breaking news
Mahabubabad
-
భార్య ఎఫైర్.. ప్రియుడి ఇంటిని తగలబెట్టిన భర్త
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా∙గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కనుల పండువగా తెప్పోత్సవం
● కాళేశ్వరం త్రివేణి సంగమంలో శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులకు పూజలుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 7.20 గంటలకు హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ది శరత్చంద్రశర్మలతో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు అవతలి తీరం వైపు ఏర్పాటు చేసిన బాణాసంచా ఆకాశంలో పదిహేను నిమిషాలపాటు వెలుగులు విరజిమ్మింది. సుమారు అరగంటకు పైగా తెప్పను ఉత్సవమూర్తులతో జలవిహారం చేయించారు. ఆ తర్వాత తీరానికి తీసుకొచ్చారు. అంతకు ముందు వీఐపీ ఘాట్ వద్ద గోదావరి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మహేశ్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్, ఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఇతర అధికారులు తీరం బయటి నుంచి వీక్షించారు. -
చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీలో అమ్మోనియా లీక్
వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ సమీపంలోని చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్కు చెందిన 10 కుటుంబాలు అస్వస్థతకు గురయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో గ్యాస్ వాసన వచ్చింది. ఎక్కడ నుంచి వాసన వస్తున్న విషయం తెలియక కోల్డ్స్టోరేజీ పక్కనే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొంతమంది చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీ వద్దకు వెళ్లి పరిశీలించి పైపుల నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసు ఇన్స్పెక్టర్ జివ్వాజి సురేశ్, ఎస్సై రాజుతో అక్కడకు చేరుకున్నారు. కోల్డ్స్టోరేజీ నిర్వాహకులతో మాట్లాడి సంబంధిత టెక్నీషియన్తో గ్యాస్ బంద్ చేయించగా లీకేజీ నిలిచిపోయింది. ప్రథమ చికిత్స అందించడంతో అమ్మోనియా గ్యాస్ లీక్తో అస్వస్థతకు గురైన కుటుంబాలకు ఎలాంటి ప్రమాదం లేదని సీఐ సురేశ్ తెలిపారు. కాంగ్రెస్ 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ వచ్చి కోల్డ్స్టోరేజీలు, పత్తి మిల్లులతో వస్తున్న దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అస్వస్థతకు గురైన 10 కుటుంబాలు ప్రమాదం తప్పిందన్న పోలీసులు -
శంభో శివ శంభో..
శివనామస్మరణతో మార్మోగిన శైవాలయాలు ● వైభవోపేతంగా మహాశివరాత్రి వేడుకలు ● ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు ● భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుశంభో శివ శంభో..హరహర మహదేవా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కిలోమీటర్ల మేర బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తజనంతో ఆలయాలు కిక్కిరిశాయి. ఆయా ఆలయాల్లో రాత్రి సమయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు
కురవి వీరభద్రస్వామి స్వామి వారి ఆలయం బయట భక్తులుహన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ ధరణికోట అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్షమందికి పైగా భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి దేవాలయం జాగరణ చేసే భక్తులతో కిక్కిరిసిపోయింది. రాత్రి 12 గంటలకు వేదపండితులు లింగోద్భవపూజను నిర్వహించారు. తేనె, నెయ్యి, పెరుగు, చక్కెర, పండ్ల రసాలతో మహారుద్రాభిషేకం చేశారు. ప్రముఖుల పూజలు.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు, గోదాదేవి, విష్ణువర్ధన్రెడ్డి దంపతులు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సిరికొండ మధుసూదనాచారి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దాత గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి దంపతులు, హైకోర్టు జడ్జి జస్టిస్ సాంబశివనాయుడు, నగర సీపీ సన్ప్రీత్సింగ్, ఏసీపీలు నరసింహారావు, సత్యనారాయణ, సీఐ మచ్చ శివకుమార్, దేవాదాయశాఖ డీసీ రామల సునీత, వాగ్దేవి కళాశాలల చైర్మన్ చందుపట్ల దేవేందర్రెడ్డి, మండువ శేషగిరిరావు, బిల్డర్ సీతారామారెడ్డి, వేముల సత్యమూర్తి, రాంరెడ్డి, బీజేపీ నాయకురాలు రావుపద్మ, మాజీ ఎమ్మెల్యే సతీమణి దాస్యం రేవతి, కార్పొరేటర్ లోట వెంకటేశ్వర్లు, సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు స్వామివారికి అభిషేకాలు జరుపుకున్నారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మున్సిపల్ పారుశుద్ద్యసిబ్బంది, శ్రీరుద్రేశ్వరసేవా సమితి సభ్యులు గండ్రాతి రాజు, చొల్లేటి కృష్ణమాచారి, కట్ల రాజు, సురేశ్కుమార్, కాశిలింగాచారి, నవీన్కుమార్ సేవలందించారు. శోభాయమానం కల్యాణం.. దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 5.45 గంటలకు రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామి కల్యాణాన్ని గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉభయదాతలుగా వ్యవహరించిన వద్దిరాజు వెంకటేశ్వర్లు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాడిశెట్టి సాంబయ్య దంపతులు వధువు తరఫున కల్యాణకర్తగా వ్యవహరించారు. గారపల్లి మహేశ్వరశర్మ శివతత్వంపై ధార్మికప్రసంగం చేశారు, బొడిగె లక్ష్మీనారాయణ భాగవతార్ హరికథ, బొంపల్లి సుధీర్రావు, రేణుక బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి.కల్యాణ మండపంలో ఉత్సవ మూర్తులకు కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులుకల్యాణంలో పాల్గొన్న భక్తులుకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ రాహుల్శర్మ దంపతులు ఆనవాయితీ ప్రకారం ఈఓ కార్యాలయం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. ఉత్తర రాజగోపురం బయట నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, ముఖ్య అర్చకులు రాముశర్మ, అర్చకులు వెల్ది శరత్చంద్రశర్మ, కాకిరాల పవన్శర్మ, బైకుంఠపాండా, రామకృష్ణశర్మ, రాజ్కుమార్, విజయ్కుమార్లు కల్యాణ తంతు అంగరంగా వైభవంగా జరిపించారు. కల్యాణ తంతు వీక్షించడానికి భక్తుల సౌకర్యార్థం రెండు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, ఈఓ మహేశ్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ రామారావు, మహదేవపూర్ సర్పంచ్ హసీనభాను తదితరులు పాల్గొన్నారు. కల్యాణం సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీ ప్రకారం కాళేశ్వరానికి చెందిన గందెసిరి సత్యనారాయణ, మధు, రమేశ్ సోదరులు తమ ఇంటి నుంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నేత్రపర్వంగా మల్లికార్జునస్వామి కల్యాణం వైభవోపేతంగా శ్రీశుభానంద– ముక్తీశ్వరుల పెళ్లి.. పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం -
కత్తితో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
దుగ్గొండి: పంచాయితీలో మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి.. కత్తితో దాడికి పాల్పడడంతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మండలంలోని జీడికల్లో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రె రమేశ్, గొర్రె యుగంధర్కు ఆర్థికపరమైన విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగా మాటామాటా పెరిగింది. దీంతో యుగంధర్ కుమారుడు రాకేశ్.. కత్తితో దాడికి పాల్పడగా రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ తెలిపారు. కాల్వలో పడి గొర్రెలు మృత్యువాత టేకుమట్ల: కాల్వ దాటే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని ఆరెపల్లి శివారులో చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరి కుర్రె వీరయ్య కథనం ప్రకారం ఎస్సారెస్పీ డీబీఎం–16 సమీపంలో మేపుతున్న క్రమంలో గొర్రెలు కాల్వ దాటుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అందులో మునిగి 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కాగా వీరయ్యకు చెందిన 26తో పాటు, మరికొంత మంది కాపరులకు చెందిన 26 గొర్రెలు చనిపోయాయి. వీటి విలువ సుమారు రూ.5లక్షలకు పైగా ఉంటుందని, నష్టపోయిన కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం● రూ.20 లక్షల విలువైన ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, హార్వెస్టర్ దహనం ● మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఘటన మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోటపై కాంగ్రెస్ జెండా..?
కాంగ్రెస్ గూటికి చేరిన స్వతంత్రులు ● మహబూబాబాద్ చైర్పర్సన్ అభ్యర్థిగా గుగులోత్ జ్యోతి? ● చివరి వరకు బీఆర్ఎస్ ప్రయత్నం మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో మానుకోటలో ప్రధాన పార్టీలకు మెజార్టీ రాలేదు. దీంతో చైర్మన్ పీఠం కోసం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో నలుగురు స్వతంత్రుల చేరికతో చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ కాంగ్రెస్కు వచ్చింది. హంగ్ ఫలితాలతో పరేషాన్ మానుకోటలో 36 వార్డులుండగా కాంగ్రెస్ 13 వార్డుల్లో, బీఆర్ఎస్ 11, సీపీఐ 3, సీపీఎం 3, బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఐదు వార్డుల్లో విజయంసాధించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేయగా వారికి 16 సీట్లు, బీఆర్ఎస్ సీపీఐ పొత్తుతో 14 సీట్లు సాధించాయి. మూడో వార్డు నుంచి కె.రజిత బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. చైర్మన్ ఎన్నికకు సరిపడా స్థానాలు ప్రధాన పార్టీలకు రాకపోవడంతో స్వతంత్రులు కీలకమయ్యారు. వీరిలో గుగులోత్ జ్యోతి, కాటా భాస్కర్, బోల్లు రాజు, గాడిపెల్లి లావణ్య కాంగ్రెస్లో చేరినట్లు సమాచారం. కాటా భాస్కర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు ఫొటోలు బయటకొచ్చాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్, సీపీఎం 16 సీట్లు కలిగి ఉండగా.. స్వతంత్రులు నలుగురితోవారి సంఖ్య 20కి చేరింది. ఎమ్మెల్యే మురళీనాయక్ ఓటుతో వారికి 21 ఓట్లు ఉన్నాయి. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్కు చైర్మన్.. సీపీఎంకు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ ప్రతిపాదిత అభ్యర్థి మూడు బాలు చౌహన్ ఓడిపోయారు. దీంతో స్వతంత్రంగా గెలిచిన గుగులోత్ జ్యోతిని కాంగ్రెస్లో చేర్చుకుని చైర్మన్గా, పొత్తులో భాగంగా సీపీఎంకు చెందిన సూర్నపు సోమయ్యకు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. 8వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ తరఫున గెలిచిన బానోత్ పార్వతికి చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంపీ వర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు(సోమవారం) కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుందని కమిషనర్ రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఉదయం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గెజిటెడ్ అధికారిగా ఆర్డీఓ కృష్ణవేణి వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మానుకోటలో ఎక్స్ అఫీషియో ఓటును వేయనున్నారు. కార్యాలయం ఎదుట పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే యత్నాలు.. 20వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ కుమార్తె తేజస్వి విజయం సాధించడంతో చైర్పర్సన్ చేయాలని శంకర్నాయక్ యత్నిస్తున్నారు. బీఆర్ఎస్కు 11 సీట్లు, సీపీఐకి 3 సీట్లు, 3వ వార్డు నుంచి బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన రజితతో కలిపి 15 ఓట్లు ఉన్నాయి. 26వ వార్డు నుంచి బీజేపీ తరఫున గెలిచిన మాలోత్ శ్రీదేవి మద్దతు కూడా కోరినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రవీందర్రావు ఓటుతో వీరిబలం 17కు చేరుతుంది. ఇక స్వతంత్రులు నలుగురు కాంగ్రెస్ గూటీలో ఉన్నా ఎన్నిక సమయంలో వారిలో ఇద్దరైనా తమకు మద్దుతు తెలియజేస్తారనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్కు చైర్మన్ స్థానం దక్కితే సీపీఐకి వైస్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉంది. డోర్నకల్: మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరగనున్న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ మున్సిపల్ కమిషనర్ నిరంజన్తో కలిసి ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ మొత్తం 15 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 11 స్థానాల్లో, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఆదివారం రాత్రి వరకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు ప్రమాణస్వీకారం కేసముద్రం: నేడు కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 16 వార్డులకు కాంగ్రెస్ 8, బీఆర్ఎస్కు 8 స్థానాలు ఉన్నాయి. దీంతో హంగ్ ఏర్పడింది. సోమవారం జరగనున్న ప్రమాణస్వీకారంలో భాగంగా చైర్మన్ ఎంపిక ఉత్కంఠతకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఎంపీ బలరాం నాయక్ ఎక్స్అఫీషియో ఓటును ఇక్కడ నమోదు చేసుకున్నట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.డ్రా పద్ధతిలో.. తొర్రూరు రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 9 సీట్లు గెలుపొందాయి. మెజార్టీ కౌన్సిలర్లను సాధించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కే అవకాశం ఉండగా, ఓటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియోలుగా పాల్గొంటే కాంగ్రెస్ పార్టీకి సైతం 9 ఓట్లు ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండాలనే నిబంధన విధించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు 9 చొప్పున ఓట్లు రానుండడంతో చైర్మన, వైస్ చైర్మన్ ఎన్నిక డ్రా పద్ధతిలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రెండు పార్టీల నాయకులు ఒకరిద్దరు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
సమస్యలతో స్వాగతం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ రెండో పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు నూతన పాలకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. వేధిస్తున్న తాగునీటి సమస్య.. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిత్యం తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, అమృత్ పథకం కోసం పైపులైన్ ఏర్పాట్ల పనులతో పలు వీధుల్లో పైప్లైన్లు పగిలి రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. అస్తవ్యస్తంగా రోడ్లు.. అమృత్ పథకంతోపాటు సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం పలు వీధుల్లో తవ్వకాలు జరపడంతో రహదారులు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి పనులు జరుగుతుండటం, పలు వీధుల్లో పనులను నిలిపివేయంతో ధ్వంసమైన రోడ్లతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే జెడ్పీ స్కూల్, టెలీఫోన్ ఎక్చేంజ్ రోడ్డులో తవ్వకాలతో రోడ్డు ధ్వంసం కావడంతో మూడు నెలలుగా స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు.. పలు వీధుల్లో పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరణ వాహనాలు రోజుల తరబడి వీధుల్లోకి రాకపోవడంతో ఇళ్లతోపాటు వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. చెత్త సేకరణ వాహనాలు నిత్యం మరమ్మతులకు గురి కావడం, సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో వీధుల్లో సకాలంలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పని ట్రాఫిక్ తిప్పలు.. మెయిన్ రోడ్డు, గాంధీసెంటర్, బ్యాంక్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై తోపుడు బండ్లు, కూరగాయాలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేయడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు డ్రెయినేజీలతోపాటు రోడ్లను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడం, వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. అభివృద్ది పనులకు మోక్షం లభిస్తుందా? గతంలో రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇతర నిధులతో చేపట్టిన పనులు పలు కారణాలతో నిలిచాయి. కూరగాయల మార్కెట్ భవనం, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, శ్మశానవాటిక పనులు, గిరిజన భవనం, డంపింగ్ యార్డు ఏర్పాటు, మోడల్ మార్కెట్ భవనం పనులు, మైనారిటీ మినీ ఫంక్షన్ హాలు వంటి మధ్యలో ఆగిన పనులకు మోక్షం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో సమస్య తిష్ట నేడు మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం నిత్యం తాగునీటి సమస్యలు అస్తవ్యస్తంగా రహదారులు -
సేవాలాల్ మహరాజ్ మార్గం అనుసరణీయం
● భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు మహబూబాబాద్ రూరల్ : బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం యువతకు ఆదర్శమని శనిగపురం సేవాలాల్ ఆలయ కమిటీ చైర్మన్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ వెంకన్ననాయక్ అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను సేవాలాల్ సేన, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహబుబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం ఆలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. భోగ్ బండారో, లాగ భోగ్ కట రోగ్, బంజారా సంప్రదాయ నృత్యాలతో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకన్ననాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా భక్తి మార్గంలో ఉండాలని సూచించారు. సేవాలాల్ జయంతికి నిధులు కేటాయించాలని, బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూరాథోడ్, కర్నావత్ వెంకన్న, మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూనాయక్, డాక్టర్ కిరణ్ నాయక్, గుగులోత్ హాల్యానాయక్, గుగులోతు కిషన్ నాయక్, ధరావత్ భాస్కర్, రాంజీనాయక్, ధరావత్ మోతిలాల్ నాయక్, స్రవంతి బాయి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులోని సేవాలాల్ మహరాజ్ దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో నిర్వహించిన జ యంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాజరై భోగ్ బండారో సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో గుగులోత్ భీమానాయక్, రామచందర్, ధరావత్ బాలునాయక్, బానోతు దా ము, నవీన్, భూక్యా సురేందర్, మల్సూర్, వీరన్న, కిషన్, వెంకన్న, రాజునాయక్ పాల్గొన్నారు. -
పోలీసు బందోబస్తు.. ట్రాఫిక్ ఆంక్షలు
● ఎస్పీ శబరీష్ ● నేడు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మహబూబాబాద్ రూరల్ : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 144 సీఆర్పీసీ (163 బీఎన్ఎస్ఎస్) సెక్షన్ అమలులో ఉంటుందని, అదే విధంగా విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శబరీష్ ఆదివారం తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నలుగురు, అంతకంటే ఎక్కువమంది గుంపులుగా తిరగొద్దని, విజయోత్సవ ర్యాలీలు, టపాసులు కాల్చడం నేరంగా పరిగణించడంతోపాటు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉదయం నుంచి వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఇల్లందు వైపు నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు వైఎస్సార్ సెంటర్ నుంచి బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, ఎఫ్ఆర్ఓ సెంటర్ వైపు వెళ్లాలని సూచించారు. నెహ్రూ సెంటర్ వైపు వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్ బ్రిడ్జి కురవి గేట్ నుంచి వెళ్లాలని, రైల్వే స్టేషన్ నుంచి ఇల్లందు వైపు, నెహ్రూ సెంటర్, కురవి రోడ్ వైపు వెళ్లే వాహనాలు ఎఫ్ఆర్ఓ సెంటర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు. నెహ్రూ సెంటర్, అండర్ బ్రిడ్జి నుంచి ఎఫ్ఆర్ఓ సెంటర్, వైఎస్సార్ సెంటర్ వైపు వెళ్లే వాహనాలు కురవి గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని తెలిపారు. -
ఓం నమఃశివాయ
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు ● వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ● అర్చనలు.. అభిషేకాలతో భక్తుల మొక్కులు ● జాగరణవేళ కిక్కిరిసిన ఆలయాలుమహబూబాబాద్ రూరల్: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివలింగ పూజలు, సామూహిక మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చన పూజలతో ఆలయాలు కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాల్లో పా ర్వతీ పరమేశ్వరులను, శివలింగాలను దర్శించుకు ని పూజలు చేశారు. ఉమాచంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం, పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవా లయం, భక్త మార్కండేయ శివాలయం, స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అర్చకులు రంగావఝుల సుధాకరశాస్త్రి, చిట్టా శ్రీకాంత్ శర్మ, కొత్తూరి నర్సింహమూర్తిశర్మ, అన్నావఝుల యు గంధర్ శర్మ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. శివాలయాల్లో శివుడిని, పార్వతీదేవి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. మహాశివరా త్రి పర్వదినోత్సవాన్ని అత్యంత విశిష్టంగా భావించిన భక్తులు బిల్వ (మారేడు) దళాలు, తెల్లజిల్లేడు పూలు, జిల్లేడు ఆకులు సమర్పించి శివుడికి అలంకరణలు, అర్చనలు, పూజలు చేశారు. వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం కురవి: మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివా రం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్ర హ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, ఈఓ సత్యనారాయణలు కల్యాణ మహోత్సవ జాతరను పర్యవేక్షించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ ఉత్తరద్వారం నుంచి మొదలుకొని నేరడ క్రాస్ రోడ్డు వరకు క్యూ ఏర్పడింది. ఆలయం ఎదుట నుంచి కల్యాణ మండపం వరకు కలకత్తా పండాల్స్(టెంట్లను) ఏర్పాటు చేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై సతీష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ రవి రాథోడ్ ఆధ్వర్యంలో డాక్టర్ విరాజిత నేతత్వంలో వైద్య సేవలను అందచేశారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి కురవి వీరన్న జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపా రు. మహబూబాబాద్ నుంచి కురవికి, ఖమ్మం, సూ ర్యాపేటల నుంచి బస్సులు నడిచాయి. ఇదిలా ఉండగా.. కల్యాణ వీరభద్రుడు, భద్రకాళీ అమ్మవారి ఉత్సవ మూర్తులను వేర్వేరు శావల్లో ప్రత్యేకంగా అలంకరించి ఆలయంలో ప్రదక్షిణలు చేయించారు. గ్రామ పంచాయతీ వద్ద రెండు శావలు వేరుపడి.. గండిమైసమ్మ వద్ద ఎదురపడ్డాయి. వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారి తరపున గ్రామ పెద్దలు కూర్చొని కట్నకానుకలను మాట్లాడి ఎదుర్కోలు నిర్వహించారు. రాత్రి కల్యాణం నిర్వహించారు. వీరభద్రస్వామిని మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ దంపతులు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు మాలోత్ నెహ్రూనాయక్ దర్శించుకున్నారు. -
శుభకార్యానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
● చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి నర్సంపేట రూరల్ : శుభకార్యానికి వెళ్లొస్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. బైక్.. చెట్టును ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన శనివారం చెన్నారావుపేట మండలం ఖాధర్పేట శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన బొమ్మగాని అనిల్గౌడ్ (39) భార్యాపిల్లలతో కలిసి తొర్రూరులో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శుభకార్యం నిమిత్తం శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి అదే రోజు రాత్రి బైక్పై తొర్రూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాధర్పేట శివారులోని మలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో పక్కనే ఉన్న వరి పొలంలో పడ్డాడు. శనివారం ఉదయం పొలానికి నీరు పారించేందుకు వచ్చిన రైతు చూడగా అనిల్ మృతిచెంది కనిపించాడు. దీంతో రైతు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రాజేశ్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. -
వైభవంగా ‘వీరన్న’ అంకురార్పణ పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అంకురార్పణ పూజలు వైభవంగా జరిగాయి. రాత్రి 7.30గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, కంకణధారణ, దీక్షాధారణ పూజలు శాస్త్రోక్తంగా చేశారు. అంకురాలతో అంకురారోహణం పూజ నిర్వహించారు. అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు బసవముద్దను ఎగురేశారు. కార్యక్రమంలో ఆలయ ఇఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, ధర్మకర్తలు బాలగా ని శ్రీనివాస్, చిన్నం గణేశ్, భిక్షపతి, సోమ్ల, శకృ, ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నేడు వీరభద్రస్వామి వారి కల్యాణం.. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనుంది. నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు శైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు హన్మకొండ: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైవ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత శనివారం తెలిపారు. ఆదివారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయానికి, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. పాలకుర్తికి ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరుతుందన్నారు. ములుగు నుంచి రామప్పకు ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
సామాజిక న్యాయం కోసం పోరాడాలి
ఐనవోలు : అరాచకాలను ఎదిరించిన పరాక్రమశాలి సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో బహుజనులు సామాజిక న్యాయసాధన కోసం పోరాడాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పున్నేలు గ్రామంలో శ్రీకంఠమహేశ్వర గౌడ సంఘం ఆధ్వర్యంలో పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పల్లె రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాపన్న స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని లక్ష్యం సిద్ధించే వరకూ రాజీలేని పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఆచరణలో చూపిన సిద్ధాంతమే తెలంగాణ సామాజిక న్యాయసాధనకు సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. బంతి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మోతె చక్రవర్తి, అంజయ్య, గడ్డం ర ఘువంశీ, చిర్ర రాజు, గోపి, రామ్మూర్తి, భిక్షపతి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ -
తెప్పోత్సవానికి హంసవాహసం రెడీ
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఆదివారం రాత్రి 7గంటలకు తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ హంసవాహనాన్ని సిద్ధం చేసింది. రాత్రి గంటపాటు పూజా కార్యక్రమాలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయించనున్నారు. కల్యాణం, తెప్పోత్సవానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. దీంతో అధికారులు ఏర్పా ట్లు ముమ్మరం చేస్తున్నారు. శనివారం సాయంత్రం కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ పనులు పరిశీలించారు. వీఐపీఘాట్, సాధారణ ఘాట్ వద్ద ఏర్పాట్లు చూశారు. సబ్కలెక్టర్ వెంట ఈఓ మహేశ్, సర్పంచ్ మోహ న్రెడ్డి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఎంపీఓ భవాని, కార్యదర్శి సత్యనారాయణలు ఉన్నారు. కల్యాణ మండపం, వేదికలను డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, నాగార్జునరావు, ఎస్సై తమాషారెడ్డి పరిశీలించారు.ఆర్ట్ ఉపాధ్యాయుడి అద్భుత కళాఖండం ● చాక్పీస్పై శివలింగం మల్హర్(కాటారం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల ఆర్ట్ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ అద్భుత కళాఖండంతో భక్తి చాటుకున్నాడు. చాక్పీస్ పై 1.3 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న శివలింగాన్ని రూపొందించాడు. గత శివరాత్రి సందర్భంగా చాక్పీస్లతో 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న 109 శివలింగాలను, ప్రపంచంలోని అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించినట్లు రజనీకాంత్ తెలిపారు. -
అండర్–19 క్రికెట్ చాంపియన్ కరీంనగర్
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా వారం రోజులు నిర్వహించిన అండర్–19 క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జట్టు చాంపియన్గా నిలిచింది. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో శనివారం ఫైనల్ జరిగింది. కరీంనగర్ , మెదక్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 107 పరుగుల తేడాతో మెదక్ పై కరీంనగర్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ నిర్ణీత 50 ఓవర్లకు గాను 39.5 ఓవర్లు ఎదుర్కొని 260 పరుగులు సాధించింది. కరీంనగర్ జట్టులో బ్యాట్స్మెన్ తక్షిల్ 104 బంతులు ఎదుర్కొని 20 బౌండరీలు, 2 సిక్సర్లతో చెలరేగి 145 పరుగులు సాధించగా, మెదక్ బౌలర్ హిషాంత్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెదక్ జట్టు 29.5 ఓవర్లు ఎదుర్కొని 153 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో కరీంనగర్ జట్టు 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెదక్ బ్యాట్స్మెన్ విఘ్నేష్ 36 పరుగులతో రాణించగా, కరీంనగర్ ఆల్రౌండర్ తక్షిల్, అహ్మద్ చెరో 3వికెట్లను తీసి మెదక్ను కట్టడి చేశారు. టోర్నీలో తక్షిల్ దూకుడు.. తక్షిల్ టోర్నమెంట్ మొత్తం మీద 15 సిక్సర్లు, 62 బౌండరీలు సాధించడమే కాకుండా ప్రతీ మ్యాచ్లో మంచి స్కోరుతో రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ కీలక వికెట్లూ తీస్తూ కరీంనగర్ జట్టుకు కప్ను అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి సీనియర్ క్రీడాకారుడు శరత్చంద్ర ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ ప్రతినిధి మనోహర్రావు, మెదక్ కార్యదర్శి రాజేంద్రరెడ్డి, మార్నేని ఉదయభానురావు, మట్టెడ కుమార్, బండారి ప్రభాకర్ పాల్గొన్నారు. రన్నరప్ మెదక్ .. -
ఎంజేపీ విద్యార్థి అదృశ్యం
హసన్పర్తి : హసన్పర్తి మండలం జయగిరి శివారులోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకులం నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటపర్తికి చెందిన నెలకొండ హేమంత్ జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సహా విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే నిద్రించాడు. ఉదయం కనిపించకపోడంతో పాఠశాల పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గేట్ తాళం వేయలేదా? కిటికీ నుంచి దూకాడా? పాఠశాల ప్రధాన గేట్ వద్ద నిరంతరం సెక్యూరిటీలు విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే విద్యార్థి పారిపోయిన సమయంలో గేట్కు తాళం వేసి లేదా? కిటికీ నుంచి దూకి పారిపోయాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉండగా, పాఠశాలలోని పలు గదులకు కిటికీలు కూడా లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఐదేళ్లుగా ఆ పాఠశాల ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నప్పటికీ సరైన సౌకర్యాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి పేరుతో మహిళ మోసం? ● లక్నెపల్లిలో ఢిల్లీ పోలీసుల విచారణ నర్సంపేట రూరల్ : కంపెనీలో పెట్టుబడి పేరుతో ఓ మహిళ మోసం చేసిందనే ఫిర్యాదు మేరకు ఆమె వివరాలు సేకరించేందుకు ఢిల్లీ పోలీసులు శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. లక్నెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా సంవత్సరాల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. అక్కడే ఓ పబ్తోపాటు ఓ కంపెనీ నెలకొల్పిందని సమాచారం. ఈక్రమంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సదరు మహిళ ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అనంతరం సదరు వ్యక్తి కంపెనీ లావాదేవీలపై ఆ మహిళకు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అతడు ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ అడ్రస్ మేరకు ఢిల్లీ పోలీసులు నర్సంపేట మండలం లక్నెపల్లికి చేరుకుని విచారించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పంట కొని డబ్బు ఇవ్వకుండా బెదిరింపులు.. ● అడ్తి యజమాని, గుమాస్తాపై కేసు నమోదు వరంగల్: రైతు వద్ద పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన అడ్తి దుకాణం యజమాని ఆవుల ప్రభాకర్, గుమాస్తా తిప్పని రాజుపై కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు తోటకూరి ఉపేందర్రావు 2025 నవంబర్లో తన 27.65 క్వింటాళ్ల పత్తిని వరంగల్ ఏనుమముల మార్కెట్కి తీసుకు రాగా క్వింటాకు రూ.5,600 చొప్పున షాపు నంబర్ 03 వ్యాపారులు ఆవుల ప్రభాకర్, తిప్పని రాజు కొనుగోలు చేశారు. సరుకుకు మొత్తం రూ.1,54,840 రాగా అందులో ఖర్చులు తీసివేయగా రూ.1,47,400 ఇవ్వాల్సి ఉంది. అందులో 93,900 ఇచ్చి మిగతా రూ.53,500 తర్వాత ఇస్తామని పంపించారు. అడిగిన ప్రతీసారి కాలయాపన చేస్తూ చివరకు డబ్బులు ఇచ్చేదే లేదని, ఎవరికై నా చెప్పుకో అని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఖమ్మం నుంచి వచ్చి మా దగ్గర వసూలు చేసే ధైర్యం నీకు లేదని, డబ్బులు అడిగితే చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై బాధిత రైతు ఏనుమాముల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో షాపు నంబర్ 03 వ్యాపారులు ఆవుల ప్రభాకర్, తిప్పని రాజుపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు ఖిలా వరంగల్: బంధువులతో తరచూ గొ డవల కారణంగా జీవితంపై విరక్తి చెంది వ రంగల్ అండర్బ్రిడ్జి ప్రాంతంలో రైల్వే ట్రా క్పై ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఇంతేజార్ గంజ్ పీఎస్కు చెందిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మాట్ల రాజయ్య, కృష్ణ కాపాడారు. వరంగల్ కొత్తవాడకు చెందిన లోకబోయిన శారదకు సమీప బంధువులతో తరచూ జరుగుతున్నాయి. దీంతో జీవి తంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై సమాచారం అందుకున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆమెను కాపాడారు. అనంతరం పీఎస్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాత్రి హాస్టల్ నుంచి పరారయ్యాడా? విద్యార్థి కోసం గాలింపు.. లభించని ఆచూకీ పీఎస్లో ఫిర్యాదు..కేసు నమోదు -
వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శివపూజకు వేళ అయ్యింది. నేడు (ఆదివారం) మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాల వెలుగుల్లో జిగేల్ మంటున్నాయి. ఆయా ఆలయల్లో అత్యంత వైభవోపేతంగా జరగనున్న శివపార్వతుల కల్యాణోత్సవానికి లక్షమంది భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, శివనామస్మరణతో శైవాలయాలు మార్మోగనున్నాయి. శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మార్మోగనున్న శివనామస్మరణ18వ తేదీ వరకు నిర్వహణ– కార్యక్రమ వివరాలు ఇలా.. హన్మకొండ కల్చరల్: నగరంలోని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మహాశివరాత్రి రోజు భక్తుల జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజు శివపార్వతుల కల్యాణం లింగోద్భవకాలపూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. పూజకార్యక్రమాలలో పాల్గొనే భక్తులు రూ. 21,116 చెల్లించి రశీదు పొందాలి. అలాగే విడిగా చండీహోమంలో రూ. 3,116, స్వామివారి కల్యాణంలో రూ. 1116, లింగోద్భవకాల పూజకోసం రూ. 12,116, అన్నపూజకోసం రూ. 5,116 చెల్లించాలని ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. 15వ తేదీన.. ● 15వ తేదీన (ఆదివారం) ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, రుద్రేశ్వరస్వామి వారికి సామూహిక రుద్రాభిషేకాలు, నిత్యవిధిహవనం, సాయంత్రం 5.45గంటలకు ఉత్తరాషాడ నక్షత్రయుక్త గోధూళిలగ్నసుమూహూర్తమున రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరిదేవి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. అర్ధరాత్రి 12గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వకమహ రుద్రాభిషేకం జరుగుతుంది. 16న.. ● 16వతేదీ (సోమవారం) ఉదయం 5గంటలకు సుప్రభాతం గణపతిపూజ, స్వామివారికి రుద్రాభిషేకములు, మహాపూజ, నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది. 17న.. ● 17వతేదీ (మంగళవారం) మహాన్నపూజ, అన్నప్రసాదాల వితరణ. సాయంత్రం మహాపూజ 18న.. ● 18వ తేదీ (బుధవారం) ఉత్సవ ముగింపులో భాగంగా ఆంజనేయస్వామికి చందనోత్సవం, ఆకుపూజ, రుద్రేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మహాబిల్వార్చన, చండీహోమం, పూర్ణాహుతి పండిత సత్కారం నిర్వహిస్తారు. -
వీరన్న సన్నిధిలో ఎస్పీ పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామిని ఎస్పీ శబరీష్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంత రం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులతో జాతరపై చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య పాల్గొన్నారు. ధ్వంసమైన పుష్కరఘాట్ పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో గోదావరి ఒడ్డున 2015లో పుష్కరఘాట్ నిర్మించారు. గోదావరి వరదలకు ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ఇరిగేషన్ ఈఈ శంకరయ్య రెవెన్యూ పంచాయతీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు స్థల పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. 2015లో పుష్కరాల సందర్భంగా రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్ను పరిశీలించినట్లు తెలిపారు. మండలంలో 2027 జూన్లో జరిగే పుష్కరాలకు పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 18న ఉన్నతాధికారులు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించేందుకు మండలానికి రానున్నట్లు వివరించారు. ముందస్తుగా అనుకూలమైన స్థలాన్ని గుర్తించేందుకు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి కరకట్ట నిర్మాణం జరుగుతున్నా దొంగల ఒర్రె ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థలాన్ని నిర్ణయించనున్నట్లు వివరించారు. ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్మహ్మద్, జీపీఓ రాములు, నర్సయ్య, సురేశ్ పాల్గొన్నారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో శనివా రం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేద ని, ప్రస్తుతం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. -
పురాధీశులెవరు?
ప్రతిష్టకోసం ఎమ్మెల్యే.. కుమార్తె కోసం మాజీ ఎమ్మెల్యే సాక్షి, మహబూబాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఒక్కోచోట ఒక్కో విధంగా తీర్పునిచ్చారు. డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు కాంగ్రెస్, తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించాయి. దీంతో అక్కడ చైర్మన్ పీఠం పార్టీ నిర్ణయం మేరకు జరగనుంది. అయితే మొదటి నుంచి రూటేవేరు అనే విధంగా మానుకోట నియోకవర్గంలో మాత్రం ఓటర్లు ఇరుపక్షాలకు దాదాపుగా సమాన మద్దతు ఇచ్చారు. దీంతో మున్సిపల్ చైర్మన్ల ఎంపిక క్యాంపు రాజకీయాల చుట్టు తిరుగుతుంది. ప్రతిష్టకోసం ఎమ్మెల్యే యత్నాలు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపిక ప్రస్తుత ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన మురళీనాయక్ తనదైన శైలిలో జిల్లా కాంగ్రెస్ పదవిని తన సతీమని భూక్య ఉమకు దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షురాలు ఒకే ఇంటి నుంచి ఉండటంతో ప్రతీ ఎన్నికలో పార్టీ ప్రతిష్టను కాపాడే బాధ్యత ఆ కుటుంబంపై మరింత పెరిగింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు గెలిచినా.. ఆశించిన స్థాయిలో గెలవలేదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపెడ రెండూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా.. మానుకోట నియోజకవర్గంలోని మహబూబాబాద్, కేసముద్రం చైర్మన్ స్థానాలను దక్కించుకుంటేనే ఇప్పటి వరకున్న విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుంది. కుమార్తె కోసం మాజీ ఎమ్మెల్యే.. తెలంగాణ ఉద్యమకాలం నుంచి మానుకోటలోనే తిష్టవేసి రాష్ట్ర సాధన తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ నాయక్ గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడవడంతో శంకర్ నాయక్ మానుకోటను వీడిపోతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చేసిన వాళ్లల్లో ప్రతిపక్ష పార్టీలతోపాటు, సొంత పార్టీ నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఈ పరిస్థితిలో అందివచ్చిన మానుకోట మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ను కై వసం చేసుకునేందుకు తన కుమార్తె తేజశ్వినిని కౌన్సిలర్గా గెలిపించుకున్నారు. ఏ విధంగానైనా చైర్మన్ పీఠంపై కుమార్తెను కూర్చొబెట్టేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేశారు. అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీని కూడా దక్కించుకునేందుకు పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.జిల్లాలోని మానుకోట, కేసముద్రం రెండు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక క్యాంపుల చుట్టు తిరుగుతుంది. కేసముద్రంలో మొత్తం 16 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా చెరో ఎనిమిది స్థానాలు దక్కాయి. దీంతో క్యాంపు రాజకీయంతోపాటు ఎక్స్అఫీషియా ఓట్లపై ఆయా పార్టీలు దృష్టిసారించాయి. మానుకోటలో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షం సీపీఎంను కలుపుకొని 16 వార్డులు, బీఆర్ఎస్ మిత్రపక్షం సీపీఐని కలుపుకొని 15 వార్డులు గెల్చుకున్నాయి. ఒక వార్డు స్థానంలో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ తటస్థంగా ఉండడంతో నాలుగు వార్డులు గెల్చుకున్న స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం కీలకం కానుంది. వారిని తమ వైపు తిప్పుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేశారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంపులో ఉండగా.. వారి బంధువుల వద్దకు వెళ్లి భారీగా నజరానాలు ఇస్తామని మద్దతు తెలుపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికి మద్దతిస్తారు.. పురాధీశులు ఎవరవుతారో వేచిచూడాలి.క్యాంపు రాజకీయం మానుకోట మున్సిపల్ పీఠానికికాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టు చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్న స్వతంత్రులు -
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేకశ్రద్ధ వహించాలి
● డీఈఓ రాజేశ్వర్ తొర్రూరు: తరగతిలోని ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలను సాధించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శని వారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పరిశీలించి సూచనలు చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచేలా కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎంలు జెల్ల లక్ష్మీనారాయణ, శారదాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వతంత్రులు ఎటువైపు..?
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పోలైన ఓట్ల మోజార్టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత స్థానంలో స్వతంత్రులే ఉన్నారు. పలు వార్డుల్లో స్వతంత్రుల ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వారికి పడిన ఓట్ల ద్వారా కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్కు మేలు జరగ్గా పలు వార్డుల్లో కాంగ్రెస్కు కలిసొచ్చింది. చివరికి చైర్మన్ విషయంలోనూ స్వతంత్రులే కీలకంకావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన వారే స్వతంత్రులుగా పోటీ చేసి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్రులకు 7,005 ఓట్లు మానుకోట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 65,712 మంది ఉండగా 49,661 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్కు 17,070 ఓట్లు, బీఆర్ఎస్కు 18,483 ఓట్లు, స్వతంత్రులకు 7,005 ఓట్లు వచ్చాయి. బీజేపీ 1,270, సీపీఐ 2602, సీపీఎం 2799 ఓట్లు సాధించాయి. బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత స్థానంలో స్వతంత్రులకే ఎక్కువ ఓట్లు పోలైనట్లు ఎన్నికల సిబ్బంది ప్రకటించారు. 36 వార్డులకు గాను 38 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. 11వ వార్డుతోపాటు పలు వార్డుల్లో స్వతంత్రులు రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ చైర్మన్ ప్రతిపాదిత అభ్యర్థి ఓటమి కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ ప్రతిపాదిత అభ్యర్థి మూడ్ బాలుచౌహన్ 17వ వార్డు నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. దీంతో నాల్గో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గుగులోత్ జ్యోతి తెరపైకి వచ్చారు. ఆమె కూడా కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తారనే ధీమాతో ఆపార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్కు చైర్మన్, సీపీఎంకు వైస్ చైర్మన్ పీఠం దక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక స్వతంత్రులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే బీఆర్ఎస్కు చైర్మన్, సీపీఐకి వైస్ చైర్మన్ దక్కే అవకాశం ఉంది. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్లపైనే చైర్మన్ ఎన్నిక ఆధారపడి ఉండడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలైన ఓట్ల మెజార్టీలో వారికి మూడోస్థానం చైర్మన్ పీఠంలోనూ కీలకంగా మారిన వైనం గెలుపోటములపై ఇండిపెండెంట్ల ప్రభావంస్వతంత్రులే కీలకం ఎన్నికల్లో కాంగ్రెస్ , సీపీఎం కలిసి పోటీ చేయగా కాంగ్రెస్ 13 వార్డుల్లో సీపీఎం 3 వార్డుల్లో విజయం సాధించాయి. బీఆర్ఎస్, సీపీఐ స్నేహపూర్వక పొత్తుతో బీఆర్ఎస్ 11 వార్డుల్లో సీపీఐ 3 వార్డుల్లో గెలుపొందాయి. కాంగ్రెస్, సీపీఎం కలిపి 16సీట్లు ఉండగా బీఆర్ఎస్ సీపీఐ కలిపితే 14 ఉన్నాయి. కాగా మూడో వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అ భ్యర్థి కె.రజిత బీఆర్ఎస్ మద్దతుతో విజ యం సాధించడంతో వారి బలం 15కు చే రింది. చైర్మన్ స్థానం దక్కాలంటే 19 ఓట్లు అవసరం ఇందుకోసం పూర్తి మెజార్టీ ఏపార్టీకి రాకపోవడంతో స్వతంత్రులు కీలకమయ్యారు. 4వ వార్డుకు చెందిన గుగులోత్ జ్యోతి, 13వ వార్డుకు చెందిన కాటా భాస్క ర్, 28వ వార్డుకు చెందిన బోల్లు రాజు, 30వ వార్డుకు చెందిన గాడిపెల్లి లావణ్య కీలకమయ్యారు. దీంతో వారి మద్దతుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
కేయూలో పార్ట్టైం లెక్చరర్ల నియామకం!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్వైజ్గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్టైం లెక్చరర్ల నియమాకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 100 మంది నియామకం.. కేయూపరిధిలో 130 మంది పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే.. కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే, జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. నోటిఫికేషన్ వస్తే ఏ విభాగంలో ఎంతమంది పార్ట్టైం లెక్చరర్లను నియమిస్తారనే విరాలు తెలియనుంది. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు. 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయం -
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్హాల్నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
సాఫ్ట్వేర్ టు కౌన్సిలర్
మరిపెడ: మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి పోటీచేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గంట్ల గౌతమ్రెడ్డి విజయం సాధించారు. గౌతమ్రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. తాను పుట్టిపెరిగిన ప్రాంతానికి సేవచేయాలనే ఆలోచనతో మరిపెడ మున్సిపాలిటీ 12వ వార్డు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 252 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సేవచేసేందుకు ఇక నుంచి స్థానికంగానే ఉంటానంటున్నాడు ఈ నవ కౌన్సిలర్. -
ములుగు తొలిపీఠం కాంగ్రెస్కే..
ములుగు: ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంటుంది. 1956లో తాలుకాగా ఉన్న ములుగును 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీగా ఏర్పాటు చేసింది. అనంతరం 2011లో మేజర్ పంచాయతీగా మారిన ములుగు 2019లో నూతన జిల్లాగా ఆవిర్భవించింది. 2024లో బండారుపల్లి, జీవింతరావుపల్లి కలుపుకొని ప్రభుత్వం ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 20 వార్డులకు తొలిసారి జరిగిన ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. మంత్రి సీతక్క మున్సిపాలిటీపై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దీంతో 20 వార్డులకు గాను 12 వార్డులు కాంగ్రెస్ కై వసం చేసుకోవడంతో ఈనెల 16న కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలుపొందిన బీసీ మహిళ చైర్ పర్సన్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఆందోళన
● రీకౌంటింగ్ చేయలేదని అధికారులపై ఆరోపణ వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గుండె స్వప్నిక గెలిచినా.. కాంగ్రెస్ అభ్యర్థి తిరుపల్లి వాణి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారని రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టినా చేయలేని బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నా చేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ ఒత్తిడికి అధికారులు తమ విధులను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వరకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, నాయకుడు పూజారి రఘు మాట్లాడుతూ.. తాము కౌంటింగ్ వద్ద ఉన్న సమయంలో తమకు చూపించకుండానే బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టారని తెలిపారు. స్వప్నిక 7 ఓట్లతో గెలుపొందారని ఓ అధికారి తెలిపారని.. ఇంతలోనే కాంగ్రెస్ అభ్యర్థి వాణి 13 ఓట్లతో గెలిచినట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. రీ కౌంటింగ్ చేయాలని ఎంత చెప్పినా అధికారులు వినలేదన్నారు. ఒక సందర్భంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అనుమానాలు ఉంటే న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని ఆందోళన చేయొద్దని అధికారులు చెప్పారని పోలీసులు ఆందోళనకారులకు తెలిపారు. -
జనగామలో 26 వార్డుల్లో ఒక్కటీ గెలవని బీజేపీ
జనగామ: జనగామ పుర ఎన్నికల్లో కమలం పార్టీ అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ఒక్క వార్డు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. అంతేకాకుండా, ప్రచార సమయంలోనే నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, కొందరు నాయకుల ఒంటెద్దు ధోరణి, అంతర్గత విభేదాలతో పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. గెలుపు అవకాశాలున్న రెండు స్థానాల్లో పార్టీనేతలే అంతర్గతంగా గండి పెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈ విభేదాలు మరింతగా ఎగసిపడినట్లు సమాచారం. ఓటమికి కారణాలపై ఒకరిపై ఒకరు నిందలు వేస్తున్నారని పార్టీ వర్గాలు చె బుతున్నాయి. 26 స్థానాల్లో కలిపి పార్టీకి కేవలం 2,416 ఓట్లు మాత్రమే రావడంతో జనగామలో కమలం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో మూడు పర్యాయాలు అధికారం, రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నా.. హై దరాబాద్కు అతి సమీపంలోని జనగామ వంటి జిల్లా కేంద్రంలో బీజేపీ గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థాయికి పడిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బలమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పలువురు స్థానిక నాయకులు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండటంపై ఆ పార్టీలో ఉన్న విభేదాలను ఎత్తి చూపిస్తుంది. బీజేపీకి 2,416.. స్వతంత్రులకు 4,143 ఓట్లు గత పురపాలక ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈసారి ఒక్క సీటు కూడా సాధించకపోవడం గమనార్హం. అంతేకాకుండా సాధారణంగా పార్టీకి వచ్చే ఓట్లకన్నా కూడా చెప్పుకో లేని స్థితిలో ఓట్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల ప్రభావం కూడా ఎక్కువనే చె ప్పాలి. బీజేపీ 2,416 ఓట్లు సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 4,143 ఓట్లు సాధించి కమలం పార్టీపై ఒక మెట్టు పైన నిలి చారు. స్వతంత్రులు కష్టపడి పని చేయగా, జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ మాత్రం ఎందుకు పనితీరు చూపలేకపోయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఓటమి కమలం పార్టీలో మార్పుకు గుణపాఠమవుతుందా.. లేదా అనేది వేచిచూడాలి. ప్రచారంలోనే చేతులెత్తేసిన నేతలు ఎన్నికలకు దూరంగా ముఖ్య నాయకులు స్వతంత్రులకంటే తక్కువ ఓట్లు సాధించిన కమలం -
ఫైనల్కు చేరిన అండర్–19 క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. నగర శివారులోని మొగిలిచర్ల క్రికెట్ మైదానంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్, వరంగల్ జట్లు తలపడ్డాయి. ఇందులో 51 పరుగుల తేడాతో మెదక్ జట్టు విజయం సాధించింది. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానంలో జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్లో కరీంనగర్, ఖమ్మం జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన పోరులో ఖమ్మం జట్టుపై 57 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. నేడు (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్లో మెదక్ జట్టు, కరీంనగర్ జట్లు తలపడుతాయని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. -
సర్పంచ్ నుంచి కౌన్సిలర్గా
నాడు కాంగ్రెస్కు 6.. నేడు బీఆర్ఎస్కు 6 నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు విచిత్ర తీర్పునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్కు 6 సీట్లతో ప్రజలు సరిపెట్టారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు అదేరీతిలో 6 సీట్లు సరిపెట్టడం చర్చనీయాంశఽంగా మారింది.అప్పుడు పదకొండే.. ఇప్పుడూ పదకొండే డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటిసారి 2019లో జరిగిన ఎన్నికల్లో నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ 11 వార్డుల్లో విజయం సాధించింది. 1, 4, 7వ వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రెండోసారి జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా.. అధికార కాంగ్రెస్ పార్టీ యాదృశ్చికంగా 11 వార్డుల్లో విజయం సాధించడం గమనార్హం. 4, 8, 9, 14వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.జనగామ: 13వ వార్డులో రాజకీయాలు అందరినీ ఆశ్చర్యపరిచేలా మలుపుదిరిగాయి. 2020లో ఒక్క ఓటు తేడాతో అప్పటి కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ రాజు చేతిలో ఓడిపోయి కన్నీటి పర్యంతమైన పానుగంటి సువార్త.. ఈసారి అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఆశ్చర్యకరంగా గతంలో ప్రత్యర్థిగా నిలిచిన చంద్రకళ రాజు ఈసారి ఆమెకు ప్రతిపాదకుడిగా నిలిచి అండగా ఉన్నారు. ప్రత్యర్థులు మద్దతుదారులుగా మారిన ఈ ఘటన జనగామ పట్టణంలోనే కాదు, మొత్తం రాజకీయ వాతావరణంలో కాలం, పరిస్థితులు, మనుషులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని మరోసారి చాటి చెప్పింది. నాడు.. నేడు రీకౌంటింగ్ 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పానుగంటి సువార్త, కాంగ్రెస్ తరఫున మల్లిగారి చంద్రకళ పోటీ చేయగా, ఒక్కఓటు తేడాతో మూడు సార్లు రీకౌంటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అదే వార్డు నుంచి సువార్త, కాంగ్రెస్ నుంచి మేడ శ్రీనివాస్ పోటీ చేయగా, 10 ఓట్ల తేడాతో సువార్త గెలుపొందగా, మూడు సార్లు రీకౌంటింగ్ చేశారు.మహబూబాబాద్ రూరల్ : నాడు సర్పంచ్గా ప్రజలకు సేవలందించిన ఓ మహిళా ప్రజాప్రతినిధి ప్రస్తుతం మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు రజాలిపేట గ్రామానికి చెందిన నీరుటి హైమ 2013 నుంచి 2018 వరకు రజాలిపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా పనిచేశారు. రజాలిపేట మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఏడో వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో హైమ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమె భర్త లక్ష్మీనారాయణ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.నాడు ఓడించి..నేడు గెలిపించి -
‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి
హన్మకొండ: హరిత కాకతీయ హోటల్ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ కత్తి నాథన్ అన్నారు. శుక్రవారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మేడా రం విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ హరిత కాకతీ య హోటల్ సిబ్బంది అందించిన సేవలను మంత్రులు, జి ల్లా కలెక్టర్, అధికారులు ప్రశంసించారని తెలిపారు. అతి థులకు సౌకర్యాలు, భోజనం అందించే విషయంలో విజయవంతమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ కత్తి నాథన్ను జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసు మ సూర్య కిరణ్, హరిత కాకతీయ హోటల్ హనుకమకొండ మేనేజర్ అశోక్, ఏఈ విజయ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జంగయ్య, చైత న్య, సాంబ శివరెడ్డి, హెడ్ కుక్ శ్యామ్ పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ కత్తి నాథన్ -
23ఏళ్ల ప్రజాప్రతినిధికి ఓటమి!
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఏర్పడక ముందు సర్పంచ్గా మూడు పర్యాయాలు (18సంవత్సరాలు), ఒకసారి ఎంపీపీగా (5సంవత్సరాలు) మొత్తంగా 23 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న నల్లా మనోహర్రెడ్డికి ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. నర్సంపేట మున్సిపల్ 17వ వార్డు నుంచి పోటీ చేసిన మనోహర్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయూబ్ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ కాలంగా ప్రజా ప్రతినిధిగా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న మనోహర్రెడ్డి కౌన్సిలర్గా ఓటమి పాలవడం ఆయన అభిమానుల్లో నిరాశను నింపింది. -
కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్తో కలిసి వీసీ ప్రతాప్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈపరీక్షలను గతఏడాది నవంబర్ –డిసెంబర్లో నిర్వహించారు. ఆయా డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 55,495మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 14,823 మంది(26.71శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 44,161 మంది పరీక్షలకు హాజరుకాగా 13,774మంది(31.19 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 36,097మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15,020 మంది విద్యార్థులు (41.61శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, పద్మజ, నాగరాజు, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్లాల్, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం ఈనెల 13నుంచి 15రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. -
క్షణ క్షణం ఉత్కంఠ!
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మద్దతుదారుల కోలాహలం● పలు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన కౌంటింగ్ ● గెలుపోటములపై అంచనాలు తారుమారు ● ముగిసిన ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. శుక్రవారం ఉదయమే అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కింపు కేంద్రం ముందు భారీగా వచ్చి చేరడం.. లోపల నుంచి ఎప్పుడు ఏ సమాచారం వస్తుందో అని ఎదురు చూడడం.. మెజార్టీ వచ్చిందనే వార్తలు రాగానే కేరింతలు, నినాదాలతో హోరెత్తించారు. వంద ఓట్లకు ఒక కట్టా.. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతీ వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్కు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు సిద్ధం చేసుకున్నా టేబుల్స్పై ఉదయం 8 గంటలకే లెక్కింపు మొదలు పెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచి అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటించారు. తర్వాత వార్డులోని ఓటర్లను గుర్తుల వారీగా వంద ఓట్లు ఒక కట్టగా కట్టి వేరు చేశారు. తర్వాత కట్టలను లెక్కించి.. మోజార్టీతో పాటు విజేతలను ప్రకటించారు. స్వల్ప మెజారిటీతో కొందరు.. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కొందరు అధిక మెజార్టీతో గెలుపొందగా.. మరికొందరు మాత్రం నరాలు తెగే ఉత్కంఠ మధ్య గెలుపొందారు. ప్రధానంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 26వవార్డు నాలుగు ఓట్ల మెజార్టీ, 28వ వార్డు ఆరు ఓట్ల మెజార్టీ, 11వ వార్డు పది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరిపెడ మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఆరు ఓట్ల మెజార్టీతో అభ్యర్థి గెలిచారు. -
టఫ్ ఫైట్!
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలను కై వసం చేసుకోగా.. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం దక్కింది. అయితే మహబూబాబాద్, కేసముద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సరైన మెజార్జీ రాకపోవడంతో చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పాగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, మాజీ మంత్రి రెడ్యానాయక్ పోటాపోటీగా ప్రచారం చేశారు. కాగా, మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ ఎనిమిది వార్డులు, బీఆర్ఎస్ ఆరు వార్డులు, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అదేవిధంగా డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 11వార్డులు, బీఆర్ఎస్ 4వార్డులు గెలుపొందాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చైర్మన్ పీఠం దక్కుతుంది. ముందు నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీపీసీ నాయకురాలు ఝాన్సీ రెడ్డితోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేశారు. గతంలో ఉన్న వర్గాలను సమన్వయం చేసి ఒక్కతాటిపై తీసుకువచ్చా రు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాటి నుంచి మళ్లీ ఆధిక్యతను చూపాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచారానికి కేటీఆర్ను పిలిచి జోష్ నింపారు. 16 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తొమ్మిది మంది గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు మాత్రమే గెలిచి వెనుకబడ్డారు. దీంతో తొర్రూరు ము న్సిపల్ పీఠం బీఆర్ఎస్కు దక్కనుంది. జిల్లాలోని డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు హస్తగతం బీఆర్ఎస్ ఖాతాలోకి తొర్రూరు మున్సిపాలిటీ కేసముద్రం, మానుకోటలో చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ క్యాంపు రాజకీయాలు, ఎక్స్అఫీషియా ఓట్లపై లెక్కలు -
అత్యధిక మెజార్టీతో గెలుపు
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలోని 35వ వార్డులో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గద్దె నీరజారాణి గెలుపొందినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమల నిర్మలపై 1153 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు తెలిపారు. క్యాంపునకు తరలిన బీఆర్ఎస్ అభ్యర్థులుతొర్రూరు: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలు పొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేయకుండా మాజీ మంత్రి దయాకర్రావు నాయకత్వంలో వారిని క్యాంపునకు తరలించారు. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందిన తరుణంలో వారిని రక్షించుకునేందుకు పార్టీ చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ చేపట్టి, టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. బస్సులో కౌంటింగ్ కేంద్రానికి వచ్చి ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు అదే బస్సులో హైదరాబాద్కు తరలివెళ్లారు. మాజీ మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనడానికి బీఆర్ఎస్కు వచ్చిన అనుకూల ఫలితాలే నిదర్శనమన్నారు. తొర్రూరు పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను గమనించి ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థులు..డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన 11 మంది అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. శుక్రవారం కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్యాంపునకు తరలివెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇలా..మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 1వ వార్డులో కాంగ్రెస్కు ఒక ఓటు వచ్చింది. 11వ వార్డులో బీఆర్ఎస్కు ఒక ఓటు, కాంగ్రెస్కు ఒక ఓటు, 12వ వార్డులో కాంగ్రెస్కు మూడు, 21వ వార్డులో బీఆర్ఎస్కు రెండు, కాంగ్రెస్ ఒక ఓటు పడింది. 24వ వార్డులో కాంగ్రెస్కు రెండు, 9వ వార్డులో బీఆర్ఎస్కు ఒకటి, 17వ వార్డులో కాంగ్రెస్కు ఒకటి, 31వ వార్డులో జనసేనకు ఒకటి, కాంగ్రెస్కు ఒకటి, 31వ వార్డులో బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కు రెండు, 10వ వార్డులో బీఆర్ఎస్కు రెండు ఓట్లు పోలయ్యాయి. అలాగే 13వ వార్డులో కాంగ్రెస్కు రెండు, స్వతంత్ర అభ్యర్థులకు మూడు, 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్కు తలా ఒకటి, 18వ వార్డులో కాంగ్రెస్కు రెండు, సీసీఐకి ఒకటి, 27వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్కు తలా ఒకటి, 28వ వార్డులో బీఆర్ఎస్కు రెండు, 30వ వార్డులో సీపీఎంకు ఒకటి, 25వ వార్డులో కాంగ్రెస్కు ఒక ఓటు పోలైంది. 29వ వార్డులో సీసీఎంకు ఒకటి, 33వ వార్డులో బీఆర్ఎస్కు ఒకటి, 35వ వార్డులో బీఆర్ఎస్కు ఒకటి, 36వ వార్డులో సీసీఐకి ఒకటి, కాంగ్రెస్కు ఒకటి, బీఆర్ఎస్కు రెండు పోస్టల్ ఓట్లు పడ్డాయి. చైర్పర్సన్ రేస్లో.. మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల్లో విసారపు ప్రగతి రెండోసారి వార్డు సభ్యురాలిగా గెలు పొందారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 9వ వార్డు నుంచి విజయం సాధించి ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందారు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొంది.. చైర్పర్సన్ రేసులో ఉన్నారు. -
కౌంటింగ్ హాల్లో నిబంధనలు
ఓట్ల లెక్కింపు సమయంలో కచ్చితంగా కౌంటింగ్ సూపర్వైజర్ ఆదేశాలు పాటించాలి. స్వస్తిక్ మార్కులు స్పష్టంగా ఉండే బ్యాలెట్లను మాత్రమే చెల్లుబాటుగా పరిగణనలోకి తీసుకుంటారు. అనుమానం ఉన్న సమయంలో ఆర్వో తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకే వ్యక్తికి ఓటు స్పష్టంగా ఉంటే మాత్రమే లెక్కింపులో చేర్చాలి. ఏజెంట్ల అభ్యంతరాలపై ప్రత్యేక పద్ధతిలో ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణకు కారణాలను స్పష్టంగా చూపించాలి. సంతకం లేకపోవడం, ఓటర్ గుర్తింపు రుజువులు అసంపూర్ణం, అటెస్టేషన్ విధిగా చేయకపోవడం, కవర్లలో లోపాలు ఉండటం, చెల్లని ఫామ్ వివరాలు ఇలా సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు తిరస్కరిస్తారు. అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఆర్వో అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఏజెంట్లు, అబ్జర్వర్ల సమక్షంలో తుది సర్టిఫికెట్ జారీ చేస్తారు. -
నేటినుంచి మల్లన్న ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు
● పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా ఐదు రోజులపాటు ఉత్సవాలు ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో నేటి(శుక్రవారం)నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో పాంచాహ్నిక దీక్షతో త్రికుండాత్మకంగా శ్రీ భ్రమరాంభికా మల్లికార్జునస్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు శైవ ఆగమోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.వాహన సేవల్లో పాల్గొనే వారు దేవస్థాన కార్యాలయంలో రూ.516 చెల్లించి రశీదు పొందాలని, శివరాత్రి ఉత్సవాల 5రోజులపాటు దాతల సహకారంతో మహా అన్నదానం జరుగుతుందని ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఈఓ కందుల సుధాకర్ గురువారం తెలిపారు. -
జల్సాల కోసం చోరీలు..
వరంగల్ క్రైం: జల్సాల కోసం బైక్ చోరీలకు పాల్ప డుతున్న ఏడుగురు సభ్యుల గల ముఠాను సంగెం, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్ల ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఏడుగురిలో నలుగురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హనుమకొండకు చెందిన దరాంగుల అంజి, వరంగల్ ఉర్సుకు చెందిన సంతోష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన జైదా రామకృష్ణతోపాటు నలుగురు మైనర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. హనుమకొండలోని ఒకే ప్రాంతంలో నివాసం ఉండడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో నిత్యం మ ద్యం సేవిస్తూ జల్సాలు చేసే వారు. అయితే జల్సాలకు డబ్బులు లేకపోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. దీనికి పార్క్ చేసిన వాహనాలను ఎంచుకున్నారు. అనుకున్నదే తడువుగా వరంగల్తోపాటు హైదరాబాద్లో తాళం వేసి ఉన్న 15 బైక్లను అపహరించి హనుమకొండ పద్మాక్ష్మి గుట్ట ప్రాంతంలో భద్రపరిచారు. ఈనెల 1న సంగెం పీఎస్ పరిధిలోని ఆశాలపల్లిలో మరో బైక్ చోరీ చేయగా వాహన యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సంగెం మండలం గవిచర్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీ చేసిన రెండు వాహనాలపై నిందితులు వస్తున్నారు. వీరిపై అనుమానం కలగడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి సుమారు రూ. 15లక్షల విలువైన 15 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, మామునూరు ఏసీపీ వెంకట్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సంగెం ఎస్సై వంశీ కృష్ణ, ఏఏఓ సల్మాన్ పాషా, సంగెం హెచ్సీ సంతోష్, బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, యాకూబ్ పాషా, నవీన్, కార్తీక్ను డీసీపీ అభినందించారు. ఏడుగురి అరెస్ట్..15 బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్ కుమార్ -
శ్రీకాంత్రెడ్డి, విజయకాంత్ రెడ్డిలకు పితృ వియోగం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డిల తండ్రి రాఘవేందర్ రెడ్డి (79) అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాఘవేందర్ రెడ్డి మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ భూ క్య మురళీనాయక్, యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు రాఘవేందర్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఉలుపాల ప్ర భాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, అజ్మీరా సీతా రాంనాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డాక్టర్ సీతామహాలక్ష్మి, ఘనపురపు అంజయ్య, చౌడవరపు మోహన్ రావు, గోపాల్ ఝ వార్, కేఎస్ఎన్.రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, అంబటి వీరభద్రం, టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కొండపల్లి రామచంద్రరావు తదితరులు రాఘవేందర్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో రాఘవేందర్ రెడ్డి కన్నుమూత తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం -
కేయూ ‘లా’ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీపరిధిలో ఈనెల 17నుంచి జరగాల్సిన ఎల్ఎల్బీ మూడేళ్ల మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల ఎల్ఎల్బీ మొదటి, మూడవ, ఐదవ, ఏడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. గంజాయి రవాణదారులకు ఇరవై ఏళ్ల జైలు వరంగల్ లీగల్ : గంజాయి రవాణ చేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. అక్టోబర్ 2023, 16న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎల్కతుర్తి మండల పెంచికలపేట వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వాహనానం నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా సరుకు లభించడంతో స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన కె.రాజవర్మ, మధ్యప్రదేశ్కు చెందిన నాందేవ్ సాహెబ్ రావు పటేల్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తులకు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. 10.5 కేజీల గంజాయి స్వాధీనం.. డోర్నకల్ : రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు 10.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. ఎస్సై ఎస్కె ఖాదర్పాషా ఆధ్వర్యంలో గురువారం రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి, మహిళ.. స్టేషన్ నుంచి బ్యాగుతో వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించారు. పట్టుకుని తనిఖీ చేయగా బ్యాగులో 10.5 కేజీల గంజాయి లభించింది. దీంతో రూ.5,25,500 విలువైన సరుకు స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు చెందిన రాజ్కన్య విలాస్ మొహతే, వసంత శామ్రావుజీ గోడేను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
కుక్క అడ్డు రావడంతో బైక్ సడెన్ బ్రేక్..
పాలకుర్తి టౌన్: కుక్క అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేయగా బైక్ అ దుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గురువారం పాలకుర్తి మండలం తొర్రూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన వెంపాల పూలమ్మ (50), బాల్రెడ్డి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డూరు మండల కేంద్రంలో పూల మ్మ చెల్ల్లి ఇంటిలో జరిగిన శుభకార్యానికి బైక్పై వె ళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి పాలకుర్తి మీదుగా బయలుదేరారు. మండలంలోని తొర్రూరు చేరుకోగా కుక్క.. బైక్కు అడ్డు వచ్చింది. దీంతో సడెన్గా బ్రేక్ వేయడంతో పూలమ్మ కిందపడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లెదుటే భార్య మృతి చెందడంతో బాల్రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కాగా, కుక్కల నియంత్రణ చేపట్టకపోవడంతో ద్విచక్రవాహనాలకు అడ్డొచ్చి పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. కిందపడిన మహిళ.. అక్కడికక్కడే మృతి తొర్రూరులో ఘటన -
వలస కూలీలకు విముక్తి ..
మామునూరు : పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులకు న్యాయమూర్తి అండగా నిలిచారు. కనీస అవసరాలు కల్పించకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న వారికి విముక్తి కల్పించారు. సొంత రాష్ట్రం ఒడిశాకు పంపించారు. గురువారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (న్యాయమూర్తి) ఎం.సాయికుమార్ ఆధ్వర్యంలో మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, లేబర్ అధికారుల నేతృత్వంలో బొల్లికుంటలోని ఈ.ఎస్.కె మార్క్ ఇండస్ట్రీస్ ఇటుక బట్టీలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది కార్మికులు దయనీయ స్థితిలో పని చేయడాన్ని గమనించారు. వారి పని వేళలు, అందుతున్న సౌకర్యాలు, వేతనాల గురించి ఆరా తీసి శ్రమ దోపిడీకి గురవుతున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిచి కార్మికుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా ఆదేశించడమేకాకుండా వారు తమ రాష్ట్రానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తమను ఆదుకుని స్వస్థలాలకు పంపిస్తున్న న్యాయస్థానం, అధికారులకు కార్మికులతోపాటు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేశ్, బట్టి నిర్వాహకుడు శివకృష్ణ, పారా లీగల్ వలంటీర్ హనుకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఇటుక బట్టీలో న్యాయమూర్తి తనిఖీ కార్మికుల దయనీయ స్థితిని చూసి అధికారులపై ఆగ్రహం న్యాయమూర్తి ఆదేశాల మేరకు స్వరాష్ట్రానికి పంపిన అధికారులు -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
విద్యారణ్యపురి: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘సెక్యూరిటింగ్ ది డిజి టల్ ఫ్యూచర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. డిజిటల్ యుగంలో ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సైబర్ ముప్పు, సమాచార భద్రత, నైతిక బాధ్యతల గురించి వివరించారు. కేయూ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిపారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డి.సురేశ్బాబు, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అకడమిక్ కో–ఆర్డినేటర్ ఎం.అరుణ, తదితరులు పాల్గొన్నారు. కాగా, జాతీయ సదస్సు సావనీర్ను రిజిస్ట్రార్ రామచంద్రం ఇతర అతిథులు ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. -
ఓట్ల రక్షణ..
సీల్ చేసిన ఓట్ల ప్యాకెట్ల వివరాలతో ఆర్వో ప్రొసీడింగ్స్ సిద్ధం చేసి అన్ని ప్యాకెట్లను పెద్ద స్టీల్ ట్రంక్లో వేసి ముద్రిస్తారు. ట్రంక్ను స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఒక తాళం చెవి ట్రెజరీ అధికారికి, మరోటి జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉంచుతారు.చెల్లుబాటైన బ్యాలెట్లు మాత్రమే లెక్కింపు ఫామ్ 15,16 ప్రకారం బ్యాలెట్లను ధ్రువీకరించి సంబంధిత రికార్డులు నమోదు చేయాలి. లోపాలున్న ఫామ్ల్లో లేట్ రిసిఫ్ట్, రిజక్టెడ్ను గుర్తించాల్సి ఉంటుంది. లెక్కింపు హాల్లో మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. స్కూల్ బ్యాగులు, పెద్ద వస్తువులు నిషేధం. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు, పార్టీల ఏజెంట్లకు మాత్రమే అనుమతి.నిబంధనల ప్రకారం లెక్కింపు..ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి వాటిని సంబంధిత టేబుళ్లకు పంపుతారు. అన్ని పోస్టల్ బ్యాలెట్లను ఫామ్–17 (అనుబంధం 38) ప్రకారం పరిశీలించాలి. లెక్కింపు సమయంలో పీఓ సంతకం, స్టాంప్, పోలింగ్ స్టేషన్ నంబర్తో కూడిన స్టాంప్ మూడింటిని చెక్ చేసుకున్న అనంతరం ఓకే అనుకున్న తర్వాతే బాక్స్ను ఓపెన్ చేస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్, ఎన్నికల ఏజెంట్ ముగ్గురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ఆర్వో పరిశీలన అనంతరం తుది నిర్ధారణఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో బ్యాలెట్ బాక్స్ తెరిచి ప్రతీ 25 ఓట్లను కట్టగా ఏర్పాటు చేయాలి. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములో వేయాలి. మొత్తం బ్యాలెట్ అకౌంట్ను మ్యాచ్ చేస్తూ లెక్కింపు కొనసాగించాలి. ప్రతీ డ్రమ్ములో 40 కట్టలు (వెయ్యి ఓట్లు) ర్యాండమ్గా చెక్ చేయాలి. నోటా సహా ఏ పార్టీ పక్షపాతం లేకుండా పరిశీలించాలి. వెయ్యి ఓట్లకు వంద కట్లను తీసుకుని ఆర్వోకు పంపాలి. ఆర్వో పరిశీలన అనంతరం తుది నిర్ధారణ ఉంటుంది. బ్యాలెట్ పత్రాల తిరస్కరణకు కారణాలను ఆర్వోలు నిర్ణయిస్తారు. లెక్కింపు అనంతరం అందరి సమక్షంలో సంబంధిత అధికారులు బయటకొచ్చి విజేతల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారు. పారదర్శకతకు ప్రాధాన్యం.. ఎన్నికల లెక్కింపులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)తుది ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ వారీగా ఓట్ల సంఖ్య, రౌండ్ వారీగా అభ్యర్థుల ఓట్లు, నోటా, తిరస్కరణలు, పోస్టల్, టెండర్డ్ బ్యాలెట్లు వివరాలు సరిచూసి బ్లాక్ బోర్డుపై నమోదు చేయాలి. లెక్కింపులో తప్పిదాలు శిక్షార్హమని అధికారులు హెచ్చరిస్తున్నారు.సమాన ఓట్లు...లాటరీ విధానంఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అభ్యర్థులు సమానంగా అత్యధిక ఓట్లు సాధిస్తే రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఒకే పరిమాణం, రంగు గల ఐదు పోల్ చీట్టీలు ప్రతీ అభ్యర్థి పేరుతో తయారు చేసి బాగా కలిపి చీట్టీ తీస్తారు. ఎవరి పేరు వస్తే అతడికి ఒక అదనపు ఓటు వచ్చినట్లు భావించి గెలుపుగా ప్రకటిస్తారు.రీకౌంట్ విధానంరీకౌంట్ కోరితే కౌంటింగ్ ప్రక్రియ 1 నుంచి 2 నిమిషాలు నిలిపివేయబడుతుంది. అభ్యర్థి 15 నిమిషాల్లో లిఖితపూర్వకంగా ఆర్వోకు రాసివ్వాలి. సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆర్వో రీకౌంట్కు అనుమతిస్తారు. పూర్తిగా లేదా పాక్షికంగా రీకౌంట్ జరగొచ్చు. తుది నిర్ణయం ఆర్వోదే ఉంటుంది. -
గిరిజన ఆవాసాలకు సర్వీస్లు త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలో ప్రధాన మంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం కింద గిరిజన ఆవాసాల విద్యుద్దీకరణకు సంబంధించి అన్ని సర్వీస్ల మంజూరు పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండలోని విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 17 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు వెంటనే మీటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారలకు గృహజ్యోతి పథకం ప్రయోజనం చేకూరే చర్యలు తీసుకోవాలన్నారు. మిగతా పనులు వేగవంతంగా పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు. సీఈలు సురేందర్, శ్రవణ్ కుమార్, జీఎంలు శ్రీనివాస్, నాగప్రసాద్, శ్రీకాంత్, డీఈలు ప్రభావతి, అనిల్ కుమార్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
చిన్నారుల సమాచారం ఇవ్వండి
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు డి మాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా.. తెలంగాణ పవ ర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా టీఎస్ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం–1104 కార్యదర్శి రమణ, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, విద్యుత్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ అజ్మీరాశ్రీరాం నాయక్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ నీలారపు రాజేందర్ మా ట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించడం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుందన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. కేంద్రం ఈ అంశంపై వెనక్కి తగ్గకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నా రు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, సదర్లాల్, ఆయా సంఘాల నాయకులు సామ్యానాయక్, సుబ్రహ్మణ్యేశ్వర్రావు, మల్లి కార్జున్, సదానందం, ఓదెలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, పాల్గొన్నారు. -
క్యాంపు రాజకీయాలు
– IIలోuసాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. తెల్లవారితే ఫలితాలు వస్తాయి. ఈ తంతు ముగిసిన వెంటనే అసలు కథ మొదలవుతుంది. అదే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక. అభ్యర్థులు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు క్యాంపులకు తరలించే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు అభ్యర్థులను పిలిపించుకొని సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రతీచోట పోటాపోటీ.. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపె డ, డోర్నకల్, కేసముద్రం ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంటుందనే మాట రావడం లేదు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సరిసమానంగా వార్డులు గెలిచే అవకాశం ఉంది. ఇరు పార్టీల రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతోపాటు, వామపక్ష పార్టీల అభ్యర్థులు కూడా పలుచోట్ల గెలిచే అవకాశం ఉంది. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎంపికలో నువ్వా.. నేనా అన్నట్లు ఉంటుంది. అదే విధంగా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రంలో స్వతంత్ర అభ్యర్థుల ఓటు మీదనే చైర్మన్ ఎంపిక ఆధారపడి ఉండే అవకాశం ఉంది. దీంతో ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వచ్చేవరకు సమీపంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపు, ఓటమి చెందిన అభ్యర్థుల సంతకాలు తీసుకొని గెలిచిన వారికి పత్రం అందజేస్తారు. అయితే గురువారం రాత్రి ఐదు మున్సిపాలిటీల కాంగ్రెస్ అభ్యర్థులను బస్సులో జిల్లాకు సమీపంలో ఉన్న డెన్కు తీసుకెళ్లి అక్కడ రాత్రి బస చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే కౌంటింగ్ సెంటర్లకు తీసుకువచ్చి అధికారి సమక్షంలో సంతకం చేసి గెలుపొందిన పత్రం తీసుకుంటారు. ఆ తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లి చైర్మన్, చైస్ చైర్మన్ నియామకంపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సమయానికి వచ్చి ఓటింగ్లో పాల్గొని మున్సిపాలిటీల చైర్మన్, వైస్చైర్మన్ను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే పదిరోజులకు సరిపడా దుస్తులు, దుప్పట్లు, బీపీ, షుగర్, మొదలైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మందులు తీసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముందుగా అందరితో మాట్లాడి విప్ జారీ చేసి సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు క్యాంపుల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. క్యాంపు ఎక్కడ పెట్టాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలా.. గోవా, విశాఖపట్నం, మైసూర్, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలా అనే విషయంపై మెజార్టీ అభ్యర్థుల నిర్ణయం తీసుకుంటున్నారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాల్లో ఐదు మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, స్వతంత్రుల్లో గెలుపొందిన వారు ఏ ఒక్కరు కూడా మున్సిపాలిటీల్లో ఉండే అవకాశం కనిపించడం లేదు. అభ్యర్థులను తరలించేందుకు ఏర్పాట్లు దుస్తులు సర్దుకొని ఉండాలని సూచన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల బిజీ చైర్మన్ ఎంపిక కోసం ఇప్పటి నుంచే ప్యూహం -
‘మేడారం’ ఆదాయం రూ.13,51,76,275
హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2న తేదీన హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. గత(2024) ఆదాయం రూ,12,71,79,280 2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రాముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రేట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్ గురువారం తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, టపాకాయలు కాల్చ డం, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధించినట్లు తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిషే ధిత వస్తువులు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంకు బాటిళ్లు, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు హానికరమైన ఎలాంటి వస్తువులు కేంద్రంలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు. తనిఖీలు నిర్వహించే సిబ్బందికి పూర్తిగా సహకరించాలన్నారు. -
మోదీ విధానాలతో తీవ్ర నష్టం
● కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహణనెహ్రూసెంటర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల హక్కులు, చట్టాలకు తీవ్రనష్టం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకుడు రేషపల్లి నవీన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు హలావత్ లింగన్న, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో కార్మిక నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్ల అమలుతో 40 లక్షల మంది అసంఘటిత కార్మికులు, కార్మిక కుటుంబాలు చితికిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, లేబర్కోడ్లను రద్దు చేసి 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుజ్జు దేవేందర్, బండపల్లి వెంకటేశ్వర్లు, నాగన్న, పర్వత కోటేష్, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, మేక వీరన్న, బూర్గుల మోష, మధు, కవిత, సులోచన, సరిత, కోటేశ్వర్రావు, జబ్బార్, మధు, శ్రీనివాస్, లింగయ్య, చెక్కల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె
● 14న అంకురార్పణతో వీరభద్రస్వామి జాతర ప్రారంభం ● 15న స్వామివారి కల్యాణ మహోత్సవంకురవి: కోరిన కోర్కెలు తీర్చే కురవి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 14న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఆలయంలో మహాశివ రాత్రి సందర్భంగా స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 14న షురూ.. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న(శనివారం) ఉదయం 9గంటలకు అర్చకుల ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు గణపతి పూజ, పుణ్యహవచనములు, అఖండ దీపారాధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, రాత్రి 10 గంటలకు బసవముద్ద పడుతుంది. ఈనెల 15న(ఆదివారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణ మహోత్సవం కనులపండువగా జరుగుతంది. ఉదయం 4నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వామి వారికి పూర్ణాభిషేకాలు ఉంటాయి. స్థానిక శివాలయంలో ఉదయం 5నుంచి రాత్రి 12 గంటల వరకు పార్వతిరామలింగేశ్వరస్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం 7గంటలకు గ్రామ సేవ, ఎదుర్కోలు, రాత్రి 1.50గంటలకు(తెల్లవారితే సోమవారం) భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కల్యాణ వేడుక జరుగుతుంది. ఈనెల 16నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 18న కురవి పెద్ద చెరువులో తెప్పోత్సవం, 20న రథోత్సవం, 21న బండ్లు తిరుగుట, పారువేట, 22న దోపోత్సవం, వసంతోత్సవం, పెద్ద చెరువులో త్రిశూలస్నానం, సాయంత్రం 7గంటలకు ఏకాంతసేవ, సదస్యం నాగవెల్లి ఉంటాయి. 23న స్వామివారి పవళింపుసేవ, 27న పార్వతిరామలింగేశ్వరస్వామి కల్యాణం, చివరగా మార్చి 1న పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయ చరిత్ర.. క్రీ.శ 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూటరాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువును) తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతిస్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఆలయంలో రాతి దీప స్తంభం దర్శనమిస్తుంది. తూర్పు రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ప్రాశస్త్యం.. సకల శక్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రుడు పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌత్రపరాక్రమాలతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే భోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకోసం ఆలయానికి భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న భక్తులకు ఆయురారోగ్యాలను, సకల సంపదలను ఇస్తాడని నమ్మకం. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి భద్రకాళీ అమ్మవారితో కలిసి వెలసి ఉన్నాడు. స్వామివారికి ఇరువైపులా శివుడు (లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళీ అమ్మవారు స్వయంభుగా వెలసి భక్తుల పూజలందుకుంటోంది. -
అభ్యర్థుల్లో టెన్షన్
మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఈమేరకు సిబ్బందికి విధులు కేటాయించారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్రాల ఎదుట భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా,అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పాఠశాలలో కౌంటింగ్.. మానుకోట మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఈదులపూసపల్లి రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. 36 వార్డులు ఉండగా 36 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. ప్రతీ టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది.. ఇలా మొత్తం ఎనిమిది మంది విధులు నిర్వర్తిస్తారు. కౌంటింగ్ కోసం 12మంది ఆర్వోలు, 12మంది ఏఆర్వోలు విధులు నిర్వర్తిస్తారు. విజేతలకు నియామక పత్రం కూడా వారి చేతుల మీదుగా ఇవ్వనున్నారు. మొత్తం 360మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు పాస్లు జారీ చేశారు. కౌంటింగ్కు నోడల్ అధికారిగా ఆర్డీఓ కృష్ణవేణి వ్యవహరించనున్నారు. కమిషనర్ రాజేశ్వర్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, ఎంపీడీఓ రఘుపతి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తొర్రూరులో సర్వం సిద్ధం తొర్రూరు: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్యభట్ట హైస్కూల్లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 16 వార్డులకు గాను 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్కు ఒక ఆర్ఓ, ఒక సూపర్వైజర్, ఇద్దరు సిబ్బందితో పాటు మరొకరిని అదనంగా ఏర్పాటు చేశారు. అధికారులు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో తెరవనున్నారు. 16 వార్డులకు గాను 63 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారి భవితవ్యం నేడు తేలనుంది. ఆర్యభట్ట పాఠశాలలోని లెక్కింపు కేంద్రాన్ని ఆర్డీఓ గణేశ్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీఐ గణేష్, ఎస్సైలు ఉపేందర్, రాజు పాల్గొన్నారు. మరిపెడలో ఏర్పాట్లు.. మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆగస్టీన్ పాఠశాలలో గురువారం ఓట్ల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 25 పోలింగ్ కేంద్రాల నుంచి సేకరించిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను శుక్రవారం లెక్కించనున్నారు. నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం సెంటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు.. డోర్నకల్: మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం గురువారం స్థానిక నిర్మలా హైస్కూల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో 15 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఐదుగురు ఆర్వోలు, ఒక అబ్జర్వర్, 45మంది సిబ్బంది, టీ పోల్ కోసం ఒకరు, వెబ్ కాస్టింగ్ కోసం ఒకరు, ఎనిమిది మంది రిజర్వ్ సిబ్బంది శుక్రవారం ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించనున్నారు. స్ట్రాంగ్రూం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా.. కేసముద్రం: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గురువారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 16 వార్డులకు గాను 16 కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక్కో కౌంటరుకు ఆర్వో, ఏఆర్ఓ, ముగ్గురు లెక్కింపు అధికారులను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మార్కెట్లో ఓట్ల లెక్కింపు కారణంగా ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. జ్యోతిరావు పూలే సెంటర్ నుంచి కట్టు కాలువ తండా మీదుగా అంబేడ్కర్ సెంటర్ నుంచి వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైల్వే పోలీసుల అప్రమత్తం
డోర్నకల్: దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో గురువారం డోర్నకల్లో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్పీఎఫ్ ఏఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్తో పాటు స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లోని పలు ప్లాట్ఫారాలపై ప్రయాణికుల రాకపోకలను నిశితంగా పరిశీలించారు. కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం : ఎమ్మెల్యే మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు డబ్బుకు, పేదరికానికి మధ్య జరిగిన యుద్ధమని అభివర్ణించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేతలు దోచుకుని, దాచుకున్న డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధిస్తారని, కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలే గెలిపి స్తాయన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నేతలు పాలనను గాలికివదిలేసి తమ స్వీయ ప్రయోజనాలకే అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వెల్లడించనున్నారని, స్థానికంగా తమకు అందుబాటులో ఉండేవారినే ప్రజ లు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసముద్రం మున్సిపాలిటీలో రూ.86 కోట్లలతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, మురు గు కాల్వల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులకుగాను 26 వార్డుల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కేసముద్రంలో 16 వార్డులకుగాను 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కాంగ్రెస్, సీపీఎం నేతలు సూర్నపు సోమయ్య, దేవరం ప్రకాశ్రెడ్డి, అజ్మీరా సురేష్, గునిగంటి రాజన్న తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎంతొర్రూరు: తొర్రూరు బస్ డిపో పరిధిలో నేడు (శుక్రవారం) ఉదయం 11నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి గురువారం తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళపాళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తిగలవారు 99592 26053 నంబర్లో నిర్ణీత సమయంలో ఫోన్ చేయవచ్చని తెలిపారు. పూర్తి కావస్తున్న జాతర ఏర్పాట్లుకురవి: మండల కేంద్రంలో మహాశివరాత్రి నుంచి జరగబోయే భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర పనులు పూర్తి కావస్తున్నాయి. గురువారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ జాతర పనులను పరిశీలించారు. నాగేంద్రస్వామి ఆలయంలో జరిగిన బారికేడ్ల పనులు, కల్యాణవేదిక, కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు ఆవరణలో కూర్చునేందుకు చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల ను ఆదేశించారు. మానుకోట డీఎస్పీ తిరుపతిరావు, మానుకోట రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై సతీష్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. శివరాత్రి రోజున భక్తుల దర్శనాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఆలయ సిబ్బంది బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే స్వామి, అమ్మవార్ల ఆభరణాలను శుభ్రం చేశారు. ఆలయం, సత్రాలకు విద్యుత్ దీపాల ఏర్పాట్లు, ఆలయ తూర్పు ద్వారం నుంచి కల్యాణ మండపం వరకు మెయిన్రోడ్డుపై కలకత్తా పెండల్స్ ఏర్పాటు చేశారు. -
ఓటింగ్ సరళి పరిశీలన..
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16 వార్డుల్లో 86.14 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. 3వ వార్డులో అత్యధికంగా 94.90, అలాగే 13వ వార్డులో అత్యల్పంగా 81.39 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు తమ కుటుంబ సభ్యులతో కేసముద్రం స్టేషన్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి కుమారులు క్రిష్టభార్గవ్, క్రిష్ణకీర్తన్ 15వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధనసరిలో పోలింగ్ సరళిని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా పరిశీలించారు. -
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్
● గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది. 80.66 -
ఓటర్ల గోప్యత!
●అంతుచిక్కని ఓటరు నాడి ● ఓటు ఎవరికి వేశారో చెప్పని వైనం ● తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు ● ఫలితాల రోజే ఉత్కంఠకు తెర సాక్షి, మహబూబాబాద్: గతంలో ఎన్నో ఎలక్షన్లు చూశాం.. ఎంతో మందిని గెలిపించాం.. ఎంతో మందిని ఓడించాం.. నామినేషన్ వేసినప్పుడే పలువురు అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది.. ప్రచారంలో మరికొందరి భవితవ్యం తెలిసేది.. కానీ ఈ ఎన్నికలు ఎవరికి అర్థంకాని రీతిలో జరిగినట్లు జిల్లాలోని ఓటర్లు చెప్పుకుంటున్నారు. దీంతో పోలింగ్ అయిన తర్వాత కూడా బ్యాలెట్ బ్యాక్సుల్లో ఏం ఉందో ఓటరు నిర్ణయం ఎలా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం ఫలితాలు తేలే వరకు అభ్యర్థుల్లో ఉత్కంఠ ఉండనుంది. ఎవరూ వచ్చినా అదే సమాధానం.. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒకటి, రెండు మినహా అన్ని వార్డుల్లో పోటీ అంచనా వేయడం కష్టంగా మారింది. ఓటరు నాడి పట్టే నాథుడే కనిపించడం లేదు. అభ్యర్థులు ఓటు అడిగేందుకు వచ్చిన సందర్భాల్లో ఓటరు చెప్పే సమాధానం ఒకే విధంగా ఉండడం గమనార్హం. అధికార కాంగ్రెస్ అభ్యర్థులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజీపీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టుకుని మంచినీళ్లు ఇచ్చి వారు చెప్పిందంతా విని మీకే ఓటు వేస్తామనే నమ్మకం కలిగించడం గమనార్హం. అయితే ఒక్కరిద్దరికి కాకుండా.. అందరికీ నమ్మకం కలిగించే విధంగా ఓటరు ఉండడంతో చివరకు ఓటు ఎటు వేసింది మాత్రం అంతుపట్టకుండా ఉంది. ఒక వైపు ఓటింగ్.. మరో వైపు డబ్బుల పంపిణీ ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో పోలింగ్కు ము ందు రాత్రి ఓటర్లకు డబ్బులు, మందు, చీరలు, ఇ తర బహుమతులు, తాయిలాలు ఇచ్చేవారు. తెల ్ల వారే సరికి అంతా గప్ చిప్గా ఉండేది. కానీ ఈ సారి ఒక వైపు ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు డబ్బుల పంపిణీ ముమ్మరంగా సాగింది. చివరి రోజు పంపిణీ చేసిన డబ్బులకే ప్రాధాన్యత ఉంటుందని నమ్మిన అభ్యర్థులు ప్లాన్ ప్రకారం ఓటర్లకు అందేలా చర్యలు తీసుకున్నారు. కుటుంబం మొత్తం గంప గుత్తగా ఓట్లు వేయాలని కోరుతూ.. పలు వార్డుల్లో ప్రతీ కుటుంబానికి రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు ఇవ్వడం అందరిని విస్మయానికి గురిచేసింది. ఇలా ఒకరిని చూసి మరొకరు తిరిగి డబ్బులు పంపిణీ చేస్తుండగా.. దీనిని గమనించిన ఓటర్లు ఆలస్యంగా ఓటు వేశారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
మహబూబాబాద్/ మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పలోఇంగ్ కేంద్రంలో కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 19వ వార్డు పరిధిలోని పోలింగ్ కేంద్రంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల సందర్శనమహబూబాబాద్ రూరల్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఎస్పీ శబరీష్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలోని పలు కీలక (క్రిటికల్) పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణను నేరుగా పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎన్నికల విధులు పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నెల 13న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి భద్రత కల్పించి, శాంతియుత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలికురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ సూచించారు. బుధవారం ఆయన జాతర పనులను పరిశీలించారు. ఉత్తరద్వారం ఎదుట కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని, జాతరలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఇటీవల నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి చదును చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, ఈఓ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అమ్మవారికి పూజలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. -
పలుచోట్ల స్వల్ప ఘర్షణలు
● దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్/ మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జమాండ్లపల్లి రెండోవార్డు ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు వారిని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు నాయకులందరినీ అక్కడి నుంచి పంపించారు. ● జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్న 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గాడిపెల్లి నాగేశ్వర్రావు, నాయకులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల కృష్ణ, నాయకులు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని.. గొడవ పెద్దది కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ● జిల్లా కేంద్రంలోని 30వ వార్డు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సీపీఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దొంగ ఓట్లు వేపిస్తున్నారని ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో అడ్మిన్ డీఎస్పీ మోహన్రావు, టౌన్ ఎస్సై ప్రశాంత్ సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకొని నాయకులను చెదరగొట్టారు. దొంగ ఓటు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామని డీఎస్పీ మోహన్రావు తెలిపారు. ● తొమ్మిదో వారు పరిధి శనిగపురం జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్మిన్ డీఎస్పీ మోహన్రావు, రూరల్ సీఐ సర్వయ్య ఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సముదాయించారు. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థి చుక్క వెంకటేష్ మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని 17వ నంబర్ పోలింగ్ బూత్లో ఇస్లావత్ రామకు బదులు బీఆర్ఎస్ నాయకుడు గుగులోత్ రాజునాయక్ ఓటు హక్కు లేని బానో త్ అఖిల్తో దొంగ ఓటు వేయించాడని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న రూరల్ ఎస్సై దీపిక సమక్షంలోనే కానిస్టేబుల్ అశోక్ బానోత్ అఖిల్ను వెంట తీసుకెళ్లి దొంగ ఓటు వేయించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా సహా య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ● మున్సిపాలిటీ పరిధి 33వ వార్డుకు చెందిన పోలింగ్ కేంద్రాన్ని గాంధీపార్కులోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం సమీపంలో బీఎల్ఓ పోల్ స్లిప్స్ ఇస్తుండగా ఆమె దగ్గర కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు. పోల్ స్లిప్స్ ఇస్తున్న క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని సీపీఐ అభ్యర్థి అజయ్సారథిరెడ్డి వారితో వాగ్వాదం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. వెంకటేశ్వర బజార్లోని పోలింగ్ కేందరం ఎదుట దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. -
పురపోరు ప్రశాంతం
ఐదు మున్సిపాలిటీల్లో ముగిసిన పోలింగ్పెరిగిన ఓటింగ్ శాతంకేసముద్రం: బారులుదీరిన ఓటర్లు● ఉదయం నుంచి బారులుదీరిన ఓటర్లు ● జిల్లాలో 78.90 శాతం పోలింగ్సాక్షి, మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయాందోళనకు గురి చేయడం, ఒకరికి బదులు మరొకరు ఓటు వేసేందుకు వచ్చి పట్టుపడడం వంటి సంఘటనలతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో గొడవలు సద్దుమణిగాయి. మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో మొత్తం 1,27,682మంది ఓటర్లకు గాను 1,00,744 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా..78.90 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషుల ఓటింగ్ 78.65శాతం, మహిళల ఓటింగ్ 79.15శాతం నమోదైంది. కాగా, కేసముద్రం మున్సిపాలిటీలో అత్యధికంగా 86.14శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 75.60శాతం నమోదైంది. మందకొడిగా ప్రారంభమై.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 7గంటలకు మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు మోస్తరుగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో కిక్కిరిసిపోయాయి. సమయం ముగిసేకొద్ది ఓటు వేయని ఓటర్లపై అభ్యర్థులు దృష్టి పెట్టి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చారు. ● గత ఎన్నికలతో పోలిస్తే మూడు మున్సిపాలిటీల్లో అధికం ● మానుకోటలో తగ్గిన ఓటింగ్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఓట్లు వేసేందుకు ఓటర్లు పోటీ పడగా.. మరికొన్ని చోట్ల నిరుత్సాహం చూపారు. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెరిగింది. అదేవిధంగా జిల్లా కేంద్రం మహబూబాబాద్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మూడు మున్సిపాలిటీల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు రాగా.. పట్టణ జనాభా.. ప్రధానంగా విద్యావంతులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉన్న వార్డుల్లో పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం పెరగడానికి డబ్బులు, పలోభాలే కారణం అని పలువురు చెబుతుండగా.. పట్టణాల్లోని పలు వార్డుల్లో పోటీచేసిన అభ్యర్థులు అందరికి కావాల్సిన వారు కావడంతో ఒకరికి ఓటు వేస్తే.. మరొకరికి అన్యాయం చేసినట్లు అవుతుందని ఓటు వేసేందుకు రాలేదని పలువురు చెబుతున్నారు.ఐదు మున్సిపాలిటీల్లో పోలైన ఓట్ల వివరాలు మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం పోలింగ్ శాతం మహబూబాబాద్ 65,712 23,784 25,873 24 49,681 75.60 తొర్రూరు 21,451 8,134 8,588 8 16,730 77.99 మరిపెడ 13,687 5,712 5,971 0 11,683 85.36 డోర్నకల్ 10,869 4,228 4,672 0 8,900 81.88 కేసముద్రం 15,963 6,652 7,098 0 13,750 86.14 -
పోరు రసవత్తరం
● పలు వార్డుల్లో గట్టి పోటీ సాక్షి, మహబూబాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేసిన పలు వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోరు రసవత్తరంగా ఉంది. ఇలాంటి వార్డులపై జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆయా కేంద్రాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరించడం, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలోని 2,7,14,16,17,19,20, 29,34 వార్డుల్లో కొన్నిచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉండగా.. మరికొన్నిచోట్ల స్వతంత్రులు, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కేసముద్రం మున్సిపాలిటీలో 1,5,8,10,13 వార్డుల్లో కొన్నిచోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. డోర్నకల్లో మున్సిపాలిటీలో అయితే సగం కంటే ఎక్కువ వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా 1,2,6,7,9,13,15 వార్డుల్లో ఉత్కంఠ పోటీ నెలకొందని స్థానికులు చెబుతున్నారు. మరిపెడ మున్సిపాలిటీలో 9,12,13 వార్డుల్లో బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో 02, 05, 11, 14, వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, 15వ వార్డులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొందనే చర్చ జరుగుతోంది. నేడు యథావిధిగా ప్రాక్టికల్ పరీక్షలుమహబూబాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చిందని.. అయితే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డీఐఈఓ సీహెచ్. మదార్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు విద్యార్థులు తప్పకుండా పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
● ఆర్డీఓ కృష్ణవేణి మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఈనెల 14నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు పూర్తిస్థాయిలో విధులు నిర్విర్తించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్రెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
నేడే మున్సిపోల్
పోలింగ్ సామగ్రి పంపిణీ ● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ● ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్● కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈమేరకు మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. కాగా, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మానుకోట, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి షురూ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఐదు గంటల లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు ఓటర్ స్లిప్తో పాటు ఆధార్కార్డు లేదా ఓటర్ కార్డు తీసుకెళ్లాలని ప్రచారం చేశారు. ఓటర్ స్లిప్లు పంపిణీ చేశారు. జీడీసీలో పంపిణీ.. మానుకోట మున్సిపాలిటీ పరిధి 36వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. 12 కౌంటర్లు ఏర్పాటు చేసి 12 మంది ఆర్వోలు, 12 మంది ఏఆర్వోలతో పాటు అదనంగా 20 శాతం ఆర్వో, ఏఆర్వోల ఆధ్వర్యంలో సిబ్బందికి సామగ్రి అందజేశారు. 88పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతీ పీఎస్కు రెండు బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. ప్రతీ పీఎస్కు ఒక పీఓ, ఒక ఏపీఓతో పాటు ముగ్గురు ఓపీఓలు మొత్తం ఐదుగురిని కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. 8 రూట్లు ఏర్పాటు చేశారు. ఒక అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్తో పాటు 88 మంది విధులు నిర్వర్తిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, మున్సిపాలిటీలో ఆరు సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, మేనేజర్ శ్రీధర్, మాస్టర్ ట్రైనర్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, హెచ్ఎంలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా గిరిజనశాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికలక ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశీరాంనాయక్ మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే కీలక దశ అన్నారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకొని అంకితభావంతో పనిచేయాలన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు పాఠశాలలకు వచ్చేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో టెన్త్ క్లాస్ ఇంటర్నల్ పరీక్షల మార్కుల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత, విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేశామని డీఈఓ రాజేశ్వర్ మంగళవారం తెలిపారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు ఇంటర్నల్ మార్కుల బృందాలకు కీలకు సూచనలు అందజేస్తారని, అన్ని పాఠశాలల్లో సమాన ప్రమాణాలు పాటించాలన్నారు. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు పాఠశాలలను సందర్శిస్తారని, ప్రతీ బృందంలో ఒకరు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు విషయ నిపుణులు ఉంటారన్నారు. జిల్లాలో అన్ని మండలాల పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కుల పరిశీలనను పరిపూర్ణంగా పూర్తి చేసి తుది నివేదికను సమయానికి సమర్పించాలన్నారు. ‘స్కిల్డిజైర్’తో కేయూ ఎంఓయూ కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం, నైపుణ్యాలను అందించడం, ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లు, పరస్పర జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడం ఎంఓయూ ఉద్దేశం అని రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో సైన్స్డీన్ జి.హనుమంతు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు. పోలీసుల సేవలు అభినందనీయం ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతంలో పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్లో మంగళవారం అధికారులకు, సిబ్బందికి బడాఖాన ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. రాష్ట్ర బెటాలియన్, జోన్లు, సెక్టారుల్లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది నృత్యాలు, పాటలతో అలరించారు. అదనపు ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల వేట..
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రధాన ఘట్టం పోలింగ్ బుధవారం జరగనుంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల పరిధిలోని సగం వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు తీవ్ర పోటీ నెలకొంది. కాగా, ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం చేసిన ప్రచారం మరోఎత్తుగా ఉంటుంది. చివరి నిమిషంలో ఓటరు మనసు తమవైపు తిప్పుకునేలా అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో 98 వార్డులు ఉండగా.. 50కిపైగా వార్డుల్లో పోటీ పోటీగా ప్రచారం సాగింది. అయితే ముందుగా పెట్టుకున్న పొత్తులు వికటించడం.. తర్వాత అభ్యర్థుల ముమ్మరంగా ప్రచారం చేయడం వంటి సంఘటనలు ఉన్నాయి. ఇందులో కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఎక్కువ పోటీ నెలకొంది. అదే విధంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులతో ఆ పార్టీ రెబల్స్ తీవ్ర పోటీ పడుతున్నారు. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ రెబల్స్ మధ్య పోటీ ఉంది. అయితే చివరి నిమిషంలో పోటీలో వెనకబడిన అభ్యర్థులను గట్టిపోటీ ఎదుర్కొంటున్న వారు బతిమిలాడడం.. ప్రచారం విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముమ్మర ప్రచారం చేసిన అభ్యర్థులకు చివరి వరకు ఓటరుకు పంచేందుకు డబ్బులు చేతికి రాకపోవడం, పలువురిని పార్టీ పెద్దలు చిన్నచూపు చూడడంలో ఏమీ చే యలేక చేతులు ఎత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంటరిగా ప్రచారం.. వారం రోజులుగా ముమ్మర ప్రచారం చేసిన నాయకులు గడువు ముగియడంతో మంగళవారం అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఓటర్ల బంధువులు, కుల సంఘాల పెద్దలను వెంట తీసుకొని వెళ్లి ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుల వివరాలు, గతంలో ఓడిపోయిన సంఘటనలు, పోటీలో గెలిస్తే అనుకూలించే అంశాలు చెబుతున్నారు. ప్రధానంగా చైర్మన్ రేస్లో ఉన్నవారు. గెలిస్తే చైర్మన్ అవుతాను. మీ పనులు చేసిపెట్టే అవకాశం ఉంటుందని బతిమిలాడుతున్నారు. ఎత్తులు..పైఎత్తులు.. గెలుపోటమలు నిర్ధారించే ఓట్లు తక్కువ సంఖ్యలో ఉంటాయనే సంకేతాలు రావడంతో.. ప్రతీ ఓటు కీలకంగా మారింది. నాయకులు డబ్బులే ప్రధానంగా భావించి ఓటు వేసే వార్డులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఆయా కాలనీల్లోని యువతకు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ పడి ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పంపిణీ చేశారు. అయితే అందరూ సమానంగా డబ్బులు ఇస్తే ఓటరు ఏం చేస్తారో అని తెలుసుకొని కొందరు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అదనంగా డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. డబ్బులే కాకుండా మగవారికి డ్రస్లు, మహిళలలకు చీరల పంపిణీ ముమ్మరం చేశారు. మరికొన్ని చోట్ల అయితే ఓటుకు రూ.5వేల నుంచి రూ. 10వేల వరకు కూడా ఇచ్చేందుకు వెనకాడేది లేదన్నట్లు తమ అనుచరులను ఓటరు వద్దకు పంపి డబ్బుల పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరి ప్రయత్నంలో అన్ని పార్టీల నాయకులు ఒంటరిగా ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థన ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేసి తాయిలాలు -
ఏర్పాట్లు పూర్తి..
తొర్రూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వి.శ్యాంసుందర్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్లో ఎన్నికల సామగ్రిని మంగళవారం సిబ్బందికి పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 194 మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారన్నారు. 34 మంది అత్యవసర సేవల కింద రిజర్వ్ చేశామన్నారు. ప్రతీ వార్డుకు పీఓ, ఏపీఓ, ముగ్గురు ఓపీఓలను నియమించామన్నారు. 40మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికల సామగ్రి పంపిణీని ఆర్డీఓ గణేష్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారుల ఏర్పాట్లు..
డోర్నకల్: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డోర్నకల్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,160 మంది పురుషులు, 5,709మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 16 పోలింగ్ కేంద్రాల్లో 110 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారితో పాటు ముగ్గురు ఓపీఓల చొప్పున విధులు చేపట్టనుండగా.. మిగతా సిబ్బంది రిజర్వ్లో ఉంటారు. సిబ్బంది పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
మహబూబాబాద్ రూరల్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జ రగకుండా మహబూబాబాద్ పట్టణ పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్ల వారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శబరీష్, డీఎస్పీ తిరుపతిరావు ఆదేశాల మేరకు టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై షాకీర్, పోలీసు సిబ్బంది మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడి వివాదాస్పద అంశాల్లో తలదూర్చొద్దని సూచించారు. శాంతియుత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగేందుకు పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులూ సహకరించాలని ఆయన కోరారు. -
ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
నెహ్రూ సెంటర్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టెక్నీషియన్ల సేవల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. నూతనంగా రిక్రూట్ అయిన ల్యాబ్ టెక్నీషియన్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ, పరీక్షల కచ్చితత్వం, సమయపాలన, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, పరికరాల సంరక్షణ, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు సారంగం, సుధీర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రవణ్, విజయ్, ప్రత్యూష, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, పురుషోత్తం, స్వామి, అనిల్ ఉన్నారు. -
డీసీఓ ఇష్టం వచ్చినట్లు కొట్టారు.. తిట్టారు
కాజీపేట అర్బన్ : తమను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతోపాటు కాలితో తన్ని అసభ్యకరంగా మాట్లాడిన డీసీఓను వెంటనే సస్పెండ్ చేయాలని మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్, జానియర్ కళాశాల విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మండికొండ సబ్స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. విద్యార్థుల కథనం ప్రకారం.. మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 160 మంది విద్యార్థినులు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువుతున్నారు. ఈ క్రమంలో 11 మంది ఫస్టియర్ విద్యార్థినులు తరగతి గదులకు ఆలస్యంగా వచ్చారని సోమవారం కళాశాల డీసీఓ, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి విచక్షణ కో ల్పోయి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా కాలితో తన్ని దుర్భాషలాడారు. ఈ ఘటనను కలెక్టర్ స్నేహ శబరీష్కు తెలిపేందుకు మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో సుమారు 120 మంది విద్యార్థినులు స్కూల్ నుంచి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్.. విద్యార్థినులను దారిలో ఆపగా వారు మడికొండ సబ్స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. డీసీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కార్యాలయానికి సమాచారం అందజేయగా జోనల్ అధికారులు అపర్ణ, అరుణకుమారి ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలుపడంతో విద్యార్థినులు కళాశాలకు చేరుకున్నారు. కలెక్టర్కు నివేదిక అందజేత.. మడికొండ గురుకుల కళాశాల విద్యార్థినులు ధర్నా చేపట్టడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎస్సీ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల, కాజీపేట తహసీల్దార్ రాజు, ఇన్చార్జ్ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి విశ్వజ.. కళాశాలకు చేరుకున్నారు. 11 మంది విద్యార్థునుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికను మంగళవారం కలెక్టర్కు అందజేశారు. ఈ ఘటనలో ఆమెను సస్పెండ్ చేయాలి సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థినుల డిమాండ్ మడికొండ సబ్స్టేషన్ వద్ద ధర్నా -
ఓటేసేందుకు 18 కార్డులు
● ఏదో ఒక్క కార్డు ఉంటే చాలు.. ● ఎంచక్కా ఓటు వేసి రావచ్చు ● నేడే మున్సిపల్ ఎన్నికలుఓటు ఇలా వేద్దాం.. ● పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే మొదటి అధికారి వద్ద ఫొటోచిట్టీ, లేదా ఏదైనా గుర్తింపు కార్డును చూపించాలి. ఆ అధికారి తమ వద్ద ఉన్న ఓటరు జాబితాలో పేరు చూసి, వరుస క్రమసంఖ్యను, పేరును బహిరంగ పరుస్తారు. ● పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు మిమ్మల్ని పోల్చుకుంటారు. మీరు నిజంగానే ఆ ఓటరేనా... నకిలీ ఓటరా? అని సరిచూసుకుంటారు. ఓటరు జాబితాలో మీ పేరును రౌండప్ చేస్తారు. రెండో అధికారి మీ వేలిపై సిరాచుక్క రాస్తారు. మూడో అధికారి బ్యాలెట్పత్రాల బుక్పై మీ సంతకం తీసుకుంటారు. చదువు రాని వారైతే.. వేలిముద్ర వేయిస్తారు. ● ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మీకు బ్యాలెట్పత్రం ఇస్తారు. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లి ఓటు వేయాలి. ● ప్రతి ఓటరు బ్యాలెట్పత్రంలోని గుర్తుపై స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంక్స్టాంప్తో ముద్ర వేయాలి. బ్యాలెట్ పత్రాన్ని మలిచి బ్యాలెట్ బ్యాక్స్ల్లో వేయాలి. బాధ్యతలు మరువద్దు.. చలి ఉందని, మధ్యాహ్నం ఎండలు ఉన్నాయని, సెలవు దొరికిందని, దూరభారమని ఓటు వేయడం మరిచిపోవద్దు. పౌరులుగా మీ బాధ్యతలను మరిచిపోవద్దు. మీకు వీలున్నప్పుడే వెళ్లి పోలింగ్ రోజు ఓటు వేయాలి. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకుంటే ‘నోటా’కు ఓటు వేయవచ్చు. ఇవి చేయొద్దు.. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దు. ఎన్నికల సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలకు గురవుతారు. క్యూలైన్లో ఉన్న ఓటర్లకు సైగలు చేయడం, ప్రచారం చేయడం తప్పు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే ప్రచారం చేసుకోవాలి. పోలింగ్ కేంద్రం వద్ద చెత్తవేయడం, ఉమ్మి వేయడం చేయొద్దు. ఓటరు గుర్తింపు కార్డు ఉండి.. పోలింగ్ కేంద్రం తెలియకుంటే.. ఓటరు గుర్తింపు కార్డు ఉంది. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియకుంటే.. ఏ వార్డులో ఓటుహక్కు ఉందో అర్థం కాకపోతే.. మున్సిపల్ ఆఫీస్లోని పౌరసేవా కేంద్రంలోకి వెళ్లి ఆన్లైన్లో ఓటరు కార్డు నంబరు ఆధారంగా చెక్ చేసి తెలుసుకోవచ్చు. – వరంగల్ డెస్క్ ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్,పాన్కార్డు, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్కార్డు పట్టాదార్ పాస్బుక్, ఉపాధిహామీ జాబ్కార్డు, ఫొటోతో ఉన్న పెన్షన్పత్రం ఫొటోతో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్,ఫొటోతో కూడిన దివ్యాంగుల సర్టిఫికెట్. ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసినకార్డులు బ్యాంకు, లేదా పోస్టాఫీస్ జారీచేసిన ఫొటో ఉన్న పాస్పుస్తకం ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు లేబర్ మంత్రిత్వశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్కార్డు ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేదా ఎమ్మెల్సీలకు జారీచేసిన గుర్తింపు కార్డులు ఓటేయడం.. మన హక్కు. అంతకుమించి బాధ్యత. రానున్న ఐదేళ్లపాటు మన పట్టణాన్ని పాలించేది ఎవరో నిర్ణయించేది మనమే. అంతటి శక్తి ఉన్న ఓటరు తన ఓటుతో నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది. నేడు (బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటు వేసేందుకు వెళ్తుండగా ఓటరు గుర్తింపుకార్డు దొరకడం లేదని.. మా ఇంటికి ఫొటోతో కూడిన పోల్చిట్టీ రాలేదనే కారణాలతో ఓటు వేయకపోవడం సరికాదు. నిర్లక్ష్యం వీడితే చాలు.. ఓటరు జాబితాలో పేరు ఉండి.. 18 రకాల గుర్తింపుకార్డులలో ఏదేని ఒకటి ఉంటే ఓటు వేయవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు జారీ చేసిన పోల్చిట్టీతోపాటు గుర్తింపుకార్డులు తప్పనిసరి. పోల్ చిట్టీ ఉండి, గుర్తింపుకార్డు లేకుంటే ఓటు వేయనివ్వరు. గుర్తింపు కార్డు ఉండి, పోల్ చిట్టీ లేకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు అవరసమైన ఫొటో గుర్తింపుకార్డుల గురించి తెలుసుకుందాం. -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● 1,100 మంది పోలీసులతో బందోబస్తు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేటలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కోసం 1,100 మందికిపైగా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఏసీపీలు 11 మంది, ఇన్స్పెక్టర్లు 125 మంది, ఎస్సైలు 113 మంది, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 515 మంది, హోంగార్డులు 226 మంది, జిల్లా గార్డులు, బాంబ్ డిస్పోజబుల్ విభాగాలకు చెందిన సుమారు 168 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అదనపు డీసీపీ స్థాయి పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించామని, ప్రతీ మున్సిపల్ పరిధిలో ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇన్చార్జ్గా ఉంటారని ఆయన తెలిపారు. రూట్ మొబైల్ టీంలు, షాడో పార్టీలు, ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్సై, ఏఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తారని, మొబైల్ పార్టీలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎవరైనా ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడుతున్నట్లు సమాచారం అందితే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. కాగా, సీపీ సన్ ప్రీత్ సింగ్ హనుమకొండ జిల్లా పరకాల, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు నష్టం కలిగే అనేక చర్యలు చేపడుతోంది. అందుకే వ్యవసాయ, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు పోరాడాలి. –బొట్ల చక్రపాణి, సీఐటీయూ జిల్లా కోశాధికారి సమ్మెను జయప్రదం చేయాలి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. కార్మిక సంఘాలు, చట్టాలు లేని దేశంగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అందుకే పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి. –తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైఉద్యమించాలి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఈనెల 12న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పాల్గొనేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం. కేంద్రం ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రాధాన్యం దేశ కార్మిక వర్గం, రైతాంగానికి ఇవ్వడం లేదు. –గంగుల దయాకర్, ఐఎఫ్టీయూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు -
మేడారం జాతర విజయవంతం
హన్మకొండ: ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి మేడారం మహాజాతరను విజయవంతం చేశారని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్ అన్నారు. మంగళవారం వరంగల్ ములుగు రోడ్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఆర్టీసీ మేడారం జాతర విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈడీ సోలోమన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉద్యోగులు బస్సులు నడిపి జాతరను విజయవంతం చేశారని అభినందించారు. వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయ భాను మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసి వివిధ విభాగాల అధికారులతో సమన్వయం సాధించడంతో జాతర విజయవంతమైందన్నారు. అనంతరం జాతరలో విధులు నిర్వర్తించిన అధికారులు, ఉద్యోగులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు మహేశ్, కేశరాజు భానుకిరణ్, విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్ -
సమ్మక్క–సారలమ్మా.. మీరే దిక్కు
హన్మకొండ కల్చరల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపులో కోరికల లేఖలు ఆసక్తి కలిగిస్తున్నాయి. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు మంగళవారం ఆరో రోజు కొనసాగింది. లెక్కింపులో లభ్యమవుతున్న భక్తుల కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత వింత కోరికలు చూసి అంతా లేఖలు చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఓ భక్తుడు ఉద్యోగం కోసమైతే.. ఇంకో భక్తుడు ఏకంగా నలుగురు పిల్లలకు ఉద్యోగాలు రావాలని, సెట్ అవ్వాలని యాటను ఇస్తానని కోరారు. మరొకరు కొడుకు పుట్టాలని కోరుకుంటున్న లేఖలు హుండీలో కనిపించాయి. అంతే కాదు ఒక భక్తుడు వ్యాపారంలో రాణించాలని, అప్పులు తీరాలని, ఆరోగ్యం బాగుండాలని, అలాగే మా దంపతులకు కొడుకు పుట్టాలని.. అమ్మవారికి విన్నవించుకున్నాడు.● మేడారం హుండీ కానుకల్లో కోరికల లేఖలు ● ఉద్యోగం కోసం ఒకరైతే, కొడుకు పుట్టాలని మరొకరు -
ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆరో రోజు మంగళవారం 40 హుండీలు లెక్కించగా రూ. 80,81,935 ఆదాయం సమకూరిందని మేడారం ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు 828 హుండీలు లెక్కించగా మొత్తం రూ. 12,64,67,051 ఆదాయం వచ్చిందని ఈఓ వీరస్వామి తెలిపారు. మేడారం మహాజాతర 40 హుండీలు లెక్కింపు -
రేపు కాజీపేట మీదుగా వన్వే స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా అజాంఘర్–యశ్వంత్పూర్ వన్వే స్పెషల్ ట్రైన్ నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. వన్వే స్పెషల్ ట్రైన్ వివరాలు.. ఈనెల 11(నేడు)న అజాంఘర్లో బయలుదేరే అజాంఘర్–యశ్వంత్పూర్ (05009) స్పెషల్ ట్రైన్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్ చేరుకుని వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాగ్పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, కాజీపేట, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. పారా సిట్టింగ్ వాలీబాల్ రాష్ట్ర జట్టు ఎంపిక కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పారా సిట్టింగ్ వాలీబాల్ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టును మంగళవారం ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 60 మంది పారా క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా క్రీడాకారుల శారీరక సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, ఆటపై అవగాహన, జట్టు సమన్వయం, క్రమశిక్షణ ఆధారంగా సెలక్షన్ కమిటీ తుది జట్టు ఎంపిక చేసిందని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు సింగారపు బాబు తెలిపారు. ఈ ఎంపికై న జట్టు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈనెల 25నుంచి 28వ తేదీవరకు జరగనున్న పారా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి దక్కకుండా చేసిందన్న అక్కసుతో..
గార్ల: అన్నకు రెండో పెళ్లి చేసి మొత్తం ఆస్తి తనకు దక్కకుండా చేసిందన్న కోపంతో నిద్రమత్తులో ఉన్న అత్తకు ఓ అల్లుడు విద్యుత్షాక్ పెట్టి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.సాయికుమార్ కథనం ప్రకారం.. సీతంపేట పంచాయతీ మంగళితండాకు చెందిన బానోత్ రాజేశ్ అన్న రమేశ్కు మూడు రోజుల క్రితం సీతంపేటలో రెండో వివాహం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ధరావత్ కౌసల్య (50) అలియాస్ కంసాలి తన కూతురును బానోత్ రాజేశ్కు పదేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసింది. వీరి కుటుంబం సజావుగానే సాగుతోంది. రమేశ్కు సైతం 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా అతని భార్య ఏడేళ్ల క్రితం అతన్ని వదిలి వెళ్లిపోయింది. రమేశ్కు రెండో పెళ్లి సంబంధంగా కౌసల్య ఇటీవల తన అన్న కూతురు అంజలితో సంబంధం కుదిర్చింది. రమేశ్, అంజలి వివాహం మూడు రోజుల క్రితం సీతంపేటలో జరిగింది. అంతా నిద్రలో ఉండగా.. రమేశ్కు పెళ్లికాకపోతే ఆస్తిమొత్తం రాజేశ్కు దక్కేది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజేశ్ తన అన్నకు రెండో పెళ్లి చేసి తనకు ఆస్తి దక్కకుండా చేసిందనే అక్కసుతో అత్త కౌసల్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. మంగళవారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా అత్తమామను చంపేందుకు ఇనుప కడ్డీలకు విద్యుత్ వైరు కట్టి వారు పడుకున్న మంచం తలదిండు కింద పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కౌసల్యకు మెలకువ వచ్చి కదలడంతో ఇనుపకడ్డీ తాకి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందింది. మామ వెంటనే నిద్రలేచి తనభార్యను పట్టుకోగా అతనికి సైతం విద్యుత్షాక్ తగలడంతో కేకలు వేశాడు. ఇంట్లోని అందరూ లేచే సరికి అత్త మృతిచెందగా, మామ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే రాజేశ్ తండ్రి వచ్చి విద్యుత్ బోర్డు ప్లగ్ తీశాడు. రాజేశ్ భార్య ఎందుకు ఇలా చేశావని నిలదీయగా మద్యం మత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అంజలిపైనా కత్తితో దాడి చేశాడు. ఇరువురికి గాయాలు కాగా, ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని గార్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి రాజేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దివ్యాంగుడైన రాజేశ్కు కొంత ఎలక్ట్రీíÙయన్ పని కూడా వస్తుంది. దీంతో కరెంటుపై కొంత అవగాహన ఉండడంతో ఇనుప కడ్డీలకు విద్యుత్ వైర్లు పెట్టడం, దానిని మంచంలో ఎవరికీ కనిపించకుండా అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
‘పేట’ పీఠమెవరికో?
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఉధృత ప్రచారం నిర్వహించారు. నువ్వా? నేనా? అన్నట్లు సాగిన ప్రచారంలో పుర పోరులో చివరికి ఎవరికి గెలుపు లభిస్తుందో? మున్సిపాలిటీ పీఠం ఎవరికి దక్కుతుందోనని పట్టణ వాసులు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ముగ్గురి మధ్య బలమైన పోరుతో గెలుపోటములు చర్చనీయాంశంగా మారాయి. హోరాహోరీ ప్రచారం.. మునిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఎక్కువ ఉంది. అయితే బీజేపీ అభ్యర్థులకు లభించే ఓట్లు వారి గెలుపోటములను తారు మారు చేయనున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ బరిలో బలమైన అభ్యర్థులు ఉండడంతో ప్రచారం హోరాహోరీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్కరే ప్రచారం చేయడంతోపాటు గెలుపు బాధ్యత తన మీద వేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితోపాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. బీజేపీ మున్సిపాలిటీలో బోణి కొట్టాలనే సంకల్పంతో ఆ పార్టీ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి 30 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్.. అభివృద్ధి మంత్రం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక దృష్టితో పట్టణంలోని రోడ్లన్నీంటిని పూర్తి చేయించడంతో అత్యధిక వార్డులు గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ హామీలు విస్మరించిందని బీఆర్ఎస్ ప్రచారం.. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని విమర్శిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతోందని తెలుపుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు గెలుపొందాలనే ఉద్దేశంతో ఆ పార్టీ సీనియర్ నాయకులను పోటీ చేయించి ప్రచారం కొనసాగించారు. బోణి కోసం బీజేపీ.. నర్సంపేట నియోజకవర్గంలో ఏ ఎన్నికలైనా ఇప్పటి వరకు రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండేది. బీజేపీకి రేవూరి ప్రకాశ్రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పార్టీ బలోపేతం బాధ్యతను గోగుల రాణాప్రతాప్రెడ్డి తీసుకున్నారు. గ్రామీణ స్థాయిలో కూడా క్యాడర్ను పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క చోట బోణి కొట్టింది. దీంతో మున్సిపాలిటీలో సైతం బోణి కొట్టాలనే ఉద్దేశంతో 30 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపి ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపేలా ప్రచారం నిర్వహించారు. దొంతి మాధవరెడ్డిపెద్ది సుదర్శన్రెడ్డిగోగుల రాణాప్రతాప్రెడ్డి -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా నిర్వహిస్తున్న తెలంగాణ అంతర్ జిల్లాల అండర్–19 క్రికెట్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీ క్రీడా మైదానంలో జరిగిన తొలిమ్యాచ్లో వరంగల్, నిజామాబాద్ జిల్లా జట్లు తలపడ్డాయి. హనుమకొండకు చెందిన రంజీ క్రీడాకారుడు తోట సుఖాంత్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నిజామాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను కేవలం 30.1 ఓవర్లు ఎదుర్కొని 117 పరుగుల చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన వరంగల్ జట్టు కేవలం 24.1 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొగిలి చ ర్ల మైదానంలో జరిగిన మరోమ్యాచ్లో కరీంనగర్ , ఆదిలాబాద్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 45 ఓవర్లలో 4వికెట్లను కోల్పోయి 231 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ఆదిలాబాద్ 34 ఓవర్లు ఎదుర్కొని 174 పరుగుల వద్ద అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో 158 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నెల 14వ తేదీ వరకు లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో పోటీలు కొనసాగుతాయని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, సభ్యులు బండారి ప్రభాకర్, మట్టెడ కుమార్, నిజామాబాద్ సంఘం జాయింట్ సెక్రటరీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తొలిమ్యాచ్లో వరంగల్ శుభారంభం నిజామాబాద్పై గెలుపు -
అన్నా.. అప్పు ఇస్తారా?
● రూ.2 నుంచి రూ.5 వడ్డీ తీసుకున్నా ఫర్వాలేదు ● ఫోన్లో ఓట్ల కోసం గాలం ● ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు జనగామ: పురపాలక ఎన్నికల ప్రచారం ముగిసినా జనగామ,స్టేషన్ఘన్పూర్లో అభ్యర్థుల పరుగులు మాత్రం ఆగడం లేదు. ప్రచార పర్వంలో పది రోజులపాటు వాడివేడీగా తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు ఫోన్కే పరిమితమై ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అన్నా గుర్తుంచుకో.. నేను గెలిస్తే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా.. నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసమే తెరిచి ఉంటాయి అంటూ తమ అనుచరులే కాక కీలక ఓటర్లకు వరుస కాల్స్ చేస్తూ గుర్తు చేస్తున్నారు. కుల సంఘాల కీలక నాయకులు, ప్రభావం చేసే ఓటర్లను టార్గెట్ చేస్తూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసే ప్రయత్నంలో అభ్యర్థులు, వారి బృందాలు అర్ధరాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. అభ్యర్థులు ఇలాగే ఫోన్లో మునిగిపోతుంటే, అనుచర వర్గం మాత్రం ప్రత్యర్థి ఏ ఎత్తు గడలు వేస్తున్నారో తెలుసుకుని దానికి పై మెట్టులో ఉండేలా ఆలోచనతో నిధుల సమీకరణ పనిలో తలమునకలైపోయారు. ఇదిలా ఉంటే ప్రచార వేడి తగ్గి పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ డబ్బు డిమాండ్ పెరుగుతోంది. ప్రచార ఖర్చులు అంచనాలను మించిపోవడంతో కొంతమంది అభ్యర్థులు మరింత ఇబ్బందుల్లో పడ్డారు. అన్నా.. రెండు నుంచి ఐదు శాతం వడ్డీకై నా రూ. 5 నుంచి రూ. 10 లక్షలు కావాలి.. కొంచెం సర్దిపెట్టు.. పేపర్ రాస్తా.. సాక్షుల సంతకం పెడతాను, రాత్రికి రాత్రే ఇవ్వాలంటూ తమకు దగ్గర వారిని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. పోలింగ్కు ఒక్క రోజు ముందుగానే ఓట్ల ప్రభావం కోసం మరికొందరు భారీ మొత్తంలో అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినా అభ్యర్థుల గెలుపు కోసం పరుగులు, అప్పు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. నేటినుంచి పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు వరంగల్ క్రైం : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేటలోని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఈనెల 10న (మంగళవారం) నుంచి నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోని 200 మీటర్ల మేర ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 11వ తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి..
హన్మకొండ: ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధమని, విద్యుత్ వ్యవస్థను స్తంభింపజేస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి, కన్వీనర్లు సాయిలు, సింగిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ల పట్ల యాజమాన్యాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ రూల్స్, ఇతర సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డికి వినతి పత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్గౌడ్, కోశాధికారి ప్రశాంత్, ట్రాన్స్కో కన్వీనర్లు కందికొండ వెంకటేష్, పొగాకు భరత్, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికిందర్, నాయకులు వెంకన్న, పాపిరెడ్డి, జయచందర్, రాజన్న, ఐలయ్య, సృజన, శ్రీకాంత్, రాజేశ్ నాయక్, శ్రీనివాస్, కోటి, నరేశ్, సంజీవ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. లేనిపక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి -
గుండె నొప్పితో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
గూడూరు: గుండె నొప్పితో ఓ ప్ర భుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మట్టెవాడలో జరిగింది. కు టుంబీకుల కథనం ప్రకారం.. మట్టెవాడకు చెందిన బిజ్జ సంపత్కుమార్(42) మండల కేంద్రంలోని చంద్రుగూడెం ఎంపీపీఎస్లో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో చాతీలో నొప్పి వస్తోందని భార్య శ్రుతితో చెప్పాడు. దీంతో ఆమె వెంటనే సమీప బంధువులకు చెప్పగా వారు హుటాహుటిన 108లో గూడూరు సీహెచ్సీకి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మండల ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సంపత్కుమార్కు నివాళులర్పించారు. -
బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగుకాల్వలో వేసినట్లే
● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగుకాల్వలో వేసినట్లేనని, ఘన్పూర్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మీ మద్దతుతోనే నిజాయితీకి మారుపేరుగా ఉన్నానన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తనను తిట్టడానికే రాజయ్యను బీఆర్ఎస్ పార్టీ కూలీగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. తాను రెండేళ్లలోనే నియోజకవర్గానికి రూ.1,400 కోట్లు తీసుకొచ్చానని, స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీ చేయడంతోపాటు రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నాయకులు శిరీష్రెడ్డి, బెలిదె వెంకన్న, అన్నం బ్రహ్మారెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, జయపాల్రెడ్డి, పోశాల కృష్ణమూర్తి, కొలిపాక సతీశ్, పోగుల సారంగపాణి, అభ్యర్థులు బూర్ల శంకర్, గుర్రం హరనాఽథ్, గుర్రం హైమారమేశ్, కొంతం రజితాశ్రీనివాస్, పెసరు కృష్ణవేణిసారయ్య, బొల్లు లక్ష్మి, సంపత్రాజ్, సీహెచ్.సత్యనారాయణ, కనకం రమేశ్, అన్నెపు సుమలతకుమార్ పాల్గొన్నారు. సమాధుల వద్ద ఓట్లు అడుగుతూ వినూత్న నిరసన కేసముద్రం: చనిపోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో తొలగించలేదంటూ ఓ స్వతంత్ర అభ్యర్థి సమాధుల వద్ద ఓట్లు అడుగుతూ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి భుక్యా బాలునాయక్.. వార్డు ఓటర్ లిస్టులో చనిపోయినవారి పేర్లు ఉన్నాయని, వాటిని అధికారులు తొలగించలేదని ఆరోపించారు. దీని వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని భావించి సమాధుల వద్ద నిరసన తెలుపుతున్నానన్నారు. -
డిజిటల్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం
కేయూ క్యాంపస్: డిజిటల్ మోసాలపై అప్రమత్తతే ఆయుధమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. సోమవారం కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం, కంప్యూటర్ సైన్స్విభాగం సంయుక్తంగా ‘సైబర్ సురక్ష మొబైల్ రక్షణ’పై క్యాంపస్లోని సెనేట్హాల్లో అవగాహన ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య, బ్యాంకింగ్, ఆరోగ్యం, సమాచారం వ్యవహరాలు అన్ని మొబైల్తోనే కొనసాగుతున్నాయన్నారు. సైబర్ నేరాలు, ఆ న్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయని, వాటి పై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సైబర్ క్రైం సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, సబ్ఇన్స్పెక్టర్ చరణ్ మాట్లాడుతూ సైబర్ నేరాల విచారణలో ప్ర భుత్వ పోర్టల్ పాత్ర కీలకమన్నారు. వరంగల్ సైబ ర్ క్రైం పీఎస్ పరిధిలో 2024నుంచి 2026 ఫిబ్రవరి9 వరకు 223 సైబర్ కేసులు నమోదయ్యాయన్నా రు. రూ 36.91కోట్లు నష్టపోయారన్నారు. అందులో 139 కేసుల ద్వారా రూ 2.66 కోట్లు తిరిగి బాధితులకు ఇప్పించామన్నారు. 85మంది నిందితులను గుర్తించి 45 కేసుల్లో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ గణాంకాలు సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కు చెందిన డైరెక్టర్ రాఘవరెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్ సంపత్ సురక్షిత డిజిటల్ భారత్ నిర్మాణంపై మాట్లాడారు. కేయూ స్టూడెంట్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ ఇస్తారి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ, యూత్ వె ల్ఫేర్ ఆఫీసర్ రాధిక, అధ్యాపకులు రమేశ్, నీలి మా, ఫాతిమా, భారవిశర్మ పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం -
ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను గెలిపించాలి
● పార్టీ జాతీయ నేత కె.నారాయణ నెహ్రూసెంటర్ : ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక సీపీఐ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం సీపీఐని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మానుకోటలో కమీషన్లు, భూ కబ్జాలకు ఎమ్మెల్యే మురళీనాయక్ తెరలేపారని ఆరోపించారు. మున్సిపాలిటీ పాలకవర్గం రాకముందే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. కబ్జాలు చేసేందుకు పైరవీలు ప్రారంభించారని, కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, మాజీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ బి.అజయ్సారథిరెడ్డి, పంజాల రమేశ్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల శ్రీదేవివెంకన్న, ఎండి.ఫాతిమా, నర్ర సంధ్యాశ్రావణ్, నాగెల్లి యాకమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
తల్లి పిండ ప్రదానం చేస్తూ.. కుమారుడు గల్లంతు
● ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయిన న్యాయవాది ● గుండ్లసింగారం వద్ద ఘటన హసన్పర్తి: తల్లి పిండ ప్రదానం చేయడానికి వెళ్లి కుమారుడు ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లసింగారం ఎస్సారెస్పీ కాల్వ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కుమార్పల్లికి చెందిన రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన తల్లి 10 వర్ధంతి సందర్భంగా పిండ ప్రదానం చేయడానికి గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు చేరుకున్నాడు. పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి నీటిలో పడ్డాడు. ప్రవాహం తీవ్రంగా ఉండడంతో అందులో కొట్టకుపోయారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు కొనసాగాయి. గీసుకొండ రిజర్వాయర్ వద్ద కూడా పోలీసులు గాలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. ప్రేమ విఫలమై ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యకాజీపేట అర్బన్ : ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో ఇందిరమ్మకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. మడికొండ పోలీసుల కథనం ప్రకారం. ఇందిరమ్మకాలనీకి చెందిన ఆవుల ప్రణయ్కుమార్ (24)అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. యువతి తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలియడంతో అమ్మాయిని నల్లగొండలోని మేనమామ ఇంటికి పంపించారు. నల్లగొండనుంచి అమ్మాయి మేనమామ.. ప్రణయ్కుమార్కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో భయపడిన ప్రణయ్కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లి సరోజన ఊరికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమారుడు ఉరి వేసుకున్నట్లు ఉండడంతో బోరున విలపించింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోలీసు స్టేషన్ నుంచి యువకుడి పరారీ?
● అరగంటలోనే పట్టుకున్న పోలీసులు.. మామునూరు: ఓ చోరీ కేసులో విచారణ పేరుతో నలుగురు అనుమానితులను మామునూరు పోలీసులు స్టేషన్కు తీసుకురాగా ఇందులో ఓ యువకుడు పరారైనట్లు సమాచారం. ఇద్దరు యువకులు, ఇద్దరు బాలురను స్టేషన్లో విచారిస్తుండగా ఓ యువకుడు పోలీసుల కళ్లు కప్పి గోడ దూకి చెట్లలోకి పరుగులు పెట్టాడు. గమనించిన పోలీసులు వెంటపడి అతడిని పట్టుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇదే పోలీస్ స్టేషన్లో గతేడాది గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితడు పరారీ కాగా.. అతడి ఆచూకీ కనిపెట్టి స్టేషన్కు తరలించారు. ఈ ఘటనను పోలీస్ కమిషనర్ సీరియస్గా తీసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆ ఘటన మరవక ముందే సోమవారం రెండోసారి విచారణలో ఉన్న ఓ యువకుడు పరారీ కావడం గమనార్హం. అయితే అరగంటలోనే పోలీసులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఐదోరోజు ఆదాయం రూ. 1,12,63,000 ● మేడారం మహాజాతర 163 హుండీలు లెక్కింపు హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఐదోరోజు సోమవారం 163 హుండీలు లెక్కించగా రూ. 1,12,63,000 ఆదాయం సమకూరిందని మేడారం ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు 788 హుండీలు లెక్కించగా మొత్తం రూ. 11,83,85,116 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో డయాగ్నొస్టిక్స్ దగ్ధం
● రూ.3లక్షల నష్టంహన్మకొండ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో డయాగ్నొస్టిక్స్ దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం ఉదయం హనుమకొండలోని భవానీనగర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భవానీనగర్లోని ఏ టు జెడ్ డయాగ్నొస్టక్స్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోమంటలు చె లరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపకశాఖ ఆఫీసర్ పి.దిలీప్ కుమార్, లీడింగ్ ఫైర్ ఫైటర్ పి.మహేశ్వర్, సిబ్బంది జి.వినోద్, గౌతంకుమార్ వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ఏ టు జెడ్ డయాగ్నొస్టిక్స్కు రూ.3లక్షల వర కు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనదారులు వాహనాలు నిలిపి ప్రమాదాన్ని చూస్తుండడంతో భవానీనగర్ వద్ద ఎన్జీవోస్ కాలనీ రోడ్డులో ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కు మార్ సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
డబ్బులిచ్చి.. కాళ్లు మొక్కి
● ఓటు వేయాలని అభ్యర్థన ● బొట్టుపెట్టి డబ్బులు ఇస్తున్న అభ్యర్థులు ● ముందస్తుగానే పంపిణీ షురూ.. ● ముగిసిన ఎన్నికల ప్రచారంసాక్షి, మహబూబాబాద్: గతంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పి ఓట్లు అడిగేవారు. అయితే, ప్రస్తుతం ప్రచార శైలి మారింది. చేసిన పనులు చెప్పడం ఒక మాట అయితే.. ప్రత్యర్థి ఎలా ఓటు అడుగుతున్నాడు.. అందుకు భిన్నంగా ఎలా అడగాలనే ఆలోచనతో కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. డబ్బులు పంచిపెడుతూ కాళ్లు సైతం మొక్కి ఓటు అభ్యర్థిస్తున్నారు. డబ్బులతో పాటు.. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం పరిపాటిగా మారింది. అయితే డబ్బులతో పాటు చిన్నా.. పెద్ద తేడా లేకుండా కాళ్లు మొక్కి ఓటు అడగడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సోమవారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే బుధవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఓటరును ప్రాధేయపడడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. కాగా, మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో ఓటుకు రూ.1,000 నుంచి రూ. 5వేల వరకు అభ్యర్థులు పంచుతున్నారు. డబ్బులు ఇవ్వడంతో పాటు కాళ్లు మొక్కడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. మహబూబాబాద్ పట్టణంలోని ఓ వార్డు అభ్యర్థి డబ్బులు ఇవ్వడంతో పాటు కుటుంబ పెద్దల కాళ్ల మీద పడి.. ఓటు వేస్తానని హామీ ఇస్తేనే కాళ్లు విడిచి పెడుతున్న సంఘటనపై చర్చ జరుగుతోంది. పోలింగ్కు రెండు రోజుల ముందుగానే డబ్బులు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల కోసం.. పట్టణాల్లో ఉన్న ఓటర్లతో పాటు.. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇతర అవసరాలకోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే వారి జాబితాను సిద్ధం చేసుకొని ఫోన్ చేసి ఓటు వేయడానికి రావాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి ట్రైన్ టికెట్లు బుక్ చేసి పంపారు. హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక వాహనాలు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది ఉన్నారు.. వారు ఉండే ప్రదేశానికి దగ్గరలో ఉన్న పాయింట్ను చెప్పి అందరూ అక్కడికి రావాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకేచోట ఉంటే వారికోసం కారుతో పాటు ప్రత్యేక మనిషిని పంపించి ఓటింగ్ రోజు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ‘ఇప్పటికే కార్లు సిద్ధం చేశాం.. మీకు ఎన్ని పనులు ఉన్నా.. ఆ ఒక్కరోజు సెలవు పెట్టుకోండి.. ఓటు వేసిన వెంటనే మళ్లీ మీ ఇంటికి పంపించే బాధ్యత మాదే’ అని ప్రాధేయపడుతున్నారు. -
నిర్భయంగా ఓటు వేయండి
మహబూబాబాద్ రూరల్/మహబూబాబాద్ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు పట్టణంలోని పలు వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడారు. కాగా, పట్టణంలోని శ్రీనివాస సెంటర్, నెహ్రూ సెంటర్, సాయిబాబా టెంపుల్ రోడ్, పత్తిపాక, బాబునాయక్ తండా ప్రా ంతాల్లో సుమారు వంద మంది పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మహబూబా బాద్ టౌన్, రూరల్ సర్కిల్, పోలీస్ హెడ్ క్వార్టర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో.. మానుకోట మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు గాంధీపురం, 5వ వార్డు అనంతారం, 10వ వార్డు వీరారం తండాలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు సర్వయ్య, మహేందర్రెడ్డి, ఆర్ఐలు అనిల్, నాగేశ్వర్రావు, ఎస్సైలు దీపిక, సతీష్, ప్రశాంత్, షాకీర్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, అరుణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసుల కవాతు.. డోర్నకల్: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం డోర్నకల్ పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. బైపాస్ రోడ్డు నుంచి ప్రధాన వీధులు మీదుగా కవాతు చేశారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. -
గులాబీ జెండా ఎగురవేయాలి
● రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ● మానుకోట మున్సిపల్ ఎన్నికల కార్నర్ మీటింగ్లో కేటీఆర్ మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డు జింకల జంక్షన్ నుంచి వివేకానంద సెంటర్ మీదుగా మదర్థెరిసా సెంటర్ వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. మానుకోటకు వస్తే తెలియని ఉత్సాహం వస్తుందని, లగచర్ల ఘటన సమయంలో ఇక్కడి నుంచే గర్జించడం జరిగిందన్నారు. రేవంత్రెడ్డి అమలు కాని హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ విషయంలో రైతులకు అన్యాయం చేశారన్నారు. మానుకోట జిల్లా చేసేది కాదని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, జిల్లా కావాలా వద్దా అన్నారు. జిల్లాల ఏర్పాటుతోనే కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల ఏర్పాటు జరిగి పాలన సులభతరమైందన్నారు. జి ల్లాలోని చిన్నగూడూరు ప్రాంతానికి చెందిన దాశరథిని సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అని మాట్లాడుతున్నారంటే ఆయనకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మూడు ఫీట్ల మనిషి సీఎం రేవంత్రెడ్డిని నమ్మి మోసపోవద్దన్నారు. రెండేళ్లలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని అన్నా రు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత మానుకోటకు మళ్లీ వస్తానన్నారు. కాగా, కేటీఆర్ రోడ్ షో కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపింది. కేసీఆర్ పాటకు కేటీఆర్, నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు ఊపుతూ నృత్యం చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్నాయక్, వినయ్భాస్కర్, నరేందర్, నాయకులు రామ్మోహన్రెడ్డి, ఫరీద్, మురళీధర్రెడ్డి, కెఎస్ఎన్రెడ్డి, నరేష్ పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం పరిష్కారం
మహబూబాబాద్ రూరల్: రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం మీడియేషన్ సెంటర్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు చెందిన దాచేపల్లి, అత్తలూరి కుటుంబాల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. దీంతో అత్తలూరి కుటుంబం దాచేపల్లి కుటుంబంపై మహబూబాబాద్ జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో వేర్వేరుగా 2017లో రెండు సివిల్ కేసులు దాఖలు చేశారు. ఈ రెండు కేసులు పెండింగ్లో ఉండగానే 2018లో దాచేపల్లి కుటుంబం జిల్లా కోర్టులో మరో సివిల్ కేసు దాఖ లు చేసింది. అప్పటి నుంచి మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ జనవరి 9న కోర్టు వాయిదా సందర్భంగా ఇరుపక్షాలతో మాట్లాడిన వివాదాన్ని మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపించారు. మూడు సివిల్ వివాదాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో మీడియేషన్ సెంటర్ కో ఆర్డినేటర్, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి న్యాయవాది వి.హరికృష్ణను మధ్యవర్తిగా నియమించారు. పలు దఫాలుగా న్యాయవాది హరికృష్ణ ఇరుపక్షాలతో మధ్యవర్తిత్వం నిర్వహించడంతో వివాదం రాజీమార్గంలో పరిష్కారమైంది. ఇరుపక్షాల న్యాయవాదులు కె.విజయభాస్కరరావు, పి.కృష్ణయ్య సమక్షంలో వారు మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రంపై సంతకాలు చేసి వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకున్నారు. -
రెడ్యా పాలనంతా అవినీతిమయమే..
● డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్డోర్నకల్: దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పని చేసిన రెడ్యానాయక్ పాలనంతా అవినీతిమయమేనని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం డోర్నకల్ బైపాస్ రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీసెంటర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ప్రస్టేషన్తోనే సీఎం రేవంత్రెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో రెడ్యానాయక్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇసుక, బెల్లం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రోత్సహించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీలోగా రైతు భరోసాకు సంబంధించి రూ.9 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్యాదవ్, పట్టణ అధ్యక్షులు సుమేర్చంద్జైన్ తదితరులు పాల్గొన్నారు. -
విలీనం.. అభివృద్ధికి దూరం
అంతర్గత రోడ్లు లేని బేతోలు గ్రామంసీసీరోడ్లు లేని రజాలిపేట గ్రామంమహబూబాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో సమస్యల తాండవం ఎనిమిదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని వైనం ఇరుకు గల్లీలు.. దెబ్బతిన్న రోడ్లు సైడ్ కాల్వలు లేక దుర్వాసన తీరని తాగునీటి సమస్యలుసాక్షి, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మహబూబాబాద్ 2011లో మున్సిపాలిటీగా ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం ఈదులుపూసపల్లి, గాంధీపురం, జమాండ్లపల్లి, బేతోలు, ముత్యాలమ్మగూడెం, శనిగపురం పరిసర గ్రామాలను మున్సిపాలిటీలో విలీన ం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యలు ఇలా.. మహబూబాబాద్ పట్టణం నుంచి కురవి వెళ్లే దారిలో బేతోలు గ్రామం ఉంది. ఇక్కడ 1,482 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. గామం ఎన్హెచ్ పక్కన ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మించారు. కానీ ఇప్పటి వరకు వైద్య సేవలు అందించడంలేదు. అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్య తీరుస్తామని చెప్పిన అధికారులు పైపులు వేశారే తప్ప నీటి సరఫరా చేయడం లేదు. బతుకమ్మ ఘాట్ లేక రోడ్డుమీదనే బతుకమ్మ అడే దుస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మానుకోట మున్సిపాలిటీలో రజాలిపేట గ్రామాన్ని కలిపా రు. 1,800 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేసే నాథుడే లేడు. సీసీ రోడ్లు లేక వర్షం వస్తే బురదలో నడవాల్సిన దుస్థితి. పక్కనే ఉన్న సలార్తండాకు తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ పట్టణం నుంచి తొర్రూరు వెళ్లే దారిలోని శనిగపురం గ్రామంలో ఏడేళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. గ్రామంలో పలు వీధుల్లో సీసీ రోడ్లు లేవు. డ్రెయినేజీ సమస్య ఉంది. గ్రామంలోని గడ్డమీది బజార్కు తాగునీటి కష్టాలు ఉన్నాయి. పన్నులు వసూలు చేస్తున్న అధికారులు సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నా రు. మున్సిపాలిటీలో విలీనమైన మరో గ్రామం ముత్యాలమ్మ గూడెం. ఈ గ్రామంలో శ్మశాన వాటిక లేదు. ఎవరైనా మృతిచెందితే రెండు కిలో మీటర్లు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయాలి. బస్సు స్టేజీ నుంచి గ్రామంలోకి వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. పన్నుల వసూళ్ల సమయంలోనే అధికారులకు ఈ గ్రామం గుర్తు కు వస్తుంది తప్ప.. సమస్యలు పరిష్కరించే నాథుడే లేడు. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో జమాండ్లపల్లి గ్రామం ఇతర గ్రామాలతో పోటీపడి అభివృద్ధి సాధించింది. మహబూ బాబాద్ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఈ గ్రామానికి గ్రహణం పట్టుకుంది. అంతర్గత సీసీ రోడ్లు లేవు. సైడ్ కాల్వల నిర్మాణం లేదు. పారిశుద్ధ్య పనులు చేయక దుర్గంధం వెదజల్లుతోంది. శ్మశాన వాటిక అంతంత మాత్రమే. పార్కు, ఇతర జిమ్ వంటి సౌకర్యాలకు నోచుకోలేదు. మహబూబాబాద్ నుంచి ఇల్లెందు వెళ్లే రహదారి పక్కనే గాంధీపురం గ్రామం ఉంది. ఇక్కడ స్వచ్ఛత కార్యక్రమాలు కనిపించవు. గ్రామంలో కొత్తగుడిసెలు, స్కూల్ బజార్లో సీసీ రోడ్లు లేవు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేవు. దీంతో చీకటి అయితే రోడ్డు మీద దిగిన మహిళలు భయం భయంగా గ్రామంలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. -
భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి
● ఆర్జేసీ మల్లెల రామకృష్ణారావు ● మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం దేవాలయంలో ఈ నెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఆ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ధార్మిక భావన కలిగిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, కాళిలింగాచారి పాల్గొన్నారు. -
నిబంధనలకు నీళ్లు
● ఇష్టారాజ్యంగా ఇటుక బట్టీల నిర్వహణ ● అధికారుల విచారణలో బహిర్గతంబయ్యారం: మండలంలో అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నారని ఓ వ్యక్తి హెచ్ఆర్సీలో ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం మండలంలోని కొత్తపేట, నామాలపాడు పంచాయతీల్లో ఏడుశాఖల అధికా రులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలో అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నారని 2022లో లింగగిరికి చెందిన నరేశ్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ, పొల్యూషన్, మైనింగ్, పరిశ్రమలు, గిరిజనశాఖకు చెందిన అధికారులు ఇటుకబట్టీలను సందర్శించారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం కొన్ని ఇటుకబట్టీల నిర్వహణ సాగడం లేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై అధికారులు తమ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విలేకరులకు తెలిపారు. విచారణలో డీఎల్పీఓ స్వరూప, పొల్యూషన్ అధికారి సుభాష్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణరెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎఫ్ఆర్ఓ సువర్చల, ఏఓ రాజు, ఏటీడీఓ భాస్కర్, డీఆర్వో రమేశ్, ఆర్ఐ సందీప్, పంచాయతీ కార్యదర్శి సంగీత పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే ఆగమే: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/మహబూబాబాద్/భూపాలపల్లి/గూడూరు: ‘అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాందీ, రాహుల్ గాందీల మీద ఒట్టేసి హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు అభివృద్ధి,సంక్షేమం గురించి నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అబద్దపు హామీలు, మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ ఆగమైతం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి డబ్బులకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పడంతోపాటు అనేక ఇతర హామీలిచ్చి నెరవేర్చలేని రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో కార్నర్ మీటింగ్ల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని రేవంత్రెడ్డి కేవలం కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరం కాదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్లో నిప్పు పెట్టి తగులబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తే..జిల్లాలు ఉండవు ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల మానుకోట, భూపాలపల్లిని జిల్లాలుగా మార్చారు. ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులను దగ్గర చేర్చారు.. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు తీసివేస్తారటా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాలుండవు.. ఏది కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. వెనకటి రోజులు తెస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజం చేస్తున్నారన్నారు. వెనకటి రోజులు అంటే యూరియా కోసం చెప్పుల క్యూ పెట్టడమా.. కరెంట్ లేని రాత్రులు గడపడమా.. అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, శంకర్నాయక్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాళ్లు గండ్ర జ్యోతి, మాలోతు కవిత, పాల్గొన్నారు. మరుగుజ్జుకు కేటీఆర్ ఆర్థిక హామీ.. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నర్సంపేట మీదుగా వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. భీరవెళ్లి భరత్ కుమార్రెడ్డి కోరిక మేరకు మార్గమధ్యలో గూడూరులోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో గల ఓ చాయ్ కొట్టు వద్ద ఆగారు. కేటీఆర్ చాయ్ తాగుతూ ఎదురుగా కనిపిస్తున్న ఓ చిన్న బాలుడి లాంటి వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అతడిని ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అని అడిగాడు. అక్కడే ఉన్న భరత్కుమార్రెడ్డి ‘సార్.. ఇతని పేరు ధారావత్ వినోద్కుమార్. 30ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు’అని చెప్పాడు. అది విన్న కేటీఆర్ ఏమైనా చిరువ్యాపారం చేసుకుంటావా? అని అతన్ని అడగ్గా, చేసుకుంటా సార్ అన్నాడు. భరత్కుమార్రెడ్డిని చూపుతూ ‘ఇతను నీకు తెలుసా’అని అడగ్గా తెల్సు సార్ అన్నాడు. వెంటనే ‘ఈయనకు రూ.2లక్షలు పంపిస్తా.. నీకు ఇస్తాడు. ఇంటి వద్ద ఏదైనా కిరాణం పెట్టుకో’అన్నాడు. -
ఓటు వేసిన ఎన్నికల సిబ్బంది
● 51 పోస్టల్ ఓట్లు పోల్ .. జనగామ: పురపోరులో భాగంగా జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో ఆదివారం పోస్టల్ ఓట్ల ప్రక్రియ కొనసాగింది. రెండు చోట్ల నామినేషన్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఓట్లు వేశారు. జనగామ మున్సిపల్ పరిధిలో 48, స్టేషన్ఘన్పూర్లో 3 ఓట్లు వేశారు. జనగామ మున్సిపల్ 4వ వార్డులో అత్యధికంగా 12 ఓట్లు పోల్ అయ్యాయి. కాగా, పోలింగ్ సామగ్రి, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. భద్రతాఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికల నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. -
సీఎం రేవంత్కు గుణపాఠం చెప్పాలి
● బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈమేరకు ఆదివారం మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి వివేకానంద చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి.. ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.65వేలు బాకీ పడ్డాడని, ఒక్కొక్క పెన్షన్దారుడికి రూ.65వేలు బాకీ పడ్డాడని విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఏమయ్యాయని, నిరుద్యోగ భృతి లేదన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇచ్చాకే, ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాకే ప్రచారానికి రావాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు నరహరి వేణుగోపాల్రెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, బొజ్జపల్లి సుభాశ్, పి.వెంకటేశ్వర్లు, ఐలోని అంజిరెడ్డి, ఇనుగాల యుగేంధర్రెడ్డి, మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ, అభ్యర్థులు పాలకుర్తి రాధికాసోమశేఖర్, వంగ వేణు, ఆమంచ నిర్మల, గట్టు స్వప్న, రాజారపు రజని, బూర్ల స్వాతి, కుమార్, రాజేందర్, సంపత్, దేవరాయ భాగ్య, గోనెల శిరీష, పొన్న రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేను కనిపిస్తున్నానా..
వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం పలు వార్డుల్లో ప్రచారం చేశారు. 7వ వార్డులో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అరూరి రమేశ్ మాట్లాడుతుండగా ఎర్రబెల్లి దయాకర్రావు అందరికీ కనిపించేలా కుర్చీ ఎక్కి నిలబడ్డారు. ఇది చూసిన కార్యకర్తలు ‘దయాకర్ సారు.. అందరికీ కనిపించేందుకు కుర్చీ ఎక్కాడు.. మీరు కూడా ఓట్లు వేసి మన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ కుర్చీ ఎక్కించాలి’ అనడంతో అందరూ నవ్వారు. – వర్ధన్నపేట -
76 ఏళ్లలో కూడా పురపోరుకు సై..
● మరిపెడ 11వ వార్డు అభ్యర్థిగా బాల్యనాయక్ పోటీ మరిపెడ : సాధారణంగా 70 ఏళ్ల వయసులో ప్రతీ ఒక్కరు కుటుంబంతో శేషజీవితం గడుపుతారు. మనువలు, మనువరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఏ బాధ, ఇతర ఆలోచనలు లేకుండా ఆనందంగా ఉంటారు. అయితే 76 ఏళ్ల వయసులోనూ ఓ వృద్ధుడు ప్రజాసేవకు సై అంటున్నాడు. యువ అభ్యర్థులతో పోటీ పడుతున్నాడు. అతడే దేశ్యాతండాకు చెందిన బానోత్ బాల్యనాయక్. మరిపెడ మున్సిపాలిటీ 11వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నాడు. ఈ సందర్భంగా యువ అభ్యర్థులకు దీటుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. గతంలో తన భార్య ఎంపీటీసీగా గెలుపొంది ప్రజాసేవ చేసిందని, తాను కూడా 11 వార్డు కౌన్సిలర్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొందేలా సేవ చేస్తానంటున్నాడు. కాగా, 76 ఏళ్ల బాల్యనాయక్ పట్టుదల, చురుకుదనం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కురవి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన శనివారం రాత్రి సీరోలు పీఎస్ పరిధిలోని చింతపల్లి శివారులో 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సాధు శ్రీను(47) బైక్పై మరిపెడ నుంచి కురవి వైపునకు వస్తున్నాడు. ఇదే సమయంలో చింతపల్లి నుంచి ఇదే గ్రామంలో ఉన్న క్రషర్ మిల్లు వైపునకు నడుచుకుంటూ నలుగురు కూలీలు వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను వెనుక నుంచి సునీల్ ఢీకొన్నాడు. దీంతో సునీల్ స్వల్ప గాయాలయ్యాయి. అలాగే, బైక్ కిందపడడంతో శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను అంబులెన్స్లో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ ఆదివారం తెలిపారు. లారీ కింద పడి కాటారంలో యువకుడు.. మల్హర్(కాటారం): లారీ కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండంలోని ఇప్పలపల్లికి చెందిన ఆత్మకూరి రాజయ్య(35) ఎరువులు కొనడానికి గారెపల్లికి వచ్చాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తాడిచర్ల నుంచి భూపాలపల్లి వెళ్తున్న బొగ్గు టిప్పర్ తగిలి టైర్ల కింద పడడంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై భార్య దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ● చింతపల్లి శివారులో ఘటన -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే మేడారంలోని వనదేవతలను దర్శించుకున్న భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయానికి క్యూ కట్టారు. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. -
కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
● పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ములుగు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతీ పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ములుగుకు మున్సిపాలిటీ హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ములుగులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తూ ములుగు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు వంగ సుమలత రవియాదవ్, యాసం వసంత రవికుమార్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, గండ్రకోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం.. -
లెఫ్ట్.. రైట్
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మున్సి పల్ ఎన్నికలు రోజుకో తీరు మ లుపు తిరుగుతున్నాయి. గత అసెంబ్లీ, పార్ల మెంట్ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన సీపీ ఐ ఇప్పుడు ప్రత్యర్థిగా మారింది. అప్పు డు మౌనంగా ఉన్న సీపీఎం నాయకులు ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నారు. కాగా, పొత్తు వికటించడంతో సీపీఐ తమ పంథాను మా ర్చుకొని బీఆర్ఎస్తో స్నేహపూర్వక పొత్తుకు అంగీ కారం కుదుర్చుకుంది. దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెరో వైపునకు చేరి ఎన్నికల బరిలో నిలిచాయి. వికటించిన పొత్తుతో చెరోవైపు.. మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచి కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల నాయకులు బహిరంగంగా ప్రకటించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో పొత్తు చెడిపోయింది. అయితే అసలు పొత్తు ఉంటుందో.. ఒంటరిగా పోటీ చేస్తుందని చర్చ జరిగిన సీపీఎం మాత్రం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంది. నాలుగు వార్డులు సీపీఎం అభ్యర్థులకు కేటాయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందనే ఆరోపణ చేస్తూ.. ఒంటరి పోరుకు సిద్ధమైన సీపీఐతో బీఆర్ఎస్ నాయకులు మంతనాలు జరిపారు. దీంతో ఆ పార్టీతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 18, 23వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం విరమించుకొని అక్కడ సీపీఐ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ప్రకటించారు. అదే విధంగా ఈ రెండు వార్డులు మినహా మిగిలిన చోట్ల సీపీఐ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఒకరు బీఆర్ఎస్తో, మరొకరు కాంగ్రెస్తో జతకట్టి ప్రచారం చేస్తున్నారు. లాభమెంత.., నష్టమెంత..? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులతో కలిసి పోటీకి దిగుతుందని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతో సీపీఐ, సీసీఎం మద్దతుతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం.. చైర్మన్ పీఠం దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు. అదే విధంగా ఎవరు కలిసి వచ్చినా.. రాకపోయినా.. ఐదు మున్సిపాలిటీలు మేమే గెల్చుకుంటామనే ప్యూహంతో బీఆర్ఎస్ ఉంది. అయితే ఎన్నికల ముందు, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్కు సీపీఐ జత కావడంతో అదనపు బలం వచ్చిందని.. దీంతో మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో సీపీఐ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు పడే అవకాశం ఉందని.. దీంతో సునాయసంగా ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఇరు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సీపీఐతో పొత్తు లేకపోయినా.. సీపీఎం కలిసిరావడం అదనపు బలమని, అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందని, దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు తమ ఖాతాలో చేరుతాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా ఇటు సీపీఐ మద్దతుతో ఉన్న బీఆర్ఎస్, అటు సీపీఎం మద్దతుతో పోటీలో ఉన్న కాంగ్రెస్ మాకే లాభం అంటే మాకే లాభం చేకూరుతుందని అంటున్నారు. అయితే చెడిన పొత్తులు ఏ పార్టీని చెడగొడుతాయో.. ఎవరికి లాభం చేకూరుస్తాయో.. ఓటర్లే నిర్ణయిస్తారని.. చివరకు ఏం జరుగుతుందో అనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఉభయ కమ్యూనిస్టులు చెరోదారి అప్పుడు మిత్రులు.. ఇప్పుడు ప్రత్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో వికటించిన సీపీఐ పొత్తు మిత్రభేదంతో లాభనష్టాలపై చర్చ -
ప్రచార పదనిసలు
● చిన్నారి చేతిలో పోస్టర్లు..పోలీసుల అదుపులో బైక్ దొంగలు?సంగెం: సంగెం పోలీసుల అదుపులో బైక్ దొంగలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 1వ తేదీన మండలంలోని కాపులకనిపర్తికి చెందిన నల్లతీగల ఉమాకర్ బైక్ను దొంగలు అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు 2వ తేదీన పీఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బైక్ కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ బైక్తో పాటు మరో పదికి పైగా ద్విచక్రవాహనాలను పట్టుకుని సుమారు 15 మందికి పైగా దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఒక బైక్ కోసం తీగ లాగితే డొంక కదిలినట్లు బైక్ దొంగల ముఠానే పట్టుబడినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటుపడిన వారిని పావులుగా వాడుకుంటూ ఖర్చుల కోసం రూ 2వేలు ఇస్తూ చోరీలు చేయిస్తున్నట్లు సమాచా రం. ఇలా ఇప్పటికే 20కి ౖపైగా బైక్ల ఆచూకీ లభించాయని, మరిన్ని లభించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. చిన్నారిపై లైంగిక దాడి● ఇద్దరు యువకులపై పోక్సో కేసు రేగొండ: చిన్నారిపై ఇద్దరు యువకులు లైంగికదాడి చేసిన అవమానవీయ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఓ చిన్నారి (8) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గణేశ్ అనే యువకుడు లైంగిక దాడి చేశాడు. అదేవిషయం వరుసకు సోదరుడైన శ్రీకాంత్కు చెప్పాడు. ఆదివారం చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ సైతం చిన్నారిపై లైంగికదాడి చేసినట్లు తెలిపారు. కాగా, సాయంత్రం అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా లైంగికదాడి విషయం బయటపడింది. పోలీస్స్టేషన్లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై రాజేశ్ తెలిపారు. ఖిలా వరంగల్: వరంగల్ కరీమాబాద్లోని నానామియ తోటలో రామగిరి ప్రతాప్ తన ఇంటి ఎదుట పార్క్ చేసిన పల్సర్ బైక్ చోరీకి గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోజువారీగానే ఈనెల 4న ప్రతాప్ తన ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసి రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు ఉదయాన్నే చూసేసరికి బైక్ కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. -
శిథిలావస్థలో వసతిగృహం
● దెబ్బతిన్న ఎస్సీ బాలికల హాస్టల్ భవనం ● ఒక పక్క కూలిపోయిన ప్రహరీ ● మరమ్మతులు చేయాలని డిమాండ్ గార్ల: మండల కేంద్రంలో 30ఏళ్ల క్రితం నిర్మించిన ఎస్సీ బాలికల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలంలో భవనం స్లాబు పెచ్చులూడిన చోట కురుస్తుండడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతిగృహంలో 50 మంది బాలికలు ఉంటూ స్థానిక బాలికోన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వర్షాకాలంలో హాస్టల్ భవనంలోని వరండా, కొన్ని గదులు కురుస్తున్నాయని బాలికలు పేర్కొన్నారు. వంటగది పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి తోడు హాస్టల్ ప్రహరీ సైతం ఒకపక్క కూలిపోవడంతో బాలికలకు రక్షణ కరువైంది. ఇప్పటికై నా సంబంధిత జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి హాస్టల్ భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థినుల సమస్యలు తీర్చాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలి
భూపాలపల్లిలోని కృష్ణకాలనీ, సుభాష్కాలనీల్లోని సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం పట్టాలు అందించాలి. కొత్తపల్లిగోరితో పాటు పలు గ్రామాల్లో రైతుల భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పట్టాలు అందించాలి. కొత్తపల్లిగోరి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల రైతులకు డీఎండీ 38 ద్వారా దేవాదుల నుంచి సాగు నీరు అందించాలి. సింగరేణి డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. – గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే -
మున్సిపాలిటీకి భారీగా నిధులు..
భూపాలపల్లి మున్సిపాలిటీకి రెండేళ్లలో రోడ్లు, డ్రెయిజీలు, కమ్యూనిటీహాల్, విద్యాభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరు చేశాం. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరినట్లు.. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. గణపసముద్రం, భీమ్ఘన్పూర్ చెరువు అభివృద్ధి, జూకల్, బూర్నపల్లి వద్ద ఇందిరాసాగర్ చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాం. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి చుక్క నీరు అందలేదు. సింగరేణి అభివృద్ధిపై సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులతో సమీక్షలు నిర్వహించాం. మెడికల్ బోర్డును ప్రారంభించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. – దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఐటీ శాఖ మంత్రి -
ఓటర్లు ఎవరి వైపు?
జనగామ: మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ జిల్లా వ్యా ప్తంగా రాజకీయ వేడి పెరుగుతోంది. ఓటర్లు ఎవరి వైపు ఉంటున్నారు? వారి మనస్తత్వం.. అభ్యర్థుల బలం.. బలహీనత.., పార్టీల గెలుపోటముల అవకాశాలు వంటి కీలక అంశాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ నిఘా వర్గాలు రోజు వారీగా సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ పార్టీల అంతర్గత లెక్కలు, ప్రచార వ్యూహాల్లోనూ ఈ నివేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఎవరి ప్రభావం ఎంత? జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో నిఘా అధికారులు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల మేనేజ్మెంటుతోపాటు సమగ్ర పరిశీలన చేస్తున్నారు. ఏ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారు? యువత ఏ పార్టీని ఎంచుకుంటుంది.. వృద్ధుల మెజార్టీ ఏ అభ్యర్థిని వరించబోతుంది.. అధికార పార్టీపై ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది.. ప్రధాన ప్రతిపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయి? అనే ప్రతీ అంశంపై విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న నాయకుల ప్రభావం ఏ స్థాయిలో ఉందో, వారిని ఎవరు సంప్రదిస్తున్నారో కూడా నిఘా యంత్రాంగం నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంపూర్ణ మెజార్టీ.. లేదంటే లాగుడే జనగామ మున్సిపల్ పరిధిలో చైర్మన్ పీఠంపై పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ 16 సీట్లు, స్టేషన్ ఘన్పూర్లో 10 సీట్లు గెలుచుకున్న వారికి ఆధిక్యం లభించనుంది. పూర్తి మెజారిటీ ఏ పార్టీకి దక్కుతుందో.. లేక మూడు ముక్కలాట పోటీ పరిస్థితి ఏర్పడుతుందో అన్న విషయంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. మెజార్టీ తక్కువ వస్తే స్వతంత్రుల మద్దతు కీలకమవుతుందన్న అంచనాలపై కూడా ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు. బీజేపీ మద్దతు ఎవరికి లభిస్తుంది.. ఇతర పార్టీల నుంచి విజయం సాధించే అవకాశమున్న అభ్యర్థులను ఏ పార్టీలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో అనే వివరాలను సూక్ష్మంగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవైనా అంతర్గత ఒప్పందాలు జ రుగుతున్నాయో వంటి వివరాలను సైతం ఇంటలిజెన్స్ నివేదికలో పొందుపరుచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిఘా వర్గాలు జనగామ,స్టేషన్ఘన్పూర్లోనే అడ్డా వేసి రోజువారీ రాజకీయ సమీకరణాల నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా పార్టీల్లో ప్రచార వ్యూహాలు మారుతున్నాయి. బలహీన వార్డుల్లో అభ్యర్థి గెలుపునకు చేపట్టబోయే కార్యాచరణ, మార్పులు, అసంతృప్తుల బుజ్జగింపు, మెరుగైన బలమైన వర్గాలను చేరదీసేలా ఈ నివేదికలు కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. పురపాలక ఎన్నికలు సాధారణంగా స్థానిక రాజకీయాల్లో కీలకమైనవి. ప్రజాభిప్రాయాలు వేగంగా మారే ఈ సమయంలో నిఘా అధికారుల నివేదికలు రాజకీయ పార్టీలకు ఏకకాలంలో హెచ్చరికగానూ, మార్గదర్శిగా కూడా మారుతున్నాయి. ఇకపై పోలింగ్ వరకు ఈ సమాచార సేకరణ మరింత తీవ్రం కానుందనే విషయం కూడా తెలిసింది. విజేతలపై స్వతంత్రుల ప్రభావం ఎంత! జనగామ, స్టేషన్లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ? సమగ్ర సమాచారం తెలుసుకుంటున్న నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ నివేదికలో పార్టీల వ్యూహాలు -
విలువలు పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలు వలు కూడా పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సూచించారు. యూత్ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో చిగురు కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ.. ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. -
మేడారంలో సండే సందడి..
వనదేవతల దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క,సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సందడితో మేడారం కళకళలాడింది. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దారిపొడవునా వాహనాలు.. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో సమ్మక్క ప్రధాన ద్వారం ద్వారా క్రమ పద్ధతిలో గద్దెలపైకి అనుమతించారు. గంటల తరబడి సమ్మక్క గద్దె వద్ద వేచి ఉండడంతో ఒత్తిడి పెరిగి చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు దారి పొడవునా వాహనాలు బారులుదీరాయి. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా. వనభోజనాల సందడి.. మహాజాతర విజయవంతంగా ముగియడంతోపాటు తిరుగువారం పండుగ కూడా పూర్తవడంతో ఆనవాయితీ ప్రకారం పూజారులు, వారి కుటుంబీకులు, గ్రామస్తులు వనభోజనాలకు తరలివెళ్లారు. ముందుగా గ్రామదేవతలకు డప్పుచప్పులతో పూజలు నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలోకి వనభోజనాలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి ఏర్పాటు చేసి మట్టితో తయారు చేసిన గద్దెలను పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించారు. సమ్మక్క,సారలమ్మతో పాటు ఇతర దేవుళ్లకు పూజలు చేసి చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం అడవిలో వంటా వార్పు చేసుకుని సహపంక్తి భోజనం చేశారు. కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు వనభోజనాలకు తరలివెళ్లిన పూజారులు -
ఏప్రిల్లో రెండో విడుత ఇళ్లు మంజూరు..
పదేళ్లు అధికారంలో ఉన్నవారు కనీసం ఏడాదికి వంద ఇళ్లు కూడా కట్టలేకపోయారు. మొదటి విడుతలో మా ప్రభుత్వం 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఏప్రిల్లో రెండో విడుత మంజూరు, మూడో దశలో ప్రతీ పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. పట్టణాల్లో స్థలాలు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వ్యవసాయ భూముల సర్వే నంబర్లు, సరిహద్దు వివాదాలు, భూములకు పట్టాల సమస్య పరిష్కరిస్తాం. – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి -
భూపాలపల్లికి రైల్వేలైన్కు కృషి
భూపాలపల్లికి రైల్వేలైన్, నవోదయ విద్యాలయం, సింగరేణి భద్రత పెంపు అంశాలపై కృషి చేస్తున్నాం. మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పని చేస్తుంది. వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. –కడియం కావ్య, వరంగల్ ఎంపీ -
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం యూనివర్సిటీలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ ఫలితాలు వెల్లడించారు. బీఎస్సీలో 66.01 శాతం, బీఏలో 60శాతం, బీకామ్లో 75.79శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్, పరీక్షల నర్సంపేట కళాశాల పరీక్షల నియంత్రణాధికారి ఎస్. కమలాకర్, అకడమిక్ కోఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి రాజీరు, అధ్యాపకులు భద్రు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టీ–20 మహిళా క్రికెట్ చాంపియన్ ఆతిథ్య వరంగల్
● రన్నరప్ మహబూబ్నగర్ వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా వారం రోజులు నిర్వహించిన అంతర్ జిల్లాల టీ–20 మహిళా క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానంలో జరిగిన ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో చివరి బంతి వరకు ఇరుజట్లు నువ్వా?నేనా? అన్నట్లు తలపడ్డాయి. ఇందులో వరంగల్ స్పిన్నర్ల ధాటికి మహబూబ్నగర్ ఓటమి చెందింది. ముగింపు కార్యక్రమానికి హెచ్సీఏ సెలెక్టర్ హర్శనారాయణ, కీర్తన ముఖ్య అతిథులుగా హాజరై విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకల్లో జిల్లా ఉపాధ్యక్షుడు నజీమొద్దీన్, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, బండారి ప్రభాకర్, సదానందయాదవ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పాఠ్యప్రణాళికల్లో విస్తృత మార్పులు చేయాలి
కేయూ క్యాంపస్: వివిధ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో విస్తృత మార్పులు చేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలో బోధన, పరిశోధనల నాణ్యతను మరింతగా మెరుగు పరిచేందుకు ఆ దిశగా పాఠ్యప్రణాళికలో విస్తృత సమకాలీన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం యూనివర్సిటీలోని అకడమిక్ కమిటీ హాల్లో సైన్స్ విభాగాల అధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సైన్స్ విభాగాల డీన్లతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం పెంపొందించాలన్నారు. అందుకనుగుణంగా సమాజ అవసరాలకు ఉపయోగపడేలా వివిధ కోర్సుల్లో సిలబస్ను మార్చాలన్నారు. 2026–2027 విద్యాసంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చేలా పాఠ్యప్రణాళికలను పునఃసిద్ధం చేయాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించారు. సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఐక్యూఏసీ డైరెక్టర్ ఎస్. నర్సింహాచారి, ‘అకుట్’ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి, స్టూడెంట్స్ ఆపైర్స్ డీన్ విభాగం మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
ప్రచార పదనిసలు
స్వేచ్ఛా కవాతు..మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకున్న ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా శనివారం వర్ధన్నపేట పట్టణంలో సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో జరిగిన కార్యక్రమాల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.50 కోట్లునిరసన ● పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిడి తెస్తున్నారు నెహ్రూసెంటర్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి 20వ వార్డులో పోటీ నుంచి తప్పుకునేలా బీఆర్ఎస్ నేతలు, మరికొంత మంది ఒత్తిడి తెస్తున్నారని 20 వార్డు స్వతంత్ర అభ్యర్థి బానోత్ స్వాతి మద్దతుదారు బానోత్ శంకర్ మేసీ్త్ర ఆరోపించారు. ఈ మేరకు శనివారం మద్దతుదారులతో కలిసి వార్డులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకొస్తున్న ప్రజా ఆదరణను చూసి తట్టుకోలేక, ప్రచారం చేయొద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. వార్డు ప్రజల ఆశీస్సులతో పోటీలోనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చచెప్పడంతో ప్రచారానికి వెళ్లారు. ● ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి హామీ స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చే కోటాతోపాటు అదనంగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తానని, మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ.50 కోట్లు వచ్చేలా సీఎం రేవంత్కు సిఫారసు చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హామీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు పేదల సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిందని, ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి స్టేషన్ఘన్పూర్, ఛాగల్లులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగా ప్రధాన దారులు కిటకిటలాడాయి. అనంతరం స్టేషన్ఘన్పూర్లో, ఛాగల్లులో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జన ప్రభంజనాన్ని చూస్తేనే వార్ వన్ సైడ్ అని తెలుస్తోందని, మున్సిపాలిటీలోని 18కి పద్దెనిమిది వార్డులను కాంగ్రెస్ గెలువబోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొర హయాం నడిచిందని, సొల్లు మాటలు చెప్పి ప్రజలను దగా చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందన్నారు. అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతోనే స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, బెలిదె వెంకన్న, అన్నం బ్రహ్మారెడ్డి, కనకం రమేష్, సత్యనారాయణ,సంపత్రాజ్, సుమతోపాటు ఆయా వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.– వర్ధన్నపేటబ్యాలెట్ బాక్స్ రెడీ.. పరకాల: మున్సిపల్ పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పరకాల మున్సిపల్ కార్యాలయంలో 44 బ్యాలెట్ బాక్స్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి సమక్షంలో సీల్ చేశారు. ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్కు బ్యాలెట్ బాక్స్లు తరలించనున్నారు. -
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఖిలా వరంగల్ : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 11, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతగా జరిగింది. నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో మొత్తం 2,486 మందికి 1,590 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 896 మంది గైర్హాజరయ్యారు. 11వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, 9వ తరగతి పరీక్ష ఉదయం 11.15 నుంచి1.45 గంటల వరకు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పూర్ణిమ తెలిపారు. 9వ తరగతికి 173 మంది బాలికలు, 373 మంది బాలురు హాజరుకాగా.. 11వ తరగతి పరీక్షకు 350 మంది బాలికలు, 694 మంది బాలురు హాజరైనట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగడానికి కృషి చేసిన జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహణ మొత్తం 2,486 మందికి 1,590 మంది హాజరు 896 మంది గైర్హాజరు -
వెలమలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి
హన్మకొండ: అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంటేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్కు వరకు ర్యాలీగా చేరుకుని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి.. వెలమ కులాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం తగదన్నారు. వెలమ జాతి మనస్సును గాయపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకులమర్రి ప్రవీణ్కుమార్, కోశాధికారి సిద్దూరి స్వామి రావు, ప్రతినిధులు బాలచందర్ రావు, తక్కళ్లపల్లి శ్యాంసుందర్ రావు, విద్యాసాగర్ రావు, పిన్నింటి వెంకటేశ్వరరావు, గుజ్జ గోపాల్ రావు, తక్కళ్లపల్లి అమృత రావు, తక్కళ్లపల్లి బుచ్చిబాబు రావు, మట్టపల్లి సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ఏఈఓలను సంప్రదించాలి
బయ్యారం: ఏజెన్సీలో ‘యాప్’సోపాలు అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన వార్తాకథనానికి వ్యవసాయశాఖాధికారులు స్పందించారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారి రాజు ప్రకటనను విడుదల చేశారు. మండలంలోని ఇర్సులాపురానికి చెందిన రైతుకు గార్ల మండలంలో భూమి ఉన్నందున ఇప్పటి వరకు యూరియా అందలేదని ఆ మండల అధికారులతో మాట్లాడి యూరియా అందిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో సెల్నెట్వర్క్ లేని గ్రామాల రైతులు ఏఈఓలను సంప్రదిస్తే యూరియాను బుక్ చేస్తారని తెలిపారు. టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి గార్ల: 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ ఆదేశించారు. స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించా లని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థుల కు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించా లని తెలిపారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. అ నంతరం ఆశ్రమ పాఠశాలలో నిర్మాణంలో ఉ న్న ఉపాధ్యాయుల క్వార్టర్స్ను పరిశీలించారు. పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి వెళ్లకుండా వార్డెన్ అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎం జోగయ్య, ఉపాధ్యాయులు మేగ్యానాయ క్, హనుమంతు, పీడీ పద్మ, ఉన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సీపీఐ పోరాటాలునెహ్రూసెంటర్: మున్సిపాలిటీ అభివృద్ధికి సీపీ ఐ అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో భారీ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐని గెలిపించడం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారానికి పోరాటాలు సాగిస్తూ, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మానుకోట మున్సిపాలిటీ ఎన్నికల కు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మె ల్యే మురళీనాయక్ ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపు కోసం కీలకపాత్ర పోషిస్తే పొత్తుల విషయంలో సీపీఐ గొంతుకోశారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీని వాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సహాయ కార్యదర్శి అజయ్సారథిరెడ్డి, పెరుగు కుమార్, నవీన్, శ్రీదేవి వెంకన్న, సంధ్య శ్రావణ్, యాకమ్మ, ఫాతిమా, పాండురంగాచారి, వెంకన్న, వీరన్న, శ్రావణ్ పాల్గొన్నారు. మెడికల్ షాపు యజమానిపై కేసు సాక్షి, మహబూబాబాద్: నిబంధనలకు విరుద్దంగా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపుపై పోలీస్, జిల్లా డ్రగ్స్ విభాగం అధికారులు ఉమ్మడిగా దాడులు నిర్వహించి మందులు స్వాధీనం చేసుకొని, షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం మరి పెడ పట్టణంలో చోటు చేసుకుంది. జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి తెలిపిన వివరాల ప్రకా రం.. మరిపెడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఖమ్మం పోలీసులకు పట్టుపడ్డారు. వారిని విచారించా రు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరిపెడ పట్టణంలోని శ్రీలక్ష్మీగణపతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్లో శుక్రవారం తనిఖీ చేశారు. ఈతనిఖీల్లో తెలంగాణ ఔషధ నియంత్రణ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ట్రమిడాల్ ఇంజక్షన్లు, ట్రమిడాల్ ట్యాబ్లెట్లు, ఆల్ఫాజోలం టాబ్లెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో మెడికల్ షాపు రికార్డులను స్వాధీనం చేసుకుని, మత్తు మందులను సీజ్ చేసి, షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
● అక్కా.. అభయహస్తం ఇవ్వు..
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు అక్రమ మద్యం కట్టడి చేయడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే మార్గాలపై పోలీస్ అధికారులు నిఘా పెట్టాలన్నారు. ఎవరైనా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పత్రాల పంపిణీ, పోలింగ్ రోజు, కౌంటింగ్ సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చేతన్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలి
● టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థులను చేర్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెంచాలని టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం తెలిపారు. శనివారం హనుమకొండ ములుగురోడ్డులోని హనుమకొండ(బి1)గురుకులంలో ఉమ్మడి జిల్లా ప్రిన్సి పాళ్లు, అడ్మిషన్ ఇన్చార్జ్లతో ఏర్పాటు చేసిన సమీ క్షలో ఆమె మాట్లాడారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయం దగ్గర పడుతున్న దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీఓఈలు ఉన్నాయని, వాటిలో కూడా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునేలా చూడాలన్నారు. -
సమష్టి కృషితో జాతర విజయవంతం
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి తో మేడారం జాతరను విజయవంతంగా ముగించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ, ఉద్యోగుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేడారం జాతరలో విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని సగర్వంగా చెప్పుతున్నానన్నారు. 2024లో జరిగిన జాతరను దృష్టిలో ఉంచుకొని అంతకంటే మెరుగైన సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు చేసి వెలుగుల మేడారం తీర్చిదిద్దామన్నారు. భక్తులందరికీ భరోసా కల్పిస్తూ అంతరాయాలు లేని విద్యుత్ అందించిన ఘనత టీజీ ఎన్పీడీసీఎల్కు దక్కుతుందన్నారు. విద్యుత్ అంతరాయాలు నివారించడానికి మొదటిసారిగా ప్రత్యేకంగా 33 కేవీ లైన్లో కవర్ కండక్టర్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే మినీ మేడారంలోగా అగ్రిక ల్చర్ సర్వీస్ లోడ్ బదలాయింపు చేస్తామన్నారు. అనంతరం మేడారంలో సేవలందించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, సురేందర్, శ్రవణ్ కుమార్, భూపాలపల్లి ఎస్ఈ మల్చూరు నాయక్, డీఈలు నాగేశ్వర రావు, సదానందం, జి.సాంబ రెడ్డి, భాస్కర్, దర్శన్ కుమార్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
ప్రలోభాలకు దూరంగా..
ఇండిపెండెంట్లే కీలకం !నా బాల్య వివాహం రద్దు చేయండిమహబూబాబాద్ రూరల్ : బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయినింగ్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న విస్తృత ప్రచారానికి బా ల్య వివాహానికి గురైన ఓ బాలిక స్పందించింది. తనకు జరిగిన బాల్యవివాహాన్ని రద్దు చేయించాల ని కోరుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయమూర్తి శనివారం ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వివరాలి లా ఉన్నాయి.. కురవి మండలానికి చెందిన ఒక బాలిక వివాహం హైదరాబాద్కు చెందిన ఓ యువకుడితో గత ఏడాది ఏప్రిల్ 25న జరిగింది. అత్తవారింట్లో బాలిక ముభావంగా ఉండటం గమనించిన యువకుడి తరఫు బంధువులు ఫిర్యాదు చేయగా రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ మండలి స్పందించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించింది. ఈనేపథ్యంలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ చేపట్టి న ప్రచారంతో బాల్యవివాహాన్ని కోర్టు ద్వారా రద్దు చేసుకోవాలని తెలుసుకున్న ఆ బాలిక తనకు న్యాయ సహాయం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి బాలికకు న్యాయసహాయం మంజూరుచేస్తూ న్యాయవాది బి.దేవిని న్యాయ సహాయ న్యాయవాదిగా నియమించారు. న్యాయవాది బాల్య వివా హ పూర్వపరాలు వివరిస్తూ జిల్లా న్యాయస్థానంలో కేసు దాఖలు చేయగా పరిశీలించిన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రతివాదులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మార్చి 26న కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయంసమాజహితానికి రెడ్ క్రాస్, రోటరీ సంస్థలు చేస్తు న్న సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టులో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పత్రికా విలేకరులతో న్యా య సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జడ్జితోపాటు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి మాట్లాడారు. నాణ్యమైన సేవలు అందించాలి మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి అర్జున్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించేవారికే ఓటుప్రజలకు అందుబాటులో ఉండేవారినే ఆదరిస్తాం.. ● సాక్షి చర్చావేదికలో మానుకోట ప్రముఖులు, ప్రజలుమహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీ 36 వార్డులతో 65,712 మంది ఓటర్లను కలిగి ఉంది. మహబూబాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేవారికే ఓటు వేసి ఆదరిస్తామంటున్నారు.. ప్రజలు. శనివారం ఉదయం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మద్యం, మనీకి దూరంగా నిజాయితీగా పనిచేసేవారికే తమ మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ఇంటి నంబర్లు ఇవ్వాలిజిల్లా కేంద్రంలని శివారు కాలనీలకు ఇంటి నంబర్లను ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. పట్టణంలోని వార్డుల అభివృద్ధికి ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక, మంగళకాలనీ వరకు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది పూర్తి చేయాలి. – జానీ, 34 వార్డు పత్తిపాక, మానుకోట రింగ్రోడ్డు నిర్మించాలిజిల్లా కేంద్రంలో సరైన రింగ్ రోడ్డు లేక భారీ వాహనాలు, గ్రానైట్ లారీలు రోడ్డులో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలి. ప్రధాన కూడలిలో భారీ వాహనాలు తిరగలేక ఇబ్బందిగా ఉంటుంది. రోడ్లు వెడల్పులు చేయాలి. నిజాయితీ పరులైన నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలి. – పెద్ది వెంకన్న, 17వ వార్డు, మానుకోట పనిచేయించుకోవడం బాధ్యత ఓటు వేయడం హక్కు.. గెలుపొందినవారితో పనిచేయించుకోవడం బాధ్యత. జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీసర్ల క్లబ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి. కూరగాయాల మార్కెట్ను నూతన సమీకృత మార్కెట్కు తరలించాలి. పాత బజారులో కూరగాయల మార్కెట్, మున్సిపాలిటీలో స్విమింగ్ ఫూల్ను ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్కు పార్కింగ్ సౌకర్యం ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. సిటిజన్ చార్జ్ ప్రకారం ప్రజలకు మున్సిపాలిటీ సేవలు అందించాలి. ప్రజలు ప్రలోభాలకు కాకుండా పని చేసే నితినీజాయితీగా ఉండే నాయకులకు ఓటు వేయాలి. – మైసా శ్రీనివాసులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కోకన్వీనర్కోతులను తరిమేయాలి 12వ వార్డులో కోతుల బెడద ఎక్కువగా ఉంది. మున్సిపల్ ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోతులు, కుక్కల బెడద నివారించడంతోపాటు వార్డులో సమస్యల లేకుండా చేయాలి. నిజాం చెరువు అలుగుతో ఈదులపూపల్లి రోడ్డులో ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాలి. – ఆకుల వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగి, 12 వార్డు కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలిపేదలకు అందుబాటులో ఉండేలా ప్రతీ వార్డులో ఒక ఫంక్షన్హాల్/ కమ్యూనిటీ ఏర్పాటు చేయాలి. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీపరులకు ఓటు వేస్తాం. – కోవ్వకుల బాలకృష్ణ పార్కులు నిర్మించాలిమానుకోట జిల్లా కేంద్రంలో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలకు సరైన ఆహ్లాదకరమైన గ్రీన్ పార్క్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచి వార్డులో చెత్తా చెదారం తొలగించాలి. ప్రతీ కాలనీలో మంచినీటి పైప్లైన్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలి. అంటువంటి నాయకులను మాత్రమే ఎన్నుకుంటాం. – మైస నాగయ్య, రిటైర్డ్ ఉద్యోగి, 27వ వార్డు గ్రంథాలయం ఏర్పాటు చేయాలిమానుకోట జిల్లా కేంద్రంలో ఒక గ్రంథాలయం ఉంది, పాత బజారులో గ్రంథాలయం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. వివేకానంద సెంటర్ నుంచి స్టేడియం వరకు నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలి. స్టేడియంలో మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ నిర్మించాలి. – జిలకర శ్రీహరి, 12 వార్డువార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దాలికౌన్సిలర్గా ఎన్నికయ్యేవారు ముందుగా వార్డు సమస్యలను తెలుసుకోవాలి. వార్డులో తాగునీరు, డ్రెయినేజీల సమస్యలను పరిష్కారించాలి. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దాలి. – మామిడాల సత్యనారాయణ, న్యాయవాది, మానుకోట శ్మశానవాటిక నిర్మించాలిమానుకోట మున్సిపాలిటి పరిధిలోని ఈదులపూసపల్లి 1వ వార్డుగా 2019లో మున్సిపల్లో విలీనమైంది. జీపీగా ఉన్నప్పుడు సర్పంచ్లే సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఇంత వరకు మా వార్డులో శ్మశానవాటిక లేదు. సీసీ రోడ్లు వేసి సమస్యలను పరిష్కరించే నాయకులనే ఎన్నుకుంటాం. – బుర్రగోవర్ధన్, ఈదులపూసపల్లి, మానుకోట పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలివర్షకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు వరదల ఇబ్బందిగా ఉంటుంది. 15వ వార్డులో సరైన డ్రెయినేజీలులేక ఆర్టీసీ కాలనీ వరద నీటితో మునిగిపోతుంది. వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించే నాయకులు, విద్యావంతులకు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేస్తాం. – పట్టాభి లక్ష్మయ్య, 15 వార్డు వార్డు కార్యాలయం నిర్మించాలి36 వార్డులో అంతర్గత డ్రెయినేజీలు నిర్మించాలి. జిల్లా కేంద్రంలో రెండో ఫ్లైవర్ నిర్మించాలి. రింగ్రోడ్డు ఏర్పాటు చేయాలి. ఖాళీ స్థలాల్లోని ముళ్ల పొదలను తొలగించి దోమల బెడద నివారించాలి. అన్ని హంగులతో వార్డు అభివృద్ధి చేసేవారినే ఎన్నుకుంటాం. ప్రతి వార్డులో వార్డు కార్యాలయం ఏర్పాటు చేస్తే ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది. – నామిరెడ్డి వెంకట్రెడ్డి, 13వ వార్డునేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఓ బాలిక వేడుకోలు స్పందించి నోటీసులు జారీ చేసిన జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
సోమన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. జాతరలో గుట్ట పరిసర ప్రాంతంలో అదనంగా 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, 15న జరగనున్న స్వామివారి కల్యాణ మహోత్సవానికి నిరంతరం విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ జాతర నిర్వహణకు 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయినున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల నుంచి సిబ్బందిని నియమిస్తామని డీఎల్పీఓ వెంకట్రెడ్డి తెలిపారు. అనంతరం జాతర వాల్పోస్టర్లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ సరస్వతి, ఎండీపీఓ వేదవతి, ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఏడీఈ శ్రీధర్రావు, ఏఈ రణధీర్, ఆర్టీసీ వరంగల్ –1 డిపో మేనేజర్ అర్పిత, సీఐ జానకీరాంరెడ్డి, డీఎంహెచ్ఓ అశోక్కుమార్, ఎకై ్సజ్ సీఐ సంతోష్రెడ్డి, ఎస్సై పవన్కుమార్, డాక్టర్ ఉష, అగ్నిమాపక అధికారి శ్రీరాములు, ఆర్అండ్బీ డీఈ కరుణాకర్, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి -
అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి
● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తొర్రూరు: కత్తి మాకు ఇస్తే యుద్ధభూమిలో నిలుస్తామని, వేరొకరికి అప్పగిస్తే ప్రయోజనం లేదని, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌ న్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొంగులేటి శనివారం రోడ్ షో నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్, అన్నారం రోడ్డులో నిర్వహించిన కార్నర్ మీ టింగ్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝా న్సీరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఇళ్లు కట్టిస్తామని, అభివృద్ధి మాతోనే జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని, అధికారంలో లేకున్నా ఉన్నామనే భ్రమలో ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తొర్రూరును దత్తత తీసుకున్నానని, ఎన్నికలు ముగియగానే పట్టణానికి ఫైర్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా మోసగించిందని, ప్రజా ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి ఏప్రిల్లో పేదలకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
డ్రగ్ కంట్రోల్ ఆకస్మిక తనిఖీలు.. మెడికల్ షాపులు సీజ్
సాక్షి హైదరాబాద్ : డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో అకస్మిక దాడులు నిర్వహించింది. నిషేదిత మందులు అమ్ముతున్న రెండు మెడికల్ షాపులను గుర్తించి వాటిని సీజ్ చేసింది.మహబూబాబాద్ జిల్లా, మారిపెడ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్ షాప్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన దాడులలో నిషేదిత మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి మందుల దుకాణం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమంగా వినియోగిస్తున్న మందులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా మెడికల్ షాపు నిర్వహించడం లేదని అదే విధంగా గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పాల్వంచలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ షాపులో డ్రగ్ లేబుల్ ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో స్టాక్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అధికారులు దాడులలో ట్రామాడోల్ ఇంజెక్షన్లు, మాత్రలు మరియు అల్ప్రజోలం మాత్రలను అధికారులు సీజ్ చేశారు. నిషేదిత మందులు అమ్మడం, లేబుల్ ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని దీనికి రెండేళ్ల దాక జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
అవ్వ మద్దతే కీలకం
సాక్షి, మహబూబాబాద్: మూలన ఉన్న ముసలమ్మను కూడా తక్కువ అంచనా వేయొద్దు అంటారు పెద్దలు. మున్సిపల్ వార్డు అభ్యర్థులు కొద్ది ఓట్ల తేడాతోనే గెలవడం లేదా ఓడిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఓటు కీలకమే. ఇందులో ప్రధానంగా వృద్ధులతో పాటు వితంతు, దివ్యాంగుల ఓట్లు గెలుపోటములను శాసించనున్నాయి. కాగా, ఆసరా పింఛన్దారుల మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు మాత్రం పింఛన్దారుల మద్దతు మాకే ఉంటుందంటే.. మాకే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు కీలకం.. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో ఆసరా పింఛన్దారులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత కార్మికులు, డయాలసిస్, ఒంటరి మహిళలు ఇలా అన్ని రకాల ఆసరా పింఛన్దారులు 14,992 మంది ఉన్నారు. వీరిలో ఒకటి, రెండు శాతం మినహా మిగిలిన వారందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరితోపాటు కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఐదు మున్సిపాలిటీల్లో 30వేలకు పైగా మంది ఉండే అవకాశం ఉంది. కావునా వార్డు సభ్యుల గెలుపులో వీరి ఓటు కీలకంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పింఛన్దారుల ఓట్లు మాకే పడతాయంటే.. మాకే వేస్తారనే ధీమాను అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ.. త్వరలో పింఛన్ రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అందుకోసమే శాసనసభ, పార్లమెంట్తోపాటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారి మద్దతు మాకే ఉంది. ప్రస్తుతం కూడా మాకే ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే పింఛన్ పెంచామని, పింఛన్దారుల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థులకే ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే వార్డుల్లో పింఛన్ ఇప్పించింది మేం.. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటున్నామని, అందుకోసం మాకే మద్దతు ఉంటుందని ఇతర పార్టీల అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతరులు మొత్తం మహబూబాబాద్ 2,860 1,147 3,427 234 138 7,806 డోర్నకల్ 286 201 710 50 06 1,253 కేసముద్రం 806 342 1103 87 27 2,365 మరిపెడ 620 264 810 71 42 1,807 తొర్రూరు 545 250 819 97 50 1,761 మొత్తం 5,117 2,204 6,869 539 263 14,992వృద్ధులు, దివ్యాంగుల ఓట్లపై దృష్టి ఐదు మున్సిపాలిటీల్లో సుమారు 15వేల మంది ఆసరా పింఛన్దారులు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక భూమిక ఓట్ల వేటలో అధికార, ప్రతిపక్ష పార్టీలుఎవరి ధీమా వారిదే.. -
పులి.. ఒకటా? రెండా?
● జనగామ జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట ● పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ● పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండడం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజ లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీ శాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజల అప్రమత్తతకు.. సూచనలు ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్దాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
ఏజెన్సీలో ‘యాప్’సోపాలు
బయ్యారం: యూరియా బుకింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్తో ఏజెన్సీ మండలాల్లోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో సాగు చేసిన పంటలకు భూమి పట్టాలు లేని రైతులు ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా తీసుకోని పరిస్థితి ఉంది. పాసుపుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే ఆన్లైన్లో యూరియా బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండడంతో.. పట్టాలు లేని రైతులు తమకు యూరియా ఎవరిస్తారని వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు షాపులకు యూరియా స్టాక్ కేటాయించిన నిమిషా ల్లోనే బుకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఏజెన్సీ మండలాల రైతులు సెల్ సిగ్నల్స్ సమస్యతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు. ఏజెన్సీ మండలాల్లో సిగ్నల్స్ సమస్య.. జిల్లాలోని బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో గిరిజన, గిరిజనేతర రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయా మండలాల్లో సుమారు 62వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంటను అధికంగా సాగు చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు యూరియా బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే ఏజెన్సీలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో రైతులు సకాలంలో బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. వారు ఏఈఓల ద్వారా బుక్ చేసుకోవచ్చు పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు తమ క్లస్టర్ ఏఈఓలను ఆధార్కార్డుతో పాటు ఆధార్కు అనుసంధానమైన ఫోన్ నంబర్తో సంప్రదించాలి. రైతుల వివరాలను ఏఈఓలు అప్లోడ్ చేస్తే ఆతర్వాత సంబంధిత రైతులు యూరియాను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో సెల్సిగ్నల్స్ లేక సకాలంలో యూరియాను బుక్ చేసుకోలేకపోతున్నామని పలువురు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. –రాజు, ఏఓ, బయ్యారం పలు మండలాల్లో అందుబాటులో లేని సెల్ఫోన్సిగ్నల్స్ ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుకింగ్ కోసం రైతుల పాట్లు పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారికి అందని బస్తాలు అన్నదాతలకు తప్పని కష్టాలు -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. స్థానిక నిర్మలా హైస్కూల్లో మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిసెప్షన్తో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, సిబ్బంది కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యాంప్రసాద్లాల్, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, సీఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు
మహబూబాబాద్ రూరల్: ఇటీవల పదోన్నతి పొందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు ఎస్పీ శబరీష్ను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీ.హెచ్.శ్రీనివాసరావు, పి.రాంబాబు, డీ.వెంకటేశ్వర్లు కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా ప దోన్నతి పొందారు. కాగా వారికి ఎస్పీ శబరీష్ శుభాకాంక్షలు తెలియజేసి, పోలీసు శాఖలో బాధ్యతలు మరింత నిబద్ధతతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వర్తించాలని సూచించారు. క్రమశిక్షణ, సేవాభావం, ప్రజల పట్ల స్నేహపూర్వక దృక్పథం కలిగి విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. సహాయక కేంద్రం ఏర్పాటు మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీడీసీలో పోస్టల్ బ్యాలెట్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు ఈనెల 7,8వ తేదీల్లో ఓటరు సహాయక కేంద్రంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ముగిసిన తిరుగువారం జాతర గంగారం: మండలంలోని పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం జాతర శుక్రవారం ముగి సింది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలు, డో లు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మూ డుోజుల పాటు జాతర నిర్వహించారు. భక్తుల మొక్కుల అనంతరం పగిడిద్దరాజు ప్రతిమలను దేవుని గుట్టకు చేర్చడంతో జాతర ముగిసింది. ప్రధాన పూజారులు పెనక రాజేశ్వర్, సురేందర్, పురుషోత్తం, సమ్మయ్య, రాహుల్ పాల్గొన్నారు. విద్యార్థుల క్షేత్ర సందర్శన మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం సైంటిస్ట్ ప్రశాంత్ కుమార్ మిరప, పసుపు పంటలపై అవగాహన కల్పించారు. 25 రకాల మామిడి, జామ మొక్కల్లో అంటుకట్టడం విధానాన్ని వివరించారు. ప్రధానోపాధ్యాయులు కె.గిరిజ, ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, సోమేశ్వర్, వెంకటేశ్వర్లు, దీపిక, రమాదేవి, వినోద్ పాల్గొన్నారు. ఖేలో ఇండియా జిల్లాస్థాయి క్రీడలు మహబూబాబాద్ అర్బన్: ఖేలో ఇండియా అథ్లెటిక్స్, కబడ్డీ, బాక్సింగ్ అండర్–14, 16బాలికల జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను ఆన్లైన్లో నేషనల్ స్పోర్ట్స్ రేపోసిటరీ సిస్టమ్లో నమోదు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి శుక్రవారం తెలిపారు. పూర్తి వివరాలకు 94406 30681 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. సీఓఈ కళాశాలల్లో ప్రవేశానికి రేపే గడువు న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) ఇంటర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి జంగా సతీశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలికలకు (హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డులోని టెమ్రిస్ వరంగల్–1 బాలికలు), బాలు రకు హనుమకొండ హంటర్ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలలో ఏర్పా టు చేసినట్లు తెలి పారు. అలాగే, జేఈఈ, నీట్, ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. -
అగ్రనేతలకు సవాలే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతి నిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్ లు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు.. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కు వ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపి ంచుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే.. ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకా శ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. ● వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధ్దన్నపేట ము న్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమే్శ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లులు ఇన్చార్జ్లుగా ఉన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. ● డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మె ల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. పుర పోరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. -
దళిత పక్షపాతి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
హన్మకొండ చౌరస్తా: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దళిత, బడుగు, బలహీన వ ర్గాల పక్షపాతి అని కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జి ల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బీ ఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చేస్తు న్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఎస్పీలో ఉన్నప్పుడు కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిచారని విమర్శించి, బీఆర్ఎస్లో చేరాక కాంగ్రెస్ పార్టీ బాంబులతో పేల్చిందనడం ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ద్వంద నీతికి నిదర్శనమన్నారు. దళితులను అవమానించారని ఎమ్మెల్యే నాయినిపై చేస్తున్న ప్రచారం లో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే దళితుల శ్మశాన వాటిక కోసం మూడెకరాల భూమిని కేటాయించిన ఘనత నాయినిదేనన్నారు. దళితులకు పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తే కేటీఆర్ను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఆరూరి సాంబయ్య, వినయ్, ఎర్ర మహేందర్, సంగీత్, సుధాకర్, శ్వేత, అనిల్, జగన్గౌడ్, రాజ్కుమార్, శ్యామ్, ఝాన్సీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ రామకృష్ణ -
ఉద్యమాల మానుకోట
సాక్షి, మహబూబాబాద్: ‘అటు ఓరుగల్లు.. ఇటు ఖమ్మం మెట్టు.. రెండింటికీ మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న మానుకోట అనేక ఉద్యమాలు, పోరా టాలకు సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలకు నెలవుగా విరాజిల్లింది. ఇదే క్రమంలో కాలానుగుణంగా వచ్చిన రాజకీయ, సామాజిక మార్పులతో గ్రామం నుంచి పట్టణంగా.. పంచాయతీగా ఆ తర్వాత పట్టణం నుంచి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన మహబూబాబాద్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. నిజాం కాలంలోనే తాలూకా.. . పురాతన చరిత్ర కలిగిన మానుకోట ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తాలూకాగా కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్స్ టౌన్ మున్సిపాలిటీగా ఏర్పడింది. తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1964లో తిరిగి గ్రామ పంచాయతీగా మారింది. వరంగల్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగిన మానుకోట పంచాయతీ 2011లో తిరిగి మున్సిపాలిటీగా మారింది. మారిన మానుకోట స్వరూపం.. తాలూకా కేంద్రంగా ఉంటూ.. చుట్టూరా వంద గ్రామాలకు కేంద్రంగా ఉన్న మానుకోట.. కాలానుగుణ మార్పులతో మహబూబాబాద్గా ఆవిర్భవించింది. సుమారు వెయ్యి జనాభాగా ఉన్న చిన్న గ్రామం నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం 65,712 మంది ఓటర్లు, లక్షకు పైగా జనాభాతో 36 వార్డులకు చేరింది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా 18 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో మహబూబాబాద్ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం మొదలైన కారణాలతో.. గడిచిన పదేళ్లలో మహబూబాబాద్ రెట్టింపుగా విస్తరించింది. పంచాయతీ సర్పంచ్లు..సంవత్సరం సర్పంచ్ పేరు 1964– 1970 కల్వల గోపాల్రావు 19971– 1981 లక్ష్మీనారాయణ(న్యాయవాది) 1981– 1995 గన్ శ్యాందాస్ ఝవార్ 1995– 2001 సాదుల శ్రీనివాస్ 2001– 2006 మలిగిరెడ్డి సుధాఅర్జున్రెడ్డి 2007– 2011 భూక్యా నెహ్రూనాయక్ మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత సంవత్సరం మున్సిపల్ చైర్మన్ 2014– 2019 భూక్య ఉమా మురళీనాయక్ 2020– 2025 పాల్వాయి రాంమోహన్ రెడ్డి స్వాతంత్య్ర కాలంలోనే తాలూకా మొదటి నుంచి చారిత్రక ప్రాంతంగా ఖ్యాతి -
3.300 కిలోల గంజాయి పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో రూ.1.70 లక్షల విలువైన 3.300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ మహేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన యువకుడు అరవింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ వద్ద గంజాయి విక్రయించేందుకు అరవింద్ వచ్చాడని తెలిపారు. ఈక్రమంలో నందమూరి నగర్ కాలనీకి చెందిన జమనగుంట్ల భువనచంద్ర అలియాస్ బాబు, ఇందిరా కాలనీకి చెందిన ఐలబోయిన నరేష్, హనుమాన్ దేవాలయం సమీప నివాసి, బాబా గుట్టకు చెందిన బోడ వంశీను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. గంజాయి విక్రయిదారుడు అరవింద్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. టౌన్ ఎస్సై షాకీర్ సంఘటన స్థలంలో విచారణ చేపట్టి రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గంజాయికి పంచనామా నిర్వహించారన్నారు. పీసీలు నాగరాజు, రఘురాం, గణపతి పాల్గొన్నారు. -
మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల వేతనాలు
వరంగల్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019లోని సెక్షన్ 41 ప్రకారం.. చైర్మన్, వైస్–చైర్మన్, వార్డు సభ్యులకు నిర్ణీత గౌరవ వేతనం, ఇతర అలవెన్సులు పొందే హక్కు ఉంటుంది. వీటిని సంబంధిత మున్సిపాలిటీల సాధారణ నిధులనుంచి చెల్లిస్తారు. వీటిని మూడు కేటగిరీలుగా విభజించారు. కార్పొరేషన్లకు(జీహెచ్ఎంసీతో కలిపి) మేయర్ రూ.65,000, డిప్యూటీ మేయర్కు రూ.32,500, కౌన్సిలర్కు రూ.7,800 వేతనం ఉంటుంది. కేటగిరీ – 2లో 50వేలకుపైగా జనాభా గల మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ చైర్మన్కు రూ.19,500, వైస్–చైర్మన్కు రూ.9,750, కౌన్సిలర్ రూ.4,550 ఉంటుంది. ఇక 50వేలలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలను మూడో కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలోని చైర్మన్కు రూ.15,600, వైస్ చైర్మన్కు రూ.6,500, కౌన్సిలర్కు రూ.3,250 వేతనం ఉంటుంది. ఈ మొత్తంలో గౌరవ వేతనంతోపాటు కన్వేయన్స్ అలవెన్స్ (రవాణా ఖర్చులు) కూడా ఉంటాయి. -
ప్రచార పదనిసలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను విభిన్నంగా పలకరిస్తూ వారి రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓట్లు అభ్యర్థిస్తున్న పలు చిత్రాలు పాఠకుల కోసం..● చిన్నారీ.. రేపటి ఓటు మాకేనా!● జొన్నరొట్టెలు చేసి... ఓట్లు అభ్యర్థించి..● లాలిస్తా.. పరిపాలిస్తా..!!● నీ ఓటు నాకే..! -
గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
హసన్పర్తి: బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి యాదవనగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. హైదరాబాద్లోని హఫీజ్ బాబానగర్, కంచన్ బాగ్, బండ్లగూడకు చెందిన మహ్మద్ మస్తాన్(18), హైదరాబాద్లోని ఉప్పుగూడకు చెందిన సోనూ అలియాస్ అనిల్(23)లతోపాటు మరో 13 మంది యువకులు వరంగల్ నగరంలో పైనాపిల్ వ్యాపారం చేస్తూ చింతగట్టు క్యాంప్ సమీపంలో డేరా వేసుకున్నారు. ఈనెల 3వ తేదీన మస్తాన్, సోనూతోపాటు రమేష్ పండ్ల వ్యర్థాలను పడేసేందుకు యాదవనగర్ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టకు చేరుకున్నారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకునేక్రమంలో సోనూ, మస్తాన్ కాల్వలో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో మస్తాన్ మృతదేహాన్ని వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద, సోనూ మృతదేహాన్ని నెక్కొండలోని ఎస్సారెస్పీలో కనుకొన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
కాంగ్రెస్తోనే ఘన్పూర్ అభివృద్ధి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1, 12, 13వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే శ్రీహరి శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఆయా వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుకు రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. దళితబంధు కోసం బంధువుల వద్దనే డబ్బులు తీసుకున్న నీచచరిత్ర మాజీ ఎమ్మెల్యే రాజయ్యది అని ఆరోపించారు. ఎస్సీ కాలనీకి రెండో విడతలో 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లు, శ్మశానవాటిక కోసం మూడు ఎకరాల భూమి అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు బంధువైన తాటికొండ దేవయ్యతోపాటు తాటికొండ నవీన్, తాటికొండ కుమార్, మాతంగి అశోక్, మాతంగి దేవయ్య ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 12వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోతికుమార్ పోటీ నుంచి తప్పుకుని కడియం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నరేందర్రెడ్డి, అభ్యర్థులు సింగపురం దయాకర్, తాటికొండ వినయ్కుమార్, గట్టు సంగీతరమేష్, నాయకులు ఎల్లయ్య, సతీష్, వెంకటయ్య, రమేష్, యాదగిరి, రాజయ్య, జగదీష్, రమేష్ పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే వేటే..!
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది అందరూ ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. నియమావళి ఇలా.. ● రాజకీయ పార్టీ, పోటీ చేసే అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితులను పెంచేందుకు ప్రయత్నించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దు. ● జాతి, మతం, కులం పేరుతో ఓట్లు అడగొద్దు. ● ఎన్నికల ప్రచారానికి దేవాలయాలు, మసీదులు, చర్చీలను వేదికలు చేసుకోవద్దు. ● పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు. ● విపక్ష పార్టీల అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయొద్దు. ● ఇంటి యజమానుల అనుమతి లేకుండా జెండాలు కట్టడం, గోడలపై పోస్టర్లు అతికించడం, ప్రచార రాతలు రాయడం చేయొద్దు. ● ప్రింటింగ్ ప్రెస్, పేరు, చిరునామా లేకుండా పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించొద్దు. ● ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీల నిర్వహణకు సంబంధిత అధికారి వద్ద అనుమతి తీసుకోవాలి. ● ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే లౌడ్ స్పీకర్లను వాడాలి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకి, వ్యక్తులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పనిచేయొద్దు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవే ట్ కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనొద్దు. ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వినియోగించొద్దు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను వినియోగించొద్దు. పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్ పాటించాలి -
సీఎం సభ హెలిపాడ్ ఏర్పాట్ల పరిశీలన
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు శివారులో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ పనులను శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. హెలిపాడ్ పరిసర ప్రాంతాల భద్రత, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్యకేంద్రాల ఏర్పాటు, అగ్నిమాక చర్యలు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని పటిష్ట భద్రతాచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం సభను విజయవంతం చేయాలని సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్ రావు, తదితరులు ఉన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి నర్మెట (తరిగొప్పుల): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీదేవి తెలిపిన వివరాలు.. తప్పిపోయిన బర్రె కోసం పొరుగు రైతుల వ్యవసాయ బావుల వద్ద వెతికే క్రమంలో మొక్కజొన్న చేనుకు అడవి పందుల నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇరుమల్ల బాపురాజు (38) మృతి చెందాడు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదుతో ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. బాపురాజుకు భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మేడారం రెండోరోజు ఆదాయం రూ.3,54,25,200
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో మేడారం సమ్మక్క సారక్క మహాజాతర హుండీల్లోని కానుకల లెక్కింపు రెండోరోజు కొనసాగింది. శుక్రవారం 160 హుండీల ద్వారా రూ.3,54,25,200 ఆదాయం సమకూరిందని మేడారం జాతర ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇందులో విదేశీ కరెన్సీ రూ.63,436 ఉందని తెలిపారు. రెండురోజుల్లో కలిపి రూ.6,04,53,636 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. ఇప్పటివరకు 285 హుండీల్లోని కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కంబోడియా, నేపాల్, మలేషియా, ఆరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. 160 హుండీల్లోని కానుకల లెక్కింపు -
ఫైనల్కు చేరిన మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా గత ఐదు రోజులుగా జరుగుతున్న అంతర్జిల్లాల టీ–20 మహిళల క్రికెట్ పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. వంగాలపల్లిలోని డబ్ల్యూసీఏ క్రీడా మైదానంలో శుక్రవారం మహబూబ్నగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో మహబూబ్నగర్ జట్టు 18 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఖమ్మం జట్టు 17 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా వరంగల్ 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 149 పరుగులను సాధించింది. ఆదిలాబాద్ జట్టు 102 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో నేడు(శనివారం) వరంగల్, మహబూబ్నగర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. తలపడనున్న వరంగల్, మహబూబ్నగర్ జట్టు -
స్టేషన్ @ 70
గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఘన్పూర్ ప్రస్తానం స్టేషన్ఘన్పూర్: మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న స్టేషన్ ఘన్పూర్ గతేడాది జనవరిలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ కల ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో ఎట్టకేలకు నెరవేరింది. ఘన్పూర్కు జంటపట్టణంగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ శివునిపల్లి, ఛాగల్లు గ్రామాలను కలిపి స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఘన చరిత్ర ఉన్నందున స్టేషన్ఘన్పూర్కు ఆపేరు వచ్చిందని, గతంలో ఇక్కడ పండిన సాంబ బియ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉండేదని, నిజాంకాలం నుంచే రైల్వేస్టేషన్ ఉండేందని స్థానికులు చెబుతుండగా.. పురాతన శివాలయం, రిజర్వాయర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక్కడి ప్రత్యేకలు. కాగా, మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలతో రాజకీయ పార్టీల నేతలు.. ఓటర్లు బిజీగా మారారు. ఇదిలా ఉండగా.. తొలి చైర్మన్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం ఏర్పడిన 1956 నుంచి పలువురు సర్పంచ్లుగా పనిచేసి స్టేషన్ఘన్పూర్ను అభివృద్ధిచేశారు. ఘన్పూర్ మొదటి సర్పంచ్గా కలకోట కృష్ణ్ణమాచార్యులు పనిచేయగా.. అనంతరం అంబటి రాఘవరాజు, చింతకుంట్ల నారాయణరెడ్డి, చింతకుంట్ల వెంకట్రెడ్డి, చింతకుంట్ల జనార్ధన్రెడ్డి, చింత బచ్చయ్య, గట్టు చేరాలు, నీరటి ప్రభాకర్, గట్టు రాజయ్య, గోనెల భద్రమ్మ, ఇల్లందుల ప్రతాప్, తాటికొండ సురేష్ పనిచేశారు. వీరిలో జనార్ధన్రెడ్డి 13 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. 1982లో అంజయ్య ప్రభుత్వం నుంచి సర్పంచ్కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కేవలం వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించి వార్డు సభ్యుల ద్వారా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేవారు. ప్రత్యక్ష సర్పంచ్ ఎన్నికల్లో మొదటి సర్పంచ్గా చింత బచ్చయ్య గెలిచి ఏడున్నర సంవత్సరాలు పదవిలో కొనసాగారు. మొదట కేవలం ఐదు, ఆరు వార్డులతో ఉన్న స్టేషన్ఘన్పూర్ గ్రామ పంచాయతీ గత ఏడాది వరకు 16 వార్డులుగా విస్తరించింది. అయితే ప్రస్తుతం స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి మున్సిపాలిటీ చేయగా మొత్తం 18 వార్డులుగా విభజించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ వివరాలు ఇలా.. విస్తీర్ణం 48.24 చదరపు కి.మీ. వార్డులు 18 జనాభా 30,527 ఓటర్లు 18,550 పురుషులు 8,913 మహిళలు 9,636 ఇతరులు 01 గృహాలు 7,408 సీసీ రోడ్లు 25.56 కి.మీ. డ్రెయినేజీలు 17.08 కి.మీ. స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు ప్రస్తుతం ఎన్నికల బిజీలో నాయకులు తొలి చైర్మన్ ఎవరని ప్రజల్లో ఆసక్తి -
ప్రచార పదనిసలు
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసి గుర్తులు కేటాయించడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. జనాల నుంచి ఓట్లను రాబట్టేందుకు వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయా మున్సిపాలిటీల్లో సాగిన ప్రచార ఒరవడికి సంబంధించిన పలు చిత్రాలు.. ● ఇసీ్త్ర చేస్తా.. అభివృద్ధి చేస్తా..● ఓటెయ్యాలని మమ్మీడాడీకి చెప్పమ్మా..● కూరగాయలు కొంటాం.. ఓటు వేయమ్మా● చాయ్ తీసుకోండి.. ఓటు వేయండి


