breaking news
Mahabubabad
-
క్రీడలతో మానసికోల్లాసం
స్టేషన్ఘన్పూర్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నిట్ వరంగల్ పీడీ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 12 కళాశాలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని, పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ స్టేషన్ఘన్పూర్లో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం -
ప్రపంచం దృష్టి భారత్ వైపు..
కేయూ క్యాంపస్: దేశ పునర్మిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమైందని, ప్రపంచం దృష్టి భారత్ వైపు చూస్తోందని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ అన్నారు. రెండురోజుల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో కొనసాగిన రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టికోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని దేశం కోసం పనిచేసేది ఏబీవీపీ కార్యకర్తలేనన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ హాస్టళ్ల కన్వీనర్ జీవన్, కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ ,కార్యదర్శి జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జాతీయసహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ -
నేల ఆరోగ్యంతోనే రైతులు బాగు
● ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి హన్మకొండ: నేల ఆరోగ్యంతోనే రైతులు బాగుంటారని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీ య రైతు దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ క్రమంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిచారు. కార్యక్రమంలో మధ్య తెలంగాణ మండలంలోని రైతు విజ్ఞాన కేంద్రాలైన వరంగల్, జోగిపేట, తోర్నాల కోఆర్డినేటర్లు డాక్టర్ ఎ.విజయభాస్కర్, డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
కోర్టు ఆవరణలో మరదలిపై బావ దాడి
జనగామ : కక్షలను మనసులో పెట్టుకుని కోర్టు పేషీకి హాజరైన మరదలి(తమ్ముడి భార్య)పై బావ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణరెడ్డి, బాధితురాలి తల్లిదండ్రులు ముశిని బాలయ్య, యాదమ్మ కథనం ప్రకారం.. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన బూడిద అర్చన అలియాస్ అండాలుకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సుంచనకోటకు చెందిన బూడిద అశోక్తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోగా, ఇరువర్గాల కేసు నమోదుతో వారు కోర్టు పేషీకి హాజరవుతున్నారు. ఈ క్రమంలో సుంచనకోట, కట్కూరు నుంచి రెండు వర్గాలుగా మంగళవారం కోర్టుకు వచ్చారు. అందులో బాధితురాలి బావ నర్సయ్య సైతం ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి అర్చన చెట్టుకింద కూర్చుని ఉండగా అదే సమయంలో నర్సయ్య బండరాయితో అర్చన తలపై రెండు సార్లు మోదాడు. మూడో సారి దాడిచేసే క్రమంలో అక్కడే ఉన్న కొందరు అడ్డుకోవడంతో ప్రాణా పాయం తప్పింది. వెంటనే గాయపడిన అర్చనను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పోలీసులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నర్సయ్యను అదుపులోకి తీసుకుని బాధితురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బండరాయితో మోది హత్యాయత్నం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు, ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
అంతా గందరగోళం!
సాక్షి, మహబూబాబాద్: గత విద్యాసంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగిన విద్యాశాఖ ఈ ఏడాది వెనుకబడిపోయింది. ఇందులో పంచాయతీ ఎన్నికలు, ఉపాధ్యాయులకు శిక్షణ, డ్యూటీల పేరుతో 15రోజులకు పైగా పాఠాలు సాగలేదు. దీనికి తోడు మారిన అధికారులు, ఖాళీలు, సమన్వయలోపం.. అంతా వార్షిక పరీక్షల ఫలితా లపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ముందస్తు ప్రణాళిక.. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆతర్వాత సంవత్సరం కాస్త మెరుగుపడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపుతో గత విద్యా సంవత్సరం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏఏఈఈఆర్టీ రూపొందించిన కరదీపికలతోపాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్తోపాటు, పలు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు వరంగల్, హనుమకొండ నుంచి సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులను పిలిపించి ప్రత్యేక క్లాసులు చెప్పించారు. వీటన్నింటి ఫలితంగా 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. మరో 80రోజుల్లో పరీక్షలు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు వంద రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేసిన విద్యాశాఖ ఈ ఏడాది అంత ఉత్సాహం చూపించడం లేదు. గతంలో డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేయించి వందరోజులకు ముందుగా స్లిప్ టెస్ట్లు పెట్టారు. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందుకోసం దాతల సహకారం తీసుకొని విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. కాగా, ఈ ఏడాది మార్చి 14నుంచి పరీక్షల నిర్వహణ టైంటేబుల్ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం సరిగ్గా 80రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రణాళికలే తయారు చేయకపోవడం శోచనీయం. విద్యార్థుల స్టడీ మెటీరియల్ కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల వివరాలు.. మరో 80రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ఎన్నికలతో అంతా అస్తవ్యస్తం ముందుకు సాగని ప్రణాళికలు మెటీరియల్ కోసం దాతలవైపు చూపు సిలబస్ గురించి ఆలోచించరా? గత సంవత్సరం పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో వచ్చిన దక్షిణామూర్తి జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. జిల్లానుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితిలో స్వచ్ఛంద పదవీ విరమణ పొంది వెళ్లిపోయారు. అయితే జిల్లా పరిస్థితిని చూసి జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏడీ రాజేశ్వర్కు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకోగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. ఈ పనులపై 15రోజులకుపైగా కాలయాపన జరిగింది. దీనికి తోడు ఏఎంఓగా పనిచేసిన ఆజాద్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. అలాగే ఉద్యోగులు, కో–ఆర్డినేటర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటివరకు ప్రణాళిక కాదుకదా.. అసలు సిలబస్ గురించి ఆలోచించిన వారు లేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.విద్యా సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో రాసిన వారు స్థానం2022–23 8,461 7,227 85.54 22 2023–24 8,178 7,738 94.62 12 2024–25 8,184 8,126 99.29 01ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఆలోపే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే పనిలో ఉన్నాం. సిలబస్ను నాలుగు భాగాలుగా విభజించి టెస్ట్లు నిర్వహిస్తాం. జిల్లా ఉన్నతాధికారులతో హైస్కూల్ హెచ్ఎంల సమావేశం నిర్వహించి టెన్త్ ఫలితాల ప్రాముఖ్యతను వివరిస్తాం. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తాం. – రాజేశ్వర్, డీఈఓ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
రేగొండ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని రామన్నగూడెం తండా గ్రామంలో జరిగింది. ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అజ్మీరా రూప్లా నాయక్ (75) తన మొక్క జొన్న పంటకు నీరు పారించేందుకు వెళ్లాడు. మోటారు ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రైవేట్ భవనం పరిశీలన
కురవి: మండల కేంద్రంలో ప్రైవేట్ భవనాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతిగృహం నిర్వహణ కొనసాగుతోంది. హాస్టల్ను వేరే చోటుకు మార్చేందుకు గతంలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల కొనసాగిన భవనాన్ని ఆయన పరిశీలించా రు. అనంతరం ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ విజయ, ఆర్ఐ రవికుమార్ భవనాన్ని పరిశీలించి, సౌకర్యాలు తెలుసుకున్నారు. నేడు లక్ష తులసి అర్చన మహబూబాబాద్ రూరల్: ధనుర్మాసవ్రత మహోత్సవాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీరామ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి అర్చన బుధవారం జరగనుందని ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ.కృష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉదయం 9గంటలకు ప్రారంభంకానున్న లక్ష తులసి అర్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. విష్ణు సహస్ర నామాలు చదివే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. డిపో అభివృద్ధికి పాటుపడాలి నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు, సిబ్బంది పాటుపడాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ సూచించారు. డిపోలోని సెక్షన్లను పరిశీలించి మంగళవారం ఉద్యోగులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మేడారం జాతరకు ఆర్టీసీ మరింత సేవలు అందించేలా సిద్ధం కావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ వి.కల్యాణి, డిపో సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్ పాపిరెడ్డి, రాములు, ఏడీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. దాతలు ముందుకు రావాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వీ వాటర్ ప్లాంట్ను డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దేశం, సొంత గ్రామం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం యూత్ సభ్యులను సన్మానించి అభినందించారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, పాఠశాల హెచ్ఎం సిరి నాయక్, ఉపాధ్యాయులు వాసుదేవ్, రవీందర్నాయక్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వనదేవతలకు భక్తుల మొక్కులు ఎస్ఎతాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చా రు. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద జల్లు స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. యాటలను మొక్కుగా సమర్పించారు. అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనా లు ఆరగించారు. అలాగే మేడారం పనుల పరి శీలనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, ధనసరి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారువేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన, భక్తుల రద్దీతో మేడారంలో సందడి నెలకొంది. -
స్వగ్రామం చేరిన ఆజాద్..
● ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు గోవిందరావుపేట : ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న మంగళవారం తన స్వగ్రామం మండల పరిధిలోని మొద్దులగూడేనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆజాద్ మాట్లాడారు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగానన్నారు. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన తాను ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నెల రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. కాగా, అంతకు ముందు ఆజాద్ అలియాస్ గోపన్న తన తల్లి లచ్చమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి ● వంగాలపల్లిలో ఘటన చిల్పూరు: బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్ స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి (54) ఆటోలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలోని ఎస్బీఐకి వస్తూ కరుణాపురంలో దిగాడు. అక్కడ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా స్టేషన్ఘన్పూర్ నుంచి హనుకొండకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కదిరె సాయివివేకానందరెడ్డిపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, డైనింగ్ హాల్, వంటశాల గదులు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడి ఆహారం అందించాలన్నారు. రాత్రివేళలో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలన్నారు. స్నానానికి వేడి నీరు అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయించాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారి పరిధిలో ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తప్పని యూరియా కష్టాలు
● క్యూకట్టిన రైతులు ● నిరాశపరిచిన ప్రత్యేక యాప్ మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వదిలిపెట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు ఎదురుచూశారు. వానాకాలం పంటల సాగు ముగించుకుని యాసంగి పంటల సాగు కోసం రైతులు పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రైతులు మొక్కజొన్న, మిర్చి సాగు చేయడంతో పాటు యాసంగి వరి నార్లు పోసుకుని వరి పంట సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మూడు పంటలకు కూడా యూరియా తప్పనిసరి అని భావించిన రైతులు ఆ బస్తాల కోసం రెండు మూడు రోజుల క్రితం వరకు ప్రత్యేక యాప్ వస్తుందని ఎదురు చూశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం నిర్ణయించిన ప్రత్యేక యాప్ కార్యకలాపాలు కొద్దిరోజుల వరకు నిలిపివేస్తున్నారని చెప్పడంతో యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న, మిరప సాగు చేసిన రైతులు యూరియా కోసం మానుకోటలోని పీఏసీఎస్ వద్దకు తెల్లవారుజామునే చేరుకోగా క్యూలో వేచిఉండడం కనిపించింది. అదేవిధంగా శనిగపురం గ్రామంలోని యూ రియా విక్రయ కేంద్రం వద్ద కూడా రైతులు బస్తాల కోసం క్యూలో వేచిఉండగా స్టాకు ఉన్నంత మేరకు బస్తాలను సంబంధిత అధికారులు, సిబ్బంది పోలీ సు బందోబస్తు మధ్య రైతులకు అందజేసి మిగిలిన రైతులను తర్వాత రమ్మని చెప్పి పంపించారు. మా నుకోట పీఏసీఎస్ పరిధిలో 444బస్తాల యూ రియా, శనిగపురం విక్రయ కేంద్రం పరిధిలో 666బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశామని మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, సొసైటీ సీఈఓ ప్రమోద్ తెలిపారు. -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25న ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధ్దన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలు జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16‘పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
వ్యక్తి దారుణ హత్య!
కేసముద్రం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచాతండాజీపీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భుక్య వీరన్న(45) కౌలు వ్యవసాయంతోపాటు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫోన్ రావడంతో తాను బయటకు వెళ్లొస్తానని భార్య విజయకు చెప్పి బైక్పై వెళ్లాడు. అర్ధర్రాతి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంటికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తండాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా ప్రధాన రహదారి పక్కన వీరన్న మృతి చెంది ఉండడాన్ని గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తల వెనుకవైపు ఆయుధంతో కొట్టినట్లు గాయం ఉండడంతోపాటు మృతదేహానికి కొంత దూరంలోని వ్యవసాయ భూమిలో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని మరోచోటు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతదేహంపై బైక్ ఉండడంతో రోడ్డు ప్రమాదంగా దుండగులు చిత్రీకరించినట్లు పలువురు భావిస్తున్నారు. అనంతరం క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, బయటకు వెళ్లొస్తానని రాత్రి ఇంచి నుంచి వెళ్లిన వీరన్న.. తెల్లవారుజామున శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి అరెస్ట్ నెల్లికుదురు : లైంగికదాడి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇనుగుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్సై కరుణాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఓ వివాహితపై ఈ నెల 22న గ్రామంలోని ఓ రైస్ మిల్లులో కూలి పనిచేస్తున్న బిహార్కు చెందిన అంకల్ మాంజి లైంగికదాడికి పాల్పడినట్లు రుజువైందని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.● ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం? ● బోడమంచాతండాజీపీలో ఘటన -
టార్గెట్ జనవరి 5..
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని, అటు ఇటు అయితే జనవరి 5 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారంలోని హరితహోట్లో మంత్రి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు. ప్రాకారం పనులపై సుదీర్ఘ సమీక్ష అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న ప్రాకారం రాతి నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుమారు అరగంటకుపైగా సమీక్షించారు. ప్రాకారం చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్ ఏర్పాట్ల పనులు, గోవిందరా జు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 5వ తేదీ లోపు ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా విజిట్ చేస్తానని, పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. జనవరి 6వతేదీన సీఎం రేవంత్రెడ్డి వచ్చే చాన్స్ ఉందని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. స్వస్తిక్ గుర్తు ఆదివాసీల సంప్రదాయమే.. స్వస్తిక్ గుర్తును ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గొట్టు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నారన్నారు. కాగా, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాల సందర్భంగా నేడు (బుధవారం) అమ్మవార్ల దర్శనాలు నిలిపివేసినట్లు పూజారులు ప్రకటించారని, భక్తులు సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన జాతర పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అంతకుముందు మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీచందర్ ఉన్నారు.మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు (బుధవారం) ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని మంగళవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాల ను నిలపనున్నట్లు పూజారులు తెలిపారు. ఆ లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అధికారులకు మంత్రి పొంగులేటి డెడ్లైన్ క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రులు -
పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: గిరిజన పాఠశాలల్లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుగులోతు దేశీరాం నాయక్ మాట్లాడుతూ.. 60 రోజుల నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రతీ రోజు ఉదమం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఏఈలను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లు, బాత్రూమ్లను శుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓలు భాస్కర్, ఉపేందర్, ఏసీఎంఓ రాములు, డిప్యూటీ ఈఓ సారయ్య, జీసీడీఓ విజయ, డీఆర్పీ శ్రీకాంత్, ఏఈ లు ఎర్రయ్య, శోభన్, శ్రీను, పాఠశాల హెచ్ఎంలు నర్సయ్య, కిషన్నాయక్, కోటేశ్వరి, వార్డెన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీవన ఎరువులతో అధిక దిగుబడులు
● మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్గార్ల: రైతులు పంటల్లో జీవన ఎరువులు, ఎన్పీకే గుళికలు, పీఎస్బీ ద్రావణం వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండలంలోని సీతంపేట గ్రామ సమీపంలో జీవన ఎరువులతో రైతు బాలాజీ సాగుచేసిన మొక్కజొన్న పంటలో క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి జీవన ఎరువులు వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో చీడపీడలను నివారించవచ్చన్నారు. అపరిమితంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. కొన్నేళ్ల తర్వాత పంటలు పండవని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జీవన ఎరువులు మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతాయని సూచించారు. జీవన ఎరువులు రైతులకు అన్ని విధాలా లాభదాయకం అన్నారు. రబీలో రైతులు వరిపంటకు జీవన ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఏడీఏ వెంట ఏఓ కావటి రామారావు, రైతులు మాలోత్ బిక్షం తదితరులు ఉన్నారు. -
సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఎంజీఎం : పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపం ఉన్న వరంగల్కు చెందిన 16 నెలల చిన్నారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ను హైదరాబాద్లోని కోఠి ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ ఈఎన్టీ సర్జన్, తెలంగాణ రాష్ట్ర కోక్లియర్ ఇంప్లాంట్ నోడల్ ఆఫీసర్ మనీష్ గుప్తా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా సరి చేయొచ్చన్నారు. తద్వారా మూగ, చెవిటి కాకుండా నిరోధించి సామాన్య జీవితం అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఈఎన్టీ హెచ్ఓడీ సంపత్, ప్రొఫెసర్ విజయ్, కోఠి ఈఎన్టీ వైద్యురాలు వీణ, ఎంజీఎం అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ చిలక మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మావతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 20257రైతులకు సహకరించాలిమహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని జెడ్పీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్ల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకువస్తే తేమశాతం ఆధారంగా కొనుగోళ్లు చేసేందుకు వీలుంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా రైతులకు అవగాహన కల్పించి సకాలంలో కొనుగోళ్లు చేపట్టి, కాంటాలు త్వరగా పూర్తిచేసి, బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు. లారీలు, బస్తాలు, ఇతర రవాణా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మల్యాల ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి జగన్ ఉన్నారు. -
బైక్ను ఢీకొన్న ఇసుక లారీ..
● యువకుడి దుర్మరణం ● దేవన్నపేటలో విషాదం హసన్పర్తి: ఇసుక లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి–ఉనికిచర్ల మార్గమధ్యలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ పంజాల నాగలక్ష్మి కుమారుడు చరితకుమార్(27) స్థానికంగా వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేడోడువాడుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం జాతీయ రహదారి మీదుగా బైక్పై నిరూప్నగర్ తండా వైపునకు బయలుదేరాడు. సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగా, వడ్డేపల్లి నుంచి ఉనికిచర్ల వైపునకు వెళ్తున్న ఇసుక లారీ డివైడర్ల పైనుంచి దూసుకొచ్చి బైక్ను ఢీకొంటూ రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ప్రమాదంలో చరితకుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, భూపాల్తోపాటు బంధువులు ఘటనా స్థలికి తరలొచ్చి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. చరితకుమార్ మృతితో దేవన్నపేటలో విషా దం అలుముకుంది. కాగా, సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఘటనాస్థలిని సందర్శించి మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఐపీఎల్ సెలక్టర్గా సాయినాథ్రెడ్డి మహబూబాబాద్ అర్బన్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన సంకేపల్లి శ్రీనివాస్రెడ్డి, కీర్తన దంపతుల కుమారుడు సాయినాథ్రెడ్డి ఇండియన్ ప్రీమియర్లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సూపర్ సెలక్టర్గా ఎంపికయ్యారు. ఇటీవల ఐపీఎల్ టెక్నికల్ వింగ్కు దేశ వ్యాప్తంగా ఎంపికలు నిర్వహించారు. ఇందులో సాయినాథ్ రెడ్డి సెలక్టర్గా ఎంపికయ్యారు. దీంతో యూ ఏఈలోని అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోచ్ సంగక్కర, డైరెక్టర్ ఆఫ్ స్రాటజీ జైల్స్తోపాటు సాయినాథ్రెడ్డి.. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. కాగా, సాయినాథ్రెడ్డి బెంగళూరులో డేటా సైంటిస్ట్ ఉద్యోగం చేస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. బీసీ మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ హన్మకొండ: ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) ఆధ్వర్యంలో బీసీ మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గడ్డ భాస్కర్ తెలిపారు. మంగళవారం హనుమకొండ రాంనగర్లోని ఓబీసీ కార్యాలయంలో ఫ్రీ ఉమెన్ ట్రైనింగ్ ఫర్ బీసీ ఉమెన్ కార్ పైలట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ సంస్థ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు బీసీ బాలికల వసతి గృహంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఇదే క్రమంలో మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి
● టీటీడబ్ల్యూఆర్సీఈ విద్యార్థినుల డిమాండ్ వరంగల్: ఐఐటీ, నీట్ లాంటి ఉన్నత చదువుకు గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ 3వ డివిజన్ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్, ఆర్సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్సీఓ డీఎస్.వెంకన్న, ప్రిన్సిపాల్తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్సీఓ డీఎస్.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు. -
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనులు వేగంగా పూర్తి
● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: విద్యుత్ సబ్స్టేషన్ల రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 15లోపు హెచ్టీ సర్వీసులకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇకపై కొత్తగా విడుదల చేసే సర్వీసులు కూడా ఆటో మేటిక్ మీటర్ రీడింగ్ ద్వారా పర్యవేక్షణలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ డివిజన్లో హై–లాస్ ఫీడర్లను గుర్తించి వాటిని పరిశీలన చేసి పెట్రోలింగ్ నిర్వహించి నష్టాలకు కారణాలను విశ్లేషించి తగ్గించాలని సూచించారు. వచ్చే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఇప్పటి నుంచే సామర్థ్యం పెంపు, అప్గ్రేడేషన్ పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జీఎంలు వేణు బాబు, కృష్ణమోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీకాంత్, సామ్య నాయక్, కళాధర్ పాల్గొన్నారు. -
సకుటుంబ సపరివారంగా..
● తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్.. ● భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశాయి. ఇందులో తల్లి సర్పంచ్గా తనయుడు ఉప సర్పంచ్గా, భార్య సర్పంచ్గా భర్త ఉప సర్పంచ్గా, నాడు భర్త సర్పంచ్గా, నేడు భర్త సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. ● తీగరాజుపల్లి మాజీ సర్పంచ్గా కర్జుగుత్త రమ కొనసాగగా సోమవారం భర్త గోపాల్ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మొండ్రాయిలో తల్లి గూడ స్వరూప సర్పంచ్గా తనయుడు విజయ్కుమార్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దతండాలో భార్య గుగులోత్ వినోద సర్పంచ్గా, భర్త రవీందర్నాయక్ ఉపసర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అరకొర వసతుల మధ్య నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండలంలోని ఎల్గూర్రంగంపేటలో జీపీ భవనం లేకపోవడంతో మత్స్యపారి శ్రామిక సంఘం కమ్యూనిటీహాల్లో, ముమ్మడివరంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో, గొల్లపల్లిలో అద్దె భవనంలో నూతన పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. సంగెం మండలం మొండ్రాయిలో సర్పంచ్గా తల్లి స్వరూప, ఉపసర్పంచ్గా తనయుడు విజయ్కుమార్, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధికారులు -
తహసీల్దార్ కార్యాలయ భవనానికి తాళం
● అద్దె రూ.6లక్షలు బకాయి చెల్లించకపోవడంతో యజమాని తాళం ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని మండల తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు నుంచి ప్రైవేట్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రెండేళ్లుగా అద్దె చెల్లించేదు. సుమారు రూ.6లక్షల పైగా అద్దె బకాయి ఉండడంతో యజమాని సమ్మయ్య సోమవారం తాళం వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది బయటనే ఉండిపోయారు. పలు రకాల పనులపై వచ్చిన ప్రజలు నిరీక్షిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇక్బాల్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టికి తీసుకెళ్లి అద్దె చెల్లిస్తామని యజమానిని ఒప్పించడంతో తాళం తీశారు. కాగా, అద్దె ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చేసేదిలేక భవనానికి తాళం వేసినట్లు సమ్మయ్య తెలిపారు. భవన నిర్మాణానికి బ్యాంకు రుణం తీసుకున్నానని, అద్దె రాకపోవడంతో ఈఎంఐ కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. -
‘అక్షయ పాత్ర’ సేవలు అనిర్వచనీయం
వరంగల్: పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఆవరణలోని ఇస్కాన్ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో హెచ్డీబీ సహకారంతో ఏర్పాటు చేసిన వంటశాలలోని అధునాతన యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవ సంస్థగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పడిన సంస్థ ఇస్కాన్ అన్నారు. అనేక విద్యా సంస్థలను సంస్థ నడుపుతూ హరే కృష్ణ సంకీర్తన ఉచిత ప్రసాద వితరణకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్కు అనుబంధంగా పని చేస్తున్నదన్నారు. ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో బెంగుళూరు కేంద్రంగా అక్షయపాత్రను ప్రారంభించారని తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్న అతిపెద్ద సంస్థ ఇదేనన్నారు. దేశంలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 22 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ప్రతీరోజు 20 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారన్నారు. మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలి
కేయూ క్యాంపస్: సముద్రాంతర్భాగం నుంచి ఆకాశం వరకు అనేక అవకాశాలున్నాయని, విద్యార్థులు, యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కేయూ ఆడిటోరియంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనం ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ఇండియా అన్నారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా మన విద్యావ్యవస్థ ఉండాలన్నారు. ప్రస్తుతం 80లక్షల మంది విద్యార్థులకు లక్షమంది అధ్యాపకులు ఉన్నారన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలు లేవనే విషయం వాస్తవమని, ప్రతీ విద్యార్థి, సంస్థలు కూడా నవీకరణ చెందాలన్నారు. రాబోయే కాలంలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సుమారు 20 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ గతిని మార్చేశక్తి భారతీయ యువతపై ఉందన్నారు. విప్లవాత్మక మార్పులను గమనిస్తూ తీర్చిదిద్దుకోవాలి.. దేశంలో విద్యావ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను గమనిస్తూ విద్యార్థులు తమ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతోపాటు ఇండస్ట్రీయల్ కంపెనీలతో ఎంఓయూలతో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాయన్నారు. జాతీయ విద్యావిధానం విద్యార్థులకు వరం.. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీర్ఘకాలిక పోరాటాల ఫలితమే జాతీయ విద్యావిధానమని, ఇది నేడు దేశంలోని విద్యార్థులకు వరమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీల హాస్టళ్ల కన్వీనర్ జీవన్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతుసింగ్, కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడిబాబురావు మాట్లాడారు. కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, కార్యదర్శి జ్ఞానేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. బాలకిష్టారెడ్డి దృష్టికి వర్సిటీల్లోని సమస్యలు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి దృష్టికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పలు సమస్యలు తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కోఠి మహిళా యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, పరిష్కరించాలని ఆ యూనివర్సిటీ నేత సుమ, అలాగే, ప్రతీ యూనివర్సిటీలోనూ స్కిల్డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఓయూ విద్యార్థి రాజు, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను బాలకిష్టారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలు పరిష్కరించేలా తమవంతు కృషిచేస్తున్నామని బాలకిష్టారెడ్డి ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూలో వర్సిటీల విద్యార్థుల సమ్మేళనం -
.. అనే నేను
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 11,14, 17వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించిన జీపీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సోమవారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కొలువుదీరారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, అనుచరగణంతో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పలు చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 పంచాయతీల్లో అతిచిన్న వయసున్న సర్పంచ్గా వర్సా దీప రికార్డులోకెక్కాకారు. నామాలపాడు సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలో దిగిన 24 సంవత్సరాల దీప ఎన్నికల్లో విజయం సాధించి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకంతో గ్రామస్తులు గెలిపించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ● నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండా జీపీ సర్పంచ్గా 22 ఏళ్ల జి. హేమలత సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.75 ఏళ్ల వయసులో సర్పంచ్లుగా.. జనగామ రూరల్: మండలంలోని ఎర్రగొల్లపహాడ్కు చెందిన చిర్ర సత్యనారాయణ రెడ్డికి 75 ఏళ్ల వయసులో సర్పంచ్గా అవకాశం లభించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్గా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుండెల్లి కల్పన రెండో సారి ఉప సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. ● భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం బావు సింగ్పల్లికి చెందిన పొనగంటి ముత్తమ్మ సర్పంచ్గా రెండో విడతలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 75 సంవత్సరాల వయసులో సోమవారం గ్రామ సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. -
పాముకాటుతో రైతు మృతి
నల్లబెల్లి: పాముకాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య(50) ఈ నెల 19వ తేదీన తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సాగు పనుల్లో ఉన్నాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎడ్లకు వేత వేసేందుకు యత్నిస్తుండగా చేతిపై పాము కాటువేసింది. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలింకారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అరుణ, కుమారులు మునేందర్, రాజేందర్ ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
బచ్చన్నపేట: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ కూతురు అనుశ్రీ (21)ని సాల్వాపూర్ గ్రామానికి చెందిన గూడెపు రాజమణి సత్తయ్య దంపతుల పెద్ద కుమారుడు అజయ్కు ఇచ్చి 13 నెలల క్రితం వివాహం చేశారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి అనుశ్రీని భర్త అజయ్ వద్దకు పంపించారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ ఉరివేసుకొంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా వచ్చి అజయ్లో ఇంటిని, సామగ్రిని ధ్వంసం చేశారు. అనుశ్రీ మృతికి అత్తింటి సభ్యులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలం వద్ద నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్ తెలిపారు. -
ఒక్కటే జీపీ.. వేర్వేరు చోట్ల ప్రమాణస్వీకారాలు
● బోటిమీది తండా జీపీలో విచిత్ర పరిస్థితి ఖానాపురం : మండల వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్లతో పాటు పాలకవర్గాలు ప్రమాణ స్వీకారాలు చేశాయి. కానీ మండలంలోని బోటిమీదితండాలో మాత్రం విచిత్ర ప్రమాణ స్వీకారం చేశారు. మొదట ఎంపీడీఓ అద్వైత సమక్షంలో సర్పంచ్ భానుప్రసాద్, నలుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదే జీపీలో కొనసాగుతున్న గొల్లగూడెంతండా చెందిన మరో ముగ్గురు వార్డు సభ్యులు మాత్రం బోటిమీది తండా జీపీలో కాకుండా గొల్లగూడెంతండాలోనే పాత జీపీ కార్యాలయం వద్ద కార్యదర్శి సమక్షంలో ఉపసర్పంచ్తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ జీపీ పాలకవర్గ ప్రమాణస్వీకార ప్రక్రియ విచిత్రంగా ఉందని పలువురు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
సరైన ఉద్యోగం రావడం లేదని యువకుడు..
ఖానాపురం: సరైన ఉద్యోగం రావడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని రేవతండాలో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజేందర్(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈక్రమంలో 20 రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఈనెల 6న తల్లికి హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ పనిచేయలేదు. ఇదే సమయంలో యువకుడి తల్లి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూడగా రాజేందర్ మృతదేహం కనిపించింది. భయాందోళనకు గురై తండాకు వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రఘుపతి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి తార ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి సోమవారం తెలిపారు. -
తొలి హామీ అమలు..
● కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి సర్పంచ్ నకీర్త రాజు తన తొలిహామీ నెరవేర్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్ల కు జన్మనిచ్చిన అంకిళ్ల మౌనిక, రాజు దంపతులకు ఆడపిల్ల భరోసా కింద రూ.5,116 నగదు అందజేశారు. ● కన్నాయిగూడెం: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాడి రాంబాబు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఎస్టీ కాలనీ, సమ్మక్క, సారలమ్మ గుడికి, హాస్టల్ వాడల్లో బోర్లు వేయించారు. -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
కురవి: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) జెడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యాసదస్సు వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న జనగామ జిల్లా కేంద్రంలో జరగబోయే విద్యాసదస్సులో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు హాజరవుతారని తెలిపారు. అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జానయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు బాబు, శ్రీనివాస్, విజయరాణి, సుహాసిని, రాధిక, శోభారాణి, రమేశ్, సైదన్న, శ్రీనివాస్, గోపాల్, యాకలత, విజయలక్ష్మి పాల్గొన్నారు. వ్యర్థ వస్తువులతో ఆదాయం పొందాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు వ్యర్థ వస్తువులతో ఆదాయం పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్లో సోమవారం డివిజన్ పరిధిలో వేస్ట్ వెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిషన్ను డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పరిసరాల్లోని చెత్త, ఇంట్లో నుంచి వచ్చిన తడి, పొడి చెత్త నుంచి ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం మొదటిస్థానంలో నిలిచిన ఏకశిల హోలిఏంజిల్స్ స్కూల్, ద్వితీయ స్థానంలో నిలిచిన మోడల్ స్కూల్, తృతీయ స్థానంలో నిలిచిన కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల భద్రతే షీటీం లక్ష్యం మహబూబాబాద్ అర్బన్: బాలికలు, మహిళల భద్రతే లక్ష్యమని షీ టీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సోమవారం షీటీం, భరోసా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసిన, వేధించిన, ఇబ్బందికరంగా మాట్లాడినా.. వెంటనే 100, 1098, వాట్సాప్ 8712656935 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చల్లగాలి మెజెస్, ప్రిన్సిపాల్ పుల్లారావు, షీటీం సిబ్బంది సుధాకర్, రమేష్, అరుణ, పార్వతి, జ్యోత్స్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీహెచ్డబ్ల్యూఓ జిల్లా నూతన కమిటీ మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫోరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్సీ హాస్టల్లో సోమవారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కాగా, టీహెచ్డబ్ల్యూఓ అసోసియేట్ అధ్యక్షుడిగా నర్సింగ్తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడిగా సదానందం, ప్రధాన కార్యదర్శిగా స్వామి, కోశాధికారిగా పైడి, ఉపాధ్యక్షులుగా పద్మ, కల్పన, పూర్ణచందర్, జాయింట్ సెక్రటరీలుగా ఎల్లస్వామి, సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ ఎన్నికల అధికారి రోహిత్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు రవాణా కష్టాలు
మరిపెడ రూరల్: జిల్లాలోని మరిపెడ మండలం తానంచర్ల సమీపంలోని పాలేరు వాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొతకు గురై కొట్టుకుపోయింది. దీంతో ఏడాదిగా పలు గిరిజన తండాలు, గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు అవతలి ఒడ్డున ఉన్న వాల్యతండా, కోట్యతండా, అజ్మీరా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 12 తండాల గిరిజన ప్రజలు, సరిహద్దు జిల్లాల ప్రజలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తారు. అయితే బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. కాగా, ప్రభుత్వాలు మారినా వంతెన కష్టాలు తీరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా నిలిచిన రాకపోకలు.. పాలేరు వాగుపై లోలెవల్ వంతెన కొట్టుకుపోవడంతో ఏడాదిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వాగు మీదుగా మరిపెడ మండల కేంద్రానికి నిత్యం వందలాది మంది గిరిజనులు వెళ్తుంటారు. వివిధ సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంటారు. అయితే ఆయా గ్రామాల గిరిజన ప్రజలు వాగు దాటే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి సూర్యాపేట జిల్లా బికుమళ్ల గ్రామం శివారు 356 జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టూ తిరిగి రావడంతో ఖర్చుతో పాటు సమయం వృథా అవుతుందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.1.20 కోట్ల బ్రిడ్జి టెండర్ రద్దు.. గత ప్రభుత్వం హయాంలో పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అప్పుటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా పాలేరు వాగుపై కోతకు గురైన లోలెవల్ బ్రిడ్జికి రూ.1.20 కోట్లు నిధులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను దక్కించుకున్నాడు. నిధులు సరిపోవని చివరి నిమిషంలో సంబంధిత అధికారులు బ్రిడ్జి టెండర్ పనులు రద్దు చేశారు. మళ్లీ లోలెవల్ వంతెన నిర్మిస్తే దానిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని, అందుకు ఈ నిధులు సరిపోవని హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని, సుమారు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి హైలెవల్ వంతెనకునిధులు మంజూరు చేసి తమను వాగు కష్టాల నుంచి గట్టు ఎక్కించాలని ఆయా గిరిజన తండాలు, గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఇదే అవస్థ.. వర్షాలు కురిసి వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నాం. లోలెవల్ బ్రిడ్జి కావడంతో పై నుంచి వాగు ప్రవహిస్తోంది. వాగు దాటే దారి లేక మండల కేంద్రానికి వెళ్లలేక పోతున్నాం. ప్రతీ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది. పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. –బానోతు అమ్రియా, కోట్యతండా, మరిపెడ భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పాలేరు వాగు లోలెవల్ వంతెన నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏడాదిగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ పక్క జిల్లా సరిహద్దు గ్రామాలనుంచి ప్రయాణం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
చిన్నగూడూరు: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్(డీపీఎంఓ) వనాకర్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మాలోత్ తండాలో లెప్రసీ కేసు డిటెక్షన్ సర్వే పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాఽధి ప్రాథమిక దశలో తెలుపు రంగు మచ్చలు, ఎరుపురంగు, గోధుమ వర్ణం కలిగి స్పర్శజ్ఞానం కోల్పోవడం జరుగుతుందన్నారు. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పీహెచ్సీల్లో ఉచితంగాచికిత్స చేస్తారని తెలిపారు. ఈ నెల 31వరకు ఆశవర్కర్లు ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కుష్ఠు వ్యాధి అంటువ్యాధి కాదని అన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ నర్సులు, ఆశవర్కర్లు ఉన్నారు. -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంకామన్ కెస్ట్రాల్ లిటిల్ రింగ్డ్ ప్లవర్ టికెల్స్ బ్లూ ఫ్లైకాచర్ -
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. జనవరి 30న జరగనున్న తెలంగాణ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో బార్ కౌన్సిల్ రెండు సంవత్సరాలకు ఎన్నుకుంటే ఎనిమిది సంవత్సరాలకు పొడిగించుకుని కాలయాపన చేసిందని, న్యాయవాదులకు సరైన న్యాయం చేయలేదన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం పోరాటం చేస్తానని, యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్య కార్డులు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తానని, మౌలిక సదుపాయాల కోసం పాటుపడతానని పేర్కొన్నారు. న్యాయవాదుల గొంతుకగా నిలబడతానని హామీఇస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ రెడ్డి, రహీంపటేల్, సంద కృష్ణ, దర్శనం రామకృష్ణ, జీవై.గిరి, సత్యనారాయణ, చిన్నమహేందర్, మున్నా, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పనులు మొదలెట్టారు
డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బానోత్ శ్యాంబాబు గ్రామంలోని మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేయగానే నేరుగా గ్రామంలో పాడైన రోడ్డు వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పోసే పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగూడ మండలం ముస్మి గ్రామ సర్పంచ్గా పోటీచేసిన బానోత్ దేవేందర్ ఎన్నికల ప్రకారంలో భాగంగా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోని వీధిలైట్లు మరమత్ము చేస్తా.. ఇతర పనులు చేయిస్తాను అని మాట ఇచ్చారు. ఎన్నికల్లో 420 ఓట్ల మెజార్టీతో గెలిశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే ఆదివారం రాత్రి తన సొంత ఖర్చులతో వీధిలైట్లు అమర్చి వెలుగులు నింపారు. మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన కోట విజేందర్ తన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, మురికి కాల్వలు తీయడం లేదని, మొక్కల పెంపకానికి ప్రధాన్యత ఇచ్చి గ్రామాన్ని పచ్చదనంతో నింపుతానని హామీ ఇచ్చారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన విజేందర్ నేరుగా అపరిశుభ్రంగా ఉన్న కాలనీల వద్దకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయించారు. -
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 10వేల చొప్పున గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫారం 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని ఈ ప్రక్రియ జనవరి 2026లోగా పూర్తి చేయాలని తెలిపారు. వీసీ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై బీఎల్ఓలతో సమీక్షించి పురోగతి సాధించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్, ఆర్డీ ఓ కృష్ణవేణి, పరిపాలన అధికారి పవన్కుమార్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. మేడారంలో నేడు మంత్రుల పర్యటన ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పర్యటించనున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, జాతర పనులను పరిశీలించనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
ప్లాట్ల కోసం పైసలు తీసుకుని..
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి నిడిగొండ శివారులో స్నేహమిత్ర బిల్డర్స్ పేరిట ప్లాట్ల అమ్మకాలు చేసి, డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్వాహకులు పత్తా లేకుండా పోయారని జగన్నాథ టౌన్షిప్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రధాన సలహాదారు గంగుల మల్లయ్య యాదవ్, అధ్యక్షుడు రంగారావు, ఉపాధ్యక్షుడు నడిగడ్డ యాకయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం వెంచర్ సమీపంలో రాష్ట్రంలోని హైదరాబాద్, ఉప్పల్, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి వచ్చిన బాధిత ప్లాట్ల ఓనర్లతో కలిసి ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో పూర్ణచందర్ శెట్టితో పాటు ఆయన తల్లి అయోధ్యమ్మ, చెల్లెలు నాగమణి ముగ్గురు కలిసి స్నేహమిత్ర బిల్డర్ పేరిట జగన్నాథ టౌన్షిప్, ఏబీ పార్టులుగా 80 ఎకరాల్లో వెంచర్ ప్రారంభించారని తెలిపారు. ఇందులో 120 గజాల చొప్పున 2500కు పైగా ప్లాట్లుచేసి, రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఏజెంట్లను పెట్టుకుని ప్లాట్లను అమ్ముకున్నారన్నారు. ఇందులో పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో కొంతమేర రిజిస్ట్రేషన్ చేయగా, మరికొన్ని ప్లాట్లకు సంబంధించి నిర్వాహకులు రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా డబ్బులు ముందుగానే తీసుకుని, నేటి వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. భూమికి సంబంధించి కొంత భాగం కోర్టులో ఉందంటూ వేలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్ణచందర్ శెట్టి అమెరికాలో ఉన్నప్పటికీ, నాగమణి, అయోధ్యమ్మకు రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉన్నా కాలయాపన చేస్తున్నారన్నారని వాపోయారు. ఫోన్ద్వారా ఒత్తిడి చేసిన సమయంలో గ్రీన్కార్డు ఉందని, తనను ఏమీ చేయలేరని పూర్ణచందర్ శెట్టి దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహమిత్ర బిల్డర్స్ ఆధ్వర్యంలో చేసిన వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది కుటుంబాలు నష్టపోకుండా ప్రభుత్వం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్లాట్ల రిజిష్ట్రేషన్తో పాటు పూర్తిస్థాయిలో తమకు అప్పగించే వరకు తమ న్యాయ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. మాట్లాడుతున్న జగన్నాథ టౌన్షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులురాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన బాధితులు రెక్కల కష్టం దోచుకున్న స్నేహమిత్ర బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేయమంటే తప్పించుకు తిరుగుతున్నారు ఫోన్ చేసినా స్పందించడం లేదు.. న్యాయం జరిగే వరకు ఉద్యమం జగన్నాథ టౌన్షిప్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక -
పంచాయతీ పట్టని ఓటర్లు!
ఓటుకు దూరంగా 2.93 లక్షల మందిఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు : 1,682● 21.17 లక్షల మందికి ఓటేసింది 18.25 లక్షల మంది ● 87 శాతానికే పరిమితమైన ఓట్లు.. మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ● పోలింగ్ శాతం తగ్గడంపై సర్వత్రా చర్చ.. ఇదే అంశంపై ఉన్నతాధికారుల ఆరాపోలింగ్ శాతం : 86.18ఓటేయని వారి శాతం : 13.822,92,63821,17,18818,24,580మొత్తం ఓటర్లుపోలైన ఓట్లుసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో 89 నుంచి 94 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అధికారులు సైతం భావించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతోపాటు.. ఓటు సద్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 21,17,188 మంది ఓటర్లు ఉండగా 18,24,580 (86.18 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామలో ఎక్కువగా నమోదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా చూస్తే మూడు విడతల్లో ఓటు శాతం 87.07 దాటలేదు. 2,92,608 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే కూడా జనగామలో ఎక్కువగా నమోదైంది. మొదటి విడతలో అత్యధికంగా జనగామ జిల్లాలో 87.39 శాతం, రెండో విడతలో 88.52 శాతం కాగా, మూడో విడతలో 88.48 శాతంగా నమోదైంది. మూడో విడతలో మహబూబాబాద్లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా చూస్తే కూడా 8 మండలాలు మినహా ఏ మండలంలోనూ 90 శాతాన్ని మించి ఓటుహక్కు వినియోగించుకోలేదు. 1,682 గ్రామ పంచాయతీల పరిధిలో 21,17,580 మంది ఓటర్లకు 18,24,580 మంది (86.18 శాతం) ఓట్లు వేయగా.. 2,92,638 (13.82 శాతం) మంది ఓటుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఓట్ల శాతం ఎందుకు తగ్గినట్లు..? పోలింగ్ శాతం తగ్గడంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాకుండా.. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలింగ్ బూత్స్థాయి అధికారులు (పీబీఎల్ఓలు) నుంచి డివిజన్, జోనల్ ఇన్చార్జ్లు, రూట్ ఆఫీసర్ల వరకు క్షేత్రస్థాయి పరిశీ లన జరుపుతున్నారు. ఓట్ల శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి చని పోయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను కొన్ని తొలగించలేదని ప్రాథమికంగా గమనించినట్లు చెబుతున్నారు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడంతోపాటు స్థానికేతరుల పేర్లను తొలగించకపోవడం వల్ల పోలింగ్ శాతంగా తగ్గినట్లు భావిస్తున్నామని, వాట న్నింటిపై కసరత్తు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏయే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది.. కారణాలు ఏమిటన్న విషయాలతో పాటు తక్షణమే తొలగించాల్సిన ఓటర్ల జాబితాను కూడా జిల్లాల వారీగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు ఓ నివేదికను అధికారులు రూపొందిస్తున్నట్లు తెలిసింది. -
ఉపాధి హామీ పేరు మార్పు మూర్ఖత్వం
● ఎంపీ పోరిక బలరాంనాయక్ మహబూబాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం మూర్ఖత్వమని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలో లోక్సభ, రాజ్యసభ, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని మహాత్మాగాంధీ పేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెట్టారని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడి పేరు మార్చ డం బీజీపీ ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమని విమర్శించారు. ఈ పథకంలో రాష్ట్రాలు 40 శాతం డిపాజిట్ చేస్తేనే కేంద్రం 60శాతం నిధులను విడుదల చేస్తుందని, పార్లమెంట్లో అన్ని పార్టీలు బహిష్కరించినా మోదీ, అమిత్ షా ఏకపక్షంగా బిల్లును ఆమోదింపచేసుకోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, కత్తిస్వామి, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, రాజుగౌడ్, ఖలీల్, బా లు, దిలీప్, రవి, మల్లయ్య, వెంకటి, లక్ష్మి, విజయలక్ష్మి, దేవి, మురళి, యాకన్న, శ్యాం పాల్గొన్నారు. -
కేయూ బీటెక్ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ మూడు, ఐదు, ఏడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించాల్సిండగా ఆయా పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే పూర్తి టైం టేబుల్ను త్వరలోనే తెలియజేస్తామని ఆయన తెలిపారు. కారు బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలుకాటారం: అదుపుతప్పి కారు బోల్తా పడడంతో ఇద్దరు తీవ్రగాయాలపాలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు ప్రయాణికులతో మంథని నుంచి మేడారం వైపు వెళ్తున్న కారు కమలాపూర్ క్రాస్ సమీపంలో మేడిపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కకు అతివేగంగా దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సౌజన్య, సునీత కారులో ఇరుక్కుని తీవ్రగాయాలపాలయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతోపాటు కారులో ఇరుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై–2 రాజశేఖర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. బోల్తా పడిన కారు.. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి వద్ద వరి ధాన్యం కుప్పను ఢీ కొట్టి ఓ కారు బోల్తా పడింది. ఒడిపిలవంచ నుంచి కాటారం వైపు వెళ్తున్న కారు డ్రైవర్ రహదారిపై ఆరబోసిన ధాన్యం కుప్పను గమనించకుండా ఎక్కించడంతో బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. -
గుర్తుంచుకుంటే సేఫ్..
ఖిలా వరంగల్: జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్ శాఖలు తీసుకుంటున్న చర్యలు భేష్ అని చెప్పవచ్చు. ప్రమాదాలను నివారించడంతో రోడ్డు సిగ్నల్స్(గుర్తులు) ప్రముఖ పాత్ర వహిస్తాయి. డ్రైవర్లు ఈ చిహ్నలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని.. ప్రతీ ఒక్కరు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కానీ, ఈ సిగ్నల్స్ను పట్టించుకోకుండా ఎంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ జీవితాలను కోల్పోతున్నారు. ప్రతి వాహనదారుడు ఈ సూచిక చిహ్నలను గమనిస్తూ ప్రయాణించాలంటే ముందుకుగా వాటిపై అవగాహన అవసరం అందుకే.. వాహదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ‘సాక్షి’ చేసే చిరుప్రయత్నమే ఈ కథనం. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే మేలు రహదారుల వెంట చిహ్నాలను పట్టించుకోని వాహనదారులు సూచికలను అనుసరించాలంటున్న అధికారులు -
విశ్వాసంతో క్రీస్తును ఆరాధించాలి
మహబూబాబాద్ రూరల్ : విశ్వాసంతో ఏసుక్రీస్తును ఆరాధించడం ద్వారా మహిమను పొందగలుగుతామని విశాఖపట్నం అగ్ర పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారులో కరుణామయి మేరీ మాత పుణ్యక్షేత్రం ఏసుగుట్ట వద్ద బంజారా క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదటగా జిల్లా కేంద్రంలోని ఫాతిమా మాత దేవాలయం నుంచి మరియమాత విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఏసుగుట్ట వరకు తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి కరుణామయి మరియమాత సన్నిధిలో నూతనంగా నిర్మించిన షెడ్డును బిషప్ ఉడుముల బాల ప్రారంభించి మాట్లాడారు. ఏసుక్రీస్తు విశ్వమంతటికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించడం కోసం ఈ భూమిపైకి వచ్చారన్నారు. అదేవిధంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులను సత్కరించి వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ఆశీర్వాదాలు అందజేశారు. వరంగల్ మేత్రాసనం పాలన అధికారి విజయపాల్ రెడ్డి, ఫాతిమా మాత దేవాలయ విచారణ గురువు సైమన్, గునేలియన్ సంస్థ అధ్యక్షుడు అసీసీ, ఫాదర్లు శ్రావణ్ రెడ్డి, పీటర్, క్రీస్తు, జోసెఫ్, థామస్, క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు. -
మేడారం.. జనసంద్రం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద భక్తుల జల్లు స్నానాలు అచరించారు. అమ్మవార్లకు పుట్టు వెంకట్రులు సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పంచి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతంలో విడిది చేసి వంటార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్లతో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ముందస్తు జాతర కళ వేల సంఖ్యలో భక్తులు రావడంతో మేడారం ముందస్తుగా జాతర కళ సంతరించుకుంది. భక్తుల రద్దీతో తల్లుల గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. రోడ్లన్నీ భక్తుల వాహనాలతో బారులు తీరాయి. కొబ్బరి, బెల్లం కొనుగోళ్లతో దుకా ణాలు కిటకిటలాడాయి. అమ్మవార్ల గద్దెల వద్ద నుంచి భక్తులు పసుపు, కుంకుమను పవ్రితంగా ఇంటికి తీసుకెళ్లారు. భక్తుల రద్దీ నియంత్రించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ములుగు డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. కిక్కిరిసిన వనదేవతల గద్దెల ప్రాంగణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు -
రాజీపడితే శాంతియుత జీవనం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : ఇరుపక్షాలు కోర్టు కేసుల్లో రాజీపడి శాంతియుత జీవనం గడపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ఆదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఉత్తమమైన రాజీ మార్గాన్ని విడనాడితే ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతాయో రామాయణ, మహాభారతాలు వివరించాయన్నారు. పాండవులకు కేవలం ఐదు ఊర్లు ఇచ్చి రాజీపడితే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి ఉండేదికాదని, దాని ఫలితమే కౌరవుల పతనానికి దారితీసిందని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని వివరిస్తూ హనుమంతుడి రాయభారాన్ని అంగీకరించి ఉంటే రామాయణ యుద్ధం జరిగేది కాదని, ఫలితమే లంకాదహనమని పేర్కొన్నారు. అందువల్ల వివాదాలు తలెత్తితే ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పరిష్కరించుకుంటే చాలా పల్లెలు వివాదరహిత గ్రామాలుగా నిలిచిపోతాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు విడాకులు కాకుండా మిగతా అన్ని సివిల్ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులను జడ్జి అభినందించారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. మైనర్లకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని, అది చట్ట విరుద్ధమని హెచ్చరించారు. సరైన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాహనాలను నడపాలని సూచించారు. డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ.. గత నవంబర్ 15న జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని, అలాంటి సంప్రదాయాన్ని న్యాయాధికారుల సహకారంతో మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు. న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణ తేజ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, ప్రభుత్వ న్యా యవాది నగేష్ కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్చందర్, టౌన్, రూరల్, బయ్యా రం సీఐలు గట్ల మహేందర్ రెడ్డి, పి.సర్వ య్య, బి.రవికుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ జీనత్, న్యాయవాదులు, కక్షిదారులు, సీడీఓలు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి తొర్రూరు: పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ కోరారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని కోర్టులో జాతీయ లోక్ అదా లత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ.. చిన్న, చిన్న సమస్యలతో గొడవలు పడి కేసుల పాలై కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను సర్వ నాశనం చేసుకోవద్దన్నారు. పీపీ రేవతిదేవి, డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్, బార్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు.3,399 కేసుల పరిష్కారం మహబూబాబాద్ రూరల్ : జిల్లా కోర్టు, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3,389 కేసులను పరిష్కరించారు. జిల్లా కోర్టు పరిధిలో ఒక క్రిమినల్, ఒక చెక్ బౌన్స్ కేసు, 19 మోటారు వాహన ప్రమాద కేసులు పరిష్కరించగా.. బాధితులకు రూ.1.02 కోట్లు నష్టపరిహారంగా అందజేయాలని ఆదేశించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక కేసు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 83 సివిల్ కేసులు, 302 క్రిమినల్ కేసులు, రెండు చెక్క బౌన్స్ కేసులు, 12 మద్యపానం కేసులు, 9 వివాహ సంబంధిత కేసులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 385 క్రిమినల్ కేసులు, నాలుగు చెక్ బౌన్స్ కేసులు, 13 మద్యపానం కేసులు, రెండు వివాహ సంబంధిత కేసులు, న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో 470 విద్యుత్, మోటార్ వాహన, సైబర్ కేసులు, ద్వితీయ శ్రేణి కోర్టులో 1,573 పెట్టీ కేసులు మొత్తంగా 2,887 కేసులు పరిష్కారం చేశారు. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 512 క్రిమినల్ కేసులు, ఏడు ఇతర కేసులు పరిష్కరించారు. -
తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
టేకుమట్ల: తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్నపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొండ సర్వేశం కుమారుడు తరుణ్(20) ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి ట్రాక్టర్ మరమ్మతుల కోసం తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ పొలాల్లోకి దూసుకెళ్లి దిగబడగా తండ్రి అలా ఎందుకు చేశావని తరుణ్ను మందలించాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. -
విద్యార్థులు.. గజగజ
● సంక్షేమ హాస్టళ్లలో చన్నీటి స్నానాలు ● చెడిపోయిన సోలార్ వాటర్ హీటర్లు ● పట్టించుకోని అధికారులు మహబూబాబాద్ అర్బన్: అసలే డిసెంబర్ మాసం.. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. కాగా జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులా ల విద్యార్థులు ఉదయం గజగజ వణుకుతూ చన్నీటి స్నానాలు చేయాల్సి దుస్థితి నెలకొంది. సోలార్ వాటర్ హీటర్లు సరిగా పనిచేయకపోవడం, దుప్పట్లు, మంచాల కొరత, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తరచూ విద్యార్థులకు జలుబు, ఇతన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని పలు విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. జిల్లాలో గురుకులాలు ఇలా.. జిల్లాలో ఐదు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 2,676 మంది విద్యార్థులు, ఆరు ట్రైబల్ గురుకులాల్లో 3,269 మంది, 23 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 4,728 మంది, రెండు మినీ గురుకులాల్లో 265 మంది, ఆరు మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాల్లో 2,970 మంది, ఐదు మైనార్టీ గురుకులాల్లో 1,129 మంది, 8 మోడల్ స్కూల్ హాస్టళ్లలో బాలికలు 760 మంది, 16 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 3,391 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇంటిని మరిపించేలా వసతులు ఉన్నాయని అధికారులు, నాయకులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో గీజర్లు, వాటర్ హీటర్లు పనిచేయకపోయినా.. వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస మరమ్మతులు కూడా చేయించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజగజ వణుకుతూ చన్నీటితో స్నానాలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొందరు విద్యార్థులు ఉదయం చలికి భయపడి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్నానం చేస్తున్నారు. ఇప్పటికై నా వేడినీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. చన్నీటితో స్నానాలు చేయలేకపోతున్నాం.. రోజురోజుకూ చలి పెరుగుతుంది. ఉదయం 7గంటలకు గజగజ వణుకుతూ చన్నీటి స్నానం చేయాల్సి వస్తుంది. చలి ఎక్కువగా ఉన్న రోజు మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేస్తున్నాం. సార్లు మా స్నానాలకు వేడి నీళ్లు కల్పించాలని కోరుతున్నాం. –అభిరామ్, ఎస్టీ హాస్టల్ విద్యార్థి, మానుకోట -
సాంకేతికాభివృద్ధిలో టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: సాంకేతికాభివృద్ధిలో టీజీ ఎన్పీడీసీఎల్ ముందువరుసలో ఉందని ఆ కంపెనీ ఫైనా న్స్ డైరెక్టర్ వంటేరు తిరుపతిరెడ్డి అన్నారు. హనుమకొండ విద్యుత్ నగర్లోని తెలంగాణ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో విద్యుత్ అకౌంట్స్ అధికారుల అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. 17 జిల్లాల నుంచి అకౌంట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వంటేరు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఎన్పీడీసీల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో పవర్ పర్చేజ్ కాస్ట్, తీసుకున్న అప్పుల వడ్డీ తగ్గింపుతో కంపెనీ వ్యయం తగ్గిందన్నారు. కంపెనీ పురోభివృద్ధిలో అకౌంట్స్ విభాగం తమవంతు పాత్రను సమర్థంగా నిర్వహిస్తుందన్నారు. అకౌంట్స్ విభాగంలో పని చేస్తునందుకు ప్రతీ ఒక్కరు గర్వపడాలని అన్నారు. కంపెనీ ప్రగతికి, ఆర్ధిక నిర్వహణలో అకౌంట్స్ అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. అర్హులందరికీ యాజమాన్యం పదోన్నతి కల్పించిందన్నారు. అనంతరం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.నాజర్ షరీఫ్, పి.అంజయ్య అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎన్.ఉపేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.రా జేశం, ఉపాధ్యక్షులుగా కె.మాధవరావు, పి.రఘుపతి, ప్రధాన కార్యదర్శిగా ఎం.సుదర్శన్ రావు, సంయుక్త కార్యదర్శిలుగా ఈ.మురళి, చంద్రమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిలుగా ఎ.రాజేంద్ర ప్రసాద్, రేష్మా, ఆర్థిక కార్యదర్శిగా బి.దేవేందర్, మహిళ కార్యదర్శిగా ఎం.సునీత, ముఖ్య సలహాదారుగా వేణుబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డిని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి విద్యుత్ అకౌంట్స్ అధికారులు ఘనంగా సన్మానించారు. కంపెనీ నిర్వహణతో అకౌంట్స్ అధికారుల పాత్ర కీలకం టీజీ ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి -
కోటను సందర్శించిన విదేశీయులు
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ మధ్యకోటను ఆదివారం కోల్కతా పర్యాటకులతో కలిసి అమెరికా దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు అద్భుతమైన శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుషిమహల్, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను వీక్షించారు. కాకతీయుల చారిత్రక విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ విదేశీయులకు వివరించారు. ఆ తర్వాత విదేశీయులు సెల్ఫీలు దిగుతూ.. చరిత్రను తెలుసుకుంటూ సరదాగా గడపారు. సాయంత్రం టీజీటీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. కార్యక్రమంలో కేంద్ర పురావస్తుశాఖ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
మహబూబాబాద్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22న సర్పంచ్ల ప్రమాణస్వీకారం నేపథ్యంలో రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, వార్డుసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మొదటి సమావేశం జరగనుందన్నారు. ఆ ప్రక్రియను ఎంపీడీఓలు, తహసీల్దార్లు స్వయంగా పర్యవేక్షిస్తారని, ఈమేరకు ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. ఈవిషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఎరువుల యాప్ ప్రారంభం వాయిదా ● జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో పలు సాంకేతిక కారణాల వల్ల ఎరువుల యాప్ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిందని జిల్లా వ్యవ సాయ అధికారి ఎం.విజయనిర్మల ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ముందుగా తెలిపిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ జరగాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి పేర్కొన్నారన్నారు. నూతన ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమం సోమవారం 5 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి జిల్లాలో అమలు తేదీని తెలియజేస్తామని, ఆ తేదీ ప్రకటించే వరకు ఆయా మండలాల్లో అమలవుతున్న పాత పద్ధతిలోనే యథావిధిగా రైతులు యూరియా పొందాలని కోరారు. నేడు జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ మహబూబాబాద్: జిల్లాలో అధిక మాంస ఉత్పత్తి లక్ష్యంగా ఈనెల 22నుంచి 31వ తేదీ వరకు అన్ని మండలాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా పశువైద్య, సంవర్థకశాఖ అధి కారి కిరణ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నట్టల నివారణ మందు వేసినట్లయితే జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్నారు. నట్టల మందు లోపంతో పశువుల్లో విరోచనాలు, పొట్టలావు కావడం, పెరుగుదల లేకపోవడం, గొంతుదగ్గర వాపు రావడం, రక్తహీనతతో బాధపడుతూ అనారోగ్యానికి గురవుతాయని అన్నారు. జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొసైటీలకు పర్సన్ ఇన్చార్జ్ల నియామకం మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని 19 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్చార్జ్లను నియమిస్తూ రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్, ధన్నసరి, మల్యాల సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.ప్రవీణ్, బయ్యారం, గార్ల, డోర్నకల్ సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్టార్ కె.శ్రీనుబాబు, మరిపెడ, నర్సింహులపేట సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.సుమలత, నెల్లికుదురు, కురవి సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె.మోహనరావు, తొర్రూరు, ఎర్రబెల్లిగూడెం, శ్రీరామగిరి సొసైటీలకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రమేశ్, పొగుళ్లుపల్లి, గూడూరు సొసైటీలకు సీనియర్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, కాంపల్లి, మన్నెగూడెం, గుండ్రాతిమడుగు సొసైటీలకు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎండీ.యాకూబ్ అలీ పర్సన్ ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలతో ఉజ్వల భవిష్యత్ నెల్లికుదురు: రాష్ట్ర స్థాయి క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర క్రీడల పరిశీలకులు పులయ్య, జి.శారద, కృష్ణమూర్తి క్రీడాకారులకు సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రాష్ట్రస్థాయి యోగా, తాంగ్తా, గట్కా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, దీంతో మానసిక ఉల్లాసంతో పాటు మేధస్సు పెంపొందుతుందన్నారు. ఈ క్రీడల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల ఆర్గనైజర్ అయిలయ్య, ఫిజికల్ డైరెక్టర్ హిమామ్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీ భవనానికి రంగులేసిన సర్పంచ్
మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న విషయం తెలిసిందే. కాగా మహబూబాబాద్ మండలంలోని మాధవపురం గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి సంబంధిత అధికారులు నూతనంగా రంగులు వేయించలేదు. దీంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందిన వెంపటి రమేష్ స్వయంగా జీపీ భవనానికి రంగులు వేశారు. తన వృత్తి పెయింటర్ కాగా సర్పంచ్గా ప్రజలకు సేవ చేయాలని ఎన్నికై న నేపథ్యంలో ఆయన ఇంకొకరిపై ఆధారపడకుండా జీపీ కార్యాలయ భవనానికి రంగులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముగిసిన జిల్లాస్థాయి టెమ్రిస్ క్రీడోత్సవాలున్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని వరంగల్(బీ 1), వరంగల్(జీ 2) గురుకులాల్లో మూడురోజులుగా నిర్వహిస్తున్న బాల, బాలికల మూడో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు డీఎండబ్ల్యూఓ టి.రమేష్, ఆర్ఎల్సీ జంగా సతీష్ బహుమతులు, సర్టిఫికెట్స్ అందచేశారు. ముగింపు కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకులాల ప్రిన్సిపాళ్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, పీడీ, పీఈటీలు, వార్డెన్స్, కళాశాలల అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. 200 కిలోల బెల్లం స్వాధీనంకేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్లో నిలిచిన కృష్ణా ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలించిన నల్లబెల్లం, పట్టికను కొందరు వ్యక్తులు తరలిస్తుండగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రజితరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ మేరకు అక్రమంగా బెల్లం తరలిస్తున్న మున్సిపాలిటీ పరిధి తండాకు చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 200 కిలోల నల్లబెల్లం, 30 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వెంకటస్వామి, రాజు, వరుణ్రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఖన్న, సెకండ్ ఎస్సై నరేష్ పాల్గొన్నారు. తారు వేస్తున్నారా... పూస్తున్నారా?ఏటూరునాగారం: మేడారం జాతర సందర్భంగా ఆర్అండ్బీ శాఖ మండలంలోని చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు 6.6 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు మరమ్మతుల కోసం రూ. 22లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బీటీ రోడ్డుపై తారు వేస్తున్నారా... లేక పూస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఉన్న బీటీ రోడ్డుపై అనేక గుంతలు పడ్డాయి. కొన్ని చోట్ల బీటీ లేచిపోయి కంకర తేలింది. దీంతో ప్రయాణికులు, భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. కానీ, కాంట్రాక్టర్ అతంతమాత్రంగానే మరమ్మతులు చేయడంతో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. వెంటనే మరమ్మతులు నాణ్యతగా చేయించాలని స్థానికులు ఆర్అండ్బీ అధికారులను కోరుతున్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నేడు కొలువుదీరనున్న గ్రామపాలక వర్గాలు ● కొత్త సర్పంచ్లకు అనేక సవాళ్లు ● రెండేళ్లుగా నిలిచిన గ్రామ పంచాయతీ నిధులు ● బూజుపట్టిన జీపీ కార్యాలయాలు ● ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి హామీలు ● జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో మొదటిసారి సర్పంచ్లే..అనే నేనుమరిపెడ రూరల్: పల్లె సంగ్రామం ముగిసింది. సోమవారం నూతన సర్పంచ్ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు డిసెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 22 నెలల తర్వాత పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరనుండగా.. గ్రామాల్లో తిష్ట వేసిన అనేక సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు కొత్త సర్పంచ్లకు సవాల్గా మారనుండగా.. వాటిని ఎలా పరిష్కరిస్తారోనని సర్వత్రా జిల్లా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. సగానికిపైగా కొత్త సర్పంచ్లే.. జిల్లాలో ఈసారి గెలుపొందిన సర్పంచ్ల్లో సాగానికిపైగా మొదటిసారి పదవులు చేపట్టిన వారే ఉన్నారు. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 70శాతం పైగా మొదటిసారి సర్పంచ్గా గెలిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు.. పాలన అనుభవం లేనివారే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చారు. ఇందులో కొన్ని అమలుకు సాధ్యం కాని హామీలు కూడా ఉన్నాయి. కాగా వారికి హామీలను నెరవేర్చడం సవాల్గా మారనుంది. అరకొర పనులు.. ప్రస్తుతం గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోవడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులే నిధులలేమితో అరకొర పనులు చేశారు. కాగా పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు.. పెండింగ్లో ఉన్నాయి. తాజాగా కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఇప్పడైనా నిధులు విడుదలవుతాయని వారు ఆశతో ఉన్నారు. రెండేళ్లుగా నిలిచిన నిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లోని జనాభా ప్రకారం విడుదల చేస్తుంది. పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్న సమయంలోనే ఈ నిధులు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో దాదాపు రెండేళ్ల నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో ఈ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరి గ్రామాల్లో అత్యవసర పనులు చేయించుకున్నారు. నిధులు నిచిలిపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కిస్తీలు, కరెంట్ బిల్లులు సైతం పెను భారంగా మారాయి. డీజిల్కు సైతం డబ్బులు లేని పరిస్థితి గ్రామ పంచాయతీల్లో నెలకొంది. ఇలా ఎన్నో సమస్యలతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. ఈ సమస్యల కాకుండా ఎన్నికల ప్రచారంలో ఆలయాలు, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మిస్తామని ప్రత్యేక హామీలు ఇచ్చారు. నిలిచిపోయిన పనులు.. పలు గ్రామ పంచాయతీల్లో నూతన జీపీ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో కల్వర్టులు దెబ్బతినడంతో గుంతలు ఏర్పడ్డాయి. రెండేళ్లగా ట్రాక్టర్లు కదలడం లేదు. దీంతో గ్రామాల్లో చెత్తసేకరణ నిలిచిపోయి చెత్త కుప్పలు పేరుకుపోయాయి. కనీసం నాటిన చెట్లకు నీరు పోసే పరిస్థితి లేదు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద నివారణ చర్యలు లేకుండా పోయాయి. సర్పంచ్లు లేక గ్రామాల్లో చేపట్టే పలు కార్యక్రమాలు సైతం నిలిచిపోయాయి. రెండేళ్ల పాటు గ్రామ పాలన లేక జీపీ కార్యాలయాలు బూజు పట్టి పోయాయి. కాగా నూతన పాలక వర్గాలతో తమ గ్రామాల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భద్రతా చర్యలు కీలకం. బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాం. మానవ తప్పిదాలు, వాహనాలు, అత్యధిక వేగం వలన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలను నివారించడానికి గుర్తులతో కూడిన బోర్డులను రోడ్డుపై ఏర్పాటు చేశాం. వాహనచోదకుల్లో చాలా మందికి వీటిపై అవగాహన ఉండట్లేదు. రోడ్డుపై ప్రయాణిస్తూ వాటిని చూడడం లేదు. వీటి గురించి తెలుసుకుంటే సురక్షితంగా ప్రయాణించవచ్చు. – సురేష్రెడ్డి, డీటీసీ వరంగల్, హనుమకొండ -
అయోధ్యపురంలో రౌండ్టేబుల్ సమావేశం
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురంలో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్, రౌండ్టేబు ల్ సమావేశ సమన్వయకర్త దేవులపల్లి రాఘవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్టేబుల్ సమావే శం నిర్వహించారు. కోచ్ ఫ్యాక్టరీలో అయోధ్యపు రం వాసులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యో గ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, ప లు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. 1979 లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమం చేపట్టిన బీఆర్ భగవాన్దాస్, కాళిదాసు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించా రు. ఈ సందర్భంగా కేయూ మాజీ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఐక్యంగా ముందు కు సాగుదామని పిలుపునిచ్చారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రులతోపాటు రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని సూచించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కయ్య మాట్లాడుతూ పోరాటాలతోనే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సాధిద్దామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు సాధించేందుకు మరో పోరాటానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని భగవాన్దా స్ తనయుడు బీఆర్ లెనిన్ అన్నారు. వీసీకే పార్టీ అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్, న్యాయవాది గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ భూనిర్వాసితులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని పార్లమెంట్లో ఎంపీలతో మాట్లాడించాలని సూచించారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడు తూ ఉద్యోగాల కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వే జేఏసీ చైర్మన్ కొండ్ర నర్సింగ్ మాట్లాడుతూ తమ పోరా టానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐటీ యూ నాయకులు కారు ఉపేందర్, రాగుల రమేశ్, భారత్ బచావో నాయకులు వెంగళ్రెడ్డి, రాంబ్రహ్మం, సీపీఐ నాయకులు రవి, వెంకట్రాజం, టీటీ యూ నేత మూల కృష్ణమూర్తి, అంబేడ్కర్ సంఘం నాయకులు జవాజీ కిషన్, మాల మహానాడు జాతీ య ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి పసునూరి మనోహర్, నాయకులు అంకేశ్వరపు రాంచందర్, సుంచు రాజేందర్, నరేందర్, రాజయ్య, ప్రదీప్కుమార్, కుమార్ పాల్గొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో గోవిందరాజు, పగి డ్దిరాజు గద్దెల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి పూజారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతన గద్దెలపై ఈ నెల 24 తేదీన ధ్వజ స్థంబాలను పూజారులు పునప్రతిష్ఠించనున్నారు. ప్రాంగణంలో ఉన్న గోవిందరాజు, పగిడ్దిరాజు పాతగద్దెలను ఇటీవల కదిలించి న విషయం తెలిసిందే. కాగా ఈనెల 23వ తేదీ సా యంత్రం వరకు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తారా లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి. 24న కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం -
పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి..
మహబూబాబాద్ రూరల్ : ఓ రైతు పత్తి పంట విక్రయించి వస్తూ మృత్యుఒడికి చేశాడు. టిప్పర్.. బొలెరోను ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ రెండో ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్ (55) పత్తి అమ్మడానికి ఈ నెల 18వ తేదీ( గురువారం) వరంగల్ వ్యవసాయ మార్కెట్కు వెళ్లాడు. పత్తి విక్రయించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి నర్సంపేట మీదుగా బొలెరోలో ఇంటికి వస్తున్నాడు. ఈ క్ర మంలో మహబూబాబాద్ మున్సిపాలి టీ పరిధి జమాండ్లపల్లి శివారులో టిప్పర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనుకకు వచ్చింది. అంతలోనే బొలెరో నడుపుతున్న డ్రైవర్ నరేశ్ తన వాహనాన్ని అదుపు చేసేలోగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో బోల్తా పడి పక్కకు పడిపోగా ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ నరేశ్కు తీవ్ర గాయాలుకావడంతో అతడిని ఖమ్మంలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బొలెరోను ఢీకొన్న టిప్పర్.. అక్కడికక్కడే రైతు మృతి జమాండ్లపల్లి శివారులో ఘటన -
వాట్సాప్కు వచ్చే లింక్లు ఓపెన్ చేయొద్దు
● మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గార్ల: వాట్సాప్లకు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. సైబర్ క్రైం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం గార్లలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థిలకు అవగాహన కల్పించారు. కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ‘నేను బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను.. మీ అకౌంట్ ఏటీఎం బ్లాక్ అయింది.. మీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పండి.. సరిచేస్తాం..’ అని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు. అకౌంట్ నంబర్ చెబితే దుండగులు నగదు మాయం చేస్తారని వివరించారు. ఒకవేళ అకౌంట్ల నుంచి నగదు పోతే వెంటనే సైబర్ క్రైం పోలీసుల టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం అందించాలన్నారు. తల్లిదండ్రులకు సైతం సైబర్ క్రైం మోసాల గురించి వివరించాలని సూచించారు. 12 లేదా, 14 డిజిట్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దన్నారు. డీఎస్పీ వెంట సీఐ రవికుమార్, ఎస్సై సాయికుమార్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు. -
స్టేషన్ఘన్పూర్లో ఫ్లెక్సీల కలకలం
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీ ల ఏర్పాటు కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ సర్పంచ్ తాటికొండ సురేశ్ తదితరులు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శనివారం నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించే యత్నం చేయగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని వాగ్వాదం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటునకు అనుమతి ఉండాలని కమిషనర్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా అని నిలదీశారు. కాంగ్రెస్, ఎమ్మెల్యే కడియంకు తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీఐ జి.వేణు, ఎస్సై వినయ్కుమార్ బీఆర్ఎస్ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా బీఆర్ఎస్ నాయకులు వినకపోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం నాయకులు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పకుంటే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ ● తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణ మహబూబాబాద్ రూరల్ : తాళం వేసి ఉన్నం ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్లోని పత్తిపాక ప్రాంతానికి చెందిన బండి అరుణ ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం తమ స్నేహితురాలి ఇంటికి వెళ్లా రు. తిరిగి రాత్రి 8.30 సమయంలో ఇంటికొచ్చారు. తలుపులు పగులగొట్టి కనిపించగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. ఇంట్లోని బీరువా తలుపులు పగులగొట్టి ఉండడంతోపాటు అందులో గల తులం బంగారు చైన్తోపాటు పూజ గదిలోని 50 వెండి తులాలు అపహరణకు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, క్లూస్ టీం, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఏర్పాటు తొలగింపునకు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల యత్నం అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు..అరెస్టు చేసిన పోలీసులు -
జూడోతో ఆత్మవిశ్వాసం
వరంగల్ స్పోర్ట్స్: జూడో క్రీడతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, బాలికలు జూడోలో రాణించి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని హనుమకొండ డీఈఓ ఎల్.వి.గిరిరాజ్ గౌడ్ అన్నారు. హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో శనివారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూడో పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లా, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 140 మంది క్రీడాకారులు, రెఫరీలు హాజరైనట్లు తెలిపారు. ఇందులో విజేతలైన క్రీడాకారులు జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు పంజాబ్లోని లుథియానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ బి. రాందాన్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సుధాకర్, వాలీబాల్ సంఘం బాధ్యుడు రాముడు, జూడో కన్వీనర్ ఎం సురేశ్ బాబు, కో కన్వీనర్ నిశాంత్, తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ గిరిరాజ్ గౌడ్ అట్టహాసంగా రాష్ట్రస్థాయి జూడో పోటీలు ప్రారంభం -
గెలిచిన, ఓడిన సర్పంచ్ అభ్యర్థుల్లో ఆందోళన
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ వరకు పదిహేనురోజుల గడువు మాత్రమే ఉంది. అయితే ఇంత తక్కువ సమయం ఉన్నా.. సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారు చిన్న పంచాయతీల్లో కనీసం రూ.10 లక్షల నుంచి పెద్ద పంచాయతీల్లో రూ. 60 లక్షలకు పైగా ఖర్చుపెట్టినట్లు సమాచారం. ప్రధానంగా నామినేషన్ వేసే సమయం, ప్రధాన నాయకులు వచ్చినప్పుడు, ఊరిలో ప్రచారసమయంలో ఒకొక్కరికీ రూ.200 నుంచి రూ.400 వరకు కూలీ ఇచ్చిమరీ జనబలం నిరూపించుకున్నారు. వీటితోపాటు మందు, మాంసం, చికెన్, దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పిలిచేందుకు వాహనాలు పెట్టడం, వారికి ఖర్చులకు డబ్బులు ఇచ్చిపంపడం, చీరల పంపిణీ వంటి వాటితో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు అభ్యర్థులు తమకు వచ్చిన వచ్చిన గుర్తులు.. రింగ్, గ్యాస్ స్టౌ, కత్తెర, క్రికెట్ బ్యాట్ మొదలైనవి కొనుగోలు చేసి పంపిణీ చేశారు. పెద్ద కుటుంబాలు ఉన్నచోట పలువురు గొర్రెపోతులు, కుల సంఘాలకు పార్టీలు ఇచ్చి ఓటు వేయాలని కోరారు. ఇలా ఒకరిని చూసి మరొకరు పోటా పోటీగా ఖర్చు పెట్టారు. అప్పులసంగతేంటి..?పోటా పోటీగా ఖర్చు.. -
ఇప్పుడేం చేద్దాం?
2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లు మొత్తం సహకార సంఘాలు 99డైరెక్టర్ స్థానాలు 1,260ఏకగ్రీవంగా ఎన్నికై నవి 509ఎన్నికలు జరిగినవి 751సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్ప ట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది.సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ -
సీఏఐ అసోసియేట్ డైరెక్టర్గా బొమ్మినేని రవీందర్రెడ్డి
● 19న ముంబాయిలో బాధ్యతల స్వీకరణ వరంగల్: దేశంలో అత్యున్నత సంస్థ కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ) అసోసియేట్ డైరెక్టర్గా తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి నియమితులైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ తెలిపారు. శనివారం ముంబాయిలోని ప్రధాన కార్యాలయంలో రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపా రు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ 1921 నుంచి సంస్థ దేశ వ్యాప్తంగా గణనీయ సేవలు అందిస్తోందని తెలిపారు. దేశంలోని అన్ని పత్తి పండించే ప్రాంతాలకు ప్రాతినిథ్య వహిస్తున్న 17 ప్రాంతీయ పత్తి సంఘాలు, 4 సహకార మార్కెటింగ్ సంఘాలు సీఏఐతో అనుబంధం కలిగి ఉన్నాయన్నా రు. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025–26 సంవత్సరానికి సేవా భావంతో మార్గ నిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన నూతన కమిటీకి అధ్యక్షుడిగా వినయ్ ఎన్.కోటక్, అసోసియేట్ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డిని గత నెల 15వ తేదీన ఎన్నుకున్నట్లు తెలిపారు. ప్రా ముఖ్యత కలిగిన డైరెక్టర్ పదవీ బాధ్యతలు రవీందర్రెడ్డి శుక్రవారం కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా ముంబాయి కార్యాలయంలో చేపట్టినట్లు తెలిపారు. నూతన కమిటీకి సీఏఐ పూర్వ అధ్యక్షుడు అతుల్ ఎస్.గనట్రా, సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్రాల కాటన్ అసోసియేషన్ల ప్రతినిధులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించినట్లు రమేశ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
● వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబాబాద్: రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్ సెఫ్టీ మాసంలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థలను బాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ఆయన.. సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్తో కలిసి శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు పాల్గొన్నారు. -
అధ్వానంగా ‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధానమైన లక్ష్మీపంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్ అధ్వానంగా మారింది. 2023 అక్టోబర్ 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారం రోజులకు అన్నారం (సరస్వతి) బ్యారేజీలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర విచారణలో భాగంగా ఏన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలికంగా ఎత్తిపోతలు, బ్యారేజీల్లో నీటి స్టోరేజీ నిలిపివేసింది. అప్పటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటినిల్వలు చేయడం లేదు. దీంతో కన్నెపల్లి సమీపంలో నిర్మించిన లక్ష్మీపంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.50 కిలోమీటర్ల మేర ఉన్న గ్రావిటీ కెనాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరి గాయి. రెండుమూడు మీటర్ల లోతుకు మట్టి, గడ్డితో కూరుకుపోతోంది. అక్కడక్కడా డ్యామేజీ, పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాజెక్టులో తాత్కాలికంగా ఎత్తిపోతలు నిలిపివేయడంతో మరమ్మతులు చేపట్టడంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలానే కాలం గడుస్తుంటే శిథిలావస్థకు చేరే అవకాశం ఉంది. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిన కాల్వ పట్టించుకోని నీటిపారుదల శాఖ అధికారులు -
రేపు నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం
మహబూబాబాద్: నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. పలుచోట్ల కొత్త సర్పంచ్లు సొంతఖర్చులతో జీపీ భవనాలకు రంగులు, ఏమైనా మరమ్మతులు ఉంటే చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్పెషల్ ఆఫీసర్లచే ప్రమాణ స్వీకారం జరుగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముగియనున్న ‘స్పెషల్’ పాలన జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన స్పెషలాఫీసర్ల పాలన ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారంతో ముగియనుంది. పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం రెండు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. దీంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో నిర్వహణ బాధ్యుతలు చూసుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తెచ్చి పెట్టినా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెలలో జరిగిన మూడు విడతల ఎన్నికల ఖర్చు సైతం పంచాయతీ కార్యదర్శులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 22న ప్రమాణ స్వీకారం వాస్తవానికి ఈనెల 20వ తేదీన గ్రామపంచాయతీల పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. దీంతో ఈనెల 22న(సోమవారం) సంబంధిత అధికారులు జీపీల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, స్పెసల్ ఆఫీసర్లే సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సమస్యల స్వాగతం రెండు సంవత్సరాలుగా నిధులు లేక గ్రామాల్లో చాలా సమస్యలు పేరుకుపోయాయి. నూతన సర్పంచ్లకు సమస్యల పరిష్కారం సవాల్గా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదలైతేనే సమస్యలకు పరిష్కారం లభించనుంది. ముగియనున్న స్పెషలాఫీసర్ల పాలన ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు -
పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు
నెహ్రూసెంటర్: జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ బి.రవిరాథోడ్ శనివారం తెలిపా రు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆప్తాలమిక్ అధికారులు, రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం డాక్టర్లు, సిబ్బందికి శనివారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లోని పిల్లల్లో కనిపించే దృష్టిలోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా చదువులో ప్రతిభను మెరుగుపర్చడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఉచిత కంటి పరీక్షలు, రిప్రాక్టివ్ ఎర్రర్ గుర్తింపు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఓ సుమన్ కల్యాణ్, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, డెమో ప్రసాద్, కేవీరాజు, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: సీఎం విదేశి విద్యా పథకానికి ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.శ్రీనివాస్రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 2025 నుంచి 31 కాలంలో ఫాల్ సిజన్ అడ్మిషన్ పొందిన అర్హతగల విద్యార్థులు నేటి నుంచి జనవరి 19వ తేదీ వరకు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 91779 96098, 91825 40680 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన మహబూబాబాద్: క్లెయిమ్ చేయని ఆస్తులపై మీ సొమ్ము.. మీ హక్కు అనే నినాదంతో జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఆయన మాట్లాడారు. కై ్లమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ సొమ్మును సులభంగా పొందేలా ఈ నినాదంతో అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎల్బీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీహరి, ఏఎన్వీ సుబ్బారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పేషంట్లకు నాణ్యమైన భోజనం అందించాలి గూడూరు: ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నవారికి నాణ్యమైన భోజనం అందించాలని ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను శనివారం అడిషనల్ ఎస్పీ సూచనల మేరకు సీఐ కిషోర్, వెంకటభాస్కర్, తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రోగులకు అందుతున్న భోజనం, మెనూ, సరఫరా వివరాల రికార్డులు పరిశీలించారు. పేషంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల సమ్మేళనం కేయూ క్యాంపస్: తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల సమ్మేళనాన్ని కేయూలో ఈనెల 22, 23 తేదీల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు అన్ని యూనివర్సిటీల నుంచి సుమారు 1,000 మంది విద్యార్థులు ఈసమ్మేళనంలో పాల్గొననున్నారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏబీవీపీ కేయూ అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, వరంగల్ మహానగర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సరయి, కార్యదర్శి వీక్షిత, బాధ్యులు ధనలక్ష్మి, సాయి, అఖిల్, వినయ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ కోర్టులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఆపరేష్ కుమార్సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసు ల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జ్యుడీషియల్ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారని, అందుకోసం మూడు జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సింగరేణి వర్క్షాపు సమీపంలో ఏర్పాటు చేసిన కోర్టులు, అంబేడ్కర్ స్టేడియంలో క్రీడలను ప్రారంభించారు. హై కోర్టు న్యాయమూర్తి, మూడు జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు నా మవరపు రాజేశ్వర్రావు, మధుసూదన్రావు హైకో ర్టు చీఫ్ జస్టిస్తో కలిసి అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు, ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ, మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, న్యాయమూర్తులు నాగరాజ్, కన్నయ్యలాల్, దిలీ ప్కుమార్నాయక్, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి శ్రవణ్రావు, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ పాల్గొన్నారు. -
సులువుగా విద్యుత్ బిల్లుల చెల్లింపులు
హన్మకొండ: డిజిటల్ పేమెంట్ ద్వారా విద్యుత్ బిల్లుల సులువుగా చెల్లించొచ్చని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్ట హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యుత్ బిల్లుల చెల్లింపు యంత్రం డిజిటల్ పేమెంట్ కియోస్క్ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్గా మారుతున్న తరుణంలో ప్రతీ వినియోగదారుడు తమ నెల వారీ కరెంట్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. వినియోగదారులు నగదు రహిత చెల్లింపు చేసేందుకు డిజిటల్ పేమెంట్ కియోస్క్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ బిల్లుల చెల్లింపు కేంద్రానికి వచ్చిన వినియోగదారులు ఆన్లైన్లో చెల్లించేలా అవగాహన కల్పించేందుకు ఉద్యోగిని నియమించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్కు అలవాటు పడుతారని, తద్వారా ప్రతి ఒక్కరూ ఈ దిశగా మొగ్గు చూపుతారన్నారు. కార్యక్రమంలో సీజీఎం ఆర్.చరణ్ దాస్, జీఎంలు శ్రీనివాస్, వెంకట కృష్ణ, జయరాజ్, హనుమకొండ ఎస్ఏఓ నవీన్ కుమార్, డీఈలు విజేందర్ రెడ్డి, జి.సాంబ రెడ్డి, యూనియన్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ ఎం.రవీంద్ర బాబు, డీజీఎంలు గంటి కమలాకర్, వై.శ్రీకాంత్ కుమార్, అధికారులు మహేశ్, కుందన్ కుమార్, రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు. కియోస్క్ ద్వారా మరింత సులభం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
పర్యాటక శాఖ బ్రోచర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: పర్యాటక శాఖ చేపట్టిన ‘వీకెండ్ డెస్టినేషన్’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన బ్రోచర్ను రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి రెండు నుంచి మూడు గంటల ప్రయాణించి వరంగల్కు చేరుకుంటే అనేక పర్యాటక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇవి దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు 50 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న 100 పర్యాటక ప్రాంతాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ క్రౌడ్ సోర్సింగ్ విధానంలో సమాచారం సేకరిస్తోందని, ఇందుకు అనుగుణంగా ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి తెలిపారు. పర్యాటక ప్రదేశానికి సంబంధించిన మూడు ఫొటోలు, 60 సెకన్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకత వివరాలు జనవరి 5లోగా పంపాలని సూచించారు. విజేతలకు రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కై ట్ ఫెస్టివల్లో బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మంచి మెజారిటీ ● మాజీ మంత్రి ఎర్రబెల్లి యాదగిరిగుట్ట: ఇటీవల జరిగిన గ్రామపంచా యతీ ఎన్నికల్లో అధిక గ్రామాల్లో కాంగ్రెస్ గెలి చినప్పటికీ.. పెద్ద గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆయన శనివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓట్ల సంఖ్య చూస్తే రాష్ట్ర వ్యా ప్తంగా బీఆర్ఎస్కు మంచి మెజారిటీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని చిన్న జీపీల్లో బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడితే ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలు స్తారన్నారు. కేసీఆర్ను పోగొట్టుకున్నామనే బాఽ ద ప్రజల్లో ఉందని, రాబోయేది బీఆ ర్ఎస్ ప్ర భుత్వమేనని ప్రజల్లో న మ్మకం ఉందని పేర్కొన్నారు. -
న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి మహబూబాబాద్ రూరల్ : అర్హులైన ప్రతీఒక్కరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ ప్రతినిధులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయంపై శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయ వాల్పోస్టర్లను విడుదల చేసిన అనంతరం షాకెల్లి మాట్లాడారు. మహిళలు, పిల్లలు (18 సంవత్సరాల లోపు వారు), ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కార్మికులు, కస్టడీలో ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, కోర్టు లైజన్ అధికారి, ఎస్సై జీనత్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి క్రాంతికుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. హక్కులను అమలు చేయాలి శుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని జిల్లా న్యాయ సేవధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధ్యులు శనివా రం జిల్లా కేంద్రంలోని సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్ రావు ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. జైలు గదుల్లో గాలి, నీరు, శుభ్రమైన టాయిలెట్లు, వైద్యసేవలు కల్పించాల్సిన బాధ్యత అధికారులదేన న్నారు. అనంతరం ఖైదీల న్యాయ హక్కులపై సమీ క్ష నిర్వహించారు. అండర్ ట్రయల్ ఖైదీల పరిస్థితి, బెయిల్ అవకాశాలపై జైలు అధికారులు, ఖైదీలతో పరస్పర సంభాషణ జరిపారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థను ఎంతగా ఉపయోగించుకోవాలో ఖైదీలకు అవగాహన కల్పించారు. -
సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి చేయాలి
మరిపెడ/మరిపెడ రూరల్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ పిలుపునిచ్చారు. శనివారం మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి అధ్యక్షతన డోర్నకల్ నియోజకవర్గ స్థాయి నూతన సర్పంచ్లు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఐఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్ కుమార్తో కలిసి రాంచంద్రునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. సర్పంచ్లు హుందాగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో సమస్యలు తెలుసుకుని నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గానికి రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేశానన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. రెడ్యానాయక్ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ పెద్ద మనిషి ఎప్పుడైన గిరిజన జాతి కోసం అసెంబ్లీలో మాట్లాడినాడా.. అని ప్రశ్నించారు. రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా ఉండి బియ్యం, బెల్లం, ఇసుక దందాలు కొనసాగించారని, సీఎంఆర్ కింద రూ.12 కోట్లు ప్రభుత్వ సొమ్ము కాజేశాడని ఆరోపించారు. వందల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల స్కాం చేసి ఎక్కడ జైలుపాలు కావాల్సి వస్తోందోనని బీఆర్ఎస్లోకి వెళ్లిన ఘనత డీఎస్ రెడ్యానాయక్ ఉందన్నారు. ఆయన బిడ్డ కవిత వందల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించిందని విప్ ప్రశ్నించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి, నాయకులు షేక్ అఫ్జల్, అంబరీష, రాంలాల్, రవీందర్రెడ్డి, బత్తుల శ్రీను, చంద్రయ్య, సుధాకర్నాయక్, ఐలమల్లు తదితరులు పాల్గొన్నారు. మరిపెడలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపనమరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం వందపడకల ఆస్పత్రికి ప్రభుత్వ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత తాలూక కేంద్రంగా ఉన్న కాలంలోనే ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన సందర్భంగా జనాభా పెరుగడం, జాతీయ రహదారిపై ఉన్న ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటికొమ్ము యుగేందర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కుడితి నర్సింహరెడ్డి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ -
రెబల్స్..దారెటు!
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తుండగానే ముగిసిపోయాయి. నిన్నటి వరకు తమ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు రెబల్ సర్పంచ్లను ఏం చేద్దామని తర్జనభర్జన పడుతున్నారు. ఒక వైపు మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని రెబల్ సర్పంచ్లు చెబుతుండగా.. పార్టీ ఓటమికి కారణం వారే.. వారితోపాటు, వారికి మద్దతు తెలిపిన నాయకులను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన వారు అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. 34 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల గెలుపు.. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ మద్దతు తెలిపిన వారు కాకుండా.. మద్దతు తెలుపలేదని విభేదించి పోటీలో నిలబడి గెలిచిన వారు మొత్తం 34మంది ఉన్నారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండలం నుంచి ముగ్గురు, దంతాలపల్లి నుంచి నలుగురు, నర్సింహులపేట నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాబాద్ మండలంలో ముగ్గురు, కేసముద్రం నుంచి ఒకరు, గూడూరు నుంచి ముగ్గురు, నెల్లికుదురు నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబల్గా నిలబడి గెలిచారు. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో నలుగురు, గార్ల మండలంలో నలుగురు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ రెబల్గా నిలబడి గెలిచారు. మాదీ కాంగ్రెస్ పార్టీ అంటున్న రెబల్స్.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాం. పార్టీ మద్దతు ఇవ్వలేదు. కానీ పోటీ చేసి గెలిచినం. అంతే కానీ కాంగ్రెస్ పార్టీని విడిచి పోలేదని రెబల్ సర్పంచ్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ పెద్దలను, ఎమ్మెల్యేలను కలిసి తాము పార్టీలోనే ఉన్నామని చెప్పారు. వారితోపాటు మద్దతు తెలిపిన నాయకులు కూడా గెలిచిన సర్పంచ్లు కాంగ్రెస్లోనే ఉన్నారని, గ్రామస్థాయిలో వారి బలాన్ని మనమే అంచనా వేయకుండా మద్దతు తెలుపలేదని నాయకులకు చెబుతున్నారు. కాంగ్రెస్లో నూతన సర్పంచ్ల లొల్లి పార్టీలోకి రానివ్వొద్దు అంటున్న ఓడిన అభ్యర్థులు మాది కాంగ్రెస్ పార్టీనే అంటున్న రెబల్ సర్పంచ్లు నాయకులకు తలనొప్పిగా వ్యవహారం రెబల్స్కు బీఆర్ఎస్ గాలంకాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం రెబల్ సర్పంచ్లపైమండిపడుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకు పనిచేశాం. లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాం.. పార్టీలోనే రెబల్గా నిలబడి ఓట్లు చీల్చారు. ఇప్పుడు వారిని పార్టీలోకి తీసుకుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెబల్ సర్పంచ్లతో పాటు వారికి మద్దతుగా ఉన్న నా యకులు, కార్యకర్తలను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సంకట స్థితి లో పడ్డారు. గెలిచిన వారినిపార్టీలోకి రానివ్వకుంటే పార్టీ రెండుగా చీలిపోతుందని, ఈ ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. ఒక వేళ వారిని పార్టీలో కి తీసుకుంటే.. పార్టీకోసం నిలబడి డబ్బులు ఖర్చుచేసిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై గ్రామ స్థాయిలో మాట్లాడుకొని గెలిచిన వారు.. ఓడిన వారిని తీసుకొచ్చి పార్టీలో చేరాలని, భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉన్న పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లను బీఆర్ఎస్ తమ పార్టీలోకి రావాలని గాలం వేస్తున్నారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని అనుచరుల ద్వారా కబురు పెడుతున్నట్లు ప్రచారం. -
ఓట్లచోరీతో మూడోసారి అధికారంలోకి..
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్మహబూబాబాద్ అర్బన్ : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓట్ల చోరీతో మూడోసారి అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ, ఐటీ కేసులు బనాయించిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే మురళీనాయక్, కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలు.. రాహుల్గాంధీ, సోనియా గాంధీపై కక్షపూరితంగా కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని, మోదీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిచేసుకోవాలన్నారు. లేనిపక్షంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా డీఎస్పీ తిరుపతిరావు, టౌన్, రూరల్ సీఐలు మహేందర్రెడ్డి, సర్వయ్య అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డీఎస్పీ చొరవతో ఎమ్మెల్యే, నాయకులు ధర్నాను విరమించుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, నాయకులు అంజయ్య, శంతన్రామరాజు, అరేంపుల విజయమ్మ, బండారు వెంకన్న, మహేందర్రెడ్డి, కొమ్మలు,వెంకన్న, సప్పిడి రంజిత్, శ్యామ్, విజయ, నాగమణి పాల్గొన్నారు. -
భద్రతానైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
హన్మకొండ: రోడ్డు భద్రతా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. గురువారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో అద్దె బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత– సురక్షిత డ్రైవింగ్ –నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని సూచించారు. బస్సు నడుపడంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ తన వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి డ్రైవర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ మాట్లాడవద్దని కోరారు. ప్రతి డ్రైవర్ సరైన పోషకాహారం తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలను నివారించడానికి చాకచక్యంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. శిక్షణలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భా నుకిరణ్, వరంగల్ రీజియన్లోని అన్ని డిపోల ను ంచి ఎంపిక చేసిన అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
రూ.49.34కోట్ల మద్యం విక్రయాలు
మహబూబాబాద్ రూరల్: మూడు విడతల్లో కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.49.34 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా అన్ని పార్టీలు జీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు ఇచ్చారు. ఇందులో అధికంగా మద్యం బాటిళ్లు ఓటర్లకు పంపిణీ చేశారు. కాగా ఈనెల 1నుంచి 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 47,363 లిక్కర్ బాక్సులు, 48,684 బీర్ల బాక్సులు మొత్తంగా రూ.49.34 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలవేళ...పెరిగిన మద్యం విక్రయాలు.. సాధారణంగా జిల్లాలో ప్రతీనెల సుమారు రూ.50 నుంచి రూ.55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నెలరోజుల పాటు జరగాల్సిన మద్యం విక్రయాలు కేవలం 15రోజుల వ్యవధిలోనే రూ.49.34 కోట్ల మేరకు జరిగినట్లు తెలిసింది. -
కుష్ఠును తరిమేద్దాం..
● లెప్రసీ కట్టడికి వైద్యారోగ్యశాఖ చర్యలు ● ప్రారంభమైన ఇంటింటి సర్వేనెహ్రూసెంటర్: ప్రమాదకరమైన కుష్ఠువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నివారణే ధ్యేయంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో 886 బృందాలతో ఇంటింటి లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,28,374 ఇళ్ల సర్వేలో భాగంగా పరీక్షలు చేపట్టి కుష్ఠువ్యాధి అనుమానితులును గుర్తించనున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం 70కుష్ఠు కేసులు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు.. చర్మంపై మచ్చలు, మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మచ్చలు ఎరువు లేదా రాగి, గోధుమ రంగులో ఉండడంతో పాటు మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ ఉండదు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా చికిత్స తీసుకుని నివారించ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రెండేళ్ల వయసు పైబడిన వారికి వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాఽధి కట్టడికి.. కుష్ఠు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇంటింటికీ వైద్యారోగ్యశాఖ సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఆశకార్యకర్తలు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. జిల్లాలో సర్వే నిర్వహించి ప్రతీ ఒక్కరిని పరీక్షించి వ్యాధి వ్యాప్తి కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్సను అందించనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే..కుష్ఠు వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగు మచ్చలు ఉన్నట్లయితే, అనుమానితులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నివారణకు ప్రజలు అవగాహన పెంచుకుని ముందుకు రావాలి. వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి, నివారణ చర్యలు తీసుకుంటున్నాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ సర్వే చేయాల్సిన రోజులు 14 సర్వే బృందాలు 886 విజిట్ చేయాల్సిన ఇళ్లు 2,28,374 ప్రస్తుతం కేసుల సంఖ్య 70 -
ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత యాసంగి సీజన్లో ఎరువులు పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. హైదరాబాద్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. ఈ స ందర్భంగా గోపి మాట్లాడుతూ.. ఇకపై రైతులు యూరియా కోసం సమయం కేటాయించాల్సిన అవసరంలేదన్నారు. రైతులు పంటల కోసం వినియోగిస్తున్న యూరియా ఎంత మేరకు అవసరం, ఆ కోటాను రైతులు వారి ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, సాంకేతిక వ్యవసాయ సహాయ సంచాలకుడు మురళి, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి రాంజీ, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. యాప్ ద్వారా యూరియా సరఫరా చేయాలి కురవి: ఎరువుల డీలర్లు యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేయాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. గురువారం కురవి రైతువేదికలో యూరియా బుకింగ్ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాప్లో బుక్ చేసిన రైతులకు యూరియా సరఫరా చేయకపోతే సదరు డీలర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యాప్ ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతులు దీనిపై అవగాహన పెంచుకుని యూరియా బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గుంటక నర్సింహరావు, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. పంట మార్పిడితో రెట్టింపు ఆదాయం బయ్యారం: పంట మార్పిడి వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం బయ్యారంలో ఆయన పర్యటించి సాగు చేసిన పచ్చిరొట్ట పంటను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు, మునగ వంటి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించడం వల్ల మెరుగైన ఆదాయం వస్తుందన్నారు. పచ్చిరొట్ట పంటను సాగు చేయడం వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయన్నారు. రేపు కేయూలో అవగాహన సదస్సు కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి నిర్మల గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అని తారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనో హర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామి డాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ మేఘనరావు తెలిపారు. పుణ్యస్నానాలు.. మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 21న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని వివరించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షాలిని షాకెల్లి, జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్, జూనియర్ సివిల్ జడ్జిలు, స్వాతి మురారి, ధీరజ్ కుమార్ దామెర, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, డీస్పీలు తిరుపతిరావు, కృష్ణ కిషోర్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
ఎస్ఎస్తాడ్వాయి: 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క– సారలమ్మ మహజాతరకు కేంద్ర మంత్రులు జువల్ ఓరం, కిషన్రెడ్డిని బీజేపీ జిల్లా నా యకులు ఆహ్వానించారు. గురువారం ఆదిలా బాద్ ఎంపీ గోడం నాగేశ్ ఆధ్వర్యంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, నాయకులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భరతపురం నరేశ్, పోదెం రవీందర్, సంతోష్ కుమార్ ఉన్నారు.బైక్ను ఢీకొన్న బొలెరో ● యువకుడి మృతి, మరొకరి పరిస్థితి విషమం కాటారం: కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్డు కొండంపేట క్రాస్ వద్ద బొలెరో.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న యువకుడు మృతి చెందగా మరొ కరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేటకు చెందిన శనిగరం రాఘవ, వలెంకుంటకు చెందిన మంతెన గణేశ్(20) గురువారం బైక్పై గంగారం ఎక్స్ రోడ్డు వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో మంథని వైపునకు వెళ్తున్న బొలెరో కొండంపేట క్రాస్ దాటుతున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న రాఘవ, గణేశ్ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గణేశ్ చికిత్స పొందుతూ మృతి చెందగా రాఘవ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి ● రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ మహబూబాబాద్ రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే రక్షక దళం విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కొనసాగించేలా కృషి చేయాలని రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేష న్ పరిధిలోని రైల్వే రక్షక దళం ఔట్ పోస్టు వి భాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే భద్రతాపరమైన విషయాలపై అధికారులు, సి బ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిధిలో చో రీలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తనిఖీల్లో కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, మానుకోట ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, సిబ్బంది ప ద్మ, జయపా ల్, శ్రీను, క న్న,శిరీష పా ల్గొన్నారు. -
ప్రజాభద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలి
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసు అధికారులకు ప్రశంసపత్రాలు, సిబ్బందికి ఎస్పీ గురువారం రివార్డులు అందజేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తికా వడంతో పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పిటిషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, నివారణాత్మక పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంశాలపై సమీక్షించి, సైబర్ నేరాలు, పోక్సో కేసులు, మాదక ద్రవ్యాలు, మద్యం అక్రమ రవాణా, ట్రాఫిక్, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అలాగే సీసీ టీవీ సర్వైలెన్స్, సీసీటీఎన్ఎస్ వంటి ఆధునిక సాంకేతికత వినియోగం, మద్యం మత్తులో వాహనాల నడపడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ఉల్లంఘనలు, నంబర్ ప్లేట్లులేని వాహనాలు, డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఆస్తి నేరాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, జూదం, ఆర్థిక మోసాలు, భూవివాదాలు, చట్ట వ్యవస్థ సమస్యలు, రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ అంశాల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ప్రవర్తన, క్రమశిక్షణ, బాధ్యతతో పాటు దర్యాప్తు ప్రక్రియలు, కోర్టు మానిటరింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. -
జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
రేగొండ: జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజుకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఈక్రమంలో అతడు తరచుగా తల్లి హైమావతి, భార్యతో గొడవపడుతుండేవాడు. 2024 జనవరి 4వ తేదీన అర్ధరాత్రి తల్లితో గొడవపడి రోకలిబండతో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటిపక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ జనవరి 14న మృతిచెందింది. ఈ ఘటనపై అప్పటి ఎస్సై శ్రీకాంత్రెడ్డి కేసు నమోదు చేయగా అప్పటి చిట్యాల సీఐ వేణుచందర్.. నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనంతరం సీఐ మల్లేశ్యాదవ్ చార్జ్షీట్ దాఖలు చేశారు. గురువారం కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడు రాజుకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రమేశ్బాబు తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన గణపురం సీఐ కరుణాకర్రావు, రేగొండ ఎస్సై రాజేశ్ను భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ అభినందించారు. 108 ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ హన్మకొండ అర్బన్ : 108, 102 సర్వీస్ల ఉమ్మ డి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా పాటి శివకుమార్ బాధ్యతల స్వీకరించారు. ఇంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయనను రాష్ట్ర అధికారులు జిల్లాకు బదిలీ చేశారు. త్వరలో జరగనున్న మేడారం జాతర నేపథ్యంలో ప్రాధాన్యతను గుర్తించి ఆయనను ఇక్కడికి బదిలీ చేసినట్లు సమాచారం. వరంగల్లో పనిచేసిన సమయంలో మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల్లో చేరిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
అర్హతలేని వైద్యులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అబార్షన్ల కోసం అర్హత లేని వైద్యులను సంప్రదించి ప్రాణాలను పోగొట్టుకోవద్దని, ఎంటీపీ చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో అవకాశం కల్పించిందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం–1994పై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, బాలికలపై వివక్షత, ఎంటీపీ చట్టంపై ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హత లేకుండా అబార్షన్లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, స్కానింగ్ సెంటర్లు నియామకాలకు లోబడి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే 104, 1098, 100 డయల్ చేసి తెలియజేవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్ శశిజోత్స్న, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగదీశ్వర్, రాజుంద్రప్రసాద్, ప్రోగ్రాం అధికారి సారంగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, డాక్టర్ సుధీర్రెడ్డి, నాగేశ్వర్రావు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్రవణ్, ప్రత్యూష, డెమో ప్రసాద్, సీడీపీఓ శిరీష, వసుంధర, రాజు, లోక్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం కరపత్రాలు ఆవిష్కరించారు. -
21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: కమల్ కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ సమీపంలో గల టీటీడీ కల్యాణ మండపంలో అండర్ –07, 09, 11, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు పురస్కారంతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్ ఇతర పూర్తి వివరాలకు 9676056744 , 9154570257 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. నేటి నుంచి టెమ్రిస్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(టెమ్రిస్) ఆధ్వర్యంలో నేటి(శుక్రవారం) నుంచి మూడో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయని గురుకులాల ఆర్ఎల్సీ, క్రీడా పోటీల రీజినల్ కన్వీనర్ డాక్టర్ జంగా సతీశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధి ఆరు జిల్లాలలోని బాల, బాలికల గురుకులాల క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలురకు వరంగల్ రంగశాయిపేటలోని వరంగల్(బీ1) గురుకులంలో, బాలికలకు శంభునిపేట దూపకుంటరోడ్లోని వరంగల్(జీ2) గురుకులంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కేయూలో లాన్ టెన్నిస్ ఎంపికలు కేయూ క్యాంపస్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులకు గురువారం లాన్ టెన్నిస్ ఎంపికలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు 30 మంది హాజరయ్యారు. ఇందులో ఐదుగురు మెన్, మరో ఐదుగురు ఉమెన్స్ మొత్తం 10 మందిని ఎంపిక చేశామని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వీరు సౌత్జోన్ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. కేయూలో అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ● నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహణ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఈనెల 19 , 20వ తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో షార్ట్రన్స్, మిడిల్ రన్స్, లాంగ్రన్స్ 400, 4 ్ఠ400 మీటర్ల రిలే పరుగు పందెం పోటీలు నిర్వహించబోతున్నారు.లాంగ్ జంప్, హైజంప్, హ్యామర్త్రో, షార్ట్పుట్, జావెలిన్త్రో విభాగాల్లో పురుషుల, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడాపోటీలను వీసీ కె. ప్రతాప్రెడ్డి ప్రారంభిస్తారని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కుమారస్వామి గురువారం తెలిపారు. ఈనెల 20 ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీకాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ
హసన్పర్తి : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఈమేరకు బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఎస్ పరిధి లోని సప్తగిరి–6 కాలనీకి చెందిన సిద్దంశెట్టి నిఖిల్ దంపతులు బ్యాంకు ఉద్యోగులు. బుధవారం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చే సరికి తలుపు ధ్వంసం చేసి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. మరో ఘటనలో పక్కనే ఉన్న పరిమళ కాలనీ–22లోని రమేశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో చోరీ జరిగింది. బుధవారం తుది దశ ఎన్నికల సందర్భంగా రమేశ్ విధులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో దొంగలు బీరువాను ధ్వంసం చేసి 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలాలకు చేరుకుని జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. 13 తులాల బంగారు ఆభరణాలు మాయం కేయూ పీఎస్ పరిధిలో ఘటన -
ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
నెహ్రూసెంటర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. శీతా కాలం సందర్భంగా జిల్లాలోని అన్ని వసతి గృహాలను అధికారులు తనిఖీ చేయాలని సూచించా రు. పిల్లలకు సరిపడా దుప్పట్లు, మానసిక ,ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఉపాధ్యాయులు ప్రత్యేక డిజిటల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్, డీఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్రాజు, ఏడీ ఎస్ఎల్ఆర్ నరసింహామూర్తి, డీఏఓ విజయనిర్మల, సవిల్సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఎస్ఓ రమేష్, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ విద్యార్థులకు సూచించారు. 69వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే పోటీలకు డీఈఓ గిరిరాజ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన ప్రతి ఆటను ఓ మెట్టుగా మలుచుకుని విజయం వైపు పయనించాలని సూచించారు. విశిష్ట అతిథి, యువజన కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి మాట్లాడుతు బాక్సింగ్ ఆత్మరక్షణకే కాకుండా సమాజంలో బాక్సర్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, రెఫరీలు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులకు భోజన, ఇతర వసతులు కల్పించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని గుణలో జరగనున్న ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, కార్యదర్శి మల్లారెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి మంచాల స్వామిచరణ్, భూపాలపల్లి డీవైఎస్ఓ చిర్ర రఘు, ఆర్మీ రిటైర్డ్ అధికారి శీలం నరేంద్రదేవ్, కోచ్లు ప్రభుదాస్, శ్యాంసన్, శ్రీకాంత్, రెఫరీలు వేణు, కుమార్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ హనుమకొండలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరు -
గ్రానైట్ రాళ్లపై గ్రైండింగ్తో ఇబ్బందులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయిపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో ఆ రాళ్లపై గీతలు, ఎత్తువంపులు తొలగించడానికి గ్రైండింగ్ పనులు చేస్తుండడంతో దుమ్ము ఎగిసిపడుతోంది. గ్రైండింగ్ పనులతో గురువారం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడ్డారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి స్ప్రే చేయకుండా గ్రైండింగ్ చేపట్టడమే కారణమని భక్తులు అంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ పనులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో శ్వాసకోశ సమస్యలు కూడా వ్యాపిస్తాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుమ్ము రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
మా చిట్టి డబ్బులు ఇప్పించండి
కాజీపేట అర్బన్: మా చిట్టి డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చిట్స్ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్ఫండ్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. తొలుత కనకదుర్గ చిట్ఫండ్ బాధితుల్లోని 37 గ్రూపుల్లో 25 మందికి 3 కోట్ల రూపాయల ఎఫ్డీలను జాయింట్ అకౌంట్ జిల్లా రిజిస్ట్రార్, కనకదుర్గ చిట్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి అందజేసిన విషయం విదితమే. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ, శుభనందిని చిట్స్ బాధితులు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చేరుకుని ఫిర్యాదులు అందించారు. తాము పూర్తిగా చిట్టి డబ్బులు చెల్లించాం.. డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను వేడుకున్నారు. డీఐజీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదుల వెల్లువ -
కంకవనాలు కనుమరుగు
ఎస్ఎస్తాడ్వాయి: మహాజాతర ఏర్పాట్ల పేరుతో మేడారం అటవీ ప్రాంతంలోని కంకవనాలు కనుమరుగువుతున్నాయి. భక్తుల సౌకర్యాల పేరుతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా విలువైన కంకవనాలను నరికివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మేడారం ఆర్టీసీ బస్టాండ్లో తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తున్న గదులకు స్థానికంగా లభించే కంక బొంగులను వినియోగిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటవీ సంపదకు నష్టం.. జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా అటవీ సంపదను నాశనం చేయడం ఎంత వరకు సమంజసమనే పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు బయట ప్రాంతాల నుంచి కంక బొంగులను కొనుగోలు చేసి తీసుకొచ్చి గదుల ఏర్పాటుకు వినియోగించాల్సి ఉంది. కానీ, అక్రమంగా వెదురు బొంగులను గదులకు వినియోగిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్లో అడవుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, కంక చెట్లు నరికి వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంకవనాలకు ప్రాధాన్యం.. కంక చెట్లు మేడారం అటవీ ప్రాంతానికి జీవనాడీగా భావిస్తారు. కంక చెట్లు నేల తేమను నిలుపుకోవడంలో, వర్షపు నీటి నిల్వలో, వన్యప్రాణులకు ఆశ్రయంగా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల్లో కంక వనాలకు ప్రత్యేక ఉంది. అలాగే, సమ్మక్క– సారలమ్మ పూజా కార్యక్రమాల్లో వీటికి విశిష్టత ఉంది. సమ్మక్క–సారలమ్మను గద్దెలపై పూజారులు వెదురు బొంగులతో తయారు చేసిన బుట్టలో తీసుకురావడంతోపాటు తల్లుల గద్దెలపై కూడా కంకవనాలను పూజారులు ప్రతిష్ఠిస్తారు. ప్రతీ జాతరకు ఇదే తంతు.. ప్రతీ ఏటా జాతర సమయంలో కంక వనాలను అక్రమంగా నరికివేస్తున్నారు. కాంట్రాక్టర్లు కొంత కొనుగోలు చేసిన వెదురు బొంగులను మేడారానికి తీసుకొచ్చి వినియోగించి, మిగిలింది మేడారం అటవీ ప్రాంతంలోని బొంగులను నరికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా అటవీ అనుమతి లేకుండా వినియోగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.చర్యలు తీసుకుంటాం..ఆర్టీసీ బస్టాండ్లోని తడకలు, వె దురు బొంగులతో ఏర్పాటు చేస్తు న్న గదులను పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన వెదురు బొంగులకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నాం. మూడు రోజులు ఎన్నికల విధులకు వెళ్లాం. ఈ సమయంలో అటవీ నుంచి కంక బొంగులను తీసుకొచ్చి వినియోగించినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – సాగర్రెడ్డి, సెక్షన్ ఆఫీసర్మేడారంలో వెదురు చెట్ల నరికివేత ఆర్టీసీ బస్టాండ్లో తడకల గదులకు వినియోగం పట్టించుకోని అటవీశాఖ అధికారులు -
పొలం దున్నుతుండగా తిరగబడిన ట్రాక్టర్..
నెల్లికుదురు: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన హెచ్. యాకయ్య (45) వివాహ అనంతరం అత్తగారి గ్రామం మండలంలోని శ్రీరామగిరిలో స్థిరపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మండలంలోని బంజరకు చెందిన ఓ రైతు తన ట్రాక్టర్ డ్రైవర్ రాకపోవడంలో ఒక్క రోజు (యాక్టింగ్ డ్రైవర్గా) డ్రైవర్గా పిలువగా యాకయ్య వెళ్లి పొలం దున్నుతున్నాడు. ఈ సమయంలో ట్రాక్టర్ దిగబడగా బయటకు తీస్తున్న క్రమంలో తిరగబడి యాకయ్య మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలికి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. ఒక్క రోజు పనికి పోకుంటే బతికెటోడివి బిడ్డో అంటూ బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఎస్సై చిర్ర రమేశ్ బాబును వివరణ కోరగా యాకయ్య మృతిపై ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. అక్కడికక్కడే డ్రైవర్ మృతి బంజర గ్రామంలో ఘటన -
ఓటెత్తిన పల్లె..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగిన పోలింగ్కు ఓటర్లు బారులుదీరారు. ఓటర్లు పట్టణాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు తరలొచ్చి ఓట్లు వేయడంతో సందడి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లను స్థానికులు, సర్పంచ్ అభ్యర్థులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఎన్నికల విధుల్లో ఎంపీడీఓకు అస్వస్థత.. మృతి వెంకటాపురం(కె) : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్(58) అస్వస్థతకు గురయ్యారు. బు ధవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు సమయంలో ఆరో గ్య సమస్య తలెత్తడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.తగ్గిన ఓటింగ్.. ● 2019 కన్నా తక్కువ పోలింగ్ .. హన్మకొండ అర్బన్: జిల్లాలో 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పు డు 7 మండలాల్లోని మొత్తం 130 జీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఒంటిమామిడిపల్లి మినహా మిగతా 129 జీపీలకు మూడు విడతల్లో నిర్వహించారు. తర్వాత మండలాలు మారడంతో ప్రస్తుతం 12 మండలాల పరిధిలో జీపీ ఎన్నికలు జరిగాయి. మొత్తం రెండు ఎన్నికలు పోల్చిస్తే అప్పుడే జిల్లాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో ఐనవోలు మండలంలో 90 శాతం పోలింగ్ నమోదైంది.గత, ప్రస్తుత పోలింగ్ వివరాలు ఫేజ్ 2019 పోలింగ్ 2025 పోలింగ్ శాతం శాతంమొదటి 89.02 83.95 రెండు 86.83 87.34 మూడు 88.80 86.44 -
ప్రజాస్వామ్యంలో మేము సైతం..
గుట్టలు దిగి.. వాగులు దాటి క్రమం తప్పకుండా ఓటేస్తున్న పెనుగోలు గిరిజనులువాజేడు: పెనుగోలు.. ఇది పచ్చని అడవి మధ్యలోని ఎత్తైన గుట్టలపై నున్న ఆదివాసీ కుగ్రామం. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధిలో ఉన్న ఈ గూడేనికి రాకపోకలు సాగించాలంటే ఎన్నో వ్యయప్రసాలకు ఓర్చుకుని 3 గుట్టలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. అలాగే మూడు వాగులు దాటాలి. 15 కిలో మీటర్లు నడచి రావాలి. ఇక్కడ 10 కుటుంబాలు, 38 మంది జనాభా ఉన్నారు. 25 మంది ఓటర్లు ఉన్నారు. అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నా ఇక్కడి ఆదివాసీలు ఓటు హక్కు వినియోగంలో మైదాన ప్రాంత ప్రజల కంటే చైతన్యవంతులు. ఉన్నత విద్యావంతులతోపాటు రహదారి సౌకర్యం ఉన్న ప్రాంతాల ప్రజలు ఓటు వేయడానికి బద్దకంగా ఉంటున్న ఈ రోజుల్లో పెనుగోలు గిరిజనులు మాత్రం రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి బతుకులు మాత్రం మారడం లేదు. ప్రస్తుత జీపీ ఎన్నికల్లోనూ తమ ఓటు వినియోగించుకున్నారు. కొంగాల జీపీ పరిధిలో 18 మంది, నాగారం జీపీ పరిధిలో ఆరుగురు తమ ఓటు హక్కును ఉపయోగించుకోగా బొగ్గుల లక్ష్మికి ఓటు లేకుండా పోయింది. ఓట్ల కోసమే మమ్ములను వాడుకుంటున్నారు.. ఆయా జీపీల పరిధిలో ఓటు వేసిన అనంతరం పలువురు పెనుగోలు వాసులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నామన్నారు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలని గుట్టలు దిగొచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. కేవలం తమను ఓట్ల కోసం వాడుకుంటూ ఎన్నికల తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసం మాత్రమే తమను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి సౌకర్యాలు లేవని తమ గోడువెల్లబోసుకున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి.. పెనుగోలు గ్రామానికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. రాళ్ల దారిలో వాగులు, వంకలు దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిందే. సమీపంలోని పాల వా గు, నల్ల వాగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగాల్సి పరిస్థితి. ఇక్కడి వారికి ఏ రోగం, నొప్పి వచ్చినా వైద్యం అందదు. గుట్టల పైనున్న ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రారు. కేవలం ఒక ఏఎన్ఎం మాత్రం వచ్చి వెళ్తుంది. దీంతో జ్వర మొచ్చినా, నొప్పి వచ్చినా రోగులు కిందికి రావాలి. వైద్యం కోసం వాజేడు, వెంకటాపురం(కె), భద్రాచలం, వరంగల్లోని వైద్య శాలలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రోగులను ఆస్పత్రికి తీసుకురావాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలపై పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. అలాగే, గుట్టలపై ఉన్న 10 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లతోపాటు, రెండు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని కోరారు. అయినా మారని బతుకులు ఫలితంగా గుట్టలపై దుర్భర జీవనం గడుపుతున్న గిరిజనులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ -
దూరభారమైనా.. తరలొచ్చి
నాడు భర్త.. నేడు భార్య ● సర్పంచ్లుగా దంపతులు..చదువుతోపాటు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను ఓటు స్వగ్రామం రప్పించింది. దూరభారమైనా ఎంతో మంది రాష్ట్రాలు దాటొచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. గుజరాత్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి తరలొచ్చి బుధవారం జరిగిన మూడో విడత జీపీ ఎన్నికల్లో ఓటేసి పల్లె ప్రగతిలో భాగస్వాములయ్యారు. ఓటు విలువను చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. నర్సంపేట: మాది చెన్నారావుపేట మండలం పాత మగ్ధుంపురం. నేను గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారుల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న. తెలంగాణలో జీపీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ నుంచి స్వగ్రామం వచ్చా. బుధవారం తొలిసారి ఓటు వేశా. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. –వేములపల్లి మోహిత్శ్రీరామ్, మగ్ధుంపురంఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని 10వ వార్డు సభ్యురాలిగా కూతురుపై తల్లి గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కూతురు తిక్క శ్యామల బరిలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా తల్లి ఇలపొంగు కొంరమ్మ బరిలో నిలిచారు. చివరకు ఉత్కంఠగా వెలువడిన ఫలితాల్లో 2 ఓట్ల మెజార్టీతో కూతురు శ్యామలపై తల్లి కొంరమ్మ విజయం సాధించింది. ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పాపని రూపాదేవిపై 349 ఓట్లతో గెలుపొందారు. కాగా, మహేశ్వరి భర్త పర్వతగిరి రాజు గత పర్యాయం సర్పంచ్గా పనిచేశారు. దీంతో అప్పుడు భర్త.. ఇప్పుడు భార్యను సర్పంచ్ పదవి వరించింది. మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ శివారు రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో రేఖ్యతండా గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో ప్రస్తుతం సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజ్వర్ చేశారు. దీంతో మనోహర్ భార్య పార్వతి బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ కల్యాణిపై 29 ఓట్లతో గెలుపొందారు. -
అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
● తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయిశ్రీ వరంగల్ క్రైం: అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ తెలిపారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, వరంగల్ కమిషనరేట్ సైబర్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై ప్రజలతోపాటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్లు, పెట్టుబడి మోసాలు, మ్యాట్రిమోని, ట్రేడింగ్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారో, అలాగే వారి బారిన పడకుండా తీసుకోవాల్సి న జాగ్రత్తలు వివరించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అదేవిధంగా http://www.cybercrime.govin వెబ్ సైట్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ వరంగల్ విభాగం డీఎస్పీ గిరికుమార్, ఇన్స్పెక్టర్లు యాసిన్,అశోక్ కుమార్, కళాశాల ప్రిన్స్పాల్ ప్రకాశ్, ఎస్సైలు చరణ్ కుమార్, శివ కుమార్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం సర్పంచ్కి 1,010ఓట్ల మెజారిటీ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెంగని అశోక్పై 1,010 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. బుధవారం మూడో విడతలో ఎన్నికలు జరగగా..2,700 ఓటర్లు ఉండగా 2,315 ఓట్లు పోలయ్యాయి. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. అందులో మోహన్రెడ్డికి 1,497 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మెంగని అశోక్కు 487 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సంతోష్ 156, బీజేపీ బలపర్చిన మరో అభ్యర్థికి 56 ఓట్లు వచ్చాయి. మిగతావి నోటా, చెల్లని ఓట్లు ఉన్నాయి. దీంతో ప్రత్యర్థి అశోక్పై మోహన్రెడి 1,010ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన భార్య వెన్నపురెడ్డి వసంత గతంలో సర్పంచ్గా, మహదేవపూర్ ఎంపీపీగా పదవులు నిర్వర్తించారు. -
క్రీడలతో స్నేహభావం
● రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్ స్టేషన్ఘన్పూర్: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్ అన్నారు. ఫాదర్ కొలంబో స్మారకార్థం బుధవారం స్టేషన్ ఘన్పూర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్, సీనియర్ క్రీడాకారుడు విద్యాసాగర్, మాజీ ఎంపీటీసీ దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా థామస్కిరణ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటమిలు సహమజని, అందరూ స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కాగా, బోనగిరి విద్యాసాగర్ మాట్లాడుతూ తన తండ్రి ఎల్లయ్య జ్ఞాపకార్థం విజేతలకు బహుమతులు అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బొల్లు వాసు, చింత ప్రణయ్, మారెపల్లి ప్రసాద్, సీనియర్ క్రీడాకారులు అంబటి కిషన్రాజ్, పెసరు సారయ్య, గజ్జెల్లి రాజు, మాతంగి కుమార్, ఆరోగ్యం, ఆకారపు అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్దే పైచెయ్యి
మంత్రి సీతక్క ఇలాకాలో క్లీన్స్వీప్తుది పోరులోసాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే.. మూడో విడతలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడ మండలంలో ఒకటి, గంగారం మండలంలో మూడు మినహా మొత్తం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. కురవి, మరిపెడ మండలాల్లో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పరువు దక్కించారు. అదే విధంగా గంగారం మండలంలో కొడిశల మిట్టలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన మద్దతుదారు లక్ష్మియ్య, డోర్నకల్ మండలం వెన్నారం పంచాయతీలో సీపీఎం మద్దతుతో జక్కుల కౌసల్య గెలుపొందారు. పలుచోట్ల గొడవలు జరిగాయి. సీతక్క క్లీన్స్వీప్ రాష్ట్ర సీ్త్ర, శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. కొత్తగూడ మండలంలో 24 పంచాయతీలు ఉండగా.. ఇందులో తన సొంత గ్రామం మోకాళ్లపల్లి ఉన్న మోడ్రాయిగూడెం జీపీతో పాటు ఆరు పంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. మిగిలిన 18 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా దుర్గారం జీపీ మినహా మిగిలిన 17జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. గంగారం మండలంలో 12 పంచాయతీలు ఉండగా మూడు జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో రెండు పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక పంచాయతీ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ మద్దతుదారు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన తొమ్మిది పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరు జీపీలు కాంగ్రెస్, మూడు జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇలా ములుగు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాల్లో 36 పంచాయతీలకు 31జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఫలించని బీఆర్ఎస్ ప్యూహం.. రెండు విడతల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మూడో విడత పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయలు రచించిన వ్యూహం ఫలించలేదు. ప్రధానంగా మాజీ మంత్రులు, రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు కై వసం చేసుకునేందుకు కష్టపడ్డారు. అయితే మరిపెడ మండలంలో 13 పంచాయతీలు, కురవి మండలంలో 15 పంచాయతీలు కై వసం చేసుకొని కాస్త మెరుగ్గా ఉండగా.. డోర్నకల్ మండలంలో నాలుగు, సీరోలు మండలంలో మూడు పంచాయతీలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఏం గెలుస్తారులే అనుకున్న గంగారం మండలంలో మూడు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచి మాట దక్కించారు. పలుగ్రామాల్లో నువ్వా.. నేనా.. కొన్ని గ్రామాల్లో గెలుపోటములపై మొదటి రౌండ్ నుంచే అంచనాకు రాగా.. కొన్ని గ్రామాల్లో మాత్రం చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు కౌంటింగ్ జరి గింది. మరిపెడ మండలం రాంపురం, ఎల్లంపేట, కురవి మండలం కురవి, పెద్దతండా, సీరోలు మండలం బీల్యానాయక్ తండలో నువ్వా.. నేనా అన్న ట్లు లెక్కింపు కొనసాగింది. ఇప్పటికే ఈ గ్రామాలు సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉండడంతో చివరి వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పరిస్థితి గమనించి జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్కు మరిపెడ, కురవి మండలాల్లో ఊరటనిచ్చే ఫలితాలు ఫలించని ఆ పార్టీ నాయకుల వ్యూహం పలుచోట్ల గొడవలు, ఉద్రిక్త వాతావరణంలో పోలింగ్ మరిన్ని ఎన్నికల వార్తలు 8లోu మూడో విడత సర్పంచ్లు వీరే 9లోuఅంగన్వాడీపాయె.. ఓడిపోయె.. మరిపెడ రూరల్: మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన నారెడ్డి రాములమ్మ, ఆనేపురం గ్రామానికి చెందిన కవులూరి శిరీష అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. గాలివారిగూడెంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాములమ్మ, ఆనేపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరీష పోటీ చేశారు. కానీ ఇద్దరు తమ సమీప అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఇటు ఉద్యోగాలకు రాజీనామా చేసి.. అటు ఓటమి చెందడంతో వారు అయోమయంలో పడ్డారు. రెబల్ స్టార్లు.. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి విజయం మరిపెడ రూరల్: మరిపెడ మండలం గిరిపురం, వాల్యతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే అనూహ్యంగా ప్రధాన అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన బాదావత్ నీల(గిరిపురం), తేజావత్ నాగ(వాల్యతండా) విజయం సాధించారు. దీంతో పోటీ పడ్డ ఆయా గ్రామాల ప్రధాన అభ్యర్థులు కంగుతిన్నారు. ఇద్దరిని కాదని గెలుపొందిన నీల, నాగాలను ఆయా గ్రామస్తులు అభినందించారు. -
ఓటు వేసిన మాజీ మంత్రి
కురవి: మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్ద తండా గ్రామంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేసిన అనంతరం స్కూల్ ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసినట్లు సింబల్ చూపించారు. పోలింగ్ సరళి పరిశీలనమరిపెడ రూరల్: మండలంలోని గాలివారిగూడెం పాఠశాలలో ఎన్నికల పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిల్ వత్సల్ టొప్పో పరిశీలించారు. అలాగే మండలంలోని ఎల్లంపేట, అబ్బాయిపాలెంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మధుకర్ బాబు సందర్శించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోల ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూర్ ఆర్డీఓ గణేశ్, మరిపెడ మండల ప్రత్యేక అధికారి కిరణ్కుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలికి ఆర్డీఓ అభినందనమరిపెడ రూరల్: వీల్ చైర్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న మండలంలోని చిల్లంచర్ల గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పాకాల లక్ష్మీబాయమ్మ (107)ను తొర్రూరు ఆర్డీఓ గణేష్ అభినందించారు. నేటి తరానికి ఆమె ఆదర్శమని కొనియాడారు. ఆర్మీ మాజీ జవాన్ ఓటమిమరిపెడ రూరల్: మండలంలోని ఎడ్జెర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆర్మీ మాజీ జవాన్ భూక్య వీరన్న ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ మద్దుతుతో సర్పంచ్గా పోటీ చేసిన వీరన్న తన సమీప కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు బాదావత్ లక్ష్మీపతిపై ఓడిపోయారు. -
ముగిసిన జీపీ ఎన్నికలు
మహబూబాబాద్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ ప్రక్రియ ఉదయం మందకొడిగా ప్రారంభమై 9గంటల తర్వాత ఓటర్లు బారులుదీరడంతో ఒక్కసారిగా ఊపందుకుంది. కాగా ఆరు మండలాల్లో 88.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 150జీపీలు, 1,138వార్డుల్లో పోలింగ్.. డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆయా మండలాల్లో 169 జీపీలు, 1,412 వార్డులు ఉన్నాయి. 169జీపీల్లో 19 ఏకగ్రీవం కాగా, మిగిలిన 150 జీపీల్లో పోలింగ్ నిర్వహించారు. 1,412 వార్డులకు గాను 272 ఏకగ్రీవం కాగా రెండు వార్డుల్లో సమస్యతో ఎన్నికలు నిలిచిపోగా.. మిగిలిన 1,138 వార్డుల్లో పోలింగ్ జరిగింది. 88.52 శాతం నమోదు.. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఓటర్లు బారులుదీరారు. కాగా నిర్ణీత సమయం వరకు క్యూలో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఆతర్వాత బారులుదీరడంతో ఓటింగ్ శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. డోర్నకల్ టాప్.. డోర్నకల్ మండలంలో 91.11శాతం పోలింగ్ నమోదై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. 90.12శాతంతో సీరోలు రెండో స్థానం, 89.92 శాతంతో మరిపెడ మండలం మూడో స్థానంలో నిలిచింది. కాగా మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. మొదటి విడతలో 86.99 శాతం, రెండో విడతలో 85.05శాతం, మూడో విడతలో 88.52 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పురుషులదే పైచేయి.. ఆరు మండలాల్లో 1,60,587మంది ఓటర్లు ఉండగా.. వారిలో 78,746 మంది పురుష ఓటర్లు, 81,837 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే 78,746 మంది పురుష ఓటర్లకు 69,986 మంది ఓటు వేయగా 88.88శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మహిళా ఓటర్లు 81,837 మంది ఉండగా.. 72,163ఓటు వేయగా 88.18 శాతంపోలింగ్ నమోదైంది. మహిళల కంటే పురుషులే అధికంగా ఓటు వేశారు. పోలింగ్, కౌంటింగ్ సరళిని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ప్రత్యేక అధికారులు, ఎన్నికల అబ్జర్వర్లు పరిశీలించారు.మండలాల వారీగా ఓటర్లు, పోలింగ్ శాతం మండలం మొత్తం పోలైన ఓట్లు పోలింగ్ ఓటర్లు శాతం డోర్నకల్ 2,9091 2,6506 91.11 గంగారం 7,958 6,763 84.98 కొత్తగూడ 1,9530 1,6289 83.41 కురవి 4,3894 3,8508 87.73 మరిపెడ 4,3551 3,9161 89.92 సీరోలు 1,6563 1,4926 90.12 మొత్తం 1,60,587 1,42,153 88.52 (సరాసరి)మూడో విడత పోలింగ్ ప్రశాంతం 88.52 శాతం ఓటింగ్ నమోదు 1,60,587ఓట్లకు గాను 1,42,153ఓట్లు పోలింగ్ క్యూలో బారులు దీరిన ఓటర్లు ఉదయం మందకొడిగా సాగిన ప్రక్రియ పోలింగ్ సరళిని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
ఉపాధ్యాయుల సర్దుబాటు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు వేయడంతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పిల్లలు స్వచ్ఛందంగా సెలవులు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈమేరకు మంగళవారం సాక్షి దినపత్రికలో ‘పాఠాలు చెప్పేది ఎవరు?’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై డీఈఓ రాజేశ్వర్ స్పందించారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎన్ని కల డ్యూటీలు పడ్డాయి. వారి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించారన్నారు. వారి స్థానంలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎంఈఓల సహకారంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్నారు. గార్లవాసికి ఆహ్వానం గార్ల: విజయవాడలో ఈనెల 27, 28న నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు గార్లకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు మంగళవారం ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మాతృభాష ప్రయోజనాలు, ప్రాముఖ్యతను వివరిస్తూ తెలుగు సాహిత్య, సాంస్కృతిక కళాభివృద్ధిని కాంక్షిస్తూ 27, 28వ తేదీల్లో విజయవాడలో మహాసభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో తెలుగు భాషపై కవిత గానం చేయనున్నట్లు ఐలయ్య తెలిపారు. కార్మిక చట్టాలను పాటించాలి బయ్యారం: ఇటుక బట్టీల్లో కార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్క్రిష్ణ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని నామాలపాడు, కొత్తపేటలోని ఇటుకబట్టీలను ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచికూలీలు బట్టీల్లో పనిచేసేందుకు వస్తున్నారని, వారి భద్రత యజమానులదేనన్నారు. బట్టీలో పనిచేస్తున్న కూలీలతో చట్టవిరుద్ధంగా పనులు చేయించొద్దన్నారు. వైభవంగా మల్లన్న దృష్టి కుంభం ఐనవోలు: జాతరకు ముందు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున దృష్టి కుంభం వైభవంగా జరిగింది. గర్భాలయంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15వరకు సుధావళి వర్ణలేపనం పనులు పూర్తిచేశారు. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టి కుంభం ప్రక్రియను అ ర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఆర్జిత సేవలు, దైవదర్శనాల ను పునరుద్ధరించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుఃసంక్రమణ పూజలు చేశారు. దృష్టి కుంభం ఇలా.. గర్భగుడికి ఎదుట ఉన్న మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నరాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి, కూష్మాండ బలి నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నరాశి, అద్దం, మేకలపై పడే విధంగా కుంభ హారతి ఇచ్చారు. ముగిసిన ప్రధాన ఘట్టం.. దృష్టి కుంభం నిర్వహిస్తే భక్తుల దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని తెలిపారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్గౌడ్, ఈఓ సుధాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్, వేద పారాయణదారులు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భాను ప్ర సాద్, మధు, శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్, పోషయ్య, ధర్మకర్తలు రేణుక,శ్రీనివాస్, మహేందర్, కీమా, ఆనందం పాల్గొన్నారు. -
24వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులన్నీ ఈ నెల 24వ తేదీ వరకు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ములుగు ఎస్పీ మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్ను ఆదేశించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు. జాతరలో బందోబస్తుకు వచ్చే సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. -
నిట్లో వర్క్షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం.గంగేశ్వర్ పాల్గొన్నారు. -
జీపీ పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని డోర్నకల్, కురవి, సీరోలు, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాల్లో జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలసత్వం వహించొద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐదుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50మంది ఎస్సైలు, సుమారు వెయ్యి మంది సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వద్ద, 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమనిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిలేదని, బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పోరు రసవత్తరం!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు మూడో విడత ఎన్నికల పోలింగ్పై దృష్టిపెట్టారు. ఇదే ఆఖరి మోఖాగా భావించి రెండు పార్టీల నాయకులు తమ మద్దతుదారులను సర్పంచ్లుగా గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడో విడతలో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, డోర్నకల్, కురవి, సీరోలు, ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 169 జీపీలు ఉండగా 19 పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్నారు. మిగిలిన పంచాయతీల్లో మూడో విడత పోరు రసవత్తరంగా సాగుతోంది. హస్తగతం కోసం.. గ్రామ పంచాయతీలు ఎక్కువగా గెలుచుకోవడం అంటే చేసిన పనికి మార్కులు వేయించుకోవడం.. మీ బలం ఏంటో తెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ పార్టీ నాయకులు అత్యధికంగా సర్పంచ్ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర సీ్త్ర, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. తన సొంత మండలం కొత్తగూడలో ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా అన్ని స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా గంగారం మండలంలో సీతక్క కోడలు కుసుమాంజలి ప్రచారం చేశారు. కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేయాలని కార్యకర్తలకు చెప్పి ప్రచారం ముమ్మరం చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెన్ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రచారం చేయడం, సభలు పెట్టి కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రులు.. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడానికి మాజీ మంత్రులు డీఎస్. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని మరిపెడ, కురవి, డోర్నకల్, సీరోలు మండలాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. సత్యవతి రాథోడ్ సొంత మండలం కురవితోపాటు ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, స్థానిక నాయకులను కలుపుకొని మంత్రి సీతక్క ఇలాఖాలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచేలా ప్రయత్నం చేస్తున్నారు. నేడు చివరి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ హస్తగతం కోసం మంత్రి, ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల యుద్ధంవిమర్శలు.. ప్రతి విమర్శలు.. పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరడంతో ఇదే ఆఖరి మోఖాగా భావించి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి రెడ్యానాయక్ ప్రస్తుత ఎమ్మెల్యే రాంచంద్రునాయక్పై చేసిన విమర్శలు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారాయి. సూర్యాపేటలో ఎమ్మెల్యే నేరచరిత్ర ఉందని, ఆయన క్యారెక్టర్ మంచిది కాదని మాజీమంత్రి బహిరంగంగా చెప్పి అందరని విస్మయానికి గురిచేశారు. అలాగే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్... మాజీ మంత్రి రెడ్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టడం, వారు చేసిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గంలోని ఒక నాయకుడిపై మంత్రి సీతక్క చేసిన విమర్శలకు బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బడే నాగజ్యోతి విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్కను విమర్శించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు నాయకులు చేస్తున్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
అసంక్రమిత వ్యాధులను గుర్తించాలి
నెహ్రూసెంటర్: అసంక్రమిత వ్యాధుల నివారణలో భాగంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 సంవత్సరాలు పైబడిన వారందరినీ వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేయాలని సూచించారు. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా పుట్టిన శిశువులందరికీ సంపూర్ణ టీకాలు అందించాలని సూచించారు. క్షయవ్యాధి నివారణకు తెమడ పరీక్షలు పెంచి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలని తెలి పారు. గర్భిణుల నమోదు చేస్తూ వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సారంగం, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, సుమన్కల్యాణ్, విజయ్కుమార్, శ్రవణ్, ప్రత్యూష, డెమో ప్రసాద్, డీపీఎంఓ వాల్యా, సీహెచ్ఓ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పాలన
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య నెహ్రూసెంటర్: దేశంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహా సభను దివిల వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డ్ ఉద్యోగులను పాలకులు విస్మరిస్తున్నారని, వారికి చెల్లించాల్సిన పెన్షన్ ను సైతం ఎత్తివేసేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని, వాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రతీ ఐదేళ్లకు ఓసారి పే రివి జన్ కమిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 70ఏళ్ల నుంచే అదనపు పెన్షన్ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల డీఏ, డీఆర్లను వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నా రు. అదానీ, అంబానీ, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాటుపడుతున్నాయని, హక్కులు, చట్టాల అమలు కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగ అరుణ, తూపురాణి సీతారాం, యాకూబ్, మల్లయ్య, పి.రాజయ్య, డీటీఓ వి.సత్యనారాయణ, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
● పంచాయతీ ఎన్నికల పరిశీలకుడు మధుకర్ బాబుమరిపెడ రూరల్: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకుడు మధుకర్బాబు అన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా మంగళవారం మండలంలోని పురుషోత్తమాయగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందిర్శంచారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్, పోలింగ్ సెంటర్లను పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు భోజన వసతి, రవాణా, కౌంటింగ్లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్వోలు, ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో ఆర్వోలు, ఆర్ఐ శరత్చంద్ర పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాద బాధితులు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు నుంచి జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ బీమా కంపెనీ అధి కారులు, న్యాయవాదులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఈ నెల 21న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాద బీమా కేసులను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న కేసులను గుర్తించి లోక్ అదాలత్ ద్వా రా పరిష్కరించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప రిష్కరించినట్లయితే కక్షిదారులకు డబ్బు సత్వరంగా అందడంతో పాటు బీమా కంపెనీ వారికి వడ్డీ లాభం చేకూరుతుందన్నారు. ఇరు పక్షాలు లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. -
చివరి విడతకు సిద్ధం
నేడు మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్మహబూబాబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఆరు మండలాల్లో చివరి విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు మంగళవారం ప్రతీ మండల కేంద్రంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. బుధవారం 150 జీపీలు, 1,138 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈమేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు ఇతరత్రా ఏర్పాటు చేశారు. జిల్లాలోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఆయా మండలాల్లో 169 గ్రామ పంచాయతీలు, 1,412 వార్డులు ఉన్నాయి. కాగా నెల 3నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 9న ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేశారు. 169గ్రామ పంచాయతీల్లో 19 జీపీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 150సర్పంచ్ స్థానాలకు 495 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,412 వార్డులకు గానూ రెండు వార్డుల్లో పలు కారణాలతో నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 272 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,138 వార్డుల్లో 2,857 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి విడతలో 19 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 150 జీపీల్లో 1,60,587 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 200 ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ఒక ఓపీఓ, 201నుంచి 400మంది ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401నుంచి 650మంది ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలకు విధులు కేటాయించారు. మొత్తంగా 1,919 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్కు 1,732 మంది పీఓలు, 1,894మంది ఓపీఓలు, 13మంది జోనల్ ఆఫీసర్లు, 61మంది రూట్ ఆఫీసర్లు, ఒకరు ఏఆర్వో, 202 మందికి ఆర్వో విధులు కేటాయించారు. 38 లొకేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల బయట సహకారంగా పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు విధులు నిర్వర్తిస్తారు. మండలానికి ఒక పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. డోర్నకల్ మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ఎస్లో, గంగారం ఏహెచ్ఎస్ (ఆశ్రమ పాఠశాల), కొత్తగూడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, కురవి ఎంపీడీఓ కార్యాలయం, మరిపెడ సెయింట్ అగస్టీన్ పాఠశాల, సీరోలు మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. కురవి, సీరోలు మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. డోర్నకల్లో ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, గంగారం మండలంలో ప్రత్యేక అధికారి వెంకటరమణ, మరిపెడ మండలంలో ప్రత్యేక అధికారి కిరణ్కుమార్ పంపిణీని పరిశీలించారు. బుధవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహణ 1,732మంది పీఓలు, 1894 మంది ఓపీఓలకు డ్యూటీ 1,919 బ్యాలెట్ బాక్స్లు, 1,60,587మంది ఓటర్లు సామగ్రి పంపిణీని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
పీజీతండా... గ్రాడ్యుయేట్ సర్పంచ్..
● ఆ ఊరిలో అందరూ పీజీలే.. దుగ్గొండి: అది ఓ మారుమూల గిరిజన తండా. గత ప్రభుత్వ కాలంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసే క్రమంలో ప్రత్యేక గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 120 నివాస గృహాలు ఉన్నాయి. 540 జనాభా ఉన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఓ గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఊరి బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆ గ్రామం పీజీతండాగా గుర్తింపు పొందింది. గ్రామ పంచాయతీల గెజిట్లోనూ పీజీతండాగా గుర్తించ బడింది. ఈనెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికలలో డిగ్రీ పూర్తిచేసిన 30 సంవత్సరాల యువకుడు లావుడ్యా చంద్రశేఖర్ పోటీ చేసి గెలుపొందారు. గ్రామంలోని అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అందుకోసమే తాను సర్పంచ్ బరిలో నిలిచానని చంద్రశేఖర్ తెలిపారు. మామ సపాయి.. కోడలు సర్పంచ్ బచ్చన్నపేట : మండలంలోని బోనకొల్లూర్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన చిక్కుడు కల్పన మామ బాలయ్య ఆ గ్రామ సపాయిగా పని చేస్తున్నాడు. గత 35 ఏళ్లుగా బాలయ్య గ్రామ సపాయిగా విధులు నిర్వర్తిస్త్తున్నాడు. మామ సపాయి కావడంతో గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కల్పనకు సులువుగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. బాలయ్య కుటుంబంలోని కోడలును సర్పంచ్గా ఆదరించడంపై ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రెమ్యునరేషన్ ఇవ్వాలి
గైడ్లైన్స్ మేరకుకాళేశ్వరం: రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం తమకు రూ.2,500 రెమ్యునరేషన్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మహదేవపూర్ మండల కేంద్రంలో మూడో విడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లకుండా జిల్లాపరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద భోజన విరామం అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి, రెండు విడతల్లో విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బందికి రూ.2,500 ఇవ్వకుండా రూ.1,500 ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ప్రస్తుతం మూడో విడతలోనూ అధికారులు అదే విధానాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. రూ.2,500తో పాటు ఒక రోజు ఆన్డ్యూటీ(ఓడీ) ఇవ్వాలని భీష్మించారు. సాయంత్రం వరకూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దనే వేచి ఉన్నారు. ఈ ఘటన తెలుసుకున్న కలెక్టర్ రూ.2 వేలు ఇస్తున్నట్లు తెలపడంతో ఎంపీడీఓ రవీంద్రనాథ్.. పోలింగ్ సిబ్బందికి హామీ ఇచ్చారు. అలాగే, ఓడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొనడంతో పోలింగ్ సిబ్బంది నిరసన విరమించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.పోలింగ్ సిబ్బంది డిమాండ్ కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన దిగొచ్చిన జిల్లా అధికారులు రూ.2వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తరలిన సిబ్బంది -
‘కోట’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ఖిలా వరంగల్: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చారిత్రక ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగా రాతికోట చుట్టూ బోటులో పర్యాటకులు షికారు చేసేలా అగర్త చెరువు అభివృద్ధి, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ రాతికోట ఉత్తర ద్వారం వద్ద ‘కుడా’ ఆధ్వర్యంలో రూ. 2కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘మోటు’ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కట్టడాలను పరిరక్షిస్తూ విశిష్టతను భావితరాలకు అందజేస్తామని, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం 32,37,41 డివిజన్లలో మొత్తం రూ.4కోట్ల 10లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశాయిపేట, దూపకుంటలో లబ్ధిదారులకు త్వరలో 2,200 ఇళ్లు కేటాయించనున్నామని, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని(ఐడీఓసీ) సీఎం చేతుల మీ దుగా ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ‘కుడా’ అధికా రులు అజిత్రెడ్డి, ఏఈ భరత్, కాంగ్రెస్ నేతలు గోపాల్ నవీన్ రాజ్, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, మడిపల్లి కృష్ణ, బోగి సురేశ్, దామోదర్యాదవ్, సాగర్ల శ్రీనివాస్, గజ్జల శ్యామ్, చందర్, వీరన్న, రాజేశ్, కత్తెరశాల శ్రీధర్ పాల్గొన్నారు. ● వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్తోటలో రూ.50లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 41వ డివిజన్ శంభునిపేట నాగమయ్య దేవాలయం ప్రాంతంలో రూ.1.10 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కరీమాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం 35వ డివిజన్ శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ ప్రవీణ్తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ‘తూర్పు’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్సీ సారయ్యపై మంత్రి సురేఖ విమర్శలు ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మమ్ముల్ని ఢీకొనడం ఎవరి చేతకాదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్సీ సారయ్యనుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. మంత్రి తన నియోజకవర్గంలో తన అనుచరుడు ఒకరు ఎమ్మెల్సీ సారయ్య వర్గంలోకి వెళ్లడంపై స్పందించారు. బలహీనులు బలవంతుల వెనుకపడతారని, తాము బలవంతులం కాబట్టే మమ్ముల్ని ఢీకొనడం చేతక కాక మా వెనుక గోతులు తవ్వుతున్నారని ఘాటుగా విమర్శించారు. వారి అల్ప సంతోషం, ఆనందాన్ని తాము అడ్డుకోబోమని అన్నారు. -
చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి
● లోహితలో ఘటన సంగెం: చలిమంటల్లో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహితలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తునికి రజిత, శివ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు రజిత తల్లిదండ్రులు బొమ్మెర కమల, యాకయ్య(65) కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి యాకయ్య చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డాడు. శరీరం కాలుతుండగా కేకలు వేయడంతో కూతురు రజిత, భార్య కమల వచ్చి చద్దర్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన 108లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
జనరల్ స్థానంలో దళిత యువకుడి గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో జనరల్ స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన గాదెపాక విష్ణు విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడిగా (ఎంఏ,బీఈడీ) గ్రామంలోనే ఉంటూ బీఆర్ఎస్లో చురుగ్గా పని చేసేవాడు. అతనికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుండా మరో అభ్యర్థిని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి ఎనగందుల వెంకన్న (కాంగ్రెస్ బలపరిచిన) పై 85 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1,177 ఓట్లకు గాను 1044 పోలైయ్యాయి. అందులో గాదెపాక విష్ణుకు 438 రాగా, ఎనగందుల వెంకన్నకు 353 ఓట్లు వచ్చాయి. గ్రామంలోనే ఉంటూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులను ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారని నూతనంగా ఎన్నికై న సర్పంచ్ విష్ణు అంటున్నాడు. అదేవిధంగా చీటూరులో ఎస్సీ రిజర్వ్ స్థానంలో బర్ల గణేశ్ కాంగ్రెస్ రెబెల్గా పోటీ చేసి విజయం సాధించారు. -
చిట్స్ బాధితులకు చెక్కులు అందజేత
● 37 మందికి రూ. 3 కోట్ల ఎఫ్డీ విడుదల కాజీపేట అర్బన్ : చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ మంగళవారం వరంగల్ ఆర్వో కార్యాలయంలో చిట్ఫండ్ బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అక్షర, అచల, భవితశ్రీ, శుభనందిని, కనకదుర్గ చిట్ఫండ్ బాధితులకు చిట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అందజేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ నుంచి ఐదు చిట్స్కు చెందిన 206 మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో కనకదుర్గ చిట్స్కు చెందిన 37 మంది బాధితులకు రూ.3 కోట్ల ఎఫ్డీ(ఫిక్స్డ్ డిపాజిట్)ని రిలీజ్ చేసి ఆ చిట్ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డితో కలిసి చెక్కులు అందజేశామని తెలిపారు. చిట్ఫండ్ కంపెనీల నుంచి చెల్లింపులు రాని బాధితులు ఫిర్యాదు చేస్తే వారి సొమ్ము అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, గత నెల 29వ తేదీన ‘సాక్షి’లో ‘బాధితులకు భరోసా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని చూసి ఫిర్యాదు చేయగా తమకు చెక్కులు అందజేశారని, ఈ ప్రక్రియలో ‘సాక్షి’ కథనం తోడ్పడిందని బాధితులు చెప్పారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిట్స్ సిబ్బంది మహేశ్, తదితరులు పాల్గొన్నారు. వసూళ్లకు పాల్పడిన జర్నలిస్ట్ అరెస్ట్, రిమాండ్ తొర్రూరు: ఎన్నికల అధికారులుగా పేర్కొంటూ బాధితుడి నుంచి వసూళ్లకు పాల్పడిన ఓ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఉపేందర్ మంగళవారం తెలి పారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగుకు చెందిన ఆనంద్ ఈనెల 12వ తేదీన కారులో మద్యం కొనుగోలు చేసి పెద్దవంగర మండలం పోచంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. అతడిని గమనించి ప్లాన్ ప్రకారం తొర్రూరుకు చెందిన ఓ చానల్ యాంకర్ జా టోత్ ఉపేందర్, ఓ పత్రిక విలేకరి చెడుపాక రాజు.. ఆనంద్ను అడ్డగించారు. తాము ఎ న్నికల అధికారులమని చెప్పి బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ. లక్ష ఇస్తేనే కా రును వదిలేస్తామన్నారు. దీంతో బాధితుడు ఆనంద్ బంధువులకు ఫోన్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వగా వారు కారును వదిలేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు ఉపేందర్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాజును మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న మరో విలేకరిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. రామప్పలో విదేశీయులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం నార్వే, అమెరికాకు చెందిన కట్రీస్ ఆర్ మదర్వేల్, రాధవన్, భూపేందర్ కత్రీలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చే శారు. ఆలయ విశిష్టత గు రించి టూరిజం గైడ్ కరుణా నిధి, రామప్ప గైడ్ విజయ్కుమార్ వివరించగా, రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. -
భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం
ఎస్ఎస్డ్వాయి: మేడారం మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భక్తులకు ఏర్పాటు చేస్తున్న తాగునీటి వసతి, వేచి ఉండే ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర కోసం 28 ఎకరాల్లో బస్టాండ్ ఏర్పాటు, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే గదులు, తదితర నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. జనవరి 25 తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. విధుల్లో డ్రైవర్లు కండక్టర్లు, టెక్నికల్ అధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ మేడారం భక్తులకు రవాణా సౌకర్యం, బస్సుల ఏర్పాటు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతకు ముందు ఎండీ నాగిరెడ్డి అమ్మవార్లను దర్శించుకోగా పూజారులు ప్రసాదం అందజేశారు. ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీలు వెంకన్న, సాల్మన్, ఆర్ఎంలు విజయభాను, రవి చంద్ర, డీఎస్పీ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్రా సీఐ దయాకర్, ఆర్ఐ అడ్మిన్ స్వామి పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మేడారంలో పనుల పరిశీలన అధికారులతో సమీక్ష -
రెండు నెలలుగా రాని మార్కెట్ ఉద్యోగుల పెన్షన్
వరంగల్: రాష్ట్ర మార్కెటింగ్శాఖ పరిధి వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని సుమారు 1,700 మంది పెన్షనర్లకు ఫైనాన్స్ క్లియరెన్స్ లేని కారణంగా రెండు నెలలుగా పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నట్లు సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్లింగం, సాయిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగపురి సారయ్య, పి.వెంకటేశ్వర్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గత కొంత కాలంగా ప్రభుత్వ ఫైనాన్స్ శాఖలో తీసుకొచ్చిన కొత్త పాలసీలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు అప్లోడ్ చేసే సమయంలో కార్యదర్శులకు చెందిన ఇతర బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పెన్షన్ చెక్లు అప్లోడ్ చేసేందుకు సిస్టంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడాన్ని గుర్తించిన కొంత మంది మార్కెట్ కార్యదర్శులు తమ బిల్లులను పెన్షన్ చెక్కుల స్థానంలో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈవిషయంలో అన్ని ఆధారాలను సంఘం నాయకులు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు.తాము పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతూ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల వద్దకు తిరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు నెలులుగా బ్యాంకు లోన్లు, చిట్టీలు, మందులు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతూ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని, ప్రజాప్రతినిధులు పట్టించుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా 16 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. 2026 జనవరి 9,11వ తేదీల్లో సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07288) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 10, 12వ తేదీల్లో శ్రీకాకుళంరోడ్–సికింద్రాబాద్ (07289) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 10, 12,16,18వ తేదీల్లో సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07290) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 11, 13,17,19వ తేదీల్లో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ (07291) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 13వ తేదీన వికారాబాద్–శ్రీకాకుళంరోడ్ (07294) ఎక్స్ప్రెస్, జనవరి 14వ తేదీన వికారాబాద్–శ్రీకాకుళం రోడ్ (07295), జనవరి 17వ తేదీన సికింద్రాబాద్–శ్రీకాకుళంరోడ్ (07292), జనవరి 18వ తేదీన శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ (07293) ఎక్స్ప్రెస్లు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొట్టవాసల, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. -
ఓటేసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
పెద్దవంగర : జీపీ ఎన్నికల్లో స్వగ్రామం వచ్చి ఓటు వేసిన ఓ మహిళ.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వడ్డేకొత్తపల్లిలో విషాదం నింపింది. బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లికి చెందిన శ్రీరామోజు నాగమణి (48) హైదరాబాద్లో కుమారుడు వినోద్, కూతురు పరమేశ్వరితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన రెండో విడత జీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన కుమారుడితో కలిసి స్వగ్రామం వచ్చింది. ఓటు వేసిన అనంతరం బైకుపై తన తల్లిగారి గ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి శివారులో స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో నాగమణి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో కుటుంబంతోపాటు వడ్డేకొత్తపల్లిలో విషాదం అలుముకుంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడి మృతిఖమ్మంరూరల్: ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కింద పడిన యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. హనుమకొండలోని ద్వారకాసాయి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్(రిజర్వ్ ఇన్స్పెక్టర్) కుమారుడైన హర్షిత్చంద్ర తన స్నేహితుడైన పూదారి మణికంఠతో కలిసి హైదరాబాద్ నుంచి అరకుకు ద్విచక్రవాహనంపై మంగళవారం వెళ్తున్నాడు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని మూలమలుపు వద్ద గేదె అడ్డు రావడంతో తప్పించే ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హర్షిత్చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మణికంఠకు గాయాలయ్యాయి. ఘటనపై హర్షిత్ తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. అదుపు తప్పిన బైక్.. మహిళకు తీవ్రగాయాలు చికిత్స పొందుతూ మృతి -
ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమిస్తాం
వరంగల్: ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కూల్చి ఏడాది గడిచిన సందర్భంగా కూల్చిన స్థలంలోనే నూతన కార్మిక భవనం నిర్మించాలని, 318 మంది కార్మికులకు మిల్లు స్థలంలోనే 200 గజాల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈధర్నాకు ముందు ఐఎఫ్టీయూ జిల్లా అ ధ్యక్షుడు గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 2026 మార్చి 31 వరకు ప్రభుత్వ పరంగా నూతన భవనం నిర్మించాలని, లేకుంటే ఏప్రిల్ 1వ తేదీన కార్మిక భవన నిర్మాణానికి పునాది తీయాలని తీర్మానించారు. భవన నిర్మాణంతో పాటు మిల్లు కార్మికులకు స్థలం ఇవ్వాలని మరో తీర్మానం చేసిన అఖిలపక్ష నాయకులు గంగుల దయాకర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, నన్నపనేని నరేందర్, నల్గొండ రమేశ్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తన వంతుగా రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రూ.2లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్రకటించారు. ఈధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కార్మిక భవన నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని లేఖతో సందేశం పంపారు. ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, టి.నాగేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, ఐక్యవేదిక బాధ్యులు పరమేశ్వర్, పి.లక్ష్మణ్, కె.కృష్ణ, అకినె వెంకటేశ్వర్లు, సాగర్, ఎన్.ప్రతాప్, జి.రమేశ్, ఎన్.అప్పారావు, జె.కుమారస్వామి, పి.సత్యం, కె.ప్రవీణ్, రమాదేవి, ఈ.శ్రీనివాస్, ఏ.కృష్ణ, ఎస్.రవీందర్, జి.శరత్, గుత్తికొండ రవి, ఎస్.యశోద, హరినారాయణ, డి.కే, బయ్యస్వామి, కె.రాజేందర్, టి.రమేశ్బాబు, ఎం.అశోక్, జి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 318 మంది ఆజంజాహి మిల్లు కార్మికులకు పట్టాలివ్వాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి... -
నేటి నుంచి ధనుర్మాసం షురూ..
● నెలరోజులపాటు తిరుప్పావై ప్రవచనాలుమహబూబాబాద్ రూరల్: మార్గశిరమాస శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 15వ తేదీ వరకు నెలరోజులపాటు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాల కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సేవాకాలం, అర్చన, మంగళ హారతులు, పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామివారి దేవాలయం, శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయం, అనంతాద్రి స్వయంభు శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం, ముడుపుగల్లు గ్రామంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయం (గోవిందక్షేత్రం)లో నెలరోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథ స్వామివారిని ప్రసన్నం చేసుకుందని అర్చకులు తెలిపారు. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి అమ్మవారు ఆచరించిన విధంగా భక్తులంతా కూడా ఆచరించి అమ్మవారు, స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. ముస్తాబైన వేణుగోపాలస్వామి వారి దేవాలయం, శ్రీ గోదాదేవి అమ్మవారు -
ఉద్యోగుల పడిగాపులు
● పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగంలో ఇబ్బందులు కొత్తగూడ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈక్రమంలో ఉద్యోగులు నిసరస తెలిపిన ఘటన సోమవారం మండలంలో జరిగింది. మండల పరిధి 18 గ్రామ పంచాయతీల్లోని ఉద్యోగులకు ఒక్కటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరికి సుమారు 30నిమిషాల సమయం పడడంతో ఉద్యోగులు బారులుదీరి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. క్లస్టర్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈవిషయంపై ఎంపీడీఓ మున్వర్కు వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కటే కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఓపికతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. -
వరిసాగుపై మక్కువ
● యాసంగి పంటపై రైతన్నల చూపు ● పెరిగిన భూగర్భ జలాలు, నిండిన చెరువులు, కుంటలపై ఆశలుమహబూబాబాద్ రూరల్ : జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు వరిపంట సాగువైపే అధికంగా మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వానాకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చే రింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి రెండో పంట వరి సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించి, సాగుకు సన్నద్ధమవుతున్నారు. నార్లు పోయడం.. గతంతో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు చేపట్టేందుకు రైతులు యాసంగి పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు వరినార్లు పోశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు పెరిగి వరి సాగు చేస్తే, ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం, ఎస్సారెస్పీ జలాలు రానుండడంతో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. సాగుపై అంచనా.. జిల్లాలో గత ఏడాది యాసంగిలో 1,49,353 ఎకరాల్లో వరిసాగు చేయగా.. ప్రస్తుతం రైతులు 1,64,124 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే వానాకాలం పంటలు సాగు పూర్తికాగా , యాసంగి పంటల సాగు పనులు మొదలుపెట్టారు. పలుచోట్ల మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈల సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. -
ప్రలోభాల హోరు
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పంపకాల జోరు.. ● రేపు తుది విడత ‘పంచాయతీ’ .. ● జిల్లాలో 150 జీపీల్లో ఎన్నికల పోలింగ్ ● ముగిసిన ప్రచారం.. అంతుబట్టని ఓటరు నాడిసాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. జిల్లాలో మూడో విడతలో కురవి, సీరోలు, మరిపెడ, డోర్నకల్, కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోని 150 గ్రామ పంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి, మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడినా... మరికొన్ని చోట్ల అనైతిక పొత్తులతో ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుని ‘హస్తం’హవాను చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా, బీజేపీ, రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. కాగా మూడో విడత ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ముగిసిన ప్రచారం.. జోరుగా పంపకాలు... ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్కు ఒక్కరోజు గడువే ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బుతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గ్రామాల్లో పోలింగ్కు ముందురోజు ఇంటికి కిలో చికెన్, మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు వైరల్ అవుతోంది. 150 పంచాయతీలకు.. మూడో దశలో మొత్తం 169 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ మద్దతుదారులు 14, బీఆర్ఎస్ 01, సీపీఐ(ఎంఎల్) 01, ఇతరులు 03 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆయా మండలకేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయమే రిపోర్ట్ చేయాలని, తదనంతరం పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. -
ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఓ అసమర్థుడు
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మరిపెడ రూరల్: డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ కార్యకర్తలను సమన్వయం చేసుకోలేని ఓ అసమర్థుడని, ఆయనకు తన కార్యకర్తలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. సోమవారం మరిపెడ మండలం గుర్రప్పతండాలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ గుర్రప్పతండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చి పోటీలో ఉన్న రెబల్ అభ్యర్థిని సమన్వయం చేసుకోలేక అసహనంతో కార్యకర్తలను దొంగలుగా పోల్చడం తగదన్నారు. రెబల్ అభ్యర్థిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే మూలస్తంభాలని, అలాంటి వారిని దొంగలుగా దూషించడం ఏమిటని ప్రశ్నించారు. డోర్నకల్ నియోజకవర్గంపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదన్నారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన గుర్రప్పతండా నుంచే ఎమ్మెల్యే రాజకీయ పతనం మొదలైందన్నారు. ఇక్కడ అడ్రస్లేని ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని, అవగాహన లేని ఎమ్మెల్యేను ఎన్నుకోవడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. -
పరదాల చాటునే ఓటు హక్కు..
కొత్తగూడ: పరదాల చాటునే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాటివారివేంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండే గదులు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో ఆరు వార్డులు, 530 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో మూడు వార్డుల పోలింగ్ పాఠశాలలో, మూడు వార్డుల పోలింగ్ నిర్వహణకు అసంపూర్తి జీపీ భవనంలో ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా, గ్రామ పంచాయతీ భవనం చుట్టూ కిరాయి పరదాలు చుట్టి మూడు గదులుగా ఏర్పాటుచేశారు. ఏర్పాట్లను ఆర్వో శ్రీధర్ పరిశీలించి రెండు చోట్ల పోలింగ్ నిర్వహించడం వల్ల అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. -
పోలీసుల ఫ్లాగ్మార్చ్
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్ పోలీసులు సోమవారం రాత్రి వేళ ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. స్థానిక సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, గొల్లచర్ల, హూన్యాతండా తదితర గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం చూపుతూ గొడవలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి నెహ్రూసెంటర్: ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు జి.దేవేందర్, కొత్త నాగయ్య అన్నారు. మానుకోట డిపో డ్రైవర్పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన వెల్లడించారు. ఆర్టీసీ డిపో సెక్యూరిటీ, సిబ్బందిని నియమించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘ముఖ గుర్తింపు’తో సమయపాలన కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఎంఓయూ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కోల్కత్తా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు. నవ్వు పార్టీ మారుకుంటూ వస్తున్నావు.. కురవి: పార్టీలు మారుకుంటూ వస్తున్నావు.. ఇప్పుడు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్గా నిలిచావు అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీరోలు మండలం చింతపల్లిలో రాంచంద్రునాయక్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామ శివారు కొత్త తండాకు దారి సమస్య మాట్లాడేందుకు ఎమ్మెల్యే నడిచి వెళ్లారు. అక్కడ వేచి ఉన్న కొత్త తండా వాసులతో మాట్లాడే సమయంలో రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రంగన్నకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలు మారుకుంటూ వస్తున్నావు అంటూ రెబల్ అభ్యర్థి రంగన్నపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రంగన్న సైతం ఆయనతో వాదనకు దిగాడు. తనను ఎమ్మెల్యే దుర్భాషలాడినట్లు రంగన్న ఆరోపించాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో రంగన్నను దుర్భాషలాడినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పాఠాలు చెప్పేది ఎవరు ?
● ఉపాధ్యాయులకు జీపీ ఎన్నికల డ్యూటీలు ● విద్యార్థులకు విద్యాబోధనలో నిర్లక్ష్యం ● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులుమహబూబాబాద్ అర్బన్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడత పోలింగ్ ముగియగా.. మరోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు, వేలం పాటలతో సర్పంచ్లు ఖరారు కాగా, మిగిలిన గ్రామాల్లో ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం, ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. కాగా, మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ డ్యూటీ పడడంతో పిల్లలకు పాఠాలు బోధించేవారు లేకపోవడంతో పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 676 ప్రైమరీ స్కూల్స్.. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతంలో ఆయా పాఠశాలలకు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ లేని మండలాల పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీ పడ్డాయి. అక్కడ పాఠశాలలు యథావిధిగా కొనసాగాలి. కాగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికల డ్యూటీలు పడడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు కరువయ్యారు. జిల్లాలో 676 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉన్నాయి. ఇందులో సుమారు 1350 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసారి ఉపాధ్యాయులకే కాకుండా సీఆర్పీలకు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. దీంతో జిల్లాలో ఏ పాఠశాలకు, ఏ కార్యాలయానికి వెళ్లిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చొరవ తీసుకొని, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు హై స్కూల్ ఉపాధ్యాయులు పంపి పిల్లలకు బోధించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ‘పై ఫొటోలో కనిపిస్తున్నది మానుకోట పట్టణం పత్తిపాకలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఒక మహిళా హెచ్ఎం, ఒక ఉపాధ్యాయురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. సుమా రు 50మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా టీచర్లకు మూడో విడత ఎన్నికల డ్యూటీ పడడంతో పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించాల్సి దుస్థితి నెలకొంది. మండల విద్యాధికారికి సమాచారం అందించగా పిల్లలను చూసుకోవాల్సిందిగా వంట నిర్వాహకులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఒకరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తే విద్యార్థులకు పాఠాలు బోధిస్తామని ఉపాధ్యాయురాలు తెలిపారు.’ -
యమబాధలు తొలిగి..ముక్తి పొంది
● అంత్య పుష్కరాల్లో స్నానాలు చేయాలి ● యూపీలోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. అలహాబాద్లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆయా రాష్ట్రాల నుంచి సుమారు 600మంది సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులతో కలిసి గోదావరి పరిక్రమణ (ప్రదక్షిణ) యాత్రలో భాగంగా కాళేశ్వరం క్షేత్రానికి విచ్చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు. -
ఎన్నికల విజయవంతానికి కృషి చేయాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విజయవంతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ సమావేశ మందిరంలో మూడో విడత ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. మొదటి, రెండో విడత ఎన్నికలను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేశారన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. మూడో విడతలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాలు ఉన్నాయన్నారు. ఆరు మండలాలకు 13మంది జోనల్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, రూట్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ ఇతరత్రా అన్ని సవ్యంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓటమెరుగని నాయకులు..
● ఆ దంపతులు ఐదుసార్లు సర్పంచ్గా గెలుపు దంతాలపల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్గా పని చేసి మరోసారి గెలువడం కష్టమే. అలాంటిది ఏకంగా ఐదుసార్లు సర్పంచ్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజానాయకులుగా పేరొందారు కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు. మండలంలోని దాట్లకు చెందిన ఆ దంపతులు 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా వారి కుటుంబం నుంచే కొనసాగుతున్నారు. ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని దాట్ల గ్రామానికి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నిక కాగా రెండు పర్యాయాలు రవీందర్, ఒక పర్యాయం మంజుల ఎన్నికయ్యారు. దంతాలపల్లి మండలం ఏర్పడిన అనంతరం దాట్ల సర్పంచ్గా రవీందర్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో 260 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మంజుల గెలుపొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు సర్పంచ్గా ఎన్నికై ఓటమెరగని నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్.. బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి సర్పంచ్గా గెలుపొందిన బేజాడి సిద్ధులు తన కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్. 1995లో తన తండ్రి రాములు, 2006లో తన భార్య సునీత, 2013లో సిద్ధులు, ప్రస్తుతం సిద్ధులే గెలుపొంది ఆ కుటుంబంలో నాలుగో సర్పంచ్ అయ్యారు. నాటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గ్రామస్తులు తమ కుటుంబం పట్ల ఆదరణ, అభిమానం చూపుతున్నారని సిద్ధులు తెలిపారు. భర్త ఉప సర్పంచ్.. భార్య వార్డు సభ్యురాలు కమలాపూర్: కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో భార్యాభర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రా మానికి చెందిన ఆసాల శ్రీ కాంత్ బీఆర్ఎస్ తరఫున 4 వ వార్డు నుంచి, ఆయన భా ర్య మౌనిక 9వ వార్డు నుంచి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడత జీపీ ఎన్నికల అనంతరం శ్రీకాంత్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసాల శ్రీకాంత్, మౌనిక -
సరదా విషాదమైంది..
ఖిలా వరంగల్ : సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్డ్రన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు. గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్డ్రన్ పార్క్కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులర్పించారు. సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి ఏకశిల పార్కు ఎదుట బాలుడి బంధువుల ధర్నా -
షూటింగ్ బాల్ విజేత వరంగల్ జట్టు
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యా క్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్ర థమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానా ల్లో నల్లగొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి ఐలయ్య ట్రోఫీలు అందజేశారు. -
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
బయ్యారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ బయ్యారం ఉప సర్పంచ్గా ఎన్నికై న ఎనుగుల ఉమ. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల పోరులో పాల్గొన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు జీవన పోరాటంలో నిమగ్నమైంది. బయ్యారం ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉమ సోమవారం ఉప సర్పంచ్గా ఎన్నికై ంది. ఎన్నిక తర్వాత మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది.సర్పంచ్ బరిలో తోటికోడళ్లు కొడకండ్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొడకండ్ల సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. కొడకండ్ల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు మసురం వెంకటనారాయణ సతీమణి రాధాలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా, మసురం లక్ష్మీనర్సింహాస్వామి సతీమణి మమత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. కాగా, కొడకండ్ల సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
ఓటు వేసేందుకు వచ్చి మృత్యుఒడికి..
● వలిగొండ వద్ద రోడ్డు ప్రమాదం ● పోచారం యువకుడి మృతి వలిగొండ/పెద్దవంగర: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వ గ్రామానికి వచ్చిన ఓ యువకుడు.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు శివారులో చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబా బా ద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం గ్రామానికి చెందిన కూకట్ల హరీశ్ (25) హైదరాబాద్లో బైక్ మెకానిక్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆది వారం జరిగిన రెండో విడత జీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం వచ్చాడు. ఓటు వేసిన అనంతరం అదే గ్రామానికి చెందిన కూకట్ల పవన్తో క లిసి బైక్పై హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్ర మంలో అరూరు శివారులో ఎదురుగా వస్తున్న డీసీ ఎం.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హరీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన పవన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హరీశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. పోచారం విషాదఛాయలు అలుముకున్నాయి. -
నయా ట్రెండ్!
● సర్పంచ్ అభ్యర్థుల ప్రమోషనల్ కాల్స్ ● తనకు ఓటు వేయాలని అభ్యర్థన కాళేశ్వరం: హలో..హలో.. నేను మీ సర్పంచ్ అభ్యర్థిని అంటూ ఫలాన గుర్తుకు ఓటు వేయాలని ఫోన్లో అభ్యర్థిస్తున్నారు. కాటారం సబ్డివిజన్ పరిధిలో మూడో విడత ఎన్నికలకు ఈనెల 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమైన ప్రమోషనల్ కాల్స్తో సెల్ఫోన్లు రింగ్..రింగ్..రింగ్మంటూ మోగుతున్నాయి. అభ్యర్థులు వాయిస్తో ప్రమోషనల్ కాల్స్ పల్లెల్లో సందడి చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి తెర పడడంతో కొత్తట్రెండ్తో ప్రచారం మొదలైందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా అభ్యర్థుల కొత్త ట్రెండ్ పల్లెల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. -
నాడు భార్య.. నేడు భర్త
● సర్పంచ్లుగా దంపతులు ఎన్నిక బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.డి ఆజామ్ గెలుపొందారు. 2019లో ఆయన భార్య ఖలీల్బేగమ్ కూడా బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలుపొందింది. ఇప్పుడు అదే గ్రామం జనరల్ అన్రిజర్వ్ అయ్యింది. దీంతో ఆజామ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీపై గెలుపొందారు. రెండు సార్లు సర్పంచ్గా ఆదరించిన గ్రామస్తులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
మాది కొత్తపల్లిగోరి గ్రామం. నేను 1995–2001 సంవత్సరాల మధ్య సర్పంచ్గా పని చేశా. అనంతరం 2001–2006 వరకు మా భార్య కాటం స్వరూప సర్పంచ్గా పని చేశారు. అప్పడు కేవలం ఎన్నికల ఖర్చు రూ.14వేలు మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారికి పెద్దగా ఖర్చులు ఉండేవి కావు. డబ్బుల ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ సేవ చేయడమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నమైంది. – కాటం సదయ్య, కొత్తపల్లిగోరి -
ఇక.. ఇక్కట్లు ఉండవు
మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మే డారం, పరిసరా ప్రాంతాల్లో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప నులు చేపట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతరకు వారం రో జుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈలోపు విద్యుత్ సరఫరా పనులు యు ద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న మే డారం 33/11 కేవీ, సమ్మక్క 33 /11 కేవి సబ్ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లపై భారం పడకుండా నార్లాపూర్ వద్ద కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు గట్టమ్మ దేవాలయం వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతర నాటికి ఈ రెండు సబ్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నా యి. వీటి నిర్మాణంతో అంతకు ముందున్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరగనుంది. కవర్ కండక్టర్తో విద్యుత్ లైన్.. 11 కేవీ విద్యుత్ లైన్కు కొక్కెలు వేయడం, చెట్ల కొమ్మలు తాకడం, ఇతరత్రా కారణాలతో గతంలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలిగే ది. ఈ సారి ఈ సమస్యను అధిగమించేందుకు 25 కిలో మీటర్ల పొడవునా కవర్ కండక్టర్ ద్వారా 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. 15 కిలో మీటర్లు 33 కేవీ విద్యుత్ లైన్ కవర్ కండక్టర్తో వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు తెగిపడితే ప్రమాదం జరిగే అవకాశముండడంతో లైన్లు తెగి కింద పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్ టీమ్లు ఏర్పాటు.. జాతరలో విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా 50 స్థానాల్లో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే పరిష్కరిస్తారు. అదే విధంగా 33 కేవీ లైన్లలో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి స మక్క సబ్స్టేషన్ వరకు పెట్రోలింగ్ టీమ్లను ని యమించనున్నారు. సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఎమ్మార్టీ టీ మ్ను సిద్ధం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జాతర సాగనుంది. విద్యుత్ సబ్ స్టేషన్లపై భారం పడకుండా మేడారం, సమ్మక్క సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అదే విధంగా 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్లో ఏదైనా అవాంతరం ఎదురైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి మేడారం, సమ్మక్క 33/11 కేవీ సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కమలాపూర్ 132/33, ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా 259 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ, ప్రమాదం జరగకుండా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 180 మీటర్ల పొడవున 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో విద్యుత్ లైన్ను వాహనాలు క్రాస్ చేసే సమయంలో లైన్లకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రమాదకారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు టవర్లు నిర్మిస్తున్నారు. వేగంగా ఏర్పాట్లు.. రెండు సబ్స్టేషన్ల ద్వారా సరఫరా సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు నార్లాపూర్, గట్టమ్మ దేవాలయం వద్ద నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం 259 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల్ల ఏర్పాటు అంతరాయాలు లేకుండా కవర్ కండక్టర్తో 11 కేవీ విద్యుత్లైన్ జంపన్న వాగు వద్ద ఆరు టవర్ల నిర్మాణంమేడారం జాతర విద్యుత్ సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర విజయవంతంలో విద్యుత్ శాఖది కీలక పాత్ర. ప్రతీ పనిని నాణ్యతతో చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ -
మారిన ఎన్నికల స్వ‘రూపం’..
భూపాలపల్లి అర్బన్: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. అయితే నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది నాటితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి, రెండు విడతలు పూర్తికాగా బుధవారం మూడో విడత జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల తీరుపై నాటితరం సర్పంచుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.గతంలో ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీద ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. నేను 1988–1993 మధ్య చిట్యాల సర్పంచ్గా పని చేశా. – బుర్ర నర్సయ్య, మాజీ సర్పంచ్, చిట్యాల మాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం. 2001లో గ్రామ సర్పంచ్గా పనిచేశా. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశా. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. నాటి గౌరవం, మర్యాద నేటి తరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. – లావుడ్య దాసునాయక్, మాజీ సర్పంచ్, గొల్లబుద్దారం ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు నాటితరం సర్పంచుల మనోగతం -
ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్
● ఆర్డీఓ, తహసీల్దార్ల వద్ద విద్యార్థుల లేఖలు ● కలెక్టర్కు చేరిన ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ నివేదిక ● చర్యలకు రంగం సిద్ధం.. వరంగల్ క్రైం: ఒగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పరకాల)లో విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ కథనానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి ని వేదిక సమర్పించారు. సెక్రటరీ ఆదేశాల మేరకు డీ సీఓ ఉమామహేశ్వరి సోమవారం సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్కు షోక్జ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వలని పేర్కొన్నారు. విద్యార్థులు ఫిర్యాదులో పెట్టెలో వేసిన ఫిర్యాదు లేఖలను పరకాల ఆర్డీఓ, దామెర తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. వారు పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకీరి చేయించిన ఘటనతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై విద్యార్థులు లేవనెత్తిన అవినీతి విషయాలపై హనుమకొండ కలెక్టర్కు నివేదిక అందజేసినట్లు తె లిసింది. ఈనెల 12న ‘చిట్టి చేతులు..వెట్టి చాకిరీ’, 13న ‘వెట్టి చాకిరీపై కదిలిన యంత్రాంగం’ అనే శీర్షి కలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీ టిపై స్పందించిన అధికారులు చర్యలకు ఆదేశించా రు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి తన నివేదికలో క్రమ శిక్షణ చర్యలకు సిఫా ర్సు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుని క్యా టరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సమ్మ య్య కొంత మంది విద్యార్థులను తనకు వ్యతిరేకంగా చెప్పుతే టీసీలు ఇస్తానంటూ బెదిరించిన విషయానికి సంబంధించిన ఆడియో కూడా వైరలైంది. ఇప్పటికై నా అధికా రులు గతి తప్పిన గు రుకులాన్ని గా డిలో పెట్టాలని త ల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్ : అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో రెండు గంటలపాటు రాస్తారోకో.. స్తంభించిన రాకపోకలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన -
పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. కాగా ఉదయం చలి తీవ్రతతో మంద కోడిగా ప్రారంభమైన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. కాగా, జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించిన ఏడు మండలాల్లో 85.05 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా అదనపు కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్తోపాటు ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక అధికారులు పోలింగ్ సరళి, కౌంటింగ్ను పరిశీలించారు. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఉదయం 9గంటల తర్వాత పోలింగ్ ఊపందుకుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. 143 జీపీలు, 1,106 వార్డుల్లో పోలింగ్ జిల్లాలో రెండో విడతలో బయ్యారం, చిన్నగూడూ రు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలు ఉండగా ఈనెల 14(ఆదివారం) పోలింగ్ నిర్వహించారు. ఆయా మండలాల్లో 158 జీపీలు ఉండగా 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 143 జీపీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,360 వార్డులకు 251 ఏకగ్రీవం కాగా 3 నోవాల్యువుడ్ వార్డులు ఉండగా మిగిలిన 1,106 వార్డుల్లో పోలింగ్ జరిగింది. పురుషులే అధికం.. పోలింగ్ పరంగా చూస్తే పురుష ఓటర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం ఓటర్లలో పురుషులు 97,561 మంది, మహిళా ఓటర్లు 10,1216 ఉన్నారు. కాగా 97,561 మంది పురుషులు 83,479(85.57 శాతం) మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 10,1216 మంది ఉండగా 85,589(84.56 శాతం) మంది పోలింగ్లో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్, లెక్కింపు సరళి పరిశీలన బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. గార్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలల్లో పోలింగ్ సరళిని జనరల్ అబ్జర్వర్ మధుకర్ బాబు, ప్రత్యేక అధిదికారి మరియన్న పరిశీలించారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని సాధారణ పరిశీలకుడు మధుకర్ బాబు, ప్రత్యేక అధికారి శ్రీమన్నానారాయణ, ఎంపీడీఓ రాధిక, తహసీల్దార్ రమేష్బాబు, చిన్నగూడూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలో పోలింగ్ సరళిని ప్రత్యేక అధికారి బీమ్లా నాయక్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. రెండో విడతలో 85.05 శాతం ఓటింగ్ ఏడు మండలాల్లో నిర్వహణ ఓటు హక్కు వినియోగించుకున్న 1,69,071 మంది ఓటర్లు ఉదయం 9 గంటల వరకు పుంజుకున్న ఓటింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
ఓటేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
చిన్నగూడూరు: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సొంత గ్రామమైన మంచ్యాతండాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంచ్యాతండా రైతువేదికలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఇటీవలే ప్రత్యేక జీపీగా ఏర్పడిన మంచ్యాతండాకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. గార్లలో ఓటు వేసిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్ల: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆదివారం గార్లలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. ఈసందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రీకౌంటింగ్ చేయాలని ఆందోళన బయ్యారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారు గుగులోతు శాంతి మూడు ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అత్యల్ప తేడా రావడంతో ప్రత్యర్థి మరోసారి కౌంటింగ్ చేయాలని కోరారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉధ్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి 12 దాటినా ఆందోళన కొనసాగింది. పోలింగ్ అధికారులు సైతం కేంద్రంలోనే ఉన్నారు. పాలడుగు భాస్కర్ -
రామప్పను సందర్శించిన యునెస్కో భారత రాయబారి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు విశాల్ వి.శర్మ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చెతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత హస్తగతం
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మోస్తరు ఫలితాలతో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.. రెండో విడత విజయపథంలో దూసుకెళ్లారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాలు కై వసం చేసుకున్నారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి, బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు రెబల్స్ షాక్ ఇచ్చారు. అత్యధిక స్థానాలు గెలుచుకొని సత్తాచాటాలని కష్టపడి ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆంతంత మాత్రం ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఓట్లతోపాటు, అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ సాగింది. అత్యధిక స్థానాలు చేతికే.. జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు, 4,110 వార్డులకు గాను రెండో విడత 158 పంచాయతీలు, 1,358 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 15 పంచాయతీలు, 251 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 143 పంచాయతీలు, 1,107 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 115 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 38 పంచాయతీల్లో బీఆర్ఎస్, 05 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించా రు. మొదటి విడత ఐదు పంచాయతీలు గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ రెండో విడతలో ఒక్కస్థానం కూడా గెలవకపోవడం గమనార్హం. 20 పంచాయతీల్లో 19 కాంగ్రెస్ కై వసం గార్ల: మండలంలోని 20 పంచాయతీలకుగాను, 19 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా ఒక్క పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నాడు. మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభీ మోగించడంతో ఆ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒక్క ఓటుతో గెలుపు! బయ్యారం: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఇరువురు అభ్యర్థులు విజయం సాధించారు. 7వ వార్డులో ఎట్టి సరిత, 13 వ వార్డులో పోస్టల్ బ్యాలెట్తో బందెల కళింగరెడ్డి విజయం సాధించారు. అత్యల్ప మెజార్టితో విజయం సాధించడంతో అభ్యర్థులతోపాటు ఆయా వార్డుల ఓటర్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చెల్లైపె అన్న విజయం బయ్యారం: మండలంలోని వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ పదవికి అన్న చెల్లె పోటీపడగా ఆదివారం వెల్లడైన ఫలితాల్లో అన్న విజయం సాధించారు. బొర్ర కృష్ణ కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా అతని చెల్లె పొడుగు సుగుణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఆసక్తికర పోటీలో చెల్లైపె అన్న విజయం సాధించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి రెబల్స్ షాక్ కష్టపడ్డా వేగం పుంజుకోని కారు మేజర్ గ్రామ పంచాయతీల్లో నువ్వా.. నేనా..?కష్టపడ్డా.. పుంజుకోని కారు పార్టీ బలానికి ఆయువు పట్టయిన పంచాయతీల్లో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కష్టపడ్డా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రధానంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, రెడ్యానాయక్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవి త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఇతర నాయకులు కాంగ్రెస్కు పోటీగా ప్రచా రం చేశారు. అయితే ఇల్లెందు నియోకవర్గంలోని గార్లలో 20 పంచాయతీలు ఉండగా 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. డోర్నకల్ నియోకవర్గంలో కాంగ్రెస్ సగం పంచాయతీలు కూడా గెలవలేదు. మొత్తం 158 స్థానాల్లో కనీసం మూడో వంతు స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వతంత్ర ఏగ్రీవం మొత్తం బయ్యారం 16 08 04 01 29 చిన్నగూడూరు 06 03 00 02 11 గార్ల 17 01 00 02 20 పెద్దవంగర 13 07 00 06 26 దంతాలపల్లి 14 02 00 02 18 నర్సింహులపేట 16 06 00 01 23 తొర్రూరు 21 09 00 01 31 మొత్తం 103 36 04 15 158ఎమ్మెల్యేలకు రెబల్స్ షాక్.. జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించగా.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మాత్రం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలోని యశస్వినిరెడ్డి సొంత గ్రామం చర్లపాలెంతోపాటు, కిష్టాపురం, మడిపల్లి, సోమారం, గుర్తూరు, పత్తేపురం గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. వీరందరు గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారు కావడం గమనార్హం. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో కాచనపల్లి, నర్సీతండా, జగ్గుతండా పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. -
ఇక పాఠశాలల్లో తనిఖీలు
● వసతులు, రికార్డుల పరిశీలన ● 34 మంది ఉపాధ్యాయలతో ప్రత్యేక బృందం ● జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలుమహబూబాబాద్ అర్బన్: ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, నాణ్యమైన విద్య, పాఠశాల రికార్డులు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. ఈ తనిఖీలు ప్రధానోపాధ్యాయులు, పీఎస్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉపాధ్యాయులు పాఠశాలలను తనిఖీలు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారులకు రిపోర్టు అందజేస్తారు. గతంలో బడి ఎలా ఉండేది, ప్రస్తుతం బడి ఎలా ఉన్నది అనే విషయాన్ని ఆరాతీసి విద్యార్థుల విద్య అభివృద్ధికి దోహదం చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పనితీరు వారి హాజరు, విద్యార్థుల సామర్థ్యం, వారి హాజరు అంశాలను పరిశీలిస్తారు. లోపాలు అవకతవకలు ఉంటే రాష్ట్ర విద్యాశాఖకు నివేదికను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు. ఒక బృందంలో పది మంది ఉపాధ్యాయులు జిల్లా పరిధిలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు 8 మోడల్ స్కూళ్లు, 17 కేజీబీవీలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్పై ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వీరు పనిచేయనున్నారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటికి సంబంధించి 15 మంది ఉపాధ్యాయులను నియమించారు. 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్ఎం ఉంటారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన బృందంలో ఒక స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, ఎస్జీటీ ఉంటారు. ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. 102 ఉన్నత పాఠశాలలు ఉండగా, రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఎస్ఏలు, పీడీ, పీజీ హెచ్ఎం ఉంటారు. మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్పై విధులను కేటాయించారు. వీరంతా గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. వారానికోసారి, లేనిపక్షంలో ప్రతీరోజు నివేదికను డీఈఓ కార్యాలయంలో అందజేయనున్నారు. తనిఖీలతో పాఠశాలలో మెరుగు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగు పడేందుకు తనిఖీ బృందాల పరిశీలన ఉపయోగపడుతుంది. తనిఖీ బృందాలు, కేటాయించిన పాఠశాలలను ప్రతీరోజు రెండు చొప్పున తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇస్తారు. ఈ బృందాల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ప్రగతి మెరుగవుతుందని ఆశించవచ్చు. తనిఖీ బృందాల నివేదికలు ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తాం. – రాజేశ్వర్, డీఈఓ


