breaking news
Mahabubabad
-
సంతోషం పట్టలేక సొమ్మసిల్లి..
● విజేతగా ప్రకటించగానే స్పృహతప్పిన వార్డు సభ్యురాలు ఏటూరునాగారం: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ 8వార్డు సభ్యురాలు అమీనాబేగం గెలుపొందినట్లు అధికారులు ప్రకటించడంతో సంతోషం పట్టలేక సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్బాబు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ
విచారణకు ఆదేశాలు.. ఒగ్లాపూర్ గురుకులంలో జరిగిన ఘటనలు నా దృష్టికొచ్చాయి. రాష్ట్ర కార్యాలయం పనిచేసే జాయింట్ సెక్రటరీ సాక్రునాయక్ విచారణకు ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శికి అందజేస్తాం. ప్రతీ పాఠశాలలో క్యాట రింగ్ కాంట్రాక్టు వ్యవస్థ ఉంది. పిల్లలతో పనులు చేయించడం తప్పు. కచ్చితంగా చర్యలు ఉంటాయి. –అలివేలు, జోనల్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జోన్సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ (పరకాల) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలో చోటుచేసుకున్న దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఉదయం 5 గంటలకే ఎముకలు కొరికే చలిలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏకంగా పాఠశాల ప్రిన్సిపాల్.. విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించడం.. వంటలు చేయించడం వంటి పనులు చేయించడమే కాకుండా పిల్లలను దూషించిన ఆడియో రికార్డులు వైరలయ్యాయి. బుధవారం ఉదయం పిల్లలతో టిఫిన్ చేయించిన ఓ వీడియో చక్కర్లు కొట్టింది. గురుకులంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్లో ఓ విద్యార్థి పాఠశాలలో జరుగుతున్న దారుణ ఘటనలు కళ్లకు కట్టినట్లు ఫిర్యాదు చేయడంతో పాఠశాలలో జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రిన్సిపాల్ విద్యార్థుల భవిష్యత్కు ఆటంకంగా మారడమే కాకుండా ఇష్టారాజ్యంగా వారిని దూషించడం, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. నిధులు పక్కదారి.. విద్యార్థుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు పక్క దారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల కాస్మోటిక్స్ చార్జిలను పక్కదారి పట్టించడంతో ఉన్నతాధికారులు గుర్తించి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. తాజాగా పాఠశాల కేర్టేకర్తో కుమ్మకై ్క వర్కర్లతో చే యించాల్సిన వంట పనులు, అది కూడా సలసల కాగే నూనెలో చిట్టి చేతులతో బొండా( టిఫిన్ ) వేయించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇతర పనులు చేయడం గమనార్హం. ఉపాధ్యాయులు స్టడీ సమయం విధుల్లో లేకపోవడంతో విద్యార్థులు సినిమాలు చూసిన ఘటనలో ఉపాధ్యాయులను వదిలి.. విద్యార్థులపై తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి. అలాగే, విద్యార్థులను ప్రిన్సిపాల్ కులం పేరుతో దూషించిన ఆడియో సైతం వైరల్గా మారింది. గురుకుల పాఠశాలలో దారుణ ఘటనలు పిల్లలతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్ విద్యార్థుల లేఖలతో వెలుగులోకి నిజాలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్ ‘సాక్షి’ ప్రత్యేక కథనం -
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
మహబూబాబాద్ రూరల్ : భూతగాదా విషయంలో అన్నను చంపిన ఘటనలో మృతుడి తమ్ముడు, అతడి ఇద్దరు కుమారులకు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) తోపాటు ఒక్కొక్కరికి రూ. 21వేల చొప్పున జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పీఎస్ పరిధిలోని కేసముద్రం (విలేజీ)కి చెందిన ఎలగలబోయిన వెంకన్న, అతడి తమ్ముడి కుటుంబానికి మధ్య భూతగాదా వచ్చింది. ఈ క్రమంలో వెంకన్నను అతడి తమ్ముడు ఎలగలబోయిన చంద్ర య్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్ కలిసి 2020, ఆగష్టు 8వ తేదీన తీ వ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు అనిల్ అదే రోజున ఫిర్యాదు చేయగా అప్పటి కేసముద్రం బి.సతీశ్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐ జె.వెంకటరత్నం విచారణ చేయగా అప్పటి రూరల్ సీఐ ఎస్.రవికుమార్ 2021 మార్చి 23న కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో బ్రీఫింగ్ అధికారులుగా అప్పటి కేసముద్రం ఎస్సై జి.మురళీధర్ రాజు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, జీనత్ వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ పక్షాన పీపీలు కొంపెల్లి వెంకటయ్య, చిలుకమారి వెంకటేశ్వర్లు, ఏపీపీ గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా కోర్టు డ్యూటీ అధికారులు నెలకుర్తి అశోక్ రెడ్డి, తేజావత్ దేవ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరం నిరూపణకావడంతో ఎలగలబోయిన చంద్రయ్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్కు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.21 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. భారత్ సుస్థిర గణతంత్ర రాజ్యం ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ● ప్రభుత్వ పింగిళి కళాశాలలో జాతీయ సదస్సు విద్యారణ్యపురి: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన సుస్థిర గణతంత్ర రాజ్యం దిశగా ఎదగాల్సిన అవసరం ఉందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఇండియా–2047 రియలిజింగ్ ది విజన్ ఆఫ్ ది డెవలప్ ఈక్విటబుల్ అండ్ సస్టేయినబుల్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపర్చడానికి ప్రతీ పౌరుడు రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడం అత్యవసరమని సూచించారు. అతిథులు సావనీర్ను ఆవిష్కరించారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి అధ్యక్షత వహించిన సదస్సులో ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్, సదస్సు డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్కుమార్, కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, అకడమిక్ కో– ఆర్డినేటర్ డాక్టర్ అరుణ, అధ్యాపకులు శైలజ, కవిత, సంధ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ మరువని బాధ్యత..
● తండ్రి మృతి చెందినా ఓటు వేసిన నాయకుడు వర్ధన్నపేట: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైందో ఆ నాయకుడు సమాజానికి చాటి చెప్పాడు. తండ్రి చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శ పౌరుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన పసునూరి రాజశేఖర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన తండ్రి ఆదినారాయణ(65) అనారోగ్యంతో మృతి చెందాడు. రాజశేఖర్ తీవ్ర విషాదంలో ఉన్నా మనసు ధైర్యం చేసుకుని తండ్రి మృత దేహం వద్ద నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు ఎంత విలువైందో సమాజానికి చాటి చెప్పాడు. దీనిపై గ్రామస్తులు.. రాజశేఖర్ బాధ్యతను కొనియాడారు. -
పటేల్గూడెంలో 4 ఓట్ల తేడాతో గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని పటేల్గూడెంలో గురువారం జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 4 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పొన్నాల బుచ్చయ్య గెలుపొందారు. పటేల్గూడెంలో 1,347 ఓట్లకు గాను 1,271 ఓట్లు పోలయ్యాయి. అందులో పొన్నాల బుచ్చయ్యకు 610 ఓట్లు రాగా బీఆర్ఎస్ బలపరిచిన కడుదూరి సోమిరెడ్డికి 606 ఓట్లు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కార్తీక్కు 36, చెల్లని ఓట్లు 17, నోటాకు 2 వచ్చాయి. దీంతో బుచ్చయ్యకు సోమిరెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ రావడంతో రెండోసారి కౌంటింగ్ చేశారు. తేడా రాకపోవడంతో అధికారులు గెలిచినట్లు ప్రకటించారు. -
నాడు జెడ్పీటీసీ.. నేడు సర్పంచ్
● బండాతండా సర్పంచ్గా అరుణశ్రీ అల్వార్ జఫర్గఢ్: 2014 నుంచి 2019 వరకు జఫర్గఢ్ జెడ్పీటీసీగా పని చేసిన బానోత్ అరుణశ్రీ అల్వార్ బండాతండా నుంచి సర్పంచ్గా గెలుపొందారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం అల్వార్బండాతండా (శంకర్తండా) జీపీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన అరుణశ్రీ తన సమీప అభ్యర్థి బానోత్ మంక్తిపై 85 ఓట్లతో విజయం సాధించింది. కాగా, బానోత్ అరుణశ్రీ అత్త తులసీ తాజా మాజీ సర్పంచ్గా పని చేశారు. మళ్లీ ఇదే గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్గా తన కోడలు అరుణశ్రీ విజయం సాధించారు. -
పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. కాగా ఉదయం మందకొడిగా ప్రారంభమై.. 9గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని ఐదు మండలాల్లో 86.99శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 146 జీపీలు, 1072 వార్డుల్లో పోలింగ్.. జిల్లాలోని గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. ఆయా మండలాల్లో 155 గ్రామపంచాయతీలు ఉండగా.. 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 1,338 వార్డులకు 266 ఏకగ్రీవమయ్యాయి. కాగా, మిగిలిన 146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్ జరిగింది. 86.99 శాతం నమోదు.. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఆతర్వాత బారులు దీరడంతో ఓటింగ్శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లదే పైచేయి మొత్తం 1,72,218మంది ఓటర్లు ఉండగా.. వారిలో 84,927 మంది పురుష ఓటర్లు, 87,282 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9మంది ఉన్నారు. మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. 84,927 మంది పురుష ఓటర్లలో 74099 మంది ఓటేశారు. అలాగే 87,282మంది మహిళా ఓటర్లలో 75,712మంది ఓటేశారు. పురుష ఓటర్ల పోలింగ్ 87.25శాతం, మహిళ ఓటర్ల పోలింగ్ 86.744 శాతం నమోదైంది. 86.99 శాతం నమోదు ఐదు మండలాల్లో 1,72,218 ఓట్లకు 1,49,812ఓట్లు పోలింగ్ క్యూలో బారులుదీరిన ఓటర్లు ఉదయం 7నుంచి 9 గంటల వరకు మందకొడిగా ఓటింగ్ 9 తర్వాత పుంజుకున్న వేగం -
ఎన్నికల పరిశీలకుడి సందర్శన
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో జరుగుతున్న జీపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్ బాబు గురువారం సందర్శించి పరిశీలించారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ ద్వారా జీపీ ఎన్నికలు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ ఉన్నారు. బోణీ కొట్టిన బీజేపీ మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ మండలంలో బోణీ కొట్టింది. మండలంలోని నడివాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పెదగాని గుట్టయ్య, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాగిపాటి బుచ్చిరెడ్డి, బీజేపీ మద్దతుతో మైదం విజయకుమార్ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 9న ఉదయం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి రాగిపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం జరిగిన జీపీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసిన మైదం విజయకుమార్ 404 ఓట్లు కై వసం చేసుకుని విజయం సాధించారు. పెదగాని గుట్టయ్యకు 306 ఓట్లు రాగా మృతుడు రాగిపాటి బుచ్చిరెడ్డికి 160ఓట్లు వచ్చాయి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అకాడమిక్ అడిట్ పరిశీలకుడు డాక్టర్ బి.రాములు అన్నా రు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం 2022 –23, 2023–24 విద్యాసంవత్సరాల ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కళాశాలకు న్యాక్ గుర్తింపులో భాగంగా ఏ–గ్రేడ్ సాధించేందుకు అధ్యాపకులు అన్ని రకాల రికార్డులను తయారు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బి. లక్ష్మణ్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్కుమార్, మసూద్ఆహ్మద్, రాజశేఖర్, అన్నపూర్ణ, వినోద్, హతీరాం, ఉపేందర్, సుమలత, సాంబశివరావు, కాసీం, సుమన్, వీరు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ‘సీకేఎం’లో అస్తవ్యస్త పాలన ● పూర్తి కాని టెండర్ ప్రక్రియ ● మెరుగు పడని సేవలు ● ఇబ్బందులు పడుతున్న రోగులు ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్ను పరిశీలించిన సమయంలో టెండర్ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
గుర్తుల కేటాయింపు ఉల్టా పల్టా..
కొత్తగూడ: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను అధికారులు ఉల్టా పల్టా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒకటో అభ్యర్థికి ఉంగరం, రెండో అభ్యర్థికి కత్తెర, మూడో అభ్యర్థికి బ్యాట్ కేటాయించాల్సి ఉంది. కాగా, అధికారులు ఒకటో అభ్యర్థికి బ్యాట్, రెండో అభ్యర్థికి ఉంగరం, మూడో అభ్యర్థికి కత్తెర కేటాయిస్తూ నోటీసు బోర్డులో అంటించారు. దీంతో వరుస నంబర్లలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ ఓటమికి అధికారులు కేటాయించిన గుర్తులే కారణం అని, కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మడగూడెం గ్రామపంచాయతీలో గుర్తు మార్పు వల్ల రీ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఈవిషయమై ఎంపీడీఓ మున్వర్ను వివరణ కోరగా గుర్తుల కేటాయింపులో ఎలాంటి సమస్య లేదని.. నోటీసు బోర్డులో తప్పుగా రాశారన్నారు. దాన్ని సరి చేసినట్లు వివరణ ఇచ్చారు. అధికారులు కేటాయించిన గుర్తులునిర్దేశించిన గుర్తుల కేటాయింపు విధానం -
సర్పంచ్ అభ్యర్థుల పాట్లు
● కాళ్లు మొక్కి.. మంచంపై తీసుకువచ్చి.. ఓట్లు వేయించిమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని రేగడి తండా, ఉత్తర తండా గ్రామపంచాయతీలో పరిధిలో వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు, నడవలేని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. స్థానికులు, సర్పంచ్ అభ్యర్థుల వారిని మంచాలపై వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించిన అనంతరం మళ్లీ వారిని ఇంటి వద్ద దింపారు. ఆమనగల్ గ్రామంలో జీపీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఓటర్లను కాళ్లు పట్టుకుని మొక్కుతూ తమకు ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. -
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
కేసముద్రం: మండలంలోని పెనుగొండ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శబరీష్ సందర్శించి, పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గూడూరులో.. గూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ శబరీష్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్రెడ్డి మండల వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ ఎస్సై గిరిధర్రెడ్డి ద్వారా మండల వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలన్నీ గస్తీ తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా, సంబురాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సైకి సూచించారు. -
మొదటి విడత హస్తగతం
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పోటాపోటీగా సాగింది. గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్లో అన్ని పార్టీల మద్దతుదారులు తమ అనుకూలమైన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయి ంచారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల వార్ వన్సైడ్ కాగా.. మరికొన్ని గ్రామాల్లో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓ ట్లు పడ్డాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. కాగా, గెలిచిన వారు సంబురాలు చేసుకోగా.. ఓడిపోయిన వారిలో కొందరు ఓట్లు వేయలేదని తిట్ల దండకం మొదలుపెట్టారు. నువ్వా.. నేనా.. జిల్లాలోని ఐదు మండలాల్లో పలుచోట్ల పోటాపోటీగా ఓట్లు పడడంతో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబాబాద్ మండలంలోని ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామం సోమ్లాతండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాతకు మెజార్టీ వచ్చింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి భూక్య కౌసల్య రీకౌంటింగ్ కోరగా మరోసారి ఓట్ల లెక్కించి రెబల్ అభ్యర్థినే విజేతగా ప్రకటించారు. జంగిలిగొండ పంచా యతీలో బీఆర్ఎస్ మద్దతుదారు జక్క మమత ముందుగా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారు గుండెల రేణుక రీకౌంటింగ్కు వెళ్లారు. ఓట్ల లెక్కింపు తర్వాత రేణుక గెలిచినట్లు ప్రకటించారు. కంబాలపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు చీరిక వసంత గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి స్వర్ణలత రీకౌంటింగ్కు వెళ్లారు. మళ్లీ ఓట్లు లెక్కించినా వసంతనే గెలిచినట్లు ప్రకటించారు. ముడుపుగల్లులో కాంగ్రెస్ మద్దతుదారు కొత్త హే మంత్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుదారు జేరిపోతుల వెంకన్న రీకౌంటింగ్కు వెళ్లారు. తర్వాత ఓట్లు లెక్కించినా హేమంత్కే మెజార్టీ వచ్చినట్లు ప్రకటించారు. దామరవంచలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. చివరకు కాంగ్రెస్ మద్దతుదారు ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్కు రెబల్ దెబ్బ.. మొదటి విడత పోటీలో కాంగ్రెస్కు ఇంటిపోరు మొదలైంది. దీంతో కొంత మందికి టికెట్ ఇవ్వలేదు. దీనిపై నిరసర తెలుపుతూ పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చే శారు. ఇందులో మహబూబాబాద్ మండలంలో సోమ్లాతండా, దర్గాతండా, సింగారం శివా రు ఇస్లావత్ తండాలో రెబల్ అభ్యర్థులు గెలి చారు. ఇనుగుర్తి మండలంలో ఒకరు, కేసుముద్రంలో ఇద్దరు, నెల్లికుదురు మండలంలో ఇద్దరు రెబల్ అభ్యర్థులు గెలిచారు. గూడూరు మండలంలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల పేరుతో అభ్యర్థులు పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో రెబల్గా పోటీ చేసిన ఐదుగురు గెలిచారు.పార్టీల వారీగా మద్దతు దారులు గెలుపొందిన అభ్యర్థుల వివరాలు అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామంలో హస్తం హవా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఊరిలో కాంగ్రెస్ ఓటమి నువ్వా నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు రీ కౌంటింగ్తో బయటపడ్డ హజార్యాతండా సర్పంచ్ఎన్నికల మరిన్ని వార్తలుమండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఏకగ్రీవం మొత్తం మహబూబాబాద్ 23 11 01 04 02 41 కేసముద్రం 13 11 00 02 03 29 నెల్లికుదురు 17 09 02 02 01 31 గూడూరు 21 12 02 05 01 41 ఇనుగుర్తి 06 04 00 01 02 13 మొత్తం 80 47 05 14 09 155 -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
● ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! ● కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. -
రైతు సంఘం నిర్మాణానికి కలిసి రావాలి
వరంగల్ చౌరస్తా: బలమైన రైతు సంఘం నిర్మాణానికి కమ్యూనిస్టులు కలిసి రావాలని జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అనుభవ్ దాస్ శాస్త్రి పిలుపునిచ్చారు. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని ఓ హోటల్లో రెండురోజులుగా జరుగుతున్న సభలు బుధవారం ముగిశాయి. అఖిల భారత రైతు సమాఖ్య నాయకుడు డాక్టర్ సత్నాంసింగ్ అజ్నాల అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనుభవ్ దాస్ మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం దెబ్బతీస్తున్న నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బలమైన రైతు సంఘం నిర్మాణం కోసం ఏఐకేఎఫ్ – జేకేఎస్ సంయుక్తంగా ఏకీకరణ ఆలిండియా మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకే రైతు విధానం ఉండాలని, ఒకరికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల ఇతర భూమి ఉండేలా ల్యాండ్ సీలింగ్ చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 400 నదులు ఉన్నాయని, వాటిని అనుసంధానం చేయడం వల్ల పంటలకు నీటి కొరత ఉండదని చెప్పారు. జీడీపీలో సుమారు 21 నుంచి 26 శాతం వ్యవసాయరంగం భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో కనీసం 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తూమాటి శివయ్య, కాటం నాగభూషణం, అజాత్ సింగ్, రమేష్ ఠాకూర్, కులదీప్ సింగ్, భూప్ నారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మే 12, 13, 14వ తేదీల్లో కిసాన్ మహా సభలు జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అనుభవ్ దాస్ శాస్త్రి -
కాంగ్రెస్ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్గా భూక్య శోభన్ బాబు
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్గా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్ బాబును నియమిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేజీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 26 మందిని నేషనల్ కోఆర్డినేటర్లను నియమించగా, అందులో శోభన్ బాబుకు అవకాశం కల్పించారు. శోభన్ బాబు ప్రాథమిక విద్యను ఇనుగుర్తిలో చదివి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, బెంగుళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణ కార్యక్రమం, ట్రైబల్ హబ్ ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జార్ఖండ్ ఇన్చార్జ్ కొప్పుల రాజు, విక్రాంత్ భూరియా, తదితరులకు శోభన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలిములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతితో కలిసి ప్రశాంత జీవితం గడపాలని జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ ఆకాక్షించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఇద్దరు మహిళా సభ్యులు ఎస్పీ ఎదుట ఎస్పీ కార్యాలయంలో బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ఆర్థిక సాయం చెక్కులను లొంగిపోయిన సభ్యులు ఒయం రామే, మడకం మల్లి లకు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ కమిటీ ఆకాశ్ టీంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. పోరు కన్న – ఊరు మిన్న అవగాహన కార్యక్రమ ప్రభావంతో మావోయిజాన్ని వీడి జీవసీవన స్రవంతిలోకి మావోయిస్టులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వదకు జిల్లాలో 87 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్టీ శివం ఉపాధ్యాయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి
కేయూ క్యాంపస్: పౌరులందరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి పట్టాభి రామారావు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ (ఎన్జీఓ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం లేకుండా మానవ హక్కులు లేవని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణ కీలకమని పేర్కొన్నారు. ఏపీ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ 2014 తర్వాత దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు విచ్చలవిడిగా పరిశ్రమలు నెలకొల్పి పర్యావరణానికి విఘాతం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ ఆచార్య.. ఆ కాలంలో బ్రిటిష్వారిని ఎదిరించి పత్రికలను నడిపి జైలుకు వెళ్లి నిర్బంధ జీవితం గడిపారని గుర్తుచేశారు. ఎన్హెచ్ఆర్సీ (ఎన్జీఓ) జాతీయ చైర్మన్ ఐలినేని శ్రీనివాస్రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మానవ సేవలకు, నిరుపేదల సమస్యల పరిష్కారానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. సదస్సులో ఏపీ రాష్ట్ర చైర్మన్ సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారం, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర యాదవ్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు బాబుయాదవ్, చీఫ్ అడ్వయిజర్ రాజేశ్వర్రావు, ఎన్హెచ్ఆర్సీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, జిల్లా అధ్యక్షురాలు తులసి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డేగల శ్రీనివాస్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, డాక్టర్ బామిరెడ్డి నరసింహ తిరుపతి మాట్లాడారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి పట్టాభి రామారావు కేయూలో జాతీయ సదస్సు -
పోలింగ్ టు కౌంటింగ్
జనగామ/సంగెం : ఉమ్మడి వరంగల్జ ఇల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకుని పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పో లింగ్నుంచి లెక్కింపు, విజేతల ప్రకటన వరకు పాటించాల్సి న నియమ నిబంధనల మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. పోలింగ్ ఏజెంట్ల కూర్చునే విధానం కేంద్రంలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు కూర్చునే విధానంపై అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్ల ముఖాలను గుర్తుపట్టే విధంగా, పోలింగ్ ఏజెంట్ల వెసులుబాటును బట్టి పోలింగ్ అధికారుల వెనుక కూర్చోబెట్టాలి. ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో అధికారుల ఎదురుగా సీట్లు ఏర్పాటు చేయవచ్చని ఎన్నికల నిబంధనల్లో స్పష్టం చేశారు. స్టేషన్లో ఏజెంట్లకు తిరగడాటానికి అనుమతి ఉండదని, నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ● ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒంటి గంట వరకు ఆవరణలో ఉన్న ఓటర్లతో ఓటింగ్ నిర్వహిస్తారు. భోజనం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ● ఓటింగ్ హాల్లో లోపల ఉన్న ప్రతీవ్యక్తి చట్టపరంగా ఓటింగ్ రహస్యాన్ని కాపాడి, అందుకు సహకరించాలి. ఉల్లంఘించిన వారికి అధికారులు 3 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ● పోలింగ్ బాక్స్లోని వార్డు సభ్యుల తెలుపు, సర్పంచ్ గులాబీ రంగు బ్యాలెట్లను బయటకు తీసి వేర్వేరుగా ఉంచుతారు. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తైన తర్వాత సర్పంచ్ బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు. ● బ్యాలెట్ అకౌంట్ నమోదు, లెక్కించిన పత్రాల సంఖ్య, జారీ చేసిన పత్రాల మధ్య వ్యత్యాసముంటే ప్రత్యేకంగా నమోదు చేయాల్సి ఉంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే బ్యాలెట్ పత్రాలు, సంబంధిత రికార్డులను రిటర్నింగ్ అధికారి సీల్తో పాటు అభ్యర్థుల ఏజెంట్ల సీల్ వేసి భద్రపర్చాలి. ● ఫలితాలు సమానంగా వచ్చిప్పుడు లాటరీ ద్వారా తుది తీర్పు వెల్లడిస్తారు. ● అనంతరం గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అధికారులు అందజేస్తారు. ఎన్నికల వాయిదా, రద్దు జనగామ: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ బూత్ను గుంపులుగా కొంతమంది ఆక్రమించడం, అక్కడ జరిగిన పోలింగ్ ఫలితాన్ని నమ్మదగిన విధంగా నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడడం, లేదా ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆక్రమించి లెక్కింపు ప్రక్రియలో అలజడిగా మార్చిన క్రమంలో రిటర్నింగ్ అధికారి వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు నివేదిక అందించాలి. నివేదిక పరిశీలించిన సదరు కమిషనర్.. పరిస్థితులను బేరీజు వేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఓటింగ్ చెల్లనిదిగా ప్రకటించి, కొత్త తేదీని నిర్ణయించి రీపోలింగ్ ఆదేశాలు జారీ చేస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనలు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి. రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఫలితాల అనంతరం ఆయన నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం, స్థలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నుకోవాలి. నిర్ణయించిన రోజు సమావేశం ఏదైనా కారణాలతో జరగకుంటే మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిపై ఉంటుంది. సమావేశ ప్రారంభ సమయం నుంచి గంటలోపు సర్పంచ్తో కలిపి మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైనప్పుడే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సమావేశానికి రిటర్నింగ్ అధికారి అధ్యక్షత వహించి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్గా ఎన్నికై న వ్యక్తి పేరును గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారి నోటీసు విడుదల చేస్తారు. ఆ నోటీసు ప్రతిని ఎన్నికై న అభ్యర్థికి కూడా అందజేస్తారు. డిపాజిట్ గల్లంతు అంటే? ఎన్నికల్లో అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయిందని వార్తలు మనం వింటుంటాం. అసలు డిపాజిట్ దక్కడం అంటే ఏమిటో తెలుసుకుందాం. పోటీలో ఉన్న అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో 16 శాతం లేదా అంతకుమించి ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా సాధిస్తేనే అభ్యర్థికి డిపాజిట్ దక్కినట్లు. ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఓట్లు పోలైతే ఒక అభ్యర్థి 160 లేదా అంతకుమించి ఓట్లు సాధించాలి. ఒకవేళ దానికన్నా తక్కువ ఓట్లు సాధిస్తే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు పేర్కొంటారు. డిపాజిట్ దక్కిన అభ్యర్థికి నామినేషన్ సమయంలో జమచేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల డబ్బులు ఎన్నికల కమిషన్ ఖాతాలోకి వెళ్తాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎన్నికలు నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ సాయంత్రమే లెక్కింపు.. విజేతల ప్రకటన -
వరంగల్ రీజియన్ను అగ్రస్థానంలో నిలపాలి
హన్మకొండ: రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ను అన్ని ఫార్మాట్లలో అగ్రభాగంలో నిలపాలని అధికారులు, ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ –1 డిపోలో వరంగల్ రీజియన్ స్థాయి ప్రగతిచక్రం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. కేఎంపీఎల్, ఆదాయం తీసుకురావడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులను ఆర్ఎం విజయ భాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేష్ ప్రదానం చేశారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ వరంగల్ రీజియన్ రూ.8 కోట్ల లాభాల్లో ఉందని పేర్కొన్నారు. డ్రైవర్లందరు 6 కేఎంపీఎల్ సాధించి ఇంధన పొదుపులో, జీరో ఆక్సిడెంట్లో వరంగల్ రీజియన్ను అగ్రస్థానం నిలపాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు చెందిన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం తీసుకొచ్చిన ఏడుగురు ఉద్యోగులు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి ప్రగతి చక్ర అవార్డులు అందించారు. రెండో త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం సాధించిన ఏడుగురు కండక్టర్లు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి, ఒక్క శ్రామిక్కు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్, హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.8 కోట్ల లాభాల్లో ముందు వరుసలో టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
వదిన – మరిది మధ్య సవాల్
ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంకోతులను పట్టిస్తాం.. ఓట్లు కొట్టేస్తాంకురవి: మండలంలోని కంచర్లగూడెం గ్రామ సర్పంచ్ స్థానానికి వదిన – మరిది మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మూడ్ రజిత పోటీ చేస్తుండగా, ఆమె సమీప బంధువు (మరిది) బానోత్ రమేష్.. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ పడుతున్నారు. వారిద్దరు దగ్గరి బంధువులు కావడంతో వారిలో ఎవరికి ఓటు వేయాలో అర్థంకాని విచిత్ర పరిస్థితి నెలకొంది. కాగా, రజిత గతంలో అదే గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు.బానోత్ రమేష్ మూడ్ రజితగోమాతకు దండం పెట్టి.. ఆశీర్వాదం పొందికురవి: మండలంలోని తట్టుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రంగమ్మ.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు బుధవారం గోమాతకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట మండలంలో ఇల్లంద పోలింగ్ కేంద్రాన్ని ఎకో ఫ్రెండ్లీ కేంద్రంగా అందంగా, ఆహ్లాదకరంగా ఎన్నికల అధికారులు తీర్చిదిద్దారు. – వర్ధన్నపేటకొత్తగూడ: కోతుల బెడదను అరికడుతామని, తమకే ఓట్లు వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని పొగుళ్లపల్లిలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ముందుగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి కోతులు పట్టే బోన్లు తెప్పించాడు. అందుకు ధీటుగా కాంగ్రెస్ బలరుస్తున్న అభ్యర్థి.. కోతులను పట్టే వ్యక్తులనే దింపాడు. -
లెక్క తేలింది..
మహబూబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. ప్రక్రియ ఆలస్యం కావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 169 సర్పంచ్ స్థానాలకు గాను 19జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 150 సర్పంచ్ స్థానాలకు 516 మంది బరిలో ఉన్నారు. 1,412 వార్డులకు గాను రెండు వార్డుల్లో నామినేషన్ల సమస్యతో ఎన్నికలు వాయిదా పడగా.. 272 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో.. జిల్లాలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత జీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 169 జీపీలు, 1,412 వార్డులు ఉన్నాయి. ఈమేరకు ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తి చేశారు. కాగా ఈనెల 9న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 17న పోలింగ్.. మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్ ఈనెల 17వ తేదీన ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు, అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మూడో విడత జీపీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి 19 జీపీలు, 272 వార్డులు ఏకగ్రీవం 150సర్పంచ్ స్థానాల్లో 516 మంది అభ్యర్థుల పోటీ 1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు ఈనెల 17న పోలింగ్ -
ప్రైవేట్ ఆస్పత్రులపై ఆరా..
● అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం ● కొనసాగుతున్న అధికారుల విచారణ నెహ్రూసెంటర్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అబార్షన్ల సంఘటనలపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. అలాగే పలు ఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి దోషులను శిక్షించే పనిలో ఉన్నట్లు సమాచారం. వరుస సంఘటనపై రాష్ట్ర, జిల్లా అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తనిఖీలతోనే సరి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు, రోగులు మృత్యువాత పడడం, ఆందోళనలు పరిపాటిగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా సమాచారంతో ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు చేసిన సంఘటలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ పలుచోట్ల వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం తనిఖీలతోనే సరిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హతలేని వైద్యులు సైతం బోర్డులపై ఎండీలుగా రాసుకొని వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చట్టాలను ఉల్లంఘించొద్దు
మహబూబాబాద్ రూరల్ : చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన వందరోజుల ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ క్యాంపెయిన్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లోనే బాల్యవివాహాలను నిరోధిస్తూ చట్టం వచ్చినప్పటికీ అది నేటికీ పూర్తిగా అమలుకు నోచుకోవట్లేదన్నారు. కొన్ని అలవాట్లు చట్టాలుగా మారుతాయని, మరికొన్ని అలవాట్లు సమాజానికి హానికరమైతే వాటిని నిషేధిస్తూ చట్టాలు వస్తాయని, అటువంటి వాటిలో బాల్య వివాహ నిషేధ చట్టం ఒకటని వివరించారు. జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టటానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వందరోజుల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఉచిత న్యాయ సేవల టోల్ ఫ్రీ నంబర్ 15100, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098, గడపగడపకూ అవగాహన, ప్రత్యేక శిక్షణ తరగతులు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని, న్యాయ సేవా సంస్థ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను జిల్లా జడ్జి ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతి మురారి, ఏ.కృష్ణతేజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చందర్, జిల్లా సంక్షేమ అధికారిని సబిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు, ప్రజలు పాల్గొన్నారు.న్యాయపరమైన రక్షణ రాజ్యాంగ హక్కుమహబూబాబాద్ రూరల్: ప్రతీ వ్యక్తికి జీవించే హక్కు, సమానత్వం, న్యాయపరమైన రక్షణ వంటి మౌలిక హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ సబ్ జైలులో బుధవారం ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జైళ్లలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు, పారాలీగల్ వలంటీర్ల నియామకం ద్వారా ఖైదీలకు న్యాయసహాయం అందుతుందని వివరించారు. అండర్ ట్రయల్ ఖైదీల వివిధ సమస్యలు, కేసులు ఆలస్యం అవుతున్న అంశాలు, బెయిల్ అవకాశాలు, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా విడుదలకు అర్హత వంటి విషయాలను వివరించారు. న్యాయవాది లేకపోయినా ఖైదీలకు వెంటనే ఉచిత న్యాయవాది నియామకానికి దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేశారు. జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు న్యాయ, మానసిక, సామాజిక సహాయాన్ని అందించడానికి నల్సా రూపొందించిన స్పృహ అనే నూతన పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. షరతులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి గార్ల: కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తేమశాతం అధికంగా ఉందని కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. తాలు ఉందని లేనిపోని షరతులు పెట్టి మిల్లర్లు తరుగు తీస్తే ఊరుకునేది లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అలువాల సత్యవతి, ఇమ్మడి గోవింద్, పెద్దవెంకటేశ్వర్లు, ఈశ్వర్లింగం పాల్గొన్నారు. -
ప్లాట్ ఫాం నిర్మాణానికి కృషి
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికుల అవసరాల మేరకు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో నాల్గో నంబర్ ప్లాట్ ఫాం మంజూరు జరిగేలా కృషి చేస్తానని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె రైలు ప్రయాణంలో తన చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫాం నిర్మాణం ప్రాముఖ్యతను ఆమె దృష్టికి తీసుకెళ్లగా రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు అయ్యేలా చూస్తానన్నారు. -
యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్లో యాసంగి పంటలకు సాగు నీరు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి
సాక్షి, మహబూబాబాద్: పుట్టిన ఊరికి సర్పంచ్గా ఎన్నికై తే ఆ కిక్కే వేరు. బరిలో నిలిచి నువ్వా నేనా.. అని చివరి వరకు పోరాటం చేసి గెలవడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి.. మెప్పించి.. ఏకగ్రీవం కావడం అంటే ఆషామాషీ కాదు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులు, మరి కొన్నిచోట్ల నాయకుల సహకారంతో జిల్లాలో 43గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇప్పుడు సంతోష పడడం కాదు.. ముందుంది అసలైన కర్తవ్యం.. ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని చర్చ జరుగుతోంది. ఊరికి మాటిచ్చి.. గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అభ్యర్థులు, నాయకులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికోసం పోటీలో ఉన్నవారందరూ డబ్బుల ఖర్చుపెట్టేందుకు పోటీ పడ్డారు. ఇందులో అత్యధికంగా డబ్బులు ఇస్తామని చెప్పిన వారికి సర్పంచ్ పదవి అప్పగించారు. అదే విధంగా గ్రామాల్లోని కోతుల బెడద తీర్చడం, తండాలు, ఆదివాసీ గూడేలు, గ్రామాల్లో దేవాలయాలు కట్టించడం, అభవృద్ధి పనులు చేయించేందుకు అంగీకార పత్రాలు, బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. మరికొన్ని చోట్ల పోటీ పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల్లో ఒక పార్టీకి సర్పంచ్, మరొక పార్టీకి ఉప సర్పంచ్ పదవి ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోని పోటీ పడిన వారికి వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, ఇతర పదవులు ఇస్తామని బుజ్జగించారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే చివరి వరకు పోటీలో ఉన్నవారిలో కొందరిని ఆర్థికంగా ఆశచూసి నామినేషన్ ఉసంహరించుకునేలా చేయాల్సి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. ఇలా ఊరికి, పోటీలో నిలిచి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్లపై ఉంటుంది.43 పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం.. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేయడం మొదలుకొని ఉపసంహరణ వరకు గ్రామాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నారు. జిల్లాలో 482 పంచాయతీలు, 4,110 వార్డులు ఉన్నాయి. ఇందులో మొదటి విడత 155జీపీలు, 1,338 వార్డులు ఉండగా.. ఇందులో 9పంచాయతీలు, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 158 పంచాయతీలు, 1,360 వార్డులకు గాను 15సర్పంచ్లు, 251వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడో విడతలో 169 గ్రామ పంచాయతీలు, 1,412 వార్డులు ఉండగా.. 19 పంచాయతీల సర్పంచ్లు, 272 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇలా మూడు విడతల్లో 43మంది సర్పంచ్లను, 768 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో 43 గ్రామ పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం పలుచోట్ల అభ్యర్థుల నానా తంటాలు డబ్బుల పంపిణీ, పనులపై హామీలు ముందుంది అసలు కర్తవ్యం -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ శబరీష్ కేసముద్రం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీపీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన సందర్శించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకుబాటిళ్లు, ఆయుధాలు, పెన్నుల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు. ఓటర్లు క్యూ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజున ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు తమ ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే తొలి పోరు
146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్ మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈమేరకు బుధవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. గురువారం ఐదు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1,072 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. అందు కోసం పోలింగ్ కేంద్రాల్లో సామగ్రితో పాటు సిబ్బందికి విధులు కేటాయించారు. మొదటి విడతలో ఐదు మండలాలు.. మొదటి విడతలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 155 గ్రామ పంచాయతీలు, 1,338 వార్డులు ఉన్నాయి. కాగా, గత నెల 27నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 3న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 9జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది, 1,072 వార్డుల్లో 2,391 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా మండలాల్లో 1,78,951 మంది ఓటర్లు ఉండగా.. 88,240 మంది పురుష ఓటర్లు, 90,701 మంది మహిళా ఓటర్లు, 10మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ.. మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మానుకోట మండలానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 12 కౌంటర్లు ఏర్పాటు చేసి పీఓలకు, ఓపీఓలకు సామగ్రితో పాటు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. పంపిణీని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీంచారు. ఇనుగుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో, నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల, గూడూరు, కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయాల్లో సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తంగా 1,753 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి పీఓ, ఓపీఓలు 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్కు ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 201నుంచి 400మంది ఓటర్లు ఉంటే ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401నుంచి 650మంది ఓటర్లు ఉండే బూత్కు ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలను కేటాయించారు. వారితో పాటు 20 శాతం అదనపు సిబ్బందితో పాటు సామగ్రి కేటాయించారు. మొదటి విడతలో 1,621పీఓలు, 1,853 మంది ఓపీలను కేటాయించారు. వారితో పాటు సహాయంగా కేంద్రాల బయట కార్యదర్శులు, కారోబార్లు ఉంటారని తెలిపారు. 10 మంది మైక్రోఅబ్జర్వర్లు.. ఎన్నికల పోలింగ్ దృష్ట్యా 10మంది మైక్రో అబ్జర్వర్లు, వారితో పాటు ఆరుగురు రిజర్వు మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 122 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఐదు మండలాల్లో 49మంది రూట్ ఆఫీసర్లు, 15మంది జోనల్ అధికారులను కేటాయించారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహణ ఐదు మండలాలకు సామగ్రి పంపిణీ పూర్తి 1,621మంది పీఓలు, 1,853మంది ఏపీఓలకు విధులు 10 మంది మైక్రో అబ్జర్వర్లు.. 1,753బ్యాలెట్ బాక్స్లు సిద్ధం పంపిణీని పరిశీలించిన కలెక్టర్ ఉదయమే షురూగురువారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. వాహనాలను పంపిస్తున్న పోలీసులు -
Local Body Elections: ఎవ్రీడే 90 ఎంఎల్..!
వరంగల్ జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకేసంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. -
యాసంగి ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో వానాకాలం పంట కోతలు ముగుస్తుండడంతో యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాగా, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగి సాగు ప్రణాళిక రూపొందించడంతో పాటు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం ఆధారంగా వీటిని సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటలు నిండుగా ఉండడంతో అధికంగా పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరితో పాటు మొక్కజొన్న, ఆరుతడి పంటలు కూడా ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. 2,55,527 ఎకరాల్లో పంటలు.. జిల్లాలో యాసంగి సాగు జనవరి వరకు కొనసాగనుండగా.. ఇప్పటికే ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జనవరిలో వరి పంట సాగు చేయనున్నారు. మొత్తంగా 2,55,527 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు. 85,976 మెట్రిక్ టన్నుల ఎరువుల ప్రతిపాదన.. యాసంగి సాగుకు మొత్తం 85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో యూరియా 59,273.78 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3157.025 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1828.75 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20978.86 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 738.02 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలోనే 40 శాతానికి పైగా ఎరువులను యాసంగి పంటల సాగుకోసం అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరం... యాసంగి సాగు కోసం 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ద్ధం చేశారు. ఇందులో వరి విత్తనాలు 49,237 క్వింటాళ్లు, మక్కలు 5,056 క్వింటాళ్లు, జొన్నలు 71 క్వింటాళ్లు, వేరుశనగ 730 క్వింటాళ్లు, పెసర్లు 115 క్వింటాళ్లు, మినుములు 15.76 క్వింటాళ్లు, బొబ్బెర్లు 63 క్వింటాళ్ల మేరకు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. వరి తర్వాత.. మొక్కజొన్నకే ప్రాధాన్యం.. పంట కోతలు పూర్తవుతున్న పలు గ్రామాల్లో యాసంగి సీజన్ పనులను రైతులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పటికీ పలువురు రైతులు యాసంగిలో వరిపంటనే సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రెండో పంటగా మొక్కజొన్నకు ప్రాధాన్యత ఇస్తూ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీటికి తోడుగా ఎస్సారెస్పీ నీటి సరఫరాపై ఆశతో వరి సాగుతో పాటు మొక్కజొన్న సాగుకు ముందుకొస్తున్నారు. గతంలో యాసంగిలో వరిపంటతో పాటుగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాటు కోతుల బెడద కారణంగా ఆరుతడి పంటలను సాగు చేసేందుకు భయపడుతున్నారు. 2,55,527 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా 85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు, 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు పంట ఎకరాలు వరి 16,4124 మొక్కజొన్న 84,261 పెసర 2,879 మినుములు 394 జొన్న 1,565 వేరుశనగ 1,043 బొబ్బెర 1,261 -
తట్టెడు మట్టి పోయలేదు..
● శిలాఫలకానికి పూలు చల్లి నిరసన తెలిపిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కురవి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన సముదాయానికి వేసిన శంకుస్థాపన శిలాఫలకానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా సంవత్సరీకం కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ శిలాఫలాకానికి పూలుచల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యంగ్ ఇండియా సమీకృత గురుకుల సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తి అయినప్పటికీ తట్టెడుమట్టి పోయలేదని, ఒక ఇటుక పేర్చలేదని విమర్శించారు. అగ్రిమెంట్, పరిపాలన అనుమతులు కాలేదన్నారు. ఇది ప్రజాపాలన కాదని, దివాళాకోరు పాలన అని మండిపడ్డారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ కార్యాలయాల నిర్మాణాలపై లేదన్నారు. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వదిలేశారని, ఇదే రోడ్డుపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వెళ్తున్నారని ఇది కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ గ్లోబల్సమ్మిట్ ప్లాఫ్ అయిందని తెలిపారు. సమ్మిట్ స్టేజ్ మాత్రం కాంగ్రెస్ నాయకులతో నిండిందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ హాయంలో సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారని తెలిపారు. చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యేను చూస్తున్నామని, బండిమీద తిరుగుతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్రవి, బోడశ్రీను, బాదె నాగయ్య, నూతక్కి నర్సింహరావు, బాదావత్ రాజులక్ష్మి, కల్లెపు శ్రీను, గుగులోత్ నెహ్రూనాయక్ పాల్గొన్నారు. -
ఎవ్రీడే 90 ఎంఎల్..!
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డోర్ డెలివరీ -
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు. సెల్టవర్ ఎక్కి రైతు ఆందోళనకేసముద్రం: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తన ధాన్యాన్ని తరలించడం లేదంటూ ఓ రైతు సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని మహమూద్పట్నంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు ఎశబోయిన మురళి ఇదే గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తన ధాన్యం తీసుకొచ్చాడు. కాంటా పూర్తయినా తరలించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సమీపంలో గల సెల్టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని ఆ రైతుకు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. కాగా, సదరు రైతు తీసుకొచ్చిన ధాన్యానికి కాంటా వేశామని, తరలించేందుకు డీసీఎం కూడా వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: మేడారం భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను సూచించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజియన్లోని అన్ని డిపోల మెకానికల్ సూ పర్ వైజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర–2026కు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర సమయంలో బస్సులు మరమ్మతులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల్లో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ మేనేజర్ ఎ.రవీందర్ పాల్గొన్నారు. సీపీని కలిసిన ఆర్టీసీ ఆర్ఎం.. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను టీజీ ఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కలిశారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో సీపీని మర్యాద పూర్వకంగా కలిసి మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. పోలీసు శాఖ ద్వారా సహకారం అందించాలని కోరుతూ లేఖ అందించారు. హనుమకొండ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు. -
ఎన్నికలపై నిరంతర నిఘా
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో మంగళవారం ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపులుగా ఉండడం పూర్తిగా నిషేధమని చెప్పారు. సెన్సిటివ్, హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు పికెటింగ్, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్ పరిసరాల్లోకి ప్రచార సామగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు తీసుకురావొద్దన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సెంటర్లకు తరలిస్తామన్నారు. ఆయా ప్రాంతాలన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. అన్నిచోట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల రాకపోకలు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఉద్రిక్తత, ప్రజలు గుంపులుగా ఉండడం, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడని ఆదేశించారు. ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, మొత్తం 1,000 మంది పోలీసు సిబ్బంది మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని పౌరులు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు. -
వైద్యశిబిరాలు ఏర్పాటు చేయండి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ కురవి: గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జాతీయ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విరాజిత, సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
చిన్నగూడూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని టీఓటీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మంచ్యాతండా రైతువేదికలో రిటర్నింగ్ అధికారులకు ఆయన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ సుజాత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలు సింగారం, వీఎస్.లక్ష్మీపురంలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సైలు సతీష్, జయకుమార్, రూరల్ ఎస్సైలు దీపిక, రవికిరణ్, పోలీసు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏకగ్రీవ సర్పంచ్లు వీరే..
కురవి: జిల్లాలోని కురవి, సీరోలు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. సీరోలు మండలంలోని బీల్యాతండా, వస్రాంతండా, బూరు గుచెట్టు తండాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు వాంకుడోత్ ఆశా, బానోత్ కల్యాణి, బానోత్ శివ, కురవి మండలం బంజరతండాలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి బానోత్ రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మడగూడెం సర్పంచ్ ఏకగ్రీవం.. గంగారం: మండలంలోని మడగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈసం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవానికి కృషి చేసిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. మరిపెడ మండలంలో.. మరిపెడ రూరల్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మంగళవారం అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోగా.. మండలంలోని పర్కజలతండా (నేతావత్తండా) సర్పంచ్గా బానోతు కొండయ్య, ఉపసర్పంచ్గా గుగులోతు రాము, చింతలగడ్డతండా సర్పంచ్గా ఆంగోతు రజితరవీందర్, అజ్మీరతండా సర్పంచ్గా అజ్మీరా రవి, ఉపసర్పంచ్గా భూక్య కిషన్, ధరావత్తండా సర్పంచ్గా ధరావత్ తేజానాయక్, అమృనాయక్తండా సర్పంచ్గా ధరావత్ పద్మరూప్లాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో రెండు గ్రామ పంచాయతీలకు ఇద్దరు ఉపసర్పంచ్లు ఎన్నిక కాగా, మరో మూడు పంచాయతీలకు ఉపసర్పంచ్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సర్పంచ్లు ఎన్నిక కాగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అలాగే ఎలమంచిలితండాలో సర్పంచ్ అభ్యర్థి బానోత్ భద్రునాయక్, 6వార్డులు ఏకగ్రీవం కాగా, మరో రెండు వార్డుల్లో పోటీ నెలకొంది. ఆరు జీపీలు.. కొత్తగూడ: మండలంలో ఆరు గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా, బీఆర్ఎస్ మద్దతుదారులు ఉప సర్పంచ్లుగా తీర్మానం చేసుకుని మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించకున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కుంజ భిక్షపతి(కోనాపురం), ఆలూరి కిరణ్(సాదిరెడ్డిపల్లి), మాలోతు లక్ష్మి(రేణ్యతండా), వాసం నర్సమ్మ(ఎంచగూడెం), వంక రాములు (మొండ్రాయిగూడెం), పెనక సిరివెన్నెల(కార్లాయి)కు ఆయా క్లస్టర్ ఎన్నికల అధికారులు కలెక్టర్ అనుమతి రాగానే ఎంపిక పత్రాలు అందజేస్తామని తెలిపారు. -
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్పోలింగ్ ఆకట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ బూత్వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా క్యూలో నిల్చోవడం, వారితో ఓటు వేయించడం.. ఓటేశాక బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో ఎలా వేయాలో.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. –వాజేడునీ ఓటు నాకే..సాధారణంగా ఎన్నికల్లో తాము గెలవడానికి అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తుంటారు. జనగామ జిల్లా చౌడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కర్ల పద్మ భార్గవరాంరెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ముక్క ఉమ మంగళవారం ప్రచారంలో ఎదురుపడ్డారు. ఒకరికి ఒకరు ఓటు వేయాలని చేతులు కలుపుతూ అభ్యర్థించడం చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ముసిముసిగా నవ్వుకున్నారు. – జనగామ రూరల్చికెన్ రెడీ ..మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. కొందరు అభ్యర్థులు ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ చికెన్ సెంటర్లో మాంసం ప్యాకింగ్ చేయిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మహబూబాబాద్ -
నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని నేరడలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్ నిర్వహణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థినులతో హిందీపాఠం చదవించారు. పదో తరగతిలో అందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని ఎస్ఓకు సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.విజయకుమారి, ఎస్ఓ సరస్వతి తదితరలు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి దంతాలపల్లి: ఎన్నికల వేళ రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు డీఎస్పీ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్కుమార్, ఎంపీడీఓ విజయ, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం మహబూబాబాద్: మాజీ సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విజయ దివస్ కార్యక్రమం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగి దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నా రు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, సలీం, ఆసిఫ్, కిరణ్, అమీర్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబె ల్ ప్రైజ్డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి సుజాతతో కలిసి రిజి స్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్డే ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక,కవిత, మహేందర్ ఉన్నారు. విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్.. లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్లాల్, మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్హాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఇస్తారి తెలిపారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మహబూబాబాద్: మొదటి విడత జీపీ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె మొదటి విడత ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 11న నిర్వహించే మొదటి ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటరు స్లిప్లు సమాచారం కోసమే అని, గుర్తింపు పత్రంగా పరిగణించొద్దన్నారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారే ఓటు వేయాలన్నారు. ఓటర్లు గుర్తింపు కోసం ఎపిక్ కార్డు (ఓటరు ఐడీ ), లేదా ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం.. ఇందులో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఏజెంట్ల ఎదుట మాక్పోలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ఐదు మండలాలు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీసీలో జిల్లా నుంచి ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్ బాబు, శ్రీనివాస్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. -
ముగిసిన ప్రచారం
● మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచారానికి తెర ● గ్రామాల్లో ప్రలోభాల ఎర ● నేటిరాత్రి అన్ని పార్టీలకు కీలకంఅన్ని పార్టీలకు కీలకం.. మొదటి విడత గ్రామ పంచాతీ ఎన్నికల ఫలితాల ప్రభావం మిగిలిన పంచాయతీలపై పడే అవకాశం ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మొదటి విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో జరగనుండడంతో.. అక్కడి ప్రజాప్రతినిధులకు తమ మద్దతుదారులను గెలిపించడం సవాల్గా మారింది. ఇందుకోసం ఎమ్మెల్యే మురళీ నాయక్, సీనియర్ నాయకులు భరత్ చందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తమ మద్దతుదారుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రలోభాల పర్వం.. -
అండర్–16 అంతర్ జిల్లాల విజేత వరంగల్
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన అండర్–16 అంతర్ జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి, మొగిలిచర్లలోని క్రీడా మైదానాల్లో ఐదు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఎంపిక పోటీలు నిర్వహించారు. వంగాలపల్లి మైదానంలో వరంగల్, ములుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరంగల్ విజయం సాధించి ఇంట్రాడిస్ట్రిక్ట్ చాంపియన్గా నిలిచింది. ఐదు జిల్లా జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 20 మందితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాబబుల్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘురామ్, నిజాముద్దీన్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ్వినయ్, ఆవాల వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి హత్య కేసులో నలుగురి అరెస్ట్
పలిమెల : మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు మహాదేవ్పూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పలిమెల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివారలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల పంకెన గ్రామానికి చెందిన చిలుమలు రాజయ్య, చిలుముల సంతోశ్.. తమ తల్లి తరచూ అనారోగ్యం కావడానికి అదే గ్రామానికి చెందిన సోదరి బక్కయ్య కారణమని భావించారు. బక్కయ్య మంత్రాలు చేయడంతోనే తమ తల్లి అనారోగ్యానికి గురవుతోందని, అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమ బంధువులు పాగే శ్రీనివాస్, పాగే రామయ్యకు విషయం చెప్పగా వారు సరే అన్నారు. దీంతో నలుగురు కలిసి కలిసి గత నెల (నవంబర్) 25వ తేదీన రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బక్కయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పలిమెల పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రాజయ్య, సంతోష్, శ్రీనివాస్, రామయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో పలిమెల ఎస్సై జె.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
ప్రచారం కాదు.. పరీక్ష!
● ఓటు కావాలంటే బురదలో దిగాల్సిందే ● ఉదయం, సాయంత్రం పొలంబాట ● సర్పంచ్ అభ్యర్థుల వినూత్న ప్రచారంజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్ర చారం ఊళ్లలో కాదు.. పొలాల్లో దూసుకుపోతోంది. ఓటు అడగాలంటే బురదలో అడుగేయాలన్న ని బంధనలను అభ్యర్థులు అక్షరాలా అనుసరిస్తున్నా రు. రైతు తెల్లవారుజామున పొలాల్లోకి దిగితే, నేతలు వెంటపడి మట్టిలో మునిగిపోతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓ టు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వానాకా లం వరి కోతలు, పత్తి సేకరణ, అమ్మకాలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యోదయానికి ముందే రైతులు పనిముట్లు భుజాన వేసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సాయంత్రం వరకూ మట్టితో మమేకమైపోతున్నారు. దీంతో అభ్యర్థులకు మెజార్టీ ఓటర్లు దొరకడం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో గంట నుంచి రెండు గంటలపాటు పొలం గట్లకు కేటాయిస్తున్నారు. ఓటరు ఇంట్లో లేడా.. పొలంలో ఉన్నాడా.. అయితే మన ప్రచారం కూడా అక్కడికే అనే ఫార్ములాతో అభ్యర్థులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉదయం పది గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ఆ తర్వాత పొలం బాట పడుతున్నారు. బురదలో మునిగిన పొలం అంచుల్లో అభ్యర్థుల ప్రచార హడావుడి కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు రైతులతోపాటు బురదలోకి దిగుతూ.. గట్లను చదును చేయడం, నీటి కాల్వలు వదలడం వంటి పనులు చేస్తున్నారు. అన్నయ్య.. తాతా.. ఇదే మా గుర్తు, ఇదే మా మాట అంటూ చేతిలో బ్యాలెట్ పత్రం నమూనా పట్టుకుని బురదలో నిల్చున్న దృశ్యాలు ఈ ఎన్నికల్లో సాధారణం అయ్యాయి. రాజకీయాలు ఈసారి నిజంగానే మట్టిలో పుట్టి, మట్టిలోనే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నా అసలు హడావుడి పొలాల్లోనే కనిపిస్తోంది. రైతు పనుల్లో మునిగిపోయిన వేళ అభ్యర్థులు సైతం అతడి వెంటే నడుస్తున్నాడు. పొలంలో పనిచేస్తే ఓటు అన్నట్లు ఈసారి సర్పంచ్ అభ్యర్థుల ప్రచార శైలి రోజుకో కొత్త మలుపు తిరుతోంది. -
రెండు వాడల మధ్య పోటీ!
హసన్పర్తి: మండలంలోని గంటూరుపల్లి గ్రామపంచాయతీలో అవతలి వాడ, ఇవతలి వాడల మధ్య పోటీ ఉంది. ఆయా వాడల్లో ఓట్లు మాత్రం పార్టీలకతీతంగా వేయడం ఆనవాయితీగా వస్తోంది. గంటూరుపల్లిలో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఇవతలి వాడలో 398 ఓట్లు, అవతలి వాడలో 304 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ చల్లా రాకేశ్రెడ్డి, అవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ సుంకరి రమాదేవి, కందుల ప్రశాంత్రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాకేశ్రెడ్డి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సుంకరి రమాదేవి, కుమారస్వామి అధికార పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు.కాగా, గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈవతలి వాడ, అవతలి వాడల నుంచి ఒక్కొక్కరే పోటీలో ఉండే వారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరి చొప్పున బరిలో నిలిచారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. -
అనుమతులు లేకుండా అడ్మిషన్లు
మహబూబాబాద్ అర్బన్: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. పలువురు అనుమతులు తీసుకోకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆకర్షణీయమైన బ్యానర్లు, పోస్టర్లు వేసి పెద్దఎత్తున అడ్మిషన్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చాలా ప్రైవేట్ స్కూ ళ్లు ప్రభుత్వ గుర్తింపు లేకుండా వెలిసినా.. బయటపడ్డవి కొన్ని మాత్రమే. అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో అనుమతులు లేని పాఠశాలలు వెలు గులోకి రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. విద్యార్థులతో చెలగాటం.. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ యూడైస్ నిబంధనలు ప్రకారంపేర్లు నమోదు కాకపోతే, వారు విద్యాశాఖ లెక్కలోకి రారని, ఆ విద్యార్థులకు హాల్ టికెట్లు రావని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతులు లేకుండా కొనసాగుతోంది. ఇందులో పదో తరగతి విద్యార్థులు సుమారు 29 మంది చదువుతున్నారు. అయితే నవంబర్లో యూడైస్లో వివరాలు కనిపించకపోవడంతో ఆ విద్యార్థులందరూ టీసీలు తీసుకొని అనుమతులు ఉన్న మరో పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆ పాఠశాలలో ఇప్పటికే 130 విద్యార్థులు చదువుతున్నారని, అడిషనల్ సెక్షన్ అనుమతి లేదని తెలిసింది. అలాగే ముత్యాలమ్మ గూడెం, కృష్ణకాలనీలో అడిషనల్ సెక్షన్కు అనుమతులు లేని మరో రెండు పాఠశాలల్లో 230మందికి పైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారని సమాచారం. ఇలా అనుమతులు లేని పాఠశాల, అడిషనల్ సెక్షన్కు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని, విద్యార్థుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల జీవితాలతో యాజమాన్యాల చెలగాటం యూడైస్లో వివరాలు కనిపించకపోవడంతో మరో స్కూల్లో చేరిన విద్యార్థులు మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు యూడైస్ ప్రమాణికం.. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్)లో ప్రతీ విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది.. వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. కాగా యూడైస్ను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన వివరాలు యూడైస్లో లేకుంటే వార్షిక పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఓటర్లకు డబ్బులిచ్చినా... భయపెట్టినా నేరమే..
విచారణలో నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానాపాలకుర్తి టౌన్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని డబ్బులు, మద్యం పంచడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి ప్రలోభాలకు పాల్ప డుతుంటారు. ఇలా చేస్తే నేరానికి పాల్పడినట్లే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)–2023 ప్రకారం.. ఎన్నికల సమయంలో నేరానికి పాల్పడిన వారికి సెక్షన్ 169 నుంచి 177 వరకు శిక్షలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను బెదిరించడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం, వైరంతో కూడిన ప్రచారం చేయడం కూడా నేరమే. ఇవి నిరూపణ అయితే ఏడాది జైలు శిక్ష పడుతుంది. చనిపోయిన వారి పేరుపై ఓటు వేయాలని ప్ర యత్నించడం, మారుపేరుతో ఓటు వేయడం, లేదా ఒకసారి ఓటు వేశాక.. మరోసారి వేయాలని ప్రయత్నించడం, దొంగ ఓట్లు వేసేలా ఇతరులను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తే, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది. ఫలితాలను ప్రభావితం చేసేలా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వ్యక్తిత్వం గురించి అబద్ధపు ప్రకటనల (వివాహేతర సంబంధాలున్నాయని, అతను స్మగ్లర్ అని, మంచి వాడు కాదని, అతను ఒక కుల, ఒక మతం వాడని, లాంటిచర్యలు)తో ప్రచారం చేయడం నేరం. నిరూపణ అయితే జరిమానా విధిస్తారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చులు సంబంధిత అధికారులకు సమయంలోపు చూపించాలి. లేకపోతే రూ. 500 వరకు జరిమానా విధిస్తారు. ఎన్నికల సమయంలో నేరాలు జరినట్లు ఆధారాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే అవసర మైతే కేసు నమోదు చేస్తారు. కేసు నిరూపణ అయితే అభ్యర్థిపై అనర్హత వేటు పడడంతోపాటు, చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశముంది.ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు ఆశ చూపి, మద్యం, బియ్యం, వస్త్రాలు, ఇతర వస్తువులు, బహుమతులు ఇచ్చి ఓటు అడగడం నేరం.ఈ నేరం నిరూపణ అయితే ఏడాది జైలు, జరిమానా విధిస్తారు. -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. డిసెంబర్ 8వ తేదీ (సోమవారం) యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ (06569) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు మంగళవారం చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 10వ తేదీ( బుధవారం)న హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు (06570) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు గురువారం చేరుకుని వెళ్తుంది. ఈ రెండు రైళ్ల సర్వీస్లకు యెలహంక, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, భోపాల్, బీనా, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. జాతరకు సహకరించాలి హన్మకొండ: మేడారం జాతరకు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజ యభాను కోరారు. ఈ మేరకు సోమవారం ములు గు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ కిషన్ జాదవ్ను ములుగులో కలిశారు. ఈ సందర్భంగా 2026 మేడారం జాతరపై వారితో చర్చించారు. ఆర్టీ సీ ఏర్పాట్లను వివరించారు. జాతరకు వచ్చే భక్తులు, సిబ్బందికి చేయాల్సిన ఏర్పాట్లు, ఆయా శాఖల ద్వారా అందించాల్సిన సహకారం గురించి చర్చించారు. సమన్వయం, సహకారంతో ముందుకెళ్తామని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవి చందర్ పాల్గొన్నారు. -
ధాన్యం రాశులతో మార్కెట్ కళకళ
మార్కెట్ కవరు షెడ్డులోని ధాన్యం రాశులు ● నేడు కొనుగోళ్లు బంద్ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం రైతులు తీసుకొచ్చిన ధాన్యం రాశులతో కళకళలాడింది. 4,026 క్వింటాళ్ల ధాన్యం (6,193 బస్తాలు) కొనుగోళ్లు చేయగా.. కాంటాల్లో ఆలస్యమైంది. కాగా వ్యాపారస్తుల కోరిక మేరకు మంగళవారం ధాన్యం కొనుగోళ్లకు బంద్ ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. బుధవారం యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. -
ఉత్సాహంగా బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్లో సోమవా రం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భోగి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే క్రీడల్లో లక్ష్యం సాధిస్తారన్నారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 90 క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హనుమకొండ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు, బాక్సింగ్ సంఘం జిల్లా ప్రతినిధులు పెద్దమ్మ, నర్సింహరాములు, స్విమ్మింగ్ సంఘం జిల్లా కార్యదర్శి మంచాల స్వామిచరణ్, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం శోభారాణి, పీడీ శ్రీధర్రావు, సెలక్షన్ కమిటీ కన్వీనర్ శీలం పార్థసారధి, బాక్సింగ్ అఫిషియల్స్ శ్యాంసన్, జీవన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి జలగలు!
ప్రజల రక్తం పీల్చుతున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు వరంగల్ క్రైం : అవినీతి జలగలు( ప్రభుత్వ ఉన్నతాధికారులు) ప్రజల రక్తం పీల్చుతున్నాయి. ప్రజ లకు హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలకు అ డుగడుగునా కప్పం కట్టాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్ప డితే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేద్దామనుకుంటే పై న ఇంకా పెద్ద తిమింగలాలు ఉంటున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుంటే మరోపక్క అవినీతి పరులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. స్టాంప్ అండ్ రిజిస్టేషన్స్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, విద్యు త్, మున్సిపాల్, ఎకై ్సజ్, విద్య, వైద్యారోగ్య శాఖల్లో అవినీతికి తావున్నప్పటికీ దాడులు కొన్ని శాఖలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులను పట్టుకున్నా లంచం తీసుకోవడానికి ఏమ్రాతం వెనుకడుగు వేయడం లేదు. ఫలితంగా కొన్ని శాఖల్లో అవినీతి హక్కుగా మారుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీఏ, రెవెన్యూ, రిజిస్టేషన్ శాఖల్లో ప్రతీ ఫైల్కు లెక్కను పక్కాగా ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఎవరైనా, ఎక్కడైనా ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే అనే స మాధానం ఎదురవుతోంది. దీనిని బట్టి అవినీతి ప్ర భుత్వ శాఖల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమవుతోది. ఈ క్రమంలో మంగళవారంతో అవి నీతి నిరోధక వారోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఏసీబీకి పట్టుబడిన అధికారులపై ‘సాక్షి’ కథనం పట్టుబడుతున్న అవినీతి అధికారులు.. చాలా మంది ప్రభుత్వ అధికారుల అవినీతి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. బాధితులు.. అవినీతి అధికారుల వేధింపులు భరిస్తూనే వారి డిమాండ్లు నెరవేరుస్తున్నారు. ఏసీబీ అధికా రుల ఫిర్యాదు చేస్తా తప్ప దాడులు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. గతంలో అవినీతికి పాల్పడిన అధికారులను హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించే వారు.అయితే వ రంగల్లో ఏసీబీ కోర్టు ఏర్పాటు కావడంతో ఇక్కడే హాజరపరుస్తున్నారు. కాగా, అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కితే బాధితులు సంబురాలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి అవినీతి అధికారుల డిమాండ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతోంది. ● ఈనెల 5న ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.లక్ష డిమాండ్ చేసి రూ. 60 వేలు ఒప్పందం కుదుర్చుకున్న హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది గౌస్, మనోజ్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు చేయగా రూ. 30 లక్షలు నగదు లభించింది. వెంకట్రెడ్డి అవినీతి అధికారులకు పట్టుపడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. ● ఈ ఏడాది జనవరి 6న మహబాబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ కర్రి జగదీశ్.. పీడీఎస్ బియ్యం వ్యాపారి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అప్పటికే రూ. 2 లక్షలు తీసుకున్నారు. మరో రెండు లక్షల కోసం చూస్తుండగా ఏసీబీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించింది. ● ఫిబ్రవరి 6న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై, పలు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విలువల ప్రకారం రూ. 5 కోట్లపైబడే అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ● ఈఏడాది మార్చి 20న స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ.. గిఫ్ట్ రిజిస్టేషన్ కోసం ఓ ప్రైవేట్ ఉద్యోగి ద్వారా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సె ప్టెంబర్ 1న తన బ్యాంకు లాకర్లో రూ. 6 లక్షలు లభిస్తే వాటికి లెక్కలు చూపకపోవడంతో ఏ సీబీ అధికారులు మరోసారి రామకృష్ణపై ఆదా యానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ● జూన్ 13న జనగామ జిల్లా ఆర్అండ్బీ శాఖలో ఓ కాంట్రాక్టర్కు బిల్లు మంజూరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా ఈఈ చిలుకపాటి హుస్సేన్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ● ఆగస్టు 23న మహబాబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఎకై ్సజ్ కేసులో ఇన్స్పెక్టర్ భూక్య రాజేశ్, కానిస్టేబుల్ ధరావత్ రవి.. బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ● నవంబర్ 21న జనగామ జిల్లా పాలకుర్తి సబ్ డివిజన్ మిషన్ భగీరథ డిప్యూటీ ఇంజనీర్ కూనమళ్ల సంధ్య(డీఈ).. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ● నవంబర్ 28న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర్ తహసీల్దార్ వీరగంటి మహేందర్.. గిఫ్ట్ రిజిస్టేషన్ విషయంలో రూ. 10 వేల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. ఇదే కేసులో ప్రైవేట్ డ్రైవర్ తుప్పరి గౌతంను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంవత్సరం కేసులు 2020 7 2021 7 2022 9 2023 11 2024 18 2025 19 పెరుగుతున్న ఏసీబీ దాడులు.. అయినా మారని తీరు ఇప్పటికే 19 కేసులు నమోదు.. హక్కుగా మారుతున్న అవినీతి నేటితో అవినీతి నిరోధక వారోత్సవాలు ముగింపుప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. హక్కుగా లభించే పనులకు లంచం ఇవ్వొద్దు. అవినీతి అధికారుల సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులపై ట్రోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నంబర్ 9154388912కు ఫిర్యాదు చేయాలి. – పి. సాంబయ్య డీఎస్పీ, ఏసీబీ -
అంధులకు ప్రత్యేక సౌకర్యాలు
జనగామ: పోలింగ్ కేంద్రాల్లో అంధులు, ఆశక్తులైన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంధత్వం లేదా శారీరక బలహీనతల కారణంగా స్వయంగా బ్యాలెట్ పేపర్పై గుర్తు చేయలేని ఓటర్లు, 18 ఏళ్లకు తక్కువ కాకుండా ఉన్న ఒక సహచరుడిని ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే, అదే వ్యక్తి ఒకే రోజు, మరెక్కడా ఏ ఇతర ఓటరుకు సహచరుడిగా ఉండకూడదు. సహచరుడు వేసి ఓటుకు సంబంధించి రహస్యంగా ఉంచుతామని నమూనా–22 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. అన్ని కేసుల వివరాలు నమూనా–23లో నమోదు చేసి రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. కంటి చూపు బలహీనంగా ఉన్న ఓటర్లు స్వయంగా గుర్తు చేయగలరా అనే అంశాన్ని పోలింగ్ సిబ్బంది ప్రశ్నించొచ్చు. కానీ, పోలింగ్ సిబ్బందే సహచరులుగా వ్యవహరించొద్దు. బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉన్న పోలింగ్ స్టేషన్లలో సహచరుడికి అనుమతి ఉండదు. జనగామ: ఎన్నికల నిర్వహణ నియమావళి–2018లోని 25 (2)వ నియమం ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వినియోగించేకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తమ సొంత గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో పనిచేయలేని సమయంలో ఫారం–15 (అనుబంధం 21) ద్వారా సాధారణ పోలింగ్ స్టేషన్లోనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందిన పక్షంలో (అనుబంధం 22) ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం జారీచేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రంపై సంతకం తీసుకొని, ఓ టర్ల జాబితా మార్కు చేసిన కాపీలో వారి పేరు ఉంటే సాధారణ ఓటరు తరహాలోనే ఓటు వేయడానికి అనుమతిస్తారు. అంతేకాకకుండా అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది ఈడీసీ కాకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. తమ సొంత మండలంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడంపై ఎలాంటి అభ్యంతరం ఉండదని ఎన్నికల శాఖ తెలిపింది. జనగామ: పోలింగ్ ప్రారంభం ఆలస్యమైనా, నిర్ణీత సమయానికే పోలింగ్ ముగించాలి. అయితే ముగింపు సమయానికి కేంద్రం వద్ద ఉన్న ఓటర్లందరికీ ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలి. ముగింపు సమయానికి కొద్ది నిమిషాల ముందు క్యూలో ఉన్నవారికి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. క్యూలో చివరి వ్యక్తి నుంచి మొదలుకొని వరుస సంఖ్యలతో స్లిప్పులు పంపిణీ చేసి, వారు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగించాలి. ముగింపు సమయం అనంతరం కొత్తగా ఎవరూ క్యూలో చేరకుండా పోలీసు, ఎలక్షన్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. నిర్ణీత ముగింపు సమయం తర్వాత క్యూలో ఉన్న వారంతా ఓటు వేసిన వెంటనే పోలింగ్ ముగిసినట్లు ప్రకటించాలి. ఆ ప్రకటన తర్వాత ఎవరిని ఓటు వేయనియొద్దు. -
ఏం పార్టీలో.. ఏం పొత్తులో!
గీసుకొండ : నేను ఓ సామన్య ఓటరును. నా మైండ్ బ్లాకై పోతాంది.. మా గ్రామాలల్ల పంచాయతీ ఎన్నికలను జూస్తే ఇదేందిరా అనిపిత్తాంది.. మొన్నటిదాకా కత్తులు దూసుకున్నోళ్లు ఇప్పుడు ఒక్కటైతాండ్లు. నాది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కొండా కాంగ్రెస్ అని జండాలు బట్టుకుని ఊరేగినోళ్లు, కొట్లాటకు దిగినోల్లు .. పంచాయతీ ఎన్నికలల్ల అవన్నీ మర్చిపోయి అలాయ్బలాయ్ దీసుకుంటాండ్లు... కపట ప్రేమలను ఒలకబోస్తాండ్లు.. ఎవరితో ఎవరు పొత్తులు బెట్టుకుండాల్లో, కలుత్తాల్లో తెల్వక నా చిన్న మెదడు హీటెక్కుతాంది. మా మండలంల నేను ఓ ఊరికి బోతే అక్కడ బద్ధ శత్రువులైన పార్టీల వారు ఒక్కటై తమ వారిని గెలిపించాలని కోరుతాండ్లు. రోజూ కలిసి దావత్లు జేసుకుంటాండ్లు.. ఏం జేసినా గెలవాలన్నదే వారి ఆలోచన.. గా యాల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలల్ల గట్టిగ జండాలను బట్టుకున్న వారు సైతం ఎటో ఓ దిక్కి బెండ్ అవుతుతాండ్లు.. ఎవరితోనైనా ఎవరు కల్వవచ్చనే కొత్త నీతి సిద్ధాంతానికి పెద్దమనుషులై తాండ్లు వాళ్లు.. కాంగ్రెస్ , బీఆర్ఎస్లు బద్ధ శత్రువులు.. అయితేనేం ఈ ఎన్నికల్ల వారు దోస్త్ కడుతాండ్లు..దోస్తరబిన్ అందమా.. అంటూ పాటలు పాడుతూ చిందులేత్తాండ్లు. ఎక్కడ ఎట్ల ఉంటే అట్ల వారు పొత్తులు కడుతాండ్లు.. వారి పొత్తులను జూసి మావాళ్లు పరేషాన్ అయితాండ్లు.. రాజకీయమంటే గింత ఉంటదా అని మదన పడుతాండ్లు. మా ఊర్లె అయితే జనం ఎవరికి ఓటు ఏయాలనో తెల్వక పరేషాన్ అయితాండ్లు. నా పరిస్థితి గూడా అంతే.. ఓటేద్దామంటే నాకు ఇట్టంలేని పొత్తులు.. పోనీ ఓటేయకుండా పోదామంటే ఎందుకో నాకు మనసొప్పడం లేదు. పొత్తులతో నా ఇష్టాన్ని హైజాక్ జేసిండ్లు ఆ ‘పొత్తల’ పార్టీలోల్లు..నా లాంటి ఓటరు పరిస్థితి పగోడికి కూడా రావొద్దు దేవుడా..! నా ఇష్టం వచ్చినోళ్లుకు ఓటేయలేక పోతున్న.. మీ గొప్ప మనసుతో నన్ను క్షమించు..నాకేమైనా దారిజూపు.. జీపీ ఎన్నికల్లో పార్టీల పొత్తుపై ఓటరు ఆశ్చర్యం -
సర్పంచ్గా గెలిపిస్తే..
● వచ్చే వేతనంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి ● రూ.100 బాండ్ పేపర్తో ప్రేమ్కుమార్ ప్రచారం స్టేషన్ఘన్పూర్: జీపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వచ్చే వేతనంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని మండలంలోని మీదికొండ సర్పంచ్ అభ్యర్థి జోగు ప్రేమ్కుమార్ అన్నా రు. ఈ మేరకు తాను గెలిస్తే చేపట్టనున్న కార్యక్రమాలను రూ.100 బాండ్ పేపర్పై పొందుపరిచి సంతకం చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్, పాఠశాలల పచ్చదనం, పరిశుభ్రత, పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, తదితర సౌకర్యాల కల్ప నకు కృషి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..
ఈదులపూసపల్లి రోడ్డు వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలో అనుమతులు లేని ఓ ప్రైవేట్ పాఠశాలపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖ అధికారులు అసలు స్పందించడం లేదు, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ మూముళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. యాజమాన్యం మా వెనుక పోలీస్ బలం ఉంది, విద్యాశాఖ అధికారులు మేము చెప్పినట్టు వింటారు అంటూ బెదిరిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – గూగులోతు సూర్య ప్రకాశ్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి మైసమ్మ చెరువులో పడి గల్లంతైన విద్యార్థి భూక్య సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం మైసమ్మ చెరువులో ఈతకెళ్లి సాయికిరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, విద్యార్థి గల్లంతైన సమయంలో అతడితోపాటు వచ్చిన విద్యార్థుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రూరల్ సీఐ సర్వయ్య ఎస్సైలు దీపిక, రవికిరణ్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శని, ఆదివారాల్లో 48 గంటల పాటు విద్యార్థి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాక వారితోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మర గాలింపు చేపట్టగా సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించా రు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కాగా, ఎన్నో ఆశలతో సాగాల్సిన సాయికిరణ్ జీవితం అర్ధంతరంగా ఆవిరైపోయిందని తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
ఇంట గెలవాలి
ప్రజాప్రతినిధులు, నాయకుల సొంత గ్రామాల్లో అనుచరుల పోటీ సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారు, మంత్రిగా ఎదిగిన వారు ఉన్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తమ సొంత గ్రామాల్లో మద్దతుదారులను గెలిపించుకోవడం కీలకంగా భావిస్తున్నారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ మద్దతుదారులను పోటీలో దించారు. వీరికి దీటుగా బీఆర్ఎస్ కూడా తమ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. దీంతో సొంత గ్రామాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై పడింది. నియోజకవర్గం అంతా ఒక లెక్క.. సొంత గ్రామం మరో లెక్కగా భావించి ఇరు పార్టీల నాయకులు ప్రచారం చేస్తూ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు. ● మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సొంత గ్రామం మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండా. తండాలో మొత్తం 914 మంది ఓటర్లు ఉంటారు. గత ఎన్నికల్లో తండాకు చెందిన ఇస్లావత్ బాలాజీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా బరిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు బాలాజీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ మద్దతుతో ఎమ్మెల్యే సోదరుడు భూక్య దళ్సింగ్ భార్య కౌసల్య పోటీలో ఉంది. బీఆర్ఎస్ మద్దతుతో దారావత్ భారతి పోటీలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఇద్దరు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ మద్దతుదారు, తన అన్న భార్య కౌసల్యను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు. ● డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ స్వగ్రామం జిల్లాలోని పెద్దవంగర మండలం నెహ్రూతండా. ఈ తండా రెడ్డికుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. పంచాయతీలో మొత్తం ఆరు వార్డులు ఉన్నాయి. 395 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో తండాకు చెందిన బానోత్ జగ్గానాయక్ కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుగా మాజీ సర్పంచ్ జగ్గానాయక్తోపాటు, బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి బానోత్ శంకర్ పోటీలో ఉన్నారు. ఇరువురి మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్కు జగ్గానాయక్ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ● మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వగ్రామం డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం గుండ్రాతి మడుగు శివారు పెద్దతండా గ్రామ పంచాయతీ. 1,680 మంది ఓటర్లు ఉన్నారు. గత పర్యాయం సత్యవతి రాథోడ్ మేనల్లుడు శ్రీరాం భార్య వనజ గెలిచింది. ఇప్పుడు 13 మంది పోటీలో ఉన్నారు. అయితే సర్పంచ్ను ఏకగ్రీవంగా చేసేందుకు సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీవం కాకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత సత్యవతి రాథోడ్దే అంటున్నారు. ● రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెం పంచాయతీలోని మోకాళ్లపల్లి. ఈ పంచాయితీలో మొత్తం 398 మంది ఓటర్లు ఉన్నారు. గత పర్యాయం కాంగ్రెస్ మద్దతుతో బంగారి భారతి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో వంక రాములు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ మద్దతుతో బంగారి నరేష్ పోటీలో ఉన్నారు. అయితే ఎన్నికలు లేకుండా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.. లేదా పోటీ అనివార్యమైతే తమ మద్దతుదారుడు రాములును గెలిపించుకునే బాధ్యత మంత్రి సీతక్కపైన ఉంది. ● మాజీమంత్రి డీఎస్ రెడ్యానాయక్, ఆమె కూతురు మాజీ ఎంపీ కవిత స్వగ్రామం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి. ఈ పంచాయతీలో 1800 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో రెడ్యానాయక్ అనుచరుడు మల్లేశం సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు తన అనుచరుడు అయూబ్ పాషాను బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేయించారు. కాంగ్రెస్ మద్దతుతో భర్తపురం యాకయ్య బరిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో అయూబ్ పాషాను గెలిపించుకుకోవడం మాజీ మంత్రి రెడ్యానాయక్కు కీలకంగా మారింది. ● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సొంత గ్రామం తొర్రూరు మండలం చర్లపాలెం. ఈ పంచాయితీలో 2,300 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు సట్ల నాగలక్ష్మి సర్పంచ్గా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ధర్మారపు కిరణ్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ పోటీలో ఉన్నారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ మద్దతు మహేందర్కు ప్రకటించింది. సొంత ఊరిలో మద్దతుదారుడు ధర్మారపు కిరణ్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై ఉంది. గెలిపించుకునేందుకు ప్రయత్నాలు, స్వయంగా ప్రచారం పలుచోట్ల గట్టిపోటీ ఎదుర్కొంటున్న మద్దతుదారులు -
పీఆర్సీ అమలు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలతో పాటు పీఆర్సీ అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం మండల ప్రధానకార్యదర్శి సారెడ్డి లింగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్, వివిధ మండలల అధ్యక్షులు యాకయ్య, విద్యాసాగర్, నాయకులు గోవర్ధన్, ప్రసాదరావు, మురళి, శ్రీనివాస్ కార్తీక్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు. 11న మార్కెట్కు సెలవు కేసముద్రం: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈనెల 11న కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 12 తేదీన మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంతొర్రూరు: నేషనల్ యూత్ వలంటీర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సోమవారం తెలిపారు. పదో తరగతి అర్హత కలిగిన ఉమ్మడి జిల్లాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ స్వచ్ఛంద సేవకు ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేల ప్రోత్సాహకం అందుతుందన్నారు. ఎంపికై న యువ వలంటీర్లు క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్య, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజలను చైతన్యపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు http://nyks.nic.in/ NationalCorps/nyc.html వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు మహబూబాబాద్ రూరల్ : యువకులు గంజాయి, డ్రగ్స్ వినియోగంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. జాగృతి పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాజగోపాల్ కాలనీలో మంత్రాలు, మూఢనమ్మకాలు, ఆన్లైన్ గేమింగ్, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై సోమవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ.. వృద్ధులైన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. 1930 సైబర్ టోల్ నంబర్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై షేక్ షాకీర్, జిల్లా పోలీసు కళాబృందం సభ్యులు పృథ్వీ రాజ్, సత్యం, తిరుపతి, తారాసింగ్, పోలీసు స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రైల్వే డిపోను మానుకోట లోనే ఏర్పాటు చేయాలినెహ్రూసెంటర్: రైల్వే మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న డిమాండ్చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పార్టీ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మానుకోట వెనుకబాటుకు గురవుతుందని, నాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నేడు రై ల్వే మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. వేలాది మంది నిరుద్యోగులు ఉన్న మానుకోటలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. మె యింటెనెన్స్ డిపో సాధించే వరకు అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు సాగించాలని పిలుపుని చ్చారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి డిపో తరలించకుండా అడ్డుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి రవి, సత్యం, జగత్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. -
రెండు రంగుల్లో బ్యాలెట్..
భూపాలపల్లి అర్బన్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎంలు వినియోగిస్తారు. అయితే త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఒక్కో పంచాయతీలో ఓటరు ఒకటి సర్పంచ్కు, మరొకటి వార్డు సభ్యుడికి.. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో ఉంటాయి. బ్యాలెట్ పత్రాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ చివరిలో నోటాను వినియోగిస్తున్నారు. పైఅభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్ పేపర్లో ఎనిమిది గుర్తులతో పాటు చివరలో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరో బ్యాలెట్ పేపర్ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్ వినియోగిస్తారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సును వరుసగా తెరుస్తారు. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ వార్డు సభ్యులకు తెలుపు.. ఉండని అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పత్రం చివరన నోటా -
ఎంజీఎంలో గందరగోళం!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వానస్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లులు చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా సర్జికల్, మెడికల్ టెండర్స్తో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సేవలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. 20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల్లో రోగులకు ఔషధాలు అందించడం కీలకం. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలను సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలం కావడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పా టు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు. స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా? ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు అందించే విషయంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకమే. ఈ విభాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను సైతం పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు. ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్ ఎంజీఎం ఆస్పత్రిలో మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్స్ అధ్వానస్థితిలో పేషెంట్కేర్ సేవలు పట్టించుకోని పాలనాధికారులు -
హాస్టల్ వసతి కల్పించాలి..
కేయూ క్యాంపస్ : హాస్టల్ వసతి కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం క్యాంపస్లోని పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతి కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికే పలుమార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికై నా వెంటనే వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేసినా పట్టించుకోలేదు. ఉదయం 11.30 నంచి సాయంత్రం 6గంటల వరకు ఆందోళన కొనసాగించారు. మరోసారి రిజిస్ట్రార్ రామచంద్రం.. పలువురి విద్యార్థులను చాంబర్కు పిలించుకుని మాట్లాడారు. వీసీ ప్రతాప్రెడ్డి మంగళవా రం యూనివర్సిటీకి రానున్నారని, ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. సమస్యను వీసీ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఇప్పుడు హాస్టల్ వసతి కల్పిస్తామని స్ప ష్టంగా ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని, లేనిపక్షంలో కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. స్టా లిన్, రంజిత్కుమార్, సందీప్, అరుణ్, రాకేశ్రెడ్డి, శ్రీను, ఆదిత్య, రోహిత్, ప్రదీప్, శివాజీ, యాకూ బ్, దిశా,రణధీర్, శరత్ పాల్గొన్నారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థుల డిమాండ్ పరిపాలన భవనం వద్ద ధర్నా -
బాక్సుల్లో మందుల్లేవు!
తొర్రూరు: ప్రయాణికుల భద్రతే లక్ష్యం, వారి సంఖ్య పెంచడమే ధ్యేయమని చెప్పే ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో మందులు ఉండడం లేదు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ఏ బస్సులో మందులు కనిపించడం లేదు. మహబూబాబాద్, తొర్రూరు డిపోల్లో 175 బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో పేరుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నా వాటిలో మందులు పెట్టడం లేదు. ఖాళీగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో బాక్సులను ఏర్పాటు చేసింది. ప్రమాద వేళల్లో వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నా అందులో మందులు కరువై ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రథమ చికిత్స అందడం లేదు. రవాణా శాఖ అధికారులు బస్సులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాత్రమే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అందులో మందులు ఉంటున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేసే బాక్సులు అలంకార ప్రాయంగా మారాయి. కిట్లో ఇవి ఉండాలి.. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేయాలి. కిట్లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే క్లాత్, గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్ ఉండాలి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్లోని మందులను మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్బాక్సులు ఏర్పాటు చేయడంతో పాటు మందులు ఉండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల్లో క్షతగాత్రులకు అందని ప్రథమ చికిత్స కొత్త బస్సులకే కిట్లు పరిమితం మందులు లేకపోవడంతో తప్పని ఇబ్బందులు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు -
ఇంటర్వర్సిటీ టోర్నమెంట్కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఈనెల 9నుంచి 11 తేదీ వరకు నిర్వహించనున్న సౌత్జోన్ ఇంటర్ వర్సిటీ టేబుల్ టెన్నిస్ మహిళల టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు పాల్గొననున్నట్లు సోమవారం కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో ఎం.శ్వేత, పి.వర్షిత, ఎం.వర్షిత, పి.శ్రావణి, ఎం.నందిని ఉన్నారు. వీరికి కోచ్కమ్ మేనేజర్గా జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ టి.కల్యాణి వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు. -
అవినీతి రహిత సమాజమే లక్ష్యం
వరంగల్ క్రైం/విద్యారణ్యపురి: అవినీతి రహిత సమాజ నిర్మాణమే మన అందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని.. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జూనియర్ కళాశాల నుంచి అశోకా సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ లో విద్యార్థులతో పాటు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, భవి ష్యత్లో అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు, ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్కుమార్, అధ్యాపకులు శ్రీదేవి, జ్యోతిర్మయి, సంధ్యారాణి, రేవతి, సరిత, సువర్ణ, జ్యోతి, సురేశ్బాబు, చిరంజీవి, రఘునందన్, వివేక్, భవాని, సాగర్, వేణు, రాజేశ్, దయాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అవగాహన ర్యాలీ ప్రారంభం -
వరంగల్లో 22.45 శాతం డ్రాపౌట్స్!
● కాకతీయ వర్సిటీ, రెండు కళాశాలల అభివృద్ధికి రూ. 56 కోట్లు.. ● లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ జిల్లాలో సెకండరీ విద్య స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ (బడి మానేయడం) రేటు ఆందోళనకరంగా ఉందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఏకంగా 22.45 శాతం డ్రాపౌట్ రేటు నమోదైనట్లు సోమవారం లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం పలు నిధులను మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీతో పాటు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కలిపి పీఎం ఉషా కింద మొత్తం రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ – క్వాలిటీ ఇంప్రూవ్మెంట్’ కింద కాకతీయ వర్సిటీలో పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రూ. 50 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద కాకతీయ వర్సిటీలో ఒక బాలుర (150 సామర్థ్యం), ఒక బాలికల (300 సామర్థ్యం) హాస్టల్ నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. అంతేగాక జాతీయ విద్యా విధానం2020 అమలులో భాగంగా వరంగల్ జిల్లా నుంచి 16 పాఠశాలలను ‘పీఎం శ్రీ’ పథకం కింద అప్గ్రేడ్ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. -
వాహనాల కొరత..
● అరకొరగా చెత్త సేకరణ ● మరమ్మతులకు గురై మూలన పడిన వాహనాలు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ అరకొరగా సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల మరమ్మతులు, పారిశుద్య సిబ్బంది, డ్రైవర్ల కొరతతో చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో ఇళ్లతో పాటు వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. దీంతో పలు వార్డుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరత.. మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులు ఉండగా.. వార్డుకు ఇద్దరు చొప్పున పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం 18 మంది మాత్రమే ఉండగా వార్డుల వారీగా చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు. ప్రతీరోజు మెయిన్ రోడ్డును శుభ్రపరుస్తూ వార్డులను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాలుగు రోజులకోసారి వీధులను శుభ్రపరిచే సిబ్బంది ప్రస్తుతం పది రోజులకు కూడా వార్డుల ముఖం చూడడం లేదని స్థానికులు చెబుతున్నారు. మూలనపడిన వాహనాలు.. మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం మూడు ట్రాక్టర్లు, మూడు ఆటోలను కొనుగోలు చేశారు. కొంతకాలం నడిచిన వాహనాలు తర్వాత తరచూ మరమ్మతులకు గురయ్యాయి. ప్రస్తుతం ఓ ట్రాక్టర్, ఓ ఆటోతో మాత్రమే చెత్త సేకరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు డ్రైవర్లు ఉండగా వాహనాలు లేక ఖాళీగా ఉండే డ్రైవర్లు చెత్త సేకరణ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికే పరిమితం.. సుమారు నెలరోజల క్రితం చెత్త సేకరణ కోసం రెండు ఆటోలను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ చేతుల మీదుగా ఆటోలను ప్రారంభించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఆయన సమయం కోసం ఎరుదుచూస్తుండడతో ఆటోలు నెల రోజులుగా కార్యాలయానికే పరిమితమయ్యాయి. వాహనాల కొరతతో వీధులు, ఇళ్లలో చెత్త పేరుకుపోతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సేకరణ సక్రమంగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లోని ఒకటి, రెండు ప్లాట్ ఫారాలు, జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఎస్పీ శబరీష్ శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ప్రజల రక్షణ కోసం చేపట్టిన బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకుగాను విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలి తొర్రూరు: సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి మేడిశెట్టి రామకృష్ణ అన్నారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలో సేవా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన క్లబ్ ప్రతినిధులకు పురస్కారాలు ప్రదానం చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కల్వ హరికృష్ణ, చిదిరాల నవీన్కుమార్, గౌరీ శంకర్, వజినపల్లి అనిల్కుమార్, లింగమూర్తి, రామ్మూర్తి, రామా ఉపేందర్, ఇమ్మడి రాంబాబు, బిజ్జాల వెంకటరమణ, రాము, రవి తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దుపెద్దవంగర: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు, గుంపులు, తగాదాలు, ఉద్రిక్తతలకు దారితీస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పుకార్లు, నిర్ధారణలేని వార్తలు ప్రచారం చేయవద్దన్నారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ గణేశ్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, ఏఎస్సై హిదాయాలి, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడారంలో భక్తుల కోలాహలం ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చా రు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. కోళ్లు, యాటలను అమ్మవార్లకు జడతపట్టి మొక్కుగా సమర్పించారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపించారు. -
పైసలిస్తేనే పనులు!
● ప్రైవేట్ స్కూళ్ల రెన్యువల్, కొత్త స్కూళ్ల అనుమతికి భారీగా వసూళ్లు ● తాజాగా ఏసీబీకి చిక్కిన హనుమకొండ ఇన్చార్జ్ డీఈఓ, ఇద్దరు ఉద్యోగులువిద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో అవినీతి భూతం రాజ్య మేలుతోంది. ఏ పనికావాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. అవినీ తి ఆరోపణల నేపథ్యంలో గతంలో డీఈఓలుగా పనిచేసిన పలు వురిని విద్యాశాఖ బదిలీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించింది. ఒకరిద్దరు మాత్రం వారికివారే తప్పుకున్నారు. హనుమకొండ డీఈఓగా పనిచేసిన వాసంతిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను డీఈఓ బాధ్యతల నుంచి తప్పించగా సెలవుపై వెళ్లారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఈఓలు లేక.. విద్యాశాఖ డీలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పింది. రెగ్యులర్ డీఈఓలు లేక డీలా పడింది. ములుగు జిల్లాలో కొంతకాలం క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇన్చార్జ్ డీఈఓగా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లాలో ఏడీ అధికారికే డీఈఓ బాధ్యతలు అప్పగించగా.. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు వేరే జిల్లాకు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లాలో గత డీఈఓను విధులనుంచి తప్పించి అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించినా అదే పరిస్థితి దాపురించింది. డీఈఓ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చివెళ్లేవారు. ఎక్కువ ఫైళ్లను కలెక్టరేట్లోని తన చాంబర్కు సిబ్బంది తీసుకెళ్తే సంతకాలు చేసేవారు. దీంతో డీఈఓ కార్యాలయంలో పర్యవేక్షణ కొరవడింది. పలు సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో టీసీ బుక్స్ ఇస్తే సెక్షన్లో ఉండే సిబ్బంది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వసూలు చేసేవారు. దీంతో ఫిర్యాదు రాగా అక్కడ సెక్షన్లో పనిచేసే ఉద్యోగిని తప్పించి టీసీ బుక్స్ ఇచ్చే బాధ్యతలు అప్పటి డీఈఓ అబ్దుల్హై హయాంలో డీసీఈబీకి అప్పగించారు. అప్పటి నుంచి డబ్బులు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారమే టీసీ బుక్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక టీసీ బుక్స్ మళ్లీ డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్కే అప్పగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. టీసీ బుక్స్కు కూడా డబ్బులు వసులు చేసేందుకే సెక్షన్ సిబ్బంది చక్రం తిప్పి డీఈఓతో ఉత్తర్వులు జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.హనుమకొండ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు డీఈఓ పరిధిలో, 6 నుంచి 10వ తరగతివరకు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో అనుమతులు రెన్యువల్ చేస్తారు. అయితే, హైస్కూళ్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. గతంలో ఒక స్కూల్లో ఒకటి నుంచి 5 తరగతుల వరకు డీఈఓ అనుమతి, రెన్యువల్ చేస్తే సంబంధిత సెక్షన్లో రూ.30 వేల వరకు వసూలు చేశారనేది ఆరోపణలున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డీఈఓ రెన్యువల్, అనుమతి ఇచ్చాక.. 6 నుంచి 10 వతరగతి వరకు అనుమతికి పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీకి కూడా రెకమెండ్ చేయా లి. ఒక కాపీని ఆర్జేడీ కార్యాలయానికి పంపుతారు. గత డీఈఓ హయాంలో కార్యాలయ సెక్షన్లో రూ.60 వేల వరకు వసూలు చేశారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలల అనుమతికి రూ.లక్షకుపైగానే సెక్షన్ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రెన్యువల్ ఫీజుగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేది రూ.5వేలు మాత్రమే. డీఈఓ కార్యాలయ సెక్షన్లో మాతం రూ.60 వేలు ఇవ్వాల్సి రావడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాఠశాలల అనుమతికి ప్రభుత్వానికి చలాన్ రూ పంలో రూ.10 వేలు మాత్రమే చెల్లించాలి. హనుమకొండ కొత్తూరు జెండాలోని క్రియేటివ్ మోడల్ హైస్కూల్ 10 సంవత్సరాల రెన్యువల్కు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రూ.లక్ష డిమాండ్ చేశారు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వీరు అధికారులకు పట్టుబడ్డారు. వీరితోపాటు ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. -
అందని అల్పాహారం
మహబూబాబాద్ అర్బన్: ప్రతీ విద్యార్థికి 10వ తరగతి అనేది చాలా కీలకం. ఇక్కడ సాధించిన ఫలితాల ఆధారంగా భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవచ్చు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందడం లేదు. దీంతో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో అందజేత.. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారంలో ఒక బిస్కెట్ ప్యాకెట్, 50గ్రాముల గుడాలు, శనిగలు, ఉడకబెట్టిన పల్లీలు, కొబ్బరి గుడాలు, అటుకులు వంటి స్నాక్స్ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం పూర్తిగా విస్మరించింది. ఉత్తీర్ణతశాతం పెరిగేలా.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. గత నెల నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.15 గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4.45గంటల నుంచి 5.45గంటల వరకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నారు. మార్చి 18నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని మొత్తం 100 ప్రభుత్వ పాఠశాలల్లో 4,501 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే సాయంత్రం అల్పాహారం లేకపోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం ఖాళీ కడుపుతో.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవారిలో ఎక్కువ శాతం పేద విద్యార్థులే ఉంటారు. చలికాలం కావడంతో ఉదయం ఇళ్లలో ఆహారం తీసుకోకుండానే పాఠశాలలకు వస్తున్నారు. ఇలా చాలామంది విద్యార్థులు ఖాళీ కడుపుతో ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం ఎప్పుడు పెడుతారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే అంతే సంగతులు. సాయంత్రం ఇంటికి వెళ్లేవరకు అకలితో అలమటించాల్సి పరిస్థితి ఉంది. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం అందని స్నాక్స్ 10వ తరగతి విద్యార్థులకు తప్పని పస్తులు అల్పాహారం అమలు చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు -
దళారుల దందా!
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ బయట, పలు దుకాణాలు, మిల్లుల వద్ద కొందరు వ్యాపారులు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. క్యాష్ కటింగ్, తరుగు తీస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిల్లర కొనుగోళ్ల వల్ల కేసముద్రం మార్కెట్ ఆదాయానికి గండి పడుతోంది. ఏటా సీజన్లో చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్కు తీసుకువస్తున్నారు. అయితే ధాన్యం ట్రాక్టర్లను మార్కెట్ బయట ఉన్న ట్రేడింగ్ దుకాణాలు, మిల్లుల వద్ద ఆపి, మార్కెట్కు వెళ్తే పడిగాపులు పడాల్సి వస్తుందని, అదే తామైతే వెంటనే కొనుగోలు చేస్తామని, నగదు చెల్లిస్తామని చెబుతూ ఖరీదు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది రైతులు డబ్బులు అవసరం ఉండడంతో బయట వ్యాపారులను ఆశ్రయిస్తూ వారు నిర్ణయించిన ధరలకే అమ్ముకుని మోసపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే బోనస్ పడడం లేదనే ఆందోళనతో పలువురు రైతులు తమ అవసరాల నిమిత్తం దుకాణాలు, మిల్లులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. దోపిడీ సాగేది ఇలా.. మహముద్పట్నం శివారు తావుర్యాతండా మూలమలుపు వద్ద కొందరు వ్యక్తులు ధాన్యం లోడ్ ట్రాక్టర్లను ఆపి, అక్కడే రేటు నిర్ణయించి, కేసముద్రంలోని సదరు వ్యాపారి దుకాణం, మిల్లుల వద్దకు రైతులను పంపుతున్నారు. తీరా అక్కడి వెళ్తే తేమ సాకును చూపుతూ క్వింటాకు రూ.100 నుంచి రూ.200 చొప్పు ధర తగ్గిస్తున్నారు. అలాగే 30కిలోల తరుగు తీస్తున్నారు. అలాగే వేబ్రిడ్జి కాంటా పెట్టినప్పటికీ కూలీ, హమాలీ పేరిట బస్తాకు(65 కేజీలు) రూ.16నుంచి రూ.20 వరకు కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యాపారి దడవాయిలకు మాత్రం బస్తాకు రూ.3ల చొప్పునే చెల్లించడం గమనార్హం. కాగా, మార్కెట్ బయట ధాన్యం ఖరీదు వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామంటూ మార్కెట్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బయట కొనుగోళ్లు జరపడం వల్ల మార్కెట్కు ఫీజు రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇదిలా ఉండగా కొందరు వ్యాపారులు ట్రాక్టర్ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుని, ధాన్యం లోడ్ తీసుకువస్తే రూ.200చొప్పున డ్రైవర్లకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాలుగా వ్యాపారుల చేతుల్లో రైతులు మోసపోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా మార్కెట్ అధికారులు స్పందించి, రైతులను మోసగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు.. ధాన్యాన్ని ఖరీదు చేసిన రోజు డేట్ వేసిన చెక్కునే రైతులకు ఇవ్వాల్సి ఉండగా, వారం నుంచి 15 రోజుల గడువుతో చెక్కుపై డేట్ వేసి వ్యాపారులు ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరగలేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇది వరకు నగదు చెల్లిస్తే ఒకశాతం క్యాష్ కట్చేసి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు వాయిదా పద్ధతుల్లో చెక్కులు, రశీదులను ఇవ్వడమే కాకుండా, ఒకశాతం క్యాష్ కటింగ్ పెడుతున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ బయట దోపిడీకి గురవుతున్న రైతులు తరుగు పేరిట ట్రాక్టర్కు 30కేజీల కోత క్యాష్ కటింగ్ చేస్తూ వాయిదా పద్ధతిలో చెక్కులు కేసముద్రం మార్కెట్ ఆదాయానికి గండి -
తేలిన లెక్క..
మహబూబాబాద్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియ ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తయ్యింది. కాగా, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆదివారం అధికారులు వెల్లడించారు. 158 సర్పంచ్ స్థానాలకు15 జీపీలు ఏకగ్రీవం కాగా.. 143 సర్పంచ్ స్థానాల్లో 475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, 1,358 వార్డులకు గాను 251ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,107వార్డుల్లో 2858 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 14న పోలింగ్.. ఈనెల 14వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రెండో విడత జీపీ ఎన్నికల దరఖాస్తుల ఉపసంహరణ 15 గ్రామ పంచాయతీలు, 251వార్డులు ఏకగ్రీవం 143 సర్పంచ్ స్థానాల్లో 475 మంది అభ్యర్థులు 1,107 వార్డుల్లో బరిలో 2,858మంది.. ఈనెల 14న పోలింగ్ మండలం జీపీలు ఏకగ్రీవం మిగిలిన బరిలో ఉన్న జీపీలు అభ్యర్థులు బయ్యారం 29 01 28 106 చిన్నగూడూరు 11 02 09 24 దంతాలపల్లి 18 02 16 46 గార్ల 20 02 18 60 నర్సింహులపేట 23 01 22 63 పెద్దవంగర 26 06 20 70 తొర్రూరు 31 01 30 106 మొత్తం 158 15 143 475బరిలో ఉన్న వార్డు అభ్యర్థులు మండలం వార్డులు ఏకగ్రీవం మిగిలిన అభ్యర్థులు వార్డులు బయ్యారం 251 28 223 609 చిన్నగూడూరు 95 30 65 174 దంతాలపల్లి 166 39 127 331 గార్ల 184 43 141 382 నర్సింహులపేట 194 38 156 367 పెద్దవంగర 192 34 158 393 తొర్రూరు 276 39 237 602 మొత్తం 1,358 251 1107 2,858 -
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం చోరీ
మంగపేట: మండలంలోని బోరునర్సాపురంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద కాంటా పెట్టిన 61 బస్తాలను శనివారం రాత్రి దుండగులు ఎత్తికెళ్లినట్లు బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత రైతు తాండ్ర బక్కయ్య కథనం ప్రకారం.. గ్రామంలోని మ్యాక్స్ సెంటర్ నిర్వాహకులకు శనివారం సాయంత్రం కాంటా పెట్టిన 60 బస్తాలను లారీలో లోడింగ్ చేసేందుకు ఆదివారం ఉదయం వచ్చి చూడగా అందులో 40 బస్తాలు కనిపించలేదు. అదే విధంగా సమీపంలోని మరో మ్యాక్స్ సెంటర్ వద్ద మూతి రవి అనే రైతు కాంటా పెట్టిన 21 బస్తాలు కూడా కనిపించలేదు. ఈ ఘటనలపై బాధిత రైతులు సెంటర్ ఇన్చార్జ్ నవీన్రెడ్డితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వారం క్రితం గ్రామానికి చెందిన రైతు చిట్టిపోతుల నర్సయ్యకు చెందిన 11 బస్తాల ధాన్యం చోరీకి గురైనట్లు సమాచారం. రాజుపేటలో మరో రైతుకు చెందిన ధాన్యాన్ని గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు తెలియడంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం.. కొందరు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల వద్ద నిబంధనల మేరకు కనీస ఏర్పాట్లు చేయడం లేదన్నారు. సెంటర్ల వద్ద కాపలాదారులను నియమించక పోవడం, కాంటా పెట్టిన వెంటనే బస్తాలను పంపించకుండా రోజుల తరబడి కాలయాపన చేయడం కారణంగా చోరీలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు బాధిత రైతుల ఫిర్యాదు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఉనికిచర్ల శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ల్యాగ రాజయ్య కుమారుడు యోగేశ్వర్(21), తన స్నేహితుడు నిఖిల్ శనివారం అర్ధరాత్రి బైక్పై ధర్మసాగర్ నుంచి హనుమకొండకు వెళ్తున్నారు. ఈక్ర మంలో ఉనికిచర్ల దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో యోగేశ్వర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నిఖిల్కు గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు శ్రీధర్ రావు తెలిపారు. -
చాలెంజ్ ఓటు అంటే ఏమిటి?
జనగామ: ఓటరు గుర్తింపుపై పోలింగ్ ఏజెంట్కు అనుమానం కలిగితే ఎన్నికల నిబంధనల మేరకు చాలెంజ్ చేయొచ్చు. సంబంధిత వ్యక్తి అసలు ఓటరే కాదని చాలెంజ్ చేస్తూ ప్రిసైడింగ్ అధికారికి రూ.5 రుసుము చెల్లించాలి. వెంటనే ప్రిసైడింగ్ అధికారి విచారణ ప్రారంభిస్తారు. ముందుగా చాలెంజ్ చేసిన ఏజెంట్ నుంచి సాక్ష్యాలు సేకరిస్తారు. సరైన ఆధారాలు లేకపోతే వెంటనే చాలెంజ్ తిరస్కరిస్తారు. ఆధారాలు ఉంటే తాను నిజమైన ఓటరేనని నిరూపించుకునే అవకాశం ఆ వ్యక్తికి ఇస్తారు. అవసరమైతే గ్రామ అధికారి, క్యూలో ఉన్న ఇతర ఓటర్లను కూడా ప్రశ్నిస్తారు. చాలెంజ్ తప్పని తేలితే ఆ వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వడంతోపాటు రూ.5 తిరిగి ఇస్తారు. చాలెంజ్ నిజమని తేలితే సదరు వ్యక్తిని ఓటు వేయనివ్వరు. అనుబంధం–13 ప్రకారం ఫిర్యాదు రాసి పోలీసులకు అప్పగిస్తారు. ఈ సందర్భంలో చాలెంజ్ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. అన్ని వివరాలు ఫారం–21 (అనుబంధం–14)లో రికార్డు చేస్తారు. చాలెంజ్ ఫీజు రశీదు అనుబంధం–15 ప్రకారం జారీ అవుతుంది. ఓటరు గుర్తింపుపై అనుమానం వచ్చినప్పుడు ప్రిసైడింగ్ అధికారి తీసుకునే వేగవంతమైన చర్య. ఇదేం పోలింగ్ను పారదర్శకంగా ఉంచే కీలక ప్రక్రియ.నిష్పక్షపాత ఎన్నికలు ఇలా?జనగామ: స్వేచ్ఛాపరమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ప్రారంభానికి ముందు బ్యాలెట్ బాక్సుల ప్రదర్శన, మార్క్డ్ ఓటరు జాబితా సిద్ధం, ఆకుపచ్చ పేపర్ సీల్పై అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సంతకాల స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. 12వ అనుబంధం భాగం–1 ప్రకటనను పోలింగ్ స్టేషన్లో అందరూ వినేలా గట్టిగా చదవడంతోపాటు సంతకం చేసిన, చేయని ఏజెంట్ల రికార్డును నమోదు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ సమయంలో అదనపు బ్యాలెట్ బాక్సులు అవసరమైతే ప్రతీసారి కొత్త బాక్సును ప్రారంభించే ముందు 12వ అనుబంధం భాగం–2 ప్రకటన చదవాలి. పోలింగ్ ముగిసిన వెంటనే భాగం–3 ప్రకటన నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. అన్ని డిక్లరేషన్లు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్, ప్రిసైడింగ్ అధికారి డైరీతో సహా ప్రత్యేక ప్యాకెట్లో రిటర్నింగ్ అధికారికి పంపాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.అందరి ఇంటిపేరు ఒక్కటే!● సర్పంచ్గా పోటీ చేసే నలుగురూ దగ్గరి బంధువులే గీసుకొండ : గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని హర్జ్యతండాలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. గ్రామ సర్పంచ్ పదవికి నలుగురు పోటీ చేస్తుండగా వారందరి ఇంటిపేర్లు ఒకే విధంగా ఉన్నాయి. ఆంగోతు ప్రశాంత్, ఆంగోతు మహబూబ్నాయక్, ఆంగోతు మాను, ఆంగోతు వీరయ్య.. ఇలా వారంతా దగ్గరి బంధువులే. అన్నదమ్ముల వరస వారే అని తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీలో 374 మంది ఓటర్లే ఉండటం విశేషం. ఈ నెల 14న గ్రామంలో ఎన్నికలు జరుగనున్నాయి. -
మెడికల్ షాపులో చోరీ..
● రూ. 56 వేల నగదు ఆపహరణ ఖిలా వరంగల్: మెడికల్ షాపులో చోరీ జరిగింది. ఈ ఘటన ఉర్సు కరీమాబాద్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉర్సు కరీమాబాద్కు చెందిన బలభధ్ర దినేష్ అదే ఏరియాలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపునకు తాళం వేసి ఇంటికెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున దుండగులు తాళం ధ్వంసం చేసి షాపులోకి చొరబడి క్యాష్ కౌంటర్లోని సుమారు రూ.56 వేల నగదు అపహరించారు. ఉదయం పక్కింటి వారు గమనించి దినేష్కు సమాచారం అందజేయగా ఆయన హుటాహుటిన షాపుకు వెళ్లి చూడగా కౌంటర్లోని నగదు కనిపించలేదు. దీంతో మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాధితుడు దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
విచిత్ర పొత్తులు!
దుగ్గొండి: మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల విత్డ్రాలు ముగిశాయి. సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు వచ్చాయి. ఇక ఎలాగైనా గెలుపొందాలని గ్రామాల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు చిగురించాయి. అడవిరంగాపురం గ్రామంలో ఎంసీపీఐ(యూ)–బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరగా, రేబల్లెలో కాంగ్రెస్–ఎంసీపీఐ(యూ) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీపీఎం నాచినపల్లిలో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోగా.. రేకంపల్లి, తిమ్మంపేట, తొగర్రాయి గ్రామాల్లో బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకుంది. మందపల్లి గ్రామంలో సర్పంచ్గా లింగాల సుమలత కాంగ్రెస్ మద్దతుతో పోటీచేస్తుండగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మారేడుగొండ శ్రీమాలతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడుతున్నారు. సర్పంచ్ బరిలో అన్న, చెల్లి.. బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపు రం సర్పంచ్ పదవికి అన్న, చెల్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్ మద్దతుతో బొర్ర కృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా అతడి చెల్లి పొడుగు సుగుణ పోటీ పడుతున్నారు. ఇరువురు తమ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తుండగా, విజయం అన్నను వరిస్తుందో చెల్లిని వరిస్తుందో ఈ నెల 14న వెల్లడికానుంది. ఉప సర్పంచ్పై రాష్ట్ర నాయకుల గురి ● వార్డు సభ్యులుగా బరిలోకి.. సంగెం: మండలంలోని వంజరపల్లి ఉప సర్పంచ్ పదవిపై రాష్ట్ర నాయకులు గురిపెట్టారు. వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 3 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక్కడ 5 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3వార్డులు కై వసం చేసుకుంటే ఉపసర్పంచ్ ఖాయం. ఉప సర్పంచ్తోనే పాలన కొనసాగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు 5వ వార్డు సభ్యుడిగా, బీఆర్ఎస్ మద్దతుతో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ తన భార్య వసంతను 3వ వార్డు నుంచి పోటీలో నిలిపారు. కాగా, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉప సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
నేటి నుంచి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా సోమవారం నుంచి చర్లపల్లి–నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. డిసెంబర్ 8వ తేదీన చర్లపల్లి–హజ్రత్ నిజాముద్దీన్ (07021) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు సోమవా రం 23.45 గంటలకు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 10వ తేదీన హజ్రత్ నిజాముద్దీన్–చర్లపల్లి (07 022) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు మరుసటి రోజు 04.30 గంటలకు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా జంక్షన్లలో హాల్టింగ్ కల్పించారు. ప్రీమియం రైళ్లకు ఓటీపీ బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్ కాజీపేట రూరల్ : రైల్వే శాఖ ఈనెల 5వ తేదీ నుంచి ప్రీమియం రైళ్లకు ఓటీపీ బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్ టికెట్ సిస్టమ్ను అమలు చేస్తోందని రైల్వే అధి కారులు ఆదివారం తెలిపారు. కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు, బెంగళూరు–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్, హజ్రత్ నిజాముద్దీన్–సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–నాగ్పూర్, నాగ్పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్కు వన్–టైం పాస్వర్డ్ (ఓటీపీ )బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్ టికెట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రీమియం రైళ్లకు తత్కాల్ రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సమయంలో సెల్ నంబర్నుకు వచ్చే ఓటీపీని చెప్పితేనే టికెట్ జారీ చేయనున్నట్లు అధి కారులు తెలిపారు. -
జీపీలకు నిధులు ఇలా..!
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఆ నిధులు ఎలా వస్తాయి? ఎవరు ఇస్తారు? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పంచాయతీలకు ఆదాయ వివరాలు. పంచాయతీలకు మూడు రకాల ఆదాయం లభిస్తుంది. మొదటిది పంచాయతీలు సొంతంగా వనరులు సమకూర్చుకుంటాయి. రెండోది కేంద్రం, మూడోది రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేస్తాయి. సొంత వనరులు.. పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించొచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలన.. రోడ్లు, డ్రైయినేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ.. సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఈ –గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించొచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీతనం పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు స్టాంప్ డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూములు కొనుగోలు, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే స్టాంప్ డ్యూటీలో కొంత వాటా అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ, ఖర్చుల కోసం ప్రభుత్వ సాధారణ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీలు అమలుకు ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. పంచాయతీలకు మూడు రకాల ఆదాయం సొంత వనరులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ఆ నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన ఈ –గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు -
క్యాష్ ఇవ్వకుండానే కటింగ్ పెట్టాడు..
ఎకరం భూమిలో వరి పంట సాగు చేయగా, 20.55 క్వింటాళ్ల ధాన్యం చేతికి వచ్చింది. అమ్ముకుందామని వెళ్తుండగా ఓ వ్యాపారి ట్రాక్టర్ను ఆపి, వడ్లను తనకు అమ్మితే నగదు డబ్బులు ఇస్తానన్నాడు. క్వింటాకు రూ.2,370 రేటు పెట్టిండు. తర్వాత వేబ్రిడ్జిపై ట్రాక్టర్ లోడ్ను తూకం వేయించారు. తీరా తనకు నగదు డబ్బులు ఇవ్వకుండా, ఒకశాతం క్యాష్ కటింగ్ చేస్తున్నట్లు(రూ.479) రాసి, వారం తర్వాత వస్తే డబ్బులు ఇస్తానన్నాడు. నగదు ఇవ్వకుండా క్యాష్ కటింగ్ ఎలా పెడతారని అడిగితే, తాము అలాగే ఇస్తామంటూ వ్యాపారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పై నుంచి తరుగు పేరుతో 30 కిలోల ధాన్యం కటింగ్ చేసి, కూలి పేరిట రూ.578 కట్ చేసి రిసిఫ్ట్ ఇచ్చాడు. ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకురాలేక నష్టానికే అమ్ముకున్నా. –ఆరిద్రపు శ్రీనివాస్, రైతు, అమీనాపురం -
కేయూలో నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలు
కేయూ క్యాంపస్: పరిశోధన, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు కాతీయ యూనివర్సిటీలో ఈనెల 9, 10 తేదీల్లో నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ విభాగం బాధ్యులు ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 326 మంది రిజిస్ట్రేషన్.. నోబుల్ ప్రైజ్డే ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 9న వివిధ విభాగాల విద్యార్థులకు పోస్టర్ ప్రజంటేషన్స్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనేందుకు ఆదివారం రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. లైఫ్ సైన్సెస్లో బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల నుంచి 165 మంది విద్యార్థులు, ఫార్మసీ కాలేజీ నుంచి 45 మంది, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్ విభాగాల నుంచి 61 మంది, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల నుంచి 41 మంది మొత్తం 326 మంది నమోదు చేసుకున్నారు. పలు అంశాల్లో పోటీలు.. ఈనెల 9న పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు ఉంటాయి. కెమిస్ట్రీ విద్యార్థులకు శాస్త్రం, సమాజాన్ని మార్చిన నోబెల్ కెమిస్ట్రీ ఆవిష్కరణలు అనే అంశం, ఫిజిక్స్ విద్యార్థులకు నోబెల్ భౌతిక ఆవిష్కరణలు ఆధునిక ప్రపంచాన్ని ఎలా ఆవిష్కరించాయి అనే అంశంపై, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ విద్యార్థులకు నోబెల్ ఆవిష్కరణలు మానవ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయి అనే అంశం, ఎకనామి క్స్ విద్యార్థులకు నోబెల్ ఆర్థికశాస్త్ర విజేతలు సమాజాన్ని ఎలా మార్చారు అనే అంశం, ఇంగ్లిష్ విభాగం విద్యార్థులకు సాహిత్యంలో నోబెల్ విజేతలు ప్రపంచాన్ని మార్చిన స్వరాలు అనే అంశాలపై పోస్టర్ల ప్రజంటేషన్లు, వక్తృత్వ పోటీలు ఉంటాయి. పలు అంశాలపై సెమినార్లు.. నిర్దేశించిన విభాగాల్లో నోబెల్ బహుమతి లభించిన పరిశోధన అంశంపై ఈనెల 10న విషయ నిపుణులతో సెమినార్లు ఉంటాయి. ఆర్థికశాస్త్రంలో శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ మహ్మద్ఇక్బాల్, ఫిజిక్స్లో బిట్స్ ఫిలానీ నుంచి ప్రొఫెసర్ తనైనాగ్, లైఫ్ సైన్సెస్ విభాగాలకు వైద్యులు వలపుదాసు చంద్రశేఖర్, కెమిస్ట్రీ విభాగంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్, ఆంగ్లంలో వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా విశ్వనాథన్ ఈ సంవత్సరం నోబెల్ బహుమతులు పొందిన అంశాలపై ప్రసంగించనున్నారు. 9, 10 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు -
ఆటోలో వచ్చి.. అందినకాడికి ఎత్తుకెళ్లి..
మరిపెడ రూరల్: ఆటోలో వచ్చిన దుండగులు పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం, ఎల్లంపేట గ్రామాల్లో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. రాంపురం గ్రామానికి చెందిన బోర గంగమ్మ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె భర్త ముత్తయ్య ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. ఈ క్ర మంలో ఓ మహిళతోపాటు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని టిఫిన్ బాక్స్లో దాచిన సుమారు రూ.4.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు గంగమ్మ బోరున విలపించింది. అదేవిధంగా ఎల్లంపేట శివారులో ఉంటున్న అలువాల వెంకన్న డయాలసిస్ కోసం ఇంటికి తాళం వేసి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు దోచుకెళ్లారు. ఈ రెండు గ్రామాల్లోని ఇళ్లల్లో చోరీ చేసింది ఒకే ఆటోలో వచ్చిన వారు ఒకరేనా..లేక వేరే వారా ఆయా గ్రామాస్తులు చర్చించుకుంటున్నారు. ఈ చోరీలపై మరిపెడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. పలు గ్రామాల్లో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన దుండగులు -
పల్లెను మాట్లాడుతున్నా!
తొర్రూరు: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక చతికిలబడిన పల్లెను నేను. ఇప్పటి వరకు పాలనను నడిపించిన పంచాయతీ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. అవసరాల మేరకు నిధులు మంజూరు కాక, చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఇప్పటివరకు ఎలాగోలా కార్యదర్శులు పరిపాలన చేసినా..ప్రజా ప్రతినిధులను తమ సమస్యలపై నిలదీసినట్లుగా ప్రజలు వారిని నిలదీయలేరు. ● అధికారుల కన్నా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటారు. తమను ప్రజలు నిలదీస్తారనే ఆలోచనతోనైనా సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలోపే పని చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులైతే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలిసి తమ సమస్యలను వివరించి ప్రత్యేకంగా నిధులు రాబట్టే వీలుంటుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ నిధులతో పాటు దాతలను సంప్రదించి ప్రాథమిక విద్యావసరాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ● ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం జరిగినా వార్డు సభ్యుడు, సర్పంచ్ వరకు తమ పలుకుబడిని ఉపయోగించి కనీస అవసరాలు తాగునీరు, వీధిదీపాలు, మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టగలరు. రైతుల పంట ఉత్పత్తుల క్రయ,విక్రయాల్లో సమస్యలు రాకుండా ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతారు. వృద్ధులు తమ ఆరోగ్య సమస్యల నుంచి, పింఛన్ల పంపిణీలో తలెత్తే సమస్యల వరకు ప్రజాప్రతినిధులపై నమ్మకంతోనే వారిని సంప్రదిస్తుంటారు. ● పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు మార్గం సుగమం అయినందుకు సంతోషంగా ఉంది. కొత్తగా వచ్చే పాలకవర్గాలు తమను ఎ న్నుకున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకు ని, నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపి, క నీస వసతులు కల్పించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా. -
కేంద్ర ప్రభుత్వం నుంచి..
ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి గ్రాంట్లు బదిలీ చేస్తుంది. ఇవి పారిశుద్ధ్య, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వా రా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. -
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
మూడు రోజుల ముందే ‘అడ్వాన్స్’ పేమెంట్స్..ఎన్నికల బరిలో మూడో తరం..హసన్పర్తి: హసన్పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవికి ఆఫర్ ఇచ్చారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడుపు ఉండడంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా అవకాశం ఇస్తే రూ.50 లక్షలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ప్రకటించారు. దీనిపై గ్రామ రచ్చబండ వద్ద సమావేశం జరగగా పోటీలో ఉన్న పల్లె దయాకర్ (అధికార పార్టీ అభ్యర్థి), కొంగటి మొగిలి, బొజ్జ అశోక్, పిట్టల రాజు అక్కడికి చేరుకున్నారు. న్యాయవాది ఆఫర్ ప్రకటించడంతో ఎక్కువ వేలం పాడిన వారికే ఏకగ్రీవం చేస్తామని స్థానికులు చెప్పారు. ముందుకు ఎవరు రాకపోవడంతో తాళ్ల వెంకటేశ్ వైపు స్థానికులు మొగ్గు చూపారు. ఇందుకు నామినేషన్ వేసిన వారు కూడా అంగీకరించారు. దీంతో వెంకటేశ్ ఒప్పంద పత్రాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం డబ్బులు అందుబాటులో లేవని, దీనికి బదులు గ్రామంలో ఉన్న ఎకరం భూమిని పంచాయతీ కార్యాలయం పేర రాశారు. దీంతో పాటు పది ఖాళీ బ్యాంకు చెక్కులు సిద్ధం చేశారు. బరిలో ఉన్న వారందరినీ నామినేషన్ కేంద్రం(అన్నాసాగరం)కు రావాలని సూచించారు. దీంతో వెంకటేశ్, అనుచరులు నామినేషన్ పత్రంతో కేంద్రానికి చేరుకున్నారు. మిగతా మరో ముగ్గురు అక్కడకికి చేరుకుని ఉపసంహరణపత్రంపై సంతకాలు చేశారు. అయితే దయాకర్ మాత్రం నామినేషన్ కేంద్రానికి చేరుకోలేదు. నామినేషనల ఉపసంహరణ ఘట్టం ముగిసే వరకు కూడా పల్లె దయాకర్ అక్కడికి రాలేదు. దీంతో జయగిరిలో పోటీ అనివార్యమైంది.లింగాలఘణపురం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు ముందస్తుగానే ఓటు కోసం అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు సమాచారం. మండలంలోని 21 పంచాయతీల్లో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రమవుతోంది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజల ముందే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. మండలంలోని ఓ జనరల్ స్థానంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ముందుగానే డబ్బులు పంచడంతో విధిలేని పరిస్థితుల్లో మిగతావారు కూడా ఎన్నికలకు మూడు రోజుల ముందే ముట్టజెప్పుతున్నారు. ప్రత్యర్థి ఎంత ఇస్తే అంతకంటే తగ్గేదేలే అన్నట్లు పోటీపడి డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదంటూ ఓటర్లే చర్చించుకుంటున్నారు.ఓటంటే.. అచ్చంగా నీ వ్యక్తిత్వమే. నిన్ను పట్టి చూపే ప్రతిబింబమే. అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు ఏ పాటి వాడో.. అన్నట్టుగా ఐదేళ్ల పాటు పల్లె గుండైపె ఎగిరే సమున్నత నీతి పతాకం. ఓటరంటే.. గ్రామాభివృద్ధికి జీవకర్ర. తెల్లటి మనసున్న వాళ్లు ఎన్నికలంటే మన దారులను మనం నిర్మించుకోవడమే. ఓటరంటే.. నోటుకు ఓటు అమ్మని వాళ్లు తాయిలాలకు సొంగ కార్చని వాళ్లు, చుక్కకో, ముక్కకో ఓటును ముక్కలు ముక్కలు చేయనివాళ్లు. ప్రజాసామ్యం ఫరిడవిల్లాంటే ఓటు పవిత్రతకు మనం కవచమై నిలబడాలి. ఓటరూ జర జాగ్రత్త! ఓటు నీ పల్లె భవిష్యత్ డాక్టర్ పోరెడ్డి ఏటూరునాగారం: ప్రస్తుత ఎన్నికల్లో ఏటూరునాగారం సర్పంచ్గా రెండు పర్యాయాలు విధులు నిర్వర్తించిన కుటుంబంలోని మూడో తరానికి చెందిన కాకులమర్రి శ్రీలతకు పోటీ చేసే అవకాశం వచ్చింది. ఏటూరునాగారం జీపీగా ఏర్పడిన సమయంలో తొలి సర్పంచ్గా కాకులమర్రి గోపాలరావు ఎన్నికయ్యారు. అనంతరం రెండోసారి గోపాలరావు కుమారుడు చక్రధర్రావు 1981లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. వారి ఇరువురి హయాంలో ఏటూరునాగారం అభివృద్ధి సాధించింది. చక్రధర్రావు కోడలు కాకులమర్రి శ్రీలత ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పూర్వీకుల చేసిన పాలన, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఎన్నిల్లో బలమైన అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం. ఓటు.. అమ్మితే చేటు గ్రామ ఓటరు లా రా.. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలో భాలకు గురవకుండా నిజాయి తీ, అభివృద్ధి పట్ల నిబద్ధత గల వ్య క్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలని ఓ యువజన కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్న యువకుడు. –సాక్షి ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్–న్యూశాయంపేట జయగిరి గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని అంగీకారం నామినేషన్ ఉపసంహరణకు అభ్యర్థుల ఒప్పందం చివరి క్షణంలో చెయ్యి ‘ఇచ్చిన’ దయాకర్ పోటీ అనివార్యం -
ఎలా ‘గుర్తు’ంటుంది
● అభ్యర్థి పేరు లేకుండా బ్యాలెట్ పేపర్ ● దగ్గరి పోలికతో అభ్యర్థుల్లో గుబులుజనగామ: పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేర్లు లేకుండా కేవలం గుర్తులతోనే ఓటింగ్.. కానీ ఆ గుర్తులే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులకు గుబులు కల్పిస్తున్నాయి. గుర్తులు దగ్గర పోలికతో ఉండడంతో వృద్ధులు, నిరక్షరాస్య ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేని పరిస్థితి. జనగామ జిల్లాలో స్టేషన్ఘన్పూర్లో ప్రచారం షురూ కాగా, జనగామ ని యోజకవర్గంలో శనివారం సాయంత్రం నుంచి అభ్యర్థులు ఇంటింటికీ పరుగులు పెట్టారు. దగ్గరి పోలికతో.. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కొన్ని ఒకే రకంగా కనిపిస్తుండడంతో వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటు వేసే సమయంలో తికమకకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. సర్పచ్లకు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడి పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్(పాన), చెత్త డబ్బా, నల్ల బోర్డు, బకెట్, మంచం, పలక, టేబుల్, బ్రష్, బిస్కెట్, గాలిబుడగ ఇలా 30 రకాల గుర్తులు కేటాయించారు. వార్డులకు గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, బీరువా, ఐస్ క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బాతో పాటు 20 గుర్తులు ఇచ్చారు. మొదటి విడత స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కేటాయించారు. బ్యాలెట్ పేపర్పై ఓటు వేసే సమయంలో గుర్తు మరచిపోకుండా అభ్యర్థులు ఓటర్లకు ఒకటికి రెండు సార్లు అర్థం చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థికి టేబుల్ అనుకుని పలక, బిస్కెట్, మంచం, నల్లబోర్డుకు వేస్తే.. అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదని గ్రామాల్లో చర్చ వినిపిస్తోంది. బ్యాటరీ లైట్–బ్రష్కు దగ్గరి పోలిక ఉంది. అలాగే, చేతి కర్ర, బ్యాట్, వేణువు గుర్తులకు సైతం సూక్ష్మంగా పరిశీలించక ఓటు వేస్తే తారు మారయ్యే పరిస్థితి ఉందని ఆయా గ్రామాల్లో చర్చ సాగుతోంది. చెత్తడబ్బా, బకెట్, గాలిబుడగ, బాల్.. ఇలా గుర్తుల్లో చాలా వరకు పోలిక ఉండడం అభ్యర్థులకు ఒకింత టెన్షన్ అని చెప్పుకోవచ్చు. వార్డుల విషయానికి వస్తే గ్యాస్ స్టౌవ్, స్టూల్, గరాటా, గాజు గ్లాస్, బీరువా, పోస్టు డాబ్బా గుర్తులకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అసలే అభ్యర్థుల పేరు లేకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు అయోమయానికి గురవుతారేమోనని భావిస్తున్నారు. దీంతో అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ పేపర్ను చూపిస్తూ గుర్తుపై ఒకటికి, రెండు సార్లు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ పోరులో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ పార్టీ పేరు చెప్పుకుని ప్రచారం చేస్తుండడం, బ్యాలెట్పై పార్టీ గుర్తు కాకుండా ఎలక్షన్ కమిషన్ కేటాయించిన సింబల్ ఉండడంతో అభ్యర్థులకు సవాల్గా మారుతోంది. గుబులు పుట్టిస్తున్న గుర్తులు ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో చూడడానికి దగ్గరి పోలికలు ఉండగా, ఫలానా గుర్తు అని చెబితే గానీ ఓటర్లు అర్థం చేసుకోలేని మరికొన్ని ఉన్నాయి. రెండు గుర్తులు కాస్తా తేడాగా ఉన్నప్పటికీ, కంటి చూపు సరిగా లేని వృద్ధులకు ఇవి ఒకేలా కనిపించే అవకాశం ఉంది. దీంతో ఒకరికి పడే ఓటు మరో అభ్యర్థికి పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. చిన్న పంచాయతీల్లో పోటీ నువ్వా? నేనా అనే స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ‘గుర్తు’లు గుబులు పుట్టిస్తున్నాయి. -
బౌండ్డౌన్ అంటే తెలుసా?
పాలకుర్తి టౌన్: ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు అతి ముఖ్యం. ఆ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని భావించినప్పుడు పోలీసులు ఎ ఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా.. వారిని త హసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చే స్తుంటారు. బైండోవర్ సమయంలో సదరు వ్య క్తి ఇచ్చిన రాతపూర్వక హామీని అతిక్రమించడ మే బౌండ్డౌన్. పోలీసులు ఎన్నికలు, పండుగలు తదితర ఉత్సవాల సమయాల్లో బౌండ్డౌన్ వరకు వెళ్లడం అరుదుగా కనిపిస్తుంది. తహసీ ల్దార్కు పాలన అధికారాలతోపాటు ఎగ్జి క్యూటి వ్ మేజిస్ట్రేట్గా కొన్ని న్యాయపర అధికారాలు ఉన్నాయి. అందుకే బైండోవర్ ప్రక్రియలో తహసీల్దార్ పాత్ర కీలకం.రసవత్తర పోరు.. ● తోటి కోడళ్లు, వారి కోడలు మధ్యే సర్పంచ్ పదవికి పోటీ వాజేడు: సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్లు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి తో వారి కోడలు కూడా పోటీకి దిగడం పోరు రసవత్తరంగా మారింది. మండలంలోని పేరూరు సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్లు గొడ్డె సరోజని, గొడ్డె వరలక్ష్మి నామినేషన్ వేయగా వారి కోడలు గొడ్డె కృష్ణవేణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. గొడ్డె సరోజన, గొడ్డె వరలక్ష్మి సొంత తోటి కోడళ్లు కాగా వరలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో, సరోజని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి కోడలు గొడ్డె కృష్ణ వేణి స్వతంత్ర అభ్యర్థినిగా శుక్రవారం నామినేషన్ వేయడం కొస మెరుపు. ఒకే ఇంటి పేరు ఉన్న ముగ్గురి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎవరెవరు పోటీలో ఉంటారో వేచి ఉండాల్సిందే. -
‘నోటా’ సంగతేంటి
‘నోటా’ గుర్తు ఎవరిని ముంచుతుందో వేచి చూడాలి. అభ్యర్థులకు ఓటు వేయొద్దని భావించే ఓటర్లు నోటాను ఎంచుకోవచ్చు. అభ్యర్థుల ప్రచారంలో నోటాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘అన్నా ఓటు మాత్రం చిత్తు చేయకు.. బ్యాలెట్ పత్రంలో చివర ఉన్న నోటాకు మాత్రం వేయకు’ అంటూ వేడుకుంటున్నారు. అసలే అంతుపట్టని గుర్తులతో ఓ పక్క ఆందోళనకు గురవుతుంటే, నోటాతో తంటాలు తప్పవనే భావనలో ఉన్నారు. ముద్ర వేసి మద్దతు తెలపాల్సిన ఎన్నికల్లో ‘స్టాంప్’ కొంచె అటు ఇటూ అయినా చెల్లకుండా పోతుంది. గతంలో మన గుర్తు పై మధ్య, చివరన అని చెబుతూ ఓటు వేయాలని ప్రచారం చేసే వారు. ఇప్పుడు కొత్తగా చివరన నోటా రావడంతో చివరి గుర్తులు వచ్చిన అ భ్యర్థులు ఏమని చెప్పుకోవాలో తెలియక, కింద నుంచి రెండోదంటూ పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు. -
దైవదర్శనానికి వెళ్లి విద్యార్థి గల్లంతు
మహబూబాబాద్ రూరల్ : దై వదర్శనానికి వెళ్లి విద్యార్థి గ ల్లంతైన సంఘటన మహబూ బాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతాద్రి మైసమ్మ చెరువులో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ సర్వయ్య కథ నం ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొల్ల గుంటి తండాకు చెందిన భూక్య శంకర్, అరుణ దంపతులకు కుమార్తె సాయిప్రియ, కుమారుడు సాయికిరణ్ (17) ఉన్నారు. కాగా శంకర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మెకానిక్ విధులు నిర్వహిస్తుండగా సమీప ప్రాంతంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కుమారుడు సాయికిరణ్ కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీఎస్ఈ డిప్లొమా ఫస్టియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటున్న మిత్రుల వద్దకు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం మొదటి సంవత్సరం చివరి పరీక్ష 2గంటలకు ఉండటంతో మరో ఏడుగురు విద్యార్థులతో కలిసి దైవదర్శనం కోసం అనంతాద్రి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. విద్యార్థుల్లో కొంతమంది స్నానం చేసేందుకు అక్కడే ఉన్న మైసమ్మ చెరువులోకి దిగగా ఈతరాని వారు చెరువులోకి వెళ్లలేదు. ఈత కొడుతూ సాయికిరణ్ మొదటగా కొన్ని తామరపూలు కోసి తీసుకుని ఒడ్డుకు చేరుకుని మళ్లీ చెరువులోకి దిగాడు. రెండోసారి తామర పూల కోసం మళ్లీ వెళ్లగా ఊపిరి ఆడకపోవడంతో ఓ విద్యార్థి వాటర్ బాటిల్ తీసుకువెళ్లి నీరు తాగించి కొద్దిదూరం అతడిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత సదరు విద్యార్థి సాయికిరణ్ను బయటకు తీసుకురావడం వీలు కాకపోవడంతో ఒక్కడే ఒడ్డుకు వచ్చాడు. అంతలోనే సాయికిరణ్ గల్లంతై ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సైలు దీపిక, రవికిరణ్, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. సాయికిరణ్ గల్లంతు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘటనాస్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు. కాగా, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతాద్రి మైసమ్మ చెరువులో ఘటన -
సనాతన ధర్మరక్షణకు కృషి చేయాలి
● త్రిదండి రామానుజ చినజీయర్స్వామి హన్మకొండ కల్చరల్ : హిందూ సంస్కృతి,సంప్రదాయాలు, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని త్రిదండి చినజీయర్స్వామి ఉద్భోదించారు. శనివారం హనుమకొండలో చినజీయర్స్వామిని తెలంగాణ అర్చక, ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి పూలమాల, పండ్లు, తాంబూలం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చినజీయర్స్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి, వేదాలకు దేవాలయాలే నిలయమని, ఆగమానుసారం పూజలు జరిగేలా చూడాలన్నారు. నిత్య కై ంకర్యాల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగాలన్నారు. హోంగార్డుల సేవలు ప్రశంసనీయం ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : శాంతిభద్రతల రక్షణలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వరంగల్ సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పరేడ్ ఆహ్వానితులతో పాటు పోలీసు అధికారులను ఆకట్టుకుంది. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ చూపిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. క్రీడల్లో రాణించిన హోంగార్డులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతోందని తెలిపారు. ఇందులో భాగంగా అత్యధిక గౌరవ వేతనం అందించడంతోపాటు, ట్రాఫిక్ పోలీసులతో సమానంగా ఆ విభాగంలో విధులు నిర్వహించే హోంగార్డులకు 30శాతం అదనపు వేతనం, పరేడ్ అలవెన్స్ రూ.200కు పెంచిందన్నారు. హోంగార్డులకు ఉచిత వైద్య సదుపాయం కల్పనకోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్స్సైలు, సిబ్బంది, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఆగిపోయిన సన్నాయి స్వరం ..
● రోడ్డు ప్రమాదంలో కళాకారుడి దుర్మరణం పాలకుర్తి టౌన్ : సన్నాయి స్వరం ఆగిపోయింది.. రోడ్డు ప్రమాదంలో ఓ యువ సన్నాయి కళాకారుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శ నివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావి లాలలో జరిగింది. ఎస్సై పవన్కుమార్ కథనం ప్ర కారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామాంజపురానికి చెందిన ఆవుదొడ్డి సంగయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు మధు(21)సన్నాయి కళాకారుడు. వృత్తిలో భాగంగా రామాంజపురం నుంచి సహ కళాకారులతో కలి సి బైక్పై పాలకుర్తికి వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని వావిలాల సమీపంలో ఆగి ఉన్న టాటా ఏస్ను ఢీకొనడంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘట నాస్థలికి చేరుకుని మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. కాగా, మధు మృతిపై బంధువులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. -
పోలీస్ శాఖకు హోంగార్డులు అదనపు బలం
మహబూబాబాద్ రూరల్ : పోలీస్ శాఖకు హోంగార్డులు అదనపు బలం అని.. ప్రజల రక్షణ, అంతర్గత భద్రతలో పోలీసు శాఖకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో 1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ఏర్పాటైనదే హోంగార్డ్ వ్యవస్థ అని ఎస్పీ శబరీశ్ అన్నారు. 63వ హోంగార్డ్స్ రైసింగ్ డే ను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో రైసింగ్ పరేడ్ శనివారం నిర్వహించగా హోంగార్డ్స్ నుంచి ఎస్పీ శబరీశ్ గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో హోంగార్డుల సేవలు మరువలేనివన్నారు. హోంగార్డులు కూడా పోలీస్ వ్యవస్థలో భాగమని, వారి సంక్షేమానికి పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. పోలీసు కానిస్టేబుళ్లకు ఏమాత్రం తీసిపోకుండా, హోంగార్డులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ సిబ్బందికి రివార్డులు, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు, క్రీడల్లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీఎస్పీ గండ్రతి మోహన్, టౌన్ డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, అర్ఐలు భాస్కర్, సోములు అనిల్, నాగేశ్వర్ రావు, ఆర్ఎస్సై శేఖర్, హోంగార్డు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జన్ను జంపయ్య పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి గార్ల: విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. శనివారం గార్ల నిర్మలా హైస్కూల్లో రాష్ట్రస్థాయి అండర్–19 బాస్కెట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తొలుత నిర్మలా హైస్కూల్ విద్యార్థులు ఎస్పీకి మార్చ్ఫాస్ట్ తో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. ప్రణాళికతో చదివితే లక్ష్యం సాధించవచ్చని సూచించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన బాలురు, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న, ప్రిన్సిపాల్ సిస్టర్ జిన్సీ, క్రీడల జిల్లా జోనల్ సెక్రటరీ గూగులోత్ శ్రీను, సత్యనారాయణ, పీడీలు పద్మ, శేఖర్, హరి, పవన్, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీశ్ ఘనంగా హోంగార్డ్స్ రైసింగ్ డే వేడుకలు -
సిలిండర్ కావాలంటే.. ఓటీపీ చెప్పాల్సిందే..
మహబూబాబాద్: గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఓటీపీ తప్పనిసరైంది. ఓటీపీ లేకుంటే సిలిండర్ ఇవ్వడం లేదు. దీంతో మొబైల్ నంబర్, అడ్రస్లు, ఇతరత్ర సమాచారం అప్డేట్తోపాటు కేవైసీ చేసుకునేందుకు వినియోగదారులు పరుగులుపెడుతున్నారు. ఓటీపీతోపాటు ఇన్సూరెన్స్, సబ్సిడీ విషయంలో కూడా కేవైసీ తప్పనిసరి అనే నిబంధన విధించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో 2,11,531 కనెక్షన్లు.. జిల్లాలో హిందూస్తాన్, పెట్రోలియం కార్పొరేషన్, లిమిటెడ్ కంపెనీ, ఇండెన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కంపెనీకి చెందిన కనెక్షన్లు మొత్తం 2,11,531 ఉన్నాయి. హెచ్పీ గ్యాస్ సిలెండర్ ధర రూ.924 ఉండగా డెలివరీ పేరుతో అదనంగా రూ.16తో మొత్తం రూ.940 తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.47.38 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.326.62 రావాల్సి ఉంది. కానీ, ప్రతిసారి రావడంలేదని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. గతంలో ఓటీపీ లేకుండానే.. ఓటీపీ తప్పనిసరి కావడంతో వినియోగదారులు సెల్ నంబర్ అప్డేట్ చేసుకుంటున్నారు. సెల్ నంబర్ మార్చిన వారు, ఇతర సమస్యలు ఉన్నవారు కార్యాలయాలకు వెళ్లి మార్చుకుంటున్నారు. అడ్రస్ మారినవారు కూడా ఇంటి నంబర్, అడ్రస్ అప్డేట్ చేసుకుంటున్నారు. కాగా, గత నెల వరకు ఓటీపీ లేకుండా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఏజెన్సీలు ప్రస్తుతం ఓటీపీ తప్పనిసరి చేశాయి. కేవైసీ సైతం.. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలతోపాటు డెలివరీ వర్కర్లు కూడా కేవైసీ చేస్తున్నారు. కేవైసీ(నో యువర్ కస్టమర్) కోసం ఆధార్ నంబర్, గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇస్తే వెంటనే కేవైసీ చేస్తున్నారు. ఆధార్ కూడా అప్డేట్ చేసుకుంటున్నారు. ఇతర ఏ సమస్య ఉన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ సబ్సిడీ, ఇన్సూరెన్స్కు కూడా కేవైసీ తప్పనిసరి అయింది. కనెక్షన్ తీసుకున్నప్పుడే కంపెనీ ఇన్సూరెన్స్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడే సదరు కంపెనీ వినియోగదారులపై ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కేవైసీ, సెల్ నంబర్ అప్డేట్ అడ్రస్లు అప్డేట్ ఉండాలి. అవి సరిగా లేకుంటే ఇన్సూరెన్స్ రాదని అధికారులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ విషయంలో ఐఎస్ఐ స్టౌవ్ సురక్షా పైపు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వాడాలనే నిబంధనలు ఉన్నాయి. కనెక్సన్ తీసుకున్నప్పుడు ఒక అడ్రస్ ఉండి ప్రమాదం జరిగినప్పుడు వేరే అడ్రస్లో ఉంటే వర్తించదు. కావున వినియోగదారులు అడ్రస్ మారితే అప్డేట్ చేసుకోవాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సబ్సిడీలో గందరగోళం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. కొంతమందికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ వస్తుంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఓటీపీ ఉంటేనే సిలిండర్వినియోగదారులు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఓటీపీ ఉండాల్సిందే. అందుకోసం మొబైల్ నంబర్ అప్డేట్, కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అడ్రస్ మార్పులు ఉంటే కూడా మార్చుకోవాలి. – బోనగిరి ప్రసాద్, హెచ్పీ గ్యాస్ డీలర్ కార్యాలయం మేనేజర్గ్యాస్ కార్యాలయాల్లో వినియోగదారుల రద్దీ కేవైసీ, మొబైల్ నంబర్ అప్గ్రేడ్ కోసం క్యూ అందరికీ అందని సబ్సిడీ కేవైసీ అప్డేట్ చేయించుకుంటున్న మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్(ఫైల్) -
ఎన్నికల బరిలో ఇరిగేషన్ ఈఈ సతీమణి
మరిపెడ రూరల్: మండలంలోని మూలమర్రితండా గ్రామ పంచాయతీకి చెందిన ఇరిగేషన్ ఈఈ భూక్య రాములునాయక్ సతీమణి జానకి అదేతండా జీపీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యోగ రీత్యా కొంతకాలంగా పట్టణ ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ సొంత ఊరికి మంచి చేయాలన్న సంకల్పంతో ఇటీవల కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాంగ్రెస్లోకి.. బయ్యారం: మండలంలోని కొత్తపేట సర్పంచ్ స్థానానికి బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా గుగులోత్ శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో కొత్తపేట పంచాయతీలో బీజేపీ తరఫున బలపర్చిన అభ్యర్థి పోటీ లేకుండాపోగా కాంగ్రెస్లో హర్షం వ్యక్తం అవుతుంది. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్రంటిషిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్. మదార్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ కోర్సులు, పదో తరగతి పాస్ మెమోలు, కులం, ఆదాయం, నివాసం, ఆధార్కార్డుల ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్తోపాటు, జిరాక్స్ కాపీలతో జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్న వివరాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలినెహ్రూసెంటర్: మేడారం జాతర సమీపిస్తున్నందున వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారుల డ్యూటీలు, అవసరమైన మందుల ఏర్పాటు, అంబులెన్స్, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన వైద్య సిబ్బంది సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో పలు విభాగాలపై సమీక్ష సమావేశం, వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆరోగ్య సిబ్బంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు, మెడికల్ క్యాంపులపై పలు సూచనలు చేశారు. అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధుల గుర్తింపు వంటి ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. క్షయవ్యాధి నివారణకు ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పరీక్షలు పెంపొందించి క్షయవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రోగ్రాం అధికారులు సుధీర్రెడ్డి, లక్ష్మీనారాయణ, విజయ్, శ్రవణ్కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రత్యూష తదితులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి ములుగు: జిల్లాలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ సూచించారు. జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల న్యాయ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెండింగ్లోని సివిల్, క్రిమినల్, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయ పరిపాలన విషయాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ, భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్ బాబు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
సర్పంచ్గా గెలిపిస్తే..
● చేపట్టనున్న పనులను ‘బాండ్’ పేపర్పై రాసిన అభ్యర్థి కేసముద్రం: తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామానికి చేసే పనులను ఓ బాండ్ పేపర్పై రాసి సాక్షులతో సహా సంతకాలు చేయించిన హామీ పత్రాన్ని శృతి అశోక్ దంపతులు శనివారం విడుదల చేశారు. మండలంలోని అర్పనపల్లి సర్పంచ్గా బరిలో ఉన్న ఓ మహిళా అభ్యర్థి తనను సర్పంచ్గా గెలిపిస్తే, తన టెంట్ హౌజ్ సామగ్రిని జీపీకి అప్పగిస్తానని, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,016 ఆర్థికసాయ అందజేస్తానని, పేదింటి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5,016 లేదా క్వింటా బియ్యం అందజేస్తానని పేర్కొన్నారు. మొదటి 6 నెలల్లో ఫంక్షన్హాల్ నిర్మిస్తానని, మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తాననే తదితర పనులు చేపడుతానని హామీ పత్రం రాసిచ్చారు. ‘ఇందులో ఏ ఒక్క పనిచేయకపోయినా నా పదవిని విరమించుకుంటానని, నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న హామీ పత్రం’ అంటూ విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొనాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో నెల్లికుదురు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి ఉత్సాహంగా పాల్గొనాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో ప్రోసిడింగ్స్ అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం, బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహన కార్యక్రమంలో చెప్పిన విషయాలను సంపూర్ణంగా తెలుసుకుని ఎన్నికల్లో పాల్గొనాలని తెలిపారు. ఎన్నికల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ మధుకర్ బాబు, మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ జిల్లా స్థాయి మాస్టర్ టైనర్స్ శ్రీధర్, మధుసూదన్ పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ సందర్శన కేసముద్రం: ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ప్రోసిడింగ్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి, సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను తనిఖీ చేసి, బ్యాలెట్ బాక్సులను, పేపర్లను పరీశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ పార్ధసారథి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
నామినేషన్ వివాదం
● ఆర్ఓపై దాడికి యత్నం డోర్నకల్: మండలంలోని గుర్రాలకుంట గ్రామపంచాయతీలో 4వ వార్డుకు దాఖలైన ఓ నామినేషన్పై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా వెన్నారం రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ దాఖలు కేంద్రం వద్ద మూడు రోజల పాటు దాఖలైన నామినేషన్ల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. గుర్రాలకుంట 4వ వార్డులో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరాలు ఉండగా ఆర్ఓ వద్ద ఉన్న నామినేషన్ దాఖలు రిజిష్టర్లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తర్వాత ఇస్లావత్ నందు పేరును చేర్చారంటూ బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ ఫారం కూడా పూర్తిగా నింపలేదని అభ్యంతరం వ్యక్తం చేయగా మూడో నామినేషన్ను అర్థరాత్రి ఆన్లైన్ చేసి రికార్డులో నమోదు చేశామని, నోటీస్ బోర్డులో ప్రకటించిన జాబితాలో మూడో పేరు చేర్చలేదని ఆర్ఓ తెలిపారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు సర్ధిచెప్పగా తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఆర్ఓపై దాడికి యత్నం... ఈ క్రమంలో మూడో నామినేషన్లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది.. రిటర్నింగ్ అధికారి ఇస్లావత్ చాంప్లాపై దాడికి యత్నించారు. ఆర్ఓ చేతిలో కాగితాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. గొడవ చేస్తున్న వారిని పోలీసులు బయటకు పంపించారు. గొడవ జరుగుతున్న క్రమంలో ఆర్ఓ చొక్కా చినిగింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి వెన్నారం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
ముగిసిన మూడో విడత నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 5(శుక్రవారం)తో ముగిసింది. అయితే పలు క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగడంతో అధికారులు శనివరం వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 169 సర్పంచ్ స్థానాలకు 1185, వార్డు స్థానాలు 1,412 ఉండగా.. 3,592 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.సర్పంచ్ స్థానాలకు 1,185.. వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలు -
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఓటర్లు బాధ్యతగా ఓటు వేయాలి● ప్రజల్లో అవగాహన.. ప్రతీరోజు గస్తీ ● సాక్షి ఇంటర్వ్యూలో ఎస్పీ శబరీశ్● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● పాతనేరస్తుల బైండోవర్, ఆయుధాల స్వాధీనంఎస్పీ శబరీశ్సాక్షి, మహబూబాబాద్: ఎన్నికలు అంటేనే పార్టీలు, వ్యక్తుల మధ్య మాట యుద్ధం.. ఇక పంచాయతీ ఎన్నికలు నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఇక ప్రచారం.. ఓటింగ్.. ఫలితాలే తరువాయి. కాగా.. స్థానిక పోరులో బిజీగా మారిన గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామంటున్న ఎస్పీ శబరీశ్తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: జిల్లాకు కొత్తగా వచ్చిన మీకు వెంటనే ఎన్నికల నిర్వాహణ పరీక్షగా మారింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు..?ఎస్పీ: నేను జిల్లాకు కొత్త కావచ్చు.. కానీ మా డిపార్టుమెంట్లో డీఎస్పీ నుంచి హోంగార్డు వరకు పాతవారే ఉన్నారు. వారి సహకారంతో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం. వారి ద్వారా సమస్యలను తెలుసుకొని శాంతియుత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: శాంతిభద్రతల సమస్య రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?ఎస్పీ: జిల్లా అంతా సమస్యలతో ఉంటుందని అనుకోవడం సరికాదు. గత ఎన్నికలు, గతంలో జరిగిన ఘటనలను పరిశీలించి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. ఇలా మొదటి విడతలో 155 గ్రామపంచాయతీలు, 1,338 వార్డులు ఉండగా.. 45 సమస్యాత్మక కేంద్రాలు, రెండో విడతలో 158 గ్రామపంచాయతీలు, 1,360 వార్డులు ఉండగా.. 37 సమస్యాత్మక కేంద్రాలు, మూడో విడతలో 169 గ్రామపంచాయతీలు, 1,412 వార్డుల ఉండగా.. 55 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాం. ఆయా గ్రామాల్లో ప్రతీ రోజు గస్తీ నిర్వహిస్తున్నాం. సాక్షి: గొడవలు జరగకుంగా ముందస్తుగా తీసుకున్న చర్యలు ఏమిటి..?ఎస్పీ: ఎన్నికలు అంటే గొడవలు జరగడం సహజం అనే ధోరణి ఉంటుంది. కానీ, అసలు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా ముందునుంచి ప్రణాళికతో వెళ్తున్నాం. ఇందుకోసం గ్రామాల్లో పోలీస్ కళాజాతా, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను అర్థం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాం. 555 కేసులతో సంబంధం ఉన్న 2,889 మంది పాత నేరస్తులను బైండోవర్ చేసి.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలోని 15 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. బెల్ట్షాపుల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుండుబా తయారీపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటివరకు 36 (ఐడీ లిక్కర్) అక్రమ మద్యం కేసులు, 15 నల్లబెల్లం రవాణా కేసులు, 85 గుడుంబా కేసులు నమోదు చేశాం. సాక్షి: బందోబస్తు ప్రణాళిక ఏమిటి.. ఎంత మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికలకు వినియోగిస్తున్నారు. ఎస్పీ: జిల్లాలోని 482 పంచాయతీలు, 4,110 వార్డుల్లో ఒకేసారి కాకుండా విడత వారీగా ఎన్నికలు జరగడం మాకు కొంత ఉపశమనం. ఒక్కోవిడతకు ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహిస్తూ.. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు కాకుండా చూసేందుకు డీఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు మొత్తం 700 మంది స్థానిక పోలీసులు పనిచేస్తారు. వీరితోపాటు సీఆర్పీఎస్, ఎస్ఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాల సేవలు వినియోగించుకుంటాం. సాక్షి: ప్రజలు, నాయకులకు పోలీస్ శాఖ ద్వారా చేసే సూచనలు ఏమిటి..?ఎస్పీ: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ఈ విషయాన్ని ఓటర్లు, ప్రజా ప్రతినిధులు గమనించాలి. ఓటరు తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేలా చూడాలి. ప్రలోభాలకు గురి చేయడం నేరం. ఐదు సంవత్సరాలు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ఓటరు రాజీ పడొద్దు. అదే విధంగా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దు. పోటీలో ఉన్నవారిలో ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడుతారు.. ప్రజల తీర్పును అంగీకరించే మనస్తత్వం అలవర్చుకోవాలి. అంతే కానీ, కావాలని ప్రజలను రెచ్చగొట్టడం. అశాంతిని ప్రేరేపిస్తే సహించేది లేదు. కావున ఎన్నికలు సజావుగా జరగాలంటే పోలీసులు ఒక్కరి బాధ్యతే కాకుండా ప్రజలు, రాజకీయ పక్షాల నాయకుల సహకారం అవసరం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరిస్తారనే నమ్మకం ఉంది. -
రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు
● డీఏఓ విజయనిర్మలదంతాలపల్లి: పంట వ్యర్థాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో శనివారం పంట వివరాల సేకరణను పరిశీలించారు. అనంత రం రైతులతో కలిసి రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటపొలం కోసాకా రైతులు తమ పొలంలోని గడ్డిని, వ్యర్థాలను కాల్చుతున్నారని అలా చేయడం వల్ల పంటలకు ఉపయోగపడే బ్యాక్టీరియా చనిపోతుందని తెలిపారు. పంటపొలాల వ్యర్థాలను కాల్చకుండా సింగిల్ సూపర్ ఫస్పెట్ చల్లి కలియ దున్నడంద్వారా నేల సారవంతమవుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల షాపులను తనిఖీ చేశారు. షాపుల యజమానులతో మాట్లాడుతూ.. కొనుగో లు చేసే ప్రతి వస్తువుపై రశీదులు ఇవ్వాలని తెలిపా రు. కార్యక్రమంలో ఏఓ వాహిని, వ్యవసాయ విస్తరణ అధికారులు దీక్షిత్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. -
పల్లె పరిపుష్టికి బాట..
జనగామ: ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు.. రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు.. వివిధ కార్యక్రమాల నిమి త్తం పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వనరులే అత్యంత ప్రధానం. అందుకే గ్రామ ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచింది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికారు. రాజస్థాన్లో మొదట అమలైన ఈ వ్యవస్థ.. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. పల్లె పాలనను బలపర్చేందుకు పంచాయతీల నుంచి మూడు శాఖలను వేరుచేసి గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, వసతి వంటి 15 కీలక శాఖలను జీపీల పరిధిలోకి చేర్చారు. సర్పంచ్ ఆధ్వర్యంలోని ఈ వ్యవస్థ గ్రామాలకు స్వయం పాలన అందించే ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో 65 ఏళ్లు దాటి.. 66వ సంవత్సరంలోకి అడుగిడిన పంచాయతీ శాఖ ప్రయాణంపై పల్లె పాలన గుర్తు చేస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పంచాయతీరాజ్ గొడుగు కింద 29 శాఖలు గ్రామ పంచాయతీ పరిధిలో 15 శాఖలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కింద రెవెన్యూ మినహా మొత్తం 29 శాఖలు ఉండగా, 15 శాఖలు మాత్రమే ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. నేటికీ వందశాతం బదలాయింపు జరగలేదు. ప్రధానంగా విద్యుత్, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పశువైద్యం, పౌరసరఫరాలు, రోడ్ల భవనాలు, మత్స్యశాఖ, గృహనిర్మాణం, ఇరిగేషన్ శాఖలు గత కొంతకాలం వరకు కొనసాగాయి. పంచాయతీల్లో సేవలందించేది ఎవరు? పంచాయతీల్లో గ్రామపాలన కొనసాగించడానికి వీరంతా చాలా ముఖ్యం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ సేవలు క్షేత్రస్థాయిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలన , గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలు, శానిటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, రహదారులు, సామాజిక భద్రత, పెన్షన్ విభాగం, గ్రామ స్థాయి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖ, పశుసంవర్థక శాఖ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్వాడీ ఆయాలు.. వీరంతా నిత్యం గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు. వీరంతా పంచాయతీ పాలనకు జవాబుదారీగా ఉంటారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం.. పంచాయతీ వ్యవస్థ గతంతో పోలిస్తే నిర్వీర్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్(మూడు అంచెలు) మాత్రమే పరిగణనలోకి ఉండగా వీటికి అదనంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. 1959లో పంచాయతీల ఆవిర్భావంలో రెవెన్యూ మినహా అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు ఉండడంతో సర్పంచ్లదే పై చేయిగా ఉండేది. సర్వాధికారాలు సర్పంచ్లకే ఉండడంతో వివిధ శాఖల అధికారులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో స్వయం ప్రతిపత్తి హోదా కావాలని వ్యవసాయం, విద్యుత్, విద్యాశాఖ అధికారులు పట్టుబడ్డారు. దీంతో మూడు శాఖలతో పాటు ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో నుంచి విడిపోవడంతో ప్రత్యేక శాఖలుగా ఆవిర్భవించాయి. దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్ల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. కాళేశ్వరం: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో కూడా ‘నోటా’ ఓటును వినియోగించుకునేలా ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో నిరక్ష్యరాస్యుడైన మామ, అక్షరాస్యుడైన తన అల్లుడితో ‘నోటా’ వినియోగంపై జరిగిన సరదా సంభాషణ ‘సాక్షి’ పాఠకులకు అందిస్తుంది. అల్లుడు: మామ నమస్తే మనఊళ్లో సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతానయే. మామ: ఏమి అల్లుడా బాగేన. పట్నం (హైదరాబాద్ ) నుంచి ఎప్పుడచ్చినవ్. ఏమి ఎలచ్చన్లు రా. ధూంధాం నడస్తనయ్. కని నాకు నచ్చనోళ్లు సర్పంచ్కు నలుగురు ఏసిండ్రు. మనోళ్లే లేరు. అల్లుడు: ఏ మామ నీకు తెల్వదానే. ఎందుకు బాధ పడుతవ్. ఈసారి బ్యాలెట్ పేపర్లో కూడా నోటాకు రాష్ట్ర ఎనికల సంఘం అవకాశం కల్పించింది. మామ: గీ నోటా ఓటు ఏంది అల్లుడా.. అల్లుడు: నోటా అంటే (నన్ ఆఫ్ ది ఎబో) పైవి ఏవి కావు అని అర్థం. నీకు నచ్చని వారు పోటీలో ఉంటే నోటాకు నీ ఓటు వేయొచ్చు. నీ ఓటు వినియోగించుకున్నట్లు కూడా అవుతుంది. మామ: నోటాకే ఓట్లు బాగా పడితే ఎట్లా రా? అల్లుడు: నోటాకు ఓట్లు ఎక్కువ పడితే రెండో అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారట. మామ: గిదెప్పటి నుంచి అమలవుతోంది. అల్లుడు: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. కానీ ఈసారి బ్యాలెట్ పేపర్లో ఇవ్వడంతో పల్లెల్లో కూడా వినియోగిస్తారు. మామ: సరే అల్లుడా..మాఊళ్ల అందరికీ నోటా ఓటు గురించి సెప్పుతా. ఇగ ఉంటా. ఓట్లయినంక కలుద్దాం. గెలిచినోళ్లం గురించి మాట్లాడుకుందాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్(45) ప్రకారం జీవో 138 పీఆర్ ప్రకారం తాగునీరు, సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ.. వంటి సేవలు అందిస్తున్నారు. అలాగే వంతెనలు, కల్వర్టులు, రహదారుల పునరుద్ధరణ తదితర మరమ్మతుల నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో విద్యుత్ సరఫరా అందించాలి. డ్రైనేజీ, వర్షపునీరు నివాస ప్రాంతాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. శానిటేషన్ నిర్వహణలో పంచాయతీల పర్యవేక్షణ చాలా కీలకం. ప్రధాన కూడళ్లలో కుండీల ఏర్పాటు, తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. శ్మశాన వాటికలు, జంతు కబేళాలు, సామూహిక మరుగుదొడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత కీలకం. వీటితోపాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలికంగా ప్రజావసరాలను చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాల ధ్రువీకరణ నమోదు, వరదనీరు, తాగునీటి పరిరక్షణ తదితర అంశాలను పంచాయతీలే పర్యవేక్షించాలి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం గ్రంథాలయాల నిర్వహణ, దివ్యాంగులు, నిరాదరణకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రోత్సాహం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 66 ఏళ్ల పీఆర్ ప్రయాణంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు పల్లె పాలనకు మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పునాది.. -
పొత్తు.. గమ్మత్తు
వాజేడు: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ ధ్య రాజకీయ వైరం ఉంది. అయితే వాజేడు మండలం పేరూరులో మాత్రం ఆయా పార్టీల నాయకులు కలిసిపోయారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తు న్న మహిళకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీ ఆర్ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం. ఇప్పటికే పేరూ రు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో గొడ్డె వరలక్ష్మి నామినేషన్ దాఖాలు చేశారు. అయితే నా మినేషన్లకు చివరి రోజైన శుక్రవారం అనూహ్యంగా పేరూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత గొడ్డె నాగేశ్వరరావు భార్య సరోజని నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో సరోజన రెండు పార్టీల కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం కొసమెరుపు. ● ఒకే అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు -
ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలి
గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్లో శాతవాహన, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని కోరుతూ శుక్రవారం రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా కోవిడ్ సమయంలో రద్దుచేసిన విజయవాడ టు కాజీపేట ప్యాసింజర్, మణుగూరు టు కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలని ఆయన ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించి గార్ల రైల్వేస్టేషన్లో రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ రవిచంద్ర తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ సంబంధి త అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మా ట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్ర త్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సీనియర్ అధికారులు, ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో రూట్ మ్యాప్ తయా రు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రొటోకాల్ పాటిస్తూ పనులు చేసుకోవాలన్నారు. ఎలాంటి పొ రపాట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ జరిగేలా చూ డాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొ ప్పో, అనిల్కుమార్ జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీ ఓ హరిప్రసాద్, సంబంధిత అధికారులు ఉన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లలో టాప్తొర్రూరు రూరల్: విద్యుత్ బిల్లుల వసూళ్లలో 40 డివిజన్లలో తొర్రూరు డివిజన్ ముందంజలో ఉందని విద్యుత్శాఖ డీఈ రవి అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ మాట్లాడుతూ.. వినియోగదారులు కరెంట్ సరఫరాను సక్రమంగా వినియోగించుకుంటూ, బిల్లులు చెల్లించడం సంతోషకరమన్నారు. విద్యుత్ సిబ్బంది, వినియోగదారుల సహాయ సహకారాలతో బిల్లుల వసూళ్లలో తొర్రూరు డివిజన్ టాప్లో ఉందని కొనియాడారు. భవి ష్యత్లో విద్యుత్ బిల్లులను చెల్లించడానికి విని యోగదారులు మరింత ఎక్కువగా సహకరించి విద్యుత్ సంస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు. 10న వాహనాల వేలంమహబూబాబాద్ రూరల్ : బెల్లం, సారాయి సరఫరా చేస్తూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి శుక్రవారం తెలిపారు. ఎకై ్సజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి కిరణ్ ఆదేశాల మేరకు వాహనాల వేలంపాట జరుగుతుందని, పాల్గొనే వారు వాహన ధరలో 50శాతం మొత్తాన్ని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ పేరున డీడీ తీయాలని, దాంతోపాటు దరఖాస్తు, ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించాలని సూచించారు. వాహనాల వివరాలు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్లో ఉన్నాయని, వాహనాలను చూసి వేలం పాటలో పాల్గొనాలన్నారు. వేలంపాటకు దరఖాస్తులు 10వ తేదీ ఉదయం 9గంటల వరకు మాత్రమే తీసుకుంటామని తెలిపారు. 13న నవోదయ ప్రవేశ పరీక్షమహబూబాబాద్ అర్బన్: జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు 5,648 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాన్నారు. పూర్తి వివరాలకు 9110782213 నంబర్లో సంప్రదించాలన్నారు. -
సర్పంచ్ వేతనం @ రూ.6,500
భూపాలపల్లి అర్బన్ : గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి, గెలువడానికి ఆశావహులు పెద్దసంఖ్యలో ఉత్సాహపడుతుంటారు. పదవిని దక్కించుకోవడానికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వారి ఉత్సాహం, గెలుపొందడానికి వారు పె డుతున్న ఖర్చు చూసి ప్రజలు సర్పంచ్కు ఎంత వేతనమొస్తుందో, ఆ పదవి ద్వారా ఎంత ఆదాయం ఉంటుందో, అందుకే అంతగా ఖర్చు చేస్తున్నారని అనుకుంటుంటారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బతిమిలాడి సర్పంచ్గా గెలిస్తే వారికి నెలకు వచ్చే వేతనం రూ.6,500 మాత్రమే. అది కూడా నెలనెలా రాదు. ఎప్పుడో ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసినప్పుడే తీసుకోవాలి. ఇదిలా ఉండగా 1992కు ముందు సర్పంచ్కు వేత నం లేదు. ఆ తర్వాత చిన్న జీపీలకు సర్పంచ్కు రూ.600, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్కు రూ.వెయ్యి మాత్ర మే ఇచ్చేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, ఏప్రిల్ 1 నుంచి సర్పంచ్ వే తనం రూ.5 వేలు చేశారు. ఆ తర్వాత 2021లో రూ.6,500 పెంచారు. కాగా, 2018 తర్వాత నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడంతో చిల్లిగవ్వ ఆదాయం రాకపోగా పనులు చేయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు మీదపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. మరీ ఇంత తక్కువ వేతనం, పనులు చేసినా పైసలు రాకున్నా అంత పోటీ ఎందుకు? అంత ఖర్చు చేస్తారంటే సర్పంచ్ ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ హోదా, దర్పం, దర్జా దక్కించుకోవడం కోసం ఉన్న ఆస్తి అమ్మి అయినా, అప్పు చేసైనా విజయం సాధించాలని ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థులూ.. ఆలోచించండి గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు అభివృద్ధి పనులు చేస్తే బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులే.. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
గార్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేశ్ హెచ్చరించారు. శుక్రవారం గార్ల సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందించే మెనూ అమలు తీరుతెన్నులను పరిశీలించారు. మెనూ ప్రకారం రోగుల కు భోజనం వడ్డించాలని, మెనూలో తేడా వస్తే టెండర్ ఏజెన్సీని రద్దు చేస్తామన్నారు. గ్రామ పంచా యతీ ఎన్నికలు సమీపిస్తున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర చి కిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది.. వైద్యుల ఆదేశానుసారం విధిగా పనిచేయాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్గౌడ్, డాక్టర్ బాలునాయక్, డాక్టర్ హనుమంతరావు, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి, ఫార్మసిస్ట్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. -
భారీ రాతి పిల్లర్ ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ రాతి పిల్లర్లతోపాటు సాలహారం నిర్మిస్తున్నారు. గద్దెల చుట్టూ ఎనిమిది ఆర్చ్ ద్వారాలు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఆర్చ్ ద్వారం భారీ రాతి పిల్లర్ను పునాది(పీడిస్టల్) లో భారీ క్రేన్ల సాయంతో నిలబెట్టారు. పిల్లర్ పై చెక్కిన ఆదివాసీల గొట్టుగొత్రాల, వంశ వృక్షం చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. కాగా, పిల్లర్ను నిలబెట్టంత వరకు పస్రా సీఐ దయాకర్.. భక్తులను సమీపంలోకి రాకుండా చూశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి రాయపర్తి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఛత్తీస్గఢ్కు చెందిన రాంసింగ్(22), సీతారాం, తుళ్లు బోరు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిపై ఉన్న 11కేవీ విద్యుత్లైన్ తాకడంతో షాక్కు గురై రాంసింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారాం, తుళ్లు అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రాజేందర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మృతుడి కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, ప్రకాశ్రెడ్డి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం 3.32గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభా వేదిక వద్దకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం రేవంత్రెడ్డి రోడ్డుపొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరుమండలాలనుంచే కాకుండా ఉమ్మడి జిల్లానుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభా ప్రాంగణమంతా నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
ఏసీబీ వలలో ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కారు. పాఠశాల అనుమతుల పునరుద్ధరణ కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో రూ.60వేలు తీసుకున్న అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డితోపాటు విద్యాశాఖ సిబ్బంది గౌస్, మనోజ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కొత్తూరు జెండా ప్రాంతంలో ఉన్న క్రియేటివ్ మోడల్ హైస్కూల్ పదేళ్ల పునరుద్ధరణ అనుమతు ల కోసం యాజమాన్యం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. ఎంతకీ అనుమతులు రాకపోవడంతో స్కూ ల్ యజమానులు.. డీఈఓ కార్యాలయ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ను సంప్రదించారు. ఫైల్ ఆమోదానికి రూ.లక్ష ఇవ్వాలని, ఇస్తే డీఈఓ ఆమోదిస్తారని గౌస్, మనోజ్ వారికి తెలిపారు. అంతమొత్తం ఇవ్వలేమని నేరుగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డిని కలిశారు. సిబ్బందికి చెపుతానని, వారిని కలవమని ఆయన చెప్పారు. ఈసారి వారు రూ.75వేలు ఇవ్వాలని చెప్పారు. మరోమారు వెంకట్రెడ్డిని కలిసి అంతమొత్తం ఇవ్వలేమని చెప్పడంతో కొంత తగ్గించి ఇవ్వమని, తాను చెబుతానని భరోసా ఇచ్చారు. చివరగా శుక్రవారం రూ.60వేలు మనోజ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కు మారిన సీన్.. మొదట డబ్బులు గౌస్కు ఇచ్చేందుకు బాధితులు డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గౌస్లేడు.. మనోజ్ ఒక్కడే ఉన్నాడు. డబ్బులు తీసుకొచ్చామని చెప్పడంతో కలెక్టరేట్లో ఉన్న అదనపు కలెక్టర్తో ఫైనల్ ఫిగర్ నిర్ధారించుకునేందుకు మనోజ్ కూడా కలెక్టరేట్కు వచ్చాడు. సార్తో మాట్లాడిన తర్వాత ఐడీఓసీ వెనుక సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారి నుంచి రూ.60వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాస్తున్న ఏసీబీ అధికారులు మనోజ్ను అదుపులోకి తీసుకుని అదనపు కలెక్టర్ చాంబర్కు తీసుకుచ్చారు. విచారణ అనంతరం వెంకట్రెడ్డి, మనోజ్, గౌస్లను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు దాడులు.. సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన దాడులు దాదాపు 8 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. ముగ్గురిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో తొలిదాడి.. హనుమకొండ కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఈ భవనంలో ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఉద్యోగులు విధులు ముగించుకొని బయటకు వెళ్లే సమ యం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఉన్న కలెక్టర్ చాంబర్లోనే.. దాడులు జరుగుతున్న సమయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశాలు ముగించుకుని తన చాంబర్లోనే ఉన్నారు. ఏసీబీ చర్యలు కొనసాగుతుండగా దాదాపు గంటకుపైగా అదే భవనంలో కలెక్టర్ ఉన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. గతంలో కూడా.. ఈ కేసులో పట్టుబడిన అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, గతంలో ఉమ్మడి జిల్లాలో జనగామ ఆర్డీఓగా, ఆపై నల్లగొండ జిల్లాలో పనిచేశారు. నల్లగొండలో పని చేసిన కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, జనగామలో భూసేకరణ విషయంలో ఆరోపణలు, విచారణలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. అసలు గురి తప్పిందా? ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడిన విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, తీవ్ర ఆరోపణలతో వారిని రాష్ట్ర అధికారులు తప్పించారని ప్రచారం సాగుతోంది. అక్కడికి ఇన్చార్జ్గా వచ్చిన వెంకట్రెడ్డి ఏసీబీకి బుక్కయ్యారని అంటున్నారు. లేదంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు చిక్కేవారని చర్చ సాగుతోంది. బదిలీ కోసం ప్రయత్నిస్తూ.. ఏసీబీకి పట్టుబడిన అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి జిల్లా నుంచి బదిలీ కోసం ఇటీవల తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న విద్యాశాఖ వ్యవహారంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన బదిలీ దరఖాస్తు చేసిన నేపథ్యంలో జిల్లాకు అదనపు కలెక్టర్గా వచ్చేందుకు గతంలో ఉమ్మడి జిల్లా సమయంలో వరంగల్(ప్రస్తుతం హనుమకొండ) ఆర్డీఓగా పనిచేసిన అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాకు వచ్చి ఒకరిద్దరు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హనుమకొండ అదనపు కలెక్టర్తోపాటు ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.60 వేల లంచం కలెక్టరేట్లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత -
కల్యాణ మండపం పెండింగ్ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపం పెండింగ్ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత నెల 29న వరంగల్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. పనులు పెండింగ్లో ఉండడంతో పురావస్తుశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఆలయ పనుల పూర్తి నివేదికను ఇవ్వాలని పురావస్తుశాఖ అధికారులను ఆదేశించారు. పురావస్తుశాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఎం.మల్లేశం, ఇంజనీర్ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. దక్షిణ భాగంలో మిగిలి ఉన్న కల్యాణమండపం పైభాగం, లోపలి భాగంలో నాట్యమండపం పనులు చేపట్టారు. పద్మాక్షిగుట్ట వద్ద నంబర్లు వేసిన ఉంచిన రాళ్లు, స్తంభాలను దేవాలయానికి తరలించారు. -
చిల్లర నాణేలతో డిపాజిట్
● వినూత్న రీతిలో నామినేషన్ కురవి: రూపాయి.. రూపాయి కూడబెట్టిన చిల్లర నాణేలతో ఫీజు చెల్లించి నామినేషన్ దాఖలు చేశారో ఓ మహిళా వార్డు అభ్యర్థి. మండలంలోని తాట్యతండాకు చెందిన బోడ వీరన్న భార్య సునీత అదే జీపీలో 8వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీకి దిగారు. నామినేషన్కు సంబంధించిన ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంది. దీనికి ఆమె అప్పుడప్పుడు కవర్లో దాచుకున్న రూపాయి నాణేలను తీసుకుని భర్తతో కలిసి కొత్తూరు(జీ) గ్రామ పంచాయతీలోని నామినేషన్ కేంద్రంలో అధికారులకు చెల్లించి నామినేషన్ వేసింది. అధికారులు ఆ చిల్లర నాణేలు లెక్కించుకుని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. -
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
వీఓఏకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో..సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన పెంతల సువర్ణ వీఓఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు, మహిళలంతా కలిసి ‘సువర్ణ నీవు సర్పంచ్గా బరిలో నిలిచి గ్రామాభివృద్ధికి పాటుపడాలి’ అని కోరుకున్నారని, అందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీఓఏగా ఉంటూ మహిళలకు సేవలందించానని, సర్పంచ్గా గెలిపి మరిన్ని సేవలందిస్తానని సువర్ణ తెలిపారు.నాడు భర్త.. నేడు భార్య ● గతంలో నీలికుర్తి సర్పంచ్గా భర్త మనోహర్ ఎన్నిక ● ఈ ఎన్నికల్లో భార్య పార్వతికి అవకాశం..నామినేషన్ దాఖలు మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ పరిధి రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం రేఖ్యతండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. దీంతో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా మనోహర్ భార్య పార్వతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, పార్వతి గెలుపొందితే దంపతులు ఇద్దరూ సర్పంచ్ పదవి చేపట్టిన వారిగా అరుదైన గౌరవం దక్కనుంది.దాట్ల..ఆ దంపతులదే.. ● 20 ఏళ్లుగా గ్రామపాలన వారిదే.. దంతాలపల్లి : 20 ఏళ్లుగా ఆ కుటుంబం గ్రామపాలన సాగిస్తోంది. భర్త ఇప్పటికే మూడు పర్యాయాలు సర్పంచ్గా కొనసాగగా భార్య ఒకసారి.. మొత్తం నాలుగు పర్యాయాలు గెలుపొందారు. ప్రస్తుతం గ్రామం జనరల్ ఉమెన్గా రిజర్వ్ కావడంతో ఐదోసారి ఆ కుటుంబం బరిలో నిలిచింది. మండలంలోని దాట్లకు చెందిన కొమ్మినేని రవీందర్ 2001, 2005లో సర్పంచ్గా గెలుపొందాడు. 2010లో తన భార్య మంజుల సర్పంచ్గా గెలుపొందింది. 2019లో రవీందర్ మళ్లీ సర్పంచ్గా గెలుపొంది ప్రస్తుతం తాజా మాజీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఐదోసారి జనరల్ ఉమెన్కు రిజర్వ్ కావడంతో మరోసారి మంజుల బరిలో నిలిచింది. కాళ్లు మొక్కి.. ఓటు అభ్యర్థించి..మహబూబాబాద్ మండలం దామ్యాతండా గ్రామపంచాయతీలో వృద్ధురాలి కాళ్లు మొక్కి ఓటు అభ్యర్థిస్తున్న సీపీఐ బలపరిచిన అభ్యర్థి బానోత్ లింగ్యా నాయక్ ప్రచార పదనిసలు.. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సర్పంచ్, వార్డు అభ్యర్థులకు శుక్రవారం పట్టణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మొదటి విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా చేయాల్సిన, చేయకూడని పనులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పెట్రోలింగ్ పార్టీల ద్వారా అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, కురవి, రూరల్ ఎస్సైలు దీపిక, రవికిరణ్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట ప్రాంతంలోనే రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో గురువారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్చందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనంతారం పరిధిలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసం చేయడం సరికాదన్నారు. రూ.908 కోట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొని, ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం నిజంకాదా అని ప్రశ్నించారు. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కానున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో సమాచారం వచ్చిందని, ఆ ప్రయత్నాలు మానుకోవాలన్నారు. రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో విషయంలో జేఏసీ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తరలకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, న్యాయవాదులు మామిడాల సత్యనారాయణ, మేక సురేష్ రెడ్డి, తుంపిళ్ల శ్రీనివాస్, భూక్య మోహన్ నాయక్, డేగల సత్యనారాయణ, ఉగ్గుల అశోక్, మౌనిక, రాజమణి, సునీత పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్మహబూబాబాద్: మానుకోటను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అౖద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం నేషనల్ నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా మా దక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే చట్ట పర మైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాలకు ఎవరూ బానిసకావొద్దన్నారు. చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు సేవించి ఆస్పత్రులకు వస్తే వారి వివరాలను పోలీస్ శాఖకు అందజేయాలన్నారు. అధికారులు గ్రామాల్లో డ్రగ్స్ తీసుకునే వారి వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో విస్తృతంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఎస్పీ తిరుపతి రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల బంధం
● పోటీపడుతున్న వారిని బుజ్జగిస్తున్న బంధువులు ● దీర్ఘకాలిక శత్రువులను కలుపుతున్న ఎన్నికలు ● మద్దతు తెలపాలని ఇంటికి వెళ్లి అభ్యర్థుల ప్రాధేయం ● బంధువుల గెలుపు కోసం దూరం నుంచి వచ్చి ప్రచారంఇనుగుర్తి మండలం చిట్యాతండా గ్రామ పంచాయతీలో ముగ్గురు అన్నదమ్ములు వేర్వేరు పార్టీల మద్దతుతో పోటీకి దిగారు. కుటుంబ సభ్యులు బతి మిలాడినా ముగ్గురూ పట్టించుకోలేదు. చివరకు బంధువులు జోక్యం చేసుకొని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడారు. మీ మధ్య పోటీ సరికాదని, ఎన్నికలు అన్నదమ్ములను శత్రువులను చేస్తాయని హితవు పలికారు. దీంతో ఇద్దరు నామినేషన్ విత్డ్రా చేసుకోగా.. ఒకరు బరిలో ఉన్నారు. తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో బాబాయ్, అబ్బాయి(అన్నకొడుకు)లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో పోటీకి సిద్ధమయ్యారు. ఇరువర్గాలు తమ క్యాడర్ను తయారు చేసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు, బంధువులు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. చివరకు అబ్బాయి పోటీలో ఉండగా.. బాబాయ్ పోటీ నుంచి తప్పుకున్నాడు. మహబూబాబాద్ మండలం వీఎస్ లక్ష్మీపురం గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. బీఆర్ఎస్ నుంచి సురుగు సుజాత, సురుగు పూలమ్మ, సురుగు ఐలమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల భార్య లు ఉండగా, ఒకరు అత్త పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముగ్గురితో మాట్లాడారు. పూలమ్మ, ఐలమ్మ నామినేషన్ విరమించుకోగా.. సుజాత మాత్రమే పోటీలో ఉన్నారు. సాక్షి, మహబూబాబాద్: ..ఇలా పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సమన్వయం, పెద్దల జోక్యం, అన్నదమ్ములు విడిపోవద్దనే ఆలోచనతో వేసిన నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. అదేవిధంగా పోటీ చేసేవారిలో గిట్టని వారు ఉంటే.. బరిలోకి దిగి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. శత్రువులను కలుపుతున్న ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. అయితే గ్రామాల్లో గెట్ల పంచాయితీ, కుటుంబ కలహాలతో సుదీర్ఘ కాలంగా విడివిడిగా ఉన్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మామ అల్లుండ్ల మధ్య అంతరాలు తగ్గుతున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులు కుటుంబ సమేతంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు ప్రకటించాలని బతిమిలాడుతున్నారు. ఇరువర్గాలకు కావాల్సిన బంధువులను మధ్యలో పెట్టి రాయబారాలు పంపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు శత్రువుగా చూసిన వారు కూడా ఇంటికి వచ్చి మద్దతు అడగడంతో భేషజాలు విడిచిపెట్టి బంధుత్వాలను నెమరు వేసుకుంటున్నారు. ఒకరి గెలుపుకోసం మరొకరు ప్రచారంలోకి దిగుతున్నారు. ప్రచారం కోసం పల్లెకు.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలుపు.. మద్దతు తెలిపిన పార్టీలకే కాకుండా, బంధువులకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తమ అన్న, తమ్ముడు, బాబాయ్, మామ, అల్లుడు పోటీలో ఉండి ఓడిపోతే గ్రామంలో పరువు పోతుందని, ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న పట్టుపోతుందనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసం తమ బంధువులను గెలి పించుకునేందుకు హైదరాబాద్, వరంగల్, సూరత్, ఖమ్మం మొదలైన ప్రాంతాల్లో నివాసం ఉండే వారు కూడా పల్లెబాట పడుతున్నారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తూ గెలిచి తీరాలి.. ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. -
వరాలు కురిపిస్తారా..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్ప డి రెండేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి వరంగల్పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మోంథా’ తుపాను నేపథ్యంలో ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15వేలకు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’పనులు... ఉమ్మడి వరంగల్కు కావాలి నిధులు.. ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డులతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత... కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం? ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ మద్దతు దారులు గెలిచేలా రేవంత్రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది. నేడు నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలుఅన్ని ఏర్పాట్లు పూర్తి సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేట లోని బంజారాభవన్లో ఏర్పాటుచేసిన హెలి పాడ్లో దిగుతారు. మధ్యాహ్నం 2.15నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. -
గర్భిణులకు అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: గర్భిణులకు తమ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మెటర్న ల్ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోగురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భి ణులు తప్పకుండా చెకప్లు చేయించుకోవాలని సూచించారు. హైబీపీ, ఎనిమియా, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైదులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మెటర్నల్ మరణాలు జరగకుండా సమన్వయంతో సిబ్బంది పని చేయాలని సూచించారు. సమావేశంలో గైనకాలజిస్ట్ శ్రీవిద్య, ప్రోగ్రాం ఆఫీసర్ సారంగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి, డాక్టర్ ప్రత్యూష, మౌనిక, సురేష్, సద్విజ, కేవీ రాజు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్పై సమీక్ష.. జిల్లాలో పాఠశాలల విద్యార్థులను పరీక్షించి, ఏమైనా రుగ్మతలు ఉంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కు పంపించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. డీఈఐసీ సెంటర్పై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లల్లో మానసిక రుగ్మతలు, దంతాల సమస్య, వినికిడి సమస్యలు తలెత్తితే సెంటర్కు పంపించి చికిత్స అందించాలని, జీజీహెచ్, ఎంజీఎంకు రెఫర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సు మన్కల్యాణ్, డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ శ్రవణ్కుమార్, డాక్టర్ సతీష్, కేవీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
తేలిన లెక్క..
మహబూబాబాద్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. కాగా, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈనెల 4వ తేదీన అధికారులు వెల్లడించారు. కాగా 155 సర్పంచ్ స్థానాలకు గానూ 9 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,338 వార్డుల్లో 266 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,072 వార్డులకు 2,391 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 9జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవం.. జిల్లాలోని ఐదు మండలాల్లో తొలివిడత జీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఐదు మండలాల్లోని 155 జీపీలకు 9గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. గూడూరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ, ఇనుగుర్తి 2, కేసముద్రం 3, మానుకోట 2, నెల్లికుదురు మండలంలో ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. అలాగే గూడూరు మండలంలో 36వార్డులు, ఇనుగుర్తి 30, కేసముద్రం 60, మానుకోట 76, నెల్లికుదురు మండలంలో 64 వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈనెల 11వ తేదీ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు. మొదటి విడతలో 155 జీపీల్లో 9జీపీలు ఏకగ్రీవం 1,338 వార్డులకు 266 ఏకగ్రీవం మిగిలిన 146 సర్పంచ్స్థానాల బరిలో 468మంది అభ్యర్థులు 1,072 వార్డుల్లో 2,391మంది పోటీ ఈనెల 11న పోలింగ్ బరిలో నిలిచిన వార్డు అభ్యర్థులు మండలం వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు గూడూరు 318 730 ఇనుగుర్తి 82 167 కేసముద్రం 194 442 మానుకోట 262 578 నెల్లికుదురు 216 474 మొత్తం 1,072 2,391మండలం జీపీలు బరిలో ఉన్న అభ్యర్థులుగూడూరు 40 120 ఇనుగుర్తి 11 34 కేసముద్రం 26 82 మానుకోట 39 129 నెల్లికుదురు 30 103 మొత్తం 146 468 -
ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం..
● ఏడుసార్లు సర్పంచ్లుగా ఎన్నుకున్న గ్రామస్తులు వాజేడు: ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం. ఏడుసార్లు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను గ్రామస్తులు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. వాజేడు మండలం నాగారం గ్రామ పంచాయతీకి ఎనిమిది దఫాలు ఎన్నికలు జరగగా అందులో ఏడు సార్లు వాజేడుకు చెందిన తల్లడి పాపారావు కుటుంబం నుంచి సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. 1984, 1989, 1994, 1999, 2004 వరకు తల్లడి పాపారావు ఐదు సార్లు పోటీ చేసి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో బోదెబోయిన కృష్ణ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2014లో తల్లడి పాపారావు కోడలు పుష్పలత సర్పంచ్గా ఎన్నికయ్యారు. అదే విధంగా 2019లో తల్లడి పాపారావు తమ్ముడు ఆదినారాయణ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఇలా ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఏడుసార్లు నాగారం సర్పంచ్ పదవిని కై వసం చేసుకున్నారు. -
ఉప సర్పంచ్ .. పవర్ ఫుల్
● నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్ పవర్ ● పల్లెల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి తీవ్ర పోటీ సంగెం: పల్లె పాలనలో ఉప సర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. ఇంతకాలం నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఉపసర్పంచ్.. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం పవర్ఫుల్గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టాబెట్టారు. ఈ నిర్ణయం ఉప సర్పంచ్ పదవిని బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. అందుకే ఎన్నికలకు ముందు నుంచి తమ ప్యానల్ గెలిస్తే ఫలనా అభ్యర్థికి ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలనే ఖండిషన్లు సైతం పెట్టుకుంటున్నారు. ఏకగ్రీవమైన చోట్ల అధికార పక్షం వారికి సర్పంచ్ పదవి ఇస్తే, ప్రతిపక్షానికి ఉప సర్పంచ్ ఇవ్వాలనే షరతు విధించుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీలో ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారనుంది. చెక్ పవర్ ఇద్దరికి .. బాధ్యత ఒక్కరిదే.. సర్పంచ్, ఉప సర్పంచ్కు జాయింట్ చెక్పవర్ ఉంటుంది. నిధుల నిర్వహణ సర్పంచ్లకు ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైన సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం 2018 పంచాయతీరాజ్ చట్టానికి ఉంది. అయితే ఉప సర్పంచ్ సహా పాలకవర్గాన్ని ఇందులో భాగస్వాములను చేయకపోవడం గమన్హారం. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకపోయినా సర్పంచ్పై వేటు పడుతుంది. ఈ విషయంలో ఉప సర్పంచ్కు మినహాయింపు ఉంది. అందుకే ప్రస్తుత జీపీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. -
గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో కొలువైన గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదిలించారు. ఏటూరునాగారం మండలం కొండాయిలో గల గోవిందరాజు పూజారులు మేడారానికి వచ్చారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదిలించారు. ఈ కార్యక్రమానికి ముందు సమ్మక్క,సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమ, సారా ఆరగించి పూజలు నిర్వహించారు. నవంబర్ 23వ తేదీన పగిడిద్దరాజు గద్దెను పూజారులు కదిలించిన విషయం తెలిసిందే. గోవిందరాజు గద్దె కదిలించే కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులను, ఇతరులు రాకుండా కట్టడి చేశారు. పునఃనిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయిన తర్వాత గద్దెలపై ఽధ్వజ స్తంభాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేశ్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్ధన్, పూజారులు పాల్గొన్నారు. ఈనెల 24న గద్దెలపై పునఃప్రతిష్ఠ గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 24న పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. గద్దెలను విస్తరిస్తున్న క్రమంలో పూజారులు సమ్మక్క, సారలమ్మ గద్దెలను కదిలించనున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో తిరిగి ఈనెల 24న నిర్వహించేందుకు పూజారులు తేదీ ఖరారు చేశారు. అమ్మవార్లకు పౌర్ణమి మొక్కులు.. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. కాగా, ఈఓ వీరస్వామి మేడారంలో గద్దెల ప్రాంగంణ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు -
నువ్వా..? నేనా..?
● ఫతేషాపూర్ సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ పంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్లు బరిలో నిలిచారు. నువ్వా? నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. 1,237 మంది ఓటర్లు కలిగిన గ్రామం ఈ సారి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ తరఫున అక్కనపల్లి సుజాత, బీఆర్ఎస్ తరఫున అక్కనపల్లి మాధవి నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి ఇద్దరే బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారంది. నువ్వా? నేనా అన్నట్లు పోటీ ఉండడంతో ఇద్దరిలో సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే. గురువారం తమ అనుచరులతో గ్రామంలో వార్డుల వారీగా తోటి కోడళ్లు ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
గీసుకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగు రు దొంగల ముఠా సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న ఓ వ్యక్తిని గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేశా రు. ఈ మేరకు గురువారం గీసుకొండ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా మునూరు ఏసీపీ వెంకటేశ్ వివరాలు వెల్లడించారు. నర్సంపేట ముగ్ధుంపురానికి చెందిన భాదవత్ సా యిచరణ్, వరంగల్ పోచమ్మమైదాన్కు చెందిన ఎం.డి. గౌస్పాషా, కాశిబుగ్గకు చెందిన కోట విశ్వతేజ, వర్ధన్నపేట ఇల్లందకు చెందిన రాయపురం సాయి.. గతంలో చోరీలకు పాల్పడి జైలుకెళ్లిన క్రమంలో మధ్య పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ముఠాగా ఏర్పడి గొర్రెలను అపహరించి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ముందుగానే గొర్రెలు ఉన్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవారు. రాత్రి వేళల్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లను అద్దెకు తీసుకుని అందులో గొర్రెలను తీసుకెళ్లి వర్ధన్నపేట ప్రాంతానికి చెందిన అంగడి వెంకన్న అనే మాంసం వ్యాపారికి అమ్మేవారు. ఇటీవల గీసుకొండ మండల పరిధిలో నాలుగు గొర్రెలను అపహరించారు. అలాగే, కొమ్మాల శివారులో ఇంటి తాళాలు పగులగొట్టి రూ. 1.05 లక్షల నగ దు, ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో రెండిళ్ల తాళాలు పగులగొట్టి కొంత నగదు ఎత్తుకెళ్లారు. గు రువారం ఊకల్ క్రాస్రోడ్డు వద్ద పోలీసులు రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా అందులో గొర్రెల మ లం, వెంట్రుకలు కనిపించారు. దీంతో కారులో ప్ర యాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బహిర్గతమైంది. రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురితోపాటు వారికి సహకరించిన మాంసం వ్యాపారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్, ఎస్సై కె. కుమార్, సిబ్బంది విజయ్, అరవింద్, సాయి, హరి, రజనీకుమార్ను ఏసీపీ అభినందించారు. రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులు -
వరంగల్ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వరంగల్ మీదుగా హజుర్ సాహిబ్ నాందేడ్–కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. 2026, జనవరి 7వ తేదీన హజుర్ సాహిబ్ నాందేడ్–కొల్లం (07133) ఎక్స్ప్రెస్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా 2026 , జనవరి 9వ తేదీన కొల్లం–హజుర్ సాహిబ్ నాందేడ్ (07134) ఎక్స్ప్రెస్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లకు ముద్కెడ్, ధర్మాబాద్, బాక్సర్, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్పడి, జోలుర్పెట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, పొదనూర్, పాల్క్కడ్, త్రిశూరు, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్, కాయన్కూలంలో హాల్టింగ్ కల్పించారు. -
ముగిసిన ఆరు జిల్లాల క్రికెట్ జట్ల ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరుణాపురం సమీపంలోని వంగాలపల్లిలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి అండర్–16 క్రికెట్ ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. ఈ ఎంపికల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో అఫ్జల్, పవన్ సమక్షంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఆరు జిల్లాల తుది జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న ఆరు జిల్లాల జట్లకు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు మొగిలిచర్ల, వంగాపల్లి క్రికెట్ మైదానాల్లో ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేసి హైదరాబాద్లో ఈనెలలో జరిగే హెచ్సీఏ లీగ్ పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు మంచిక అభినవ్వినయ్, శంకర్, కోచ్లు సందీప్నేత్ర, రాజ్కుమార్, మెతుకు కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులూ.. అలర్ట్
వరంగల్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచా యతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో కోడ్ ఎందుకు విధిస్తారు? దానిని ఉల్లంఘిస్తే ఈసీ ఏం చర్యలు తీసుకుంటుంది అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కోడ్ ఎందుకంటే.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే ‘మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్’(ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇదీ ఎన్నికల నియమావళి.. ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం ఉంటుంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ● కోడ్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించొద్దు. ● ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించొద్దు. ● మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ప్రాజెక్టులకు ఆర్థిక గ్రాంట్ను, వాటికి సంబంధించిన హామీలను ప్రకటించొద్దు. ఎక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయొద్దు. మంత్రులు అధికారిక వాహనాలను, యంత్రాంగాన్ని వినియోగించొద్దు. ● ఎవరైనా ప్రభుత్వ అధికారి, సిబ్బంది అధికార మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ● ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు గాని, ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు/చెల్లింపులను మంజూరు చేయొద్దు. ● గృహ నిర్మాణ పథకం మంజూరై, పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సాయం అందాలి. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులను ప్రకటించొద్దు. సహాయాన్ని అందించొద్దు. ● కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైఫ రీత్యాలు సంభవిస్తే బాధితులకు ఎస్ఈసీ అనుమతితో ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. ఎలా మొదలైంది.. 1960 కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’(ఎంసీసీ)మొదలైంది. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అంగీకారం తెలిపిన తర్వాతే ప్రవర్తనా నియమావళిని సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి నిబంధనలను పాటించాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాత, 1967 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవర్తనా నియమావళిని అనుసరించారు. నగదు రూ.50 వేలకు మించి ఉండొద్దు.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేకపోతే ఆ డబ్బులను పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో లభించిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువ ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బులను కోర్టులో జమ చేస్తారు.కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికలకు దూరమే.. అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు నేరం రుజువైతే జైలు శిక్ష కూడా.. రూ.50 వేలకు మించి తరలించొద్దు..గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులూ అలర్ట్గా ఉండాలి. లేదంటే ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(కోడ్) ఉల్లంఘించిన వారిని పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయొచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడొచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. -
శుభముహూర్తం ఎప్పుడు?
● నామినేషన్ దాఖలుకు పురోహితుల వద్దకు వెళ్తున్న అభ్యర్థులు.. పాలకుర్తి టౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో ఈ నెల 3వ తేదీన మూడో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు శుభముహూర్తం చూసుకుంటున్నారు. పురోహితులను కలిసి పేరు బలం తెలుసుకుంటున్నారు. నామినేషన్ దాఖలు చివరి రోజైన 5వ తేదీ శుక్రవారం కావడంతో తిథి పాడ్యమి ఉండడంతో ఆ రోజు ఎక్కువ మంది మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల విజయ ముహూర్తం ఉందని పురోహితుడు దేవగిరి సంతోష్శర్మ తెలిపారు. -
నాకు యాదికొత్తాంది!
గీసుకొండ: నా పేరు బత్తాయిల సాంబయ్య! గ్రామపంచాయతీ ఎన్నికలకు మా ఊర్ల నామినేషన్లు ఏత్తాండ్లని తెలిసి మా పెద్దలు చెప్పిన మాటలు యాదికొత్తానయ్.. మా చిన్నతనం ఊర్లర్ల మొగుడు, పెళ్లం (భార్యాభర్త) పంచాయితీలు, అన్నదమ్ముల నడుమ ఆస్తి, భూముల పంపకాల గొడవలు, గెట్ల పంచాయితీలను పెద్ద మనుషులు చేసేటోండ్లు. ఆ పెద్ద మనుషులళ్ల మంచోళ్లను ఊరి జనం సర్పంచ్గా నిలబెట్టి గెలిపించేటోళ్లట. పైసా ఖర్చు లేకుంట మంచి తనాన్ని చూసి జనాలు ఓటు ఏసేటోరట.. గందుకనే అప్పట్ల ఊర్లళ్ల ప్రశాంతంగా ఉండేదని పెద్దలు జెప్పంగ ఇన్న.. వారికన్నా ముందుగాల పంచాయతీ ఎన్నికలు ఎలాగుండేవో నాకు తెల్వదు. దొరలు రాజ్యమేలిండ్లని మా తాతముత్తాతలు మాట్లాడుకునేటోళ్లు.. సర్పంచ్ అంటే గ్రామం గురించి పని చేసే పెద్దాయని అని అనుకునేటోళ్లు. ఇప్పుడైతే పేదోడు, డబ్బు లేనోడు సర్పంచ్ అయ్యే అవకాశమే లేదు. గాంధీ తాత నిలబడ్డా కష్టమే అంటాండ్లు. గ్రామాల్లో భూములు, జాగలు, డబ్బున్లోళ్లదే రాజ్యం. గందుకనే ఓటరును జేబుల ఏసుకోవడానికి డబ్బును ఎరగా ఏత్తాళ్లు. ఓటుకు రూ. వెయ్యే కాదు రూ. 5 వేలు ఇచ్చేందుకు ఆల్లు ఎనకడుగు ఏయడం లేదు. సర్పంచ్ పదవంటే అంగట్ల సరుకుగా మారిపోయిందంటున్నారు. అవసరమైతే అర్రాజు(వేలం) పాడి సర్పంచ్గా అయిదం అనుకునేటోల్లూ ఉన్నరు. గ్రామానికి మొదటి పౌరుడంటే నాటి అర్థమే మారిపోయిందని జనాలు గుబులు పడుతాండ్లు. సర్పంచ్ అనేటోడు ఊరికి ఉపకారం జేసే పనులు జేయాలని కోరుకుంటాండ్లు అమాయక జనాలు. ● జీపీ ఎన్నికలపై ఓటరు అభిప్రాయం -
నిబంధనల మేరకు దివ్యాంగులకు అవకాశాలు
● కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిబంధనల మేరకు దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తామని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూ దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో గురువారం సెనేట్హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిపాలన భవనంలో లిఫ్ట్ సదుపాయం కల్పించామని, హ్యూమనిటీస్, దూరవిద్య కేంద్రంలో కూడా కల్పించబోతున్నట్లు వెల్లడించారు. క్రీడా రంగంలో భాగంగా పారా ఒలంపిక్ క్రీడలు నిర్వహించాలని యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్కు సూచించారు. పరిశోధకులు, ప్రొఫెషనల్ విద్యార్థులకు క్యాంపస్లో ఇంటర్నెట్ సదుపాయాలు బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. చదువు, క్రీడలకు వైకల్యం అడ్డు కాదు.. చదువు, క్రీడలు, తదితర రంగాల్లో ప్రతిభచూపేందుకు వైలక్యం అడ్డుకాదని, సంకల్పమే శక్తిగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని రాష్ట్ర దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. తమకు అందుబాటులో ఉ న్న జీఓలను దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు. పీహెచ్డీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన దివ్యాంగ అభ్యర్థులకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగావకాశాలు కూడా కల్పించేలా ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, దివ్యాంగుల సెల్డైరెక్టర్ రాజు, కేయూ పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, యూని వర్సిటీ క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి, దివ్యాంగ విద్యార్థి అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, బాధ్యుడు రాంబాబు పాల్గొన్నారు. కాగా, తెలుగు విభాగంలో పీహెచ్డీ పూర్తిచేసిన శారద, పదో ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్ మాచర్ల కృష్ణవేణిను అతిథులు సన్మానించారు. -
ఏకగ్రీవంపై నజర్ !
సాక్షి, మహబూబాబాద్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. కొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పోటీలో నిలబడి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక పరంపర కొనసాగుతోంది. అయితే పోటీలో నిలబడి డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకని, ఏకగ్రీవంగా ఎంపికై తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పెద్దల సమక్షంలో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులను ఒప్పించి పలు పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. పంచాయతీల ఏకగ్రీవం మొదటి విడత ఎన్నికలు జరిగే 155 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. అయితే ఇప్పటి ఐదు మండలాల పరిధిలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గూడూరు మండలం రాజనపల్లి, కేసముద్రం మండలం క్యాంపుతండా, ఇనుగుర్తి మండలం రాములుతండా, నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెం, మహబూబాబాద్ మండలం రెడ్యాల, సికింద్రాబాద్ తండాల నుంచి ఒకే ఇక అభ్యర్థి పోటీలో ఉండగా ఏకగ్రీవంగా అయినట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు రెండో విడత, మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునేందుకు మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. అభివృద్ధికి నిధులు గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన సర్పంచ్ పదవి ఇస్తే గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తానని పలువురు అభ్యర్థులు ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామంలో గుడి, చర్చి కట్టించేందుకు నిధులు ఇస్తానని అంగీకారం చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామ పెద్దల సమక్షంలో అగ్రిమెంట్లు కూడా రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మరికొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు స్థలం లేక ఆగిపోయాయి. ఏకగ్రీవంగా సర్పంచ్ని చేస్తే మూడు గుంటల ఇంటి స్థలం ఇస్తానని ప్రకటించడంతో అగ్రిమెంట్ చేసుకొని ఆ గ్రామంలో ఇతర సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మరొక గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థిని కాంగ్రెస్ లో చేరుతాననే ఒప్పందంపై ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. వీటితోపాటు అధికార పార్టీలో కీలకంగా పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవ సర్పంచ్ చేస్తే ప్రభుత్వ నిధులు ఇస్తానని, గ్రామంలో ఉన్న పెండింగ్ పనులు, సొంత ఖర్చులతో గుడి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో ఆ గ్రామాల్లో ఇతర పార్టీల మద్దతుదారులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కోతులను పట్టిస్తానని, మరికొన్ని గ్రామాలు, తండాల్లో దర్గమ్మ, రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం సొంత ఖర్చులతో నిర్మిస్తామని ఎర వేస్తూ సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పలువురు అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో రూ. 5లక్షల నుంచి రూ. 20లక్షల వరకు డిపాజిట్ కూడా చేసి సర్పంచ్ ఏకగ్రీవానికి కు సిద్ధం అవుతున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఐక్యతారాగంమహబూబాబాద్ రూరల్ : అధికారపక్షం, ప్రతిపక్షం ఐక్యతారాగం వినిపించిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల, సికింద్రాబాద్ తండా గ్రామాల పరిధిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రెడ్యాల, సికింద్రాబాద్ తండా గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరించారు. కాగా. బుధవారం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన సందర్భంగా సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేఎస్ఎన్ రెడ్డి తమ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో రెడ్యాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఐలబోయిన లక్ష్మి, సికింద్రాబాద్ తండా గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నూనావత్ ఇస్తారిని ఏకగ్రీవ సర్పంచ్లుగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రెడ్యాల జీపీ పరిధిలోని పది వార్డులు కాంగ్రెస్ పార్టీ, సికింద్రాబాద్ తండా జీపీ పరిధిలోని ఎనిమిది వార్డుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని హామీ గుడి నిర్మాణం, గ్రామ పంచాయతీలకు స్థలం ఇచ్చేందుకు అంగీకారం గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందాలు ఏకగ్రీవంగా పంచాయతీల కై వసం -
స్లాబ్ పైనుంచి టెంట్పైకి దొర్లిన రెండేళ్ల బాలుడు
● అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం కేసముద్రం: రెండేళ్ల బాలుడు మెట్ల మీదుగా స్లాబ్పైకి ఎక్కి టెంట్ పైకి దొర్లిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధి గిర్నితండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బి.గణేశ్, కల్యాణి దంపతుల ఇంట్లో అయ్యప్ప పీఠం పూజ సందర్భంగా అయ్యప్ప మాలధారులను భిక్షకు పిలిచారు. ఈ మేరకు ఇంటి ఆవరణలో స్లాబ్కు దగ్గరగా టెంట్ వేసి కింద పూజ నిర్వహిస్తున్నారు. ఆ దంపతుల కుమారుడైన రెండేళ్ల రిత్విక్ మెట్ల మీదుగా స్లాబ్పైకి ఎక్కాడు. స్లాబ్ చివరకు వచ్చిన ఆబాలుడు ఒక్కసారిగా టెంట్పైకి దొర్లాడు. దీంతో టెంట్ మధ్యకు చేరుకున్న ఆ బాలుడు ఏడువగా.. తల్లిదండ్రులు స్లాబ్ పైకి ఎక్కి చూడగా టెంట్ మధ్యలో బాలుడు కూర్చుని ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. చాకచక్యంతో ఆ బాలుడిని పట్టుకుని కిందకు దింపడంతో ప్రమాదం తప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయ్యప్పస్వామే తమ కుమారుడిని కాపాడంటూ తల్లిదండ్రులు కొడుకుని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళ ఆత్మహత్య గీసుకొండ: మండలంలోని బాలయ్యపల్లెకు చెందిన రాగిరి సదాలక్ష్మి(59) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సదాలక్ష్మి భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతోంది. అలాగే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీనిపై మనస్తాపం చెందిన సదాలక్ష్మి మంగళవారం వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ బుధవారం తెలిపారు. -
ఖర్చుకు పైసలెట్లా?
సంగెం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్లు, పరిశీలన పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు తమ నాయకులు, అనుచరులను బరిలో దింపారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది. తమ గెలుపు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ముందుకొస్తున్న అభ్యర్థులు తమ ఆస్తులను తనఖా పెట్టడానికి, కొందరు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. రూ.10 నుంచి రూ.30 లక్షలకు పైగా ఖర్చు.. చిన్న పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసేందుకై నా వెనుకాడడం లేదు. జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్ కీలకం కావడం.. నిధులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఖర్చుచేయనుండడంతో పోటీకి సై అంటున్నారు. ఒక వేళ ఓడిపోతే సెంటిమెంట్తో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పదవి దక్కుతుందనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. గెలిచినా.. ఓడినా కష్టాలే.. డబ్బులు భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వారికి మొదట పదవి ఆనందపరిచినా, వెంటనే అప్పులు తీర్చడం మొదటి ప్రాధాన్యతగా మారనుంది. ఓడిపోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అప్పులు చెల్లించలేక కుంటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల్లో యథేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసి గెలిచినా, ఓడినా ఇరువురు అభ్యర్థులు సైతం కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. పోటీ చేసిన అభ్యర్థులు సంయమనం పాటించి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే కంటే నిజాయితీగా ప్రచారం చేసి నిస్వార్థంతో సేవ చేస్తామని ఓట్లు పొందితే బాగుంటుదని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు కూడా ఎన్నికల సమయంలో వచ్చే మద్యం, డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు తప్పవని ఆలోచించాలి. అందుకే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సేవ చేసేవారికి ఓట్లు వేసి ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు ఆస్తుల తనఖాకు సిద్ధమవుతున్న పోటీదారులు -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
● ఎస్పీ శబరీష్ కురవి: జిల్లా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం రాత్రి కురవి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులు, స్థానిక రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను, మద్యం, డబ్బు పంపిణీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలిగించే యత్నాలు చేసినా పోలీసులు చూస్తు ఊరుకోరని తెలిపారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, బహుమతుల రూపంలో ప్రలోభా లకు గురిచేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. యువత సమాజంలో మార్పునకు దారి చూపే శక్తిగా ఉండాలని, అక్రమ పద్ధతులకు దూరంగా ఉండి స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు. ఎన్నికల రోజు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అదనపు సిబ్బంది నియామకం, 24/7 కంట్రోల్రూం మానిటరింగ్ వంటి ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్పయ్య పాల్గొన్నారు. జాగృతి కళాకారులు పాటలు పాడి అవగాహన కల్పించారు. మహబూబాబాద్లో.. మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామాన్ని బుధవారం రాత్రి ఎస్పీ శబరీష్ సందర్శించారు. గ్రామ వీధుల్లో తిరిగి సీసీ కెమెరాలను పరిశీలించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు ఎన్నికల సమయంలో గ్రామంలో జరిగే ప్రతీ కదలికపై నిఘా పెట్టడానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో సెన్సిటివ్, హై సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వారు, రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ వెంట డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తుపాను సాయం అందించండి
హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాను కారణంగా వరంగల్ నగరానికి తీవ్ర భారీ నష్టం వాటిల్లిందని, తక్షణమే సాయం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్సభలో జీరో అవర్లో గళమెత్తారు. మోంంథా తుపాను కారణంగా వరంగల్ నగరంలో 200 మీల్లీ లీటర్ల భారీ వర్ష కురిసిందని, తద్వారా నగరంలో 45 కాలనీలు నీట మునిగాయని వివరించారు. కొన్ని చోట్ల రహదారులు నదులుగా మారాయని, ఓ గర్భిణినీ ట్రాక్టర్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలో అమృత్, స్మార్ట్సిటీ పథకాల ద్వారా చేపట్టిన డ్రైనేజీ పనులు 66 శాతం మాత్రమే పూర్తికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రణాళిక వైఫల్యమే అని పార్లమెంట్లో తెలిపారు. అమృత్ 2.0 ద్వారా ప్రత్యేక నిధులు మార్చి 2026లో విడుదల చేయాలని, జీడబ్ల్యూఎంసీ, మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్కు ఆదేశించాలని, రహదారుల పునఃనిర్మాణానికి రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. హెరిటేజ్, స్మార్ట్సిటీ అయిన వరంగల్ ఏటా వర్షాలతో నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య -
ప్రీ ప్రైమరీ ఆలస్యం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఇతర జిల్లాలో ప్రక్రియ పూర్తి చేసుకొని పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా.. జిల్లాలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే ఉన్నట్లు తెలిసింది. టెండర్ దశలో మెటీరియల్ కొనుగోలు.. పుట్టగొడుగుల్లా వెలసిన ప్రైవేట్ కిడ్స్ పాఠశాలలకు దీటుగా నిరుపేద కుటుంబాల పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించేందుకు జిల్లాలో 22 ప్రీప్రైమరీ పాఠశాలలు మంజూరు చేశారు. ఇందులో పిల్లలు కూర్చునేందుకు కుర్చీలు, గ్రూపు టేబుల్స్, టీచర్ టేబుల్, మెటీరియల్ స్టోరేజీ రాక్స్, పుస్తకాలు భద్రపరిచే రాక్స్, ప్లే మెటీరియల్ డబ్బాలు, ఔట్డోర్, ఇండోర్ క్రీడా పరికరాలు, చదవడం, రాయడానికి ఉపయోగించే మెటీరియల్తో పాటు సెంటర్లో ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయించడం కోసం నిధులు మంజూరు చేశారు. మొత్తం ఒక్కో పాఠశాలకు రూ. 1.70లక్షలు కేటాయించారు. మెటీరియల్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెల నాల్గో తేదీ వరకు టెండర్లు వేయడం.. తర్వాత కాంట్రాక్టర్కు అప్పగించనున్నారు. పూర్తి కాని టీచర్, ఆయాల నియామకం ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేసేందుకు ఒక టీచర్, ఒక ఆయా అవసరం. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగా టీచర్ పోస్టులకు 252మంది, ఆయా పోస్టులకు 99 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీచర్లు, ఆయాల ఎంపిక కోసం తమ అనుచరులకు అవకాశం ఇవ్వాలని పలుచోట్ల రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ ఏడాది ప్రారంభిస్తేనే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువు చెబుతున్నారు. అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలో బోధన జరపడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పూర్వ ప్రాథమిక దశ బోధన లేదు. ఇందుకోసం ఏర్పాటు చేసే ప్రీప్రైమరీ పాఠశాలలు ఈ ఏడాది ప్రారంభిస్తేనే.. వచ్చే విద్యా సంవత్సరం వరకు పుంజుకునే అవకాశం ఉంది. పాఠశాలలు ప్రారంభించి చిన్నపిల్లలకు మెరుగైన బోధన అందిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలను పంపిస్తారు. కానీ, ఈ ఏడాది పాఠశాలల ఏర్పాటులో జాప్యం కావడంతో.. విద్యా సంవత్సరం ముగింపు వరకై నా పాఠశాలలు ప్రారంభించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ముందుకు సాగని ప్రక్రియ పూర్తికాని మెటీరియల్ కొనుగోలు టెండర్లు టీచర్, ఆయాల ఎంపికలో జాప్యం ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభిస్తేనే వచ్చే ఏడాదిలో ఫలితాలుప్రక్రియ మొదలైంది జిల్లాలో 22 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు అయ్యాయి. టీచర్, ఆయాల నియామకం కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. మెటీరియల్ కొనుగోలుకు టెండర్ పిలిచాం. ఆ ప్రక్రియ పూర్తి కాగానే మెటీరియల్ వస్తుంది. త్వరలో జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. – రాజేశ్వర్, డీఈఓ -
మార్కెట్ హమాలీలకు ఇన్సూరెన్స్ కల్పించాలి
వరంగల్: Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*-ÎÌSMýS$ VýS$Ç¢…ç³# M>Æý‡$z-ÌS-™ø´ër$ C¯]l*ÞÆð‡¯ŒæÞె¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS° Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ VýS$…ò³ÍÏ Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… H¯]l$-Ð]l*-Ð]l¬ÌS Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS A«§ýlÅ-„ýS$yýl$ çßæïœgŒæ B«§ýlÓ-Æý‡Å…ÌZ °Æý‡-çܯ]l ^ólç³-sêtÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ Ð]l*sêÏ-yýl$™èl* Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡P-sŒæ-ÌZ §é§éç³# 6ÐólÌS Ð]l$…¨ çßæÐ]l*Î, §ýlyýl$-Ð鯇$$, ïÜÓç³-ÆŠæ, ^ér, GyýlÏ-º…yýlÏ M>ÇÃMýS$-Ë$ ç³°^ól-çÜ$¢-¯é²-Æý‡-¯é²Æý‡$. AÆý‡$á-OÌñæ¯]l çßæÐ]l*-ÎÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$ CÐéÓ-ÌS° Mö¯ól²-â¶æ$Ï-V> yìlÐ]l*…yŠæ ^ólíܯ]l ÐéÆý‡…-™é Ð]lĶæ$çÜ$ Oò³ºyìl ç³°^ól-Ķæ$-Ìôæ° íܦ†MìS ^ólÆý‡$-MýS$-¯é²-Æý‡-¯é²Æý‡$. ÐéÇ Ý릯]l…-ÌZ Ð]l_a¯]l Mö™èl¢ çßæÐ]l*Î M>ÇÃMýS$-ÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$, VýS$Ç¢…ç³# M>Æý‡$z, C¯]l*Þ-Æð‡¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS-¯é²Æý‡$. ™ðlÌS…V>׿ Æ>çÙ‰ çßæÐ]l*Î, §ýlyýl-Ð鯇$$, ^ér, ïÜÓç³ÆŠ‡Þ Ð]lÆý‡PÆŠ‡Þ ĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$-Ë$ §éÐðl$Æý‡ MýS–çÙ~, í³rtÌS Ððl…MýS¯]l², VýS…«§ýl… ¿êçÜP-ÆŠæ, ÔóæQÆŠæ, }°Ðé‹Ü, MýS$Ð]l*-ÆŠæ, Æ>…»êº$, Æ>k, f¯éÆý‡ª¯Œl, Æ>k, MýSÐ]l$-ÌêMýS-ÆŠæ, Ð]l$¯øçßæ-ÆŠæ, §éçÜ$, çܨ, çÙ…Ô¶æ$ ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వరుడు -
ప్రజాసేవ కోసం ఉద్యోగానికి రాజీనామా..
మరిపెడ రూరల్: ప్రజా సేవ చేయలనే దృఢ సంకల్పంతో ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. విషయం తెలియగానే గ్రామానికి చెందిన రాములమ్మ అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి మరో 8 ఏళ్లు సర్వీస్ ఉన్నట్లు ఆమె తెలిపారు. కాగా, ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెను గ్రామస్తులు అభినందించారు. గాలివారిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా రాములమ్మ నామినేషన్ దాఖలు -
అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు..
నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో జన్మించిన మాధవరెడ్డి.. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1981లో అమీనాబాద్ సర్పంచ్గా గెలుపొంది ప్రజాసేవలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ, నిబద్ధత గల నాయకుడిగా కొనసాగుతూ 1995లో డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా కొనసాగుతూ డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. అయినా 2014లో నమ్ముకున్న పార్టీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం లభించలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించాడు. పార్టీ ఆదరించకున్నా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ (బీఆర్ఎస్)లో చేరలేదు. తిరిగి కాంగ్రెస్లోనే చేరి నిజాయితీ గల నాయకుడిగా పార్టీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. గత ఎన్నికలో ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొంది నర్సంపేట అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా అంచలంచెలుగా ఎదిగిన ‘దొంతి’ -
ఆ వృద్ధుడు.. పట్టు వదలని విక్రమార్కుడు
మరిపెడ రూరల్: ఏడు పదుల వయస్సులో కూడా ఓ వృద్ధుడు పట్టు వదలని విక్రమార్కుడిలా సర్పంచ్ పదవికి సై అంటున్నాడు. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. తన నిర్ణయాన్ని గ్రామస్తులు కూడా అంగీకరించారు. ఆయనే మండలంలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ తేజానాయక్. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్గా కావాలనే తన కోరికను గ్రామస్తులకు తెలుపగా వారు అంగీకరించారు. అదేవిధంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రెండున్నర గుంటల స్థలం, భవనానికి దారి, ఖర్చులకు రూ.2 లక్షలు నగదును తాయిలాలుగా ప్రకటించాడు. ఇంకేముంది గ్రామస్తులంతా ఏకగ్రీవానికి మద్దతు తెలపడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు పదుల వయస్సులో కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ ఏకగ్రీవం వైపుగా అడుగులు -
‘గుర్తు’కు మొదటి అక్షరమే ఆధారం
హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే వారికి అధికారులు ఈ విధంగా గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్న్పత్రాల పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అ’ అనే పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థికి అంతకు తర్వాత వచ్చే అక్షరం కంటే ముందు గుర్తును కేటాయిస్తారు. అంటే పేరుకు ముందు ఉండే అక్షరం మేరకు గుర్తుల కేటాయింపు ఉంటుంది.శబరిమల రైళ్ల పొడిగింపుకాజీపేట రూరల్: అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన శబరిమల ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. 2026 జనవరి 3వ తేదీన సిర్పూర్కాగజ్నగర్–కొల్లం (07117) ఎక్స్ప్రెస్, 2026 జనవరి 5వ తేదీన కొల్లం–చర్లపల్లి (07118) ఎక్స్ప్రెస్ వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. 2026 జనవరి 3వ తేదీన వరంగల్, కాజీపేట మీదుగా కొల్లం–చర్లపల్లి (17125) రైలును పొడిగించి నడిపిస్తున్నారు. ఈ రైలుకు కాయన్కుళం, చెంగనూర్, తిరువల, కొట్టాయం, ఎర్నాకులం, అలువా, త్రిశూరు, పాలక్కడ్, పొదనూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలెర్పెట్టయ్, కట్పడి, చిత్తూరు, పాకల్, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట, జనగామ, భువనగిరిలో హాల్టింగ్ కల్పించారు. నారుమడికి నీరు పారించడానికి వెళ్లి.. ● తూములో పడి యువకుడి మృతి ● మాటేడు శివారులో ఘటన తొర్రూరు రూరల్: నారుమడికి నీరు పారించడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు తూములో పడి మృతి చెందా డు. ఈ ఘటన బుధవారం మండలంలోని మాటేడు శివారు బండమీద తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన జాటోత్ సురేశ్(38) తన కుమారుడు హరికృష్ణ, తండ్రి బాలుతో కలిసి నారుమడికి నీరుపారించడానికి మాటేడు పెద్ద చెరువు బొంతుపల్లి తూము వద్దకు వెళ్లాడు. తూము తెరుస్తున్న క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయి పక్కన ఉన్న ము ళ్ల పొదల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు సురేశ్ మృతదేహాన్ని తూము నుంచి బయటకు తీ శారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. -
పెళ్లికుదిరిన 10 రోజులకే అనంతలోకాలకు..
మహబూబాబాద్ రూరల్ /దుగ్గొండి: ఆ యువకుడు ఇంజనీరింగ్ చదివి రైల్వే ఉద్యోగం సాధించాడు. ఉన్నత స్థితిలో ఉండడంతో పదిరోజుల క్రితం పెళ్లి కుదిరింది. అంతలోనే విధి వక్రించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన పీరాల మల్లయ్య, రమ దంపతుల కుమారుడు భగవత్(29) ఇంజనీరింగ్ పూర్తి చేసి గతేడాది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిధిలో గల క్యారేజీ అండ్ వ్యాగన్ విభాగంలో జేఈఈగా ఉద్యోగంలో చేరాడు. ప్రతీ మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గిర్నిబావిలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భగవత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఎదిగొచ్చిన కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో రైల్వే ఉద్యోగి మృతి జమాండ్లపల్లి శివారులో ఘటన గిర్నిబావిలో విషాదఛాయలు -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: విద్యుత్ ఎమ్మార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం (పల్లా రవీందర్రెడ్డి భవన్)లో ఆ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎమ్మార్టీ విద్యుత్ ఉద్యోగుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్టీ ఉద్యోగులకు పదోన్నతి చానల్ పెంచేందుకు చేసిన కృషి ఫలించిందన్నారు. జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతి లభించే అవకాశం వచ్చిందన్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎమ్మార్టీ విభాగంలో కొత్తగా అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఎమ్మార్టీ విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.సారంగపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ ర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్.శోభారాణి, యు.రవీందర్, ఎం.శ్రీదేవి, కార్యదర్శిగా కె.రాజు, సంయుక్త కార్యదర్శులు గా ఆర్.ప్రణయిత, ఎన్.వనజ, డి.సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.అంబేడ్కర్, ఆర్.హరి, ఎస్.కమలాకర్, జా కీర్, కోశాధికారిగా జె.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదెలు, ఎమ్మార్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మద్యం బ్రాండ్ల కొరత
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక వైన్షాపుల్లో కొన్ని బ్రాండ్లకు కొరత ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు భారీగా మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంసీ విస్కీ, ఐబీ, ఓసీ క్వార్టర్ బాటిళ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు ప్రచారం. కొద్ది రోజులుగా మద్యం దుకాణాల్లో ఆయా బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు దొరకకపోవడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీని కలిసిన ‘తెరవే’ బాధ్యులుమహబూబాబాద్ రూరల్: ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శబరీష్ను తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వంగా కలిసి శుభాకా ంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ, కవులు బాణాల వీరయ్య, రేణిగుంట్ల లక్ష్మీకాంతరావు, నాలం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. డీఈఓకు సన్మానంమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఇటీవల డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వర్ను రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, మురళీధర్స్వామి, రమేష్ బాబు, నిరంజన్రెడ్డి, బాణాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కేయూలో నెట్వర్కింగ్ ఆధునికీకరణ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్ నెట్వర్కింగ్ను ఆధునికీకరించేందుకు బీఎస్ఎన్ఎల్కు వర్క్ ఆర్డర్ జారీచేసినట్లు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం బుధవారం తెలిపారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో వర్క్ ఆర్డర్పై విధివిధానాలపై సమీక్షించారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయం కే హాబ్ స్టార్టప్స్, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులు, క్యాంపస్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులు, అలాగే, ఇంజనీరింగ్ కళాశాలల్లో కొనాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్వర్క్ విస్తరించడం లక్ష్యంగా ఈవర్క్ ఆర్డర్ను బీఎస్ఎన్ఎల్కు జారీ చేసినట్లు రామచంద్రం తెలిపారు. క్యాంపస్ నెట్వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో రూ.1.29 కోట్లు యూనివర్సిటీ వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. నేడు మేడారంలో పునఃప్రతిష్ఠాపన పూజలు ఎస్ఎస్తాడ్వాయి: ఇటీవల మేడారంలో పూజారులు పగిడిద్దరాజు పాత గద్దెను కదలించారు.. నేడు గోవిందరాజు పూజారులు సైతం పాత గద్దెను కదలించి నూతనంగా నిర్మించిన గద్దెలపై పునఃప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు గురువారం గద్దెలపై పునఃప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను పూజారులు నిర్వహించనున్నారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజుల పూజారులు వారివారి గుళ్ల వద్ద పూజలు నిర్వహించి మేడారానికి రానున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వరుస క్రమంలో నూతనంగా పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ అఽధికారులు పూజా సామగ్రిని పూజారులకు అందజేశారు. ఈ పూజ కార్యక్రమాలకు గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు ఆడబిడ్డలను ఆహ్వానించనున్నారు. పూజారులు పౌర్ణమికి ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. నేడు పౌర్ణమి సందర్భంగా నూతన గద్దెలపై పునఃప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
దివ్యాంగులను ప్రోత్సహించాలి
మహబూబాబాద్ అర్బన్: సమాజంలో దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో బుధవారం డీడబ్ల్యూఓ సబిత అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని, ప్రపంచ వేదికలపై మన దేశ కీర్తిని చాటారని, వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో శ్రమించి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరారని, దివ్యాంగులు క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పలువురు దివ్యాంగులను సన్మానించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా అధికారి విజయకుమారి, సీడీపీఓలు శిరీష, ఎల్లమ్మ, సూపర్వైజర్లు దైదుషారాణి, పద్మావతి, విజయ, కవిత, భవాని, దుర్గ, అధికారులు రాజు, కమలార్, దివ్యాంగులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో -
మేడారంలో వేగంగా విద్యుత్ పనులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విద్యుత్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. బుధవారం మేడారంలో ములుగు సర్కిల్ పరిధిలోని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 8 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు పూర్తి కా గా, భక్తుల రద్దీ పెరిగే సందర్భంలో విద్యుత్ లోపాలు లేకుండా ఉండేందుకు 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. మిగతా పనులను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అదనంగా మేడారంలోని సమ్మక్క సబ్స్టేషన్లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫా ర్మర్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ అంతరాయం లేకుండా జంపన్న వాగు వద్ద 6 టవర్ల నిర్మాణం చేపట్టగా, అందులో 4 టవర్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ నార్లాపూర్ సబ్స్టేషన్ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పస్రా సెక్షన్ ఆఫీస్లో నిర్మిస్తున్న కంట్రోల్ రూం, డ్యూటీ రూం పనులను పర్యవేక్షించారు. ములుగు ఎస్ఈ ఆనందం, డీఈఈలు సదానందం, పురుషోత్తం , ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, ఈఈ (సివిల్) వెంకట్రామ్ పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులువు.. హన్మకొండ: విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులవని, అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగదారుల ముంగిటకు తీసుకొచ్చామని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పేమెంట్ సిస్టం (కియోస్క్)ను బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సేవలను పూర్తిగా డిజిటల్ వైపునకు మళ్లిస్తున్నామన్నారు. వినియోగదారులు మరింత వేగంగా తమ బిల్లులను చెల్లించుకునేలా రూపొందించిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ (కియోస్క్)ను యూనియన్ బ్యాంకు సహకారంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామని తెలిపారు. త్వరలో మరిన్ని ఈఆర్వో కేంద్రాల్లో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.చరణ్ దాస్, చీఫ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, జనరల్ మేనేజర్లు శ్రీనివాస్, వెంకట కృష్ణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నవీన్ కుమార్, డీఈలు విజయేందర్ రెడ్డి, జి. సాంబరెడ్డి, యూనియన్ బ్యాంకు ఏజీఎంలు వై.శ్రీకాంత్ కుమార్, మహేశ్, చీఫ్ మేనేజర్ పి.వి.చైత్యన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులతో జాతరలో విద్యుత్ పనుల పురోగతిపై సమీక్ష -
40ఏళ్లు ఒక్కరే సర్పంచ్!
సాక్షి, మహబూబాబాద్ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ నాయి ని∙మనోహర్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్ రెడ్డి సర్పంచ్గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. -
బ్యాంకుల్లో రద్దీ..
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలనే నిబంధనతో బ్యాంకులు రద్దీగా మారాయి. మండలంలో మూడో విడత గ్రామ పంచాయ తి ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలనే నిబంధన ఉండడంతో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహులు బ్యాంకుల బాట పడుతున్నారు. దీంతో డోర్నకల్లోని పలు బ్యాంకులు బిజీగా మారాయి. మండలంలో 26 గ్రామపంచాయతీలు, 218 వార్డులు ఉండగా ఎన్నికల్లో భారీ సంఖ్యలో పోటీ చేస్తున్న వారు అకౌంట్ కోసం బ్యాంకుల్లో క్యూ కడుతున్నారు. డీఈఓకు సన్మానంమహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వి.రాజేశ్వర్ను మంగళవారం టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి ముజాహిద్ అలీ, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మ ర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు సీహెచ్. శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎస్బీ.శ్రీనివాస్, ఉమామహేశ్వర్రావు, రమేశ్, జీసీడీఓ విజయ కుమారి పాల్గొన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా తొర్రూరు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా ఉంచుతామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఏ.శ్రీనివాసరావు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ చట్టం అభ్యర్థులకు నిర్ణీత వ్యయ పరిమితిని విధించిందని, అది దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.30 వేల వరకు ఖర్చు చేయాలన్నారు. వ్యయాన్ని ప్రత్యేక ఖాతా ద్వారానే నిర్వహించాలని సూచించారు. నామినేషన్ మొదలు ప్రచారం ముగిసేవరకు అభ్యర్థుల వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సమావేశంలో తహసీల్దార్ గడీల శ్రీనివాస్, ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, డీటీ నర్సయ్య, ఆడిట్ అధికారి వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు తొర్రూరు: నిబంధనలు ఉల్లఘించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా రవాణా శాఖ సహాయ అధికారి శీలం వెంకట్రెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలో మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అధిక లోడు, అతి వేగంతో రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. లెసెన్స్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 4 ట్రాక్టర్లు, ఒక ట్రాలీని సీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదుమహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, జిల్లాలో పార్టీకి ఎదురులేదని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఏఐ సీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరుకాగా.. డీసీసీ అధ్యక్షురాలు భూ క్య ఉమ పాల్గొన్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికై న ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతులమీదుగా నియామక పత్రం అందజేశారు.ఉమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నా రు. జిల్లాలో బూ త్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. -
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా..?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీ(గురువారం)న పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్కలు గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిల్లర్ల ఏర్పాటు పనులన్నీ ఈనెల 3వ తేదీ కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలింది ఒకరోజే.. గోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిగిలింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్ల ర్ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేయడం కనిపించింది. రెండు గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటుతో పాటు డిజైన్కు సంబంధించిన స్టోన్స్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు. రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసిన పూజారులు మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమేఅధికారులు పరిశీలించినా పనులు అంతంతే.. ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంపై ఆర్అండ్బీ శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిల్లర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. -
జర.. తప్పుకోరాదే!
సాక్షి, మహబూబాబాద్: పల్లెపోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు కలిసి పనిచేసిన నాయకులు ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారుతున్నారు. ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన వారిని బుజ్జగించేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తప్పుకోరాదు తమ్ముడు అని కొందరు.. జర తప్పుకోరాదే.. మరో అవకాశం నీకే ఇస్తాం.. ఈ సారి నాకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు. ఇందుకోసం సీనియర్ నాయకులను రాయబేరాలకు పంపిస్తున్నారు. పోటాపోటీగా నామినేషన్లు.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మహబూబాబాద్, గూడూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో పోటా పోటీగా నామినేషన్లు వేశారు. మొత్తం 155 గ్రామ పంచాయతీలకు 1,017 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,338 వార్డులకు 3,334 మంది నామినేషన్లు వేశారు. అయితే వీరిలో అత్యధికంగా ఒకే పార్టీ నుంచి పోటీకి సిద్ధమైన వారు ఉన్నారు. సగటున ఒక్కో సర్పంచ్ పదవికి ఆరుగురికిపైగా నామినేషన్లు వేశారు. నిన్న ఒక్కటిగా.. నేడు పోటీగా.. మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారం.. జిల్లా కేంద్రంలో జరిగే సమావేశాలు, నాయకుల వద్దకు ఒకే మోటారు సైకిల్పై వెళ్లి, ఒకే చోట తిని, తాగిన వారు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతున్నారు. నేనంటే నేను సర్పంచ్ బరిలో ఉంటానని నామినేషన్లు వేశారు. దీంతో ఒక వైపు పోటీ పడుతున్నా.. సొంత పార్టీలోని రెబల్స్తో ఇబ్బంది అవుతుందని భయపడుతున్నారు. నామినేషన్ విత్డ్రా చేయించేందుకు పార్టీ పెద్దలు, కుల సంఘాల నాయకుల వద్దకు వెళ్లి బతిమిలాడుతున్నారు. కొన్నిచోట్ల ఊరికోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి పెద్ద మనుషుల వద్ద డిపాజిట్ పెడుతున్నారు. ఏకగ్రీవం అయితే ఊరి రూపురేఖలే మారుస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే ఇలాంటి వాతావరణం ఒకటి రెండు చోట్ల మినహా.. అత్యధిక గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉండడంతో.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరిస్థితిని గమనిస్తున్నారు. పోటీలో ఉంటే తమ పార్టీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థులకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కబురు పంపుతున్నారు. నేడు విత్డ్రాలు.. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరిరోజు. దీంతో రెబల్ అభ్యర్థులను విత్డ్రా చేయించే పనిలో నాయకులు ఉన్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రివరకు అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎంత చెప్పినా ససేమిరా అంటున్న నాయకులకు ఎంపీటీసీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని హామీలు ఇవ్వడం, ప్రమాణాలు చేయించే పనిలో నాయకులు ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎంత మంది తన నామినేషన్ ఉపసంహరించుకుంటారో.. ఎంత మంది బరిలో ఉంటారో బుధవారం సాయంత్రం వరకు తేలనుంది. రెబల్ అభ్యర్థులతో రాయ‘బేరాలు’ గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందాలు మరో అవకాశం ఇస్తామని బుజ్జగింపులు నేడు మొదటి విడత నామినేషన్ల విత్డ్రాల పర్వం -
నేటినుంచి మూడో విడత నామినేషన్లు
మహబూబాబాద్: జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. కాగా, ఈనెల 3నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 5వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అందుకోసం 51 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఆరు మండలాల్లో 169 గ్రామపంచాయతీలు, 1,412 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు మండలాలు.. జిల్లాలోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 169 గ్రామపంచాయతీలు, 1412 వార్డులు ఉ న్నాయి. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో వారే కీలకం కానున్నారు. పురుష ఓటర్లు 84,140మంది, మహిళా ఓటర్లు 87,350 మంది ఉన్నారు. 3,210 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నేటి నుంచి స్వీకరణ.. ఈనెల 3నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూడో విడత నామమినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 6న పరిఽశీలన, అదే రోజు సాయంత్రం 5గంటల తర్వాత అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తారు. 7వ తేదీన అప్పీళ్లు, 8న పరిష్కారం, 9వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు ఉపసంహరణ, అదేరోజు 3గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేస్తారు. 17వ తేదీన ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటల తర్వాత లెక్కింపు, వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంంది. 51 క్లస్టర్లు ఏర్పాటు.. నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు 51క్లస్టర్లు ఏర్పాటు చేశారు. డోర్నకల్ మండలంలో 7క్లస్టర్లు, గంగారం 3, కొత్తగూడ 8, కురవి 12, మరిపెడ 14, సీరోలు మండలంలో 7 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అందుకుగాను 51 మంది ఆర్వోలు, ఒక ఏఆర్వో, అదనంగా పదిమంది ఆర్వోలు, సపోర్టు స్టాఫ్గా పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లను కేటాయించారు. అర్ధరాత్రి వరకు నామినేషన్లుఆరు మండలాల్లో 169 జీపీలు, 1,412వార్డులు 51క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తి నేటినుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల పర్వం మహిళా ఓటర్లే అధికం -
40ఏళ్లు ఒక్కరే సర్పంచ్!
సాక్షి, మహబూబాబాద్ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ నాయి ని మనోహర్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్ రెడ్డి సర్పంచ్గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. పోటీచేసిన ప్రతీసారి గెలుపే విరమణ తర్వాతనే మరో సర్పంచ్ రికార్డు సృష్టించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట సర్పంచ్ నాయిని మనోహర్రెడ్డి


