కబడ్డీ సీనియర్‌ జట్టుకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ సీనియర్‌ జట్టుకు ఎంపిక

Feb 22 2026 8:37 AM | Updated on Feb 22 2026 8:37 AM

కబడ్డీ సీనియర్‌ జట్టుకు ఎంపిక

కబడ్డీ సీనియర్‌ జట్టుకు ఎంపిక

అక్కన్నపేట(హుస్నాబాద్‌): చౌటపల్లికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు పులికాశి వంశీకృష్ణ రాష్ట్ర సీనియర్‌ జట్టుకి ఎంపికయ్యారు. గుజరాత్‌ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ పత్తిపాక లావణ్య, మాజీ సర్పంచ్‌ గద్దల రమేష్‌ మాట్లాడుతూ క్రీడాకారులకు కేరాఫ్‌ చౌటపల్లి పుట్టినిల్లుగా నిలుస్తోందన్నారు. ఈ గ్రామం నుంచి అనేకమంది కబడ్డీతో పాటు వివిధ క్రీడాల్లో జాతీయ, అంతార్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. అందులో భాగంగా వంశీకృష్ణ జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపిక కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement