్తోంది. – గజ్వేల్ -
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
కాంగ్రెస్ జంబో కమిటీసాక్షి, సిద్దిపేట: ఎట్టకేలకు పూర్తి స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీని టీపీసీసీ ప్రకటించింది. గతేడాది నవంబర్22న డీసీసీ అధ్యక్షురాలిగా తూంకుంట ఆంక్షారెడ్డిని నియమించారు. డీసీసీ కమిటీ కోసం జిల్లాకు సమన్వయ కర్తలు అల్లాడి పవన్, రోహిత్లను టీపీసీసీ నియమించగా వీరు రెండు మూడు మార్లు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్యకార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ నేతల సలహాలు, సూచనలతో చివరకు పూర్తి స్థాయి కమిటీని గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులు తొమ్మిది మంది జిల్లా కాంగ్రెస్ కమిటీని 85 మందితో టీపీసీసీ ప్రకటించింది. అందులో ఉపాధ్యక్షులు తొమ్మిది మంది, ప్రధాన కార్యదర్శులు 20, అధికార ప్రతినిధులు నలుగురు, కార్యదర్శులు 36 మంది, జిల్లా కమిటీ సభ్యులు 16 మందిని నియమించారు. ఈ కమిటీ రెండేళ్లు ఉంటుందా? లేక జిల్లా అధ్యక్షురాలు పదవీ కాలం ముగిసినప్పుడే వీరిది సైతం ముగుస్తుందా? అని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటుండటం గమనార్హం. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం జిల్లా వ్యాప్తంగా మండల సమావేశాల్లోనే పార్టీ పదవులు ఆశించే వారి నుంచి నామినేషన్లను స్వీకరించారు. సామాజిక సమీకరణాలు, నాయకుల సమర్థత, సీనియార్టీలను పరిశీలించి పదవులు ఇచ్చారని ఓ వర్గం కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొత్త వారికే ఇచ్చారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి డీసీసీ కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నంటి ఉన్నవారికి పదవులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంతో పలువురు నిరాశ చెందుతున్నారు.ఎట్టకేలకు జిల్లా పూర్తి స్థాయి నియామకం -
చే‘నేత’ ఎన్నికల సందడి
● ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ● జిల్లాలో 13 సంఘాలకు ఎన్నికలు దుబ్బాక: చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమపార్టీల అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలనే పట్టుదలతో సమీకరణల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలపై దృష్టి సారించి పావులు కదుపుతుండటం విశేషం. 4వ తేదీ నామినేషన్లకు చివరి రోజు జిల్లాలో మొత్తం 18 చేనేత, ఉన్ని సంఘాలు ఉన్నాయి. మొదటి విడతలో 13 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 4వ తేదీ చివరి రోజు కావడంతో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులతో ఆయా సంఘాల్లో ఎన్నికల సందడి నెలకొంది. దుబ్బాక, సిద్దిపేట, ఇర్కోడ్, సిద్దిపేట ప్రాజెక్టు, గజ్వేల్, దుద్దెడ చేనేత సంఘాలతో పాటు లింగారెడ్డిపల్లి, శ్రీరాములపల్లి, ధర్మారం, గజ్వేల్ ఉన్ని సంఘాలకు పోలింగ్ జరుగుతుంది. 50 మంది ఓటర్ల కన్నా తక్కువగా ఉన్న సిద్దిపేట ఆదర్శ, పొట్లపల్లి, చెర్ల తోటపల్లి, గజ్వేల్ ఉన్ని సంఘాలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 10న పోలింగ్ చేనేత సంఘాలకు 10న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియకు ఈ నెల 4 వరకు అవకాశం ఉండగా 5న స్క్రూటినీ, 6న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.10న పోలింగ్ అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో జరుగనున్న 13 సంఘాల్లో మొత్తం 2,510 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలో అత్యధికంగా దుబ్బాక చేనేత సహకార సంఘంలో 1,502 ఓటర్లు ఉండటంతో ఈ సంఘం ఎన్నికలు చాలా ఆసక్తిగా తయారయ్యాయి. పకడ్బందీగా ఎన్నికలు చేనేత సహకార సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 4వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటాం.10న పోలింగ్ అదే రోజు కౌంటింగ్. దుబ్బాక చేనేత సహకార సంఘంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. –శ్రీనివాస్రెడ్డి,ఎన్నికల అధికారి -
కొనుగోళ్లు పూర్తయినా చేతికి అందని డబ్బులు
● జిల్లాలో 38,973 మెట్రిక్ టన్నులు సేకరణ ● రూ.10.53 కోట్లు పెండింగ్ ● వానాకాలం సాగుకు అందకపోవడంతో రైతన్న పరేషాన్ ● అప్పులు చేసి యూరియా, విత్తనాలు కొనుగోలుజిల్లాలో 31వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. వ్యవసాయ మార్కెట్లలో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 9,032 మంది రైతుల నుంచి 38,973 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. వీటికి రూ.93.53 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.83 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.10.53కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వెయ్యి మందికి పైగా రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే సొసైటీ అధికారులను అడిగితే తమకు సంబంధం లేదని, మార్క్ఫెడ్ అధికారులను అడగాలని వారు సమాధానమిస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. 45 రోజులుగా పెండింగ్ మక్కలు విక్రయించి 45 రోజులైనా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. కొనుగోళ్లు పూర్తయినా చెల్లింపులు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు పనులు ముమ్మరమయ్యాయి. మక్కల డబ్బులు వస్తే పంట పెట్టుబడికి అందుతాయని ఆశగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. గిట్టుబాటు ధర కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి పరిస్థితి. పండించిన పంటను అమ్మేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విక్రయించిన తర్వాత డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి మక్కల డబ్బులు త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్మేందుకు పడిగాపులు, ఇబ్బందులు పడ్డారు. విక్రయించిన తర్వాత డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మక్కల కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు. వానాకాలం సాగు పెట్టుబడికి ఉపయోగపడతాయని అనుకున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో అప్పులు చేసి యూరియా, విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ను కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే అసలుకే మోసం వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట నెల రోజులైనా డబ్బులు రాలే చేర్యాల వ్యవసాయ మార్కెట్లో మే 29న 26.5 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయించాను. నెల రోజులు దాటినా డబ్బులు రాలేదు. సాగు పెట్టుబడికి డబ్బులు ఉపయోగపడుతాయి అనుకున్నా. డబ్బులు రాకపోవడంతో అప్పు తెచ్చాను. ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి డబ్బులు త్వరగా ఇప్పించాలి. –దాసరి అనిల్ కుమార్, చేర్యాల త్వరలోనే జమవుతాయి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కలను కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన మక్కల వివరాలను హెడ్ ఆఫీస్కు పంపించాం. రైతుల వారీగా డబ్బులు జమ అవుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపులు కానున్నాయి. – బాలకృష్ణ, డీఎం, మార్క్ఫెడ్ -
ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా ఎన్యూమరేషన్ పత్రాలు ప్రజల నుంచి సేకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని 4, 22 వార్డుల్లో ఆయన క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సిబ్బందితో కలిసి పత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు సర్ ఉద్దేశ్యం, ఎన్యూమరేషన్ పత్రాలను నింపే విధానం వివరించారు. ఆయన వెంట వార్డు సూపర్ వెజర్, బూత్ లెవల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు నాణ్యమైన విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా కోపరేటివ్ అధికారి వరలక్ష్మి అన్నారు. నాబార్డు సహకారంతో గంగాపూర్ సహకార సంఘంలో విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ విత్తనోత్పత్తి చేయడానికి హుస్నాబాద్, జగదేవ్పూర్, గంగాపూర్లో మూడు సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అందించేందుకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 90 శాతం వరి విత్తనాలు ప్రైవేటు సంస్థలవే కొనుగోలు చేస్తుండటంతో పంట దిగుబడి తగ్గుతోందన్నారు. దీనిని నియంత్రించడానికి విత్తనోత్పత్తి చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు సంతోష్ కుమార్, డా. పల్లవి, ఏఈఓ, రైతులు ఉన్నారు. వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు నేడు హాజరు కానున్న మంత్రి వివేక్ మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలో బొడ్రాయి(నాభిశిల) ఉత్సవాలు రెండో రోజు గురువారం కూడా అంగరంగ వైభవంగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య బొడ్రాయికి జలాభిషేకం చేశారు. హోమాలు, పూజల్లో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ రాణి, ఉప సర్పంచ్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మంత్రి వివేక్, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీలం మధు పూజల్లో పాల్గొంటారని మండల నాయకుడు మోర్సు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
యూరియా.. అక్రమాలేనయా..
చేర్యాలలో 6,429 బస్తాలు పక్కదారి ● గుర్తించిన వ్యవసాయ శాఖ ● తాజాగా బైరాన్పల్లిలో 13 బస్తాలు మాయంసాక్షి, సిద్దిపేట: యూరియా పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పంపిణీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చినప్పటికీ ఫర్టిలైజర్ షాప్ యజమానుల అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే చేర్యాలలో 6,429 యూరియా బస్తాలు రైతుల పేర్లతో కాజేశారు. గుర్తించిన వ్యవసాయ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యజమాని సందీప్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఓ పక్క చర్యలు తీసుకుంటున్నా తాజాగా దూల్మిట్ట మండలం బైరాన్పల్లి రైతు సేవా కేంద్రంలో రైతు పేరు మీద వచ్చిన యూరియాను అక్రమంగా తరలించినట్లు ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన నందనబోయిన కుమార్ అనే రైతు మార్చి 8న బైరాన్పల్లిలోని రైతు సేవా కేంద్రంలో 13 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. అదే నెల 9న యూరియా తీసుకువెళ్లవచ్చని సమాచారం వచ్చింది. అయితే యూరియా లేదని రైతును యజమాని వెనక్కి పంపించారు. దీంతో చేసేదేమిలేక ఇంటికి వచ్చిన తర్వాత రైతు ఫోన్లో యూరియా కొనుగోలు చేసినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. అవక్కాయిన కుమార్ రైతు సేవా కేంద్రం నిర్వాహకుడుని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో యూరియా అక్రమాలు మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపారు.కాసులకు ఆశపడి.. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే మరో పక్క కొందరు వ్యాపారులు కాసులకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా పక్కదారి పట్టవద్దన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్లో బుక్ చేసుకున్న వారికే యూరియా బస్తాలను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఫర్టిలైజర్ షాప్ల యజమానులు అక్రమాలు ఆపడం లేదు. -
వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం సిగ్గుచేటని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానా లపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.4.25కోట్ల అప్పులు చేసి అన్ని రంగాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని చెప్పారు. ఈ అప్పులతో రూ. 20లక్షల కోట్ల సంప ద బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఈ అప్పులతో కొత్తగా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్రావు ఎక్కడికక్కడా నిలదీస్తుండడం, సంక్షేమ శాఖ లో జరిగిన టెండర్ల అవినీతిని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. హామీల అమలులో విఫలమై ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ రాబోవు రోజుల్లో గుణపాఠం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నిందితుల అరెస్ట్.. అధికారి సస్పెన్షన్
సిద్దిపేటజోన్: యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేది లేదని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చేర్యాల పరిధిలోని శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ దుకాణంలో యూరియా సరఫరా విషయంలో అక్రమాలు జరిగినట్లు దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ద్వారా విచారణలో.. షాప్ యజమాని సందీప్రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా 6,429 యూరియా బస్తాలను నిబంధనలకు విరుద్ధంగా రైతుల పేరిట విక్రయించినట్లు తేలిందన్నారు. అతనిపై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అదేవిధంగా షాప్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న సిద్దిపేట పరిధిలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేశ్ ట్రేడర్స్ షాప్ల లైసెన్సులను వ్యవసాయ శాఖ రద్దు చేసిందన్నారు. యూరియా పక్కదారి పడుతున్నా పర్యవేక్షణ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చేర్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి భోగేశ్వర్ స్వామిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాప్ తప్పనిసరి.. గత రబీ సీజన్ నుంచి ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తెచ్చిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ అన్నారు. రబీ సీజన్ పంట కాలం పూర్తి కావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో యూరియా యాప్ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసి యూరియా అమ్మకాలు నిలిపివేసిందన్నారు. ఇదే సమయంలో చేర్యాలకు చెందిన శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వ ఈపాస్ మిషన్ ఉపయోగించి రైతుల పేర్లను అక్రమంగా నమోదు చేసి అక్రమాలకు పాల్పడినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ను ఉపయోగించడం వల్ల ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్లో రేపు స్పాట్ అడ్మిషన్లు
గజ్వేల్: స్థానిక ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం శుక్రవారం ఉదయం 10గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్వీ కృష్ణారావు తెలిపారు. పాలిసెట్లో అర్హత సాధించిన, సాధించని అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరై ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అభ్యర్థులు తమ వెంట టీసీ, పదోతరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాలిసెట్ రాసిన వారు ర్యాంకు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యప్రభుత్వ కళాశాలల్లోనే.. డీఐఈఓ రవీందర్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): నాణ్యమైన విద్య కేవలం ప్రభుత్వ కళాశాలల్లోనే లభిస్తుందని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని ప్రతి తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ సమస్య లు తెలుసుకొన్నారు. కళాశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, డిజిటల్ తరగతులు జరుగుతాయన్నారు. ప్రతీ విద్యార్థి మంచి మార్కులతో ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, ఆధ్యాపక బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో గతేడాది కంటే ఈఏడాది అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. రెండేళ్లుగా చిన్న కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నందున ప్రిన్సిపాల్, అధ్యాపకులను డీఐఈఓ అభినందించారు. అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేషం గజ్వేల్రూరల్: డీడీఎన్ (ధూపదీప నైవేద్య) అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేషం శ్రీనివాసాచార్యులకు మరోసారి అవకాశం లభించింది. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో అర్చకుల నూతన రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్లోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న శేషంను రెండోసారి డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. విత్తన అమ్మకాలు నిలిపివేత చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించడంతో విత్తన అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. స్థానిక బాలాజీ సీడ్స్ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్, జ్యోతి ఫర్టిలైజర్స్లో వారం రోజుల పాటు విత్తనాల అమ్మకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఎండీ.ఆప్రోజ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రెండు దుకాణాల నిర్వాహకులు విత్తన అమ్మకాల నిబంధనలు ఉల్లంఘించినందున వారం పాటు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అమ్మకుండా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మెమోలు జారీ కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ హైస్కూల్ హెచ్ఎం భైరయ్య, ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు మెమోలు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈఎల్స్ (సంపాదిత సెలవులు) పేరిట ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి సహకరించిన హెచ్ఎంపై, సొమ్ము కాజేసిన ఉపాధ్యాయురాలిపై సాక్షి దినపత్రికలో ఈనెల 29న ‘సారు.. ఇదేం తీరు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఆర్జేడి కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు హెచ్ఎంకు మెమో జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి మాత్రం బుధవారం అందజేశారు. ఈఎల్స్ పేరిట అక్రమంగా డబ్బులు కాజేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయమై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై డీఈఓ శాస్త్రిని వివరణ కోరగా ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన క్రమ శిక్షణ చర్యల నిమిత్తం ఆర్టికల్ ఆఫ్ చార్జి ఫ్రేమ్ అందజేసినట్లు తెలిపారు. -
నేరాల కట్టడికే సీసీ కెమెరాలు
● సీపీ రష్మీ పెరుమాళ్ ● రావురూకులలో కెమెరాల ప్రారంభంసిద్దిపేటరూరల్: నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రావురూకులలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట సురక్ష నేత్ర ప్రాజెక్ట్ ప్రారంభించిన వంద రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సీసీ కెమెరాలు ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ, గ్రామాలను 24 గంటలు నిఘా నీడలో ఉంచుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే 100 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా సైబర్ నేరానికి గురై ఆర్థికంగా నష్టపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సిద్దిపేట ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, సీఐ వాసుదేవరావు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి దుబ్బాకరూరల్: మండలంలోని పాతారంలో సీపీ రష్మీపెరుమాళ్ సిసి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వ్యక్తి గత వివరాలు చెప్పకూడదన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంత మంది మోసగాళ్లు నిరుద్యోగులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారని అలాంటి మోసగాళ్లను నమ్మకూడదన్నారు. ఎవ్వరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
నాచగిరి హుండీ ఆదాయం రూ.23 లక్షలు
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించా రు. గడచిన 98 రోజులలో వివిధ హుండీల ద్వారా ఆలయానికి రూ.23,09,829 ఆదాయం సమకూరింది. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి సమక్షంలో సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది.ఈ లెక్కింపులో ధర్మకర్తలు చందా నాగరాజు, నాయకం శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కొత్తపల్లి శ్రీనివాస్,శివకేశవ సేవాసమితి, భ్రమరాంబిక సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
కమిషనర్ మల్లికార్జున్సిద్దిపేటజోన్: వర్షాకాల నేపథ్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మురికి కాల్వ ల్లో మట్టి, చెత్తచెదారం తొలగించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. బుధవారం పట్టణంలోని 21, 36, 37, 38, 40, 43 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధులకు గైర్హాజరైన పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో చెత్త సేకరణ వాహనాల సమయపాలన, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. తడి పొడి హానికరమైన చెత్తను తప్పనిసరి వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెపక్టర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ఆర్డీఓ సదానందం సిద్దిపేటజోన్: సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీఓ సదానందం సూచించారు.కలెక్టర్ హైమావతి సూచన మేరకు బుధవారం డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ భవ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ హరికిరణ్లతో కలిసి సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఈ నెల 2లోపు ఎన్యూమరేషన్ పత్రాలను 95% పంపిణీ చేయాలని ఆదేశించారు. సమాచార సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూరించిన పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటర్ జాబితా నుంచి పేరు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతీ వార్డులో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వలస వెళ్లిన, చనిపోయిన వారి వివరాలను అందజేయాలని సూచించారు. -
ప్రవేశాల్లో వెనుకబడి
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన అడ్మిషన్లు ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడంలేదు. గతేడాదితో పోలిస్తే తక్కువగా మంది విద్యార్థులు చేరారు. బడుల్లో డిజిటల్ ద్వారా విద్యా బోధన, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్లు అందజేస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మక్కువ చూపడం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా అటువైపే మొగ్గుచూపుతుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత 201 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం లక్ష్యానికి చేరువ కాలేకపోయింది. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి జూన్ 20వ తేదీ వరకు బడి బాట చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో చేరాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరారు. పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై వివరించారు. అయినా ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రాబట్టలేకపోయారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,125 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారు. అందులో 1,215 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పొందారు. మిగతా వారు 3,910 మంది 1వ తరగతిలో చేరారు. గతేడాది 7,949 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరగా అందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారిలో 2,456 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే 2,824 మంది విద్యార్థులు తగ్గారు. సమన్వయం, ప్రచారం లేకే.. బడిబాట కార్యక్రమం జరిగినప్పుడు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యం ప్రవేశాలకు ఆటంకం కలిగింది. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం లేక సమస్య నెలకొంది. బడిబాట కార్యక్రమం నిర్వహణ పై క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం లేక మందకొడిగా ప్రవేశాలు నమోదయ్యాయి. పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు వరకు జరగనుంది. అప్పటి వరకై నా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెరిగేనా అని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. ఇంకా సమయం ఉంది అడ్మిషన్లకు ఇంకా సమయం ఉంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశం పొందగానే యూడైస్లో నమోదు చేయడం లేదు. ఇటీవల హెచ్ఎంలకు సమావేశం నిర్వహించి నమోదు చేయాలని ఆదేశించాను. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. – వరగంటి శాసీ్త్ర, జిల్లా విద్యా శాఖ అధికారి -
దారి మూసి.. గొయ్యి తీసి
● నాలుగు నెలలైనా పూర్తికాని బ్రిడ్జి ● జాడలేని కాంట్రాక్టర్ ● పల్లెలకు రాకపోకలు బంద్ ● శేరిపల్లి–గుంటిపల్లి గ్రామస్తుల ఇక్కట్లు వర్గల్(గజ్వేల్): ‘బ్రిడ్జి’ నిర్మాణం పేరుతో రోడ్డును అడ్డంగా తవ్వేశారు. వానాకాలంలోగా పూర్తిచేస్తామని నమ్మబలికారు. రూ.2.2 కోట్ల నిధులు అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. గొయ్యితోనే పనులు నిలిపేశారు. నాలుగు నెలలైనా అతీగతి లేకపోవడంతో శేరిపల్లి–గుంటిపల్లి మధ్య వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వర్గల్ మండలం శేరిపల్లి–గుంటిపల్లి రోడ్డుపై శేరిపల్లి శివారులో హైలెవెల్ వంతెన నిర్మాణానికి 2023లో పీఎంజీఎస్వై ద్వారా ప్రభుత్వం రూ.2.2 కోట్లు మంజూరుచేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ టెండర్ నిర్వహించి, 2025లో అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తిచేసి కంట్రాక్టర్కు పనులు అప్పగించింది. గొయ్యికే పరిమితం శేరిపల్లి శివారులో హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు నాలుగు నెలల క్రితం మొదలయ్యాయి. రోడ్డు మీద పాత కాజ్వేను తొలగించి అట్టడుగుదాకా భారీ గొయ్యి తవ్వారు. పక్కనుంచి జనం రాకపోకల కోసం మొక్కుబడిగా మట్టి దారితో మమ అనిపించారు. నాలుగు రోజులు సర్దుకుపోదామని భావించిన ఇరుగ్రామాల ప్రజలకు ‘షాకిస్తూ’ కాంట్రాక్టర్ నడిరోడ్డులో భారీగొయ్యి తవ్వి, అంతటితోనే పనులు ఆపేశారు. శేరిపల్లి, గుంటిపల్లె పక్కపక్కనే ఉంటాయి. పొలాలు కలిసిపోయినట్లే ఉంటాయి. ఎద్దు ఎవుసం నమ్ముకొని మేము కూరోగాయో వేసుకుంటం. మార్కెట్కు తీసుకపోతాం. సౌకర్యంగా ఉన్న రోడ్డును తవ్విపారేసిండ్రు. వానాకాలం రాక ముందే పూర్తయితదని, జాడలేకుండా పోయిండ్రు. బురద తోవే మాకు దికై ్కంది. మా గోస సర్కారు పట్టించుకోవాలె.రోడ్డును నాశనం చేసిండ్రు: శేరిపల్లి రైతులు నోటీసు జారీచేశాం బ్రిడ్జి పనులు నిలిచి రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నది వాస్తవం. పనులు వేగవంతం చేయాలని అనేకసార్లు కాంట్రాక్టర్ కు చెప్పాం. ప్రజల ఇబ్బందులు వివరించాం. అగ్రిమెంట్కు అనుగుణంగా పనులు జరగా ల్సిందే. కాంట్రాక్టర్కు నోటీసు జారీచేశాం. స్పందించకుంటే తదుపరి చర్యలు చేపడతాం. – సోహెల్ (పీఆర్ ఏఈ) -
వీబీజీ రాంజీ బిల్లు రద్దు చేయాల్సిందే
చేర్యాల(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రాంజీ బిల్లును రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్మావో డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ బిల్లును తొలగించాలని, లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, చుంచనకోట సర్పంచ్ శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు అరుణ్, మల్లేశం, సిద్ధులు, మైసయ్య, రాజు, నర్సింహారెడ్డి, చంద్రం, వెంకటేశం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది సేవలు మరువలేనివి
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది సేవలు మరువలేమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పదవీ విరమణ పొందిన సూపరింటెండెంట్ కార్యాలయం వెంకటేశ్వరరావు, ఏఎస్ఐలు రామ్ముర్తి, నవీన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ పెంటయ్యలను సీపీ మంగళవారం మెమెంటో అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.న్యాయమూర్తి బాలసదనం సందర్శన సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల యోగక్షేమాలు గూర్చి అరా తీశారు. పిల్లలకు చట్టాలు, విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించాలని సూచించారు. సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటగది పరిసరాలను, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తూనికలు కొలతల జిల్లా అధికారి శివరంజని సిద్దిపేటకమాన్: నోట్బుక్స్, ఇతర పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికల అధికారి శివరంజని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో బుక్ డిపోలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని ఓ బుక్ డిపోలో పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బుక్ డిపోలో నిర్ణయించిన ధరకు ఉండాల్సిన పేజీల కంటే తక్కువ ఉండటంతో కేసు నమోదు చేసి, జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా బుక్ డిపోలను నిర్వహించాలని ఆమె సూచించారు. -
సర్వర్ మొరాయింపు..
● నిలిచిన రిజిస్ట్రేషన్లు ● క్రయ విక్రయదారులకు తప్పని తిప్పలుసిద్దిపేటకమాన్: సాంకేతిక సమస్య తలెత్తడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొద్ది సమయం మాత్రమే పనిచేయడంతో మూడు, నాలుగు దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముందుగా స్లాట్లు బుక్ చేసుకున్న ప్లాట్ల క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో గంటల కొద్దీ ఎదురు చూశారు. సాయంత్రం వరకు అదే పరిస్థితి ఉండటంతో క్రయ విక్రయదారులు నిరాశతో వెనుదిరిగారు. జిల్లాలో సిద్దిపేట అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల ద్వారా ప్లాట్లు, భవనాలు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన సర్వర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ చేయడంతో జూన్ 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సోమ, మంగళవారాలు కార్యాలయాలు పనిచేసినప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిద్దిపేట సబ్రిజిస్ట్రార్ అర్బన్, రూరల్ కార్యాలయంలో సోమవారం 11, మంగళవారం 8, చేర్యాలలో 6 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. దుబ్బాక కార్యాలయంలో సర్వర్ సమస్యతో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
డివైఢర్..!
రాకపోకలకు తీవ్ర అడ్డంకి..పరిష్కారానికి చర్యలు గజ్వేల్ బస్టాండ్ వద్ద బస్సుల ఇన్, అవుట్కు ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. ముందుభాగంలో డివైడర్ను కొంత కట్ చేస్తే...రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఈ దిశగా అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇకపోతే రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా ఉంటాయి. – పావన్, ఆర్టీసీ డీఎం, గజ్వేల్–ప్రజ్ఞాపూర్కటింగ్ చేయాల్సిన డివైడర్ ఇదేగజ్వేల్: లోపాలు సరిచేయకుండానే గజ్వేల్ పట్టణంలోని నూతన బస్టాండ్ను ఆర్భాటంగా వినియోగంలోకి తేవడం ట్రాఫిక్ సమస్యలకు సృష్టిస్తోంది. ప్రయాణికులకు అవస్థలను కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుభాగంలో ఉన్న డివైడర్ను కట్ చేస్తేనే రాకపోకలకు ఇబ్బందులు తొలగి, ట్రాఫిక్ సమస్యలు కొంత మేర పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. రూ.2.86కోట్లతో బస్టాండ్ నిర్మాణం ఎస్డీఎఫ్(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) ద్వారా పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన రూ.2.86 కోట్లతో బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గత నెల 31న మంత్రి వివేక్ చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించారు. కేవలం పదిహేను గుంటలలోపు స్థలంలో నిర్మించిన ఈ బస్టాండ్లో బస్సులు నిలిపే అవకామే లేదు. ఒకవేళ బస్సులు నిలిపితే తర్వాత వచ్చే బస్సులతో, వేలాదిమంది ప్రయాణికులతో మరింతగా కిక్కిరిసిపోతున్నది. అంతేకాకుండా ఇన్, అవుట్ బస్సులు వెళ్లడానికి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో ఈ పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డివైడర్ కట్ చేస్తేనే సమస్యకు పరిష్కారం ప్రస్తుతం బస్టాండ్ వద్ద బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే.. ముందు భాగంలోని డివైడర్ను కొంత భాగం కట్ చేయాల్సి ఉన్నది. అలా చేస్తేనే బస్టాండ్ ముందు భాగంలో బస్సులు ఫ్రీగా రాకపోకలు సాగించడానికి అవకా శం కలగనున్నది. ప్రస్తుతం ఈ రోడ్డు ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) పరిధిలో ని 161ఏఏ నెంబర్ రోడ్డు. జాతీయ రహదారిగా ఉండగా... దీనిపై డివైడర్ కట్ చేయాలంటే ఎన్హెచ్ఏఐ అనుమతి తప్పనిసరిగా పొందాలి. కానీ ఈ అనుమతి వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లాల్సి రావడం వల్ల సంబంధిత అధికారులు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తున్నది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే త్వరలోనే ఈ రహదారి స్టేట్ హైవేగా మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అలా అయితే స్థానిక అధికారులు అనుమతి సరిపోతుందని చెబుతున్నారు. రింగు రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే... గజ్వేల్ రింగు రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల భారీ వాహనాలు పట్టణంలోని రోడ్డు గుండా వెళ్తున్నాయి. ప్రత్యేకించి బస్టాండ్ ప్రాంతంలో నుంచి భారీ వాహనాలు వెళ్లినప్పు డు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఈ సందర్భంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రింగు రోడ్డు అనుసంధానం సంగాపూర్ రోడ్డువైపున 150మీటర్ల మేర ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్న విషయం తెల్సిందే. లోపాలు సరిచేయకుండానేవినియోగంతో ట్రాఫిక్ ఇక్కట్లు ప్రయాణికులకు తప్పని అవస్థలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన గజ్వేల్ నూతన బస్టాండ్ దుస్థితి -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం కావాలి
గజ్వేల్రూరల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని డీసీఓ వరలక్ష్మి పిలుపునిచ్చారు. కో–ఆపరేటివ్ వారోత్సవాలు సందర్భంగా పీఏసీఎస్ గజ్వేల్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని కొడకండ్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు నరకడం వల్ల పర్యావరణంలో మార్పులు సంభవించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు రఘోత్తంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గౌత్, పీఏసీఎస్ కార్యదర్శి బాలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● గజ్వేల్లో డీబీఎఫ్ జిల్లా మహాసభ గజ్వేల్: భారత రాజ్యాంగ పరిరక్షణకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్లో నిర్వహించిన డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి అడ్డకట్టవేయడం ద్వారానే హక్కులను కాపాడుకోగలుగుతామని చెప్పారు. దళితబహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా, డీబీఎఫ్ అండగా ఉంటూ పోరాటం చేస్తున్నదని చెప్పారు. తన చైర్మన్ పదవీకాలం ముగిశాక, తానూ కూడా డీబీఎఫ్ పోరాటాల్లో భాగస్వామిగా ఉంటానని ప్రకటించారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి’ హక్కులను హరించేవిధంగా వీబీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇంకా ఈ మహాసభల్లో ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, బీఎస్పీ నాయకుల స్వామి పాల్గొన్నారు. డీబీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా వేణు గజ్వేల్లో జరిగిన జిల్లా మహాసభల్లో డీబీఎఫ్ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా బ్యాగరి వేణు, ఉపాధ్యక్షులుగా పోతరాజు శంకర్, ప్రధాన కార్యదర్శిగా భీమ్ శేఖర్, కార్యదర్శిగా సతీష్కుమార్తోపాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
పోలియో కార్యక్రమం విజయవంతం
● జిల్లాలో 95,577 మందికి చుక్కల పంపిణీ ● డీఎంహెచ్ఓ ధనరాజ్సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో మంగళవారం వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీని డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి రోజు బూత్ల ద్వారా, తర్వాత రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. గృహసందర్శన, ట్రాన్సిస్ట్ పాయింట్స్, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, మొబైల్ టీంల ద్వారా 2,54,220 ఇళ్లను సందర్శించి 95,577 మంది చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేశామన్నారు. ఇమ్యునైజేషన్ అధికారి దీప్తిప్రియాంక, డిప్యూటీ డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు. -
సబ్సిడీ ఏదీ?
రూ.500 గ్యాస్ బండ ఉత్తిదేనా? గ్యాస్ సిలిండర్ రాయితీ విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. ఏడాదిన్నరగా సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ కావడం లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ను అందజేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తొలుత అమలు చేసినప్పటికీ తరువాత మొండి చెయ్యి చూపింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,012.50. పేదలపై ఈ మొత్తం భారం పడుతోంది. రాయితీ జమకాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సబ్సిడీ డబ్బులు వస్తాయా? రావా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట ప్రజాపాలనలో రేషన్ కార్డులున్న వారికి రూ.500లకు గ్యాస్ సిలిండర్ అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని అందించడం ప్రారంభించారు. 1,79,883 మంది వినియోగదారులకు 10,97,205 గ్యాస్ సిలిండర్లను రూ. 34.74కోట్ల సబ్సిడీని అందించారు. ప్రస్తుతం గృహ వినియోగదారుల సిలిండర్ ధర రూ. 1,012.50 ఉండగా కేంద్రం రూ.47 మాత్రమే జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.465.50అందజేయాల్సి ఉంది. పథకం ప్రారంభంలో ఈ రాయితీని సక్రమంగానే జమ చేయగా ఏడాదిన్నర నుంచి ఖాతాల్లో పడటం లేదని లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి లబ్ధిదారులకు దాదాపు రూ.50 కోట్ల వరకు రాయితీ బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పేదలపై భారం రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటన చేయడంతో సంతోషించారు. కొన్ని నెలలు సబ్సిడీ చెల్లించారు. ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ఇవ్వకపోవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ చెల్లిస్తే ఆ డబ్బులు వంట నూనైకె నా ఉపయోగపడేవి అని లబ్ధిదారులు అంటున్నారు. మొత్తం చేతి డబ్బులే వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఒక్కొక్కసారి డబ్బులు లేక అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయండి
● ఏరువాక పౌర్ణమి మరుసటి రోజే పెట్టుబడి సాయం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్రూరల్: రైతులకు బాసటగా ప్రజాపాలన ప్రభుత్వం నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన రైతు సదస్సులో సీఎం రేవంత్రెడ్డి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని మీర్జాపూర్ రైతు వేదికలో రైతులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా ఉందని మిగతా రైతులు కూడా ఆ దిశగా సాగు చేయాలన్నారు. ఏరువాక పౌర్ణమి రోజున రైతులు కొత్త సాలు పెట్టగానే ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేసిందన్నారు రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే ఎక్కువ లాభలు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దారు లక్ష్మారెడ్డి, ఏడీఏ వీణారెడ్డి, ఏఓ పూజ, సర్పంచ్లు పాల్గొన్నారు. బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తాం హుస్నాబాద్: ఎరువుల తయారీ, సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, రైతులకు ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించా రు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల కొరత లేకుండా తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. డిమాండ్ మేరకు ఎరువుల సరఫరాతో పాటు రామగుండం ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులను తెలంగాణ రైతాంగానికే అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే తెలంగాణకు సరఫరాను తగ్గిస్తోందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాపాతం తగ్గడం వల్ల రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ఓటరు సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. పట్టణంలోని 17, 18వ వార్డుల్లో ఓటరు సవరణ పురోగతిని పరిశీలించారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి ● పాఠశాలల ఆకస్మిక తనిఖీచిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం చిన్నకోడూరులోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె మాట్లా డుతూ శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. అన్ని కూరగాయలు ఇష్టంగా తినాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సలీమ్, హెచ్ఎం, టీచర్లు ఉన్నారు. పీహెచ్సీ తనిఖీ.. చిన్నకోడూరు పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అన్ని రకాల మందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి ఆవరణలో చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
విద్యాధరి.. అక్షర ఝరి
వైభవంగా మూల మహోత్సవం మూల మహోత్సవ వేడుకలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం అలరారింది. భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. సోమవారం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. చతుషష్ట్యోపచార పూజలు, సామూహిక లక్షపుష్పార్చన, చండీ హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపం దర్శించుకుని తరించారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల మహోత్సవ వేళ క్షేత్రంలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. – వర్గల్(గజ్వేల్) -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.సుదర్శన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సాయిరమాదేవి బదిలీ కాగా ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఫ్యామిలీ కోర్టు నుంచి జి.సుదర్శన్ నియామకమయ్యారు. ఈ మేరకు న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేట కోర్టు ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిని పలువు రు న్యాయమూర్తులు అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సంతోష్కుమార్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమకు నిధులివ్వండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత పరిశ్రమకు ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రభుత్వం కాపాడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నీలకంఠ సమాజం దుకాణ సముదాయా న్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. చేనేత కార్మికులు సైతం ఇతర రంగాల వైపు దృష్టి సారించాలన్నారు. దుబ్బాక ప్రాంతం చేనేతకు చాలా ప్రసిద్ధి అని, ఇక్కడ నేతన్నలకు ఉపాధి కల్పించే మార్గాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నేతన్నల సంక్షేమం కోసం శాయశక్తుల కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు, నీలకంఠ సమాజం అధ్యక్షులు తదితరులు ఉన్నారు. ఫర్టిలైజర్ షాపులో అమ్మకాలు నిలిపివేత వర్గల్(గజ్వేల్): నిబంధనలు ఉల్లంఘించిన ఫర్టిలైజర్ షాప్లో అమ్మకాలు నిలిపేస్తూ ములుగు ఏడీఏ (వ్యవసాయ సహాయ సంచాలకులు) అనిల్కుమార్ ఆదేశాలు జారీచేశారు. సోమ వారం ఆయన వర్గల్ మండలం శాకారంలోని డిబిల్ అగ్రిసైన్సెస్ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ రికార్డులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు అప్డేట్ చేయలేదని గుర్తించారు. నిబంధనలు పాటించకుండా ఎరువులు, విత్తనాలు, పెస్టిసైడ్స్ అమ్ముతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. ఈ మేరకు శాఖాపరమైన చర్యలు చేపట్టి, ఆ షాపులో అమ్మకాలు నిలిపేసినట్లు ఏడీఏ అనీల్కుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన విద్య అందించాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పాఠశాల సిబ్బందితో శుభ్రం చేయించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026
కోలాటం బృందానికి నంది అవార్డులు మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రానికి చెందిన కోలాటం కళా బృందానికి జాతీయ స్థాయి స్వర్ణ నంది అవార్డులు వరించాయి. ఈ మేరకు సోమవారం కోలాటం బృందం సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవ, సాంస్కృతిక విభాగాల్లో విశిష్ట సేవలను అందించినందుకు అవార్డులు వచ్చాయన్నారు. వేద రూరల్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురవెల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కళా ఉత్సవాల్లో 20 స్వర్ణ నంది అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ నందిని, కోలాటం బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారన్నారు. -
94,854 మంది చిన్నారులకు చుక్కల మందు
● డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ ● ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేసిన వైద్య సిబ్బందిసిద్దిపేటకమాన్: జిల్లాలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 94,321 మందిని గుర్తించగా రెండు రోజుల్లో మొత్తం 94,854మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. ఇతర ప్రాంతాల పిల్లలు కూడా ఇక్కడ వేయించుకోవడంతో జిల్లాలో 100.56శాతం నమోదైనట్లు తెలిపారు. మంగళ వారం వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి 3,649మంది చిన్నారులకు చుక్కలు వేశారన్నారు. ట్రాన్సిస్ట్ పాయింట్ల వద్ద 426మంది, మొబైల్ టీంల ద్వారా 208మంది, రోడ్లపైన, రహదారి మార్గంలో సూపర్వైజర్ల ద్వారా 54మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం కూడా వైద్య సిబ్బంది మిగిలిన చిన్నారులకు ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తిప్రియాంక, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్యాదవ్, డాక్టర్ నిర్మలారెడ్డి, డాక్టర్ మీనా, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పల్స్పోలియోపై స్టేట్ టీమ్ పరిశీలన వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలంలోని హైరిస్క్ ప్రాంతాల్లో పల్స్పోలియో తీరును సోమవారం రాష్ట్ర కార్యక్రమ అధికారి డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలోని బృందం తనిఖీచేసింది. నగరం తండా, శ్రావ్య, స్నేహా ఫారాలు, అరుణ గార్డెన్స్ యోగా ఫారాలను సందర్శించి అక్కడి లేబర్ను పోలియో చుక్కలపై ఆరాతీశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ మీనాకుమారి, పీహెచ్సీ సిబ్బంది వారి వెంట ఉన్నారు. -
చేనేత పోరు షురూ..
సిద్దిపేటజోన్: జిల్లాలో చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు ఆయా సొసైటీల వారీగా నోటిఫై చేశారు. సంబంధించిన షెడ్యూల్ సహకార సంఘాల వద్ద నోటీస్ బోర్డ్ మీద అతికించారు. జిల్లాలోని 17 సంఘాలకు గాను మొదటి దశలో 13 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన వాటికి మరో నెల తరువాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 13 సొసైటీలకు చెందిన 2,510 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.13 సొసైటీల్లో సిద్దిపేట ఆదర్శ, పోట్లపల్లి, చెర్ల తోటపల్లి, గజ్వేల్ ఉన్ని సహకార సంఘాల ఎన్నికల్లో 50 లోపు ఓటర్లు ఉండగా, చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. జూలై 3న నామినేషన్ల స్వీకరణ, అదేరోజు స్కృటినీ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం నాలుగు సొసైటీల్లో పోలింగ్, ఫలితాల ప్రకటన, తొమ్మిది మంది సభ్యులతో ఆఫీస్ బేరర్స్తో కూడిన కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. 10న పోలింగ్.. మొదటి విడత చేనేత సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ మేరకు 50 ఓటర్లకు పైగా ఉన్న తొమ్మిది సహకార సంఘాల ఎన్నికలు జూలై 10న జరుగనున్నాయి. సిద్దిపేట చేనేతసహకార సంఘం, ఇర్కోడ్, సిద్దిపేట ప్రాజెక్టు, దుద్దెడ, దుబ్బాక, లింగారెడ్డిపల్లి ఉన్ని సంఘం, శ్రీరాములపల్లి, ధర్మారం ఉన్ని సంఘము,, గజ్వేల్ ఉన్ని సంఘాల ఉన్నాయి. సోమవారం నోటిఫై జులై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ, జులై 5న స్కృటినీ, జులై 6న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా విడుదల, గుర్తుల కేటాయింపు, జులై 10న పోలింగ్ ప్ర క్రియ, అనంతరం అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారుల నియామకం.. జిల్లాలో జరుగుతున్న 13 చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులను నియమించారు. సిద్దిపేటకు అమృత సేనారెడ్డి, ఆదర్శ సొసైటీకి రేఖ, ఇర్కోడ్కు రాజమౌళి, సిద్దిపేట ప్రాజెక్టుకు వర్మ, గజ్వేల్కు గౌతమ్, పోట్లపల్లికి శ్రీకాంత్, చెర్ల తోట పల్లికి యాకుబ్, శ్రీరాములు పల్లికి యాదగిరి, దుబ్బాకకు శ్రీనివాస్ రెడ్డి, దుద్దేడకు సతీష్ రెడ్డి, లింగారెడ్డి పల్లి ఉన్ని సంఘముకు ప్రవీణ్ రెడ్డి, ధర్మారం ఉన్ని సంఘముకు రవి, గజ్వేల్కు నాగరాజులను ఎన్నికల అధికారులుగా నియమించారు. మోగిన ఎన్నికల నగారా ఏర్పాట్లు పూర్తిఎన్నికల షెడ్యూల్ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి దశలో 13 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన ఎన్నికల అధికారులను నియమించాం. సజావుగా ఎన్నికల నిర్వహణకు పూర్తి చర్యలు తీసుకుంటాం. –బిచ్చప్ప, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
● నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా ● మంత్రి పొన్నం ప్రభాకర్కోహెడరూరల్(హుస్నాబాద్): రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్వాపూర్ గ్రామ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలను చల్లారు. అలాగే మండల కేంద్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయాన్ని మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలజయరాజ్, సర్పంచ్లు తదితరులు పాల్గోన్నారు. ఒక్క ఓటూ పోవద్దు: మంత్రి హుస్నాబాద్రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేక ఓట్లను బీజేపీ తొలగించాలని చూస్తోందని, అర్హులందరూ బీఎల్వోలకు సహకరించి ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పోతారం(ఎస్)లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించి ఓటరు జాబితా సవరణ గురించి గ్రామస్తులకు వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2.51 లక్షల ఓట్లు ఉంటే 61 వేల ఓట్లను తటస్థంగా పెట్టినట్లు చెప్పారు. అర్హలందరూ సరైన పత్రాలు, రెండు కలర్ ఫొటోలతో సిద్ధంగా ఉండి మీ ఇంటికి వచ్చే బీఎల్వోలకు అందించాలన్నారు. సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని చెప్పారు. -
ప్రతీ చిన్నారికి రెండు చుక్కలు
● తప్పనిసరిగా వేయించాలి ● కలెక్టర్ హైమావతి ● పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సిద్దిపేటకమాన్: ఐదేళ్లలోపు పిల్లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఎంపీ రఘునందన్రావు, కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేట అర్బన్ నాసర్పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని భావి భారత పౌరులను పోలియో రహితంగా ఉంచడానికి ప్రభుత్వం ఉచితంగా పోలియో చుక్కలు అందిస్తుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. బూత్ల దగ్గర వేయగా మిగిలిన చిన్నారులకు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 94,321మంది ఉన్నట్లు వంద శాతం వీరందరికి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వినోద్బాబ్జి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తిప్రియాంక, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేట ప్రగతి భేష్.. సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట అభివృద్ధి ప్రత్యక్షంగా చూశాం. అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ఇదే తరహాలో గద్వాల అభివృద్ధి కోసం కృషి చేస్తా’మని గద్వాల పాలకవర్గ సభ్యులు ప్రశంసించారు. ఆదివారం గద్వాల చైర్మన్ నర్సింహులు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సిద్దిపేట సందర్శించారు. సిద్దిపేట అధ్యయన కేంద్రంగా ఉందన్నారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైతు బజార్, స్వచ్ఛ బడి, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 95.76 శాతం పంపిణీ నమోదైంది. జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లలు 94,321 మంది ఉండగా బూత్ లెవల్ లో 90,319 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. గద్వాల పాలకవర్గ సభ్యులు ప్రశంస -
రాష్ట్రంలో నియంత పాలన
సిద్దిపేటజోన్: ఉద్యోగుల ఏడు డీఏలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం.. న్యాయం అడిగితే ఉద్యోగ సంఘాలపై ఏసీబీ, విజిలెన్స్ దాడులతో రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తోందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకను తట్టుకునే పరిస్థితి, సద్విమర్శలు స్వీకరించే ఓపిక ప్రభుత్వానికి లేదన్నారు. 99 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేస్తానన్న సీఎం మాట నీటిమూటయిందని విమర్శించారు. సీఎం కుర్చీలో కూర్చొని ఇచ్చిన మాటకు ఒక విలువ ఉండాలని, మాట మీద నమ్మకం పోతే కుర్చీకి, పదవికి గౌరవం ఉండదన్నారు. ఉద్యోగులు జీవితకాలంలో దాచుకున్న డబ్బుల కోసం పదవీ విరమణ తర్వాత ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పదవీ విరమణ బెనిఫిట్స్ వచ్చేవని, ఇప్పుడు ఎప్పుడూ వస్తాయో తెలియని గందరగోళంగా ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులతో కనీసం ప్రభుత్వం అగ్రిమెంట్ కూడా చేసుకోలేదని, కానీ ఉద్యోగుల జీతాల నుంచి మాత్రం మొదటి, రెండవ నెల అంటూ డబ్బులు కట్ అయిపోతున్నాయని ఆరోపించారు. గతంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కింద ఉద్యోగుల జీతం నుంచి ఒక శాతం కటింగ్ ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 1.5 శాతం పెంచి డబ్బులు కటింగ్ చేస్తుందని ఆరోపించారు. ఒక ఇంట్లో ఎందరూ ఉద్యోగులు ఉంటే అందరి దగ్గర డబ్బులు కట్ చేస్తున్నారని, కానీ ట్రీట్మెంట్ మాత్రం మొదలు కాలేదని విమర్శించారు. ఇప్పటికీ గురుకులాల్లో పిల్లలకు, నోట్బుక్స్ రాలేదని, కనీసం ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదన్నారు. పాఠశాలల్లో బ్రేక్పాస్ట్ ప్రారంభమైనా, సిద్దిపేట జిల్లాపైన రాజకీయ కక్షతో ఫేజ్–1లో మన జిల్లా పేరు లేకుండా పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. అంతకుముందు గ్రామీణ క్రీడ చిర్రగోనె టోర్నమెంట్ను ప్రారంభించి అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను నేటి తరానికి అందించాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. -
హనుమాన్ అనుగ్రహంతో వర్షాలు కురవాలి
నంగునూరు(సిద్దిపేట): హనుమాన్ అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం నంగునూరులోని హనుమాన్ దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు కురవడం లేదని, కరువు రాకుండా ఉండాలని భగవంతున్ని ప్రార్థించామన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించి ఓటర్లకు పత్రాలను అందజేశారు. అలాగే పల్స్పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. మల్లన్న ఆలయంలో భక్తుల సందడికొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మరి కొంత మంది భక్తులు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢమాసం ప్రారంభం కానుండటంతో భక్తుల రాక కొంత మేర తగ్గినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ ఈఓ సుధాకర్రెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు. అమ్మను కొలిచి.. మొక్కులు చెల్లించి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే అర్చకులు వన దుర్గమ్మను పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు తీసి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. -
వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.7,542 కోట్లు
పిడుగుల కాలం జాగ్రత్త! పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాలు 8లో uజిల్లాలో వ్యవసాయ వార్షిక ప్రణాళిక రూ.7,542కోట్లతో సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే రూ.800కోట్లకుపైగా పెరిగింది. కానీ ఎన్నో ఆశలతో వానాకాలం సీజన్కు సిద్ధమవుతున్న జిల్లా రైతాంగానికి రుణ వితరణ వేగంగా జరిగితేనే మేలు జరగనుంది. ఈ దిశగా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – గజ్వేల్ సకాలంలో అందేలా చూస్తాం రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం వార్షిక ప్రణాళిక సిద్ధం చేశాం. గతేడాదితో పోలిస్తే ప్రణాళికను ప్రభుత్వం పెంచింది. పంట రుణాలు సకాలంలో అందేలా చూస్తాం. వ్యవసాయానుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యతనిస్తాం. – హరిబాబు, లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లాలో 3లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వానాకాలం, యాంసగి సీజన్లకు సంబంధించి ఈఏడాది(2026–27) రూ.7,542 కోట్లకుపైగా రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఆమోదం కూడా లభించింది. వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి మూడు నెలలకోసారి 25శాతం లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించారు. గతేడాది రూ.6,700కోట్లకుపైగా లక్ష్యంగా ఉండగా.. రెండు సీజన్లు కలుపుకొని 74శాతం వరకు రుణాలు అందించారు. వ్యవసాయానుబంధంగా ఉండే సూక్ష్మ చిన్నతరహా రంగాలకు, వాణిజ్య రంగాలకు మరో రూ.1,675 కోట్లకుపైగా కేటాయించారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి 5.41 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే వరి 3.85 లక్షల ఎకరాల్లో సాగులోకి రానుందని అంచనా వేస్తున్నారు. పత్తి 1,18,772 ఎకరాలు, మొక్కజొన్న 28,027, కంది 7,431 ఎకరాల్లో కంది, మరో 14 ఎకరాల్లో పెసర్లు సాగులో రానుందని అంచనా వేస్తున్నారు. కానీ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు సక్రమంగా కురవక విత్తన ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పటివరకు పత్తి విత్తనాలు మాత్రమే విత్తుతున్నారు. పత్తి 43,552 ఎకరాలకుపైగా సాగులోకి వచ్చింది. మొక్కజొన్న 3,842, కంది 544, వరి 308 ఎకరాలు సాగులోకి వచ్చాయి. సకాలంలో అందితేనే మేలు రుణ ప్రణాళిక సక్రమంగా అమలైతేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో రైతు బంధుతోపాటు పంటల పెట్టుబడి కోసం రుణాల పంపిణీ అత్యవసరం. కానీ కొన్నేళ్లుగా రుణమాఫీ వంద శాతం జరగక రైతుల రుణాలు రెన్యువల్ కావడంలేదు. ఫలితంగా కొత్త రుణాల పంపిణీ ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో ఏటా రుణవితరణ లక్ష్యం తగ్గిపోతోంది. ఈసారైనా ఈ పరిస్థితి లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎస్ఐఆర్పై అపోహలు వద్దు
● ఒక వ్యక్తికి ఒకే ఓటు ● మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎస్ఐఆర్పై అపోహలు వద్దని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మన్కీ బాత్ను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ తో ఓట్లను తొలగిస్తున్నారనడం అవాస్తవమన్నారు. నకిలీ ఓట్లు మాత్రమే తొలగిస్తారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఓ, బీఎల్ఏలతో ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓటర్లను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. అనేక మంది ప్రజలు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చారని, వారికి స్వగ్రామంతో పాటు పట్టణాలలో ఓట్లు ఉన్నాయన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొంత మంది రాజకీయ నాయకులు బీఎల్వోలను, బీఎల్ఏలను తమ ఇంట్లో కుర్చోబెట్టుకుని మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు చేసే ఓట్ల మ్యాపింగ్లకు ఓటర్లు సహకరించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం టోల్ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 10 బీజేపీ జిల్లా కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వర్చువల్గా ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కార్యాలయం ప్రారంభం సిద్దిపేట బీజేపీ జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో ఆదివారం ప్రారంభించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ప్రారంభం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసాగర్, బాలేష్గౌడ్, కప్పర ప్రసాద్, వెంకట్, సంతోష్, పద్మ, ఉమారెడ్డి, తిరు మల, మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు. -
సారు.. ఇదేం తీరు
ఉత్తమ ఉపాధ్యాయుల వక్రబుద్ధి ● తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి.. ● ఈఎల్స్ను పొందేందుకు అడ్డదారులు ● జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి.. కొండపాక(గజ్వేల్): సమాజంలో మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు కొందరు అక్రమాలకు పాల్పడుతూ వృత్తికే మచ్చగా నిలుస్తున్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా అడ్డదారులకు తెరలేపారు. ఈ ఘటన కొండపాక మండలంలోని మర్పడ్గలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమ్మర్ క్యాంపునకు వెళ్లకుండానే.. మర్పడ్గ హైస్కూల్లో ఏడెనిమిదేళ్లుగా హెచ్ఎం భైరయ్యతో పాటు 11 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సుమారు 140కి పైబడి విద్యార్థులున్నారు. గణిత బోధకురాలిగా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు 2018లో చేర్యాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో జిల్లా స్థాయి సమ్మర్ క్యాంప్ను నిర్వహించనప్పటికీ క్యాంప్లో డ్యూటీ చేసినట్లుగా తప్పుడు సర్టిఫికెట్ సంపాదించారు. వాస్తవానికి సదరు ఉపాధ్యాయురాలి పేరు సమ్మర్క్యాంపునకు సంబంధించి డీఈఓ ఉత్తర్వుల్లో కానీ అటెండెన్సు రిజిస్టరులో నమోదు కాలేదు. దీంతో ఉపాధ్యాయురాలు సమ్మర్ క్యాంపులో పాల్గొనలేదన్న విషయం స్పష్టమవుతోంది. సదరు ఉపాధ్యాయురాలు అడ్డదారిలో 21 ఈఎల్స్ (సంపాదిత సెలవులు) పేరిట డబ్బులు పొందేందుకు 2020లో హెచ్ఎం భైరయ్యకు దరఖాస్తు చేశారు. కానీ సర్టిఫికెట్ వాస్తవమా కాదా అన్న విషయాన్ని ఏమాత్రం విచారణ చేయకుండానే 2022లో హెచ్ఎం 21 ఈఎల్స్ మంజూరు ఇవ్వడంతో డబ్బులు డ్రా చేశారు. హెచ్ఎం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విషయం పొక్కిందిలా.. అదే పాఠశాలలో సాంఘిక సబ్జెక్టు బోధకుడిగా పని చేసిన అంజయ్య ఇదివరకు వేసవి సెలవుల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో విధులు నిర్వర్తించారు. ఈక్రమంలో ఈఎల్స్ను పొందేందుకు హెచ్ఎం భైరయ్యకు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు చేయడానికి హెచ్ఎం నిరాకరించారు. దీంతో సదరు ఉపాధ్యాయురాలి ఈఎల్స్ మంజూరు చేసిన విషయాన్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ఈ క్రమంలో హెచ్ఎం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు చర్చించుకున్న విషయం గుప్పుమంది. ఈ విషయమై ఓ వ్యక్తి హెచ్ఎం తీరుపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన విద్యాశాఖ కార్యాలయం దీనిపై సమగ్రంగా విచారణ చేసి రిపోర్టును అందించాలని డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీఈఓ కార్యాలయ అధికారి హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయురాలిని వేర్వురుగా విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉండగా చేర్యాలలోని కేజీబీవీలో సమ్మర్ క్యాంపు నిర్వహణ రిజిస్టరును పరిశీలించగా ఈఎల్స్ను పొందేందుకు నకిలీ సర్టిఫికెట్ సృష్టించిన విషయం బయట పడింది. డీఈఓ కార్యాలయం చేపట్టిన విచారణ, సేకరించిన స్టేట్మెంట్ రికార్డును రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. దీంతో కొందరు అఽధికారులు నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా ఈఎల్స్ కాజేసిన విషయం బయటకు రాకుండా పైరవీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈవిషయమై డీఈఓ కార్యాలయ అధికారి రామస్వామిని వివరణ కోరగా విచారణ రిపోర్టును రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
నిర్మాణ పనులు వేగిరం చేయండి
సిద్దిపేటరూరల్: అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన వివిధ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీలు, వీఓ, జీపీ భవనాలు, పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం జరుగుతున్న క్రమంలో వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. భూగర్భజలాల పెంపునకు ఇంకుడుగుంతలు, ఊటకుంటలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు 6,481 ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్లు పూర్తి కాగా, మిగతా ఇళ్లను సైతం పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అంతకుముందు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేశ్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీపీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్రెడ్డి, డిప్యూటీ సీఈఓ ,మిషన్ భగీరథ ఈఈ తదితరులు పాల్గొన్నారు.నేడే పల్స్ పోలియో.. సర్వం సిద్ధం: కలెక్టర్ సిద్దిపేటరూరల్: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని, 0–5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కల వేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న పల్స్ పోలియోను జిల్లా వ్యాప్తంగా 94,321 మంది చిన్నారులకు వేసేందుకు 568 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోజు వేయించుకోని చిన్నారులకు ఆశాలు, అంగన్వాడీలు ఇంటింటికీ తిరిగి పొలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకరించాలన్నారు. కలెక్టర్ హైమావతి అధికారులతో కలెక్టర్ సమీక్ష -
పెండింగ్ బిల్లులు క్లియర్
హుస్నాబాద్రూరల్: మాజీ సర్పంచ్ ఆత్మహత్యతో పెండింగ్ బిల్లుల చెల్లింపులో అధికారుల్లో కదలిక వచ్చింది. నాలుగు నెలలుగా సాకులు చెప్పిన అధికారులు మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ మరణంతో బకాయి బిల్లులను ఆగమేఘాల మీద క్లియర్ చేస్తున్నారు. మండలంలో అభివృద్ధి పనులకుగాను సర్పంచ్లకు చెల్లించాల్సిన నిధులు మొత్తం రూ.38 లక్షల 61 వేల 302 పెండింగ్లో ఉన్నాయి. అయితే రెండు రోజుల్లోనే రూ.16 లక్షల 20 వేల 339లకు సంబంధించిన బిల్లులను అధికారులు చెల్లించారు. బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులను పిలిపించుకొని మరీ బిల్లులు చెల్లిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే వరకు ఏ గ్రామంలో ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే విషయం అధికారులకు తెలియకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీపీడీపీలో లేవని.. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో నమోదు చేసిన పనులు చేపడితే 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. అయితే సర్పంచ్లు చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు జీపీడీపీలో లేవని అధికారులు బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తున్నారు. ఎంపీఓ, ఎంపీడీఓలు నిబంధనల గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యతో అధికారుల్లో కదలిక రూ.38.61 లక్షల బకాయిలకు -
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026
లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం.. చెల్లాచెదురైన చేపలుఎన్నాళ్లకొచ్చావె వానా... కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాన దంచికొట్టడంతో ఉపశమనం పొందారు. చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం పెద్ద పెద్ద ఉరుముల శబ్దంతో జోరుగా కురిసింది. జిల్లా కేంద్రంతోపాటు పలుప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రైతుల్లో సైతం ఆశలు చిగురించాయి. జోరువాన దృశ్యాలను సాక్షి కెమెరా ఇలా క్లిక్మనిపించింది. – సాక్షి స్టాఫ్ఫొటో గ్రాఫర్, సిద్దిపేట -
సన్న రకం వడ్లే వేయండి
డీఏఓ స్వరూపరాణి చేర్యాల(సిద్దిపేట): ఈ సీజన్లో రైతులు దొడ్డు రకం కాకుండా సన్న వడ్లు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని రామాంజనేయ ఫర్టిలైజర్స్ను స్థానిక ఎఓ అప్రోజ్తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని స్టాకు రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించారు. దుకాణానికి వచ్చిన రైతులతో మాట్లాడిన ఆమె సన్న వడ్లు సాగు చేయాలని వారికి సూచించారు. సన్న రకాల్లో బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్ 15048, జై శ్రీరాం, కేఎన్ఎం1638, కేఎన్ఎం7715, డబ్ల్యూజీఎల్44 వంటి ఏడు రకాలను ప్రభుత్వం సూచించిందని తెలిపారు. ఈ–పాస్ ద్వారానే విక్రయించాలి మద్దూరు(హుస్నాబాద్): ఎరువుల అమ్మకాలు ఈపాస్ యంత్రం ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. శనివారం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువుల విక్రయాలు ఈపాస్ ద్వారానే అమ్మాలని, లేదంటే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడమేకాకుండా లైసెన్సు రద్దు చేస్తామన్నారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో దూల్మిట్ట ఏఓ అఫ్రోజ్, ఏఈవోలు ఉన్నారు. ఐ అండ్ పీఆర్ క్రియేటివ్ డైరెక్టర్గా రాజు మద్దూరు(హుస్నాబాద్): ఐ అండ్ పీఆర్ క్రియేటివ్ డైరెక్టర్గా లద్నూరు గ్రామానికి చెందిన కొండ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజును నియమించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కల తొలగింపు వర్గల్(గజ్వేల్): ‘ప్రమాదం కమ్మేస్తోంది’ శీర్షికతో శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. వర్గల్ మండలం గుంటిపల్లి బస్టాండ్ వద్ద పిచ్చి మొక్కలు కమ్మేసి ప్రమాదకరంగా మారిన జంట ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ ఏఈ వాసుదేవరావు శనివారం పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్లను, కరెంటు తీగలను అల్లుకుపోయిన పిచ్చిచెట్లను యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా హుస్నాబాద్: సమస్యలు పరిష్కరించాలని వచ్చిన ప్రజలకు గౌరవం ఇవ్వకుండా అధికారులు అవమానించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బాధితులతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గూడ మల్లారెడ్డికి చెందిన స్థలంలో వేరొకరు అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ అధికారి వద్దకు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మీరు కౌన్సిలరా? ఏ పార్టీ పక్షాన వచ్చారు? అని అడగటం ఏమిటనీ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధికారిని పిలిపించి బాధితుల సమస్యను తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఎవరు వచ్చినా వారిని గౌరవించి సమస్యను సావధానంగా వినాలన్నారు. బాధితులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
కేంద్రం విధానాల వల్లే విద్యారంగం అస్తవ్యస్తం
గజ్వేల్: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం అస్తవ్యస్తంగా మారుతోందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గజ్వేల్లో విద్యారంగంపై కేంద్ర విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఛాత్రోస్ కీ గూంజ్’లో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యం, నీట్ పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసిగజ్వేల్లో నిరసన ర్యాలీ -
వైభవంగా శనిత్రయోదశి మహోత్సవం
వర్గల్(గజ్వేల్): విద్యాసరస్వతి క్షేత్రం శనివారం శనిత్రయోదశి మహోత్సవ వైభవంతో అలరారింది. పోటెత్తిన భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే శనీశ్వరునికి భక్తజన సామూహిక తైలాభిషేకాలు, మరోవైపు సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరస్వీకార పూజలతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో పరివారం భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని, గణపతి, వెంకటేశ్వరుడు, లింగేశ్వరుడు, శనీశ్వరులను దర్శించుకుని తరించారు. క్షేత్రంలో 1000 పైగా తైలాభిషేకాలు జరిగినట్లు మేనేజర్ రఘుపవన్ పేర్కొన్నారు.సర్పై అపోహలొద్దు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి దుబ్బాక: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రజలు ఎలాంటి అపొహలు పెట్టుకోవద్దని నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. శనివారం చేర్వాపూర్లో ‘సర్’ నిర్వహణ తీరుకు సంబంధించి మ్యాపింగ్ ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని తహసీల్దార్ మోతిసింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని అన్నారు. మృతి చెందిన, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను తొలగించడం జరుగుతుందన్నారు. -
హుస్నాబాద్లో దొంగల బీభత్సం
హుస్నాబాద్: ఒకే ఒక్కడు ఆరు దుకాణాల్లో చోరీ చేశాడు. భారీ మొత్తంలో బంగారం, నగదును అపహరించాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... పట్టణంలోని మెయిన్ రోడ్డులో తెలంగాణ బజార్, రాధికా కిరాణం, శంకర్ క్లాత్ షోరూం, సితార సెలెక్షన్, లావణ్య కిరాణా షాపు, ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో చోరీకి పథకం రచించాడు. వరుస క్రమంలో ఉన్న మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడగా, మిగితా మూడు ఇళ్లలో వీలుకాలేదు. అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో భవనాల వెనుక నుంచి ఓ దొంగ ముఖానికి మాస్క్ ధరించి ఇళ్లలోకి చొరబడ్డాడు. దుకాణాదారులు పైఅంతస్తులో నిద్రిస్తున్నారు. పైనుంచి కిందికి ఎవరూ రాకుండా తలుపులు మూసివేశాడు. రాధికా కిరాణంలో 15 తులాల బంగారం, 30 వేలు, లావణ్య కిరాణంలో రూ.12వేలు, తెలంగాణ బజార్లో పావు తులం బంగారం, రూ.13 వేలు నగదును ఎత్తుకెళ్లాడు. కాగా దుకాణాదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. దొంగ ఓ భవనంపై వదిలివెళ్లిన తాళం చెవి గుత్తి, పర్స్, బ్యాగ్, దుప్పటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్తో వేలి ముద్రలు, ఆధారాలను సేకరించారు. దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించగా, ఒక్కడే ముఖానికి మాస్క్ ధరించి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బంగారం, నగదు అపహరణ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ -
లెక్క
తేలని పింఛన్లబల్దియాల్లో కొనసాగుతున్న ఫేస్ రికగ్నిషన్ఆసరా, చేయూత పింఛన్ల లబ్ధిదారుల లెక్క ఇంకా తేలడం లేదు. లబ్ధిదారుల ధ్రువీకరణకు బల్దియాల్లో చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) సిబ్బందికి సవాల్గా మారింది. గత నెల 15 నుంచి జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ చేపట్టారు. పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు బల్దియా సిబ్బంది అన్వేషిస్తున్నారు. – సిద్దిపేటజోన్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రికార్డుల ప్రకారం 33,674 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 28,627మందిని గుర్తించారు. ఫేస్ ప్రక్రియలో ఇంకా 5,047మందిని రికార్డు నమోదు చేయాల్సి ఉంది. వీరిలో సుమారు 1500మంది లబ్ధిదారులు చనిపోయినట్లు సమాచారం. మిగతా 3,547మంది లెక్క తేలాల్సి ఉండగా వారి కోసం ఆయా బల్దియాల్లో సిబ్బంది అన్వేషణ సాగుతోంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 2,533 మంది లబ్ధిదారులకు అక్కడ పోస్ట్ ఆఫీస్ ద్వారా నెలవారీగా పింఛన్లు పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఫేస్ ప్రక్రియ అవసరం లేకపోయింది. ఆసరా, చేయూత కింద.. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులతో పాటు కులవృత్తి చేసే చేనేత, గీత కార్మికుల, కిడ్నీ, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం ఆసరా, చేయూత పింఛన్లు మంజూరు చేసింది. వీరికి ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా నెలవారీగా పింఛన్లు విడుదల అవుతున్నాయి. పింఛన్లలో అక్రమాలకు, అవినీతికి చెక్ పెట్టి వాస్తవ లెక్క కోసం ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ చేపట్టారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, ఆర్పీలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా ఫొటో, లైవ్ సెల్ఫీలను మొబైల్ ద్వారా తీస్తున్నారు. అదేవిధంగా ఫెషియల్ సిస్టం ఇబ్బందులు అధిగమించేందుకు బయో మెట్రిక్ పద్ధతిలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ లెక్కన లబ్ధిదారులలో వాస్తవంగా లైవ్ ఐడెంటిటీ పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పక్కా లెక్క కోసం.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆసరా, చేయూత ద్వారా అసలు లెక్క తేల్చడం సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. 33,674మందికి గాను 28,627మంది ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో పొందుపరిచారు. మిగతా 5,047మంది ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ వీరిలో 1,500 వరకు చనిపోయినట్టు క్షేత్ర స్థాయిలో లభించిన ప్రాథమిక సమాచారం మేరకు తేలింది. మిగతా 3,557లబ్ధిదారుల లెక్క తేలాల్సి ఉంది. కొందరు అందుబాటులో లేకపోవడం, ఆధార్ కార్డుల సీడింగ్ సమాచారం పొంతన లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉండడం, కొందరిని గుర్తింపు సమస్యగా మారడం లాంటి వివిధ కారణాలతో ఫేస్ రికగ్నిషన్ లెక్క కొలిక్కి రాలేదు. జిల్లా వ్యాప్తంగా 33,674 మందిలబ్ధిదారులు ఇప్పటి వరకు గుర్తించింది 28,627మందినే.. వివిధ కారణాలతో 5వేల మంది దూరం వీరిలో చనిపోయిన వారు 1500 పైనే.. మిగతా వారి కోసం అన్వేషణ -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. త్రీ టౌన్ ఎస్సై మల్లేశం కథనం ప్రకారం... దుద్దెడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు గుండెల్లి ఆంజనేయులు(38) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులుతో పాటు మరి కొందరితో కలిసి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నం.655/1గా చూపించి సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ యజమాని ఎడ్ల జ్యోతి, శ్రీనివాస్ దంపతులకు సుమారు ఆరేళ్ల క్రితం భూమిని విక్రయించి రూ. 47.87లక్షలు తీసుకున్నారు. 2022లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్ధారణ కావడంతో ఆంజనేయులు, ఆయన భాగస్వాములును సంప్రదించగా మరో చోట భూమిని చూపిస్తామని ఒప్పుకున్నారు. ఈ విషయంలో పంచాయితీ జరుగుతోంది. సయోధ్య కుదరకపోవడంతో కొనుగోలుదారుడు త్రీటౌన్ పోలీస్టేషన్న్లో రియల్ సభ్యులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో బెయిల్పై విడుదలైన గుండెల్లి ఆంజనేయులుతో పాటు ముఠా సభ్యులను కొనుగోలుదారుడు భూమి విషయమై అడిగితే భూమికి బదులుగా మరో చోట భూమిని చూపిస్తామని చెప్పారు. కాగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని దాట వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార భాగస్వాములు కలిసి తనను ఒక్కడినే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుందని గుర్తించిన ఆంజనేయులు కుటుంబీకులతో చెప్పుకుంటూ బాధపడ్డాడు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఫాంహౌస్ వద్ద ఉరివేసుకున్నాడు. మృతుని భార్య సంధ్యారాణి పలువురిపై త్రీటౌన్ పోలీస్టేషన్న్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్లో ఆత్మహత్యకు గల కారకుల పేర్లు రాశారు. మరో పేజీలో కూతురి పైచదువులు చదువుకొని గొప్ప డాక్టరు కావాలన్న నోట్ లభించింది. కాగా సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.న్యాయం చేయాలని ఆందోళన సిద్దిపేటజోన్: ఆత్మహత్య చేసుకున్న గుండెల్లి ఆంజనేయులు బంధువులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని భారత్నగర్లో శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఆంజనేయులు ఆత్మహత్య చేసుకోవడానికి శ్రీనివాస్ రెడ్డి కారణమని, నాయ్యం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రవీందర్రెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు.కొండపాకలో ఘటన -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
ఏసీపీ సదానందంహుస్నాబాద్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని ఏసీపీ సదానందం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలు విక్రయించడం నేరమని, వాటి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువత చెడు అలవాట్లకు గురికాకుండా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గోన్నారు. -
నాచగిరీశుని సేవలో..
టీఎస్ఎల్ఎస్ఏ మెంబర్ సెక్రటరీ వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీ నృసింహక్షేత్రాన్ని శుక్రవారం రాష్ట్ర లీగల్సర్వీసెస్ అథారిటీ(టీఎస్ఎల్ఎస్ఏ) మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయనకు ఈఓ రంగాచారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం, హారతి, తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సన్మానించారు. చేప పిల్లల పంపిణీ ఎప్పుడు? చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా మత్స్యకారుల బతుకులు ఆగం చేస్తోందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం చిన్నకోడూరులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి పాలనలో మత్స్యకారుల బతుకులు చితికిపోతున్నాయన్నారు. జూలై నెలలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాపయ్య, యాదగిరి, రాజు, దేవయ్య, రాజేష్, మహేష్, సత్తయ్యలు ఉన్నారు. పరిశోధనలకు ‘కావేరి’ కృషి అభినందనీయం వర్గల్(గజ్వేల్): విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కావేరి వర్సిటీ కృషి అభినందనీయమని, జాతీయాభివృద్ధికి తోడ్పడే నాణ్యమైన పరిశోధనలు, విద్యా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఐకార్(ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ఎస్ పరోడా సూచించారు. గౌరారంలోని కావేరి యూనివర్సిటీని సందర్శించారు. చాన్స్లర్ జీవీ భాస్కర్రావు, వీసీ ప్రవీణ్రావుతో కలిసి ఆయన అక్కడి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్, ప్రయోగశాలలు, డ్రోన్ అకాడమీ, పరిశోధనా క్షేత్రాలు, పాలీహౌస్లు, పరిశోధన సదుపాయాలను పరిశీలించారు. అధ్యాపకులు, పరిశోధకులతో మాట్లాడారు. వ్యవసాయరంగంలో సాంకేతికత ఆధారిత పరిశోధనలకు, ఆవిష్కరణలకు చేస్తున్న కృషి భేష్ అని కితాబునిచ్చారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివకుమార్ గజ్వేల్రూరల్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా శివకుమార్ నియామకమయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్ శుక్రవారం నూతన అధ్యక్షులను ప్రకటించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లికి చెందిన శివకుమార్ రెండోసారి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఏడెకరాల విస్తీర్ణంలో హరినామ క్షేత్రం సిద్దిపేటకమాన్: సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో ఏడెకరాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని హరినామ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని టీటీడీ మాజీ ఈవో కేవీ రమణాచారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సాయిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2న దేవనాథ్ జీయర్ స్వామి పర్యవేక్షణ, మంగళాశాసనములతో తిరుమల శ్రీవైష్ణవులచే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కలియుగంలో హరినామ స్మరణ ఎంతో ముఖ్యమైనదన్నారు. ఆసక్తిగల భక్తులు మహత్కార్యంలో భాగస్వాములు కావాలని కోరారు. -
వరుణా.. కరుణ చూపవా..
వర్షాలు కురవాలని జలాభిషేకంవర్షాలు కురవాలని మహిళలు జలాభిషేకం చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర దేవాలయంలో వరుణ దేవుడు కరుణించాలని ప్రత్యేక పూజలు చేశారు. బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మహిళలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – హుస్నాబాద్ -
రెండు చుక్కలు
చక్కని జీవితానికి..సిద్దిపేటకమాన్: జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజు వేయించుకోని చిన్నారులకు 29, 30వ తేదీన వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ ధనరాజ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పోస్టర్ను ఆవిష్కరించి, ప్రణాళికలు రూపొందించారు. డీఎంహెచ్ఓ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమంపై శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు.. 94,321 జిల్లాలో వైద్యారోగ్యశాఖ నివేదికల ప్రకారం 2,54,286 గృహాలు ఉండగా 10,17,143మంది జనాభా ఉన్నారు. ఇందులో 0నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్నారులు 94,321మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ పీహెచ్సీల పరిధిలో 568 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 32 ట్రాన్సిస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసి, పలు రూట్లలో 57మంది సూపర్వైజర్లను నియమించారు. మరో 37 మొబైల్ టీంలు పర్యవేక్షించనున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు వచ్చిన 1,03,800 డోసులను అన్ని పీహెచ్సీలకు పంపిణీ చేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తి ప్రియాంక తెలిపారు.రేపే పల్స్ పోలియో సర్వం సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ -
3,073 మంది ఓటర్లు..
జిల్లాలో 18 సొసైటీల పరిధిలో 5,652 మంది చేనేత కార్మికులు సభ్యత్వం కల్గి ఉన్నారు. అయితే చనిపోయిన వారిపేర్లు తొలగించగా తుదిజాబితా ప్రకారం 3.073 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా దుబ్బాక సంఘంలో 1,502 ఓటర్లు, సిద్దిపేట హెచ్డబ్ల్యూసీఎస్లో 192, ఆదర్శ సిద్దిపేటలో 46, ప్రాజెక్టు హెచ్డబ్ల్యూసీఎస్ సిద్దిపేటలో 123 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇర్కోడ్ సొసైటీలో 59, వీరారెడ్డిపల్లిలో 82, తిరుమల సొసైటీ సిద్దిపేట లో 73, శ్రీరాములపల్లిలో 64, పొట్లపల్లిలో 43,గజ్వేల్లో 237, ధర్మారంలో 56, లింగారెడ్డిపల్లిలో 53, దుద్దెడలో 147, చేర్యాల చేనేత సొసైటీలో 264, చేర్యాల ఉన్ని సంఘంలో 77, గజ్వేల్ ఉన్ని సంఘంలో 20, చెర్లతోటపల్లి సంఘంలో 35 మంది ఓటర్లు ఉన్నారు. -
విత్తు మొలకెత్తవా..
బొట్టు బొట్టు సాగుకు పట్టి..వానాకాలంలో చినుకు జాడ కరువైంది. పుడమిలో పడ్డ విత్తు మొలకెత్తాలంటే గగనంగా మారింది. దుక్కిలో విత్తుకున్న రైతులు వాన జాడకోసం దిక్కులు చూస్తున్నారు. విత్తనాలను మొలకెత్తించడానికి నానా అగచాట్లుపడుతున్నారు. వానపై ఆశలు చాలించుకున్న రైతులు డ్రిప్పు పైపులను పొలమంతా పరుచుకుంటున్నారు. బొట్టు బొట్టును ఒడిసి పడుతూ విత్తనాలను మొలకెత్తేలా చెమటోడ్చుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రిప్పుపైపులతో నీటి తడిని అందిస్తూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
ఇక చేనేత పోరు
దుబ్బాక: చేనేత కార్మికుల ఎదురుచూపులకు తెరపడనుంది.13 ఏళ్ల నిరీక్షణ అనంతరం చేనేత సహకార ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో సహకార పోరుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 29న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చేనేత సంఘాల ఓటరు జాబితా సిద్ధమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఎట్టకేలకు ఎన్నికలకు ముహుర్తం వెలువడనుండటంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల నిరీక్షణ.. చేనేత సహకార సంఘాలకు 13 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. సంఘాలు ఆర్థికంగా పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకపోవడంతో నేతన్నలకు పని దొరకక వారి కుటుంబాల పరిస్థితి కడు దయనీయంగా తయారైంది. చివరిసారిగా 2013లో చేనేత సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018 లో వాటి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రతీ 6 నెలలకు ఒకసారి చొప్పున ఇప్పటి వరకు ప్రభుత్వం 16 పర్యాయాలు పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తూ వచ్చింది. రికార్డులు అందజేయకపోవడంతో.. జిల్లాలో 18 చేనేత, ఉన్ని సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఉన్ని సహకార సంఘం రికార్డులు అందజేయకపోవడంతో ఎన్నికలకు దూరంకానుంది. దీంతో 17 సంఘాలకే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో ఏడు సొసైటీలు సిద్దిపేట, ధర్మారం, చేర్యాల, గజ్వేల్ ఉన్ని సహకార సంఘాలు, దుద్దెడ, వీరారెడ్డిపల్లి, చెర్లతోటపల్లి చేనేత సంఘాలు నామమాత్రంగా ఉన్నాయి.సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధం రెండు రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం జిల్లాలో 18 సహకార సంఘాలు సంతోషంలో నేత కార్మికులు -
హామీలు అమలు చేసేది ఎప్పుడో?
తొగుట(దుబ్బాక)/మిరుదొడ్డి(దుబ్బాక): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీడీ కార్మికులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. తొగుటలో బీడీ కార్మికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని కోరారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి సుమారు ఏడు లక్షల మంది జీవిస్తున్నారని, ఎన్నోయేళ్లుగా బీడీలు చుట్టినా ఆర్థికంగా మాత్రం వృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనిదినాలు తగ్గిపోయి ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నాయని వాపోయారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 29న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వసంత, బీడీ కార్మికులు అరుణ, హేమలత, లావణ్య, కవిత, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు. మిరుదొడ్డిలోని పలు బీడీ కార్మికుల కార్ఖానాలను సీఐటీయూ మండల కార్యదర్శి మద్దెల అంజయ్య సందర్శించారు. ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బీడీ కార్మికులు కల్యాణి, నిరీక్షణ, అలేఖ్య, కౌసల్య పాల్గొన్నారు. 29న చలో కలెక్టరేట్ బీడీ వర్కర్స్ యూనియన్ నేత భాస్కర్ -
సర్కు సహకరించాలి
కొండపాక(గజ్వేల్): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు వచ్చే బీఎల్ఓలకు సహకరించుకుంటూ ఓటు హక్కును పక్కాగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. కొండపాక మండలం దుద్దెడలో సర్వే ప్రక్రియను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోకుండా చూడటంతో పాటుగా నకిలీ ఓటరులను జాబితాలోంచి తొలగించేందుకు సర్వేను చేపట్టిందన్నారు. సర్వేలో భాగంగా ప్రతీ ఇంటికీ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, వివరాలు సేకరిస్తారన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్ఓలు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్రెడ్డి, బీఎల్ఓ, బీఎల్ఏలు, సర్పంచ్ శివకుమార్, నాయకులు గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కును పక్కాగానమోదు చేయించుకోవాలి కలెక్టర్ హైమావతి -
నూతన ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా సంతోష్
సిద్దిపేటకమాన్: జిల్లా నూతన ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా బి.సంతోష్ నియామకమయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన శ్రీనివాసమూర్తి పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా బి.సంతోష్ను నియమించారు. గురువారం బాధ్యతలు తీసుకున్న సంతోష్ కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క ను అందజేశారు. జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఉద్యమకారులకుసముచిత న్యాయం చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం: ఎమ్మెల్సీ కోదండరాం దుబ్బాక: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పల్లెల నుంచి పట్నం వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బైరి రమేశ్, ర్యాకం శ్రీరాములు, కాల్వ నరేష్, ఆస స్వామి, కాల్వ లింగం తదితరులు ఉన్నారు. చేనేత పరిశ్రమను కాపాడుకుందాం దుబ్బాక పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి కోదండరాం సందర్శించారు. ఈ సందర్భంగా మగ్గాలను పరిశీలించి కార్మికుల వెతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానన్నారు. దేశంలోనే దుబ్బాక గొల్లభామ చీరలు చాలా ప్రసిద్ధి అని, ఇలాంటి గొప్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దుబ్బాక పట్టణంలోని 14, 15 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లోనూ కోదండరాం పాల్గొన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాధికారి వరుగంటి శాస్త్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి 11వరకు జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొత్తం 332 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. ఇందులో 210 మంది బాలురు, 122 మంది బాలికలు ఉన్నారన్నారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.కొనసాగుతున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ ప్రవేశం కోసం రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. గురువారం 176 మంది విద్యార్థులు హాజరయ్యారు. ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు విద్యార్థులకు లాగిన్ ఐడీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఈనెల 26 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల ‘సర్దుబాటు’ను సవరించాలి డీఈఓకు యూటీఎఫ్ కమిటీ వినతి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం డీఈఓ వరుగంటి శాస్త్రిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్వలీ, యాదగిరి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అమలుకు విద్యార్థుల నమోదు సంఖ్యను జూలై 31వరకు తీసుకోవాలన్నారు. రెండేళ్లుగా కొనసాగిస్తున్న విధానాన్ని ఈ ఏడాది కూడా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్(ఏఎంఓ) పోస్టును సీనియర్ గెజిటెడ్ హెచ్ఎం లేదా సీనియర్ ఎస్ఏతో భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటకిరణ్, జిల్లా కమిటీ సభ్యులు గిరిబాబు, నర్సింలు, రాజేందర్, రాజనర్సింలు, బాలకిషన్, లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ‘హ్యూమన్ రైట్స్’ జిల్లా అధ్యక్షుడిగా భీమప్ప గజ్వేల్: ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన భీమప్ప నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు రమేష్గుప్త నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భీమప్ప మాట్లాడుతూ అసోసియేషన్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తానని అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయండిసిద్దిపేటరూరల్: ఆశాసీ్త్రయమైన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు వారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి సూపరింటెండెంట్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 27వేల పాఠశాలలను 4వేల పాఠశాలలకు కుదిస్తామని సీఎం చెప్పడం సరికాదన్నారు. గ్రామం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ పాఠశాల తప్పనిసరి అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్వలిఅహ్మద్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
జాప్య రహదారి
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడున్నరేళ్లయినా పనులు పూర్తికావడంలేదు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు. ఈ మార్గంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేటనత్తనడకన నేషనల్ హైవే నిర్మాణంఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి(765డీజీ) రహదారి 133.61 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.1,461కోట్లను కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.11 నవంబర్ 2022న ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా జాతీయ రహదారుల శాఖ విభజించింది. అందులో మొదటి ప్యాకేజీ మెదక్ నుంచి సిద్దిపేట 69.97కిలో మీటర్లు విభజించి రూ.882 కోట్లు, రెండో ప్యాకేజీ సిద్దిపేట నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్లకు రూ. 579కోట్లను కేటాయించారు. ఈ రోడ్డును ఫోర్లేన్ రోడ్డు 15మీటర్ల వెడల్పుతో, సాధారణ దగ్గర డబుల్ రోడ్తో 10మీటర్లు విస్తరించారు. అటవీ శాఖ అనుమతి పెండింగ్ కోహెడ మండలం నాగసముద్రాల నుంచి గండీమైసమ్మ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జరగడం లేదు. దాదాపు 1.5కిలో మీటర్లు అటవీ శాఖ పరిధిలో ఉంది.. దీంతో అటవీ శాఖ అనుమతులు ఇంకా పెండింగ్లో ఉంది. జాతీయ రహదారులు, అటవీ శాఖ సమన్వయ లోపంతోనే పనులు జరగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముందుకు సాగని ఫ్లైఓవర్.. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే మార్గంలో మిట్టపల్లి వద్ద రైల్వే ట్రాక్ ఉంది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రెండున్నరేళ్లుగా బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రైలు రాకపోకలు సాగిస్తోంది. రైల్వే గేట్ వేస్తుండటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మూడున్నరేళ్లుగా సాగుతున్న విస్తరణ పనులు ఇంకాపూర్తికాని ఫ్లైఓవర్లు.. అనుమతులు రాక పలుచోట్ల పనులకు బ్రేక్ఇబ్బంది పడుతున్నాం నాగసముద్రాల వద్ద రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. అంతటా రోడ్డు నిర్మాణం జరిగింది. ఒక్క మాదగ్గరే నిలిచిపోయింది. భారీ వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తే దుమ్ము లేస్తోంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. – చిరంజీవి, వాహనదారుడు, నాగసముద్రాల అనుమతులు రాకపోవడంవల్లే.. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో కొంత ఆలస్యమైంది. ఇచ్చిన సమయం దాటిపోవడంతో సదరు కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. గత సంవత్సరం నుంచి పనులు కావడం లేదు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలిపాం. త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తాం. – అన్నయ్య, డీఈ, జాతీయ రహదారులుబైపాస్లో నిలిచిన పనులు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు దాదాపు మూడు కిలో మీటర్లు రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణం పనులు మధ్యలో నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎన్సాన్పల్లికి వెళ్లే దారిలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి ఒక్కో దగ్గర ఎత్తు.. మరొక దగ్గర వంపుగా ఉండటంతో వాహనాలు అదపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
నాచ‘గిరి’ ప్రదక్షిణం.. పోటెత్తిన భక్తజనం
స్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి అలరారింది. క్షేత్రంలో నృసింహ నామం మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి గురువారం ఉదయం ఉత్తర ద్వారం వద్ద నృసింహునికి హారతి సమర్పించి ‘గిరి’ ప్రదక్షిణ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, వేలాది భక్తులు స్వామివారిని అనుసరిస్తూ, నృసింహుని స్మరిస్తూ నాచగిరి కొండలు, హరిద్రానది తీరం చుడుతూ ఉత్తరద్వారం వద్దకు చేరుకున్నారు. గర్భగుడిలో లక్ష్మీనృసింహులను దర్శించుకున్నారు. క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. – వర్గల్(గజ్వేల్) -
డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడుదాం
సిద్దిపేటఎడ్యుకేషన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదామని జిల్లా కలెక్టర్ హైమవతి యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్లో గురువారం ఏర్పాటు చేసిన ర్యాలీని పోలీస్ కమిషనర్(సీపీ) రష్మీపెరుమాళ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా డ్రగ్స్ దిర్వినియోగం, అక్రమ రవాణపై ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు, ర్యాలీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాల దుర్వినియోగం, వాటి రవాణాపై అవగాహన పెంపొందింంచుకుని వాటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలపునిచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి జీవితాలను కాపాడుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. తల్లిదండ్రలు పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, ఒక వేళ వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా, నూతన వ్యక్తులతో కలిసినా మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు. సీపీ రష్మీపెరుమాళ్ మాట్లాడుతూ డ్రగ్స్తో యువత జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే నేరమని, వారి సమాచారాన్ని పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం డ్రగ్స్కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటు పడుతామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల జిల్లా అధికారులు శారధ, విజిత, రాము, గణేశ్, ప్రిన్సిపల్ దేవయ, అధ్యాపకులు సుధాకర్రెడ్డి, కనకచంద్రం, అశోక్, ధరిపల్లినగేశ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు కలెక్టర్ హైమావతి పిలుపు ప్రభుత్వ జూనియర్ కళాశాలవిద్యార్థుల ర్యాలీ హాజరైన సీపీ రష్మీపెరుమాళ్ -
పల్లెల ప్రగతికి కృషి
మిరుదొడ్డి(దుబ్బాక): పల్లెల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అందెలో ఎంపీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.66 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కాగా మిరుదొడ్డిలోని అరుంధతి కల్యాణ మండపంలో తాగునీటి బోరు బావి తవ్వకంతో పాటు, కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎంపీకి అంబేడ్కర్ చైతన్య సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, జిల్లా నాయకులు ఎల్ముల దేవరాజు, భిక్షపతి, జిల్లా టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ల మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి ఎంపీ రఘునందన్ రావు -
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచామని, అదే స్థాయిలో సర్ ప్రక్రియలోనూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావా లని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో సర్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్లో ఇప్పటివరకు మ్యాపింగ్ జరిగిందని, ప్రస్తుతం ఇంటింటికీ సిబ్బంది వస్తున్నారని, వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు సర్పై అవగాహన కల్పించి పాల్గొనేలా చూడాలన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేస్తూ.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఎన్యూమరేషన్ పత్రాలను నింపే సమయంలో సహకరించాలని సూచించారు. ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాలి.. నియోజకవర్గ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హరీశ్రావు సూచించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. మంజూరు కానీ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. బిల్లులు సైతం వెంటనే చెల్లించాలన్నారు. హరితహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి లక్ష మొక్కలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికి 70వేల మొక్కలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పంచాయతీ సెక్రటరీ పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. మృతుల కుటుంబాల పరామర్శ సిద్దిపేటఅర్బన్: మండలంలోని పొన్నాల గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురు మృతుల కుటుంబ సభ్యులను గురువారం రాత్రి ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. పొన్నాల మాజీ సర్పంచ్ దుర్గయ్య కూతురు మృతి చెందగా పరామర్శించి ఓదార్చారు. ‘సర్’పై ప్రజలకు అవగాహన కల్పిద్దాం బూత్ లెవల్ ఏజెంట్లుఅప్రమత్తంగా ఉండాలి మాజీ మంత్రి హరీశ్రావు -
విధుల్లో అలసత్వం తగదు
● మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ● వానాకాలం జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం ● సిద్దిపేటలో చేర్యాల పాలకవర్గం పర్యటనసిద్దిపేటజోన్: విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తలు గూర్చి శానిటరీ సిబ్బంది, అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. నీరు ప్రవహించే నాళాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట కోసం పనిచేయాలని సూచించారు. అంతకుముందు పట్టణంలో చేర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం పర్యటించి వివరాలు సేకరించింది. కోమటి చెరువు, మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, ఇర్కోడ్ స్లాటర్ హౌస్, స్వచ్చ బడి, డంపు యార్డు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం పరిశీలించారు. -
క్రీడలతోనే ఆరోగ్య సమాజం
సిద్దిపేటజోన్: క్రీడల ద్వారా ఆరోగ్య సమాజం నిర్మాణం జరుగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడలను జీవన విధానంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తితో స్నేహం, ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, ప్రతిభ, విలువలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శాస్త్రి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, అసోసియేషన్ చైర్మన్ మోహన్రెడ్డి, యువకులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు జిల్లా కేంద్రంలో ఒలింపిక్ డే రన్ -
మాజీ సర్పంచ్ది ప్రభుత్వ హత్యే
హుస్నాబాద్రూరల్: మండల పరిధిలోని మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సర్పంచ్ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య ఆరోపించారు. బుధవారం మహ్మదాపూర్లో సంపత్ కుటుంబాన్ని ఓదార్చి పాడే మోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 31 నెలల నుంచి పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. మాజీ సర్పంచ్ల పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలన్నారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వెంట గుంటి మధుసూధన్రెడ్డి, నెమలి సుభాష్గౌడ్, విద్యాసాగర్, నర్సింహులు, గద్దల రమేశ్, రాము, కుమార్, దినేష్రెడ్డి ఉన్నారు. బిల్లులు చెల్లించకుంటేమంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం సర్పంచ్ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య -
విద్యార్థినికి విద్యాశాఖ కమిషనర్ అభినందన
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పాఠశాల విద్యార్థిని అంజలిని విద్యాశాఖ కమిషనర్ అభినందించారు. తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీఎంయూఎన్) సెషన్స్లో రాణించడంతో బుధవారం హైదరాబాద్లో విద్యాశాఖ కమిషనర్ నికోలస్ అభినందించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి తెలిపారు. ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కృషిని అభినందిస్తు ప్రశంసా పత్రాలను అందించినట్లు తెలిపారు. డీఐఈఓ తనిఖీ బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ రవీందర్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అడ్మిషన్, హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేర్పించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్యను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. -
పనుల్లో నాణ్యత తప్పనిసరి
సిద్దిపేటరూరల్: హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కోహెడ, అక్కన్నపేట మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న ఉపాధి హామీ సీసీరోడ్డు, బీటీరోడ్డు, హెల్త్ సబ్సెంటర్, అంగన్వాడీ మరుగుదొడ్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్ మరమ్మతులు వంటి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. 15వ ఆర్డిక సంఘం కింద చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి ఫోర్లేన్ నిర్మాణం వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వందశాతం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, అన్ని మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు రాని ఉపాధ్యాయులపై చర్యలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ రన్లో పాల్గొని మధ్యాహ్నం అయినా పాఠశాలకు రాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు టి.సతీష్ ఒలింపిక్ రన్ ఉందని వెళ్లి మధ్యాహ్నం 2.30 దాటినా రాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ హైమావతి హుస్నాబాద్ నియోజకవర్గఅధికారులతో సమీక్ష -
జీపీ బిల్లులు రూ.5.08 లక్షలు పెండింగ్
హుస్నాబాద్రూరల్: మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ సంపత్కు జీపీ నుంచి రూ.5.08లక్షలు చెల్లించాల్సి ఉందని డీఎల్పీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఎంపీడీఓ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ సంపత్ గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసినప్పటికీ జీపీడీపీ నమోదు చేయకుండా బిల్లులు చెల్లించడం కార్యదర్శులుగా ఇబ్బందిగా మారిందన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పొందుపర్చిన పనులను చేపడితే పంచాయతీ నిధుల నుంచి బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసినప్పటికీ జీపీడీపీ తీర్మానంలో నమోదు చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందన్నారు. మొత్తం రూ.6.73లక్షలకు మే 19న రూ.1.65 లక్షలు మాజీ సర్పంచ్కు చెల్లించినట్లు వివరించారు. సమావేశంలో సూపరింటెండెంట్ శంకర్, మోహన్లు ఉన్నారు.


