Mahabubabad
-
జిల్లా కోర్టు, పోలీసు కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా కోర్టు భవనాల సముదాయ ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ సోమవారం పోలీసుల నుంచి వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలుమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 3నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో సోమవారం డీఎస్ఓ, ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఒకటే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 87 మంది పరీక్ష రాస్తారని, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యుత్, తాగునీరు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.సమావేశంలో పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు, సీఎస్ఓ పూజరి వీరయ్య, డీఓ సంజీవ, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు సబ్ రిజిస్ట్రార్గా నసీమామహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో సోమవారం అదనపు సబ్రిజిస్ట్రార్గా నసీమా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆర్ఓ విభాగంలో పనిచేసే ఆమెను మానుకోటకు అదనపు సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేశా రు. కాగా ఆమెకు దస్తావేజ్ లేకరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు యశ్వంత్, భరత్, సురేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరిపెడ: ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఈ రోజు అవి మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. జూన్ చివరి వరకు రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జాటోతు రాంచందర్నాయక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఐదుగురు ఏఆర్లకు అంతర్గత బదిలీలు
కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్)ను అంతర్గంగా బదిలీలు చేశారు. అలాగే, వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మరో ఏఆర్కు మరో రెండుచోట్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ● యూనివర్సిటీ కాలేజీలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. శ్రీధర్ను పరిపాలనాభవనంలోని టీచింగ్,నాన్టీచింగ్ విభాగాలకు బదిలీ చేశారు. అదనంగా లీగల్ సెల్ బాధ్యతలు అప్పగించారు. ● టీచింగ్, నాన్టీచింగ్ విభాగంలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీహెచ్ ప్రణయ్కుమార్ను సీడీసీ విభాగానికి బదిలీ చేశారు. యూనివర్సిటీ ఫార్మసీకాలేజీ, కేయూ గెస్ట్హౌజ్ అదనపు బాధ్యత అప్పగించారు. ● కేయూ పరీక్షల విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న ఆర్. శ్రీలతాదేవిని పరిపాలన భవనంలోని అకౌంట్స్ విభాగానికి బదిలీచేశారు.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ కార్యాలయం అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకౌంట్స్ విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న కె.శ్రీలతను హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీకి బదిలీ చేశారు. సుబేదారి యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ ఇంజనీరింగ్కాలేజీ(కోఎడ్యుకేషన్) ఏఆర్గా పనిచేస్తున్న బి. నేతాజీని పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. అలాగే, అదే ఇంజనీరింగ్కాలేజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకడమిక్ బ్రాంచ్లో ఏఆర్గా పనిచేస్తున్న కోలశంకర్ను క్యాంపస్లోని యూనివర్సిటీ కాలేజీ, అలాగే ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలు కూడా.. మరో ఏఆర్కు సైతం అదనపు బాధ్యతలు -
వైద్యసేవలు సమర్థవంతంగా అందించాలి
ఖిలా వరంగల్: పేదలకు వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి స్వస్త్య యోజన సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషన్ (హెచ్వ్యాక్) సిస్టమ్నకు మరమ్మతులు చేసి వెంటనే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖిలా వరంగల్ ఖుష్మహాల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల అనంతరం ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాలలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెద్యసేవలు, ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణపై సమీక్ష -
దూసుకొచ్చిన మృత్యువు
● అతివేగంతో రోడ్డు పక్కకు వెళ్లిన కారు.. ● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు ● కాటారం మండలం గంగారం వద్ద ఘటన కాటారం : కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త ఇద్దరు వృద్ధుల నిండు ప్రాణాలు బలితీసుకుంది. కాలక్షేపం కోసం ఇంటి ఎదుట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారుపాక మధునమ్మ (90), నీలారపు బాలయ్య (65), మల్లయ్య ఆయన మనుమడు ఆరేళ్ల బాలుడు డానియల్తో కలిసి రోడ్డు పక్కన తమ ఇళ్ల ఎదుట చెట్టు నీడకు కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన మొగిళి (కారు డ్రైవర్), మరో ముగ్గురు దైవదర్శనం నిమిత్తం కాళేశ్వరం వెళ్లి అన్నారం బ్యారేజ్ను సందర్శించి దామెరకుంట మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా గంగారం ఎస్సీ కాలనీ వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు అవతలి వైపుగా ఉన్న చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న వృద్ధులపైకి దూసుకెళ్లింది. మధునమ్మ కాలు, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన బాలయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో వృద్ధుడు మల్లయ్య, డానియల్కు సైతం తీవ్ర గాయాలవగా భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయాడు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగా మద్యం తాగి ఉన్నట్లు తెలిసింది. మద్యం మత్తులో అతివేగంతో వెళ్లడంతో ఇద్దరి ప్రాణాలు పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలిని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ మొగిళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనాస్థలిని సందర్శించిన ఎంపీ.. గంగారంలో కారు ప్రమాదం విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఘటనా స్థలిని పరిశీలించారు. ఎస్పీ కిరణ్ఖరేతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రమాదానికి కారమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. -
క్షయ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్: క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులువాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ సబ్ జైలులో సోమవారం నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాటుపడాలన్నారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, ఛాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నవారు తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయవ్యాధి ఉంటే ఆరు నెలలపాటు మందులు వాడితే పూర్తిగా కోలుకుంటారన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయకుమార్, సబ్ జైలు ఇన్చార్జ్ సూపరిండెంటెంట్ భిక్షపతి, డాక్టర్ మౌనిక, డాక్టర్ నర్మద, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, టీబీ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ, శ్వేత, అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ –2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి ఎం. రవిచంద్రారెడ్డి 8వ ర్యాంకు, వి. నాగసిద్దార్థ 13వ ర్యాంకు, పి. సాక్షి 40వ ర్యాంకు, ఎ. అనుశ్రీ 47వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని వారు తెలిపారు. బి. సాయి 68వ ర్యాంకు, బి. భరణి శంకర్ 90వ ర్యాంకు, జి. రాజేశ్ 106వ ర్యాంకు, బి. వినోద్ 115వ ర్యాంకు, ఎం. వెంకటకౌసిక్ 123వ ర్యాంకు, ఎస్. పవన్ 204వ ర్యాంకు, ఎ. సంతోశ్ 265వ ర్యాంకు, బి. వాగ్దేవి 269వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. ఇంకా పలువురు ఎన్నో ర్యాంకులు సాధించారని వారు వివరించారు. భవిష్యత్లో మరింత అత్యత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ ఎంసెట్ , ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వారు తెలిపారు. -
అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు..
● చెరువులో ఈతకు వెళ్లి చిన్నారి మృతి ● చిన్న ముప్పారంలో ఘటన నెల్లికుదురు: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి అనంతలోకాలకు చేరాడు. స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంలో చోటు చేసుకుంది. స్థా నికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్సంపల్లి సాయికుమా ర్, సంధ్య దంపతుల మహబూబాబాద్లో ఉంటున్నారు. వీరికి ఇద్ద రు కుమారులు. మూడు రోజులు క్రితం అమ్మమ్మతో కలిసి చిన్నముప్పారం వచ్చిన సాయికుమార్, సంధ్య దంపతుల కుమారుడు బాహు భరత్తేజ్ (9) సోమవారం స్నేహితులతో కలిసి ఈత కోసం చెరువు వద్దకు వెళ్లాడు. అయితే బాహు భరత్తేజ్ ఈత రాకుండానే చెరువులో దూకాడు. దీంతో స్నేహితులు భయపడి వెళ్లిపోగా బాహు భరత్ తేజ్ నీటిలో మునిగాడు. ఈ విషయం తెలియక బాహు భరత్తేజ్ తాత వెంకటయ్య చేపలకోసం అదే చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో తన మనవడి దుస్తులు చూసి చట్టుపక్కల వారిని పిలిచి చూడగా బాహు భరత్ తేజ్ అప్పటికే మృతి చెందాడు. దీంతో వెంకటయ్య.. తన మనువడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించాడు. గేదెను తప్పించబోయి..మృత్యుఒడికి ● బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం ● ఈదులపూసపల్లి శివారులో ఘటన మహబూబాబాద్ రూరల్ : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు గేదెను తప్పించబోయిన మృత్యుఒడికి చేరాడు. ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందడపడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.దీపిక సోమవారం వివరాలు వె ల్లడించారు. గూడూరు మండలం బొల్లెపల్లికి చెందిన చిల్పూరి హరీశ్ (23) మానుకోటలోని ఆరోగ్య ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఆదివారం తన ద్విచక్రవాహనంపై మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి మీదుగా వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో గేదె అడ్డురావడంతో తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలుకాగా వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈఘటనపై మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇన్నోవేషన్ హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్గా కిరణ్కుమార్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కే హబ్లోని ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంప్లాయిబులిటీ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇన్చార్జ్ కోఆర్డినేటర్గా క్యాంపస్లోని వర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.కిరణ్ఉమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. -
సోమేశ్వరస్వామివారికి నాగాభరణం బహూకరణ
పాలకుర్తి టౌన్: స్వయం భూ శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు మిశ్రమ బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మో హన్ బాబు తెలిపారు. సోమవా రం పాలకుర్తి మండల కేంద్రంలో ని శ్రీసోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అజ్ఞాత భక్తుడు.. రూ.24లక్షల విలువైన 449 గ్రాముల మిశ్రమ బంగారు నాగాభరణం బహూకరించారు. స్వామివారి ప్రాణ మట్టంపై నాగాభరణం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మహా మండపంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బా బుకు అందజేశారు. బంగారు నాగా భరణం సమర్పించిన అజ్ఞాత భక్తుడిని ఈఓ, అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించారు. -
పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజ్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చిందు యక్షగాన కళల వైభవం కోసం పాటుపడినందుకు సన్మానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, గంటా చక్రపాణి, డైరెక్టర్ తరుణ్, ఐఐసీటీ డైరెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చెస్లో దేవాన్ష్కు అంతర్జాతీయ రేటింగ్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన బైరి దేవాన్ష్రెడ్డి చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమాఖ్య ప్రతినిధి పి. కన్నా తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్ష్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ క్లాసికల్ విభాగంలో 1508 రేటింగ్ సాధించడం హర్షణీయమన్నారు. దేవాన్ష్రెడ్డి ఆరుగురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో తలపడి విజయం సాధించారన్నారు. ఈ రేటింగ్ సాధించడంపై తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య సంతోషం వ్యక్తం చేశారు. 4, 5 తేదీల్లో క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ, వరంగల్, జనగా మ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జి ల్లాల అండర్–19 జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 4, 5వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వరంగల్ క్రికెట్ అసో సియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ క్రీడా మైదానంలో నిర్వహించే ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన ఆరు జట్లు, ఉమ్మడి జిల్లా వేదికగా జూన్ రెండో వారం నుంచి నిర్వహించే వన్డే లీగ్ టోర్నమెంట్లో పాల్గొంటాయని తెలి పారు. ఇందులో రాణించిన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ అండర్–19 జిల్లా జట్టుకు ప్రాతినిథ్య వహిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 01, 2006 నుంచి జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవ ద్వారా జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్తో హాజరుకావాలని తెలిపారు. 7న జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అ సోసియేషన్ జిల్లా నిర్వహణ కార్యదర్శి పి. రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించి ఉండాలన్నా రు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు 7వ తేదీ ఉద యం హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్కు ఆధార్ కార్డు, స్కూల్ బోనోఫైడ్, మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో పాటు రూ.300 ఫీజుతో హాజరుకావాలన్నారు. ఉదయం 9గంటలకు వె యింగ్ అనంతరం ఎంపిక పోటీలు ఉంటాయ న్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 10, 11వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
అధిక సాంద్రత సాగు.. లాభాలు బాగు
దుగ్గొండి: తెల్లబంగారంపై మక్కువతో అన్నదాతలు అనదిగా పత్తి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకూ పెట్టుబడి వ్యయం పెరగడం.. నానాటికీ దిగుబడి తగ్గడం.. దిగుబడికి వచ్చినా సరైన ధర లేక పోవడంతో పత్తి పంటపై అన్నదాతలకు ఆసక్తి తగ్గిపోతుంది. అయితే ఈ తరుణంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి అధిక దిగుబడులు సాధించొచ్చని వరంగల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త యు. నాగభూషణం తెలిపారు. రోహిణి కార్తె మొదలు కావడం, రుతుపవనాలు విస్తరించడంతో రైతులు పత్తి పంట సాగు ప్రారంభించారు. మూస పద్ధతికి స్వస్తి పలికి నూతనంగా సాగు చేయాలని ఆయన తెలిపారు. సాధారణంగా రైతులు హచ్చు పద్ధతిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. సాలుకు సాలుకు మధ్య 100 సెంటీమీటర్లు, మొక్కమొక్కకు మధ్య 100 సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు నాటుతున్నారు. ఇలా సాగు చేయడం వల్ల ఎకరా భూమిలో 6 నుంచి 7 వేల మొక్కలు మాత్రమే వస్తున్నాయి. ఈ పద్ధతిలో సాగుతో పత్తి మూడు ధపాలుగా తీయాల్సి వస్తోంది. కూలీల భారం పెరుగుతుంది. పంట కాలం పెరుగుతుంది. రెండో పంట వేసుకునే అవకాశం రావడం లేదు. దిగుబడి ఏటీకి ఏడు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో గతేడాది ఎకరాకు 6 క్వింటాళ్లకు మంచి రాలేదు. అధిక సాంద్రత పద్ధతిలో ఎకరాకు 30 వేల మొక్కలు.. అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే క్రమంలో సాలుకు సాలుకు మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంతో విత్తాలి. ఎకరాకు 4 పత్తి గింజల ప్యాకెట్లు అంటే సుమారు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇలా సాగు చేయడం వల్ల ఎకరా భూమిలో 25 నుంచి 30 వేల మొక్కలు వస్తాయి. పత్తి 40 రోజుల వయసులో, 70 రోజుల వయసులో చమత్కార్ మందును పిచికారీ చేయాలి. చమత్కార్ మందు పిచికారి వల్ల చేనంతా ఒకేసారి కాపునకు వస్తుంది. కాయలన్నీ ఒకేసారి కాస్తాయి. దూది సమయంలో కేవలం ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు అనంతరం మళ్లీ రెండో పంటగా మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయ పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేయడం, సస్యరక్షణ అంతా సాధారణ పద్ధతిలోనే చేసుకోవాలి. ఇలా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధర కొంతమేర తక్కువ ఉన్నా ఆశించిన మేర నికర ఆదాయం ఉండి రైతు లాభాలు పొందుతాడు. ఎకరాకు 25 నుంచి 30 వేల పత్తి విత్తనాలు నాటొచ్చు సాధారణ పద్ధతిలో ఎకరాకు 7 వేలే.. ఎకరాకు 15– 20 క్వింటాళ్ల దిగుబడి -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
కాజీపేట అర్బన్ : విద్యార్థులు సెల్ఫోన్లు వీడి, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు ఆదివారం హంటర్రోడ్డులోని గౌడ హాస్టల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులకు గోపా ( గౌడ అఫిషీయల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారాల అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోపా ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డులు నేటి పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుతున్న విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గోపా అధ్యక్షులు చిర్రరాజుగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, రాష్ట్ర గోపా మాజీ అధ్యక్షుడు విజయ్భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.శ్రీనివాస్గౌడ్, గౌడ ప్రతిభా పురస్కార్ కార్యక్రమ కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్, సీనియర్ నాయకులు పెద్ది వెంకట్నారాయణగౌడ్, బూర విద్యాసాగర్గౌడ్, తాళ్లపెల్లి జనార్ధన్గౌడ్, బోనగాని యాదగిరిగౌడ్, ఏసీపీ నాగయ్యగౌడ్, మార్క విజయ్గౌడ్, పోగాకు అశోక్గౌడ్, సురేశ్, కుమారస్వామి, బత్తిని రమేశ్, అంబాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గౌడ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేత -
టీజీ ఎడ్సెట్–25 ప్రశాంతం
రెండు సెషన్లలో కలిపి 83.79శాతం హాజరుకేయూ క్యాంపస్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఆదివారం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యాన ఆన్లైన్ కంప్యూటర్ సిస్టం ద్వారా నిర్వహించిన ‘టీజీ ఎడ్సెట్’ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని 9 సెంటర్లలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షకు 2,190 మంది విద్యార్థులకు 1,821 మంది(83.15శాతం), మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,110 మందికి 1782 మంది(84.45శాతం) హాజరయ్యారు. రెండు సెషన్లు కలిపి 4,300 మంది విద్యార్థులకు 3,603 మంది (83.79శాతం) హాజరైనట్లు టీజీ ఎడ్సెట్ కన్వీనర్, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రశ్నపత్రాల సెట్ల ఎంపిక కేయూలోని ఎడ్సెట్ కార్యాలయంలో ఉదయం సెషన్ సెట్–ఎ ప్రశ్న పత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, రెండో సెషన్ సెట్–బి ప్రశ్న పత్రాన్ని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి ఎంపిక చేశారు. ఎంపిక కార్యక్రంమలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఇ.పురుషోత్తమ్, ఆచార్య మొహమ్మద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి, విద్యావిభాగం డీన్ రాంనాఽథ్కిషన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పాలకమండలి సభ్యులు బి.సురేష్లాల్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన చైర్మన్, వీసీ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని మోక్షిత ఇన్స్టిట్యూట్, బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, హనుమకొండలోని ఆయాన్ డిజిటల్, నోబెల్ ఇన్స్టిట్యూట్ తదితర పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్రడెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, టీజీ ఎడ్సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి పరిశీలించారు. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
సంగెం: ఒంటరితనం భరించలేక ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లపెల్లి సుశీల, సారంగపాణి(70) దంపతులకు శారద, కుమారస్వామి, రాజు సంతానం. చిన్నతనంలో కుమారుడు కుమారస్వామి చనిపోయాడు. తర్వాత భార్య సుశీల మరణించింది. అనంతరం రేణుకను మరో పెళ్లి చేసుకున్నాడు. కూతురు శారద, చిన్న కుమారుడు రాజు వివాహాలు జరిపించారు. కొంతకాలం తర్వాత కూతురు శారద మరణించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం రెండో భార్య రేణుక సారంగపాణిని వదిలివెళ్లింది. దీంతో కొంత కాలంగా సారంగపాణి చనిపోయిన భార్య సుశీల, కుమారుడు కుమారస్వామి, కూతురు శారదను తలుచుకుంటూ ఒంటరితనంతో మనస్తాపం చెందుతున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత రాజు కుటుంబసభ్యులు ఒకగదిలో సారంగాపాణి మరోగదిలో నిద్రించారు. ఉదయం లేచిన తర్వాత మనవడు వినయ్.. సారంగపాణి గదిలో చూడగా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతోయువకుడు .. ఎల్కతుర్తి: పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో గడ్డిమందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెట్టెం సతీశ్(30) పెళ్లి కావడం లేదని కొంతకాలంగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 29న కుటుంబీకులకు చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో తల్లి మంజుల ఫోన్ చేయగా పొలం వద్ద గడ్డిమందు తాగానని చెప్పాడు. దీంతో హుటాహుటిన పొలం వద్దకు చేరుకుని సతీశ్ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ‘మాయం’
చిన్నగూడూరు: రైతులు ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలవుతుంది. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరుసగా రెండోసారి ధాన్యం బస్తాలు మాయమయ్యాయి. బాధిత రైతులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన బాధిత రైతులు నామ సునీతరాజు, కోల లచ్చమ్మశ్రీను కథనం ప్రకారం.. గత నెల 9న సునీతకు చెందిన 84 బస్తాలు(33 క్వింటాళ్ల 60 కేజీలు), లచ్చమ్మకు చెందిన 38 బస్తాలు(15 క్వింటాళ్ల 20 కేజీలు) మొత్తం 122 బస్తాలు ధాన్యం కాంటా వేవారు. మరుసటి రోజు ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించారు. వే బ్రిడ్జి కాంటా అయిన మరో పది రోజులకు 110 బస్తాలకు కాంటా అయినట్లు ఫోన్కు ఓటీపీ వచ్చిందని మరిపెడ చారి అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 122 బస్తాలకు 110 బస్తాలు కాంటా అయితే మిగతా 12 బస్తాల ధాన్యం ఏమైందంటూ కొనుగోలు కేంద్రం నిర్వహకులను ప్రశ్నించగా వారు పట్టించుకోలేదు. దీంతో తహసీల్దార్ మహబూబ్అలీ, ఎస్సై ప్రవీణ్కుమార్కు ఫిర్యాదు చేశామని బాధిత రైతులు తెలిపారు.● వరుసగా రెండోసారి ఘటన ● పట్టించుకోని కేంద్రం నిర్వాహకులు -
అనాథ బాలబాలికల జీవితాల్లో వెలుగులు
● బాలవికాస మహిళాభివృద్ధి సీనియర్ మేనేజర్ లతకాజీపేట రూరల్ : సమాజంలో బాలవికాస సంస్థ అనాథ (వికాస) బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ మహిళాభివృద్ధి పథక సీనియర్ మేనేజర్ డి.లత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాస సంస్థలో ఆదివారం రూ.9 లక్షలతో 273 మంది అనాథ (వికాస) బాల బాలికలకు నూతన విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి పీజీ వరకు 9 జిల్లాల వారికి అవసరమైన విద్యాసామగ్రితోపాటు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలవికాస అనాథ బాలబాలికలకు చేయూతనిస్తూ వారికి అన్ని విధాలా తోడ్పటునందిస్తూ భవిష్యత్కు బంగారు బాటలు వేస్తోందన్నారు. బాలవికాస తెలుగు రాష్ట్రాల్లో మహిళాభివృద్ధి పథకంలో భాగంగా 1,600 మంది అనాథ బాలబాలికలకు చేయూత నిచ్చిందన్నారు. జనవికాస ప్రెసిడెంట్ లూర్థుమర్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ మనిషి జీవితంలో విద్య అత్యంత విలువైందన్నారు. బాలవికాస బాలబాలికల విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి పథక నుంచి సుజాత, జ్యోతి, అమూల్య, ఐటీ మేనేజర్ శివరాం, తదితరులు పాల్గొన్నారు. -
పశువుల ఎరువుతో భూసారం
పెద్దవంగర: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోతుండడంతో నేలలోని పోషక నిల్వల్లో సమతుల్యత లోపించి ఉత్పాదకత తగ్గుతోంది. చీడపీడలు ఆశించడం.. సూక్ష్మ పోషకాల లోపం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యలు అధికమించాలంటే సేంద్రియ పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వేసవి దుక్కులు దున్నే ముందు.. ఆవులు, గేదెలు, గొర్రెల ఎరువు పంటల సాగులో ఎంతో ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే అద్భుత ఫలితం ఉంటుంది. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతోంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువులఎరువు ఉపయోగపడుతుంది. గ్రామాల్లో ట్రాక్టర్, ఎడ్లబండ్ల సాయంతో ఎరువులను పొలాల్లోకి చేరుస్తున్నారు. భూసారం పదిలం.. సాధారణంగా రైతులు వేసవిలో పశువుల ఎరువు ను వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే స మయంలో ఎండలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా పశువుల ఎరువును పొ లంలో చల్లితే వాటిలో ఉన్న పో షకాలు ఆవిరవుతాయి. అందు కే పశువుల పేడను పొలంలో కు ప్పలు పోసుకోవాలి. భూమిలో తగు తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీంతో భూసారం పెరుగుతుంది. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వా ఉంచే గుణాన్ని అదుపుచేసి పోషకాలు మొక్కలకు అందేలా తోడ్పాటునిస్తుంది. 19,600 ఎకరాల్లో సాగు భూమి.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో సుమారు ఈ ఏడాది 19,600 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశువుల ఎరువునే తమ పొలాలకు వాడుతున్నారు. వేసవి దుక్కులతో మేలు అధిక దిగుబడులు సాధించొచ్చుభూసారం పెరుగుతుందిపశువుల ఎరువుతో భూసారం పెరుగుతుంది. సహజ సిద్ధ పో షకాలు అందుతాయి. నేలలో ని నీటిని నిల్వ ఉంచే గుణం అదుపు చేసి పోషకాలను మొక్కలకు అందే విధంగా సాయపడుతుంది. రైతులు పశువుల ఎరువుతో అధిక దిగుబడులు పొందొచ్చు. వీటితో పండించి పంటను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. గుగులోత్ స్వామి నాయక్, ఏఓ, పెద్దవంగర -
పాముకాటుతో రైతు మృతి
స్టేషన్ఘన్పూర్: పాముకాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని విశ్వనాథపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రపు ఎల్లయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తన వ్యవసాయ బావి వద్ద పశువులకు మేత వేస్తుండగా పాము కాటు వేసింది. గమనించని ఎల్లయ్య యథావిధిగా ఇంటికి వచ్చాడు. కాలుకు కాటువేసిన చోట స్వల్పంగా రక్తస్రావం అవుతుండగా కట్టె గీసుకుందని భావించాడు. అనంతరం కాస్త నలతగా ఉండటంతో పాము కాటు వేసి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా అదేరోజు రాత్రి మృతిచెందాడు. విద్యుత్ తీగలే యమ పాశాలై.. ● తెగిపడిన తీగలు తగిలి వ్యక్తి మృతి ● చెర్లపాలెంలో ఘటనతొర్రూరు రూరల్ : విద్యుత్ తీగలు యమపాశాలయ్యా యి. రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తొర్రూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన వల్లపు అశోక్ (45) శనివారం జలగం మల్లయ్యతో కలిసి పని నిమిత్తం బైక్పై చెర్లపాలెం వెళ్తున్నారు. ఈ క్రమంలో చెర్లపాలెం శివారులో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడి ఉన్నాయి. చూడకుండా బైక్ నడపడంతో తీగలు వాహనానికి తగిలి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తొర్రూరులో ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అశోక్ అదేరోజు రాత్రి మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. ● రూ.14లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం అపహరణఖిలా వరంగల్ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జ రిగింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వరంగల్ గాంధీనగర్లోని వెంకటేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెంది న చాతరాజు రేణుక ఇంటికి తాళం వేసి శనివారం క క్కిరాలపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఇంటికి రాగా ఇంటి తాళం తీసి ఉండడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఎస్సై సురేశ్ క్లూస్ టీమ్తో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరు పరిశీలించారు. బీరువాలో దాచిపెట్టిన ఐదు న్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.14లక్షల నగదు చోరీకి గురైందని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్తవాడలో పదితులాల బంగారం.. రామన్నపేట : వరంగల్ కొత్తవాడలో ఆదివారం సా యంత్రం సక్కుబాయ్ నివాసంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 తులాల వరకు బంగారం చోరీకీ గురైనట్లు బాధితులు తెలిపారు. సుక్కబాయి హైదరాబాద్ వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు ఈ చోరీకి పాల్ప డినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
వన మహోత్సవానికి వేళాయె..
మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం వానాకాలం ప్రాంరభంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ కార్యక్రమం చేపడుతోంది. వానలను దృష్టిలో పెట్టుకుని శాఖల వారీగా లక్ష్యాలను కేటా యించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపులో అధికారులు నిమగ్నమయ్యారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడగానే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 5 మున్సిపాలిటీలు.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా మానుకోట మున్సిపాలిటీ పరిధి గాంధీపురంలో రెండు నర్సరీలు, కురవి రోడ్డులో నర్సరీ, రామచంద్రాపురంలో నర్సరీ ఉండగా.. కేవలం కురవి రోడ్డులో ఉన్న నర్సరీలో 60,000 మొక్కలు ఉన్నాయి. మన్సిపాలిటీలో 30,000 మొక్కలు మాత్రమే నాటడం లక్ష్యం కాగా.. ఇంకా 30,000 అదనంగా ఉన్నాయని సిబ్బంది తెలిపారు. ● మరిపెడ మున్సిపాలిటీ పరిఽధిలో రెండు నర్సరీలు ఉండగా మొక్కలు లేవు. అయితే గ్రీన్ టీం లేకపోవడంతో మొక్కల పెంపకం చేపట్టలేదని సిబ్బంది పేర్కొన్నారు. ● తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు నర్సరీ లు ఉండగా గ్రీన్ టీం లేక మొక్కలు పెంచలేదు. ● డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు నర్సరీలు ఉండగా ఒక నర్సరీలో మాత్రమే 42,000 మొక్కలు ఉన్నాయి. కౌన్సిల్ పదవి కాలం ముగియడంతో గ్రీన్ సభ్యులను తొలగించారు. నిర్వహణ బాధ్యత సిబ్బందికి అప్పగించారు. ● ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. దాని పరిధిలో ఐదు గ్రామాలు ఉండగా ప్రతీ జీపీలో సర్సరీ ఉండగా.. వాటిలో మ్తొతం 42,000 మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీ మున్సిపాలిటీ 30,000 మొక్కలు నాటాలని లక్ష్యం కాగా.. మొక్కలు లేని మున్సిపాలిటీలకు అటవీశాఖ ద్వారా సరఫరా చేయనున్నారు. జిల్లాలో 482 జీపీలు.. 482 నర్సరీలు జిల్లాలో 18 మండలాలు ఉండగా 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఉంది. ప్రతీ నర్సరీలో 8,000నుంచి 10,000 మొక్కలు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. ఆ నర్సరీల్లో ఉన్న మొక్కలు గ్రామాల్లో సరిపోతాయని, ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తారు. మిగిలినవి రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో నాటనున్నారు. అలాగే అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాల్లో నాటనున్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని నర్సరీలో మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు ఆశించిన స్థాయిలో వర్షాలు పడగానే నాటుడే.. జిల్లాలో 50లక్షల మొక్కల లక్ష్యం శాఖల వారీగా కేటాయింపునకు కసరత్తు లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మే 31న కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె .వీరబ్రహ్మచారి, డీఎఫ్ఓ విశాల్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్తో కలిసి సంబంధిత అధికారులతో వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 50,13,500 మొక్కలు నాటే లక్ష్యం ఉందన్నారు. శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించి, పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జీలుగ విత్తనాలు స్వాధీనం
తొర్రూరు: అక్రమంగా నిల్వ ఉన్న జీలుగ విత్తన బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వివరాలు వెల్లడించారు. తొర్రూరు పట్టణానికి చెందిన చదలవాడ ఉపేందర్ అక్రమంగా జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. జనగామ జిల్లా తరిగొప్పుల, బచ్చన్నపేట రైతు సేవా కేంద్రాల ఏజెంట్లు శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ నుంచి క్వింటాకు రూ.8వేలు చెల్లించి 106 బస్తాల్లో రూ.4.50లక్షల విలువైన 63 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కొనుగోలు చేశాడు. ఆ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన వ్యాపారి శేషాద్రికి క్వింటాకు రూ.12 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఈమేరకు తొర్రూరులోని తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేయగా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోదాలు జరిపి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉపేందర్తో పాటు రైతుసేవా కేంద్రాల ఏజెంట్లు శ్రీనివాస్రెడ్డి, సురేశ్, డ్రైవర్లు భూక్య వీరన్న, బానోతు సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. జీలుగ విత్తనాలతో పాటు రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’
మరిపెడ: గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని తొర్రూరు ఆర్డీఓ గణేశ్బాబు అన్నారు. మరిపెడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం డివిజన్ స్థాయి రెవెన్యూ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ హాజరై మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 3నుంచి గ్రామాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదమం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించన్నుట్లు తెలిపారు. రైతులు భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట మండలాల తహసీల్దార్లు కృష్ణవేణి, మహబూబ్ అలీ, రమేశ్బాబు, మరిపెడ ఆర్ఐ శరత్కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తొర్రూరు ఆర్డీఓ గణేశ్బాబు -
వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
కురవి: వేసవి సెలవులు.. ఆదివారం కావడంతో మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో నిలుచున్నారు. దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోగా ఆలయ అధికారులు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. జాతీయ సదస్సుకు ఎంపిక మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 26, 27తేదీల్లో న్యూఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్వహించనున్న సదస్సుకు భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు వి.గురునాథరావు రూపొందించిన పరిశోధన ప్రాజెక్ట్ ఎంపికై ంది. గురునాథరావు రూపొందించిన ప్రాజెక్టు ‘హ్యాండ్స్ ఆన్ ఫిజిక్స్’ను సదస్సులో ప్రదర్శిస్తారు. కాగా రాష్ట్రం నుంచి గురునాథరావు మూడోసారి ప్రదర్శనకు ఎంపికయ్యారు. 2018, 2022లో ఎన్సీఈఆర్టీ సదస్సుల్లో అవార్డులు అందుకున్నారు. ఆయన ఎంపికపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడారంలో విత్తన పండుగ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో పూజారులు విత్తన పండుగ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క పూజారులు, స్థానిక ఆదివాసీలు గ్రామంలోని గ్రామ దేవతలను పసుపు, కుంకుమలతో అలకరించి కంకణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో పూజారుల కుటుంబీకులు, గ్రామస్తులు వన భోజనలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి వేసి పసుపు, కుంకుమలు, సార ఆరగించి ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు, ఆదివాసీ పెద్దలు విత్తనాలు నాటేందుకు ముందుగా వర్షాలు ఏ కార్తెలో బాగా కురుస్తాయని కొత్త మట్టి కుండలో నీటిని పోసి ఒక్కొక్క కార్తె పేరు చెబుతూ ఇప్పపూలను వదులుతారు. నీటిలో ఇప్పపువ్వు తేలితే వర్షాలు అనుకూలంగా కురుస్తాయని ఆదివాసీలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయంగా విత్తన పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. అనంతరం వనంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. విత్తన పండుగతో మేడారంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్, భోజరావు, సిద్ధబోయిన రమేశ్, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, దశరథం, గ్రామస్తులు పాల్గొన్నారు. డొనేషన్ల వసూలుపై చర్య తీసుకోవాలి కేయూ క్యాంపస్: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బాధ్యులు శంకర్ పాల్గొన్నారు. శాతవాహన ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలి గార్ల: గార్ల రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివారం యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రైల్వేస్ సోమన్నకు రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ జర్పుల లచ్చిరాంనాయక్ వినతిపత్రం అందజేశారు. అనంతరం సోమన్నను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. -
గుండెపోటుతో ఏఎస్సై కృష్ణమూర్తి మృతి
కేసముద్రం: కేసముద్రం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై మద్దెర్ల కృష్ణమూర్తి(58) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై మురళీధర్రాజు తె లిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం పోలీస్స్టేషన్లో ఏఎస్సై కృష్ణమూర్తి మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం విధులకు హాజరయ్యాడు. కాగా సాయంత్రం 7.30 గంటలకు గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది సీపీఆర్ చేసి.. 108వాహనంలో మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన క్రిష్ణమూర్తి ప్రస్తుతం హనుమకొండలోని వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఏఎస్సై కృష్ణమూర్తి ఇటీవల రాష్ట్ర పోలీస్శాఖ నుంచి ఉత్కృష్ణ పతకం అందుకున్నాడు. మరికొద్ది నెలల్లో ఆయన రిటైర్మెంట్ ఉంది. కాగా, ఏఎస్సై కృష్ణమూర్తి మృతితో కేసముద్రంలో విషాదం నెలకొంది. -
ఛత్తీస్గఢ్ టు హైదరాబాద్
ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నుంచి ఐరన్ ఓర్ పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలిపోతోంది. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని, పర్మిషన్ ఉందా లేదా అంటూ ఆరా తీశారు. అయితే డ్రైవర్ సెల్ఫోన్లో చూపిన ఆధారాలను చూసి విచారించి వదిలేశారు. గతంలోనే మావోయిస్టులు పలు ప్రకటనల్లో ఖనిజ సంపద తరలిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. కొద్ది రోజులకే ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ తరలిపోతుండడం గమనార్హం. ఖనిజ సంపదను తరలించేందుకే మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా అనే అనుమానాలను పలు ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. -
జోరుగా బెల్లం దందా..
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో నల్లబెల్లం దందా జోరుగా సాగుతోంది. గుడుంబా తయారీ, క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం జిల్లాకు నల్లబెల్లం రవాణా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం యథేచ్ఛగా బెల్లం దందా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా జిల్లాకు రవాణా అవుతోందని, దీనికి పోలీసు, ఎకై ్సజ్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్ఛగా బెల్లం సరఫరా.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన జిల్లాకు చెందిన సుమారు పదిమంది వ్యాపారులు అడ్డదారుల్లో బెల్లం సరఫరా చేస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి ఎ కై ్సజ్, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని తండాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, చిత్తూరు నుంచి నల్లగొండ జిల్లా నుంచి మరిపెడ మీదుగా మహబూబాబాద్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. బెల్లం వ్యాపారమంతా జిల్లాలోని మండలాల శివారు గ్రామాలు, తండాల్లో జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల పరిధి తమదికాదంటే తమదికాదంటూ సాకులు చెబుతూ ఎకై ్సజ్, పోలీసు అధికారులు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారం వారి కనుసన్నల్లోనే కొనసాగుతోందని విశ్వసనీయ సమాచారం. అక్కడ ధర తక్కువ.. ఇక్కడ ఎక్కువ వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నల్లబెల్లం తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాకు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లారీలు, డీసీఎం, ఇతర వాహనాల ద్వారా తెప్పించి టన్నులకొద్దీ క్రయవిక్రయాలు జరిపి కోట్లాది రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటా నల్లబెల్లం ధర రూ.5 వేలు ఉండగా ఇక్కడ ధర రూ.9 వేల నుంచి రూ.10 వేలకుపైగా పలుకుతోంది. కాగా నల్లబెల్లంతో తండాల్లో గుడుంబా తయారీ చేసి అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. కాగా ఎకై ్సజ్, పోలీస్ అధికారులు నల్లబెల్లం రవాణాను కట్టడి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాకు ప్రతీరోజు రెండు నుంచి మూడు లారీల నల్లబెల్లం వస్తుంది. వ్యాపారులు అధికారుల కళ్లుకప్పి వారికి అనువైన ప్రాంతాల్లో డంపు చేసి అక్కడి నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా తండాలకు తరలించి సొమ్ము చేసుకుంంటున్నారు. తనిఖీలు అంతంత మాత్రమే.. జిల్లాలో అధికారులు కొంతమేరకు బెల్లం పట్టుకుని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బడా బెల్లం వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఇష్టమొచ్చినట్లు సాగిస్తున్నారు. రైళ్లు, ఇతర వాహనాల ద్వారా తక్కువ మొత్తంలో బెల్లం తీసుకువచ్చే వ్యాపారులు మాత్రమే అధికారులకు పట్టుబడుతుండగా..పెద్ద మొత్తంలో రవాణా చేసే వారిని పట్టుకున్న దాఖతాలు లేవు. నమోదు చేసిన కేసులు.. జిల్లాలో ఎకై ్సజ్ అధికారులు 15,605 కిలోల నల్లబెల్లం, 1,258కిలోల పటిక, 3,442 లీటర్ల గుడుంబా స్వాధీనం చేకున్నారు.అలాగే 161 వాహనాలను సీజ్ చేసి, 553 కేసులు నమోదు చేసి, 225 మందిని అరెస్టు చేశారు. 2022లో ఏడుగురిపై, 2023లో ఏడుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయగా, మరో 8 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే పోలీస్ అధికారులు 38,940 కిలోల నల్లబెల్లం, 2,251 పటిక స్వాధీనం చేసుకుని, 27 వాహనాలు సీజ్ చేసి, 47 కేసులు నమోదు చేసి 98 మందిని అరెస్టు చేశారు. అక్రమార్కులను ఉపేక్షించేది లేదు.. జిల్లాలో ఎక్కడ కూడా నల్లబెల్లం, ఇతర అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదు. అక్రమ వ్యాపారాలపై నిఘాపెట్టి పోలీసు అధికారులు, సిబ్బంది, టాస్క్ ఫోర్స్, ప్రత్యేక బృందాలతో రైళ్లు, వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. గ్రా మాలు, తండాల్లో నల్లబెల్లం, గుడుంబా రవాణా, క్రయవిక్రయాలపై ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి సమాచారం ఇస్తే ఒక్క కిలో కూడా వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేస్తాం. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ నల్లబెల్లం కట్టడికి ప్రత్యేక చర్యలు జిల్లాలో ఇప్పటివరకు నల్లబెల్లం క్రయవిక్రయాలు, గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నాం. 14 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి 5వేల మందిని బైండోవర్ చేశాం. బైండోవర్ ఉల్లంఘించిన వారితో జరిమానాలు కట్టించాం. నల్ల బెల్లం అక్రమ రవాణాపై ఎకై ్సజ్, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది ప్రతీరోజు దాడులు నిర్వహిస్తున్నారు. రైళ్లలో, యాత్ర రవాణా మార్గాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. – బి.కిరణ్, డీపీఈఓ యథేచ్ఛగా బెల్లం సరఫరా, క్రయవిక్రయాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అధికారుల సహకారంపై అనుమానాలు -
నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వేదికతో పాటు విలేకరులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 8.30గంటలకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 8.45గంటల వరకు కలెక్టరేట్కు చేరుకుంటారు. 8.55గంటలకు ప్రభుత్వ విప్, కలెక్టర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9గంటలకు ప్రభుత్వ విప్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 9.05 గంటలకు జాతీయ గీతాలాపన, 9.10 గంటలకు విప్ ప్రసంగిస్తారు. 9.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.45గంటలకు రైతులకు నాణ్యమై న విత్తనాల పంపిణీ కార్యక్రమం, 9.50గంటలకు జిల్లాలో పదో తరగతి టాపర్స్కు సన్మానం కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10గంటల వరకు కార్యక్రమాలు ముగుస్తాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి విద్యుత్ దీపాలతో కార్యాలయం అలంకరణ ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ -
జవాన్కు ఘన స్వాగతం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న తర్వాత మొదటిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన వీర జవాన్ రొట్టెల మహేశ్కు స్థానిక రైల్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున అతడి మిత్రులు, పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రొట్టెల మహేశ్ ఆపరేషన్ సిందూర్లోపాల్గొని స్వస్థలానికి వెళ్లేందుకు వచ్చారు. స్వాగతం పలికిన వారిలో టౌన్ క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది కాసాని మౌనిక, ఉప్పుల మహేశ్, తుప్పతి వినోద్ కుమార్, తుప్పతి విజయ్ కుమార్, పీసీలు రహీం, అనిల్, నరేంద్ర వర్మ తదితరులు ఉన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం టీస్ఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట ప్రచార జాతాను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడి మనదే–బడి బాధ్యత మనదే అనే నినాదంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు నూతనంగా నియామకాలు చేపట్టి, టీచర్ల కొరత లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు మల్లారెడ్డి, మురళీకృష్ణ, యాకూబ్, స్వప్న, మంజుల, సంజీవ, కుమార్, రాజశేఖర్, ప్రవీణ్, శ్రీనివాస్, వీరస్వామ, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
సౌర విద్యుత్కు ప్రోత్సాహం..
హన్మకొండ: దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు నివాస గృహాలు తమ సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం’ తీసుకొచ్చింది. రూ.75,021 కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని 2026–2027 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు తమ పరిధిలో ఇళ్ల పైకప్పుపై సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులు సౌరశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాయం అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా నెట్ మీటర్ల ఏర్పాటు, ఇన్స్టాలేషన్ను సులభతరం చేశాయి. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఇప్పటి వరకు 3,925 మంది విద్యుత్ వినియోగదారులు 14,014.77 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇంటిపై కప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను గృహ అవసరాలకు వినియోగించుకుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందడంతో పాటు మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి (డిస్కంలకు) విక్రయించి ఆదాయం పొందొచ్చు. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం, పర్యావరణ హిత విద్యుత్ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాయితీ మూడు కిలో వాట్ల వరకు పరిమితం ఈ పథకంలో 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు యూనిట్ ఖర్చులో 60 శాతం, 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు 40 శాతం రాయితీ అందిస్తున్నారు. 3 కిలో వాట్ల సామర్థ్యం తర్వాత ఎలాంటి రాయితీ లేదు. రాయితీ మూడు కిలో వాట్ల వరకు పరిమితం చేశారు. ప్రస్తుతమున్న ధరల ప్రకారం కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ యూనిట్ ఏర్పాటుకు రూ.85,550 అవుతుంది. ఇందులో ప్రభుత్వం రూ.30 వేల రాయితీ అందిస్తుండగా, వినియోగదారుడు 55,500 చెల్లించాలి. 2 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు రూ.1,46,500 ఖర్చు అవుతుంది. 3 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు రూ.2,08,900 ఖర్చు అవుతుంది. 2 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్కు ప్రభుత్వం రూ.60 వేల రాయితీ అందిస్తుంది. వినియోగదారులు రూ.86 వేలు భరించాలి. మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు ప్రభుత్వం రూ.78 వేల రాయితీ అందిస్తుండగా, వినియోగదారుడు రూ.1,30, 900 భరించాలి. మూడు కిలో వాట్ల పైగా సోలార్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.78 వేల రాయితీ అందిస్తుంది. మిగతా ఖర్చులు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతీ వినియోగదారుడు ఈ సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై కప్పు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉండాలి. కిలోవాట్ సోలార్ యూనిట్ ఏర్పాటు ద్వారా నాలుగున్నర యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానళ్ల ద్వారా 15 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మిగులు విద్యుత్ను డిస్కంలకు విక్రయించడం ద్వారా యూనిట్కు రూ.5.25 చొప్పున ఆదాయాన్ని పొందొచ్చు. గృహ వినియోగదారులకు రాయితీపై సోలార్ ప్లాంట్ ఇంటి పైకప్పుపై ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ టీజీఎన్పీడీసీఎల్లో ఇప్పటి వరకు 3,925 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు మార్చి 2027 వరకు దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంపీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనతో ప్రయోజనాలుపీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనతో విద్యుత్ వినియోగదారులతో అనేక ప్రయోజనాలున్నాయి. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్కు మేలు చేసినట్లు అవుతుంది. ప్రధానంగా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. విద్యుత్ బిల్లుల బాధ తప్పుతుంది. ప్రభుత్వం రాయితీ ఇస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ఖర్చు తక్కువవుతుంది. కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్ సర్కిళ్ల వారీగా ఇలా.. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆదిలాబాద్ సర్కిల్లో 331 మంది వినియోగదారులు 1191.67 కిలో వాట్ల సామర్థ్యమున్న సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆసిఫాబాద్లో 21 మంది 75 కిలో వాట్లు, భూపాలపల్లిలో 19 మంది 62 కిలో వాట్లు, హనుమకొండలో 622 మంది 2123.8 కిలో వాట్లు, జగిత్యాలలో 65 మంది 238 కిలో వాట్లు, కామారెడ్డిలో 65 మంది 240.95 కిలో వాట్లు, కరీంనగర్లో 491 మంది 1840.23 కిలో వాట్లు, ఖమ్మంలో 715 మంది 2544.66 కిలో వాట్లు, కొత్తగూడెంలో 441 మంది 1582.82 కిలో వాట్లు, మహబూబాబాద్లో 81 మంది 289.5 కిలో వాట్లు, మంచిర్యాలలో 137 మంది 434.45 కిల వాట్లు, నిర్మల్లో 79 మంది 270.5 కిలో వాట్లు, నిజామాబాద్లో 486 మంది 1795.99 కిలో వాట్లు, పెద్దపల్లిలో 108 మంది 390.3 కిలో వాట్లు, వరంగల్ సర్కిల్లో 219 మంది వినియోగదారులు 791.9 కిలో వాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.సోలార్ ప్యానెళ్లు సూర్యశక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మారుస్తాయి సోలార్ ప్యానళ్ల సూర్యశక్తి ని నేరుగా విద్యుత్ శక్తిగా మారుస్తాయి. సౌర ఫలకాలు ఫొటోవోల్టాయిక్ ప్రభావం ద్వారా సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తాయి. సోలార్ ప్యానళ్లను ఇంటి పైకప్పుపై బిగించుకుని సులువుగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ విద్యుత్ను ఇంటి అవసరాలకు వాడుకోవడంతో పాటు మిగులు విద్యుత్ డిస్కంలకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చు. పి.మధుసూదన్రావు, ఎస్ఈ , హనుమకొండ -
పొదుపు.. భవిష్యత్కు మలుపు
కాజీపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే అనుకునేవారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వావలంబన్ పథకం’కు గృహిణి నుంచి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరూ అర్హులు. ఈ పథకంలో చేరడం వల్ల వృద్ధాప్యంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుత రోజూవారీ ఖర్చులను అధిగమించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సంపాదించే వయసులోనే ఎలాంటి పొదుపు చేకుండా ఉంటే వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో కొడుకులు పట్టించుకోకపోవడం ప్రస్తుతం చూస్తున్నాం. ఆసరా కరువై.. పనిచేసే శక్తిలేక.. ఆర్థిక అండ కరువై ఎంతోమంది వృద్ధులు దుర్భరంగా బతుకుతున్నారు. వయసు పెరగడంతో పాటు జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్థికంగా స్వాతంత్య్రం ఉండాలి. అందుకే ‘స్వావలంబన్’ యోజన పథకంలో చేరితే చక్కటి ఫలితంగా ఉంటుంది. వయసులో ఉన్న సమయంలో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది. పింఛన్ ఇలా పొందుతారు.. ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్ల నిండిన వెంటనే తాము జమచేసిన డబ్బు మొత్తం 60 శాతం నగదును ఒకేమారు చెల్లిస్తారు. మిగతా 40శాతం వారి ఖాతాలో అలాగే ఉంచి, దానిపై వచ్చే రాబడిని జీవితాంతం ప్రతీనెలా పింఛన్ రూపంలో చెల్లిస్తారు. ఖాతాదారుడు మరణిస్తే అప్పటివరకు ఖాతాలో పొదుపు చేసిన మొత్తం నిధిని వారి నామినీకి అందిస్తారు. 60 ఏళ్ల తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న 40శాతం సొమ్మును కూడా వారికే అందజేస్తారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మండలస్థాయి కోఆర్డినేటర్లను నియమించినా ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి సరైన ప్రచారం చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. టోల్ఫ్రీ నంబర్ 1800–110708కు ఫోన్చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.‘స్వావలంబన్ యోజనతో’ వృద్ధాప్యంలో ఆర్థిక అండ 18 నుంచి 60 ఏళ్ల వారు అర్హులు కేంద్ర ప్రభుత్వ పథకంతో భవిష్యత్కు ఆర్థిక ధీమాస్వావలంబన్తో ప్రయోజనాలు.. వృద్ధాప్యంలో పింఛన్ అందజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులందరూ ఈ ఖాతాను తెరిచేందుకు అర్హులు. ప్రతీ పౌరుడు ఏడాదిలో కనీసం రూ.వెయ్యి నుంచి రూ. 2వేలకు తగ్గకుండా పొదుపు చేయాలి. ప్రభుత్వం ఏటా రూ.600 కలుపుతుంది. ప్రతీ ఖాతాదారుడికి ఫొటోతో పాటు పాన్కార్డు (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్)ను ఇస్తుంది. ఈ కార్డుతో ఎన్పీఎస్లో సభ్యత్వం ఉన్నట్లు గుర్తించొచ్చు. ఖాతా తెరిచిన 45 రోజుల్లో ఈ కార్డును పొందొచ్చు.నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్ యోజన పథకం’ వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి దేశంలోని సామాన్యులు సైతం 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. బడుగు, బలహీన వర్గాల వారితోపాటు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న,పెద్ద వ్యాపారులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. వయసులో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో అండగా నిలవనుంది. స్వావలంబన్ యోజన విశిష్టత.. ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా దేశంలోని సామాన్యులు కూడా 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా 2009లో ‘జాతీయ పెన్షన్ స్వావలంబన్ యోజన పథకం’ను ప్రారంభించింది. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● విద్యుత్శాఖ ఎస్ఈ నరేష్ నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్శాఖ ఎస్ఈ జె.నరేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా, కరెంట్ ఆటో జనరేట్ అయ్యేలా పరిశీలించామని, అంతరాయం కలగకుండా ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో జిల్లా కేబుల్ ఆపరేటర్స్తో సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ పోల్స్ ద్వారా కేబుల్ వైర్లు, నెబ్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారని, ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ పోల్స్ వినియోగంపై చార్జీల వసూలుపై ఆపరేటర్స్కు తెలియజేశారు. సమావేశంలో డీఈ విజయ్, ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ఏఈ పాల్గొన్నారు. -
అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్: రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అౖద్వైత్కుమార్సింగ్ అన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ విశాల్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్తో కలిసి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర అవతరణ వేడుకలు, వనమహోత్సవం, భూభారతి చట్టంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ హాజరవుతున్నారని, ప్రొటోకాల్ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలో శానిటేషన్, సౌండ్సిస్టం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై గ్రామ రెవెన్యూ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరించాలని తెలిపారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లాలో వన మహోత్సవం నిర్వాహణకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, డీఏఓ విజయ నిర్మల, డీఎస్సీఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఈఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి సమీక్షలో కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ -
‘పుష్కరాల’ చెత్త తొలగింపు ఏదీ!
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాల్లో చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. గోదావరిలోని ఖాళీ వాటర్ బాటిళ్లు, వ్యర్థాలు తొలగించడం లేదు. దీంతో పశువులు అందులోని వ్యర్థాలు, ప్లాస్టిక్ను తింటున్నా యి. ఫలితంగా పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే కాకుండా అన్నదానసత్రాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహించిన ప్రాంతాల్లో వ్యర్థాలు కుళ్లి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికై నా అధి కారులు స్పందించి దోమలు వ్యాప్తి చెందకుండా చెత్తను తొలగించి, అన్ని వార్డుల్లో రెండు రోజులకు ఒక్కసారి వారం పాటు బ్లీచింగ్ ఫౌడర్ చల్లాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు తీసుకుని దుర్గంధం వెదజల్ల కుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
మేడారం ఈఓగా వీరస్వామి
హన్మకొండ కల్చరల్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈఓగా మేకల వీరస్వామి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు మేరకు శనివారం వరంగల్లోని ధర్మిక భవన్లోని మేడారం సమ్మక్క , సారలమ్మ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓ మేకల వీరస్వామికి వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఉద్యోగ విరమణ పొందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర ఈఓ రాజేంద్రం, మరో ఆలయ ఈఓ వేణుగోపాల్ను ఘ నంగా సన్మానించారు. కా ర్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, ఈఓలు అద్దంకి నాగేశ్వరరావు, వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు -
సమన్వయంతోనే పుష్కరాలు సక్సెస్
భూపాలపల్లి: అధికారులు, ప్రజల సమన్వయంతోనే సరస్వతీనది పుష్కరాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన ‘సరస్వతి పుష్కరాలు ఎ డే ఆఫ్ థాంక్స్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మార్గనిర్దేశంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారన్నారు. పుష్కరాల విజయవంతంలో వారి పాత్ర కీలకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నారు. కొందరు సరస్వతీనది పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న అంశాలను భూతద్దంలో చూపించి తమను బద్నాం చేసేందుకు యత్నించారన్నారు. త్వరలోనే కాళేశ్వరం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పుష్కరాల విజయవంతానికి కృషి చేశారన్నారు. పుష్కరాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్నారు. అనంతరం పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పలు శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అటెండర్ నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు మూడు నెలలు శ్రమించారు పుష్కరాలు విజయవంతం కావొద్దని కొందరు కుట్రలు పన్నారు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
మూగజీవాలను బలి తీసుకున్న విద్యుత్ తీగ
డోర్నకల్: మండలంలోని ఫకీరాతండా సమీపంలో ని వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతానికి శుక్రవారం సాయంత్రం నాలుగు మూగజీవాలు బలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఫకీరాతండా పరిధిలోని బోడ్యాతండా సమీపంలోని తురక వెంకన్న వ్యవసాయ భూమిలో ఫకీరాతండా ఫీడర్కు చెందిన 11కేవీ విద్యుత్తీగ తెగి పడింది. బోడ్యాతండాకు చెందిన బానోత్ శంకర్కు చెందిన ఆవు, చిలుకోడుకు చెందిన బండ్ల జంపయ్య, మిరియాల నరేష్కు చెందిన రెండు గేదెలు మృతి చెందగా అదే సమయంలో అక్కడికి వచ్చిన కుక్క విద్యుత్ తీగను నోట కరుచుకుని మృత్యువాత పడింది. గడ్డి మేస్తూ రాత్రివేళ ఎక్కడో ఉన్నాయని రైతులు భావించారు. కానీ, ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు మృతిచెందిపడిఉన్న పశువులను చూసి యజమానులకు సమాచారం అందించంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బానోత్ శంకర్, బండ్ల జంపయ్య, మిరియాల నరేష్తోపాటు వారి కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని మూగజీవాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆవును రూ.65,000కు కొనుగోలు చేశామని శంకర్ తెలపగా.. ఒక్కో గేదెకు రూ.లక్షకు పైగా చెల్లించి కొనుగోలు చేసినట్లు జంపయ్య, నరేష్ తెలిపారు. గుడిపాటి బంజర గ్రామంలో.. గార్ల: పుల్లూరు పంచాయతీ గుడిపాటి బంజర గ్రామంలో విద్యుదాఘాతంలో శనివారం 2 పాడిగేదెలు మృతిచెందాయి. గుడిపాటి బంజరకు చెందిన చింతల మల్లయ్య ఉదయాన్నే పాడిగేదెలను మేతకు వదిలాడు. గాలిదుమారానికి పుల్లూరు పెద్దచెరువులో విద్యుత్ తీగలు తెగిపడటంతో మేత మేసుకుంటూ వెళ్లిన గేదెలు విద్యుత్ వైరుకు తాకి విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. సంఘటనా స్థలాన్ని విద్యుత్ ఏఈ మహేంద్రబాబు సందర్శించారు. వేర్వేరు చోట్ల ఐదు పశువుల మృత్యువాత కన్నీరుమున్నీరుగా విలపించిన రైతులు -
సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’
హన్మకొండ అర్బన్ : సమాజం అండదండలతోనే తనకు ‘పద్మశ్రీ’ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం శనివారం వరంగల్ చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఎమ్మార్పీస్ శ్రేణులు, ఇతర సంఘాల నాయకులు మంద కృష్ణ దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్లో, రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ మాట్లాడారు. ఈ సంవత్సరంలో ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించడం, తనకు పద్మశ్రీ పురస్కా రం రావడం మాదిగజాతికి గర్వకారణమన్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాకుండా తనకు ఉద్యమంలో అన్ని విధాలా సహకరించిన సమాజానికి కూడా అన్నారు. మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటంలో అనేక ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా బరిలో నిలిచి లక్ష్యం సాధించామన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు .. వర్గీకరణ విషయంలో ముందుండి నడిపిన ప్రధాని మోదీ, సహకరించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలి పారు. ఇది మాదిగ జాతి ఉద్యమ విజయానికి నిదర్శమన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునిపోతూ వర్గీకరణ సాధించామన్నారు. ఈక్రమంలో అనేక వర్గాలు సహకరించాయన్నారు. రా నున్న రోజుల్లో వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ కార్యవర్గ సమావేశం.. వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సుమారు 11గంటల ప్రాంతంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ ఎమ్మార్పీస్ నేతలు, ఇతర ప్రజాసంఘాల ఆఽధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణను సన్మానించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మందకృష్ణను అభినందిస్తూ తీర్మానంచేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యుక్షులు గోవిందు నరేశ్ మాదిగ, రుద్రపోగు సురేశ్ మాదిగ, జాతీయ నేత మంద కుమార్ మాదిగ, బొడ్డు దయాకర్, నరేంద్ర, బొర్ర భిక్షపతి, బుర్రి సతీశ్, రవి, గద్దల సుకుమార్, బండారు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగకు ఘన స్వాగతం ఖిలా వరంగల్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు వరంగల్లో ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన శనివారం రాత్రి ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో వరంగల్ వచ్చారు. రైల్వేస్టేషన్లో దిగిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో రైల్వేస్టేషన్నుంచి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు ర్యాలీగా చేరుకున్నారు. వర్గీకరణ స్వప్నం సాకారమమడం ఉద్యమ విజయం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
యువ వికాసానికి వేళాయె..
సాక్షి, మహబూబాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాస పథకం అమలు తుది దశకు చేరింది. పెద్ద యూనిట్లు కాకుండా చిన్న యూనిట్లతో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రూ.లక్ష లోపు రుణాలు పొందే వారి ఎంపిక ప్రారంభించి జూన్ చివరి నాటికి యూనిట్లు ప్రారంభించనున్నారు. చిన్న పెట్టుబడులకు తొలిఅవకాశం.. రాజీవ్ యువవికాసంలో ఎక్కువ మొత్తంలో సహకారం అందుతుందని భావించి ఎక్కువమంది రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్లకు తొలి అవకాశం ఇచ్చేలా ఎంపిక చేసి ఆ పైన పెట్టుబడుల యూనిట్లను తర్వాత ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీల్లో రూ.50 వేల పెట్టుబడి లోపు 100 శాతం సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం 4,851 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకోగా అన్ని కేటగిరీలు కలిపి కేవలం 684 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదే విధంగా 90శాతం సబ్సిడీతో అందించే రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్లకోసం అన్ని కార్పొరేషన్లకు కలిపి 3,618 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకోగా.. 1,226 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతోపాటు రూ. లక్ష నుంచి రూ.2లక్షల లోపు పెట్టుబడులకోసం 3,120 యూనిట్లు లక్ష్యం కాగా 5,344 దరఖాస్తులు, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల పెట్టుబడుల యూనిట్లు 2,474 లక్ష్యంగా ఉండగా 41,477 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తక్కువ పెట్టుబడి యూనిట్లనే ఎంపిక చేయనున్నట్లు అధికారులు ప్రకటించడంతో తక్కువ పెట్టుబడి దరఖాస్తులు చేసుకొని వెనకబడ్డామని పలువురు యువకులు వాపోయారు. ఈనెల 2 నుంచి ఎంపిక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం కానుకగా యువతకు ఆర్థిక భరోసా కల్పిస్తామని సీఎం ప్రకటించినట్లుగానే ఈనెల 2వ తేదీ నుంచి యూనిట్ల ఎంపిక ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు యూనిట్ల ఎంపిక, చెక్కుల పంపిణీ చేస్తారు. 10వ తేదీ నుంచి ఆయా యూనిట్ల నిర్వహణకు శిక్షణ ఇస్తారు. తర్వా త యూనిట్లు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ అంతా జూన్లో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి యూనిట్లను జూలైలో, తర్వాత రూ.2లక్షలకు పైగా యూనిట్ల ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులు (రూ. 50వేల లోపు..)– శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రేపటి నుంచి యూనిట్ల ఎంపిక వెంటనే శిక్షణ, యూనిట్ల ప్రారంభం కసరత్తు చేస్తున్న అధికారులుకార్పొరేషన్ టార్గెట్ వచ్చిన దరఖాస్తులు ఎస్సీ 543 275 ఎస్టీ 3,685 35 మైనార్టీ 42 55 క్రిస్టియన్ 07 01 బీసీ 295 295 ఈబీసీ 279 23 మొత్తం 4,851 684 రూ. 1లక్షలోపు.. ఎస్సీ 772 53 ఎస్టీ 2,047 233 మైనార్టీ 73 227 క్రిస్టియన్ 14 03 బీసీ 566 679 ఈబీసీ 146 13 మొత్తం 3,618 1,226రూ.లక్ష నుంచి రూ.2లక్షల లోపు (అన్ని కార్పొరేషన్లు) 3,120 5,344 రూ. 2లక్షల నుంచి రూ. 4లక్షల వరకు (అన్ని కార్పొరేషన్లు) 2,474 41,477యూనిట్ల ఎంపిక షురూ.. కార్పొరేషన్ల ద్వారా అందించే ఆర్థిక భరోసా కోసం వచ్చిన దరఖాస్తులను బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ జాబితాలను సిద్ధం చేశాం. జూన్ రెండో తేదీ నుంచి రూ. లక్షలోపు పెట్టుబడుల యూనిట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రతీ ఎంపిక పారదర్శకంగా చేస్తున్నాం. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆ విమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
ఆ సినిమాలకు అవార్డులు తిరస్కరించాలి
న్యూశాయంపేట: పుష్ప –2 సినిమాలో స్మగ్లర్ పా త్ర పోషించిన అల్లు అర్జున్కు, రజాకార్ సినిమాకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులను తిరస్కరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకుడు మో తె లింగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశంలో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను అవమానపరుస్తూ తీసిన రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూములను పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండా పార్టీకే దక్కిందని గుర్తుచేశారు. ఆనాడు పటేల్ సైన్యాలతో గ్రామాలపై విరుచుపడి ప్రజలపై కాంగ్రెస్ పార్టీ దాడి చేసి చంపించిందని, నేడు అదేతీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ తీసిన సి నిమాలకు ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం అమరవీరులను అవమానపరచడమే అని అన్నా రు. అలాగే మూఢనమ్మకాలు, అశాసీ్త్రయ భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చిన కల్కి సినిమాకు కూడా ఉత్తమ సినిమా అవార్డు రావడం భారత సమాజాన్ని మూఢ విశ్వాసాల వైపు తీసుకెళ్లడమేనని చెప్పారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, ఎన్.అశోక్ స్టాలిన్, డాక్టర్ మార్క శంకర్ నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మంచాల రమాదేవి, కర్రె లక్ష్మణ్, మునిగాల భిక్షపతి, బాషబోయిన సంతోష్, జక్కు రాజుగౌడ్, బత్తిని సదానందం పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
బోడకాకర సాగుతో నికర ఆదాయం
మహబూబాబాద్ రూరల్: విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న ఆగాకర (బోడకాకర) సాగుతో అధిక దిగుబడి, నికర ఆదాయం వస్తుందని, చిన్న, సన్నకారు రైతులకు గొప్ప వరం లాంటిదని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బోడకాకర సాగు, ఆదాయం, లాభాలు, ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే అంశాలపై ఆయన వివరించారు. లాభాలు :● బోడకాకర సాగును అన్ని పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. 2 నెలలలోనే పంట చేతికొస్తుంది. 6 నెలల వరకు దిగుబడి ఉంటుంది. ● సీజన్, డిమాండ్ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. ● బోడకాకరలో పోషకాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే బోడకాకర సాగు లాభదాయకం. ● ఒక ఎకరంలో 4 నుంచి 6 నెలల కాలంలో కనీసం రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విత్తనం ద్వారా :● ఇది సులువైన పద్ధతి. విత్తనం మొలక 10 నుంచి 15 శాతంగా ఉంటుంది. అందులో మరలా ఆడ, మగ మొక్కలు ఉంటాయి. ఆడ మొక్కలు 15 నుంచి 20 శాతం ఉంటాయి. ఎకరాకు వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు ఒక అడుగు చొప్పున దూరంలో నాటడానికి 1,000 ఆడ మొక్కలు అవసరం అవుతాయి. దీనికి 3 వేల మొక్కలు అనగా 9 వేలు (మొలక 30 శాతం) గింజలు కావాలి. ఈ విధంగా ఎకరాకు అరకుంచం విత్తనం అవసరమవుతుంది. పొలంలో వరుస వరుసకు ఆరు అడుగులు, పాదు పాదుకు మధ్య ఆరు అడుగుల దూరంలో నాటిన స్తంభాల మధ్య వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు మధ్య రెండు అడుగుల చొప్పున 16 మొక్కలు వస్తాయి. (అనగా 36 చదరపు మీటర్లకు) ప్రతి 10 ఆడ మొక్కలకు 1 మగ మొక్కను విధిగా ఉంచుకోవాలి. దాదాపు వెయ్యి ఆడ మొక్కలకు 100 మగ మొక్కలు ఉండాలి. ● నారుమడిని వరుస వరుసకు నాలుగు అడుగులు, పాదు పాదుకు మధ్య ఒక అడుగు సైజులో, ఎత్తులో తయారు చేయాలి. 15 సెంటీ మీటర్ల వరుసల మధ్య 10 సెంటీ మీటర్ల దూరంలో విత్తనాలు విత్తాలి. వాటిపై గడ్డి వేసి పెట్టాలి. 40 నుంచి 45 రోజుల్లో మొలకలు వస్తాయి. మార్చి నెలాఖరులో నారుమడి వేస్తే, జూన్లో నాటుటకు తయారవుతాయి. నాటుట :● దుంపలను గాని విత్తనం మొక్కలను 30 నుంచి 30 సెంటీ మీటర్ల కొలతలు కలిగి పెంట ఎరువుతో నిండిన గుంతల్లో నాటుకోవాలి. నేరుగా గుంతల్లో విత్తనాలు నాటుకోవాలంటే ప్రతీ గుంతకు 10 నుంచి 15 విత్తనాలు వేస్తే 3 నుంచి 5 మొలకలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి. అప్పుడు ఒక ఆడ తీగను ఉంచి మిగతావి వేరే చోట నాటుకోవాలి. పంట కాలం :● పంటకాలం మే/జూన్ నుంచి అక్టోబర్/నవంబర్ వరకు ఉంటుంది. తర్వాత తీగ చనిపోతుంది. దుంప భూమిలో సుప్తావస్థలో ఉంటుంది. మళ్లీ మే/జూన్లో మొలకెత్తుతుంది. ● అయితే జూన్ అక్టోబర్ మధ్యలో ఎక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకోవాలి. ● సాధారణంగా ఆకులు ఒకే తమ్మెతో తీగలు ఎక్కువ దిగుబడి ఉంటుంది. 2.5 కిలోలు మొక్కకు ఇస్తుంది. అదే ఆకులు 3 నుంచి 5 తమ్మెలుగా ఉన్న తీగలు తక్కువ దిగుబడి అంటే 1.0 నుంచి 1.5 కిలోలు మొక్క ఇస్తుంది. ● అదే విత్తనమైతే ప్రతి గుంతలో 10 నుంచి 15 విత్తనాలు వేయాలి. ● అందులో నుంచి 3 నుంచి 5 పిలుకలు / మొక్కలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి. పందిరి :● భూమికి 4 నుంచి 6 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు / జీఐ వైరుతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. తీగలను అంతటా పాకించాలి. లేదా ప్రతి మొక్క రెండు పాదలు ఏర్పాటు చేసుకుని తీగలను అల్లించవచ్చు. దిగుబడి : ● బోడకాకరను సాధారణంగా వెజిటబుల్ చికెన్ అని అంటారు. పంట 45 నుంచి 50 రోజుల్లో పూతకు వస్తుంది. పూత నుంచి కాయ కాయడానికి వారం రోజులు పడుతుంది. వారానికి రెండుసార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు ఎకరం 40 నుంచి 50 కిలోలు వస్తాయి. సాధారణంగా 15 నుంచి 20 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది. ● ఆగస్టు నుంచి అక్టోబరు చివరి దాకా కాయలు వస్తాయి. ఆపై తీగలు ఎండిపోతాయి. మరల మరుసటి సంవత్సరం తొలకరికి దుంపలు చిగురిస్తాయి. వారానికి రెండు సార్లు కోత వస్తుంది. ప్రతి కోతకు 40 కిలోల కాయలు వస్తాయి. 8 నుంచి 10 క్వింటాళ్లు ఎకరాకు, అధిక దిగుబడికి మొదటగా బ్రష్తో మగ పూల నుంచి పుప్పొడి సేకరించి, ఉదయం వేళలో ఆడ పూలపై అద్దాలి. ● వెదురు బుట్టల్లో అడుగున ఎండుగడ్డి వేసి, కాయలతో నింపి తడి గోనె సంచిలో కప్పి ప్యాకింగ్ చేసి దూరం ప్రాంతాలకు మార్కెట్ చేస్తారు. కాపు అనంతరం నవంబరు నుంచి నీరు పెట్టరాదు. నిద్రావస్థలో వుంచాలి. మరలా మే నుంచి మొలకలు వస్తాయి.రోగ నిరోధక శక్తి పెంపు ప్రస్తుత వాతావరణ మార్పులు, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, డెంగీ, కరోనా, పలు వైరసుల వల్ల కలిగే అనారోగ్య లక్షణాల నుంచి సంరక్షణకు, రోగ నిరోధక శక్తి పెరగాలంటే అధిక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్న ఆగాకర (బోడకాకర) చాలా ముఖ్యం.బోడకాకర ఏక పంటగా, అంతర పంటగా, బోర్డర్ పంటగా, టెర్రస్ (మిద్దె) తోటగా, ఇంటి ఆవరణంలో పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఈ తీగజాతి పంట, అటవీ ప్రాతంలో సహజసిద్ధంగా పండేది. రానురాను ఈ పంటకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దాంతో రైతులు ఈ పంటను చిన్నచిన్న కమతాల్లో సాగు చేసుకుంటున్నారు. ఆగాకర కాయలో ఔషధ గుణాలు, పోషక విలువలు మెండుతక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉండే బోడకాకరలో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉండి కిలో రూ.80 నుంచి రూ.200 ధర పలుకుతోంది. ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.ముఖ్యాంశాలు తప్పనిసరిగా ప్రతి 10 ఆడ మొక్కలకు, ఒక మగ మొక్క చొప్పున నాటుకోవాలి. మగపూల నుంచి సేకరించిన పుప్పొడిని మె త్తటి బ్రష్తో తీసుకొచ్చి ఆడపూలపై అద్దితే ఎక్కువ దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం తక్కువైనప్పుడు 10 రోజులకోసారి తేలికపాటి తడులు ఇవ్వాలి.రాయితీలు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం నుంచి పందిరి సాగుకు రూ.50 వేల రాయితీ ఉంది. -
రాయబంధంలో మావోయిస్టు సభ్యురాలికి చికిత్స
● రెండు రోజుల్లో ఎస్పీ ఎదుట హాజరు ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాయబంధంలో మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు మడకం చిట్టి అలియాస్ కీడో రహస్యంగా చికిత్స పొందుతోంది. ఇటీవల కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె ఎడమ కాలుకు బుల్లెట్ తగలడంతో ములుగు జిల్లా చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయబంధం గొత్తికోయగూడెనికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, ఆమె కాలుకు గాయం కావడంతో చికిత్స కూడా చేయిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్ రక్షణ స్థాయిలో పనిచేసే సెంట్రీగా ఆమెను పోలీసులు భావిస్తున్నారు. చిట్టి అరెస్టును పోలీసులు మరో రెండు రోజుల్లో చూపెట్టి ఎస్పీ ఎదుట హాజరుపర్చిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అనామక ఫిర్యాదులపై విచారణహన్మకొండ: అనామక ఫిర్యాదులపై సీవీసీ నిబంధనల ప్రకారం ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత, అందులో వాస్తవాలు నిర్ధారణ అయితేనే శాఖా పరమైన చర్యలు చేపడుతామని టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ చీఫ్ ఇంజనీర్ టి.మధుసూదన్ స్పష్టం చేశారు. యా జమాన్యానికి వచ్చే అనామక ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆరోపణల్లో ప్రాధాన్యం ఉంటే సీవీసీ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టడానికి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు పంపిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. విచా రణలో ఆరోపణలు అవాస్తవాలు అని నిరూపితమైతే ఎలాంటి శాఖాపరమైన చర్యలుండవని తెలిపారు. ఆరోపణలు వాస్తవమని నిరూపితమైతేనే చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు
హసన్పర్తి: ప్రజల్లో ధైర్యం కలిగించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి కవాతు ప్రారంభించారు. హనుమకొండ బస్టాండ్, బ్రాహ్మణవాడ, అలంకార్ జంక్షన్, చౌరస్తా మీదుగా అశోక్ జంక్షన్ వరకు కవాతు సాగింది. అనంతరం కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. కేంద్రహోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమం ఏడు రోజులు కొనసాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్స్టేషన్లలో కవాతు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణ తలెత్తినా తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా కవాతు నిర్వహిస్తున్నట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సరస్వతి, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సతీష్, రవికుమార్, సత్యనారాయణరెడ్డితో పాటు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు కార్యక్రమాలు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
‘ఉపాధి’ వేతన బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలను విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలి రూ.600లు, 200 రోజుల పనిదినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాములు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో వచ్చిన గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల ఏర్పాటు పేరుతో గ్రామాలను విలీనం చేసి లక్షలాది మందిని ఉపాధి పనికి దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంబాల స్వరూప, లోకిని స్వరూప, వేలు రజిత, చిలుక రాఘవులు, అజ్మీరా భిక్షపతి, మనీఫా చందు, నర్సింగం తదితరులు పాల్గొన్నారు. పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు -
‘సీకేఎం’ వైద్యుల నిర్లక్ష్యం
ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత ప్రాణం మీదికి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వరంగల్ కాశికుంట ప్రాంతానికి చెందిన నజియా భాను ప్రసూతి సేవల కోసం సీకేఎంలో ఈనెల 25న రాత్రి చేరారు. రాత్రి సుమారు నాలుగు గంటలు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు బాబు జన్మించినట్లు తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆరు రోజులు బాలింతను కుటుంబ సభ్యులకు చూపించకుండా వైద్య సేవలు కొనసాగుతున్నట్లు చెబుతూ వచ్చారు. శుక్రవారం ఉదయం నజియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కేస్ షీట్ అందించాలని కోరారు. కేస్ షీట్ పోయిందని, కొత్తది రాసిస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. నజియా బేగంను వెంటనే చూపించాలని పట్టుబట్టారు. అప్పటికే నజియా బేగం పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి భవనం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. -
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
త్రివేణి సంగమం వద్ద పెరిగిన నీటిమట్టం బొగత జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులుములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు శుక్రవారం తరలివచ్చారు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు గుట్టలపైనున్న వాగు పొంగడంతో ఆ నీరు బొగతకు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం వద్ద కనువిందు చేస్తున్న జలధారలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం పెరిగింది. ఇటీవల ఎగువన అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు తరలిపోతోంది. గత వారం 1,800 – 2,200 క్యూసెక్కుల వరకు ప్రవాహం తరలిపోయింది.బొగతలో పర్యాటకుల సందడి– కాళేశ్వరం– వాజేడు -
అలర్ట్.. అలర్ట్
ఒక వైపు కోవిడ్, మరో వైపు సీజనల్ వ్యాధులుమందులు, కిట్లు సమకూర్చే పనిలో.. సీజనల్ వ్యాధులపాటు, కోవిడ్ను ఎదుర్కొనేందుకు కావాల్సిన మందులు, కిట్లు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు తోపాటు ప్రమాదరకమైన మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలకు కావాల్సిన మందులు, యాంటీబయాటిక్స్ల్లో కొన్ని ఇప్పటికే స్టోర్ రూమ్కు చేరాయి. దీనికి తోడు కోవిడ్ చికిత్సకోసం సాధారణ మందులు, దగ్గు, జలుబు టానిక్స్, టాబ్లెట్లు, పారాసిటమాల్, రెమిడెిసీవర్, ప్లోవీర్ ఇంజక్షన్లు, హెరిత్రోమైసిన్ తదితర మందులు కావాలని రాష్ట్ర ఔషధ సరఫరా అధికారులకు ఇండెంట్ పెట్టారు. వీటితోపాటు పరీక్షలు నిర్వహించేందుకు పీపీ కిట్లు, ఎన్–95 మాస్క్లు, శానిటైజర్లు, మొదలైనవి అవసరమని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● ముంచుకొస్తున్న ముప్పు ● అప్రమత్తం కావాలని ఉన్నతాధికారుల ఆదేశం ● సర్వం సిద్ధం చేస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ సాక్షి, మహబూబాబాద్ : వర్షాకాలం వచ్చిందంటే దోమలు, ఈగలు, అపరిశుభ్రత తదితర కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీనికి తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు. అధికారుల అప్రమత్తం కోవిడ్తోపాటు సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు, సమర్థవంతంగా చికిత్స అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకోసం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ, చికిత్స, మందుల సరఫరా, కిట్లు మొదలైనవి సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నారు. వార్డులో బెడ్లు, ఫ్యాన్లు, వెలుతురు వచ్చే విధంగా మరమ్మతులు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా పైపు లైన్లు సరిచూస్తున్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులకు గురయ్యే వారికోసం జీజీహెచ్లో 50 పడకలు, గూడూరు, గార్ల, తొర్రూరు, మరిపెడ సీహెచ్సీల్లో 20 బెడ్ల చొప్పున సిద్ధం చేస్తున్నారు. ఇలా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కో–ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు●
● డీఏఓ విజయ నిర్మల దంతాలపల్లి: విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యల తప్పవని డీఏఓ విజయనిర్మల అన్నారు. మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల షాపులు, గోడౌన్లు శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. షాపుల యజమానులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు రశీదు ఇవ్వాలని, స్టాక్ బోర్డుపై ఎప్పటికప్పుడు ధరలు, నిల్వల వివరాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాహిని, ఏఈఓలు దీక్షిత్ కుమార్, షాపుల యజమానులు పాల్గొన్నారు. -
చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం
కోవిడ్ మళ్లీ ప్రబలుతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే రోజుకు 1200 నుంచి 1500 వరకు ఔట్ పేషెంట్లు, 250 మంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం. కోవిడ్, సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మందులు పోగా అవసరమై వాటికోసం ఇండెంట్ పెట్టాం. అందరి సహకారంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడీగా ఉన్నాం. – శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఎట్టకేలకు మోక్షం !
మహబూబాబాద్: పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు మంజూరు చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కార్డులు అందజేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23,007 దరఖాస్తులకు గాను 16,483 దరఖాస్తులను పరిష్కరించి రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్కార్డు దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే సంబంధిత కార్యాలయాలు నూతన దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. అ యితే రేషన్కార్డుల మంజూరులో కొంత ఆలస్యంపై దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 23,007 దరఖాస్తులు.. జిల్లాలో 18 మండలాలు, 482 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీ ఉన్నాయి. కొత్త రేషన్కార్డుల కోసం 23,007 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఈనెల 29 తేదీ వరకు 16,483 దరఖాస్తులను పరిష్కరించారు. ఆధార్ కార్డు, ఇంటి పన్ను, నివాస ధ్రువీకరణ పత్రాలతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆతర్వాత ఆపత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు. అనంతరం ఆర్ఐ విచారణ చేసి, నివేదిక ఇవ్వగానే అంతా సక్రమంగా ఉంటే తహసీల్దార్ లాగిన్లో సంతకం పూర్తి అవుతుంది. ఆతర్వాత ఆన్లైన్లోనే డీసీఎస్ఓ లాగిన్లోకి వెళ్తాయి. ఆతర్వాత డీసీఎస్ఓ కార్యాలయంలో మంజూరు అయిన వెంటనే దరఖాస్తుదారుడి సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. అనంతరం మీసేవ కేంద్రాల్లో ఆహార భద్రతకార్డులను ప్రింట్ తీసుకుంటున్నారు. సన్న బియ్యం పంపిణీతో.. ఏప్రిల్ నెల నుంచి సన్న బియ్యం పంపిణీతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. సంబంధిత కార్యాలయాల్లో ఆ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. రేషన్కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలకు అర్హులు కావడంతో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మీసేవ కేంద్రాల్లో దోపిడీ.. జిల్లాలో 95 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. కాగా రేషన్కార్డు కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తుకు చెల్లించాల్సిన రుసుము కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారు. 23,007 దరఖాస్తులకు 16,483దరఖాస్తుల పరిష్కారం లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న దరఖాస్తుదారులు సన్న బియ్యం పంపిణీతో పెరుగుతున్న దరఖాస్తులురేషన్ కార్డు రావడం ఆనందంగా ఉంది.. రేషన్ కార్డు కోసం కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేశారు. వెంటనే మీసేవ కేంద్రంలో ఆహార భద్రత కార్డు తీసుకున్నా. ఎంతో సంతోషంగా ఉంది. – ఫిరోజ్ ఖాన్, మానుకోట -
విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీస చదువు సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ స్కూల్లో శుక్రవారం ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శిక్షణలో నేరుకున్న అంశాలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆజాద్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, అధికారులు సతీశ్, ప్రవీణ్, సదయ్య పాల్గొన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి -
రైతులు ఆందోళన చెందొద్దు
● అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరబ్రహ్మచారి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం నిల్వలు, బస్తాల తరలింపు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో 200మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, రవాణాలో జాప్యం ఉన్నందున కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, హమాలీలతో మాట్లాడి త్వరితగతిన తరలించాలన్నారు.కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకొవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, తహసీల్దార్ రమేశ్బాబు, ఏఓ వినయ్కుమార్ పాల్గొన్నారు. ధాన్యం దిగుబడి పెరగడంతో ఆలస్యం.. తొర్రూరు రూరల్: గత ఏడాది కంటే ధాన్యం దిగుబడి పెరగడంతో కాంటాలు పెట్టడం ఆలస్యం అవుతుందని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మాపురం, మాటేడు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, తహసీల్దార్ శ్రీనివాస్, సొసైటీ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ధాన్యం తరలిస్తాం దంతాలపల్లి: రైతులు అధైర్యపడొద్దని, ధాన్యం తరలిస్తామని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసి తరలించేందకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వాహిని, ఏఈఓ దీక్షిత్, నిర్వాహకులు, రైతులు తదితరులు ఉన్నారు. -
రైల్వే పనుల్లో వేగం పెంచాలి
● ఎంపీ పోరిక బలరాంనాయక్ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, పనుల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3, 4 నంబర్ల ప్లాట్ ఫాంల నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తానని, పనుల్లో జాప్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి, పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు సౌకర్యాల కల్పనలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా లేకపోవటం విచారకరమన్నారు. ఎంపీ వెంట గుగులోత్ వంశీ, మాలోత్ అరుణ్, విక్రమ్,ఆకుల శ్రీను, గెల్లి మురళి, సాయి తదితరులు ఉన్నారు. -
జీపీఓ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి(జీపీఓ) పోస్టుల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. జిల్లాలో జీపీఓ పోస్టులకు 130మంది రాత పరీక్ష రాశారని, వారితో 110మంది అర్హత సాధించినట్లు చెప్పారు. వారిలో 103మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే నెల 3నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30నుంచి 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలికల)లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. సమావేశంలో డీఈఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విత్తన దుకాణాల ఆకస్మిక తనిఖీకేసముద్రం: మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాలను మండల టాస్క్ఫోర్స్ టీం ఎస్సై మురళీధర్రాజు, ఏఓ వెంకన్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దుకాణంలో వివిధ రకాల కంపెనీల విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఇన్వాయిస్లు, లైసెన్స్, స్టాక్ బోర్డు, గోదాములను పరిశీలించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అపురూపాలు పదిలం
గత స్మృతులను నెమరు వేసుకోవాలి. వర్తమానంలో మనుగడ సాధిస్తూ.. భవిష్యత్పై కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.. అంటారు పెద్దలు. గతం తిరిగిరానిదని కూడా ఉద్బోధిస్తుంటారు. ఏ శాస్త్ర సాంకేతిక విజయాన్ని పరిశీలించినా.. దానికి మూలం పూర్వీకుల నుంచి సంక్రమించిన పరిజ్ఞానమే. ఇలాంటి పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామస్తులు. అయిదారు దశాబ్దాల క్రితం వినియోగించిన వస్తువులు, వ్యవసాయ పరికరాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన వస్తువులను తెలంగాణ ఆద్యకళా మ్యూజియం పేరిట భద్రపరిచే ప్రయత్నాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్యాభై ఏళ్లుగా ప్రయత్నాలు పూర్వీకులు వినియోగించిన వస్తువులు, ఆనాటి కళలు, వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు పూనుకున్నారు శ్రీరామగిరి వాసులు. యాభై ఏళ్ల క్రితం వివేకానంద సాంస్కృతిక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ఆనాటి వీధిభాగోతాలు మొదలుకొని.. చిడతల రామాయణం, జడకుప్పి, కోలాటం తదితర కళలను పరిరక్షిస్తూ నేటికీ ప్రదర్శిస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులను కూడా సేకరిస్తున్నారు. భావితరాల కోసం.. మారిన కాలం, వైజ్ఞానిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయి. కానీ గతంలో పూర్వీకులు వినియోగించిన వస్తువులను భావితరాలకు చూపించాలనే ఆలోచనతో శ్రీరామగిరి వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను భద్రపరిచారు. వీటిలో మోటబొక్కెన, బకెట్ పంపు డబ్బాలు, కుందెన, పాన్ధాన్ (ఆకులు, సున్నం, వక్కల కత్తెర, వక్కలు భద్రపరిచే పెట్టె), చుట్టకుదురు, రోకళ్లు, ఇసుర్రాయి, ఉట్టి, చల్లకవ్వం, ఉట్టి, అటికలు (మట్టితో తయారు చేసిన పాత్రలు), పిల్లలు ఆడుకునే రింగున్, బొంగరాలు మొదలైనవి ఉన్నాయి. చేపల వేట కోసం వినియోగించే ఊత, మావుతోపాటు విడిచిన బట్టలు వేసుకునే మైల్దాన్, మంగలి పెట్టె, సానరాయి మొదలైవాటితోపాటు, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పాతకాలం పండితులు రాసిన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాల యం ప్రొఫెసర్లు, పురావస్తు శాఖ వారి ఆధ్వ ర్యంలో వస్తువులు, జానపద కళల ప్రదర్శనల ద్వారా ఆనాటి కళలకు గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ సుజాత, జయదీర్ తిరుమలరావు శ్రీరామగిరి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు సేకరించిన పురాతన వస్తువులు, వ్యవసాయ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానంద సాంస్కృతిక మండలి సభ్యులను అభినందించారు. గ్రామంలో సేకరించిన వస్తువులను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఆద్య కళా మ్యూజియానికి తరలించారు.పురాతన కళ, సంస్కృతి పరిరక్షణ మా గ్రామంలో ఐదు దశాబ్దాల క్రితం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం వివేకానంద సాంస్కృతిక కళామండలిని ఏర్పాటు చేశాం. నాతోపాటు, మా గ్రామానికి చెందిన బొమ్మిడి వినోద్రెడ్డి, ఇతర మిత్రులం.. ఇప్పటికీ ప్రాచీన కళల పరిరక్షణకు పాటుపడుతున్నాం. వస్తువులు, వ్యవసాయ పరికరాలను సేకరించాం. చిడతల రామాయణం, జడకుప్పి వంటి కళల ప్రదర్శనకు.. రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఊరిలో సేకరించిన వస్తువులను మ్యూజియంలో భద్రపరుస్తున్నారంటే మా గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాం. – కళాధర్ రాజు, ప్రధాన కార్యదర్శి, వివేకానంద సాంస్కృతిక మండలి కావలసినవి తయారు చేసుకునేవాళ్లు పూర్వ కాలం పద్ధతులే వేరు. చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్లు ఎక్కువ. ఎవరికి కావలసిన వస్తువులను వారు తయారు చేసుకునే వాళ్లు. అప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఏ వస్తువు కూడా పర్యావరణానికి భంగం కలిగించేది కాదు. అందువల్లే పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. – మురళీధర్ స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు జ్ఞాపకాలు పదిలం చిన్నతనంలో పల్లెటూరులో పెరిగాను. అందరం వరుసలతో పిలుచుకునే వాళ్లు. కానీ గోళం, ఊత, గాజె, బొట్టుపెట్టలు ఇప్పుడు కనిపించడం లేదు. వండిన అన్నం ఉట్టిమీద పెడితే.. స్టూలు వేసుకొని ఎక్కి అన్నం పెట్టుకున్న గుర్తులు ఇప్పటికి మరుపు రావు. – బండారు వెంకటరమణ, మహబూబాబాద్ -
మేడిగడ్డ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డ్పై దాడి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ అవుతలి మహారాష్ట్ర బార్డర్ వైపున గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్ రవీందర్పై మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి గేట్ తీయాలని ఒత్తిడి చేయడంతో తీయకపోవడంతో రవీందర్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తీవ్రంగా గాయపడడంతో మహదేవపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీని ఆధారంగానే దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఎస్ఏఓలకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించారు. డివిజన్, జిల్లా వారీగా ప్రగతి సమీక్షించారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిళ్లు, డివిజన్ల, సెక్షన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్ చౌర్యం అరికట్టాలని చెప్పారు. రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఉపయోగించే విద్యుత్ స్తంభాలకు అద్దె వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, స్తంభాల వెంట గుత్తులుగా ఉన్న కేబుళ్లతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, క్రమపద్ధతిలో తీగలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏఓలు పాల్గొన్నారు. -
విత్తన చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
దంతాలపల్లి: నూతన విత్తన చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు నూతన విత్తన చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే నూతన విత్తన చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ చట్టం ద్వారా ప్రభుత్వం రైతుల కోసం వివిధ రాయితీలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ నిపుణులు నరసింహారెడ్డి, ఏఓ వాహిని, వివిధ గ్రామాల రైతులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. రైతులకు అవగాహన.. నర్సింహులపేట: నూతన విత్తన చట్టం–2025పై మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద విత్తన కమిటీ సభ్యులు, రైతులతో గురువారం అధికారులు ముఖాముఖి నిర్వహించారు. స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి పాల్గొని రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. విత్తన చట్టాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందింస్తున్నామన్నారు. వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, వ్యవసాయ విధాన సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, ఏఓ వినయ్కుమార్, ఏఈఓ శరత్చంద్ర, రైతులు సొమిరెడ్డి, అశోక్రెడ్డి, వెంకన్న, సుధాకర్, నర్సింహ, అనిల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మె
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని, ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్లో కార్మికుల హక్కుల కాలరాసేలా పోరాటాలు, సమ్మె చేయకుండా రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ తీసుకురావడాన్ని నిరసిస్తూ అక్కడి విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మధ్యా హ్న భోజన సమయంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులుంటాయన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. ప్రైవేట్ నిర్వాహకులను భరించలేమన్నారు. ఈ క్రమంలో ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ బాధ్యుడు సామ్యా నాయక్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ఉద్యోగుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇక్కడ ధర్నా చేశామన్నారు. ఈ ధర్నాలో శ్రీకాంత్, వెంకటేశం, కుమారస్వామి, జానకీరాంరెడ్డి, మధుకర్, పి.మహేందర్ రెడ్డి, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ -
నీడ మాటున నిధులు మాయం!
తొర్రూరు: గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలకు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాఽ దనం షేడ్నెట్ల పాలవుతోంది. తాత్కాలిక షేడ్నెట్లను ఏర్పాటు చేస్తుండడంతో చిన్నపాటి ఈదు రు గాలులు వీచినా చిరిగిపోతూ పనికి రాకుండా పోతున్నాయి. దీంతో తరచూ కొత్తవాటి కొనుగోళ్ల కోసం రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఖర్చు ఇలా.. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 10 నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. వేసవిలోనూ మొక్కల పెంపకం చేపడుతుండటంతో నీడ అవసరం ఉంటుంది. ఇందుకు షేడ్ నెట్(నీడ కోసం పరదా)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పంచాయతీ నిధులను కేటాయిస్తున్నారు. ప్రతీ నర్సరీకి రెండు నుంచి నాలుగు వరకు షేడ్నెట్ల అవసరం ఉంటుంది. ఒక్కో నెట్కు రూ.3 వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు షేడ్నెట్లకు రూ.6వేలు, నాలుగు నెట్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. జిల్లాలోని 461 నర్సరీల్లో ఏటా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. చిరిగిపోతున్న షేడ్నెట్లు.. కొనుగోలు చేస్తున్న షేడ్నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వచ్చినా చిరిగిపోతున్నాయి. గత ఏడాది కొనుగోలు చేసిన షేడ్నెట్లు ఇప్పటికే ఈదురుగాలులకు దాదాపు అన్ని చోట్ల చిరిగిపోయాయి. మొక్కల రక్షణకు మళ్లీ కొనుగోలు చేయక తప్పడం లేదు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను కానీ, ప్రత్యామ్నాయ పరికరాలు కానీ కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్గా నర్సరీలు నిర్వహించేవారు నీడ కోసం ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ నర్సరీలలోనూ నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటేటా కొనుగోలు చేసే అవసరం ఉండదు. దీనివల్ల ప్రజాధనం ఆదా అవుందని, ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నర్సరీల్లో నాసిరకం షేడ్నెట్ల వినియోగం చిన్నపాటి గాలులకే చిరిగిపోతున్న నీడ పరదాలు జిల్లాలో రూ.40లక్షల వరకు ఖర్చుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం షేడ్నెట్ల నాణ్యతపై దృష్టి సారిస్తాం. గతంలో గ్రా మ పంచాయతీ పాలకు లే కొనుగోలు చేసేవారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు పచ్చదనానికి వెచ్చించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన నెట్లను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కొన్ని పంచాయతీల్లో గతంలో కొనుగోలు చేసినవి, చిరిగిపోకుండా ఉన్నవాటిని వినియోగిస్తున్నారు. – పూర్ణచందర్, తొర్రూరు ఎంపీడీఓ -
టెంట్ సిటీలో దొంగలు పడ్డారు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం 40 టెంట్సిటీ నిర్మాణాలు చేపట్టింది. సోమవారం పుష్కరాలు పూర్తి కావడంతో బుధవారం నుంచి టెంట్సిటీలోని ఏసీలు, ఫర్నిచర్, బెడ్స్ తదితర వ స్తువులు తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి టెంట్సిటీకి చెందిన 8 ఏసీ కాంప్రెషర్స్, 3 కూలర్లు, డార్మెటరీకి చెందిన 9 బెడ్స్, దిండు, బెడ్షీట్స్, డ్రెస్సింగ్ మిర్రర్లు, గ్రీన్ నెట్ బాండిల్, కుర్చీలు దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు లేకపోవడం, విద్యుత్ దీపాలు వెలుగకపోవడంతో దుండగులు రెక్కీ నిర్వహించి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సంబంధిత ఆలీఎలిమెంట్ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్వాహుకులు కాళేశ్వరం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు. 8 ఏసీ కాంప్రెషర్స్, 3 కూలర్లు, ఇతర విలువైన వస్తువుల అపహరణ -
ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలు, అధికారులు..
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి సమావేశంలో పాల్గొన్న డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల ఎస్పీలు కిరణ్ఖరే, సుధీర్రాంనాథ్ కేకన్, శబరీశ్హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. – హన్మకొండ అర్బన్ -
ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా
హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్లో ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా లేని ఆకాశరామన్న ఉత్తరాలు (ఫిర్యాదులు) ఉద్యోగులు, అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. వివిధ ఫిర్యాదులపై అధికారుల తక్షణ స్పందనతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారు. ఇష్టానుసారంగా ఫిర్యాదులు చేస్తూ క్షణికానందం పొందుతున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనామక (ఆకాశరామన్న), చిరునామా లేని ఫిర్యాదులను పరిశీలన, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్ విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా.. కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ విచారణ చేపడుతున్నారు. ఇదే అదునుగా ఆకాశరామన్న ఉత్తరాలు రాసే వారు పెట్రేగిపోతున్నారని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక.. వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక ఆకాశరామన్న ఉత్తరాలు, ఫిర్యాదులతో తమ కోపాన్ని తీర్చుకుంటున్నారనే ప్రచారం విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఈ వింత పోకడలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రత్యర్థుల క్షణికానందం.. ప్రధానంగా యాజమాన్యం ప్రతీ అనామక ఫిర్యాదుపై స్పందించి విచారణ చేస్తుండడంతో పేరు, చిరునామా లేని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా ఫిర్యాదుకు గురైన ఉద్యోగి, అధికారి పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యర్థులు క్షణికానందం పొందుతున్నారు. విద్యుత్ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారిందని విద్యుత్ ఉద్యోగులు వాపోయారు. ఇంత జరుగుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు చోద్యం చూస్తున్నాయే కాని, వీటిని అరికట్టేందుకు సంఘాల నాయకులు పూనుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ ఆదేశాలు బేఖాతర్.. పేరు, చిరునామా లేకుండా వచ్చిన అనామక ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్ విజి లెన్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పా టు కోర్టులు ఇచ్చిన తీర్పులను సైతం ఉదాహరించింది. చిత్తశుద్ధి, బాధ్యత, పారదర్శకంగా పని చేసే అధికారులపై కొందరు ఇలాంటి ఫిర్యాదులు చేసే అవకాశముందని, ఇలాంటి ఫిర్యాదులు విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినా అత్యుత్సాహం చూపుతున్న కొందరు అధికారులు దురుద్దేశంతో విచారణ చేపడుతున్నారని, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన యాజమాన్యం విచారణలకు ఆదేశిస్తుండడంతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారని ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికై నా యాజమాన్యం అనా మక, ఆకాశరామన్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేకుండా, సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు. తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించరు?అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో కాకుండా రిటైర్మెంట్ ముందు ఆకాశరామన్న లేఖల ద్వారా ఫిర్యాదులు పంపుతుండడం సరికాదని పలు సంఘాలు, అసోసియేషన్ల నాయకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఉద్యోగ విరమణ సమయంలో ఫిర్యాదులు చేస్తే పరిస్థితులు ఎటువైపు వెళ్తాయో ఆలోచించాలని అకాశరామన్న ఉత్తరాలు రాసే వారికి సూచిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఏ ఉద్యోగి కూడా సంతోషంగా విరమణయ్యే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్న పేరులేని ఫిర్యాదులు ఫిర్యాదులపై అధికారుల స్పందనతో పెట్రేగిపోతున్న ఫిర్యాదుదారులు అనామక ఫిర్యాదులపై విచారణ చేపట్టొద్దని విజిలెన్స్ ఆదేశాలు.. అయినా పట్టించుకోని కొందరు అధికారులు.. విచారణకు ఆదేశం ఇదే అదునుగా భావిస్తున్న ప్రత్యర్థులు విద్యుత్ ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసన -
ఇక నో టెన్షన్
సైబర్ ఎటాక్..కాజీపేట మండలం మడికొండకు ఓ యువకుడు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రికవరీ ఏజెంట్ల బారినపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రూ.1.60 లక్షల మొత్తం చెల్లించారు. అయినా మరికొంత చెల్లించాలని డిమాండ్ చేసి.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతో తెలివిగా ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల నుంచి తప్పుకుని తన ఫోన్ హ్యాక్ అయ్యినట్లు ప్రకటించాడుకాజీపేట: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లైన నలబై రోజులకే ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కేవలం రూ.2వేల కోసం భార్యభర్తల ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురై తనువు చాలించాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి రూ. 15వేల రుణం తీర్చే క్రమంలో వేధింపులకు గురైంది. అవమానంగా భావించిన సదరు యువతి.. పురుగు ల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇలా.. ఇటీవల రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువ ఉంటున్నారు. పూర్తిగా చెల్లించినా బాకీ ఇంకా ఉందంటూ.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండడం సైబర్ కేటుగాళ్ల తెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఆ సైబర్ దాడి నుంచి రక్షించుకునేందుకు ఓ వెబ్సైట్ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన పెంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైట్కు ఫిర్యాదు చేయొచ్చు.. మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా ఫిర్యాదు చేయొ చ్చు. ఇందు కోసం మీ సెల్ఫోన్కి వచ్చిన ఫొటోల ను ఈ సైట్కు పంపాలి. ఇందులో తొమ్మిది రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మే రకు వివరాలు నమోదవుతాయి. తర్వాత ఫొటోలు అప్లోడ్ చేస్తే వాటిపై సదరు సైట్ నిఘా పెడుతుంది. ఎవరైనా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పో స్ట్ చేస్తే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆ వివరాల ను నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తుంది. – పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేటఫొటో మార్ఫింగ్ బెదిరింపు నుంచి రక్షణ పొందండిలా! రుణయాప్ వేధింపుల అడ్డుకట్టకో సైట్ అవగాహన పెంచుకోవాలంటున్న పోలీసులు 2015 నుంచే అందుబాటులోకి..ఈ జాగ్రత్తలు మేలు.. సామాజిక మాధ్యమాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలను అప్లోడ్ చేయకపోవడమే మంచిదని..ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్ లేకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ప్రొఫైల్ చిత్రాలను ఇతరులకు డౌన్లోడ్ కాకుండా లాక్ వేయాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్లు, లింక్లను ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించొద్దు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని బ్లాక్లిస్ట్లో పెట్టడం సురక్షితమని వివరిస్తున్నారు.ఆ సైట్ పేరు.. www.sotpncii.org అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్సైట్ పూర్తిగా భద్రమని పోలీసులు చెబుతున్నారు. మనం అప్లోడ్ చేసిన ఫొటోలను డౌన్లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం ఉండదు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో.. మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దీని ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో మన చిత్రాలు అప్లోడ్ అయితే .. అధునాతన సాంకేతికత ఆధారంగా గుర్తించి వెంటనే తొలగిస్తుంది. 2015 లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ సైట్ ఇప్పటి వరకు అంతర్జాతీయంగా రెండు లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్ చిత్రాలను తొలగించి వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.పూర్తిగా సురక్షితం..అప్రమత్తంగా ఉండాలి ఫొటోలు మార్ఫింగ్, రుణ యాప్ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. తద్వారా వారికి అండగా నిలిచి .. అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. -
ఉపాధ్యాయ శిక్షణలో కొత్త పుంతలు
సాక్షి, మహబూబాబాద్: ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతి, ఉచిత పుసక్తాలు, ఏకరూప దు స్తులు అందజేస్తున్నారు. ఇన్ని సౌకర్యాలతో పాటు ప్రతిభా వంతులైనఉపాధ్యాయులు బోధిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదు. ప్రైవేట్ పాఠశాలలకు పంపించేందుకే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఈపరిస్థితిని మార్చాలంటే బోధన వి ధానంలోనే మార్పు రావాలి..వినూత్న పద్ధతిలో శాసీ్త్రయతను జోడించి బోధిస్తే మంచి ఫలితం ఉంటుందని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ప్రధాన లక్ష్యాలు..రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో సృజనాత్మకను పెంపొందించే వారిని గుర్తించి ప్రత్యేక మాడ్యూల్ తయారు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయుడి మూర్తిమత్వం వికసింపచేయడం, విషయ పరిజ్ఞానం, బోధనా పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీ నేర్పించడం కీలక అంశాలుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు పది మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారిని ఉమ్మడి జిల్లాల వారీగా పంపించి శిక్షణ ఇప్పిస్తున్నారు. అదే విధంగా వారి ద్వారా శిక్షణ పొందిన జిల్లా స్థాయి ఇన్స్ట్రక్టర్లు ఎస్జీటీ నుంచి పీజీ హెచ్ఎం వరకు అన్ని స్థాయిల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.డిజిటల్ బోధనపై దృష్టిమారుతున్న పరిస్థితులు, అందిపుచ్చుకున్న విజ్ఞానం, ఆవిష్కరణలు జోడించి మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా శిక్షణ ఇన్నారు. ప్రధానంగా ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానల్(ఐఎఫ్పీ), లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎల్ఎంఎస్), ఎడ్యుకేషన్ యాప్స్ను సద్వినియోగం చేసుకోవడం శిక్షణలో నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,9,10 తరగతుల కోసం ఎల్ఎంఎస్లో 246 అంశాలు, వాటికి ఉప అంశాలు మొత్తం 1000కి పైగా అందుబాటులో ఉంచారు. ప్రతీ పాఠశాలలో ప్యానల్ బోర్డు, ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్నందున ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలు, మెళకువలు, నూతన అవిష్కరణలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు వినూత్న బోధన చేయాల్సి ఉంటుంది.శాస్త్రీయ పద్ధతి జోడించి..ప్రతీ సబ్జెక్టును బోధించేందుకు శాస్త్రీయ పద్ధతిని జోడిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం పాఠశాలల్లో ఉన్న సైన్స్ కిట్స్ను ఉపయోగిస్తూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ పాఠ్యాంశాలు బోధించాలి. ఆ పరికరాల వినియోగం కోసం ప్యానల్ బోర్డును వినియోగించి ఇంటర్ నెట్ ద్వారా ఆడియో, వీడియో చిత్రాలను చూపించాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థులు ఒక వైపు వినడం, మరోవైపు చూడటం, పరిశీలించడంతో విషయాలను సునాయసంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కార్పొరేట్గా దీటుగా బోధనప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయికి మించి బోధన జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం నిధులు సమకూర్చడమే కాదు.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి బోధన జరిపేలా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల మూర్తిమత్వం పెంపొందించడం, వయోజన విద్య, పిల్లల అపహరణ మొదలైన అంశాలపై కూడా శిక్షణలో చర్చ జరుగతుంది.– రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిమంచి ఫలితాలు వస్తాయిఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణతో ఉపాధ్యాయులకు బోధన సులభతరం అవుతుంది. వినూత్న బోధన చేయడంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. పాఠ్యాంశంపై పట్టు వస్తుంది. దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయులందరూ నూతన ఒరవడితో బోధిస్తే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుంది.– బి.అప్పారావు, జిల్లా సైన్స్ అధికారినూతన పద్ధతుల్లో తరగతులుఉపాధ్యాయులందరికీ వారి వారి సబ్జెక్టుల్లో పరిజ్ఞానం ఉంటుంది. నూతన పద్ధతులు, కొత్త ఆవిష్కరణలను జోడించి బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాడ్యూల్స్, యాప్స్ను వివరిస్తూ.. అవి ఎలా ఉపయోగించాలనేది శిక్షణలో ఉపాధ్యాయులు తెలుసుకుంటారు. దీంతో బోధన సులభం అవుతుంది.– సురేశ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వానాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకు మించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాల కు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖ ర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే లా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొ న్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహు ల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస తదితరులు పాల్గొన్నారు.2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలి పారు. రైతులు, భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. -
కర్రతో విద్యుత్ తీగలు కదిలిస్తుండగా..
● మెయిన్లైన్ నుంచి ఊడి మీదపడడంతో యువకుడు మృతి ● దస్తగిరిపల్లిలో ఘటన నల్లబెల్లి: కర్రతో విద్యుత్ తీగలు కదిలిస్తుండగా మూడు తీగల్లో (త్రీఫేస్) ఒకటి మెయిన్లైన్ నుంచి ఊడి మీదపడడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దస్తగిరిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మందాటి లక్ష్మణ్ రెడ్డి(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. చదువుకుంటూనే వ్యవసాయ పనుల్లో కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం వ్యవసాయ భూమికి నీరు పారించడానికి వెళ్లాడు. విద్యుత్ మోటారు ఆన్ చేయగా నడవకపోవడంతో తీగలను కర్రతో కదిలిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు తీగల్లో ఒకటి మెయిన్ లైన్ నుంచి ఊడి మీద పడడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ధాన్యంలో కోత.. రైతుల ఆందోళన
కేసముద్రం: మిల్లర్లు దిగుమతి చేసిన ధాన్యంలో కోత విధిస్తున్నారంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఓ రైస్ మిల్లులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దవంగర మండలం గట్లగుంట గ్రామ శివారు రామోజీతండాకు చెందిన రైతులు జాటోత్ మంగీలాల్, లకావత్ సోమ్లా, జాటోత్ బాలాజీ, జాటోత్ నీలమ్మ, కుమార్, అనూష, నరేష్, లక్ష్మి, జాటోత్ కొమురమ్మ పోచంపల్లి ఐకేపీ సెంటర్లో తమ ధాన్యాన్ని ఇటీవల అమ్ముకున్నారు. ఈ నెల 24న రెండు లారీల్లో 932 బస్తాల చొప్పున కేసముద్రంలోని ఓం సాయి ఇండస్ట్రీస్కి తరలించగా.. బస్తాలను దిగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రక్ షీట్పై రాసిచ్చే క్రమంలో ధాన్యం తడిసిందని, ఇందుకుగాను బస్తాకు 2 కిలోల చొప్పున కోత విధిస్తామని నిర్వాహకులు చెప్పారు. తడిసిన ధాన్యం, తడవని ధాన్యానికి ఒకే విధంగా ఎలా కోత విధిస్తారంటూ ఆ రైతులు మిల్లు ఆవరణలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, రైతులకు నచ్చజెప్పారు. అనంతరం ధాన్యంలో ఎలాంటి కోత విధించకుండా తీసుకుంటామని సదరు మిల్లరు చెప్పడంతో రైతులు శాంతించారు. -
నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు వరి, పెసర విత్తనాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నాణ్యమైన విత్తనాలు అందించి రైతన్నకు నేస్తంగా నిలవడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. జూన్ 2న అందజేత.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఏ.జానయ్య ఆదేశాల మేరకు నాణ్యమైన విత్తనం...రైతన్నకు నేస్తం కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జిల్లాలోని 819మంది రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలను అందించేందుకు మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయి క్లస్టర్ నుంచి ముగ్గురికి.. జిల్లాలోని 18 మండలాల్లో ముఖ్యంగా రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న గ్రామస్థాయి క్లస్టర్ నుంచి ముగ్గురు రైతులకు వరి, పెసర విత్తనాలను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరిలో డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 1355, డబ్ల్యూజీఎల్ 1246, పెసర ఎంజీజీ 385 రకాలను ఎంపిక చేశారు. ఒక్కొక్క రైతుకు 10 కిలోల చొప్పున వరి విత్తనాలు, మూడు కిలోల చొప్పున పెసర విత్తనాలను అందజేయనున్నారు. జిల్లాలోని 273 గ్రామాల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక రైతు నుంచి మరో రైతుకు.. వరి, పెసర విత్తనాలు ఇవ్వడమే కాకుండా వాటి సాగు, అనంతరం గుణగణాలు, పంట దిగుబడి వరకు పర్యవేక్షించడానికి ఒక శాస్త్రవేత్తల బృందం, చివరగా పంటకోత దశలో క్షేత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో రైతు నుంచి మరో రైతుకు విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.మాలతి శాస్త్రవేత్తలు, కిశోర్ కుమార్, రాంబాబు, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనం.. రైతులకు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో 819మంది రైతులకు వరి, పెసర విత్తనాల పంపిణీ జూన్ 2న అందించేందుకు ఏర్పాట్లు -
రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి కాజీపేట అర్బన్ : రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా తోడ్పడుతుందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన నూతన విత్తన చట్ట ముసాయిదా తయారీకి కమిటీల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు, పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా ముసాయిదా ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడవుతున్న ట్రూత్ఫుల్ విత్తనాలకు బదులు సర్టిఫైడ్ సీడ్లను డీలర్లు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భూభారతి చట్టం మాదిరి విత్తన చట్టం, మార్కెటింగ్ చట్టాల ముసాయిదా తయారు అవుతుందన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, వరంగల్ టీ–సీడ్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. డీలర్లు రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్కుమార్, నర్సింహారెడ్డి, శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఏఓ రవీందర్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రైతులకు ఈ అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న తెలిపారు. భూమిలో ప్రధానంగా 17 నుంచి 18 పోషకాలు.. మట్టి (భూసార) పరీక్షలతో నేల ఆరోగ్యం కాపాడినట్లు అవుతుందని, భూమిలో ప్రధానంగా 17 నుంచి 18 పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిలో నైట్రోజన్, పాస్పరస్ ముఖ్యమైన పోషకాలు. తర్వాత కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్( సీహెచ్ఓ) మైక్రోన్యూట్రెన్స్ (లఘు పోషకాలు) ప్రధానమని, ఇవన్నీ ఉంటే పంటల దిగుబడి అఽధికంగా వస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమిలో సహజ పోషకాలున్నా రైతులు అధిక దిగుబడులు కోసం ఇష్టారాజ్యంగా రసాయన ఎరువులు వాడడం వల్ల కొన్ని రోజులకు భూమి చౌడుగా మారి వినియోగంలోకి రాకుండా పోతుందని తెలిపారు. మట్టిని ఎలా సేకరించాలి.. ఏటవాలు పొలంలో వర్షపు నీరు ప్రవహించి పోషకాలు ఒకే దగ్గరికి చేరుతాయి. ఈనేపథ్యంలో రైతులు ఎకరం పొలంలో 8 నుంచి 10 ప్రదేశాల్లో మట్టిని సేకరించాలి. వీ ఆకారంలో 15సెం. వరకు పారతో గుంతతీసి, అందులో పైపొర ఇంచు లోతుకు తవ్వి మట్టి తీయాలి. తడిలేకుండా ఆరబెట్టాలి. చతురాస్త్రా ఆకారంలో నాలుగు విభాగాలు చేయాలి. ఎదురెదురుగా ఉన్న మన్ను మాత్రమే తీసుకోవాలి. మిగతా రెండు భాగాలను తొలగించాలి. ఇలా కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేకుండా చూసుకుని నీడలో ఆరనివ్వాలి. నమూనా కోసం పొలంలో మట్టిని తవ్వి సేకరించే సమయంలో గట్ల దగ్గర, పంట కా ల్వలోని మట్టి తీసుకోవద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించొద్దు. ఆ తర్వాత ఆ మట్టిని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధన భూసార పరీక్ష కేంద్రానికి తరలించాలి. నిపుణులు సర్వే నంబర్తో నమోదు చేసుకుని ప్రయోగశాలలో పరీక్షలు చేసి నివేదిక అందజేస్తారు. ఉమ్మడి వరంగల్లోని పొలాల్లో జింక్ లోపం.. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని పొలాల్లో ఎక్కువ జింక్ లోపమున్నట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పశువులు, గొర్రె ఎరువు పొలంలోని భూమిలో కలిసిపోయి ఎరువుగా మారడం వల్ల జింక్ ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు రసాయన ఎరువులు వాడడంతో భూసారం తగిందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ప్రయోజనాలు.. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మక భూములున్నా వాటి గురించి తెలుసుకుని వాటిని సవరించుకునే విధానాలు కూడా ఉపయోగించొచ్చు.భూసారంతో అధిక దిగుబడులు ఎరువుల వాడకంలో ఖర్చులు తగ్గుదల సూక్ష్మ పోషకాల పరిమాణాన్ని తెలుసుకోవచ్చు మట్టి నమూనాను సేకరించే పద్ధతి ప్రదర్శన రైతులకు అవగాహన సదస్సులుభూసార పరీక్షలు తప్పనిసరిఖరీఫ్లో అన్నదాత కచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. చెప్పిన విధంగా మట్టిని సేకరించి ల్యాబ్లో అందజేస్తే వారంలోపు నివేదిక ఇస్తారు. నివేదిక ప్రకారం పంటలకు ఎరువులు వేస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది. –రవీందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మట్టి పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి సాగుకు ముందే మట్టి నామూనా సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోవడం వల్ల అధిక దిగుబడులతోపాటు రసాయనిక ఎరువులు వాడకంలో ఖర్చులు తగ్గుతాయి. మట్టిపరీక్షలపై అవగాహన పెంచుకోవాలి. –డాక్టర్ రాజన్న, కేవీకే కోఆర్డినేటర్, మామునూరు -
స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..
● విద్యుత్షాక్ తగిలి రైతు మృతి ● కాల్ నాయక్ తండాలో ఘటన నర్సంపేట: వ్యవసాయ మోటారు స్టార్టర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తలిగి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్నాయక్ తండాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పో లీసులు, తండావాసుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన గుగులోత్ భద్రు(48) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి వ ద్దకు వెళ్లాడు. నీరు పారించడానికి యత్నించగా మోటారు నడవకపోవడంతో స్టార్టర్ మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్షాక్ తగిలి పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడి అ క్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు బావిలో నుంచి భద్రు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుమారుడు విజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి ● మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన మహబూబాబాద్ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఆ ర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీ సుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఉప్పల సింగారం కాలనీకి చెందిన పెండెం రాజేశ్వరరావు కుమారుడు కార్తీక్ (17) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డీవీ నాయక్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. నెలరోజుల క్రితం వచ్చిన కార్తీక్.. అకాడమీలోనే ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. బుధవారం రా త్రి బహిర్భూమికని తరగతి గది నుంచి బయట కు వచ్చిన కార్తీక్.. కోచింగ్ సెంటర్ భవనంపైకి ఎక్కి తన లోయర్ (ప్యాంట్) తీసుకుంటున్నా డు. ఈ క్రమంలో అక్కడ సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై అక్క డే పడ్డాడు. వెంటనే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చికిత్స నిమిత్తం 108లో ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కార్తీక్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కా గా, కార్తీక్ విద్యుత్ వైర్లు పట్టుకోవడంతోనే షాక్ కు గురై మృతిచెంది ఉంటాడనే అనుమానం వ్య క్తమవుతోంది. టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ ఘ టనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. -
‘పహల్గాం’పై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
న్యూశాయంపేట : పహల్గాం ఉగ్రఘటనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై మోదీ జవాబు చెప్పాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర బలగాలు.. మావోయిస్టుల మృతదేహాల ఎదుట నృత్యం చేయడం.. వారిని మోదీ, అమిత్ షా అభినందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, లేదంటే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు డబ్బులు లేవనడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, చక్రపాణి, వీరన్న, రమేశ్, వెంకట్, భానునాయక్, లింగయ్య, తిరుపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
అక్రమార్కులపై చర్యలేవి..?
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలుహన్మకొండ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఎన్పీడీసీఎల్) లో చేపట్టిన సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగినట్లు వాస్తవాలు వెలుగుచూశాయి. అయితే దీనిపై యాజమాన్యం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోంది. ఫలితంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తీరుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. అక్రమాలు జరిగినట్లు మూడు నెలల క్రితమే నిజాలు నిగ్గు తేలగా ఇప్పటి వరకూ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడంలో ఉన్న ఆంతర్యమేమిటని విద్యుత్ ఉద్యోగ వర్గాలతో పాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు.. ఎన్నిక కోడ్ ఎత్తివేశాక 2018 డిసెంబర్లో పూర్వ సర్కిళ్ల వారీగా మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ పంపారు. అయితే ఈ సమయంలో మరో 24 పోస్టులు తగ్గించారు. గతంలో కాల్ లెటర్ అందుకుని రెండోసారి కాల్లెటర్ అందని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అంతకు ముందు కాల్లెటర్ జారీ చేసిన వారందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అనర్హులతో కలిపి 427 మందికి కాల్లెటర్ పంపి పోస్టులు భర్తీ చేశారు.. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్ లెటర్ పొందిన 24 మంది అభ్యర్థులను పక్కన పెట్టారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాల్ లెటర్ అందుకుని ఉద్యోగాలు రాని అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్సీ నుంచి ఒక అధికారి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి ఇద్దరు, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి 24 పోస్టుల భర్తీలో అక్రమాలకు జరిగినట్లు గుర్తించారు. అర్హులు కాని వారు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి విచారణ కమిటీ యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి నోటీసు జారీ చేయగా వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు వీరికి అనుకూలంగా నిర్ణయం వెల్లడించడంతో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కీలక పోస్టులో ఏళ్ల తరబడి ఒకే అధికారి తిష్ట టీజీ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను ఇండస్ట్రీయల్ విభాగం నిర్వహిస్తుంది. ఈ విభాగంలో కంపెనీ ఏర్పాటు నుంచి కీలక పోస్టులో ఒకే అధికారి ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. ఈ అధికారిపై అనేక ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో ఆయనది అందెవేసిన చేయి అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకే పోస్టులో పని చేస్తుండడంతో ఏ సమయంలో ఎలా అక్రమాలకు పాల్పడొచ్చో ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని సమాచారం. దీంతో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలకు తెరలేపారని ఉద్యోగవర్గాలు పేర్కొన్నాయి. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్.. టీజీ ఎన్పీడీసీఎల్లో 497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించారు. ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. పోస్టుకు ఒక్కరు చొప్పున మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సెప్టెంబర్లో పూర్వ సర్కిల్ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్ లెటర్ పంపించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు 497 మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్ లెటర్ పంపారు. అంటే ఇక్కడ 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపేశారు. అక్రమార్కులపై చర్య తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి?ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూసినా ఎలాంటి చర్య తీసుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తే చర్యలు తీసుకునే యాజమాన్యం.. ఇంత పెద్ద అక్రమం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్లో చేపట్టనున్న నియామకాలు పారదర్శకంగా జరుగుతాయా అనే సందేహాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడింది ఇండస్ట్రీయల్ విభాగం అధికారులేనని స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలకు వెనుకంజ వేయడంపై యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు కోరుతున్నారు. విచారణ ముగిసి మూడు నెలలైనా బాధ్యులపై చర్యలు శూన్యం యాజమాన్యం వెనుకడుగు వెనుక ఉన్న ఒత్తిళ్లేమిటి..? -
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు. బుధవారం మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఇండియా(ఐక్య) పొలిట్ బ్యూరో సమావేశాల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ కొన్ని దేశాలపై కక్ష కట్టి భారీ పన్నులను విధిస్తూ అమెరికాలో చదువుకునే భారతీయ, ఇతర దేశాల విద్యార్థులపై అనేక ఆంక్షలు విధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధానాలను వ్యతిరేకించాల్సిన భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మోకరిల్లి దేశానికి తీరని నష్టం చేకూరుస్తోందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిరణ్ జిత్ సింగ్ శేఖన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పొలిట్ బ్యూరో సభ్యుడు మహేంద్ర నేహ, అనుభవ్ దాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఎన్రెడ్డి హంసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలపాలి ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై రాజ్యహింస, మావోయిస్టుల ఏరివేత పేరుతో పౌరులపై కొనసాగిస్తున్న కాల్చివేతను వెంటనే నిలపాలని ఎంసీపీఐ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మర్రెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్లో ఎంసీపీఐ కేంద్ర నాయకుడు మోర్తాల చందర్ రావు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి వెంకట్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుల ఏరివేత పేరుతో కాల్చి చంపి వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండపడ్డారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్ నిలిపి మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించి పౌర హక్కులను కాపాడాలన్నారు. సమావేశంలో నాయకులు నర్ల చంద్రశేఖర్ , పానుగంటి నరసయ్య, మాదం తిరుపతి, మాడిశెట్టి అరుణ్ కుమార్, తాటికొండ రవి, మాలోత్ రాజేశ్ నాయక్, సంద గణేశ్, బాషిపాక రమేశ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ -
పుష్కరాల ఆదాయం రూ. 2.83 కోట్లు
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన నగదు కానుకలు, లడ్డు ప్రసాదం, రూమ్ల అద్దెలు, హోమాలు, దర్శనాల ద్వారా కాళేశ్వరాలయానికి రూ. 2.83కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేశ్ తెలిపారు. బుధవారం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ హుండీలను లెక్కించారు. పుష్కరాలు 12 రోజులతో సహా మొత్తం 64 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,36,28,099 కోట్లు, దేవస్థానం అద్దె గదుల ద్వారా రూ.1.71లక్షలు, హోమాల ద్వారా రూ.1.23లక్షలు, శీఘ్రదర్శనం ద్వారా రూ.5.60.లక్షలు, ప్రసాదం ద్వారా రూ.1,38,36,552 కోట్లు, మొత్తం రూ. 2,83,18,651 ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. మిశ్రమ బంగారం 15 గ్రాములు, మిశ్రమ వెండి 1.750 గ్రాములు సమకూరిందని తెలిపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, పర్యవేక్షణాధికారి నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ నగదు లెక్కించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్శర్మ, సత్యనారాయణ, సత్యం, శ్యాందేవుడా, సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రంగస్థల నటుడు శ్యామలరావు కన్నుమూత
హన్మకొండ కల్చరల్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో దర్శకుడిగా, నటుడిగా ఖ్యాతి గడించిన శతపతి శ్యామలరావు (66) కన్నుమూశారు. వరంగల్ రైల్వేగేట్ ఉర్సు కరీమాబాద్కు చెందిన శతపతి శ్యామలరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేశారు. కిడ్నీ శరీరానికి సరికాకపోవడంతో అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏటా రంగలీలా మైదానంలో నిర్వహించే రావణవధ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. నరకాసురవధ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఆదివారం ప్రముఖ రంగస్థల కళాకారుడు జీవీ బాబు మరణించడం.. బుధవారం మరో రంగస్థల సీనియర్ కళాకారుడు శతపతి శ్యామలరావు మృతి చెందడంతో ఓరుగల్లు రంగస్థల కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల అధ్యక్షుడు ఆకుల సదానందం, ఐక్యవేదిక బాధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, సీనియర్ కళాకారుడు జేఎన్ శర్మ, జూలూరు నాగరాజు, సహృదయ సాహిత్య సాంస్కృతిక బాధ్యులు, తదితరులు సంతాపం తెలిపారు. -
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయం
● పట్టుకున్న కంపెనీ బృందం నెహ్రూసెంటర్ : బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు (ఇంట్లో వినియోగించే విద్యుత్ పరికరాలు) విక్రయిస్తున్న షాపులో కంపెనీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీలో నకిలీ పరికరాలను గుర్తించి సీజ్ చేసింది. ఈ ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోల్డ్మెడల్ కంపెనీ రీజినల్ హెడ్ నాగేశ్వర్రావు కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నీలం ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ షాపులో బ్రాండెడ్ ఎలక్ట్రికల్ పేరుతో నకిలీ పరికరాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి షాపులను నిర్వహిస్తూ ఇలాంటి నకిలీ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నకిలీ ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంతో వి ద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయని, ప్రజలు నకిలీ పరికరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. టౌన్ ఎస్సై విజయ్కుమార్ సమక్షంలో తనిఖీలు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
చెరువు మరమ్మతు పనులు ప్రారంభం
కురవి: మండలంలోని నేరడ పెద్ద చెరువు కట్ట కు బుంగ పడగా.. మరమ్మతు పనులను ప్రా రంభించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘చెరువు కట్టకు బుంగ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన కురవి ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఆదేశానుసారం చెరువు కట్టకు పడిన బుంగను పూడ్చేందుకు సిమెంట్, ఇసుక, కంకర తెప్పించి పనులు చేయడం జరిగిందన్నారు. అలాగే అలుగు కాల్వ దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే.నజీర్, కొలిపాక రాములు, నీరుడు ధనరాజ్, నరెడ్ల వెంకటరెడ్డి, కిషన్ నాయక్, సోమ్లానాయక్, ఇరుగు వెంకన్న,పరమేశ్వర్,సక్రాం, నరేష్, ఐనాల విక్రమ్, రంగన్న, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈపాస్ మిషన్లతో ఎరువులు విక్రయించాలిమహబూబాబాద్ రూరల్: డీలర్లు ఈపాస్ మిషన్లలో వివరాలు నమోదు చేసుకొని రైతులకు ఎరువులు విక్రయించాలని డీఏఓ ఎం.విజయనిర్మల అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో నేషనల్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎరువుల అమ్మకానికి ఉపయోగించే ఈపాస్ యంత్రాలను జిల్లాలోని ఎరువుల డీలర్లకు డీఏఓ బుధవారం ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు, నేషనల్ ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ రీజినల్ మేనేజర్ వంశీకృష్ణ, కంపెనీ స్థానిక సిబ్బంది సందీప్, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి తొర్రూరు: రాజీ మార్గంలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తొర్రూరు సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని కోర్టు హాల్లో జరిగిన అవగాహన సదస్సులో జడ్జి ధీరజ్కుమార్ మాట్లాడుతూ.. జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీపీ రేవతిదేవి, డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐలు గణేష్, రాజ్కుమార్, ఎస్సైలు, కోర్టు పోలీస్ కానిస్టేబుళ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● డీఎంహెచ్ఓ రవి రాథోడ్ పెద్దవంగర: వానాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. బుధవారం మండలంలోని అవుతాపురం పల్లె దవాఖానను ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి, మౌలిక వసతులపై ఆరా తీశారు. పల్లెదవాఖాన వైద్యురాలు పలు సమస్యలను డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రవి రాథోడ్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఫ్రైడే డ్రైడే వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యురాలు సబితరాణి, ఏఎన్ఎం జ్యోత్స్న, ఆశకార్యకర్తలు సరిత, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
మహబూబాబాద్: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విషపూరితమైన పాలన కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టుల శవాలను సక్రమంగా భద్రపర్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదన్నానరు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు, హత్యలు చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మొదట దళితులపై, తర్వాత మైనార్టీలపై దాడులు చేసి చివరికి మావోయిస్టులను టార్గెట్ చేసిందన్నారు. ప్రజల ఆంక్షలు, డిమాండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు ఉంచేందుకు మావోయిస్టులు పోరాటం చేస్తున్నారన్నారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు రమాదేవి, నాగభూషణం, కుమారస్వామి, సంజీవ, చంద్రన్న, మండల వెంకన్న, గౌని ఐలయ్య, హెచ్.లింగన్న, హరినాయక్, బీమా నాయక్, ఉపేందర్, వెంకన్న, అశోక్, గీత, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల సాగుకు సై..
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా తొలకరి జల్లులు కురుస్తుండడంతో అన్నదాతలతో పాటు వ్యవసాయ అధికారులు, వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు మిర్చి కట్టె తీయడం, పత్తి చేను పాటు చేయడంతో పాటు దుక్కులు దున్నుతున్నారు. దుక్కులు చేసే పనిలో.. వర్షం కురవడంతో రైతులు మిర్చి, మొక్కజొన్న, పత్తి కట్టెను తీసి దుక్కులు దున్నే పనిలో ఉన్నారు. ఇందుకోసం చిన్న రైతులు కాడెడ్లను సిద్ధం చేయగా.. మిగిలిన రైతులు ట్రాక్టర్లకు నాగళ్లు, హైవీల్స్, ఇతర పరికరాలు అమర్చే పనిలో ఉన్నారు. పదును ఉండగానే దుక్కులు పొతం చేసి.. మరోవర్షం కురిస్తే విత్తనాలు వేయాలనే ఆలోచనతో రైతులు చెలకల్లోనే గడుపుతున్నారు. రంగంలోకి టాస్క్ఫోర్స్.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాలు, కాలంచెల్లిన ఎరువులు, పురుగు మందులు అమ్మకుండా నివారించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పడిన బృందాలు ఇప్పటికే జిల్లాలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తన షాపులను తనిఖీలు చేశాయి. ప్రతీ అమ్మకానికి బిల్లులు ఇవ్వాలని, రైతులను మోసం చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేవారు. అదే విధంగా రైతుల వద్దకే అధికారులు అనే పేరుతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వెళ్లి రైతులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లా పరిస్థితికి అనుగుణంగా ఏ పంటలు వేయాలి అని సూచించా రు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కావాల్సిన విత్తనాల వివరాలుపంట విస్తీర్ణం విత్తనాల అవసరం అందుబాటులో ఉన్నవి (ఎకరాలు) వరి 2,21,282 44,256 క్వింటాళ్లు 618క్వింటాళ్లు పత్తి 84,854 1,69,708 ప్యాకెట్లు 84,360ప్యాకెట్లు మొక్కజొన్న 58,361 4,669 క్వింటాళ్లు 14 క్వింటాళ్లు మిర్చి 52,249 522.49 క్వింటాళ్లు 12 క్వింటాళ్లు కందులు 750 30 క్వింటాళ్లు 2 క్వింటాళ్లు పెసర 4,555 182.49 క్వింటాళ్లు 9.8 క్వింటాళ్లు మినుము 10 40 కిలోలు 20 కిలోలు వేరుశనగ 41 21 క్వింటాళ్లు లేవు పసుపు 463 463క్వింటాళ్లు లేవు నువ్వులు 52 1.04 క్వింటాళ్లు 20 కిలోలు ఇతరపంటలు 33,274 345 క్వింటాళ్లు 48 క్వింటాళ్లువిత్తనాలు, ఎరువుల సేకరణ.. పంట సాగులో ముఖ్యమైన ఘట్టం విత్తనాల సేకరణ. కాగా గతంలో జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలతో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా.. అలాగే చీడ పీడలను తట్టుకొని అధిక దిగుబడి నిచ్చే విత్తనాలు కొనుగోలు పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో వానాకాలంలో 4,22,641 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,21,282 ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశం ఉంది. ఇందులో కూడా ఎక్కువ మంది రైతులు సన్నరకం వరి వంగడాలనే సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే విధంగా 84,854 ఎకరాల్లో పత్తి, 52,249 ఎకరాల్లో మిర్చి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ఇందులో మిర్చి విత్తనాల కో సం గుంటూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తేవడం, నర్సరీల్లో మొ క్కలు పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. పచ్చిరొట్టకోసం ఇప్పటికే జీలుగ, జనుము విత్తనాలు కొని దుక్కిలో చల్లుతున్నారు. న్యూస్రీల్జూన్ నెల వరకు ఎరువులు (మె.ట..) ఎరువు కావాల్సినవి ప్రస్తుతనిల్వ డీఏపీ 1,002 1,206ఎంఓపీ 152 369ఎస్ఎస్పీ 139 834కాంప్లెక్స్ 4,171 5,304తొలకరి జల్లులతో రైతుల పొలంబాట చెలక పాటు చేసేందుకు సిద్ధం విత్తనాల సేకరణలో బిజీబిజీ మరో వర్షం కురిస్తే విత్తనాలు నాటుడే.. -
సర్వం సిద్ధం చేశాం
తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇందుకు అనుగునంగా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. ముందుగా పచ్చిరొట్ట వేయాలని రైతులను ప్రోత్సహించి 50శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. నకిలీ విత్తనాల బెడద లేకుండా టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాం. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతాం. కొరత ఉందని ప్రచారం చేస్తే రైతులు నమ్మకండి. – విజయ నిర్మల, డీఏఓ -
ప్రభుత్వ బడుల బలోపేతానికి పాటుపడాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యార్థుల నమోదుకు ఉపాధ్యాయులు పాటుపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బడిబాట ప్రచార జాత కార్యక్రమ పోస్టర్లను బుధవారం డీఈఓ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడటమే కాకుండా.. బడి బాగుకోసం టీఎస్ యూటీఎఫ్ ప్రచారం నిర్వహించడం అభినందనీయం అన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీకృష్ణ, యాకూబ్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా టీఎస్ యూటీఎఫ్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు హుస్సేన్, హరినాయక్, రమేశ్, మండలాల బాధ్యులు ప్రవీణ్ కుమార్, అబ్దుల్ అజీజ్, సుందర్ కుమార్, వెంకన్న, భిక్షపతి, షరీఫ్, పార్వ తి, అనిత, శంకర్, వీరస్వామి, రాములు, సాహెబ్ అలీ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్ రెడ్డి -
ధాన్యం రైతులు అధైర్యపడొద్దు
మరిపెడ రూరల్: ధాన్యం రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అద్వైత్కుమార్ అన్నారు. మరిపెడ మండలం తండధర్మారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని ధాన్యం సేకరణ రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, ఏపీఎం రాములు, సిబ్బంది, రైతులు తదితరులు న్నారు. కొనుగోళ్లు పూర్తి చేయాలి.. పెద్దవంగర: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని పోచంపల్లి, గంట్లకుంట, చిట్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. పలు రికార్డులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అనవసరమైన వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. ధాన్యం కాంటా పెట్టి వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచి ంచారు. డీసీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేందర్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయాలి.. తొర్రూరు రూరల్: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని మాటేడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఆయాశాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సహకారశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతరశాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
‘రాజీవ్ యువవికాసం’ పకడ్బందీగా అమలు చేయాలి
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి హైదారాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి రాజీవ్ యువవికాసం పథకం అమలుపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకుల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఈ పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హుల జాబితా తయారు చేసినట్లు చెప్పారు. మొదటి విడతలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చే నెల 2 నుంచి 9వరకు అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వై త్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కాల్మొక్త సారూ.. మా వడ్లు కొనండి
నర్సింహులపేట/దంతాలపల్లి/కోనరావుపేట: వానాకాలం తరుముకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలున్న అన్నదాతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వారాలతరబడి వేచిచూస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవటం, మరోవైపు రోజూ వర్షాలు పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో వడ్లకు కాంటా వేయాలని అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యం కొనుగోలు చేయాలని ఇద్దరు గిరిజన మహిళా రైతులు తహసీల్దార్ రమేశ్బాబు కాళ్లు మొక్కి వేడుకున్నారు. తిర్మాతండాకు చెందిన భూక్య గోరి, భూక్య ఈరి అనే మహిళా రైతులు 40 రోజుల క్రితం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు అధికారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అక్కడ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసి కొనుగోలు కేంద్రం జలమయమైంది. దీంతో తహసీల్దార్ రమేశ్బాబు బుధవారం ఆ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు.వర్షానికి వడ్లు తడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వెంటనే కాంటా వేసి తరలించాలని వేడుకుంటూ ఆ రైతులు తహసీల్దార్ కాళ్లు మొక్కారు. ఇతర రైతులు ఆగ్రహంతో నిలదీయటంతో రెండు రోజుల్లో కాంటా వేసి ధాన్యం తరలిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ధాన్యం బస్తాలతో రోడ్డుపై నిరసనధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో రైతులు బుధవారం ధాన్యం బస్తాలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోకపోవటంతో దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలు అడ్డుగా పెట్టి సుమారు 45 నిమిషాలు ధర్నా చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్పైగా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తమ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి 60 రోజులు అవుతోందని, ధర్నాను అడ్డుకోవద్దని పోలీసుల కాళ్లు పట్టుకోబోయాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతులు బుధవారం స్థానిక వై జంక్షన్ వద్ద పురుగులమందు డబ్బాలు పట్టుకుని తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. వెంకట్రావుపేట కేంద్రం పరిధిలో 10 వేల క్వింటాళ్లలోపే ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికే 8,300 క్వింటాళ్లు తూకం వేశామని సింగిల్విండో చైర్మన్ బండ నర్సయ్య చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే సింగిల్విండోను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
● ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరాంనాయక్ రామన్నపేట : తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్ప డుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మట్టెవాడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ చూపుతూ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన వెంకటి రామ్ గోద్మారే, ఇదే రాష్ట్రం యవత్మాల్ జిల్లా ఇందిరానగర్కు చెందిన షెరాలీ సయ్యద్ మోతీ పరిచయస్తులు. బోళ్ల (స్టీల్, అల్యుమినియం గిన్నెలు) వ్యాపారైన గోద్మారే.. ఆ సామగ్రి అమ్మకంతో వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2008 నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 20కి పైగా చోరీలకు పాల్పడ్డాడు. షెరాలీ సయ్యద్ మోతీ కూడా జల్సాలకు అలవాటు పడి అక్కడి సుపారీ గ్యాంగ్లో చేరాడు. 2019లో ఓ మర్డర్ కేసులో మహారాష్ట్రలోని అమరావతి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వెంకటి గోద్మారేతో పరిచయం ఏర్పడింది. దీంతో గోద్మారే సలహా మేరకు 2022లో ఇద్దరు కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డారు. రాయ్పూర్ జైలుకు వెళ్లి తిరిగి మే 01, 2024న విడుదలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్పై ఉండడంతో జల్సాలు, లాయర్కు డబ్బులు ఇవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈనెల 11న రైలులో వరంగల్కు చేరుకుని నగరంలోని బ్యాంకు కాలనీ –2లోని శాంతినగర్లో బయ్య స్వామి అనే వ్యక్తి ఇంటి తాళం పగులకొట్టి 9 తులాల బంగారం, రూ. వెయ్యి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గాలించి పట్టుకున్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మట్టెవాడ ఎస్హెచ్ఓ గోపి, ఎస్సై నవీన్కుమార్, కానిస్టేబుళ్లు హరికాంత్, మీర్ మహ్మద్ అలీ, రాజేశ్,ఏఏఓ మహ్మద్ సల్మాన్ పాషా, నగేశ్రెడ్డి, ప్రవీణ్ను ఏసీపీ అభినందించారు. కాసుల పెట్టె గలగల.. ● ఆర్టీసీ పుష్కర ఆదాయం రూ.6.29 కోట్లు ● 5,047 ట్రిప్పుల ద్వారా 4,36,189 భక్తుల చేరవేత హన్మకొండ: సరస్వతీనది పుష్కరాలకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రత్యేక బస్సుల నడిపి రూ.రూ.6,29,94,460 ఆదాయం రాబట్టుకుంది. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతినదీ పుష్కరాలకు వరంగల్ రీజియన్లోని ఆయా బస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరవేసింది. 5,047 ట్రిప్పుల ద్వారా 6,28,586 కిలో మీటర్లు బస్సులు తిప్పి 4,36,189 ప్రయాణికులను చేరవేసి రూ.6,29,94,460 ఆదాయం పొందింది. 12 రోజుల పాటు సురక్షితంగా బస్సులు నడిపి క్షేమంగా భక్తులను చేరవేసింది. అధికారులు బస్ స్టేషన్లో ఉండి భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు సమకూర్చుకుంటూ వెంట వెంటనే చేరవేశారు. 2 నుంచి స్లాట్ బుకింగ్ కొడకండ్ల : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లోనూ వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ డి.ఫణిందర్ తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కొడకండ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కూడా ఆస్తులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుకింగ్ విధానం అమలవుతుందని, ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి చేసి దస్తావేజులు అందజేస్తామన్నారు. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని, స్లాట్ బుకింగ్ తమ వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ కిశోర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక బస్సుల వివరాలు, వచ్చిన ఆదాయం (రూ.లలో).. తేదీ ట్రిప్పులు భక్తులు ఆదాయం 15న 166 13,877 14,14,083 16న 212 15,410 19,15,312 17న 270 21,999 28,89,795 18న 439 39,597 5353158 19న 364 34,237 44,81,904 20న 320 26,643 35,86,130 21న 300 24,816 33,43,466 22న 376 31,612 45,02,242 23న 461 45,609 63,01,693 24న 680 61,237 92,33,941 25న 780 64,454 1,07,95,477 26న 679 56,698 91,77,259 -
మూడు నెలల కోటా.. ఒకేసారి
మహబూబాబాద్: వర్షాలు, వరదల వల్ల ఎదుర య్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడు నెల ల బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వచ్చే 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నారు. డీసీఎస్ఓ అధికారులు అలాట్మెంట్, ఇతర ప్రక్రియను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణాకు అధికంగా లారీలను ఉపయోగించడంతో రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 2,40,543 రేషన్కార్డులు.. జిల్లాలో 2,40,543 రేషన్కార్డులు ఉన్నాయి. 558 రేషన్ షాపులకు ప్రతీ నెల 4,602 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కేటాయిస్తున్నారు. కాగా వర్షాకాలం, గోదాంలలో బియ్యం నిల్వలు తదితర కారణాల వల్ల మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 14,414 మెట్రిక్ టన్నుల బియ్యం.. జిల్లాలో పెరిగిన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా మూడు నెలలకు 14,414 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. మానుకోట, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, కొత్తగూడ, గార్లలోని ఎంఎల్ఎస్ (మండల లెవల్ స్టాకింగ్) గోదాంల నుంచి వాటి పరిధిలోని షాపులకు బియ్యం సరఫరా జరుగుతంది. ఈనెల 25 నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా జరగాల్సి ఉండగా.. లారీల కొరతతో ఈనెల 27నుంచి పంపిస్తున్నారు. గోధుమలు, చక్కెర పంపిణీ విషయంలో అస్పష్టత.. సన్నబియ్యంతో పాటు గోధుమలు, చక్కెర పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే డీలర్లు గోధుమలు, చక్కెర తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే పంపిణీ చేసే అవకాశం కల్పించిందని అంటున్నారు. ఇదిలా ఉండగా గోధుమలు హైదరాబాద్కే పరిమితమని, అతి తక్కువగా ఉండే అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే చక్కెర పంపిణీ చేసే అవకాశం ఉందని డీలర్లు అంటున్నారు. జిల్లా కేంద్రంలో చక్కెర గోదాం లేకపోవడంతో డీడీ చెల్లించడం లేదని డీలర్లు చెబుతున్నారు. కేటాయింపు పూర్తి జిల్లాలో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి ఇచ్చేందుకు ప్రాసెస్ పూర్తి అయ్యింది. వెంటనే షాపులకు సన్నబియ్యం సరఫరా చేసి.. వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. మున్సిపాలిటీ పరిధిలో చక్కెర, గోధుమలు ఇచ్చే అవకాశం ఉన్నా డీలర్లు ముందుకు రావడం లేదు. వాళ్లు ఆర్వో చెల్లించకపోవడంతో వాటిని సరఫరా చేయలేకపోతున్నాం. – ప్రేమ్కుమార్, డీసీఎస్ఓ జూన్లో మూడు నెలల బియ్యం పంపిణీ వర్షాలు, వరదల నేపథ్యంలో నిర్ణయం 14,414 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు జిల్లాలో 2,40,543 రేషన్ కార్డులు -
పిడుగుపాటు.. ముందే తెలుసుకోవచ్చు
● ‘దామిని’ యాప్ ద్వారా ప్రమాదాన్ని ముందే పసిగట్టొచ్చు ● ఎరుపు, పసుపు, నీలి రంగుల ద్వారా ఎంత సమయంలో పిడుగు పడుతుందనే సమాచారం ● ప్లేస్టోర్లో అందుబాటులో‘ దామిని’ యాప్సంగెం: అకాల వర్షాలు, వానాకాలంలో పిడుగులు పడి మూగజీవాలు, ప్రజలు మృతి చెందడం మనం చూస్తుంటాం. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజాజీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉరుములతో కూడిన వర్షాలతో పాటు పిడుగుపాటుతో ప్రా ణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఏటా పిడుగుపాటుకు గురై అధిక సంఖ్యలో మూగజీవాలు, ఎ క్కువ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిడుగు పాటుపై పరిశోధనలు చేసిన భారత వా తావరణ శాఖ పిడుగు పడడాన్ని ముందే పసిగట్టేందుకు ఓ యాప్ను ఆవిష్కరించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ(ఐఐటీఎం) ‘దామిని’ యాప్ను రూపొందించింది. యాప్ డౌన్లోడ్ ఇలా.. స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతీ ఒక్కరు ప్లేస్టోర్ నుంచి ‘దామిని’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ తెరిచి పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్ నమోదు చేయాలి. అనంతరం జీపీఎస్ లోకేషన్ కోసం యాప్ను వినియోగించే సమయంలో మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో, లేదో మూడు రంగుల్లో చూపిస్తుంది. ● ఎరుపు రంగు.. ● మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది. ● పసుపు రంగు.. ● మీరు ఉన్న ప్రాంతంలో 10 నుంచి 15 నిమిషాలలోపు పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ పసుపు రంగుగా మారుతుంది. ● నీలం రంగు.. ● మీరు ఉన్న ప్రాంతంలో 18 నుంచి 25 నిమిషాలలోపు పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ నీలం రంగులో కనిపిస్తుంది. మీకు తెలుసా.. ?పాటించాల్సిన జాగ్రత్తలు నల్ల మబ్బులు ఆకాశమంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్న సమయంలో రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాల్లోకి లేక తాము ఉన్న చోటనే మోకాళ్లపై కూర్చుని రెండు చెవులు మూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొబైల్ సిగ్నల్స్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తాయి. మబ్బులు ఉన్న సమయంలో పంట పొలాల్లో మొబైల్ వినియోగించకపోవడం మంచిది. విద్యుత్ స్తంభాలు, సెల్ఫోన్ టవర్లు, బోర్పంప్ సెట్లకు దూరంగా ఉండాలి. బోరు మోటార్ల నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో వినియోగించొద్దు. పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. -
90శాతం ధాన్యం సేకరణ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 90శాతం ధాన్యం సేకరించినట్లు సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి.. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 90శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. 15రోజుల ముందు రుతుపవనాలు రావడంతో మిగిలిన ధాన్యం సేకరణ ఇబ్బందిగా మారిందన్నారు. రైతులకు రూ.1,2184 కోట్లు చెల్లించామన్నారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించాలని ఆదేశించారు. భూభారతి చట్టం అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఆర్డీఓ మధుసూదన్రాజ్, అధికారులు వెంకటేశ్వర్లు, విజయనిర్మల, ప్రేమ్కుమార్, నర్సింహరావు, మరియన్న తదితరులు పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
మిషన్ వాత్సల్య ఉపకారవేతనం కింద రూ.2 కోట్లకుపైగా నిధులు
సాక్షి, వరంగల్ : అనాథ బాలురకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న ‘మిషన్ వాత్సల్య’ పథకం స్పాన్సర్షిప్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 883 మంది అనాథలకు 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు రూ.2,11,92,000 నిధులు మంజూరయ్యాయి. ఈ ఉపకారవేతనం కోసం ఆరు జిల్లాల్లో కలిపి పదివేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రాధాన్యత క్రమంలో ఉన్న అర్హులైన 883 మంది అనా థలతోపాటు వారి గార్డియన్ల జాయింట్ బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు అధికారులు జమ చేయనున్నారు. ప్రాధాన్యత క్రమంలో తల్లిదండ్రులు చనిపోయినవాళ్లు, హెచ్ఐవీ బాధిత తల్లిదండ్రుల పిల్లలకు, తండ్రి చనిపోయి తల్లి వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన పిల్లలకు, వితంతువుల పిల్లలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారు, అక్రమ రవాణా, దాడులకు గురైన వారు, బాల యాచకులు, బాల్య వివాహ బాధ్యులు అంటే 18 సంవత్సరాలలోపు బాలలకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం జమచేయనున్నారు. ఈ పిల్లల్లో కూడా ఎవరైనా మహాత్మా జ్యోతిబాపూలే, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నవారికి అందనుంది. ఇటీవల కేంద్రం 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు నిధులు విడుదల చేయడంతో అసలైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వీటిని జమచేసేలా మహిళా, శిశు సంక్షేమ విభాగాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే రెండువేలకు పైగా దరఖాస్తులు వస్తే వారిలో ప్రాధాన్యత క్రమంలో అర్హులుగా 97 మందిని గుర్తించారు. మిగిలిన 46 మందిని స్పాన్సర్షిప్ కమిటీ పరిశీలించి కలెక్టర్కు నివేదించిన తర్వాతనే వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇతర ఐదు జిల్లాలో ఈ స్థాయిలోనే దరఖాస్తులు రాగా అర్హులను గుర్తిస్తున్నారు.ఈ పథకంతో ఎంతో మేలు..మిషన్ వాత్సల్య పథకం డెవలప్మెంట్ గోల్స్తో ముడిపడి ఉంటుంది. పిల్లల రక్షణ ప్రాధాన్యతలను గుర్తించడానికి ఇదొక చక్కటి ప్రణాళిక. బాలల న్యాయ సంరక్షణ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు బాలల హక్కులు, అవగాహనపై ‘ పిల్లలను వదిలేయవద్దు‘ అనే నినాదంతో ఈ పథకం పనిచేస్తుంది. కోవిడ్ 19 కారణంగా ఎటువంటి ఆదరణ లేని అభాగ్యులుగా మిగిలిన పిల్ల లకు చేయూతను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ వాత్సల్య‘ పేరుతో దీన్ని 2021 సంవత్సరంలో ప్రారంభించింది. దీనిద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 883 మంది అనాథలకు లబ్ధి చేకూరుతుందని ఆయా జిల్లాల సంక్షేమ విభాగాధికారులు అంటున్నారు. -
ఆగస్టు 19 నుంచి కేయూలో ‘సైన్స్ కాంగ్రెస్ ’
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19 నుంచి 21వతేదీ వరకు మూడురోజులు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంఽధించిన బ్రోచర్ను కేయూలోని సెనేట్హాల్లో మంగళవారం వీసీ కె. ప్రతాప్రెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సిహెచ్. మోహన్రావు, అకాడమీ బాధ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అకాడమీ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 19, 20, 21తేదీల్లో మూడురోజుల సమావేశాల్లో రెండు ప్లీనరీ సమావేశాలతోపాటుగారెండు సబ్థీమ్స్, నాలుగు స్పెషల్థీమ్స్తో సమాంతరంగా సెషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులకు సైంటిస్టులతో ఇంటరాక్షన్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ సైన్స్ కాంగ్రెస్ జరగబోతుండడం ఇది రెండోది. 2018లో వరంగల్ నిట్లో నిర్వహించారు.ఈసారి కేయూలో జరగబోయే సైన్స్కాంగ్రెస్కు వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా వివిధ తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్యాకేజీ–1 వివరాలు..గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర జూన్ 14న ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. ప్యాకేజీ–2 వివరాలు..సికింద్రాబాద్ నుంచి వయా కామారెడ్డి, నిజా మాబాద్ మీదుగా ఐదు జ్యోతిర్లింగ యాత్ర రైలు జూలై 5వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9701360701, 9281030712, 9281495845, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలుభూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీనది పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులకు అభినందనలు తెలిపారు. విధుల్లో నిబద్ధత, సమగ్ర ప్రణాళిక, అవిశ్రాంత కృషితో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. పుష్కరాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను అ భినందించారు. సమష్టి బాధ్యతతో నిర్వహించిన ఈ పుష్కరాలు మన భవిష్యత్ కార్యాచరణకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. -
ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో రెగ్యులర్ ఎంఏ తెలుగుకోర్సులో ప్రవేశం పొందడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని పీఠాధిపతి గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హంటర్రోడ్లోని వరంగల్ ప్రాంగణంలో జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2025–2026 విద్యాసంవత్సరానికి ఎంఏ తెలుగుకోర్సులో ప్రవేశం పొందడానికి ఆసక్తి గల విద్యార్థులు తెలుగు విశ్వవిద్యాలయం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. teluguuniversity.ac.in, WWW.pstucet.org వెబ్సైట్లో వివరాలు పొందుపర్చామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 2025 జూన్24లోగా సాధారణ రుసుముతో, 2025జూన్30 వరకు ఆలస్య రుసుముతో సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9989417299, 9989139136 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
వెదజల్లే పద్ధతితో రైతులకు మేలు
బయ్యారం: వెదజల్లే పద్దతిలో వరిసాగు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మల్యాల కేవీకే పోగ్రాం కో–ఆర్డినేటర్ మాలతి అన్నారు. బయ్యారం సొసైటీ ఆవరణలో మంగళవారం ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు ఆమె హాజరై మాట్లాడుతూ.. వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసిన రైతులు కలుపు నివారణపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పద్ధతిలో రైతులు తక్కువ పెట్టుబడితో పంటను సాగు చేయవచ్చన్నారు. రైతులు విత్తనశుద్ధి చేయడం వల్ల ప్రారంభదశలో వరిపంటను ఆశించే పలు తెగుళ్లను అరికట్టవచ్చన్నారు. పచ్చిరొట్టను సాగు చేయడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చన్నారు. పత్తి, మిరప ఇతర వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంటమార్పిడి పద్ధతి పాటించాలన్నారు. పంటల సాగులో రైతులకు ఎల్లప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు తమ శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు వానాకాలం పంటలసాగుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఓ రాంజీ, మల్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, రాంబాబు, ఏఈఓలు రచన, తేజస్విని, అఖిల్, ఫయాజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సన్నద్ధం..
కేయూ క్యాంపస్: న్యాక్ ఏప్లస్ గ్రేడ్ కలిగిన కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 19 వతేదీతో 50 వసంతాల్లోకి అడుగిడబోతోంది. ఈమేరకు వీసీగా ప్రతాప్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల అనంతరం తొలిసారి మంగళవారం కేయూ సెనేట్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేపట్టిన, చేపట్టబోయే పలు అభివృద్ధి అంశాలను వివరించారు. ప్రధానంగా అకడమిక్, పరిశోధనల పరంగా వర్సిటీని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వర్క్షాప్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సెమినార్స్ నిర్వహిస్తున్నామన్నారు. రూసా నిధులతో యూనివర్సిటీలోని కే హబ్లో ఆరు రీసెర్చ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 65మందికి ప్రాజెక్టు ఫెల్లోస్ అవకాశం లభించిందని, ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో స్కిల్స్ ఆధారిత కోర్సులను కూడా ప్రారంభిస్తామన్నారు. కేయూలో ఈఏడాది ఆగస్టు 19నుంచి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. మూడురోజులు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహిస్తామన్నారు. అందుకు ముందు గోల్డెన్జూబ్లీ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్ప నకు ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థులు కూడా గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగస్వాములయ్యేలా కార్యక్రమ ప్రణాళిక రూపొందించబోతున్నామన్నారు. కొత్త కోర్సుల రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధికల్పన కోర్సులపై కూడా దృష్టిసారిస్తామన్నారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేయూకు బ్లాక్గ్రాంట్ గతంకంటే సుమారు రూ.9కోట్లకుపైగా పెంపుదలచేసి బడ్జెట్లో రూ. 144 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే, యూనివర్సిటీలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 50కోట్లు కేటాయిందన్నారు. విద్యార్థులకు హాస్టల్ భవనాలు కేయూలో 4వేలకు పైగా పీజీ తదితర కోర్సుల విద్యార్థులు ఉన్నారు. అయితే అందుకు సరిపడా హాస్టల్స్ అవసరం ఉంది. గర్ల్స్, బాయ్స్కు హాస్టల్ భవనాలు అవసరం ఉంది. వాటి నిర్మాణాల కోసం కృషి చేస్తున్నామని వీసీ తెలిపారు. అలాగే, మహిళా ఇంజనీరింగ్ అకడమిక్ బ్లాక్ను కూడా నిర్మిస్తామన్నారు. జూలై 7న కేయూ స్నాతకోత్సవం కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7న నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవర్మ కూడా రానున్నారని వీసీ వెల్లడించారు. వివిధ కోర్సుల్లో 546 మంది అభ్యర్థులకు గోల్డ్ మెడల్స్, 573 మంది అభ్యర్థులకు డాక్టరేట్లు ప్రదానం చేస్తారని తెలిపారు. కేయూ భూముల పరిరక్షణకు ప్రహరీ నిర్మాణం కాకతీయ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు రూ. 20 కోట్లతో ప్రహరీ నిర్మించబోతున్నాం. ఇప్పటికే విజిలెన్స్, మున్సిపల్ అధికారుల సమక్షంలో రెవెన్యూ అధికారుల సర్వే పూర్తయింది. అధికారుల నుంచి ఫైనల్ రిపోర్టు రావాల్సింది. కబ్జాదారులపై కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు సమయపాలన పాటించేలా హాజరు.. కేయూలో అధ్యాపకులు, ఉద్యోగులు సమయపాలన పాటించేలా ఈఏడాది జూలైలో ఫేస్ రికగ్నినేషన్ అటెండెన్స్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వీసీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం పాల్గొన్నారు.ఆగస్టు 19వ తేదీతో కేయూకు 50 వసంతాలు అందరి సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధి ఈసారి బ్లాక్గ్రాంట్స్ పెంచిన ప్రభుత్వం అకడమిక్, పరిశోధనల పరంగా ముందుకు రూసా నిధులతో కే హాబ్ అందుబాటులోకి.. భూముల పరిరక్షణకు ప్రహరీ నిర్మాణం వీసీ కె.ప్రతాప్రెడ్డి వెల్లడి -
నర్సింహులపేట, కురవిలో భారీ వర్షం
నర్సింహులపేట: మండలంలో మంగళవారం రాత్రి 7 గంటలకు భారీగా వర్షం కురిసింది. మండలంలోని వివిధ గ్రామాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నుంచి వరద నీరు పోటెత్తింది. కురవి : మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం రాశులపై రైతులు టార్పాలిన్లు కప్పుకున్నారు. కురవి, నేరడ, అయ్యగారిపల్లి గ్రామాల్లో కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యం బస్తాలున్నాయి. చెరువుకట్టకు బుంగమండలంలోని నేరడ గ్రామ పెద్ద చెరువు కట్టకు మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బుంగ పడింది. చెరువుకట్టపై దర్గా మాదిరిగా నిర్మాణం చేసి ఉంది. ఆ నిర్మాణం కింది భాగంలో బుంగ పడడంతో చెరువుకట్టకు ప్రమాదం పొంచి ఉంది. అలాగే చెరువు సమీపంలో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీ కూలింది. -
రైల్వే పెన్షనర్లు డిజిటల్ సేవలకు అప్డేట్ కావాలి
కాజీపేట రూరల్ : రైల్వే పెన్షనర్లకు హ్యుమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఆర్ఎంఎస్)– ఈ పాస్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) డిజిటల్ సేవలు ప్రవేశపెట్టినట్లు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ నేషనల్ (ఏఐఆర్ఆర్ఎఫ్) ప్రెసిడెంట్ ఎస్.శ్రీధర్ అన్నారు. కాజీపేట జంక్షన్లోని రైల్వే కమ్యూనిటీహాల్లో మంగళవారం రైల్వే పెన్షనర్ల శ్రేయస్సు దృష్ట్యా డిజిటల్ లిట్రసీ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ అవగాహన నిర్వహించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ రస్నాదేవి మాట్లాడుతూ రైల్వే పెన్షనర్స్ హెచ్ఆర్ఎంఎస్ ఈ –పాస్ను అనుసంధానం చేసుకోవాలన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రి ఏసీఎంఎస్ హరిబాబు.. హెచ్ఎంఐఎస్ వినియోగంలో ఉన్న లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఎఐఆర్ఆర్ఎ్ఫ్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఎస్.బాబు రావు, పి.వెంకటేశ్వర్లు, డివిజన్ ట్రెజరర్ డి.రాజేశ్వర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సంగమయ్య, సిహెచ్.కొమ్మాలు, జె.కె.మల్లయ్య, సుధాకర్, యాదగిరి, రజాలి, ఆర్.వెంకటేశ్వర్లు, రామారావు, బి.సమ్మయ్య, ఆగయ్య, డి.మల్లేశం, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, బెల్లంపల్లి, జమ్మికుంట, రామగుండం, కేసముద్రం,డోర్నకల్, ఖమ్మం, వరంగల్, కాజీపేట నుంచి 300 మంది రైల్వే రిటైర్డ్ పెన్షనర్లు పాల్గొన్నారు. ఏఐఆర్ఆర్ఎఫ్ ప్రెసిడెంట్ శ్రీధర్ -
కార్పొరేట్ కంపెనీలతో రైతు పరిస్థితి దుర్భరం
ఖిలా వరంగల్: రైతులు గౌరవం కోల్పోయారని, పంట సాగు మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడంతో రైతులు దుర్భర జీవితం ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్ ఎంసీపీఐ నాయకుడు మోర్తాల చందర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు గతంలో ఇంట్లో విత్తనాలు తయారు చేసుకునేదని, ఇప్పుడు పత్తి విత్తనాలు కావాలంటే నగదు పట్టుకుని విత్తన షాపులకు వెళ్లాలని, అక్కడ నాణ్యమైన విత్తనాలు లభించడం లేదన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేట్ చేతుల్లో ఉన్న విత్తన కంపెనీల ప్రభావాన్ని తగ్గించి రైతులకు నేరుగా సహాయ సహకారాలతోపాటు నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి రామన్నపేట : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు మర్రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో భాగంగా రెండో రోజు మంగళవారం నగరంలోని పోచమ్మమైదాన్లో నిర్వహించిన రైతు ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు, నాయకులు చంద్రశేఖర్, సింగతి సాంబయ్య, పానుగంటి నర్సయ్య, బాషిపాక రమేశ్, కుస సంపత్, బల్సుకూరి నర్సయ్య, వీరమల్లు రాజు, మాదం తిరుపతి, తాటికొండ రవి, మాలోత్ రాజేశ్ నాయక్, రాకేశ్, సూరి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం -
అనుమతిలేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు
కేసముద్రం: అనుమతిలేని విత్తనాలను విక్రయిస్తే సంబంధిత డీలర్పై విత్తనచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని రైతువేదికలో కేసముద్రం, ఇనుగుర్తి మండలాలకు చెందిన విత్తన, ఎరువుల, పురుగుమందుల డీలర్లకు ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లూజు పత్తి విత్తనాలు, అనుమతిలేని బీటీ–3 పత్తి విత్తనాలు అమ్మితే రైతులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి డీలర్ చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకోవాలన్నారు. అదే విధంగా రిజిస్టర్లు, బిల్లుబుక్కులు మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు వివేక్, రవీందర్, ఎస్సై మురళీధర్రాజు, ఏఓలు బి.వెంకన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరం.. పరిసమాప్తం
భూపాపల్లి/కాళేశ్వరం: పన్నెండు రోజులు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. ఈనెల 15న ఉదయం 5.44 గంటలకు మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ఘనంగా ఆరంభించారు. దీంతో 12 రోజులుగా భక్తజనం లక్షలాదిగా తరలివచ్చి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ముందు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు చేశారు. పిండ ప్రదాన పూజలు, తర్పణాలు, సంకల్ప పూజలు చేశారు. నదీమాతకు పూజలు నిర్వహించారు. చీర, సారె, నైవేద్యం సమర్పించారు. సరస్వతి ఘాట్ వద్ద 17 అడుగుల ఏకశిలా సరస్వతిమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి బారులుదీరారు. చివరి రోజు లక్షకుపైగా.. ఉదయం నుంచి రాత్రి వరకు చివరి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. ఉదయం నుంచి పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపారు. అనంతరం ఆటోలు, అధికారులు ఏర్పాటు చేసిన షటిల్ బస్సుల్లో పుష్కరఘాట్లకు తరలివెళ్లారు. రాత్రి వరకు లక్షకుపైగా మంది భక్తులు పుష్కర స్నానాలు చేసి ముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. ప్రముఖుల పూజలు.. కాళేశ్వరంలోని సరస్వతీనదిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్కుమార్, సీఎస్ రామకృష్ణరావు, స్పెషల్ సెక్రటరీ వికాస్రాజ్ దంపతులు, ప్రవచన కర్త నాగఫణి శర్మ, ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్ పుష్కర స్నానాలు ఆచరించి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన.. గోదావరి ఘాట్, పార్కింగ్ స్థలాలు, ఆలయ పరిసరాల్లో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే పరిశీలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియర్ చేశారు. అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. ముగిసిన హోమాలు.. కాళేశ్వరం : రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్య వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు, వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలనే ఆకాంక్షతో పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు 12 హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రావు, ఈఓ మహేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సరస్వతీనది పుష్కరాలు 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహణ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, ముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు చివరి రోజు లక్షకుపైగా భక్తుల రాక ప్రముఖుల పూజలు -
ఒప్పుకున్న ప్రకారమే డబ్బు చెల్లించాలి..
రాయపర్తి: బ్యాంకులో దాచుకున్న బంగారం చోరీకి గురైందని, ఈ విషయంలో బ్యాంకు అధికారులు డబ్బు చెల్లి స్తామని ఒప్పుకున్నారని, ఆ ప్రకారమే ప్రస్తుతం బంగారా నికి ఉన్న ధర చెల్లించాలని పలువురు ఖాతాదారులు డిమాండ్ చేశారు. తక్కువ ధర చెల్లిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశా రు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలోని ఎస్బీఐ ఎదుట, అనంతరం వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్బీఐలో గతేడాది నవంబర్ 18న బ్యాంకులో 495 మందికి చెందిన 19కిలోల బంగారం చోరీకి గురైన విషయం విధితమే. ఈఘటనలో పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 కిలోల 520 గ్రాముల బంగారం రికవరీ చేశారు. బాధితులు అధైర్యపడొద్దని, న్యా యం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గత నెలలో తులానికి రూ.95వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో బాధితులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో 87 మంది పేర్లు ఉన్నతాధికారులకు పంపారు. అందులో కొంత మందికి రూ.92వేలు, మరి కొంతమందికి రూ.87వేలు పలు రకాలుగా రావడంతో తక్కువ వచ్చినవారు వద్దని, ఎక్కువ వచ్చినవారు లెక్క చూసుకుని వెళ్లారు. ఈ క్రమంలో రూ. 95వేలు ఒప్పుకున్న బ్యాంకు అధికారులు ప్రస్తుతం తక్కువ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ బ్యాంకు ఎదుట తర్వాత వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సైలు చందర్, శ్రవణ్కుమార్ బాధితులతో మా ట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న బ్యాంకు ఆర్ఎం రహీమ్ను బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీశారు. ఒప్పుకున్న డబ్బు ఇ వ్వాలని, కోత విధించవద్దని కోరారు. దీనిపై ఆర్ఎం స్పంది స్తూ బాధితుల వివరాలను ఉన్నతాధికారులకు పంపామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని వివరించారు.ప్రస్తుతం బంగారానికి ఉన్న ధర ఇవ్వాలి.. తక్కువ చెల్లించొద్దు బంగారం బాధితుల డిమాండ్ ఎస్బీఐ ఎదుట, జాతీయ రహదారిపై ఆందోళనతక్కువ చెల్లిస్తే ఒప్పుకోం..రాయపర్తి ఎస్బీఐలో 40 గ్రాముల బంగారం తాకట్టు పెట్టాం. అయితే బ్యాంకులో బంగారం చోరీకి గురైనప్పటి నుంచి అధికారులు మాకు న్యాయం చేస్తామంటూ దాటవేస్తున్నారు. గత నెలలో తులానికి రూ.95వేలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ.87వేలు ఇస్తామని చెబుతున్నారు. దీనికి ఒప్పుకోం. ఒప్పుకున్న ప్రకారం ఇవ్వని పక్షంలో మా బంగారం మాకు ఇవ్వాలి. –ముద్రబోయిన సుధాకర్, బాధితుడు, రాయపర్తి -
చనిపోతూ ఇతరులకు ప్రాణం
మహబూబాబాద్ రూరల్ : తాను చనిపోతూ ఓ యువకుడు ఇతరులకు తన అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబాబాద్ మండలం చిన్నకృష్ణాపురం గ్రామానికి చెందిన అజ్మీరా మంగ్య, విజయ దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్ (21) హైదరాబాద్లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్ ఈ నెల 21వ తేదీన తన బైక్పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్కు తీవ్ర గాయాలుకాగా వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా 23వ తేదీన బ్రెయిన్ డెడ్కు గురైనట్లు గుర్తించారు. దీంతో జీవన్ దాన్ ట్రస్ట్ నోడల్ అధికారి శ్రీభూషణ్ రాజు అతడి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా మంగ్య, విజయ దంపతులు అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. లివర్, కిడ్నీలు, కార్నియా దానం చేసి ఇతరులకు ప్రాణం పోశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. గ్రామస్తులు అజ్మీరా వెంకన్న, కిశోర్, రవికుమార్, రమేశ్, భాస్కర్, సంత్రి, లచ్చు, సైదులు, బద్రి, వీరన్న, మంగి, శారద, బాలరాజు, మాజీ సర్పంచ్ గుగులోత్ రవి, తదితరులు రాజశేఖర్ మృతదేహాన్ని ఈ నెల 24వ తేదీన గ్రామంలో ఖననం చేశారు. మృతుడి పేరిట 12 అడుగుల స్తూపం నిర్మించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడి అవయవాలు దానం మృతుడి తల్లిదండ్రుల ఔదార్యం -
పీహెచ్డీ పట్టాలకు ఫీజు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2022 ఆగస్టు 25న స్నాతకోత్సవం నిర్వహించారు. అప్పట్లో ఆర్ట్స్, సోషల్సైన్స్, సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మసీ, ‘లా’ , ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ విభాగాల్లో పీహెచ్డీలు పొందిన అభ్యర్థులు 2022 ఆగస్టు మూడోవారం వరకు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించారు. అయితే అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళసైసౌందరరాజన్ స్నాతకోత్సవంలో పాల్గొనే సమయం తక్కువ ఉంటుందని, అందుకే 2019 డిసెంబర్ 31వరకు ఆయా విభాగాల్లో పీహెచ్డీలు పొందిన 56మంది అభ్యర్థులకే పట్టాలు ప్రదానం చేయించారు.దీంతో స్నాతకోత్సవం 2022 ఆగస్టు 25నాటికి వారం రోజులముందు వరకు 2020 జనవరి1నుంచి పీహెచ్డీలు పొందిన అభ్యర్థుల్లో చాలామంది రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసినవారికి ప్రదానం చేయలేదు.వారిలో ఎక్కువమంది కేయూ 23వ స్నాతకోత్సవం కోసం నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు 2 సంవత్సరాల 9 నెలల తర్వాత మళ్లీ కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.ఈమేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కేయూ వీసీ కె ప్రతాప్రెడ్డి ఇటీవల కలిశారు. జూలై7న ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్నాతకోత్సవం వచ్చే అవకాశాలున్నాయి. పీహెచ్డీ పట్టాలు పొందేందుకు రిజిస్ట్రేషన్కు అవకాశం గతంలో పట్టాలు పొందని అభ్యర్థుల గురించి పట్టించుకోకుండానే ఇటీవల 2020 జనవరి 1నుంచి 2025 మే 31వరకు ఆయా విభాగాలల్లో పీహెచ్డీలు పొందిన అభ్యర్థులు కేయూ 23వ స్నాతకోత్సవంలో పట్టాలు పొందేందుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. దీంతో గత 22వ స్నాతకోత్సవం సందర్భంగా రూ. వెయ్యి చొప్పన ఫీజు చెల్లించామని, అప్పటి స్నాతకోత్సవంలో తమకు పట్టాలు ప్రదానం చేయలేదని పలువురు సోమవారం పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ వారికి తెలిపారు. అలా ఎంతమంది ఉన్నారనే అంశంపై లెక్కలు కేయూ 22వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయా విభాగాలకు సంబంధించి ఫీజు చెల్లించి డాక్టరేట్ పట్టాలు పొందని అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనే అంశంపై ప్రస్తుం లెక్కలు తీస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల 9నెలలు గడిచిపోయాయాయి. అందులోకొంతమంది ఆ తర్వాత అవసరం నిమిత్తం పట్టాలు తీసుకెళి ఉంటారా లేదా అని చూస్తున్నారు. ఎక్కువశాతం మంది మాత్రం స్నాతకోత్సవంలోనే పట్టాలు పొందేందుకు అలాగే ఉన్నారని సమాచారం. అందుకు సంబంధించిన జాబితా రూపొందించి ఆయా అభ్యర్థులకు కూడా ఈ జూలై 7న జరిగే స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ చెప్పారు. కాగా, 2020 జనవరి 1నుంచి 2025 మేలో ఇప్పటివరకు అవార్డు అయిన అభ్యర్థులు 573మంది ఉన్నారు. గత స్నాతకోత్సవానికి రూ. వెయ్యి చెల్లించిన అభ్యర్థులు ఇందులో 56 మందికే ‘డాక్టరేట్’ ప్రదానం మిగతా వారికి ఈ స్నాతకోత్సవంలో అందజేయనున్న అధికారులు జూలై 7న కేయూ 23వ స్నాతకోత్సవం -
మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలి●
● మానవ హక్కుల వేదిక డిమాండ్ హన్మకొండ: ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను కు టుంబ సభ్యులు, బంధువులకు అప్పగించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అ ధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈనెల 21న ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారని, ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సజ్జ వెంకటనాగేశ్వరరావు (రాజన్న), వన్నాడ విజయలక్ష్మి (భూమిక), గోనెగండ్ల లలిత (సంగీత), బుర్ర రాకేశ్ (వివేక్ ) ఉన్నారని వారు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. వీరి కుటుంబీకులు, బంధువులు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ పీఎస్, ఆస్పత్రి ఎదుట ఐదు రోజులుగా పడిగాపులు కాస్తున్నా అక్కడి పోలీసులు మృతదేహాలను అప్పగించడం లేదన్నారు. ఉదయం, సాయంత్రం అంటూ కాలం వెల్లదీస్తూ మృతదేహాలను అప్పగించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెంటనే మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
పుష్కరాలను చాలెంజ్గా తీసుకున్నాం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలను చాలెంజ్గా తీసుకున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమకు భగవంతుడు పుష్కరాలు నిర్వహించే అవకాశం కల్పించాడని, రూ. 40 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరాలకు ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించారని అభినందించారు. కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి సంగమంలో మొదటిసారి పుష్కరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సరస్వతి మాతా 17 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని, ఈ ప్రాంతానికి అన్ని లక్షల మంది ఎన్నడూ రాలేదని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచినీరు, అన్నదానం చేశారని అభినందించారు. మీడియా ద్వారా లక్షలాది మంది భక్తులు వచ్చేలా ప్రచారం చేశారని, టీవీ ఛానళ్లు ద్వారా వీక్షించే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. శాఖల సమన్వయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని, రాలేని భక్తులు సంవత్సర కాలంలో ఎపుడైనా పుష్కర స్నానాలు చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు ప్రణాళిక ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ సరస్వతీనది పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత సదుపాయాలు కల్పిస్తామని, పుష్కరాల ముగింపు సందర్భంగా చిరుజల్లులు కురవడంతో ఆ దేవతల అనుగ్రహం అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ మాట్లాడుతూ శ్రీ కాళేశ్వరముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామమని, ఈ గ్రామంలో సరస్వతీనది పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 5 నెలల ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని అందుకు అనుగుణంగా ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈనిధులతో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణకు సహకరించిన స్థానికులు, అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. 30 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏడీఆర్ఎం గోపాలకిషన్ అన్నారు. రైల్వే మూడో లైన్ పనుల్లో జాప్యం జరుగుతుందనే కోణంలో ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘నత్తతో పోటీ!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై రైల్వే అధికారులు స్పందించారు. ఈమేరకు సికింద్రాబాద్ ఏడీఆర్ఎం గోపాలకిషన్ సోమవారం ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని మూడో లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా మూడో లైన్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఎల్.సీ 80 గేటు ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం, అదేవిధంగా మరికొద్ది దూరంలో ఆర్వోబీ నిర్మాణం, కొత్త బజార్ నుంచి పాత బజార్ వైపునకు రైల్వే స్టేషన్ బయట ప్రాంతాల నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టింగ్ విషయంపై జీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రయాణికులకు సహకరిస్తామని తెలిపారు. సీనియర్ డీఈఎన్ దినకర్, డీఓఎన్ సుధీర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లు రామారావు, వంశీకృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజు, ఎస్ఎస్ఈ పీవే అధికారి ఆలం, ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, జేఈ పాండునాయక్ తదితరులు ఉన్నారు. సికింద్రాబాద్ ఏడీఆర్ఎం గోపాలకిషన్ రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల పరిశీలన -
– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu
పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పునీతులయ్యారు. కాళేశ్వరం సందర్శనలో జ్ఞాపకాల్ని మూటగట్టుకెళ్లారు. ఎండ, వాన.. గాలి దుమారం.. ఇవేవీ వారిని అడ్డుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. నదీ పరిసరాల్లో బురద.. వారి సంతోషానికి అడ్డు కాలేదు. కిక్కిరిసిన భక్తులతో ఆర్టీసీ బస్సులు. దారి పొడవునా ప్రైవేట్ వాహనాలు. ఇలా.. లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చారు. నదీ మాతకు పూజలు చేశారు. తర్పణాలు వదిలారు. పిండ ప్రదానాలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. చీరెసారె సమర్పించారు. 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నదీమాతకు నవరత్న మాల హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు లక్ష మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. -
బస్టాండ్ కిటకిట..
● రైళ్ల రద్దుతో పెరిగిన ప్రయాణికుల రద్దీ నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. రెండు రోజులుగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 34 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 46వేలకు పెరిగింది. దీంతో డిపో ఆదాయం పెరింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాల బస్సు సర్వీసులను తగ్గించి, హనుమకొండ ప్రాంతాలకు బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థ్ధం నడిపిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా డిపో పరిధిలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు వేచిచూడాల్సి వస్తోంది. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్లో సోమవారం లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. భూభారతి చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొదటి విడతలో 203 మందికి సోమవారం నుంచి 50రోజులు పాటు ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెక్షన్లలో శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం శిక్షణకు హాజరైన సర్వేయర్లకు సర్వే మెటీరియల్ను కలెక్టర్ అందజేశారు. అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, నరసింహమూర్తి పాల్గొన్నారు. -
లక్షణాలు గుర్తిస్తే కాపాడొచ్చు..
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకో వాలని అనుకునే వారి మానసిక పరిస్థితి గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా మానసిక వ్యాధిగ్రస్తులు, సున్నిత మనస్తత్వం గలవారు, మత్తు పదార్థాలకు బానిసైన వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో మూడు స్టేజీలుగా గుర్తిస్తాం. తాను ఆత్మహత్య చేసుకుంటాను అని ఇతరులతో చెప్పడం, కత్తితో కోసుకోవడం.. ఇతర ప్రయత్నాలు చేయడం, మూడో దశలో ఆత్మహత్య చేసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇస్తే మార్పు వస్తుంది. మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. లక్షణాలు గుర్తించి సరైన వైద్యం అందిస్తే మనిషి ప్రాణం కాపాడవచ్చు. – ఎం. మహేశ్కుమార్, హెచ్ఓడీ, సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం జిల్లాలో ఆత్యహత్యలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా ఉండడం బాధాకరం. క్షణికావేశంలో అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండేందుకు కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్రిమిసంహారక మందులు భద్రపరిచే విషయంపై వ్యవసాయశాఖ సహకారంతో రైతులతో సమీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ ● -
మినీ ట్యాంక్బండ్ పనుల పరిశీలన
బయ్యారం: మండలంలోని గంధంపల్లి–కొత్తపేట ఊరకుంట వద్ద చేపడుతున్న మినీ ట్యాంక్బండ్ పనులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్నందున త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్నాయక్, సీతారాంరెడ్డి, సురేశ్, బాలరాజు, అన్నపూర్ణ, శివ, సతీ శ్, రఘుపతి, భగవాన్, రాంబాబు, మురళి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలినెహ్రూసెంటర్: అత్యవసర అంబులెన్స్ 108 పైలెట్స్ విధుల్లో అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించాల ని 108 జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్ అన్నారు. అంతర్జాతీయ పైలెట్స్ దినోత్సవ వేడుకలను సోమవారం కార్యాలంయలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. పైలెట్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సీనియర్ పైలెట్లను సన్మానించారు. కార్యక్రమంలో 108 పైలెట్లు చాపల శివప్రసాద్, బూర్గుల రమేశ్, నెహ్రూనాయక్, సతీశ్, ప్రేమ్చంద్, సంతోశ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కనుమరుగవుతున్న ఏళ్లనాటి వృక్షాలు.. కేసముద్రం: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న ఏళ్లనాటి భారీ వృక్షాలను తొలిగిస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంస్టేషన్ నుంచి కేసముద్రంవిలేజ్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న భారీ వృక్షాలను యంత్రాల సాయంతో కట్చేస్తూ తొలిగిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లపాటు నీడనిచ్చిన చెట్లు కనుమరుగవుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రోడ్డు విస్తరణతో వాహనాల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిమహబూబాబాద్ రూరల్: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే చర్యలు ఉంటాయని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు ప్రతీరోజు అప్డేట్ చేయాలని తెలిపారు. తహసీల్దార్ రాజేశ్వర్ రావు, రూరల్ ఎస్సై దీపిక, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓ సాయిప్రకాశ్, డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ వేమిశెట్టి సోమయ్య, డీలర్లు పాల్గొన్నారు. కఠిన చర్యలు చేపడుతాం.. గార్ల: ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన డీలర్లపై చర్యలు తప్పవని మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం గార్లలో జరిగిన డీలర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్ శారద, ఎస్సై ఎస్కె.రియాజ్పాషా, ఏఓ రామారావు, ఏఈఓ కిరణ్, డీలర్లు లింగాల ఉమేశ్, విద్యాసాగర్, మనోజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ల శిక్షణ శిబిరం మార్పు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్ల శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసనపర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్వుడ్ పాఠశాలకు మార్చినట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ● ప్రజావాణికి 122 వినతులుమహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. వినతి ఇచ్చిన 15 రోజుల్లోపే సమస్య పరిష్కారం చేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా ప్రజావాణిలో 122 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, సీపీఓ సుబ్బారావు, డీఏఓ విజయనిర్మల, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని ట్రాన్స్జెండర్ దుర్మరణం
ఖిలా వరంగల్: పట్టాలు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందింది. ఈఘటన ఆదివారం వరంగల్ చింతల్ ప్లైఓవర్ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన ట్రాన్స్జెండర్ మిరియాల ఐశ్వర్య (35) వ్యక్తిగత పని నిమిత్తం చింతల్కు వచ్చింది. అనంతరం మైసమ్మ ఆలయ సమీపాన పట్టాలు దాటి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో ఎంజీఎం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. వరంగల్ రైల్వే జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు శవ పంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలి తల్లి బొందమ్మకు ఐశ్వర్య మృతదేహం అప్పగించారు. -
కాళేశ్వరానికి పెరిగిన భక్తులు
● బస్సులు సమకూర్చిన అధికారులు ● నేడు భక్తుల రద్దీ పెరిగే అవకాశంహన్మకొండ: సరస్వతీనది పుష్కరాలు ముగింపు సమీపిస్తుండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్టీసీకి భక్తులు ఒక్కసారిగా పెరిగారు. ఉదయం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్తో పాటు వరంగల్ రీజియన్లోని ఇతర బస్ స్టేషన్లు భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి.అధికారులు అప్పటికప్పుడు బస్సులు సమకూర్చి భక్తులను చేరవేశారు. సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 15 నుంచి 24 వరకు 5574 ట్రిప్పుల ద్వారా 3,30,218 భక్తులను చేరవేశారు. వివిధ బస్ స్టేషన్ల నుంచి కాళేశ్వరానికి 3,347 ట్రిప్పుల ద్వారా 1,70,523 మందిని చేరవేయగా, తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి వివిధ బస్ స్టేషన్లకు 2,227 ట్రిప్పుల ద్వారా 1,59,695 మంది భక్తులను చేరవేశారు. సరస్వతి పుష్కరాలకు తరలిన భక్తుల సంఖ్య తేదీ కాళేశ్వరం వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణమైన భక్తులు ట్రిప్పులు భక్తులు ట్రిప్పులు భక్తులు 15న 123 4,198 117 3,287 16న 238 10,002 219 8,805 17న 259 12,324 240 9,869 18న 376 18,838 367 18,608 19న 310 15,152 307 14,474 20న 266 11,235 257 10,847 21న 374 19,028 359 17,996 22న 362 19,450 361 17,773 23న 445 24,786 434 24,971 24న 594 35,510 565 33,065భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. డి.విజయభాను ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ -
పుష్కరాలకు వెళ్తూ...తిరిగిరాని లోకాలకు
కాటారం : పుష్కరాలకు వెళ్తూ ఓ వృద్ధురాలు తిరిగిరాని లోకాలకు చేరింది. కారు, తవేరా ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి వద్ద జాతీయ రహదారి 353(సి)పై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన సకోటి కిషన్లాల్, కడికె దుర్గాజీ కుటుంబ సభ్యులు, డ్రైవర్ మహేందర్ తవేరాలో పుష్కరాలకు బయలుదేరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన లక్ష్మీనర్సింహారావు కుటుంబ సభ్యులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కాటారం మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న తవేరాను ఢీకొంది. దీంతో వాహనాలు నుజ్జునుజ్జయి రోడ్డుకు ఇరువైపులా దూసుకుపోయాయి. ఈ ఘటనలో తవేరాలో ప్రయాణిస్తున్న డ్రైవర్, పదిమంది భక్తులు, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులలతో పాటు సమీపంలో అన్నదానం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు జేసీబీ సాయంతో వాహనాల డోర్లు తెరిచి క్షతగాత్రులను బయటకు తీశారు. తవేరాలో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన సకోటి లలిత(61) తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రికి తరస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అదే వాహనంలోని డ్రైవర్తో పాటు మరో తొమ్మిది మందికి గాయాలుకావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఓనర్ కమ్ డ్రైవర్ లక్ష్మీనర్సింహారావుతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిని ఎస్సై మ్యాక అభినవ్, పీఎస్సై గీతారాథోడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కారు, తవేరా ఢీ.. వృద్ధురాలి దుర్మరణం కాటారం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఘటన -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ ని యా మకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమి ంచేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రైవేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేల జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాలి. సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల పరీక్ష
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపాలన అధికారుల పరీక్షకు 152 మంది అభ్యర్థులకు 130 మంది అభ్యర్థులు హాజరై, 22 మంది గైర్హాజరయ్యారన్నారు. గతంలో రెవెన్యూశాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామ పాలన అధికారుల పరీక్ష రాశారన్నారు. పరీక్షకు సహకరించిన అన్ని శాఖ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ మహబూబాబాద్: జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్లకు నేడు(సోమవారం) మానుకోట పట్టణం అనంతారం రోడ్డులోని తెలంగాణ మోడల్ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఎల్ఆర్ ఏడీ నర్సింహమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 390మంది గుర్తింపు పొందిన సర్వేయర్లు ఉన్నారన్నారు. 203 మందికి మొదటి విడతలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు చెప్పారు. టీజీఈసెట్లో సత్తాచాటిన మండలవాసి చిన్నగూడూరు: తెలంగాణ ఈసెట్ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో మండలవాసి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది. మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన తిప్పర్తి భాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఈసెట్ రాష్ట్రస్థాయి ఫలితాల్లో 234వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తేజోన్నత రెడ్డి, ఉపేందర్ సహకారంతో ర్యాంక్ సాధించినట్లు ఆమె తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఆర్ట్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా జితేందర్ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్ను నియమిస్తూ ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేపట్టేందుకు ఈప్లేస్మెంట్ సెల్ అధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ నియమాక ఉత్తర్వులను జితేందర్కు అందించి అభినందించారు. కోటగుళ్లలో పూజలు గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కోటగుళ్ల సందర్శన ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, ఆలయ శిల్ప సంపద అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు. -
త్రివేణి సంగమం.. జనసంద్రం
పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలు పదకొండు రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవుదినం సందర్భంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరానికి భారీగా తరలి వచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు ఆచరించి, నదీ మాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. దంపతిస్నానాలు చేసి దొప్పల్లో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఘాటుపై ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. క్యూలైన్లో బారులుదీరడంతో రాత్రి వరకు ఆలయంలో రద్దీ నెలకొంది. రెండు లక్షల మంది భక్తుల రాక.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. సోమవారంతో పుష్కరాలు ముగియనుండంతో భక్తులు ఆదివారం భారీగా కాళేశ్వరం బాటపట్టారు. రెండు లక్షల మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వా మివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా. ట్రాఫిక్ జామ్.. కాళేశ్వరానికి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో పోలీసులు అన్నారం క్రాస్ నుంచి వయా మద్దులపల్లి మీదుగా వన్ వే ఏర్పా టు చేసి వాహనాలు తరలించారు. మంచిర్యాల వైపు నుంచి వచ్చేవాహనాలు అంతర్రాష్ట్ర వంతెన వద్ద నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ప్రాణహిత వంతెన వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులు పార్కింగ్ స్థలాల నుంచి కాలినడకన ఘాట్ వరకు నడిచివెళ్లారు. మహదేవపూర్ నుంచి వచ్చే వాహనాలు మధ్యాహ్నం నుంచి వన్వే తీయడంతో టూ వే ద్వారా మళ్లీ తరలివచ్చాయి. కలెక్టర రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే ట్రాఫిక్ను సమీక్షించారు. ఆర్టీసీ బస్సులు లేక అవస్థలు.. భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సాయంత్రం వేళల్లో బస్సులు అధిక సంఖ్యలో నడిపించడం లేదని భక్తులు ఆరోపించారు. పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పుష్కరాల పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఐడీకార్డులు ఉన్న వారి ద్విచక్రవాహనాలనూ అనుమంతించలేదు. అలాగే, మీడి యా ప్రతినిధులతోనూ వాగ్వాదానికి దిగారు. ప్రధాన ఆలయం మండపంలోకి వెళ్లే గేటు వద్ద ఎస్సై ఎస్.రాజేశ్.. ఉత్సవ కమిటి సభ్యుడు అశోక్తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడున్న వారు సముదాయించే ప్రయత్నంలో అన్న సంబోధించగా ఎస్సై కో పోద్రెకుడయ్యాడు. తాను సబ్ఇన్స్పెక్టర్ను అని, తనను సార్ అని సంబోంధించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎస్సైపై సీఐకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఘనంగా హారతి.. సరస్వతిఘాట్ వద్ద ఆదివారం రాత్రి కాశీపండితులతో నవరత్నమాల హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏడుగురు పండితుల బృందం తొమ్మిది హారతులను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 45 నిమిషాల పాటు జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మంత్రులు దుద్దిళ్ల ఽశ్రీధర్బాబు, సీతక్క, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రా వు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాస రాజు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, ఈఓ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల పుష్కర స్నానం కాటారం/కాళేశ్వరం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, యోగా నంద సరస్వతి స్వామి, ఎమ్మెల్సీ సురభివాణి, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎంపీ నాందేవ్ కిర్సాన పుణ్యస్నానం ఆచరించారు. అలాగే, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజారామయ్యార్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్కు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే స్వాగతం పలికి పుష్ఛ గుచ్చం అందజేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం చేశారు. పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తజనం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన రద్దీ 11వ రోజు రెండు లక్షల మంది వరకు రాక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, యోగానందాసరస్వతిస్వామి, సినీనటుడు తనికెళ్ల భరణి పుష్కర స్నానాలు, పూజలు కాశీపండితులతో నవరత్నమాల హారతి -
మోక్షం
పెండింగ్ బిల్లులకుమహబూబాబాద్: గ్రామ పంచాయతీల్లో గతంలో చేసిన అభివృద్ధి పనుల బకాయి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో సర్పంచ్లు సొంత డబ్బులతో పనులు చేయించారు. కాగా మూడేళ్లుగా వాటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మేరకు వారు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రూ.10లక్షల లోపు ఉన్న బిల్లులకు మాత్రమే నిధులు విడుదల చేయగా.. మాజీ సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 482 జీపీలు.. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,75,551 గృహాలు ఉన్నాయి. సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు లేక పోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. కాగా సర్పంచ్లో పదవిలో ఉన్నప్పుడు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. దీంతో మాజీ సర్పంచ్లు బిల్లుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 9,990 బిల్లులను క్లియర్ చేస్తూ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2024 ఆగస్టు లోపు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.10లక్షలలోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్ కానున్నాయి. సంబంధిత కార్యాలయాల చుట్టూ మాజీ సర్పంచ్లు.. ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించగానే మాజీ సర్పంచ్లు డీటీఓ కార్యాలయం, డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అధికారులను అడుగుతున్నారు. అందుకు సంబంధిత అధికారులు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, పేపర్లలో మాత్రమే చూశామని చెబుతున్నారు. మాజీ సర్పంచ్ల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని అధికారులు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన.. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ని ర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మాజీ సర్పంచ్ల నిధులు విడుదలతో జీపీ ఎన్నికలు త్వరలోనే ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నా యి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాలను వేగవంతం చేసింది. జీపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో అధికార పార్టీ అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు అర్థమవుతోంది. మండలాల వారీగా పెండింగ్ బిల్లులు మండలం పెండింగ్ బిల్లుల డబ్బులు బయ్యారం 14,842,354 చిన్నగూడూరు 51,358,84 దంతాలపల్లి 67,53,189 డోర్నకల్ 84,61,548 గంగారం 63,233,68 గార్ల 99,716,85 గూడూరు 47,862,457 కేసముద్రం 23,763,998 కొత్తగూడ 26,215,657 కురవి 13,028,911 మానుకోట 27,499,764 మరిపెడ 18,006,391 నర్సింహులపేట 83,93,430 నెల్లికుదురు 23,171,816 పెద్ద వంగర 92,59,513 తొర్రూరు 86,32.184 మొత్తం 25,73,22,149 మాజీ సర్పంచ్లకు ఊరట రూ 10.లక్షలలోపు బిల్లులకు క్లియరెన్స్ 2024 ఆగస్టులోపు చేసిన పనులకే.. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు నిధుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గతంలో జిల్లాలో పెండింగ్ బిల్లుల జాబితా పంపించాం. ఆ బిల్లులు అన్ని ఎస్టీఓ కార్యాలయంలోనే జరిగాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల వస్తే దాని ప్రకారం ప్రాసెస్ చేస్తాం. – హరిప్రసాద్, డీపీఓ వారి ఖాతాల్లో జమ అవుతాయి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపాం. క్లియర్ చేసే బిల్లుల డబ్బులు మాజీ సర్పంచ్ల ఖాతాల్లోనే జమ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక జాబితా లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. – వి.సత్యనారాయణ, డీటీఓ -
ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే సుస్థిర పాలన
మహబూబాబాద్ అర్బన్ : ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానంతో సుస్థిరపాలన అందించవచ్చని బీజేపీ రాష్ట్ర కోకన్వీనర్ శ్రీరామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి 100రోజుల్లోపు జరుగుతాయని, తద్వారా ప్రజాపాలన సులభం అవుతుందని, దేశ సంప ద, అధికార యంత్రాంగం శ్రమ వృథా కాదన్నారు. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ మహేశ్గౌడ్, కోకన్వీనర్ సందీప్గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అశోక్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు నాయక్ ఉన్నారు. -
మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదాం
హన్మకొండ: ఈనెల 27న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుని 31న వరంగల్కు రానున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదామని మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్, ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద కుమార్, నాయకులు ఎస్.నరేంద్రబాబు, మంద వెంకటేశ్వరరావు, బొడ్డు దయాకర్, బొర్ర భిక్షపతి, బుర్ర సతీశ్, పుట్ట రవి, పేరెల్లి ఎలీషా, దుడ్డు రామకృష్ణ, చేతల శివ, మంద వర్ధన్, కుమ్మరి శ్రీనాథ్, దావు ఆదిత్య పాల్గొన్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
పునఃప్రారంభమయ్యేనా?
మహబూబాబాద్ అర్బన్: పేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. గతంలో విద్యార్థులు లేరనే సాకుతో బంద్ చేశారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను అధికారులు మూసివేశారు. అలాగే కొత్తగూడ ఆశ్రమ ఎస్సీ హాస్టల్, ఇనుగుర్తి ఎస్సీ హాస్టల్ను గత ఏడాది మూసివేశారు. పునఃప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాల నాయకులు, మేధావులు కోరుతున్నారు. హాస్టళ్లను కాపాడాలి.. జిల్లా వ్యాప్తంగా గతంలో 23 హాస్టళ్లు ఉండేవి. ప్రస్తుతం 19 హాస్టళ్లలో 1,400 మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కాలేజీలకు సంబంధించి నాలుగు హాస్టళ్లు ఉండగా 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే కొత్తగూడ, ఇనుగుర్తి మండలాల్లోని హాస్టళ్లు క్లోజ్ చేయగా.. మరో రెండు హాస్టళ్లు మూతపడే ప్రమాదం ఉంది. మంత్రి సీతక్కకు కొత్తగూడ హాస్టల్ను ప్రారంభించాలని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇనుగుర్తి మండలం ఏర్పడిన నేపథ్యంలో అక్కడి ఎస్సీ హాస్టల్ పునఃప్రారంభిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నాయకులు కోరుతున్నారు. దీనిపై జిల్లా ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నరసింహ స్వామిని వివరణ కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ హాస్టళ్ల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జిల్లాలో మూతపడిన నాలుగు హాస్టళ్లను పునఃప్రారంభించేందుకు అధికారులు, నాయకులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. ఆ భవనం నిరుపయోగం ప్రత్యేక తెలంగాణలో 2016లో మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను మూసివేసి, ఆ భవనాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయానికి అప్పగించారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఎస్సీ సంక్షేమ కార్యాలయం అక్కడికి మార్చారు. దీంతో ప్రస్తుతం ఆనంద నిలయం ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉంది. గతంలో నాలుగు ఎస్సీ హాస్టళ్లు మూత మళ్లీ ప్రారంభిస్తే విద్యార్థులకు ఎంతో మేలు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఘన్పూర్ శివారులో ఘటన స్టేషన్ఘన్పూర్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం ఘన్పూర్ శివారు ఆర్ఆర్ దాబా సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన యాల వెంకటేష్, సురేశ్(21) తండ్రి నాగరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారు ప్రస్తుతం సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్, సురేశ్ డ్రైవర్లుగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉంటున్నారు. సురేశ్ బైక్పై శివునిపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ఘన్పూర్ శివారులో అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సైడ్ బర్మ్కు ఢీకొనడంతో రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న బాటసారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. చౌళ్లపెల్లిలో వ్యక్తి.. ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చౌళ్లపెల్లికి చెందిన రాచర్ల రవి(53) ఆదివారం రాత్రి పిల్లలను బస్ ఎక్కించడానికి బైక్పై ఆత్మకూరు వచ్చాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో గేదె ఎదురురావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పుష్కరాల్లో తనికెళ్ల భరణి ప్రవచనాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో ఆదివారం సినీనటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద సంగీత్ నాటక్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వామి వారి ప్రవచనాలు చెప్పారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ప్రాముఖ్యత, త్రివేణి సంగంమం, సరస్వతీనది పుష్కరాల గొప్పతనం గురించి వివరించారు. -
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
సౌధామిని.. పుష్కర మణి! ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే గోదావరికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని నదికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. – వివరాలు, ఫొటోలు: 8లోu -
Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు
మహబూబాబాద్ అర్బన్: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొందరికి మొక్కలు పెంచడం, ఇంకొందరికి జంతువులు, పక్షులను సాకడం ఇష్టం. కాగా పింగిలి శ్రీనివాస్, ఆయన కూతురు దీపిక మాత్రం శునకాలను పెంచడం ఇష్టంగా మార్చుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ శునకాల ప్రేమికులే కావడం విశేషం. ఖమ్మం నుంచి తీసుకొచ్చి.. మానుకోట మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన పింగిలి శ్రీనివాస్–ప్రసన్నలక్ష్మి దంపతులకు కూతురు దీపిక, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ ప్రభుత్వ డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. ఆయన ఒకరోజు ఖమ్మంలోని తన బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇంద్రనగర్ కాలనీలో సైడ్ డ్రెయినేజీ వద్ద చిన్న కుక్కపిల్ల శ్రీనివాస్ కంటపడగా.. దానిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కూతురు దీపిక.. ఆ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరికి తీసుకొని.. స్నానం చేయించి పాలు, బిస్కెట్లు అందించింది. కుక్కపిల్ల నోటినుంచి నురగ కారడంతో పాటు కురుపులు కావడంతో వెంటనే పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు ఖమ్మంలో పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి శునకానికి క్యాన్సర్ ఉందని తేల్చారు. దీంతో హైదరాబాద్, ముంబై వైద్యులు చికిత్స చేయగా కోలుకుంది. కాగా దానికి దీపిక ముద్దుగా టాఫీ అని నామకరణం చేసి పెంచుకుంది. ఇలా వారి కుటుంబానికి కుక్కల పెంపకంపై మక్కువ పెరిగింది. వీధికుక్కలు, అనారోగ్యానికి గురైన వాటిని చేరదీసి వాటి ఆలనాపాలన చూస్తున్నారు. అనాధ శునకాలకు ఆలంబన మానుకోట జిల్లా కేంద్రంలో లక్ష్మి థియేటర్ వద్ద గర్భం దాల్చిన వీధి కుక్క కనిపించింది. తండ్రి శ్రీనివాస్, కూతురు దీపిక దాన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందించారు. నెహ్రూసెంటర్లో మరో కుక్క పిల్ల కనిపించగా.. దాన్ని కూడా తీసుకెళ్లి పెంచుతున్న క్రమంలో ఒకరోజు కిందపడిపోయింది. దానిని పశువైద్యశాలకు తీసుకెళ్లగా శునకానికి మూర్ఛరోగం ఉందని తెలిపారు. ఆ కుక్కను హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి రూ.25 వేల వరకు వెచి్చంచి చికిత్స అందించారు. ఆ తర్వాత గర్భం దాలి్చన వీధి కుక్క 7 పిల్లలకు జన్మనిచి్చంది. అనంతరం వాటిని ఇంటికి తీసుకురాగా.. సందడి నెలకొంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా వాటి మధ్యలో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇలా ఎక్కడ వీధి కుక్కలు అనారోగ్యంతో కనిపించినా.. వాటిని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి, సొంత డబ్బులతో మంచి వైద్యం అందించి ఆరోగ్యంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3వేల కుక్కలను దత్తత ఇచ్చారు. వారి కుటుంబం ప్రస్తుతం సుమారు 40 కుక్కలను పెంచుతోంది. దంపతులిద్దరూ శునకాల సేవలో.. పింగిలి దీపిక 13 ఏళ్లుగా శునకాలను పెంచుతోంది. కాగా ఆమెకు 2020లో మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన ఇమామ్పాషాతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇమామ్పాషా కూడా ఆమెకు సహకరిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయత్రం తానే దగ్గరుండి చూసుకుంటూ.. భోజనంతో పాటు మందులు వేస్తున్నారు.కుక్కల కోసం యూట్యూబ్ చానల్ నాకు కుక్కలు, వాటి పిల్లలు అంటే చాలా ప్రేమ. మొదట మా నాన్న కుక్క పిల్లను తీసుకువచ్చాడు. దాంతో నాకు కుక్కలంటే ప్రేమ పెరిగింది. నేను మొదట మ్యారేజ్ ఈవెంట్స్ చేసేదాన్ని. అలా వచి్చన డబ్బులతో కుక్కలకు వైద్యం, స్నాక్స్, భోజనం అందించేదాన్ని. ప్రస్తుతం చాలా కుక్కలు ఇంట్లో ఉండడంతో.. నాన్న పెన్షన్ డబ్బులతో వాటికి అన్ని రకాల భోజనం అందిస్తున్నాను. నేను పెంచుతున్న వీధి కుక్కలకు ఏదో ఒక రోగం ఉంటోంది. గుండె, లివర్, క్యాన్సర్, పిడుసు లాంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వాటిని హైదరాబాద్లో బంజారాహిల్స్ ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి.. మంచి వైద్యం అందిస్తాను. ఎవరికి కుక్కలు కావాలన్నా ఈదులపూసపల్లికి వచ్చి దత్తత తీసుకుంటారు. ప్రత్యేకంగా కుక్కల కోసం నా పేరుతోనే సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించాను. – పింగిలి దీపిక, శునకాల సంరక్షకురాలుమా బిడ్డకు ఇష్టమని.. నేను మొదటిసారిగా చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకువస్తే.. మా అమ్మాయి దీపిక దానిపై ఎనలేని ప్రేమ పెంచుకుంది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్లినా.. అనారోగ్యంతో వీధి కుక్కలు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్తాను. వాటికి చికిత్స అందించి ఆరోగ్యవంతంగా మారిన తర్వాత.. తిరిగి బయటకు పంపించడం లేదా ఇంట్లోనే పెంచుతాను. నా పెన్షన్ డబ్బులతో వాటికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. అవి ఇంట్లో సందడి చేస్తాయి. పింగిలి శ్రీనివాస్, ఈదులపూసపల్లిమా పిల్లలుగా భావిస్తాం దీపికకు నాకు వివాహమై ఐదు సంవత్సరాలు అవుతోంది. నాకు కూడా జంతువులంటే ప్రేమ. మా ఇద్దరినీ.. జంతువులపై ఉన్న ప్రేమే కలిపింది. రోజూ ఉదయం 9 గంటలకు కుక్కలకు స్నానం తర్వాత టానిక్, మందులు వేస్తాను. 10 గంటలకు ఎగ్, చికెన్ బిర్యానీ, కూరగాయలతోనే చక్కటి భోజనం పెడతాను. మధ్యాహ్నం స్నాక్స్, బిస్కెట్లు, ఇంట్లో తయారు చేసిన మురుకులు, అప్పాలు పెడతాను. సాయంత్రం 5గంటలకు భోజనం, రాత్రి 8 గంటలకు మందులు, పాలు అందిస్తాం. వీధి కుక్కలను ప్రేమ చూసుకుంటాను. – ఎండీ ఇమామ్పాషా. మానుకోట -
సమగ్ర కీటక నివారణపై కేవీకేలో శిక్షణ
మామునూరు: మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ములుగు జిల్లాకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఖరీఫ్ పంటల్లో సమగ్ర కీటక వ్యాధి నివారణ (ఐపీడీఎం) పై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై ఐపీడీఎం సిద్ధాంతాలు, పద్ధతులు, రసాయనాల చట్టాలు, నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం మల్చింగ్ యూనిట్ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. అక్కడ కూరగాయల పంటల్లో ప్రధాన కీటకాలు, వ్యాధులను గుర్తించడం, వాటి నిర్వహణ పద్ధతుల గురించి వివరించారు. జె.సాయి కిరణ్ అజొల్లా తయారీ, పశువులకు ఇచ్చే ఆహార నియమాలు, అనువైన మేత గురించి కేవీకేలోని డెమో యూనిట్లలో వివరించగా.. డాక్టర్ గణేశ్ చేపల పెంపకం, వాటి నీటి, ఆహారం, ఆరోగ్య నిర్వహణ గురించి వివరించారు. కార్యక్రమంలో డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు. -
డిగ్రీ ఇయర్వైజ్ పరీక్షల ఫలితాల వెల్లడి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధి లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సు ల బీఏ, బీకాం, బీబీఏ, బీఎసీ కోర్సుల (ఇయర్వైజ్ బ్యాక్లాగ్స్) మొదటి, ద్వితీయ, ఫైనలియర్ పరీక్ష ల ఫలితాలను శనివారం వీసీ కె.ప్రతాప్రెడ్డి.. రిజి స్ట్రార్ వి.రామచద్రంతో కలిసి విడుదల చేశారు. మొత్తం 1,832మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా అందులో1,370మంది (74.38శాతం)ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. ఈ ఫలితాలను కేయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్లో చూడొచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, పి. వెంకటయ్య, క్యాంప్ ఆఫీసర్ ఎన్. సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ పట్టాలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేయూ క్యాంపస్: కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. పీహెచ్డీ పొందిన అభ్యర్థులు స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాలు పొందాలనుకునే వారు రూ. వెయ్యి చొప్పు న యూనివర్సిటీకి ఆన్లైన్లో ఫీజు చెల్లించి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కేయూఆన్లైన్.కో.ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేంద ర్ శనివారం తెలిపారు. కేయూలో 2020 జనవరి 1 నుంచి 2025 మే 31వరకు పీహెచ్డీ పొందిన అ భ్యర్థులు 573 మంది ఉన్నారు. ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మసీ, ‘లా’, ఇంజనీరింగ్ కోర్సుల్లో పీహెచ్డీ పూర్తిచేసి న అభ్యర్థులు పట్టాలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చే సుకోవాలన్నారు. కాగా,2016, 2017, 2018, 201 9, 2020, 2021 సంవత్సరాల్లో వివిధ కోర్సుల్లో గోల్డ్మెడల్స్ సాధించిన 564 మందికి కూడా స్నాతకో త్సవంలో గోల్డ్మెడల్స్ ప్రదానం చేస్తారన్నారు. -
లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందజేత
ములుగు: లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు శనివారం ఎస్పీ శబరీశ్ రివార్డులు అందజేశారు. మణుగూరు ఎల్ఎస్జీ సభ్యురాలు, ఛత్తీస్గఢ్లోని ఊసూరు పీఎస్ పరిధి మలంపేటకు చెందిన మడవి మంగిలి అలియాస్ నవ్యకు రూ. లక్ష, మిలిషీయా సభ్యుడు, ఛత్తీస్గఢ్లోని ఊసూరు పీఎస్ పరిధి కొత్తపల్లికి చెందిన దూది జయరామ్కు రూ. 25 వేల రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాటాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సరెండర్ పాలసీ అమలు చేస్తోందన్నారు. ఆ పాలసీ ప్రకారం లొంగిపోయిన వారికి రివార్డు, వైద్య చికిత్సతో పాటు పునరావాస చర్యలు కల్పిస్తోందన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నూతన విజయ డెయిరీ ఏర్పాటుకు కృషి ● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రూ.25 కోట్లతో నూతన విజయ డెయిరీ నిర్మాణం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులందరం సీఎం రేవంత్రెడ్డిని కలిసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ ములుగురోడ్ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్ యూనిట్లో శనివారం నూతనంగా రూపొందించిన పాలు, పెరుగు నూతన ప్యాకింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై కొత్త ప్యాకింగ్లను విడుదల చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ అంటేనే నమ్మకం అన్నారు. కార్యక్రమంలో డెయిరీ జీఎంలు మల్లయ్య, మధుసూదన్రావు, రీజనల్ సేల్స్ మేనేజర్ ధన్రాజ్, డెయిరీ వరంగల్, జనగామ డిప్యూటీ డైరెక్టర్లు శ్రవణ్కుమార్, సత్యనారాయణ, జూనియర్ మేనేజర్ అశోక్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసం.. ● రూ.1.31 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● క్రెడిట్ కార్డులు ఇప్పిస్తే కమీషన్ ఇస్తామని మోసం.. మహబూబాబాద్ రూరల్ : క్రెడిట్ కార్డులు ఇప్పిస్తే కమీషన్ ఇప్పిస్తామనే మాటలు విన్న ఓ వ్యక్తి.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. రూ.1.31 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రూరల్ పీఎస్ పరిధిలోని గాంధీపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జిలానీ సెల్ ఫోన్కు ఈనెల 5వ తేదీన ఓ మెస్సేజ్ వచ్చింది. అవతలి వ్యక్తులు క్రెడిట్ కార్డులు ఎవరికై నా అవసరం ఉంటే ఇప్పించండి మీకు కమీషన్ ఇస్తామని సమాచారం పంపించారు. నమ్మిన జిలానీ వాళ్లు పంపిన స్కానర్కు ఈ నెల 5వ తేదీన మొదట రూ.40 వేలు బదిలీ చేశాడు. మళ్లీ అదే రోజున ఒకసారి రూ.48 వేలు, తెల్లవారురోజున మరోసారి రూ.28 వేలు, అనంతరం రూ.15 వేలు, మొత్తం రూ.1.31 లక్షలు నగదు బదిలీ చేశాడు. రెండుమూడు రోజల అనంతరం తనకు స్కానర్ పంపిన వ్యక్తులకు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. దీంతో లబోదిమంటూ అదే రోజు సైబర్ క్రైమ్ 1930 నంబర్కు ఫిర్యాదు చేశాడు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై దీపిక పేర్కొన్నారు. -
ఏడు కిలోమీటర్ల దూరంగా...
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సర్వసతీనది పుష్కరాల నేపథ్యంలో శనివారం పదో రోజు భక్తుల వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. మహారాష్ట్ర వైపు నుంచి గోదావరిఖని, మంచిర్యాల భక్తుల సంఖ్య పెరగడంతో హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రైవేట్ వాహనాలను అన్నారం క్రాస్ నుంచి కాళేశ్వరానికి వన్ వేలో తరలించారు. ఉదయం 11 గంటల నుంచే సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో మద్దులపల్లి–పుసుకుపల్లి గ్రామాల మధ్య రెండు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. వాహనాల సంఖ్య పెరగడంతో నేరుగా ఎస్పీ కిరణ్ఖరే బైక్పై తిరుగుతూ కాళేశ్వరం నుంచి పుసుకుపల్లి, మద్దులపల్లి, అన్నారం మీదా అన్నారం క్రాస్ వరకు ట్రాఫిక్ రాకపోకలు, నియంత్రణను పరిశీలిస్తూ సిబ్బంది సూచనలు చేశారు. 7కిలో మీటర్ల దూరంగా అడవిలో హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి నడుకుంటూ వెళ్లారు. భక్తులను ఇబ్బందులకు చూడలేక పోలీసులు అటువైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులు, వ్యాన్లను ఆపి ఎక్కించి పుష్కర ఘాట్కు తరలించారు. ఆటోచార్జీ ఒక్కరికి రూ.100, భక్తుల మండిపాటు.. అడవిలో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో భక్తులు అంత దూరం నడవలేక ఆటోల్లో ప్రయాణించారు. ఆటో యజమానులు ఒక్కొక్కరి నుంచి చార్జీ రూ.100 వరకు వసూళ్లు చేశారు. దీంతో భక్తులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. రోజు వర్షంతో ఇబ్బందులు.. ప్రతీ రోజు కాళేశ్వరంలో వర్షం కురుస్తుండడంతో సరస్వతి ఘాట్ నుంచి ముక్తీశ్వర ఆలయం వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు పూర్తిగా బురదమయం కావడంతో వాహనాలు పార్క్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ సవాల్గా మారింది. పుష్కర ఘాట్ సమీపంలో పార్కింగ్ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అడవిలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయకతప్ప లేదు. తిరుగు ప్రయాణానికి భక్తుల అవస్థలు.. బస్సుల కోసం పడిగాపులు.. కాళేశ్వరం సరస్వతీనది పుష్కరాలకు పదో రోజు హాజరైన భక్తులు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల లేక ఇబ్బందులు పడ్డారు. శనివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. కాళేశ్వరానికి ఉదయం 6గంటల నుంచే రద్దీ పెరిగింది. తిరుగు ప్రయాణానికి కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్కు మధ్యాహ్నం 2గంటల నుంచే అధిక సంఖ్యలో చేరుకున్నారు. హనుమకొండ, భూపాలపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల బస్సుల కోసం ఎదురుచుశారు. అదనపు టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలోనే కూర్చుకున్నారు. బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయినా ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.కాళేశ్వరం పుష్కరాల పార్కింగ్ పాయింట్ ఏర్పాటు అక్కడి నుంచి వచ్చేందుకు భక్తుల అవస్థలు వాహనాలను దారి మళ్లించినా నియంత్రణ కాని ట్రాఫిక్ నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ.. -
పెళ్లికి వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
నల్లబెల్లి : పెళ్లికి వెళ్లొస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన భూస కుమార్ (40), పెండ్లి రాజు ద్విచక్రవాహనంపై నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు ఒల్లెనర్సయ్యపల్లిలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక పూర్తయిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపునకు వెళ్తున్న లారీ రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కుమార్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు గాయాలుకావడంతో స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ఒకరి మృతి.. మరొకరికి గాయాలు -
భ్రూణహత్యలు నివారించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలో భ్రూణహత్యల నివారణకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం, జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ పై సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉందని, అబార్షన్ రేటు ఎక్కువగా ఉందన్నారు. ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్దంగా లింగ నిష్పత్తి జరిగిన, అబార్షన్ చేసిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, జీపీ నగేష్, డాక్టర్ మీనాక్షి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాహిని, కౌన్సిలర్ రమేష్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, హెచ్ఈ కేవీ రాజు, లోక్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, అరుణ్, మనోహర్, అనిల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ -
రోడ్డు సదుపాయం కల్పించాలి
వీసీలో మంత్రి సీతక్క మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం నుంచి దుబ్బతండాకు రోడ్డు సదుపాయం కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల అటవీ సమస్యలు, పర్యావరణ తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీసీ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాట్లాడారు. వీసీలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కె.వీర బ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యూనిఫాం అందజేతకు సిద్ధం మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు సిద్ధం చేస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మధుసూదన్ రాజు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం (బి) జీపీ పరిధిలోని జిల్లెళ్లగూడెం గ్రామంలో స్కూల్ యూనిఫాం కుట్టు శిక్షణ కేంద్రాన్ని డీఆర్డీఓ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. త్వరగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు పూర్తిచేసి పాఠశాలలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం తిలక్, సీసీ రూపాదేవి, వీఓఏ శశికళ, కుట్టు శిక్షణ కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. గార్ల రైల్వేగేటు ఓపెన్ గార్ల: గార్ల– డోర్నకల్ మధ్య గల రైల్వేగేటును శనివారం రైల్వే ఉన్నతాధికారులు ఓపెన్ చేశారు. గార్ల నుంచి డోర్నకల్ మధ్యలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాల్వ రైల్వే ట్రాక్ కింద నుంచి తీస్తున్నందున గత 2 నెలల నుంచి రైల్వే గేటును రైల్వే అధికారులు మూసివేశారు. దీంతో ఖమ్మం నుంచి గార్లకు వచ్చే వాహనదారులు, ఆర్టీసీ ప్రయాణికులు బుద్దారం నుంచి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ కోసం పక్కనే ఆర్అండ్బీ రహదారి తవ్వడంతో కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంతో రైల్వే అధికారులు రైల్వేగేటును ఓపెన్ చేశారు. దీంతో రెండు మండలాల ప్రజలకు ఇబ్బందులు తొలగినట్లయింది. రైల్వే ఉన్నతాధికారులు డీఎన్ దినకరన్, ఏఎన్ రమేష్బాబు, ఐఓడబ్ల్యూ అఖిల్, రైల్వేబోర్డు కమిటీ సభ్యులు ఖాదర్బాబా, జర్పుల లచ్చిరాంనాయక్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 2017 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఉన్నతి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాక్విలిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యంపై 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యగల వారు అర్హులన్నారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు 9704550189 ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. రైళ్ల రద్దుతో ఇబ్బందులుకేసముద్రం: మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో థర్డ్లైన్ అనుసంధాన పనుల్లో భాగంగా సింగరే ణి, శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్ రైళ్లను ర ద్దు చేసి, కాకతీయ ఎక్స్ప్రెస్ రైలును మాత్రమే నడుపుతున్నారు. దీంతో కేసముద్రం రైల్వేస్టేష న్ శనివారం కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందు కు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, తాళ్లపూసపల్లి, కేసముద్రం రైల్వే స్టేషన్లలో కాకతీయ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉండటం, ఉదయం అప్లైన్లో ప్రయాణించే ప్ర యాణికులు ఆయా రైల్వేస్టేషన్లలో ఎక్కడంతో బోగీలన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయా యి. ఈ క్రమంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో ప్ర యాణికులంతా రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ప్లాట్ఫాంపైనే ఉ న్నారు. అలాగే పలు రైళ్లకు కేసముద్రం రైల్వే స్టే షన్లో హాల్టింగ్ ఉండటంతో మహబూబా బాద్లో దిగాల్సిన ప్రయాణికులు కేసముద్రంలో దిగి బస్సులు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానా నికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. -
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపు యాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ -
పాలిసెట్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–25 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో 1,554 మంది అభ్యర్థులకు 1,331 మంది (85.65శాతం) ఉత్తీర్ణత సాఽధించినట్లు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లాలో పాలిటెక్నిక్ ఎంపీసీ స్ట్రీమ్లో బాలురు 3,374 మంది పాలిసెట్కు హాజరుకాగా.. వారిలో 2,742 మంది (81.27 శాతం), బాలికలు 2,875 మంది హాజరుకాగా 2,478 మంది (86.19 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో బాలురు, బాలికలు కలిపి 481 మందికి 428 మంది (88.90 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లాలో బాలురు, బాలికలు కలిపి మొత్తం 668 మందికి 551 మంది(82.49శాతం) ఉత్తీర్ణత సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 824 మంది అభ్యర్థుకు 683 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.89 శాతం) సాధించారు. జనగామ జిల్లాలో 1,343 మంది అభ్యర్థులకు 1,070 మంది (79.67శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. జిల్లాలో ఉత్తమ ర్యాంకులు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల ఉపేందర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు షణ్ముక ఎంపీసీ విభాగంలో 75, ఎంబైపీసీ విభాగంలో 83వ ర్యాంకు సాధించాడు. అలాగే గంజి వెంకటనారాయణ, జ్యోతి దంపతుల కుమార్తె లక్ష్మీతనుజ ఎంపీసీ గ్రూప్లో 230, ఎంబైపీసీలో 54వ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. ఈ మేరకు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు పలువురు అభినందించారు. జిల్లాలో 85.65శాతం ఉత్తీర్ణత -
నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం
మహబూబాబాద్ అర్బన్: గ్రామ పాలన అధికారి పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షకు 10,954 పోస్టులకు గాను జిల్లా నుంచి 152 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు తరలించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిరాక్స్ షాపులు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, ఏఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి మహబూబాబాద్: గ్రామ పాలన అధికారుల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గ్రామ పరిపాలన అధికారుల పరీక్షల నిర్వాహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో హాజరుకానున్న152 మంది అభ్యర్థులు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా నుంచి సీరోలు మండలం చిలుకొయ్యలపాడు వరకు రూ.3.75 కోట్లతో నిర్మిస్తున్న 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని రాకాసితండా, చిలుకొయ్యలపాడు మధ్య రోడ్డు నిర్మాణంతో రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీకి చెందిన బ్రోచర్ను నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్రెడ్డి, నాయకులు ఊడ్గుల వీరన్న, లక్ష్మినారాయణ, బోడ రమేష్, వేల్పుల శ్రీను, బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
‘ఆడ’నే చిదిమేస్తున్నారు!
సాక్షి, మహబూబాబాద్: ఆడ, మగ ఇద్దరు ఉంటేనే సృష్టి.. వంటింటి స్థాయి నుంచి దేశ సరిహద్దుల్లో కాపలా వరకు శత్రు దేశాన్ని గడగడలాడించే శక్తియుక్తులకు భారత మహిళలు నిదర్శనమని ఇటీవల ఆపరేషన్ సిందూర్తో రుజువు చేశారు. ఇంత జరిగినా సమాజంలో ఆడవారంటే తక్కువ చూపు పోవడం లేదు. ఆడపిల్లలు పుడుతున్నారని తెలియగానే తల్లి గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకోవడం బాధాకరం. ఇందుకు నిదర్శనం పురుషుల నిష్పత్తితో పోలిస్తే సీ్త్రల నిష్పత్తి రాష్ట్రంలోనే మానుకోట కింది స్థాయికి దిగజారడం. అయితే ఈ పాపపు పనులు చేసే వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటున్నానే ప్రచారం జిల్లాకు తలవంపులు తెచ్చేలా ఉంది. ఇక్కడ ఇది సహజమే.. లింగనిర్ధారణ పరీక్షలు, గర్భవిచ్ఛిత్తి ఇతర ప్రాంతాల్లో అబ్బో అనే విషయాలు అయితే మహబూబాబాద్ జిల్లాలో సహజమే అన్నట్లు పేరుంది. గతంలో తొర్రూరు పట్టణంలోని ఓ ఆస్పత్రిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న విషయం బట్టబయలు కావడంతో ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. కురవి మండలంలో ఓ ఆర్ఎంపీ ఈ పాపానికి ఒడిగడుతున్న విషయంపై కేసు అయ్యింది. నెల్లికుదురు మండలంలో మొబైల్ వాహనంలో స్కానింగ్ మిషన్ తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో తొర్రూరు పట్టణంలో వరుస సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో మూడురోజుల క్రితం జరిగిన సంఘటనను అధికారులు స్వయంగా చూశారు. ముగ్గురిపై కేసు పెట్టినట్లు చె ప్పారు. కానీ ఇప్పటివరకు ఆయా ఆస్పత్రులపై చ ర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని పీసీపీఎన్డీటీ సమావేశంలో బాధ్యులపై చ ర్య తీసుకోవాలని ముక్తకంఠంతో చెప్పినట్లు తెలి సింది. ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో చివరి స్థానం.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో లింగ వ్యత్యాసంలో జిల్లా చివరిస్థానం(33)లో ఉంది. వెయ్యిమంది పురుషులకు గతంలో రూరల్ ఏరియాల్లో 996 మంది, అర్బన్ ఏరియాల్లో 1,035 మంది సీ్త్రలు సగటున 903 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో లింగ నిష్పత్తి భారతదేశంలో 894, రాష్ట్రంలో 879 ఉండగా రాష్ట్రంలో అతి తక్కువగా మానుకోట జిల్లాలో 836 ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 60శాతానికి పైగా జనాభా గిరిజన, ఆదివాసీలు ఉండటం, అక్షరాస్యత తక్కువగా ఉండటంతో మగ సంతానం కావాలనే ఆలోచనతో ఆడ, మగ అనే పరీక్షలు గర్భంలోనే గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా విచ్ఛిన్నం చేయడమే మహిళల జనాభా తగ్గుదలకు కారణమని విమర్శలు వస్తున్నాయి. విచారణ జరుగుతోంది.. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, భ్రూణహత్యలకు చేయడం చట్టరీత్య నేరం. ఎక్కడ జరిగినా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. మహబూబాబాద్లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవిరాథోడ్, జిల్లా వైద్యాధికారి కఠినంగా శిక్షించాలి జిల్లాలో వరుసగా భ్రూణహత్యల సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో పురుషుల జనాభాతో పోలిస్తే సీ్త్ర జనాభా తక్కువగా ఉంది. ఇందుకు కారణం లింగనిర్ధారణ, అబార్షన్లు. ఈ పాపపు పనికి ఒడిగడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. – నాగవాణి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భ్రూణహత్యల కేంద్రంగా మానుకోట గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికే.. వరుస సంఘటనలతో బట్టబయలు మొక్కుబడిగా అధికారుల తనిఖీలు కిందికి దిగజారిన మహిళల నిష్పత్తిమహిళల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ.. ప్రమాదకరంగా మారిందని జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గడంపై నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ సీరియస్గా పరిగణించింది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ప లు ఆస్పత్రులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ల నడుస్తున్నాయ ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంత జరిగినా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడాహుడీ చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరిపాటిగా మారుతుంది. ఇక్కడ వణుకుజణుకు లేకుండా భ్రూణ హత్యలు చేస్తున్న విషయం ప్రచారం కావడంతో వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చి గు ట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
ట్రాలీ అడుగును అరలుగా మార్చి..
సాక్షి, వరంగల్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అడవి అన్నవరం గ్రామం నుంచి హైదరాబాద్కు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో అరలుగా(చిన్నపాటి గదుల్లా) తయారుచేసి అందులో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లని తరలిస్తున్న నలుగురు నిందితులను వరంగల్ యాంటి నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1908 ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ కె.సైదులు, ఇన్స్పెక్టర్ రవీందర్ నేతృత్వంలో 17 మంది సభ్యుల బృందం వరంగల్ ఉర్సుగుట్ట జంక్షన్లో నిఘా పెట్టి ముందు ఎస్కార్ట్గా వస్తున్న స్విఫ్ట్ కారుతో పాటు గంజాయితో వస్తున్న ట్రాక్టర్ను ఆపారు. తనిఖీ చేస్తే రూ.1,05,38,000ల విలువ చేసే 210 కిలోల 760 గ్రాములు (105 ప్యాకెట్లు) దొరికాయి. నలుగురు నిందితుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ములుగురోడ్డులోని వరంగల్ యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె.సైదులు మీడియాకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రూ.పది వేలకు ఆశపడి.. 400 కిలోమీటర్లకు పైగా నడిపి.. ఏపీలోని అడవి అన్నవరానికి చెందిన తల్లిబాబు, నర్సీపట్నానికి చెందిన గోవిందమ్మ గంజాయి రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన గుగులోత్ భాస్కర్, కంబాలపల్లి గ్రామం పూరి తండాకు చెందిన కొర్ర వినోద్ కుమార్కు తల్లిబాబుతో పరిచయం ఏర్పడింది. అప్పటికే నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగేడు గ్రామానికి చెందిన కేతావత్ రాము నాయక్కు గుగులోతు భాస్కర్ పరిచయం ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు ప్లాన్ వేశారు. ఇందుకోసం రాము నాయక్ నెలన్నర క్రితం రూ1.60 లక్షలకు ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. కిలో గంజాయి రూ.3,500లకు తల్లిబాబు, గోవిందమ్మ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్లోని శ్రీకాంత్కు కిలోకు రూ.పదివేల చొప్పున అమ్మేందుకు ట్రాక్టర్ ట్రాలీ కింది భాగాన అరలుగా తయారుచేసి 105 ప్యాకెట్లను అమర్చి మూడ్రోజుల క్రితం అన్నవరం నుంచి బయలుదేరాడు. అయితే ఈ లోడ్ను హైదరాబాద్కు చేరవేస్తే రూ.10వేలు ఇస్తామని చెప్పడంతో అనకాపల్లి జిల్లా నీతవరం వలసంపేటకు చెందిన విరోధుల శీను ట్రాక్టర్ డ్రైవర్గా ఒప్పుకున్నాడు. సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించిన ట్రాక్టర్లో ఏమీ లేకపోవడంతో ఎక్కడా చెక్ పోస్టుల వద్ద పోలీసులకు అనుమానం రాలేదు. ఈ ట్రాక్టర్కు ముందు భాస్కర్ స్నేహితుడి కారు పై లటింగ్ ఉపయోగించారు. టోల్ ఫ్రీ నంబర్ 190 8కు సమాచారం రావడంతో అప్రమత్తమైన వరంగల్ నార్కొటిక్ పోలీసులు ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద భాస్కర్, రాము, వినోద్ కుమార్, విరోధుల శ్రీను ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు శ్రీ కాంత్, రాజు, మొగిలి, హెడ్ కానిస్టేబుళ్లు రంగ య్య, నిరంజన్, సోమలింగం, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఏ.రా జు, కె.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, ఎం.రాజేష్, పి.విజ య్, రహీం, కుమారస్వామి, సంపత్, సతీష్, సునీ ల్లను డీఎస్పీ సైదులు అభినందించారు. అయితే ఈ మీడియా సమావేశానికి ప్రధాన నిందితుడు భాస్కర్ను తీసుకొస్తుండగా పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటనే అతడిని లోపలికి తీసుకెళ్లారు. 400 కిలోమీటర్లు.. 105 గంజాయి ప్యాకెట్లు 210 కిలోల 760 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు -
రైతు ర్యాలీకి అనుమతిని పరిశీలించండి
● వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న రైతు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణ కోసం తెలంగాణ రైతు సంఘం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని వరంగల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. శాంతియుత ర్యాలీ, సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతు సంఘం నాయకుడు మోర్తాల చందర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ‘ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్లోని కార్మిక మైదానంనుంచి సాయి కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో 800 మంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆజంజాహీ మిల్లు మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిపై పలుమార్లు దరఖాస్తు చేసినా పోలీసులు ఎలాంటి నిర్ణయమూ చెప్పలేదు. అందుకే విధిలేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’ అని చెప్పారు. మరోవైపు కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) ఉంటే తప్ప ర్యాలీకి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కలెక్టర్ నుంచి ఎన్ఓసీ సమర్పించిన తర్వాత మే 17న సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని అనుమతిని పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. చట్టప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయండి నయీంనగర్ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాకలో జరుగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్, కల్వర్టు పనులను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అలాగే వరంగల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను, పరిసరాలను పరిశీలించి వర్షాకాలం సమీపిస్తుండటంతో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ముగ్గురిపై గృహ హింస కేసు మహబూబాబాద్ రూరల్: ఓ వివాహితను అదనపు కట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై గృహహింస చట్టం కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీటీఆర్ నగర్ కాలనీ చెందిన దుంప స్వప్నకు ఖమ్మం జిల్లా కేంద్రం శివారులోని మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన వంశీతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సమయంలో రూ.3లక్షలు కట్నంగా ఇచ్చారు. డబ్బులు సరిపోవటం లేదంటూ మరో రూ.5లక్షలు తేవాలంటూ స్వప్నను వంశీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలో ఆమె భర్త వంశీ, అత్తమామలు వెంకన్న అలివేలుపై చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్ కేసు నమోదు చేశారు. -
సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించినట్లు శుక్రవారం స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–పాట్నా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. పొడిగించిన రైళ్ల వివరాలు.. జూన్ 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి గురువారం కాజీపేట జంక్షన్కు 1:25గంటలకు చేరుకొని వెళ్తుంది. అలాగే చర్లపల్లి–పాట్నా (07256) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు 23:00 గంటలకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళ, గురువారాల్లో కాజీపేట జంక్షన్కు 23:10 గంటలకు చేరుకొని వెళ్తుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. -
రైతులు ధైర్యంగా ఉండండి..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. లారీలు సమయానికి రాక కల్లాలోనే వరి ధాన్యం ఉంటుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎస్ఓ శ్రీనాథ్, డీఎం సివిల్ సప్లై అధికారి రాములు, డీసీఓ వాల్యానాయక్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు సన్న వడ్లను దింపుకునేలా చూడాలని కోరారు. లారీల కొరత లేకుండా చూసి, ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఆదేశించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
అప్పు అడిగినందుకు అంతమొందించారు
గూడూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జి.సూర్యప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీసు స్టేషన్లో శుక్రవారం మండలంలోని గుండెంగ శివారు పంతుల్య తండాకు చెందిన తేజావత్ భద్రు హత్య కేసు వివరాలను సీఐ వివరించారు. పంతుల్యతండాకు చెందిన భద్రు మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య నీల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం తండా సమీపంలోని వ్యవసాయ బావిలో భద్రు శవమై కనిపించగా, పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. కానీ అంతకు ముందే పంతుల్యా తండాకు చెందిన తేజావత్ వీరేందర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తనతో పాటు మరో ముగ్గురు తేజావత్ భద్రును చంపినట్లు నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వెంటనే విచారణ చేపట్టగా, భద్రు వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్న వీరేందర్ డబ్బులు అడుగుతున్నాడనే కోపంతో అదే తండాకు చెందిన తేజావత్ సురేష్కు చెప్పుకున్నాడు. గతంలో భద్రుపై కోపంతో ఉన్న సురేష్, వీరేందర్తో కలిసి పథకం పన్నారు. ఈక్రమంలో అదే తండాకు చెందిన తేజావత్ కిషన్, బాదావత్ ఈర్య వారికి సహకరించగా, మద్యం తాగిఉన్న భద్రు మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపామని, అనంతరం సమీపంలోని వ్యవసాయ బావిలో వేశామని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం హత్యకు పాల్పడిన తేజావత్ వీరేందర్, తేజావత్ కిషన్, తేజావత్ సురేష్, బాదావత్ ఈర్యలను రిమాండ్కు తరలించినట్లు సీఐ సూర్యప్రకాశ్ తెలిపారు. గూడూ రు ఎస్సై గిరిధర్రెడ్డి, కొత్తగూడ ఎస్సై కుషకుమార్, ట్రెయినీ ఎస్సై కోటేశ్వర్రావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. భద్రు హత్య కేసులో నిందితుల అరెస్ట్ -
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీలతో కలిసి పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించి జిల్లాలో (152) మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, టౌన్ సిఐలు దేవేందర్, సర్వయ్య, ఏఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తికావాలి మహబూబాబాద్ రూరల్/కురవి:ఽ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, కురవి, సీరోలు మండలాల్లోని కురవి, కొత్తూరు(సీ), అయ్యగారిపల్లి, నేరడ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా రావాల్సిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్లోడ్ అయిన లారీలను అవసరం ఉన్న చోటకు వెంటనే పంపించాలన్నారు. హమాలీలను సిద్ధంగా ఉంచాలని, లారీ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సంబంధిత క్లస్టర్ సిబ్బంది సమన్వయంతో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు విజయ, పున్నం చందర్, చంద్రశేఖర్ ఉన్నారు. -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. ఇలా కాళేశ్వరానికి వచ్చిన వారిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. – మరిన్ని ఫొటోలు, వివరాలు10లోu -
జవాన్కు ఘనసన్మానం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్లో పాల్గొని వచ్చిన జవాన్ షేక్ అజహర్ను ఎస్పీ సుధీ ర్ రాంనాథ్ కేకన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ జవాన్ కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జవాన్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో పాల్గొనడం జిల్లా వాసిగా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, టౌన్ సీఐ దేవేందర్, ఏఆర్ ఆర్ఐ భాస్కర్, మరిపెడ ఎస్సై సతీష్, జవాన్ అజహర్ తల్లిదండ్రులు ఖాసీం, యాకూబ్ బీ, నాగుల మీరా, సోనీ తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వినియోగంతో భూసారానికి ముప్పు
● జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల గార్ల: రసాయన ఎరువులు, పురుగుమందులు అ ధికంగా వినియోగించడంతో భూసారం దెబ్బ తిని, నేలలు చౌడుబారి పంటల్లో దిగుబడులు తగ్గుతా యని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల సూ చించారు. శుక్రవారం గార్లలోని రైతువేదిక భవనంలో జరిగిన రైతు సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రియ ఎరువులు, జీలుగ సాగుతో భూసారం పెరగడంతో పాటు, భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ సదస్సులో మల్యాల శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, కిషోర్కుమార్, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ కావటి రామారావు, రాజు, ఏఈఓలు పాల్గొన్నారు. -
మానుకోటలో అబార్షన్
ముగ్గురిపై కేసు నమోదు నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన అబార్షన్ ఘటనపై ‘గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్కు యత్నం’ అనే శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ ఆదేశాల మేరకు అబార్షన్ ఘటనపై విచారణ ముమ్మరం చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవిరాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. సదరు మహిళా అబార్షన్కు కారణమైన కాంతి మోమోరియల్ ఆస్పత్రి నిర్వాహక వైద్యులు రామకృష్ణనాయక్, మహిళను అబార్షన్ కోసం తీసుకువచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు గణేష్, ఆమెకు స్కానింగ్ నిర్వహించిన నెక్కొండకు చెందిన యూఎస్జీ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా హాస్టల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అర్హులైన బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారిణి ఓలేటి జ్యోతి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 13వ తేదీ వరకు పలు క్రీడా అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్, జూన్ 10, 11 తేదీల్లో ఓయూ క్యాంపస్లో సైక్లింగ్, వెల్డ్రోమ్, హనుమకొండలో అథ్లెటిక్, జిమ్నాస్టిక్ ఎంపిక ఉంటుందన్నారు. స్టడీ సర్టిఫికెట్లు, కుల ఆదాయం, నివాసం, 5 పాస్ ఫొటోలతో ఆయా జిల్లాల్లో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని, అండర్ 14 నుంచి అండర్ 16 వరకు వయస్సుల వారీగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. నేటి నుంచి కేసముద్రంలో 17 రైళ్లకు హాల్టింగ్కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్లో నేటి (శనివారం) నుంచి 17 రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట–కొండపల్లి రైల్వే సెక్షన్ల మధ్య జరుగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా చేపట్టిన నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్తో మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్టింగ్ తొలగించి, కేసముద్రంలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 24 (శనివారం) నుండి 26వ తేదీ వరకు మణుగూరు–సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (12746), మచిలీపట్నం–బీదర్ (12749), కాకినాడ పోర్ట్–లింగంపల్లి (12737), గూడూరు–సికింద్రాబాద్ (12709), తిరుపతి–సికింద్రాబాద్ (12763), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం– మహబూబ్నగర్ (12861), తాంబరం–హైదరాబాద్ (12759), భువనేశ్వర్–ముంబాయి సీఎస్టీ (11020), షాలీమార్–హైదరాబాద్ (18045), ఈనెల 26న కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ(17206), 27న బెంగళూరు–లాల్ఖాన్(05073), కోయంబత్తూర్–ధన్బాద్ (03680), మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ (17208), 24న తిరుపతి–కరీంనగర్ (12761), ఈనెల 26, 27వ తేదీల్లో నర్సాపూర్–నాగర్సోల్ (12787), 25 నుంచి 27 వరకు చైన్నె సెంట్రల్– అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ (12656)లకు హాల్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు. ఎంబీఏ పరీక్షల పరిశీలన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్లోని కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంటు విభాగం పరీక్షకేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయనవెంట కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు.