breaking news
Mahabubabad
-
410.24 మెట్రిక్ టన్నుల బియ్యం విక్రయం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్మహబూబాబాద్ రూరల్: డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి (జిల్లా ప్రధాన న్యాయమూర్తి)గా బాధ్యతలు స్వీకరించిన కె.మురళీమోహన్ను జిల్లా కోర్టులో కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భూముల సర్వే పారదర్శకంగా చేపట్టాలిదంతాలపల్లి: మండలంలో భూముల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దముప్పారం, కాలువపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న భూ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సర్వేలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సర్వే నిర్వహించిన తర్వాత హద్దులు పెట్టి రైతుల మధ్య బేదాభిప్రాయాలు లేకుండా చూడాలన్నారు. రైతుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్కుమార్, సర్వేయర్ నిత్యశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు ముగిసిన ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాల కోసం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మొత్తం 57 సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరైనట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. ప్రతిభ, మెరిట్ ఆధారంగా ఎంపికై న క్రీడాకారులకు త్వరలో సమాచారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీశ్రెడ్డి, దీపక్ ప్రసాద్, సుధాకర్ యాదవ్, సంతోష్చారి, రాజేశ్ పర్యవేక్షించారు. డీఎస్ఏ కోచ్లు రాయబారపు నవీన్కుమార్, కందికొండ రాజు, బొడ్డు విష్ణువర్ధన్, రాజారపు రమేశ్, కూరపాటి రమేశ్, ఓనపాకల శంకర్, మహ్మద్ అఫ్జల్, దేవిక, శ్రీమన్నారాయణ, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు మంచాల స్వామిచరణ్, కోడెం రాజలింగం, సాంబయ్య, సారంగపాణి, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, మహబూబాబాద్: వ్యాపారులు నిత్యం రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తులు అమ్మితే భద్రత ఉంటుందని నమ్మిన రైతులకు ఇక్కడ కూడా మోసమే జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే వారిని అధికారులు ప్రోత్సహించడం, వారిని నమ్మి పంటలను అమ్మిన రైతులకు డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వకుండానే వ్యాపారులు ఉడాయించిన సంఘటనలు ఉన్నాయి. మార్కెట్లకు రూ.20కోట్ల ఆదాయం రైతులు పండించిన పంటలకు సరైన ధర పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను ఏర్పాటు చేసింది. కాగా, జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్లలో ఎక్కువగా.. తొర్రూరు మార్కెట్లో తక్కువగా పంటలను అమ్ముకుంటారు. ఇలా జిల్లాలో సీజన్కు మూడు లక్షల బస్తాల మిర్చి, లక్ష క్వింటాళ్ల ధాన్యం, పదివేల క్వింటాళ్ల పత్తి, మరో నాలుగు వేల క్వింటాళ్ల మేరకు మొక్కజొన్నలు, అపరాల విక్రయాలు జరుగుతాయి. వీటిని మార్కెట్లో అమ్మినందుకు రైతుల నుంచి వసూళ్లు చేసే చార్జీలు, వ్యాపారుల నుంచి వచ్చే పన్నులు మొత్తం కలిపి సీజన్కు రూ. 20కోట్ల మేరకు ఆదాయం ఉంటుంది. నిబంధనలు గాలికి.. రైతులకు న్యాయం చేయాల్సిన మార్కెటింగ్ అధికారులు పలువురు వ్యాపారులతో కుమ్మకై ్క నిబంధనలను గాలికి వదులుతున్నారు. కాగా, వ్యాపారి కొనుగోలు చేసే పంటస్థాయిని బట్టి రూ.50వేల నుంచి రూ. 2లక్షల మేరకు ఎన్ఎస్సీ బాండ్స్ మార్కెట్కు అందచేసి లైసెన్స్ తీసుకోవాలి. ఈ సందర్భంగా ఈ–నామ్లో పొందుపరిచిన విధంగా రేటు నిర్ణయించడం, ఉత్పత్తులు కొనుగోలు రోజునే రైతులకు డబ్బులు చెల్లించాలి. లేదా అదే రోజు పేరిట చెక్కు రాసి ఇవ్వాలి. కానీ, జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్లలో మాత్రం అధికారులు చెప్పింది కాకుండా వ్యాపారులు చెప్పిందే పద్ధతి అన్నట్లు కొనసాగుతోంది. రైతుల ఉత్పత్తులు కొని వారాల తరబడి వాయిదా పెట్టడం, ధర విషయంలో కూడా వ్యాపారులు కుమ్మకై ్క రైతులను ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు ప్రతీ వ్యాపారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలను కొనుగోలు చేయాలి. ఈ– నామ్ విధానం ప్రకారం రేట్లు పెట్టాలి. అదే రోజు డబ్బులు ఇవ్వాలి. అలా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. లైసెన్స్లు రద్దు చేస్తాం. రైతులు కూడా పంటలు అమ్మిన వెంటనే డబ్బులు తీసుకోవాలి. ఇవ్వకుంటే ఫిర్యాదు చేయాలి. పంటలు కొని డబ్బులు ఇవ్వని వ్యాపారులపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్ అధికారిఅధికారులే బాధ్యత వహించాలిప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లో రైతులు ఉత్పత్తులు అమ్ముకుంటే వారికి ఇవ్వాల్సిన డబ్బులకు మార్కెట్ అధికారులే బాధ్యత వహించాలి. దళారులు రంగప్రవేశం చేసి ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటే గమనించాల్సిన అధికారులు మౌనంగా ఉండడం శోచనీయం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రైతులు మోసానికి గురికాకుండా చూడాలి. – నల్లపు సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడువాయిదా చెక్కులు ఇస్తున్నారు ఈ–నామ్ టెండర్ ద్వారా వ్యాపారులు మా సరుకులు కొనుగోలు చేస్తారు. కొనుగో లు చేసిన రోజునే మా అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయాలి. అలా కాకుండా వ్యాపారులు వాయిదా పద్ధతిలో చెక్కులు ఇస్తున్నారు. దీంతో తాము బ్యాంకుల చుట్టూ తిరగడం, ఒక్కొక్కసారి చెక్ బౌన్స్ అవుతుంది. మా చేతిలోకి డబ్బులు వచ్చేంత వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. – కముటం సురేందర్, రైతు, కేసముద్రం●వీరభద్రస్వామి ఆలయం● ముందుకు సాగని వీరభద్రస్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ ● రెండున్నర ఏళ్లయినా నిధుల మంజూరులో జాప్యంనమ్మకంతో మార్కెట్కు వచ్చిన రైతులు అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ఇష్టారాజ్యంతో ఆగం అవుతున్నారు. స్థాయికి మించిన ఉత్పత్తులు కొనుగోలు చేయడం, రైతులకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడం, వాయిదాలు పెట్టి రైతులను తిప్పించుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు వ్యాపారులు ఇచ్చే మామూళ్లతో మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో కేసముద్రం మార్కెట్లో పత్తి, ధాన్యం రైతులు, ప్రస్తుతం మహబూ బాబాద్ మార్కెట్లో మొక్కజొన్న, మిర్చి అమ్మిన రైతులకు సుమారుగా రూ.60లక్షల మేరకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు ఉడాయించి ఐపీ పెట్టిన సంఘటపై రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం ఇష్టారాజ్యంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు డబ్బుల ఎగవేతకు ప్రయత్నాలు.. రైతుల ఇబ్బందులు ప్రేక్షకపాత్రలో మార్కెటింగ్ అధికారులుమహబూబాబాద్: జిల్లాలో పలు ప్రాంతాల్లో వివిధ (6–ఏ)కేసుల్లో సీజ్ చేసిన 410.24 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఓపెన్ ఆక్షన్ ద్వారా విక్రయించనున్నట్లు డీసీఎస్ఓ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 31లోపు డీసీఎస్ఓ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1న అదనపు కలెక్టర్ చాంబర్లో టెండర్ విధానం ద్వారా ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తారన్నారు. రేషన్ డీలర్లు, పీడీఎస్ కేసుల్లో ఉన్నవారికి వేలంలో పాల్గొనేందుకు అర్హత లేదన్నారు. -
నయా పోలీస్!
రేపు, ఎల్లుండి ఉమ్మడి వరంగల్ పోలీస్ అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ సమావేశాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే దిశగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల పర్యటనలను ఉమ్మడి వరంగల్నుంచే ప్రారంభిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్, సాంకేతికత ఆధారిత నేర నియంత్రణ, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో నేరుగా చర్చించేందుకు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పోలీసింగ్ పరిస్థితి, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. వరంగల్నుంచే శ్రీకారం... డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్ ఆకస్మిక తనిఖీలు, కార్యక్రమాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలను వేదికగా ఎంచుకోవడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలతో ఇదే తరహా సమావేశాలు నిర్వహించే కార్యక్రమానికి ఇదే నాంది కానుందని తెలుస్తోంది. మూడు విడతల్లో సమావేశాలు.. ఈ నెల 30న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి(వరంగల్, హనుమకొండ, జనగామ)లోని అధికారులతో డీజీపీ సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. 31న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. గోప్యంగా ఏర్పాట్లు.. డీజీపీ పర్యటన షెడ్యూల్ను పోలీస్శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సమావేశాల్లో పాల్గొనే అధికారులకు మాత్రమే అంతర్గతంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భద్రత, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పరిమిత స్థాయిలోనే చేపడుతున్నారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే పోలీసింగ్, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం విని యోగం, జవాబుదారీతనం పెంపు, సిబ్బంది సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్పై దిశానిర్దేశానికి ప్రణాళిక వరంగల్ నుంచే డీజీపీ శ్రీకారం..రికార్డులతో సిద్ధమవుతున్న అధికారులు.. డీజీపీ సమీక్ష నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు జిల్లాల వారీగా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో గత ఏడాదినుంచి నమోదైన కేసులు, వాటి పరిష్కారం, పెండింగ్ దర్యాప్తులు, కోర్టు విచారణలు, శిక్షలశాతం, బైండోవర్ కేసులు, రౌడీషీటర్ల హిస్టరీ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని డీజీపీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. -
షాక్ ఇస్తున్న కరెంట్ బిల్లులు
హన్మకొండ: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతోపాటు ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు విద్యుత్ ఉపకరణాల కోసం విద్యుత్ను విరివిగా వాడుతోండడంతో బిల్లులు షాకిస్తున్నాయి. వర్షాకాలంలోనూ వేసవి నాటి బిల్లులు వస్తుండడంతో విద్యుత్ వినియోగదారులు మొత్తుకుంటున్నారు. కాలచక్రం మారుతున్నా వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. వేడి వాతావరణం నెలకొని ఉండడంతో గృహాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల్లోను ఏసీలు, కూలర్లు వేసవికి దీటుగా వినియోగిస్తున్నారు. దీంతో వేసవిలో మాదిరిగానే విద్యుత్ విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. సీజన్ మారినా తగ్గని విద్యుత్ వినియోగం! వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు భారీ వర్షం కురువకపోవడం, వాతావరణం చల్లబడకపోవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గలేదు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎల్టీ కేటగిరిలో 19,05,034 వినియోగదారులు ఉండగా, ఇందులో 12,89,903 మంది గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు 1,62,936 మంది, పరిశ్రమలు 12,018, కుటీర పరిశ్రమలు 2,288, వీధి దీపాలు 21,437, సాధారణం 9,275, తాత్కాలిక వినియోగదారులు 2,714, ఈవీ చార్జింగ్ సర్వీస్లు 58 ఉన్నాయి. 2026 జనవరిలో టీజీ ఎన్పీడీసీఎల్ మొత్తం బిల్లింగ్ (డిమాండ్)రూ.921.08 కోట్లు కాగా జూన్లో రూ.1,156.63 కోట్లు, జూలైలో రూ.1,028,82 కోట్లు బిల్లింగ్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026 జనవరిలో రూ.177.41 కోట్లు కాగా జూన్లో రూ.253.68 కోట్లు, జూలైలో రూ.241.74 కోట్ల బిల్లింగ్ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనవరితో చూసుకుంటే జూన్ నాటికి రూ.76.27 కోట్ల బిల్లింగ్ పెరిగింది. జనవరితో పోల్చుకుంటే జూలైలో రూ.64.33 కోట్లు పెరిగింది. జూన్తో చూసుకుంటే జూలైలో రూ.11.94 కోట్లు తగ్గినా జనవరితో చూసుకుంటే విద్యుత్ బిల్లులు పెరిగాయి.ఎల్నినో ప్రభావంతో తగ్గని ఉష్ణోగ్రతలు నేటికీ కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం! వానాకాలంలోనూ వేసవినాటి బిల్లులు పెరిగిన విద్యుత్ వినియోగం ఉమ్మడి వరంగల్ జిల్లా జనవరి బిల్లింగ్ రూ.177.41 కోట్లు జూలైలో రూ.241.68 కోట్లు బిల్లింగ్ -
వక్ఫ్ భూములను పరిరక్షించాలి
న్యూశాయంపేట: వక్ఫ్ భూముల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సాక్షి దినపత్రికలో శనివారం ‘వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువు.. అన్యాక్రాంతం అవుతున్న ఆస్తులు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. జిల్లాలో వక్ఫ్ భూముల పరిరక్షణ, ఆక్రమణలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ కమిటీ, సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని వక్ఫ్ ఆస్తులు, పరిరక్షణ పెండింగ్లో ఉన్న అంశాలు, భూముల, రికార్డుల నిర్వహణ, ఆక్రమణల నివారణ శాఖల మధ్య సమన్వయంపై సమీక్షించారు. భూములకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) వై.వి.గణేష్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి రమేష్, సర్వే అండ్ ల్యాండ్స్ అధికారి శ్రీనివాసులు, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, ఆడిటర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారద -
నీటి వసతి ఆధారంగా పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు నీటి వసతి ఆధారంగా పంటలు వేసుకోవాలని, ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్వహించిన 100వ రైతు నేస్తం కార్యక్రమాన్ని మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ద్వారా రైతులు, వ్యవసాయ అధికారులు మంగళవారం వీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతుందని, వరికి బదులు ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసర, మినుములు, కూరగాయలు సాగు చేయాలని కోరారు. జిల్లాలోని జయ్యారం గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్న రైతు వల్లూరి కృష్ణారెడ్డి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఉత్తమ రైతులు, ఏఈఓలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ టెక్నికల్ రాంజీ, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి రిమాండ్
వర్ధన్నపేట: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు తెలిపారు. మంగళవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్.. జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. భాస్కర్ ఈ నెల 26న మధ్యాహ్నం గ్రామంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక కోసం తల్లి వెతుకుతూ భాస్కర్ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ చిన్నారి ఉంది. అక్కడ జరిగిన ఘటనను ఆ చిన్నారి తన తల్లికి వివరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఉపాధ్యాయుడు భాస్కర్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. బాలికకు సీకేఎంలో వైద్య పరీక్షలు కాశిబుగ్గ: బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సమాచారం. మహిళా ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది. పాముకాటుతో బాలుడి మృతి మల్హర్: పాముకాటుతో ఓ బాలుడు మృతిచెందన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై మహేందర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిచర్ల గ్రామానికి చెందిన రిజ్వాన్(16) మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పాముకాటుకు గురయ్యాడు. గమనించిన ఇంటి పక్కన బంధువులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో రిజ్వాన్ మృతిచెందాడు. తండ్రి అక్బర్ అనారోగ్యంతో కొన్ని రోజులుగా భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అతని వెంట భార్య ఉంటుంది. కాగా కుమారుడు రిజ్వాన్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్న సమయంలో పాముకాటుతో ప్రమాదానికి గురయ్యాడు. తండ్రి అక్బర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతిపలిమెల : నీట్లో తక్కువ మార్కులొచ్చాయని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థి ని చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగె కృష్ణవేణి (18) ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మంగళవారం మరణించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై తమకు సాయంత్రం 7 గంటల వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
పెండింగ్ పనులకు ఆమోదం తెలపండి
హన్మకొండ చౌరస్తా/ధర్మసాగర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కీలక రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడంతోపాటు జాతీయ రహదారిపై అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. హనుమకొండ జిల్లాలోని కరుణాపురం నుంచి పెద్ద పెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్ మండల హెడ్క్వార్టర్, దేవునూర్, సోమదేవరపల్లి, దామెర, ఎల్కతుర్తి మండల హెడ్క్వార్టర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించి బలోపేతం చేయాలని కోరారు. ప్రధానంగా ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిద్దిపేటకు వెళ్లే వాహనాలు వరంగల్ వెళ్లే అవసరం లేకుండా 163, 563 జాతీయ రహదారులను అనుసంధానించే కీలక మార్గమని తెలిపారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని అభివృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్–163) నాలుగు లైన్ల విస్తరణ సమయంలో పలు గ్రామాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను పూర్తి చేయాలని కోరారు. సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ అనుసంధానం లేకపోవడంతో స్థానిక ప్రజలు ప్రధాన రహదారినే వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలతోపాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని వివరించారు. అవసరమైన భూమి ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మిగిలిన లింకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరారు. నర్సంపేట–నందిగామ రహదారి విస్తరణ, భట్టుపల్లి–హంటర్ రోడ్ మార్గ అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి త్వరగా ఆమోదం తెలపాలని కోరగా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
17 విద్యుత్ మోటార్ల చోరీ
సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా చోరీకి గురవుతున్న విద్యుత్ మోటార్ల కేసులను సంగెం పోలీసులు చేధించినట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. సంగెం పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈ నెల 22వ తేదీ రాత్రి ముగ్గురి ఇళ్లల్లో సంపుల్లోని మూడు విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిచారని బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తులో భాగంగా రామచంద్రాపురంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడి కదలికలను స్పష్టంగా గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ, నిఘాతో నిందితుడిని గుర్తించారు. ఈక్రమంలో మండలంలోని కాపులకనిపర్తి గ్రామంలో మంగళవారం వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు మోటార్లను తీసుకుని సైకిల్పై వెళ్తున్న జనగామ జిల్లా జఫర్గడ్ మండలం గరిమిళ్లపల్లి గ్రామానికి చెందిన పిడుగు యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా సంగెం మండలంలోని రామచంద్రాపురంలో 3, కాట్రపల్లిలో 3, సంగెం ప్రభుత్వ ఆస్పత్రిలో 2, గాంధీనగర్లో 1, ఆశాలపల్లిలో ఒకటితోపాటు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నెలులో 2, సింగారంలో 5 మోటార్లను వరుసగా చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి ఇంటి నుంచి మరో 15 మోటార్లు మొత్తం 17 మోటార్లను స్వాధీనం చేసుకుని నిందితుడు యాదగిరిని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నేరం జరిగినపుడు వెంటనే నిందితులను పట్టుకోవడానికి దోహదం చేస్తాయన్నారు. నిందితుడి అరెస్టు, మోటార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన పర్వతగిరి సీఐ రాజగోపాల్ -
అభివృద్ధిపై నీలినీడలు
కురవి: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కురవి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ రూ.5కోట్ల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో మొత్తం పనులు పూర్తికాలేదు. ఆ నిధులతో చేపట్టాల్సిన కొన్ని పనులు నేటికీ మొదలు కాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఆలయ అభివృద్ధికి నయాపైసా విడుదల చేయలేదు. కొంత మంది భక్తులు లక్షలాది నిధులు వెచ్చించి సొంతంగా కొంత మేర అభివృద్ధి చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం వీరభద్రుడికి ఆదరణ కరువైంది. ముందుకు సాగని మాస్టర్ ప్లాన్.! కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఆలయ ఈఓ సత్యనారాయణ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. రూ.50 కోట్లతో ప్లాన్ తయారు చేసి సిద్ధం చేశారు. భక్తుల సాయంతో పనులు చేసేందుకు సిద్ధమైన తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడంతో చైర్మన్గా కొర్ను రవీందర్రెడ్డిని ఎంపిక చేశారు. చైర్మన్తో పాటు సభ్యులు ఆ మాస్టర్ ప్లాన్ను తీసుకుని డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ జాటోత్ రాంచంద్రునాయక్ సహకారంతో ఈ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి వద్దకు వెళ్లారు. ప్లాన్ను ఆయన సీఎం రేవంత్రెడ్డికి చూపించి ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేలా చేస్తానని పాలకమండలికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయోనని భక్తులు ఎదురుచూస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని దామరంచపల్లిలో మంగళవారం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరంచపల్లి గ్రామానికి చెందిన కాడపాక సాగర్ (34) తన పొలం వద్ద మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాగర్ భార్య మధుశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్సై హేమ తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నల్లబెల్లిలో ఆశ కార్యకర్త.. నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలో విద్యుత్షాక్తో ఆశ వర్కర్ బర్తిపాక లక్ష్మి (37) మంగళవారం మృతి చెందారు. ఎస్సై సాయి ప్రసన్న కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన గద్దె మహేందర్ సోదరి బర్తిపాక లక్ష్మి ఆశ వర్కర్గా విధులు నిర్వహిస్తోంది. కొంతకాలంగా ఆమె తన అన్న మహేందర్ ఇంట్లోనే నివసిస్తుంది. మంగళవారం స్నానం చేసిన అనంతరం బాత్రూమ్లో దుస్తులు వేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తాకడంతో విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలో ఓ రైతు, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఆశ కార్యకర్త మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. -
సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించాలి
● ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య హసన్పర్తి: భవిష్యత్ ప్రపంచాన్ని మలుపు తిప్పే సాంకేతికతగా కృత్రిమ మేధస్సు మారిందని, అందుకు పరిశోధకులు నైతిక విలువలతో కూడినసాంకేతిక పరిష్కారాలపై దృష్టిసారించాలని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవిఅప్పయ్య అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ఐఈఈఈ సహకారంతో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 7వ అంతర్జాతీయ స్మార్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్వెంటివ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్(ఐసీఎస్ఎఓస్ ఐటీ –2026) మంగళవారం ఎస్సార్ ఐఎక్స్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రవి అప్పయ్య మాట్లాడారు. అంతర్జాతీయ విద్యాసహకారాన్ని ప్రోత్సహించడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ సదస్సుల ద్వారా పరిశోధనకులు, విద్యార్థులు పరిశ్రమ నిపుణుల మధ్య విలువైన భాగస్వామ్యాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ రవిచందర్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు, స్మార్ట్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు తమ పరిశోధనలను పంచుకునే అంతర్జాతీయ వేదికగా ఐసీఎస్ఎఓస్ ఐటీ రూపుదిద్దుకుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మహేష్, ప్రొఫెసర్ శశికళ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట మీదుగా 28 రైళ్ల సర్వీస్లు
● ఆగస్టు 8 నుంచి పొడిగింపు అమలు కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాట్నా– చర్లపల్లి మధ్య 14, చర్లపల్లి– పాట్నా మధ్య 14 రైళ్ల సర్వీస్లుగా పొడిగిస్తూ నడిపిస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాట్నా– చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 14 సర్వీస్లుగా, చర్లపల్లి–పాట్నా (03254) వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు 7 సర్వీస్లుగా, చర్లపల్లి–పట్నా (03255) వెళ్లే ఎక్స్ప్రెస్ ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు 7 సర్వీస్లుగా ప్రయాణిస్తూ కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుందని సీపీఆర్వో తెలిపారు. 3 ఏసీ, 3 ఏసీ ఎకనామి, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు దక్షిణ మధ్య రైల్వే, మధ్య రైల్వే పరిధిలో చర్లపల్లి–పాట్నా మధ్య కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగపూర్ స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
● డీఏఓ విజయచంద్ర మహబూబాబాద్ రూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఏఓ విజయచంద్ర సూచించారు. మానుకోట పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు, విత్తన మేళాలో డీఏఓ మాట్లాడారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతుందని, రైతులు పంట మార్పిడి చేయాలన్నారు. మినుములు, పెసర, కందులు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న కూరగాయల సాగు, సబ్సిడీ వివరాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ టెక్నికల్ రాంజీ, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
దాడికి దారితీసిన వివాహేతర సంబంధం
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో వివాహహేతర సంబంధం కారణంగా జరిగిన ఘర్షణ చివరికి కత్తుల దాడికి దారితీసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై దూలం పవన్కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరవెన్ను గ్రామానికి చెందిన కొడిశాల అజయ్ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గతంలో పలుమార్లు ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తతోపాటు గ్రామానికి చెందిన గాదరి హరికృష్ణ, మాచర్ల కాంత్రి, జఫర్గడ్ మండలం తిమ్మంపేటకు చెందిన పులి వర్ధన్, చందు, వరుణ్, లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ఆనంద్లతో కలిసి సోమవారం అర్ధరాతి కొడిశాల అజయ్ ఇంటికి వెళ్లారు. మాట్లాడుతుండగా ఒకరు అజయ్పై కత్తితో దాడి చేయడంతో అదే కత్తిని గుంజుకొని అజయ్ ఆరుగురిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో పులి వర్ధన్, చందుకు తీవ్రగాయాలు కాగా గాదరి హరికృష్ణ, మాచర్ల కాంత్రి, వరుణ్, ఆనందర్కు స్పల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయలైన క్షతగాత్రులను వెంటనే హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు గాదరి హరికృష్ణ తండ్రి గాదరి సోమయ్య ఫిర్యాదు మేరకు అజయ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. అజయ్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పరస్పరం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వివాహిత మహిళలే టార్గెట్..! కత్తుల దాడి ఘటనలో ప్రధానంగా వినిపిస్తున్న కొడిశాల అజయ్ పై గతంలో ఓ మహిళను తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి దేవరుప్పుల పోలీస్ సేష్టన్లో కేసు నమోదైనట్లు స్థానికులు తెలిపారు. అతనికి గతంలో వివాహం కాగా అనారోగ్యంతో భార్య మృతి చెందినట్లు తెలిపారు. కత్తులతో పరస్పరం దాడులు నలుగురికి తీవ్ర గాయాలు విచారణ చేపట్టిన పోలీసులు -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనుల్లో వేగం పెంచాలి
కురవి: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడారు. స్కూల్కు రూ.200కోట్లు కేటాయించారని, నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాయంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనులను ప్రారంభించిందని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ విద్య అందిస్తారని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున స్కూల్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన ఉంటుందన్నారు. ప్రతీ పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు వసతి, విద్య అందించేలా రూపకల్పన, అధునాతన తరగతి గదులు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, గ్రంథాయం, క్రీడా మైదానాలు, హాస్టల్, భోజనశాల వంటి సదుపాయాలు ఉంటాయని వివరించారు. మొదటి దశలో బాలికల పాఠశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూసీ ఇంజనీర్ అరుణ్కుమార్, కురవి తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలిగూడూరు: ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మండలంలోని బొద్దుగొండ, ఎర్రకుంటతండా సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నాణ్యమైన సిమెంట్, ఐరన్, కలప వస్తువులను ఉపయోగించాలన్నారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్ఛరించారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూసీ ఇంజనీర్ అరుణ్కుమార్, డీటీ కోమల పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి మహబూబాబాద్: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ఎస్ఐఆర్పై సంబంధిత అఽధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకునేలా ఓటర్లను చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను మంగళవారం డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ఔట్ పేషెంట్స్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం ఆస్పత్రులు నిర్వహించాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే సీజ్ చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో బోర్డులపై చికిత్సల ధరలు ప్రదర్శించాలన్నారు. తనిఖీలో డిప్యూటీ డెమో రాజ్కుమార్, రాకేష్, మనోహర్, కృష్ణ, సత్య ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్నినో ‘షాక్’
హన్మకొండ: ఎల్నినో ప్రభావంతో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో సాగునీటి అవసరాలకు రైతులు విద్యుత్ పంపులను విరివిగా నడుపుతున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గృహ అవసరాలకు అధికంగా విద్యుత్ వాడుతున్నారు. విద్యుత్ వినియోగంతోపాటు డిమాండ్ పెరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిఽధిలో ఈ నెల 25న విద్యుత్ వినియోగం 80,6887 మిలియన్ యూనిట్లు జరగగా, డిమాండ్ 5,622 మెగావాట్లు నమోదైంది. అధిక వాడకం ఎందుకంటే..? ఎల్నినో తీవ్ర ప్రభావంతో ఉమ్మడి వరంగల్జిల్లా అంతటా కరువుఛాయలు అలుముకుంటున్నాయి. వర్షాకాలమైనా చినుకు జాడలేదు. ఇటీవల మోస్తరునుంచి తేలికపాటి కురిసిన వర్షాలు మినహా వరదలు పారే భారీ వర్షం ఇప్పటివరకు లేదు. ఫలితంగా జలవనరులు వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక నెర్రలు వారుతున్నాయి. వర్షాలు కురుస్తాయనే ఆశతో వరినార్లు పోసుకున్న రైతులు అందుబాటులో ఉన్న భూగర్భజలాలతో పొలం దున్ని నాట్లు వేస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు మెట్ట పంటలు వాడిపోతుండడంతో వాటిని రక్షించేందుకు తడులు ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ పంపుల వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడంతో గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విరివిగా వినియోగిస్తుండడంతో విద్యుత్కు డిమాండ్ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ నెలలో 25,917 మిలియన్ యూనిట్ల వినియోగం జరగగా, 1,376 మెగావాట్ల డిమాండ్కు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో గత ఐదు రోజుల్లో విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో) ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతవారం రోజుల్లో విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో)జిల్లా (సర్కిల్) 20న 21న 22న 23న 24న 25న 26న హనుమకొండ 5.38 4.99 4.99 5,2 5.4 5.76 6.05 వరంగల్ 3.574 3.206 3.218 3.308 3.557 3.559 2.917 జనగామ 4,41 4.07 4.05 4.35 4.66 4.97 4.92 మహబూబాబాద్ 3.1 2.85 2.88 3.15 3.43 3.658 3.53 భూపాలపల్లి 2.85 2.4 2.74 3.05 3.31 3.36 3.48 ములుగు 2.55 2.56 2.88 3.29 3.5 3.57 3.69 అమాంతం పెరిగిన విద్యుత్ వాడకం, డిమాండ్ కనుమరుగైన వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ మోటార్లు, గృహ అవసరాలకు విరివిగా విద్యుత్ వాడకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెలలో 24,917 మిలియన్ యూనిట్ల వినియోగం 1376 మెగావాట్లకు పెరిగిన డిమాండ్జిల్లా (సర్కిల్) 22న 23న 24న 25న 26న హనుమకొండ 270.40 302.80 313,10 346.32 317.00 వరంగల్ 245.94 255.91 258.07 274.96 243.51 జనగామ 313.83 334.91 374.82 376.82 378.91 మహబూబాబాబ్ 268.56 299.26 327.07 354.95 326.90 భూపాలపల్లి 138.06 154.41 177.60 196.15 190.43 ములుగు 138.85 157.35 166.31 186.08 178.00 -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని డీఈఓ సత్యనారాయణ మూర్తి అన్నా రు. మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శిక్షణలో అందించిన బోధన పద్ధతులు, టీచింగ్–లెర్ని ంగ్ మెటీరియల్ను ప్రతీరోజు తరగతి గదిలో వినియోగించాలన్నారు. ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికతో బోధించాలన్నారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రంథాలయం, సైన్స్ల్యాబ్, ఏటీఎల్ ల్యాబ్లు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అక్రమ గర్భస్రావం కేసులో దర్యాప్తు ముమ్మరం
జనగామ : జిల్లాలో కలకలం రేపిన లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ గర్భస్రావం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అక్రమ గర్భస్రావం వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సోమవారం పట్టణంలోని సంజయ్నగర్లోని అనసూర్య నివాసాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి ఆరా తీశారు. గర్భస్రావం ఎలా జరిగిందనే అంశంపై కాలనీ వాసులను అడిగామని డీఎంహెచ్ఓ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఆర్ఎంపీ శ్రావణ్తో పాటు గర్భస్రావం చేసిన అనసూర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మరోవైపు మృతి చెందిన మహిళ తల్లి, అలాగే హనుమకొండకు చెందిన స్కానింగ్ కేంద్ర నిర్వా హకుడు ప్రవీణ్ పరారీలో ఉండగా, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. డీఎంహెచ్ఓ వాణిశ్రీ పరిశీలన -
జల్సాలకు అలవాటు పడి..
డోర్నకల్: జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ముల్కలపల్లి సమీపంలో విక్రయించేందుకు యత్నించిన ఏడుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. గంజాయి రవాణాపై విశ్వనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై రియాజ్పాషా, సిబ్బంది ముల్కలపల్లి సమీపంలో నిఘా పెట్టారు. ఈ సమయంలో మూడు బైక్లపై కొంతమంది యువకులు వచ్చి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో సిబ్బంది ఏడుగురు యువకులను పట్టుకోగా ఒకరు పరారయ్యారు. అనంతరం విచారించి ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన మారకల శ్యాంప్రేమ్ కృష్ణ, ముల్కలపల్లికి చెందిన బానోత్ ఉదయకిరణ్, బండారి వరప్రశాంత్, ఖమ్మానికి చెందిన చాపల సాయిశశికుమార్, గోరంట్ల చక్రవర్తిమణిరాజ్, తొడేళ్లగూడేనికి చెందిన షేక్ అబ్బాస్(ఆటోడ్రైవర్ ), తంగెళ్ల మహేశ్(భవన నిర్మాణ కార్మికుడు)గా గుర్తించారు. ముల్కలపల్లికి చెందిన బండారి సంతోశ్ పరారయ్యాడు. షేక్ అబ్బాస్, మహేశ్ మినహా మిగతా వారంతా గతంలో ఒడిశాలో గంజాయి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 22న శ్యాంప్రేమ్ కృష్ణ, బానోత్ ఉదయకిరణ్, వరప్రశాంత్, సాయిశశికుమార్, చక్రవర్తిమణిరాజ్ ఒడిశాలో 7.525 కేజీల గంజాయి కొనుగోలు చేసి మూడు బ్యాగుల్లో 24వ తేదీన ముల్కలపల్లి పాండవుల గుట్ట వద్ద విక్రయించడానికి తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి మూడు బైక్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ సోమవారం తెలిపారు. ఎస్సైలు రియాజ్పాషా, ఝాన్సీ, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డోర్నకల్ పోలీసులుగంజాయి తరలిస్తూ పట్టుబడిన వారిలో ముగ్గురు బీటెక్, ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. మరొకరు డిగ్రీ పూర్తి చేసి కూలి పనులు చేస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద తమ వారిని చూసి కంటతడి పెట్టారు. -
వరుణ దేవా కరుణించు..
● ఓటాయి గ్రామంలో వరుణ యాగం కొత్తగూడ: వర్షాలు కురవాలని మండలంలోని ఓటాయి గ్రామ ప్రజలు సోమవారం వరుణ యాగం నిర్వహించారు. భానుప్రసాద శాస్త్రి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. మహిళలు బిందెలతో నీరు తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. వర్షాలు కురవాలని ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టి రాములు, గ్రామ స్తులు సారంగపాణి, మహేందర్, మల్లేష్, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.గోరింటాకు సంబురంఆషాఢమాసం సందర్భంగా మహిళలు గోరింటాకు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, సోమవారం జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురంకాలనీకి చెందిన మహిళలు ఒకచోటచేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకొని సంతోషం వ్యక్తం చేశారు. –మహబూబాబాద్ అర్బన్ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మాధవిమరిపెడ రూరల్: తెలంగాణ జాగృతి రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన మారిపల్లి మాధవిని నియమించినట్లు జాగృతి చీఫ్, సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత సోమవారం ప్రకటించారు. నూతన అధ్యక్షురాలు సారథ్యంలో జాగృతి తన లక్ష్యాల వైపు మరింత బలంగా పయనిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన కల్వకుంట్ల కవితకు మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
బాలుడికి ఆర్ఎంపీ ఇంజెక్షన్..
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడికి ఆర్ఎంపీ చికిత్స అందించిన అనంతరం ఆరోగ్యం విషమించి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ క్లినిక్కు తాళం వేసి పరారైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన బలుగూరి సురేశ్, రేణుక దంపతులు మరిపెడలో వాటర్ ప్లాంట్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు నాని (3) జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం ఉదయం మరిపెడలోని ప్రజత్ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడ కాంపాటి రవిబాబు అనే ఆర్ఎంపీ బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చి మందు రాసి ఇంటికి పంపించాడు. అయితే సాయంత్రానికి బాలుడి ఆరోగ్యం మరింత విషమించడంతో తిరిగి అదే క్లినిక్కు తీసుకెళ్లగా మరో సారి ఇంజెక్షన్ ఇచ్చాడు. అనంతరం బాలుడి కడుపు ఉబ్బిపోవడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే పెద్ద ఆస్పత్రికి తరలించాలని సదరు ఆర్ఎంపీ సూచించాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే బాలుడు అదేరోజు రాత్రి మృతి చెందాడు. బాలుడి మృతికి కారణం ఏమిటని ప్రశ్నించేందుకు కుటుంబీకులు క్లినిక్ వెళ్లగా అప్పటికే ఆర్ఎంపీ క్లినిక్, మెడికల్ షాపునకు తాళం వేసి పరారయ్యాడు. కాగా, ఇదే ఆర్ఎంపీ వైద్యం వికటించి మండలంలోని ఉల్లెపల్లికి చెందిన కొలిచెల్మ మల్సూర్, మహేశ్వరి దంపతులు కుమార్తె మణిదీప (3) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా బ్రూణ హత్య కేసులో సదరు ఆర్ఎంపీపై గతంలో కేసు నమోదు కాగా, జైలుకు కూడా వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అయినా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల అండదండలతో దర్జాగా క్లినిక్ కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అప్రమత్తం.. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంహెచ్ఓ రవి రాథోడ్ ఆధ్వర్యంలో మరిపెడలో తనిఖీలు నిర్వహించి స్థాయికి మించి వైద్యం చేస్తున్న పరారీలో ఉన్న రవిబాబు క్లినిక్తో పాటు మరో రెండు గుడిసె వెంకన్న, వీరన్న ఆర్ఎంపీలకు చెందిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, తమ కుమారుడి మృతికి కారణమైన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. ఘటనపై మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మరిపెడలో ఘటన బాధితులు వచ్చేలోపు క్లినిక్కు తాళం వేసి పరారైన గ్రామీణ వైద్యుడు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ధర్మసాగర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, పొలాలకు సకాలంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ (దక్షిణ కాల్వ) నుంచి సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు. సౌత్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత రాకుండా ఉండేందుకే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి విడుదల ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కాగా, రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంపై రైతాంగం ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్ నాగరాజు -
జీవిత లక్ష్యాన్ని నిర్దేశించేది ప్రొఫెషనల్ విద్య
హసన్పర్తి : ఇంజనీరింగ్ విద్యార్థులకు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించేది ప్రొఫెషనల్ విద్య అని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్గా తరగతులకు హాజరు కావాలని సూచించారు. సమయ పాలన పాటిస్తే చదువుపై శ్రద్ధతోపాటు క్రమ క్షణ కూడా పెంపొందుతుందన్నారు. తరగతులకు హాజరుకాకుండా తప్పుడు అడుగు వేస్తే జీవితం నాశనమవుతుందని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ప్రతీ రోజు వారికి కొంత సమయం కేటాయించాలన్నారు. వారి ముందు ఎలాంటి గొడవలకు దిగొద్దన్నారు. తమ పిల్లల చదువుపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవంగా మెదగాలన్నారు. ప్రపంచంలో సంభవిస్తున సాంకేతిక విద్యకనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సావీనర్ను ఆవిష్కరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ దీపక్ గార్గ్, ప్రొ వైస్ చాన్స్లర్ డాక్టర్ మహేశ్, రిజిస్ట్రార్ రమణరావు, డీన్ డాక్టర్ అర్చనారెడ్డి, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమయ పాలన పాటించాలి ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డి -
కేయూలో నాలుగు విభాగాల అఽఽధిపతుల నియామకం
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగాల్లో నలుగురు అధిపతులను నియమించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా ఆ విభాగం ప్రొఫెసర్ ఎం సదానందం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతిగా ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక, ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఈసీఈ) విభాగం అధిపతిగా ఆ విభాగం డాక్టర్ బి. శ్రీకాంత్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ ) విభాగం అధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సుమలత నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. కాగా, వీరు రెండు సంవత్సరాలపాటు ఆ పదవుల్లో ఉంటారు. ఈ నలుగురికి సోమవారం సాయంత్రం కేయూ వీసీ కె. ప్రతాప్ రెడ్డి ఉత్తర్వుల కాపీలు అందజేశారు. -
వినతులు త్వరగా పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్నారు. ప్రజావాణిలో 184 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. మెరుగైన సేవలు అందించాలిమహబూబాబాద్ రూరల్ : ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుశాఖ లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. హత్యలు, ఆస్తి నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులు, చార్జిషీట్లు, కోర్టు వ్యవహారాల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్లో నమోదయ్యే ప్రతీ కేసు, ఫిర్యాదు, దర్యాప్తు వివరాలు, అరెస్టులు, చార్జిషీట్లు, వారెంట్లు, ఆస్తుల స్వాధీనం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్ 2.0లో నమోదు చేయాలని, పెండింగ్ ఎంట్రీలు లేకుండా డేటా నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్, గుడుంబా తయారీ, విక్రయాలు, రవాణాపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే నైట్ పెట్రోలింగ్, నైట్ బీట్స్, వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద పటిష్టమైన గస్తీ నిర్వహిస్తూ దొంగతనాలు, చోరీలు, ఇతర నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సమయస్ఫూర్తితో రక్షించిన మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సైలు రాజు, సతీష్, రవికిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి మహబూబాబాద్: సర్పంచ్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని , ఉపసర్పంచ్ల చెక్పవర్ రద్దు చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం సర్పంచ్ల చైతన్య సదస్సు నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నెలలో ఒక్కరోజు కలెక్టర్ సర్పంచ్లతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఆరు నెలలకు ఒకసారి సీఎం సర్పంచ్లతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటు హక్కు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్లు పని చేయాలన్నారు. సమావేశంలో నాయకులు గునిగంటి కమలాకర్, భూక్య ప్రవీణ్, నరేందర్, వెంకట్, శ్రీనివాస్, గుట్టయ్య, యాకాంతం, బాబురావు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూ ఆడిటోరియంలో కెహబ్, తెలంగాణ రాష్ట్ర టీహబ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం( ఎంఓయూ)లో భాగంగా విద్యార్థుల్లో వ్యవస్థాపకత ఎంటర్ప్రెన్యూర్ షిప్, స్టార్టప్లపై అవగాహన కల్పించేందుకు సోమవారం నిర్వహించిన ఇండక్షన్ ప్రోగ్రాంలో వీసీ ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎంఓయూ ద్వారా 3వేలమంది విద్యార్థులకు విస్తృత అవకాశ వేదికను కల్పించి టీహబ్ మెంటరింగ్ సహకారంతో వారి విన్నూత్న ఆలోచనలను స్టార్టప్లుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్ల డించారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, హైదరాబాద్ టీహబ్ ప్రతినిధి శ్రవణ్ మాట్లాడుతూ కేయూ నుంచి దరఖాస్తులు చేసుకున్న సుమారు 1,700 మంది విద్యార్థుల్లో ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కార్యక్రమానికి 400 మందిని ఎంపికచేసినట్లు వెల్లడించారు. వీరికి 12 నుంచి 15 ప్రత్యేక శిక్షణ సెషన్లు నిర్వహించి వ్యవస్థాపకత స్టార్టప్లపై అవగాహన కల్పించబోతున్నామన్నారు. కెహబ్ డైరెక్టర్ సవితాజ్యోత్స్న, రూసానోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్ రెడ్డి, టీహబ్ ప్రతినిధులు ఆశిష్ శర్మ, భరత్, కెహబ్ సంయుక్త డైరెక్టర్లు సిద్ధార్థ, బొల్లం కిరణ, కేయూ కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
మద్దతు మరింత..
ఖరీఫ్ పంటలకు పెరిగిన కనీస మద్దతు ధరలు 2026–27 సీజన్కు కేంద్ర ప్రభుత్వం కొత్త ఎంఎస్పీ ప్రకటింపుజనగామ : కేంద్ర ప్రభుత్వం 2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు పంటల కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రధాన ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంచింది. అత్యధికంగా సన్ ఫ్లవర్ పంట క్వింటాల్కు రూ.622, పత్తి (మిడియం, లాంగ్ స్టేపుల్) రూ.557, నైజర్ విత్తనాలకు రూ.515, నువ్వులకు రూ.500 పెంచారు. నూనెగింజలు, పప్పుధాన్యాలకు అధిక ప్రోత్సాహం లభించింది. మొక్కజొన్నకు కేవలం రూ.10, పెసరకు రూ. 12 మాత్రమే పెంపు ఇవ్వడం గమనార్హం. రైతులకు కనీస గిట్టుబాటు ధర హామీ ఇవ్వడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
కక్షిదారులకు న్యాయమే కోర్టుల లక్ష్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ మహబూబాబాద్ రూరల్ : కక్షిదారులకు న్యాయం చేయడమే కోర్టుల లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కన్నోజు మురళీమోహన్ అన్నారు. సోమవారం నూతన ప్రధాన న్యాయమూర్తిగా మురళీమోహన్ బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి అనంతరం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మురళీమోహన్ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ సలహాలు, సూచనలు స్వీకరిస్తూ కక్షిదారుల న్యాయం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. తక్షణమే న్యాయం చేకూరేలా న్యాయవాదులు సహకరించాలని, బార్ అండ్ బెంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం అందించేలా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. జడ్జిలు శాలిని శాకెల్లి, కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ జంగం సిద్ధార్థ, సీనియర్ న్యాయవాదులు కేశవరావు, సురేష్ రెడ్డి, జీపీ నగేష్ కుమార్, పీపీ కొంపల్లి వెంకటయ్య, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, రవికుమార్, శ్రీనివాస్, బార్ అసోసియేషన్ సభ్యులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడి మృతి
నల్లబెల్లి: అభిమాన నాయకుడు ఆరోగ్య పరిస్థితి చూసి తీవ్ర మనోవేదనకు గురైన బీఆర్ఎస్ నాయకుడు, వార్డు మెంబర్ ఊరటి నరేశ్(46) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాయిల్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, రెండో వార్డు సభ్యుడు నరేశ్ పార్టీలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి వీరాభిమాని. తన అభిమాన నాయకుడు సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో అస్వస్థకు గురై హనుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని ఆదివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పెద్ది ఆరోగ్య పరిస్థితి గమనించి, హైదరాబాద్ తరలించేవరకూ ఉన్నాడు. తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత తీవ్ర ఆవేదనలో ఉన్న నరేశ్ సోమవారం ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వైద్యులు గుండె పోటుగా నిర్ధారించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదని.. ● పెద్దనాన్నను హత్య చేసిన యువకుడు ● నిందితుడి అరెస్ట్, రిమాండ్ దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి(56) హత్య కేసులో అతడి తమ్ముడి కుమారుడు రాజును అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిరమణ సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన ముస్కుల తి రుపతిరెడ్డి మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతిరెడ్డికి నామినీగా ఉన్న అ న్న సాంబరెడ్డికి రైతు బీమా కింద రూ. 5 లక్షలు వ చ్చాయి. గత శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని తనకు ఇవ్వకుండా తన త మ్ముడు తిరుమల్కు ఇచ్చాడని రాజు కోపోద్రెకుడిగా మారాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి తన పెద్దనాన్న సాంబరెడ్డిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. ఎస్సై రణధీర్రెడ్డి ఉన్నారు. -
మందులు లేక.. ఆహారం అందక..
కాజీపేట : కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండపర్తి మనోహర్ రావు కుమారుడు సు రేందర్ రావు ప్రస్తుతం అ త్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భార్య, పిల్ల లు ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు ఆహారం కూడా కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలితరం ఎమ్మెల్సీగా ప్రజాసేవలో గుర్తింపు పొందిన మనోహర్ రావు భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. అడిగిన వారికి లేదనకుండా భూములతోపాటు ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం కాజీపేట రైల్వే జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లోని విస్తార భూములు ఒకప్పుడు వారి కుటుంబానికి చెందినవేనని గ్రామస్తులు నేటికీ చెప్పుకుంటుంటారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో కూడా ఈ కుటుంబానికి సన్ని హిత బంధుత్వం ఉన్నట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. కాలక్రమేణా కుటుంబ ఆస్తులు చేజారిపోవడంతో సురేందర్ రావు నిరుపేద స్థితికి చేరుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కిందపడడంతో తుంటి ఎముక విరిగిందని, సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న తాతల కాలం నాటి ఇల్లు కూడా శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోవడంతో నిరాశ్రయుడిగా మారిపోయాడు. మందులు, ఆహారం కూడా అందక అర్ధాకలితో రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు చేసుకున్న ఫలితం శూన్యమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సురేందర్ రావు దీనస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయనకు ఆర్థిక సాయం, మెరుగైన వైద్యం, భోజన వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కడిపికొండ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసేవ చేసిన కుటుంబ సభ్యుడు నేడు ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉండడం బాధాకరమని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి సురేందర్ రావుకు చేయూతనందించాలని కోరుతున్నారు. దాతలు వైద్యంతో పాటు చేయూతనందించడానికి 86866–00049 నంబర్కు ఫోన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దయనీయ స్థితిలో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు ప్రభుత్వ సాయం కోసం గ్రామస్తుల విజ్ఞప్తి -
డిజిడల్
మంగళవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: మారుతున్న కాలంతో పాటు బోధన విధానం మారాలి. ఇందుకోసం కృత్రిమ మేధా(ఏఐ)ను వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నారు. ఇందు కోసం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు ట్యాబ్స్, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఐఎఫ్బీ ప్యానెల్ బోర్డులు, కంప్యూటర్లు మంజూరు చేశారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకొని బోధించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. గత ఏడాది వరకు కంప్యూటర్ బోధకులను నియమించలేదు. ఇప్పుడు నియమించినప్పటికీ.. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేక కొన్నిచోట్ల, వాటిని ఎలా ఉపయోగించాలో తెలి యక మరికొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలతో జిల్లాలో 20శాతం పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్యను బోధించడం లేదు. చివరి నుంచి రెండోస్థానం.. ప్రభుత్వం విద్యకు ఎన్ని కోట్లు కేటాయించినా.. ఎన్ని అధునాతన పరికరాలు కొనుగోలు చేసినా.. జిల్లాలో మాత్రం మెరుగైన విద్య అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. జాతీయ విద్యామండలి అధ్వర్యంలో నిర్వహించిన 2025 పీజీఐడీ నివేదికలో జిల్లా పరిస్థితిని స్పష్టం చేశారు. డిజిటల్ విద్యకు 50 మార్కులు కేటాయించి బోధన ఆధారంగా మార్కులు ఇవ్వగా.. 33 జిల్లాల్లో మహబూబాబాద్ 32వ స్థానంలో నిల్వడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించకపోవడమే ఇందుకు కారణమని పలువురు అంటున్నారు. డిజిటల్ బోధనపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ప్రతీ పాఠశాలకు ప్యానల్ బోర్డులు, కంప్యూటర్లు అందజేశాం. వీటిని సద్వినియోగం చేసుకుని బోధన జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఐసీటీ ఆపరేటర్లను నియమించాం. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే కంప్యూటర్ విద్య, డిజిటల్ బోధనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. – సత్యనారాయణమూర్తి, డీఈఓ ఏజెన్సీ బిడ్డలకు అందని డిజిటల్ విద్య మూలన పడుతున్న కంప్యూటర్లు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం ట్యాబ్లు, ఐఎఫ్బీ ప్యానల్ బోర్డులు వృథా పీజీఐడీ నివేదికలో చివరినుంచి రెండో స్థానంలో మానుకోట -
పంట కుంటలు.. జలగనులు
● ఫామ్ పాండ్స్తో రైతులకు ప్రయోజనం ● వీబీ జీ రామ్జీ పథకం ద్వారా సబ్సిడీ అందజేత ● రైతుల పంటలకు ఎంతో మేలు డోర్నకల్: వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయ అవసరాలకు వాడుకునేలా పంట కుంటలు(ఫామ్ పాండ్స్) ఉపయోగపడుతాయి. మెట్టతో పాటు అన్ని రకాల భూముల్లో పంట కుంటలను ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంతో పాటు వేసవి కాలంలోనూ రైతులకు మేలు జరుగుతుంది. కాగా, ప్రస్తుతం ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వీబీజీ రామ్జీ పథకం ద్వారా పంట కుంటలను తవ్వుకునేందుకు రైతులకు పూర్తి సబ్సిడీ అందిస్తోంది. రెండు నుంచి ఐదెకరాల లోపు.. పంట కుంటల ఏర్పాటుతో రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రెండు నుంచి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు పంట కుంటలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులు. తమ వ్యవసాయ భూమిలో ఒంపుగా ఉన్న ప్రాంతంలో పంట కుంటను ఏర్పాటు చేసుకుంటే వరదనీరు పంట కుంటకు చేరుతుంది. పంట కుంటలతో ప్రయోజనాలు.. ● వర్షాభావ పరిస్థితుల్లో సైతం పంటల సాగుకు నీరు అందుబాటులో ఉంటుంది. ● వ్యవసాయం, పండ్ల తోటలు, కూరగాయల సాగుకు, ఇతర పంటలకు పంట కుంటల నీటిని వినియోగించవచ్చు. ● చేపల పెంపకంతో పాటు పంటలకు ఎరువులు, పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో రైతులకు నీరు అందుబాటులో ఉంటుంది. ● సారవంతమైన భూమి పైపొర కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ● భూగర్భ జలాల అభివృద్ధితో పరిసర ప్రాంతాల్లోని బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ● భూమి తేమ శాతం పెరుగుతుంది.మొదటి రకం... కొలతలు: 40 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పు, 6.5 ఫీట్ల ఎత్తు అంచనా వ్యయం: రూ.80,000. పని దినాల సంఖ్య: 400 రెండో రకం కుంట.. కొలతలు: 65 ఫీట్ల పొడవు, 65 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల లోతు అంచనా వ్యయం: రూ.4,00,000 పని దినాల సంఖ్య: 1100 అర్హత... 2 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు అర్హులు. పట్టాదారు పాసుపుస్తకం, వీబీజీ రామ్జీ జాబ్కార్డు, రైతు అంగీకార పత్రం అవసరం. -
ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి కృషి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య కేయూ క్యాంపస్: ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ , భౌతిక, మౌలిక వసతుల కల్పనపై సోమవారం పార్లమెంట్లో ప్రస్తావించారు. సమగ్ర శిక్ష పథకం అమలు, డిజిటల్ విద్య, విస్తరణ, కేంద్ర నిధుల కేటాయింపులపై సమగ్ర వివరాలు కోరారు. ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయశాఖమంత్రి జయంతి చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్ష పథకం కింద దేశవ్యాప్తంగా ఆ సీఎంఈ విద్యాదీక్ష, ఐసీటీ ల్యాబ్లు, స్మార్ట్క్లాస్రూమ్ల ద్వారా సాంకేతిక ఆధారిత విద్యాబోధనను ప్రోత్సహిస్తున్నట్లు తెలి పారు. రాష్ట్రాల వార్షిక కార్యాచరణ మేరకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు? వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక వేధింపులు జరిపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై ఎస్సై సాయిబాబును వివరణ కోరగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టామన్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మొక్కజొన్న వ్యాపారి పరారీ ● రైతులకు రూ.12,39,360 ఎగవేత మహబూబాబాద్ రూరల్ : మొక్కజొన్న పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన వ్యాపారిపై బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి సోమవారం తెలిపారు. రైతులు అజ్మీరా నరేశ్, కోటేశ్, వెంకన్న, బానోత్ లక్ష్మణ్, మాలు, బోడ రాంజి, గుగులోత్ సూక్య, దూదిమెట్ల కట్టయ్య వద్ద వ్యవసాయ మార్కెట్ పరిధిలో వ్యాపారం నిర్వహించే ఎన్.ఎస్ ట్రేడర్స్ య జమాని ధరావత్ శేఖర్ రూ.12,39,360 విలువైన మొక్కజొన్న పంట కొనుగోలు చేశాడు. మే 8వ తేదీన పంటను కొనుగోలు చేసిన శేఖర్.. రైతులకు డబ్బులు ఇస్తానని చెప్పి వాయిదాలు పెట్టుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఘటనపై రైతుల ఫిర్యాదు మేరకు సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన విద్యార్థిని పాగె కృష్ణవేణి ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆశించిన మేరకు మార్కులు రాకపోవడంతో మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారని గ్రామస్తులు తెలిపారు. రైల్లోనుంచి పడిన వ్యక్తి.. తెగిన చేయిఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారిపడడంతో ఓ ప్రయాణికుడి ఎడమ చేయి తెగిపోయింది. ఈఘటన సోమవారం మధ్యాహ్నం వరంగల్ రైల్వేస్టేషన్ సమీపం బట్టల బజార్ ఫ్లైఓవర్ వద్ద పట్టాలపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి సోమవారం రైలులో వరంగల్కు బయలుదేరాడు. పాత రైల్వే గేట్ వద్దకు రైలు చేరుకోగానే ప్రయాణికుడు మల్లికార్జున్ ప్రమాదవశాత్తు రైలులోనుంచి జారిపడ్డాడు. మల్లికార్జున్ ఎడమ చేయి తెగిపోవడంతోపాటు శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన ఈఎంటీ ఎండీ సలీమొద్దిన్, పైలెట్ అజీజ్పాషా ఘటన స్థలానికి చేరుకుని తాత్కాలిక చికిత్స అందజేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. -
ఆదర్శ గ్రామ నిర్మాణానికి కృషి చేయాలి
● బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి కాజీపేట రూరల్ : ఆదర్శగ్రామ నిర్మాణానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృషి చేయాలని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్లో సోమవారం బాలవికాస, సోపార్ ఆధ్వర్యంలో మోడల్ విలేజ్ ప్రోగ్రాం కింద గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాభివృద్ధి కమిటీలకు ఆదర్శ గ్రామ నిర్మాణం, వనరుల ఆధారిత సామాజిక అభివృద్ధిపై అవగాహన ఉండాలన్నారు. గ్రామ పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, పర్యావరణ, తదితర అభివృదధి సాధించే మార్గాలపై నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు జిల్లాలోని 150 గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు, బాలవికాస మోడల్ విలేజ్ ప్రోగ్రాం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వసంత, ప్రాజెక్ట్ స్టాప్ రాజ్కుమార్, ఫీల్డ్ కో ఆర్డినేటర్ వినయ్కుమార్ పాల్గొన్నారు. -
పంట మార్పిడి తప్పనిసరి
● ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్ ● మానుకోట రైతు వేదికలో విత్తన మేళా మహబూబాబాద్ రూరల్ : భవిష్యత్ తరాల మనుగడ కోసం పంట మార్పిడి విధానం తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో విత్తన మేళా ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ప్రస్తుతం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఎస్సారెస్పీ, ఇతర నీటి వనరులు కూడా అందుబాటులో లేనందున రైతులు ఆరుతడి పంటలు పండించాలన్నారు. ప్రతీ రైతు తనకు ఉన్న భూమిలో సాధ్యమైనంత వరకు నీటి కుంట (పంట కుంట)ను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నీటి వనరులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను వేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలన్నారు. జిల్లాలో ప్రాజెక్ట్ వైవిధ్యం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అధికంగా వరి పండించడం వల్ల అధిక యూరియా వాడకం, కాన్సర్ రావడం, భూసారం కోల్పోవడంతో పలు సమస్యలు వస్తున్నాయన్నారు. పసుపు, వేరు శనగ విస్తీర్ణం తగ్గడం వల్ల పరిశ్రమలు మూత పది చాలా మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. మార్కెట్ డిమాండ్ ఉన్న అపరాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, మునగ, ఉల్లి వంటి పంటలు సాగు చేయాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, డీఏఓ విజయచంద్ర, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికా రి జినుగు మరియన్న, ఏఎంసీ వైస్ చైర్మమన్ మదన్ గోపాల్ లోయ, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, సర్పంచ్ గుండెల రేణుక, ఏఈఓలు పాల్గొన్నారు. -
విత్తన మేళాకు వేళాయె
మహబూబాబాద్ రూరల్ : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈమేరకు రైతులు వరికి బదులు తక్కువ సాగునీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచి స్తోంది. ఈమేరకు విత్తన మేళా ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు అందించేందుకు గాను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాభావ పరిస్థుతుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు వైపునకు రైతులు మళ్లేలా, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. అలాగే ఈ నెల 27నుంచి 29 వరకు జిల్లాలోని 18 మండలాల్లో రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బయ్యారం మండల పరిధి కొత్తపేట రైతు వేదిక, చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి, దంతాలపల్లి, డోర్నకల్ మండల పరిధి అమ్మపాలెం, గంగారం, గార్ల, గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, కొత్తగూడ మండల పరిధి పొగుళ్లపల్లి, కురవి, మహబూబాబాద్, మరిపెడ మండల పరిధి గిరిపురం, నర్సింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర, సీరోలు మండల పరిధి కాంపల్లి, తొర్రూరు రైతు వేదికల్లో విత్తనమేళాలు నిర్వహించనున్నారు. విత్తనమేళాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తన శుద్ధి, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పురుగు, వ్యాధి నివారణ, నీటి యాజమాన్యం, శాసీ్త్రయ సాగు విధానాలపై అవగాహన కల్పించనున్నారు. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రభుత్వం, వ్యవసాయ, ఉద్యా న శాఖల ఆధ్వర్యంలో రైతుల అవసరాల మేరకు విత్తన మేళాలో పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయల విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని మండలాల్లో ఎంపిక చేసిన రైతు వేదికల్లో సోమవారం నుంచి బుధవారం వరకు విత్తన మేళా నిర్వహిస్తారు. కాగా రైతులు తమ భూభాగం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటలకు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. రైతులు ఏజెన్సీల నుంచి మాత్రమే ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి రశీదులను భద్రపరచుకోవాలి. తద్వారా ఏదైనా సమయంలో పంట నష్టం జరిగితే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ ఎల్నినో ప్రభావంతో ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో నాణ్యమైన విత్తనాలు ప్రస్తుత వాతావరణ పరి స్థితులు పంటల సాగుకు అనుకూలంగా లేనందువల్ల రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడం శ్రేయస్కరం. ఎంపిక చేసిన రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తున్న విత్తన మేళాలకు వచ్చి రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్లాలి. పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –ఎస్.విజయచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి -
ధరలు ౖపైపెకి..
● అమాంతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ● బియ్యం రేట్లకు రెక్కలు ● పేదలపై ఆర్థిక భారంమహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు కోడిగుడ్లు, మాంసం, చికెన్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు, పేదలపై ఆర్థికభారం పడుతోంది. ప్రభుత్వం ధరల కట్టడిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మాంసం మరింత.. రెండు నెలల నుంచి కోడిగుడ్డు ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కేసు కోడిగుడ్ల ధర రూ. 240కి చేరింది. దీంతో ఒక్క గుడ్డు రూ.8కి విక్రయిస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రతకు కోళ్లు ఎక్కువ మృతి చెందడంతో ఉత్పత్తి తగ్గి గుడ్డు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా కేసు ధర రూ. 240కి చేరలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మాంసం కేజీ రూ.1,000, బోన్లెస్ అయితే రూ.1,200, గొర్రె లేదా మేక తలతో పాటు నాలుగు కాళ్లకు రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. చికెన్ ధర కూడా విపరీతంగా పెంచారు. గ్యాస్ ధరల దడ.. జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధర రూ.60పెరిగింది. అప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.924 ఉండగా రూ.60 పెరగడంతో రూ.984కి చేరింది. అలాగే జూన్లో మళ్లీ రూ 29 పెంచారు. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,013కి చేరింది. కానీ డెలివరీతో కలిపి రూ.1,030 తీసుకుంటున్నారు. బియ్యం ధరలు.. బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. జై శ్రీరాం రకం బియ్యం క్వింటా రూ.7.000, ఆర్ఎన్ఆర్ రూ.6000, సాంబమసూరి రూ. 5,500 విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఈ సారి వర్షాలు లేక సాగు కష్టంగానే ఉంది. వరి సాగు లేకపోతే బియ్యం ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. -
నాలుగున్నర గంటలు ఉత్కంఠ
హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిలకడగా ఆరోగ్యం హనుమకొండ హంటర్రోడ్డులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన వెంటనే పెద్ది సుదర్శన్రెడ్డిని భార్య స్వప్న, అందుబాటులో ఉన్న కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు చేరుకున్న వెంటనే డాక్టర్ మమత చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్రెడ్డి భార్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఇతర నాయకులకు సమాచారం అందించారు. హనుమకొండలోనే ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, అరూరి రమేశ్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు, ఈవీ శ్రీనివాస్రావు, ముద్దసాని సహోదర్రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, శంబీపూర్ రాజు, హైదరాబాద్ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. సుదర్శన్రెడ్డి భార్య పెద్ది స్వప్నతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు చెప్పారు. కాగా, సుదర్శన్రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో వైద్యులు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. డాక్టర్కు అభినందనల వెల్లువ కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇప్పడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ మమత కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాపాడిన ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. గంటపాటు శ్రమించి పట్టువదలకుండా అంకితభావంతో సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలు కాపాడిన మమతకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఎక్స్లో అభినందనలు తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి గుండెపోటు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పరామర్శ -
మార్వాడీల తాల్ సప్తాహ్
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని సఖి మండలి, మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో వర్షాలు కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ తాల్ సప్తాహ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు హారతితో మొదలుపెట్టి భక్తి పాటలు ఆలపిస్తూ భజనలు చేస్తూ రాత్రి 10 గంటల వరకు మహేశ్వరీ భవన్ ఆవరణలో రాధాకృష్ణుల సన్నిధిలో సీ్త్రలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరు ఒకచోట చేరి పూజలు చేస్తున్నారు. హేమాచలుడికి ప్రత్యేక పూజలు మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి నాగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ సివిల్ జడ్జి పూజిత వేర్వేరుగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికారు. అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్శర్మ జడ్జిల కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు జరిపించి వేద మంత్రోచ్ఛరణతో స్వామివారిని శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పర్యాటకుల రద్దీ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ వివరించారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని టూరిజం ఇన్ప్లుఝెన్సర్లు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఈఓ భాస్కర్, ఆర్ఐ రమేశ్, సీసీ నాగరాజు ఉన్నారు. అలాగే నెదర్లాండ్ దేశస్తుడు మనోలో ఆలయాన్ని సందర్శించి రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని కొనియాడారు. కేఎంసీ పూర్వవిద్యార్థుల యాప్ ఆవిష్కరణ కాశిబుగ్గ: కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో KMC Alumini Connect అధికారిక మొబెల్ యాప్ను హైదరాబాద్లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆవిష్కరించారు. కేఎంసీ అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్, సన్షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కస్తూరి శ్రీధర్ తరఫున ఈ యాప్ను రూపొందించారు. క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, సర్జికల్ అంకాలజిస్టు సుబ్రహ్మణ్యేశ్వర్రావు, రెమిడీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బీవీఆర్ శ్రీధర్రావు, డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఈ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ వారం రోజుల్లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లో అందుబాటులోని ఉంటుందని వివరించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జార్జ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కృపాల్సింగ్, డాక్టర్ వినోద్రెడ్డి (ఆస్ట్రేలియా), డాక్టర్ ఎన్ఎస్డీ దుర్గాప్రసాద్, డాక్టర్ లక్ష్మయ్య, చందర్ తేజావత్ ఉన్నారు. -
సైబర్ వల.. విలవిల
మహబూబాబాద్ రూరల్ : సైబర్ నేరగాళ్ల వలలోపడి తెలివిగల మేధావులు మోసపోతున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై అప్రమత్తత తప్పనిసరి అని పోలీసులు చెబుతున్నప్పటికీ చాలామంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డబ్బులు కోల్పోయి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు.. ఫేస్బుక్ ప్రకటనల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టించడం, టెలిగ్రామ్ ట్రేడింగ్ గ్రూపుల పేరుతో మోసాలకు పాల్పడటం, బ్యాంకు అధికారులు లేదా కంపెనీ ప్రతినిధులమని చెప్పి యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్లను ఆమోదింపజేయడం, బ్యాంకింగ్ వివరాలను సేకరించి అనధికారిక లావాదేవీలు నిర్వహించడం, వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అప్రమత్తతే ఆయుధం.. జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎంసీఆర్పీ), సైబర్ హెల్ప్లైన్ 1930 ద్వారా జిల్లాలో నమోదైన ఫిర్యాదుల ప్రకారం సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. జిల్లాలో జనవరి నుంచి నమోదైన సైబర్ మోసాల వివరాలు.. ● మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పెట్టుబడి వెబ్సైట్ ద్వారా రూ.1.50 లక్షలు మోసం జరిగింది. ● నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారిక ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీ ద్వారా రూ.3.50 లక్షలు కోల్పోయారు. ● డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారిక ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీ ద్వారా రూ.లక్ష నష్టం జరిగింది. ● కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిగ్రామ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.1.71 లక్షలు మోసం చేశారు. ● కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసి ఘటనపై కేసు నమోదైంది. ● బయ్యారం పోలీస్స్టేషన్ పరిధిలో యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ (ఫోన్పే) మోసం ద్వారా రూ.9,879 కోల్పోయారు. ● మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్వెస్ట్ మెంట్ వెబ్ సైట్ ద్వారా రూ.49 వేలు మోసపోయారు. ● జిల్లాలో 7 సైబర్ ఫిర్యాదులు నమోదు కాగా రూ.8,29,879 మేర ఆర్థిక నష్టం జరిగినట్లు గుర్తించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలను నమ్మవద్దు. ● తెలియని వ్యక్తులు పంపిన యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ను ఆమోదించవద్దు. ● ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ, బ్యాంకు పాస్వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు. ● పెట్టుబడిపెట్టే ముందు సంబంధిత సంస్థ, వెబ్సైట్ విశ్వసనీయతను నిర్ధారించుకోవాలి. ● టెలిగ్రామ్, వాట్సాప్లో తెలియని ఇన్వెస్ట్ మెంట్ గ్రూపుల్లో చేరవద్దు. ● వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బెదిరించినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ● ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ● బ్యాంకు ఖాతాల లావాదేవీలకు అలర్ట్లను యాక్టివేట్ చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్లైన్ కాల్ చేయాలి లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రిజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి. – శబరీష్, ఎస్పీ ఆదమరిస్తే అంతే సంగతులు ఎక్కువగా మోసపోతున్న మేధావులు అప్రమత్తత తప్పనిసరి జిల్లాలో జనవవరి నుంచి రూ.8,29,879 మేర ఆర్థిక నష్టం -
9వసారి స్పందించడం మిరాకిల్..
పెద్ది సుదర్శన్రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చి న వెంటనే గంట పాటు సీపీఆర్ చేశా. ఎనిమిది సార్లు చేసినా గుండె లయ అందుకోలేదు. తొమ్మిదో సారికి లయ అందుకొని శ్వాస తీసుకుకున్నాడు.. ఇది మిరాకిల్. తర్వాత అంజియోగ్రామ్తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించాం. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగడానికి ఇంజక్షన్ ఇచ్చాం. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళంలో గడ్డకట్టింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాం. – మమత, కార్డియాలజిస్ట్ -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్కు కన్నీటి వీడ్కోలు
కేయూ క్యాంపస్: యూనివర్సిటీ పీజీ కళాశాలలో కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ రవీందర్ గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం చిన్నకోడెపాక గ్రామంలో రవీందర్ మృతదేహానికి కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ నివాళులర్పించారు. అదేవిధంగా కేయూ వర్సిటీ కాలేజీల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీందర్ మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం జరిగిన రవీందర్ అంత్యక్రియలో రిజిస్ట్రార్ రామచంద్రం పాడె మోశారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి.. రవీందర్ కుటుబాన్ని ఆదుకోవాలని చిన్నకోడెపాకలో రిజిస్ట్రార్ రామచంద్రంను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవీందర్ సతీమణికి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం, రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రిజిస్ట్రార్ వెంటనే విషయాన్ని ఫోన్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రామచంద్రం మాట్లాడుతూ రవీందర్ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు సోమవారం కుటుంబానికి అందజేస్తామన్నారు. ఈనెల 27న యూనివర్సిటీకి వచ్చి తనను, వీసీని కలిస్తే డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు. కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు భిక్షపతి, నిరంజన్, వెంకటగోపీనాఽథ్, కనకయ్య, మల్లేశ్, ఓ.మోహన్, వీరేందర్, రవీందర్, నాగేశ్వర్రావు, ప్రవీణ్, దేవోజీనాయక్, శ్రీధర్, నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’లో మీ పేరుందా?
● ఎస్ఎంఎస్తో వివరాలు కాజీపేట : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువు దగ్గర పడుతోంది. ఈనేపథ్యంలో ఓట రు జాబితాలో మీపేరు ఉందో లేదో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పరిశీలించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి 1950 హెల్ప్లైన్కు ఫోన్ చేయొచ్చు. లేదా ఈసీఐ ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నమోదిత మొబైల్ నంబర్ నుంచి ఈసీఐ తెలిపిన విధానంలో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఓటరు వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఎలా తెలుసుకోవాలంటే.. ఎస్ఐఆర్లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈనేపథ్యంలో ఓటర్లు తమ ఎస్ఐఆర్ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం చక్కటి అవకాశం కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే ఈసీఐ అని టైపు చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్కు మెస్సేజ్ పంపించాలి. సెకన్లలోనే ఈసీ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో మీపేరు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, నియోజక వర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే మీపేరు ఎస్ఐఆర్లో నమోదైనట్లు అర్థం చేసుకోవాలి. మెసేజ్లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెసేజ్ రాకపోయినా బూత్ లెవల్ ఆఫీసర్ లేదా ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
పెట్రోల్ పోసి సజీవదహనం
పథకం ప్రకారం పిలిచి.. సాక్షి ప్రతినిధి, వరంగల్: పాత కక్షలు, రాజకీయ వి భేదాల నేపథ్యంలో వ్యాపారిపై పెట్రోల్ పోసి ని ప్పంటించి హత్య చేసిన కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరా రీలో ఉన్నాడు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుమాముల ఎన్టీఆర్ నగర్కు చెందిన వ్యాపారి అడుప మహేశ్ (45)పై ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామి అలియాస్ కుమార్ కక్ష పెంచుకున్నాడు. స్థానిక ప్రజాప్రతినిధి వద్ద తన రాజకీయ ప్రాధాన్యతను మహేశ్ దెబ్బతీస్తున్నాడని అనుమానం పెంచుకున్నారు. మహేశ్ను హత్య చేయాలని ముందుగానే కుట్ర పన్నాడు. ఇందుకోసం మరో ఏడుగురు సహచరులతో కలిసి పథకం రచించాడు. పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య పరిమళకాలనీ రోడ్డు నంబర్–2 వద్ద మహేశ్పై నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన మహేశ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య అడుప నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ కేసు విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలతో వేగంగా ఛేదింపు.. నిందితులను పట్టుకునేందుకు మామునూరు ఏసీపీ వెంకటేష్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామితో పాటు గంధం నరేశ్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్ అలియాస్ బండి శ్రీను, లాసాని రాంసాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సురేశ్ కోసం గాలింపు కొనసాగుతోంది. కఠినశిక్ష పడేలా చర్యలు.. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలి పారు. ఈ కేసును వేగంగా ఛేదించిన మామునూరు ఏసీపీ వెంకటేష్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్ట ర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్ఫోర్స్ సి బ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. రాజకీయ, పాత కక్షలతో వ్యాపారిని హత్య చేసిన ముఠా ప్రధాన నిందితుడిపై గతంలో హత్య కేసు ప్రత్యేక బృందాలతో కేసు ఛేదించిన పోలీసులు.. ఏడుగురి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత -
ఆలోచించండి
పాత ఫోన్లు విక్రయిస్తున్నారా..? ఖిలా వరంగల్ : పాత ఫోన్లు కొంటామంటూ కొందరు నగరం, పట్టణం, గ్రామాల్లో సంచరిస్తున్నారు. వారి పట్ల కాస్తా జాగ్రత్తగా ఉండాలి..ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందంటే నమ్ముతారా..? చిన్నపాటి ఆశచూపి పాత ఫోన్లకు మరమ్మతులు చేసి కొత్త నేరాలకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మూలన పడిన పనికి రాని ఫోనే కాదా..అని నిర్లక్ష్యం చూపకు.. విక్రయించాలనుకుంటే మీకు తెలిసిన రీ సైక్లింగ్ కేంద్రాలు, గుర్తింపు పొందిన డీలర్లకు అమ్మకోవచ్చు. కానీ ఇంటి ముందుకు వచ్చే వారు ఇచ్చే డబ్బుకు ఆశపడి పాతఫోన్లను విక్రయించొద్దని, ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మోసాలకు అవకాశం.. పాడై మూలన పడిన ఫోన్లో సిమ్ కార్డు మరిచిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యకిగత చిత్రాలు, వీడియోలు, నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్లో బ్యాంకింగ్, యాప్లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థికపరమైన మోసాలు జరగొచ్చు. నేరం చేయకపోయినా సహకరించినట్లు భావించే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ ఫోన్లు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే జీవితాంతం కటకటాల్లో ఉండాల్సి రావొచ్చు. నేరం ఒకరిది.. శిక్ష మరొకరిది.. ప్రతీ మొబైల్ ఫోన్కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి(ఐఎంఈఐ) నంబర్ ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు. ప్రజల నుంచి సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు జార్ఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు తరలి వెళ్తాయి జాగ్రత్త. మరమ్మతులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. జాగ్రత్త .. ఎవరైనా వ్యక్తికి /డీలర్కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్ వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లు(ఐఎంఈఐ) నంబర్ విక్రయించిన తేదీ, పేర్కొంటూ రసీదు పొందాలి. ఏరోజు ఎవరికి విక్రయించారనే సమాచారం ఉంటే .. భవిష్యత్లో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయట పడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం పోలీసు కేసులు, ఆర్థిక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని తెలుపుతున్న నిపుణులు -
పార్క్ చేసిన బైక్కు నిప్పుపెట్టిన దుండగులు
ఖిలా వరంగల్ : ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్కు దుండగులు నిప్పు పెట్టి తగుల బెట్టారు. ఈఘటన శుక్రవారం అర్ధరాత్రి ఖిలా వరంగల్ పడమరకోటలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. పడమరకోటకు చెందిన పొన్నం అశోక్కు పొన్నం శ్రీనివాస్, స్వరూప, అతడి కుమారుడు అజయ్ మద్య ఇంటి హద్దు రాళ్ల విషయంపై శుక్రవారం గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం అశోక్ తన ఇంటి ఎదుట సీసీ రోడ్డు పై బైక్ను పార్క్ చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయాన పార్క్ చేసిన బైక్పై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్పోసి నిప్పంటించి పరారయ్యారు. మంటలు ఎగిసిపడంతో స్థానికులు నిద్ర లేచి చూసే సరికే బైక్ మంటల్లో కాలిపోతోంది. వెంటనే నీల్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే 60శాతం వరకు కాలిపోయి రూ. 50వేలు నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధితుడు పొన్నం అశోక్ ఆదివారం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. చేపల వేటకు వెళ్లి మృత్యుఒడికి.. ● గోదావరిలో మునిగి వ్యక్తి మృతి ● అయ్యవారిపేటలో ఘటనవాజేడు: చేపల వేట కోసం వెళ్లి ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరుకున్నాడు. గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేటలో చోటు చేసుకుంది. పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరారపు రామచందర్(55) మరో వ్యక్తితో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల వేట అనంతరం స్నానం చేయడానికి రామచందర్ గోదావరిలోకి దిగి లోతు తెలియకపోవడంతో మునిగి పోయాడు. మరో వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో గ్రామస్తుల సాయంతో ఎస్సై కృష్ణ ప్రసాద్ గాలింపు చర్యలు చేయించి మృతదేహాన్ని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, మృతుడికి భార్య సావిత్రి, నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి వివాహం చేశాడు. -
ప్రాణం తీసిన గర్భస్రావం
జనగామ: జనగామ జిల్లాలో అబార్షన్ (గర్భస్రావం) వికటించి ఓ గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లికి చెందిన మల్కాపురం శ్రావణి(35)ని మండలానికే చెందిన అంబాల భాస్కర్ గౌడ్కు వివాహం చేశారు. వీరు హైదరాబాద్ ఫీర్జాదిగూడలో నివసిస్తుండగా, భాస్కర్ గౌడ్ ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన శ్రావణిని ఆమె అమ్మమ్మ ఊరైన దేవరుప్పుల మండలం కోలుకొండలో ఉంచారు. మరోసారి ఆడబిడ్డ పుడితే కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయనే భావనతో శ్రావణి తల్లి శోభ, కోలుకొండకు చెందిన ఆర్ఎంపీ శ్రావణ్ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్ఎంపీ సూచన మేరకు ఈ నెల 20న హనుమకొండలో ఓ ఇంట్లో లింగనిర్ధారణ స్కానింగ్ నిర్వహిస్తున్న ప్రవీణ్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించగా, గర్భంలో ఆడశిశువేనని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆర్ఎంపీ సహకారంతో జనగామ పట్టణంలోని సంజయ్నగర్లో నివాసముంటున్న ప్రైవేట్ వైద్య సిబ్బంది అనసూర్య వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి అబార్షన్కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న ఆమె ఇంట్లోనే గర్భస్రావం నిర్వహించినట్లు తెలిపారు. గర్భస్రావం అనంతరం ఇంటికి వెళ్లిన శ్రావణికి 23న తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. తిరిగి అనసూర్యను సంప్రదించగా కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో 24న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అనంతరం అక్కడి నుంచి ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ 25వ తేదీన ఉదయం శ్రావణి మృతి చెందింది. ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శ్రావణి తల్లి శోభ, ఆర్ఎంపీ శ్రావణ్, నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ స్కానింగ్ చేసిన ప్రవీణ్, గర్భస్రావం నిర్వహించిన అనసూర్య నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆర్ఎంపీ శ్రావణ్, ప్రైవేటు వైద్య సిబ్బంది అనసూర్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతూ గర్భిణి మృతి నలుగురిపై కేసు.. ఇద్దరి అరెస్ట్ -
హిసార్–తిరుపతి ఎక్స్ప్రెస్కు శాశ్వత హోదా
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉత్తర భారతంలోని హరియాణ రాష్ట్రాన్ని.. దక్షిణ భారతంలోని తిరుపతితో అనుసంధానించే హిసార్–తిరుపతి–హిసార్ వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇకపై శాశ్వత (రెగ్యులర్) రైలుగా సేవలందించనుంది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును రెగ్యులర్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా కొత్త రైలు నంబర్లను కూడా కేటాయించింది. కాగా, గతంలో 04717/04718 నంబర్లతో నడిచిన ఈ రైలు ఇకపై 14723/14724 నంబర్లతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ శనివారం హిసార్ నుంచి (14723) ప్రతీ సోమవారం తిరుపతి నుంచి (14724) ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుందని రైల్వేశాఖ తెలిపింది. ఆరు రాష్ట్రాలు.. 43.20 గంటల ప్రయాణం.. దాదాపు 2,492 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రయాణం ద్వారా హరియాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈ రైలు అనుసంధానిస్తుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 43 గంటల 20 నిమిషాలు పడుతుంది. హిసార్లో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరిన రైలు రాజస్తాన్లోని సదల్పూర్, జైపూర్, మధ్యప్రదేశ్లోని నగడ, ఉజ్జయిని, భోపాల్, మహారాష్ట్రలోని నాగ్పూర్, బల్లార్షా మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అనంతరం సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్, ఖమ్మం స్టేషన్లలో ఆగి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 23 బోగీలతో రైలు.. ప్రయాణికులకు ఊరట ఈ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మొత్తం 23 బోగీలు ఉంటాయి. వీటిలో 2 ఏసీ–2 టియర్, 7 ఏసీ–3 టియర్, 8 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో పాటు 2 సెకండ్ క్లాస్ కమ్ లగేజీ ర్యాక్ కోచ్లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును రెగ్యులర్ చేయడంతో ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం ప్రాంతాల ప్రయాణికులు కూడా ఈ సర్వీసుతో ప్రయోజనం పొందనున్నారు. ఉమ్మడి వరంగల్ వాసులకు ప్రయోజనమే.. హిసార్–తిరుపతి వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు శాశ్వత హోదా కల్పించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. వరంగల్లో ఈ రైలు ఆగుతుండడంతో ఉత్తర భారతంలోని హరియాణ , రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సైనిక సిబ్బంది, యాత్రీకులు నేరుగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఖమ్మం స్టేషన్లో కూడా ఆగుతుండడంతో మహబూబాబాద్, డోర్నకల్, కొత్తగూడెం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ రైలును సులభంగా వినియోగించుకోగలరు. తిరుపతి వెళ్లే భక్తులకు కూడా ఈ సర్వీస్ మరో ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రత్యేక రైలుగా కాకుండా రెగ్యులర్ సర్వీస్గా మారడంతో టికెట్ల లభ్యత, సేవల నిరంతరతపై ప్రయాణికుల్లో విశ్వాసం పెరగనుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నుంచి ఉత్తర భారత రాష్ట్రాలకు నేరుగా వెళ్లే వారానికి ఒక స్థిరమైన రైలు సర్వీస్ అందుబాటులోకి రావడం ప్రాంతీయ ప్రయాణ అవసరాలను కొంత మేర తీర్చనుంది. ఇకపై ప్రతీ వారం రెగ్యులర్ సర్వీస్ ఉత్తర–దక్షిణ భారతాన్ని కలిపే 2,492 కిలోమీటర్లు.. సూపర్ఫాస్ట్కు కొత్త రైలు నంబర్లు తెలంగాణలో వరంగల్, ఖమ్మం మీదుగా రాకపోకలు -
ముగిసిన జిల్లా స్థాయి చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డికాలనీలోని మాస్టర్జీ వికాస్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–13 బా లబాలికల చదరంగ పోటీలు ముగిశాయి. ఈ ము గింపు వేడుకలకు డాక్టర్ ఏలియా, సేజ్ హైస్కూల్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, కెస్ట్ మిత్ర ఫౌండర్ మధు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం చెస్ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన పోటీల్లో బాలుర విభాగంలో సాయి ప్రీతం, శ్రియన్రామ్, అక్షిత్ చౌహాన్, దావల్ సాయి, బా లికల విభాగం నుంచి ఆద్య అనిశెట్టి, వెన్నమల్ల దిలీషా, మునిగాల అక్షర, సహస్ర విజేతలుగా నిలి చినట్లు తెలిపారు. వీరు ఆగస్టులో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా నుంచి ప్రా తినిథ్యం వహిస్తారని తెలిపారు. చీఫ్ ఆ ర్బిటర్ ప్రేమ్ సాగర్, షణ్ముఖ, రాము పాల్గొన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ జపం హన్మకొండ కల్చరల్: సకాలంలో వర్షాలు కురవా లని, రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ జపం, రుద్రాహోమాలు నిర్వహించినట్లు వే యిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేర కు మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపం, పూజలు ఆదివారం ముగిశాయి. ఈ మేరకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో వరుణ జపం, రుశ్యశృంగ పారా యణం, నవగ్రహమంత్రయుక్తంగా వరుణ రుద్రహోమం నిర్వహించారు. అనంతరం వివిధ ఫలపుష్పాలతో మహాపూర్ణాహుతి చేశారు. భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ లోక కల్యాణార్థం పంచభూతాల్లోని ప్రకృతిని రక్షించుకోవడానికి రుద్రహోమాలు నిర్వహించినట్లు తెలిపారు. వేలాదిమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. వేదపండితుడు గంగు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సాయితేజ, శ్రీవత్సవాచార్యులు, శ్రీమాన్ నారాయణచార్యులు, రేవన్, అక్షయ్ పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్: వరంగల్ లక్ష్మీపురం జంతువధ శాలను ఆహార కల్తీ నియంత్రణ, బల్దియా వెట ర్నరీ, వినియోగదారుల మండలి ప్రతినిధులు ఆది వారం తనిఖీ చేశారు. మేకలు, గొర్రెలను, మటన్ షాపుల్లో విక్రయిస్తున్న మాంసం విక్రయాలను పరిశీలించారు. నామమాత్రంగా జంతు వధను కబేళాకు తరలించి, ఇళ్లల్లో, ఖాళీ స్థలాల్లో వధించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. జంతువుల మాంసం, తల, బోటీలను దుర్గంధ ప్రదేశాల్లో శుభ్రం చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ ఆఫీసర్, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
గోరింటాకు సంబురం
తొర్రూరు: ఆషాఢమాసం సందర్భంగా తొర్రూరు పట్టణంలో గోరింటాకు సందడి నెలకొంది. లయ న్స్క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలో గోరింటాకు సంబురాలు నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. తీరొక్క డిజైన్లతో కూడిన గోరింటాకు పెట్టుకుని అతివలు ఆనందంగా గడిపారు. గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని వినాయక ఫ్రెండ్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రతినిధులు బుదారపు పద్మ, కందగట్ల సులోచన, పద్మ, అనురాధ, భవాని, సంధ్యారాణి, స్వాతి పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని రక్తబంధం
నర్సంపేట రూరల్ : మృత్యువులోనూ ఆ అన్నదమ్ముల రక్తబంధం వీడి పోలేదు. అనారోగ్యంతో ఒకే రోజు ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సర్వాపురం గ్రామానికి చెందిన కందికొండ కనుకయ్య, శాంతమ్మ దంపతులకు కొమురయ్య (81), నర్సయ్య (78)తో పాటు కూతురు ఉంది. కొమురయ్య, నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, నర్సయ్యకు ముగ్గురు కుమారులు, ఇద్దరులు కుమార్తెలు ఉన్నారు. రెండు నెలలుగా అనారోగ్యం పాలై ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో తొలిఏకాదశి పండుగ రోజే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముతున్నాయి. అనారోగ్యంతో ఒకే రోజు అన్నదమ్ముల మృతి సర్వాపురంలో ఘటన -
ప్రజలకోసం పనిచేసే నాయకులు కావాలి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ నెహ్రూసెంటర్: భూముల కోసం, కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం, జేబులు నింపుకునే వారు కాకుండా.. ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఈసీఐఎల్, సీఎస్ఆర్ ఆధ్వర్యంలో అందజేసిన అత్యాధునిక అంబులెన్స్ను శనివారం ప్రారంభించారు. అనంతరం హుస్సేన్నాయక్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేసే నాయకుడికి మనుగడ ఉంటుందన్నారు. గూడూరు, మహబూబాబాద్ ఆస్పత్రులకు అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిచేలా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు త్వరలో భర్తీకానున్నాయని చెప్పారు. అంబులెన్స్ను అందించిన ఈసీఐఎల్ సంస్థ బాధ్యులను ఆయన అభినందించారు. జిల్లాలో రూ.10కోట్లతో దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అభివృద్ధి పనుల కోసం తనవద్దకు రావాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఈసీఐఎల్ డైరెక్టర్ చక్రవర్తి, సీఎస్ఆర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, సీఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ సునీల్కుమార్, జీఎంసీ ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, డాక్టర్ వెంకట్రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా తొలి ఏకాదశి
మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీమన్నారాయణుడి ప్రీతికరమైన శనివారం రోజు తొలి ఏకాదశి రావడాన్ని భక్తులు విశేషంగా భావించారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకరణ, అర్చన పూజలు జరిపారు. భక్తులు తమను చల్లంగా చూడాలని శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. కాగా, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి ఆలయంలో తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. -
గుండెపోటుతో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీందర్ మృతి
కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాల కామర్స్అండ్బిజినెస్మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓ రవీందర్( 52) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. విధులు నిర్వర్తించిన అనంతరం హనుమకొండ ఎన్జీఓఎస్ కాలనీలో తాను నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందారని నిర్ధారించారు. రవీందర్కు భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. రవీందర్ మృతి సమాచారం అందుకున్న కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, పలువురు అధ్యాపకులు రవీందర్ మృతదేహాన్ని సందర్శించారు. రవీందర్ మృతితో కుటుంబంతోపాటు సహచర అధ్యాపకుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా రవీందర్ కుటుంబం ఎన్జీఓఎస్ కాలనీలో అద్దెభవనంలో నివసిస్తోంది. రవీందర్ మృతదేహాన్ని శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి సొంత గ్రామం చిన్నకోడెపాకకు తరలించారు. ఆదివారం అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయని సహచర అధ్యాపకులు తెలిపారు. -
రుణాలు ఇప్పిస్తానని మోసం..
మహబూబాబాద్ రూరల్ : ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని పలువురుని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ టౌన్ పీఎస్లో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గూడూరు మండలం చెర్ల తండాకు చెందిన బోడ మహేశ్ అనే వ్యక్తి నీతి ఆయోగ్ డైరెక్టర్ అని చెప్పుకుని తిరిగేడు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద నుంచి సుమారు రూ.1.85 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మహేశ్ను అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులను పరిస్థితులను నమ్మొద్దని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. టౌన్ ఎస్సై గడ్డం ఉమా, సిబ్బంది పాల్గొన్నారు. ఒకరి అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
పంట మార్పిడితో రైతులకు లాభం
● కలెక్టర్ స్నేహ శబరీష్మరిపెడ రూరల్: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతు బాదావత్ వీరన్న–బుజ్జి దంపతుల వ్యవసాయ క్షేత్రంలో పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో పాటు పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై సూచనలు అందించాలని ఆదేశించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంట మార్పిడి విధానాన్ని ప్రతీ రైతు పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో పోషకాహార పంటల సాగును ప్రోత్సహించే నూతన ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని సూచించారు. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన నల్ల తామర పురుగును తట్టుకునే అర్క తేజస్వి మిరప విత్తనాల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. హెచ్ఆర్ఎస్ మల్యాల ప్రధాన శాస్త్రవేత్త ప్రశాంత్, డీఏఓ విజయచంద్ర, జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డి, కమిషనర్ నరేష్రెడ్డి, మరిపెడ వ్యవసాయ అధికారి బోడ వీరసింగ్, తహసీల్దార్ కృష్ణవేణి, సర్పంచ్ లచ్చుపతి, అధికారులు పాల్గొన్నారు. గడువులోగా సర్ ప్రక్రియ పూర్తిచేయాలి మరిపెడ: అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ఫారాలు ఆగస్టు 3లోపు సమర్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. మరిపెడలోని సర్ సవరణ డిజిటలైజేషన్ కేంద్రాన్ని, సాంఘిక సంక్షేమశాఖ బాలికల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, తిరిగి సేకరించాలన్నారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడారు. తరగతి గదులు, కిచెన్షెడ్, డైనింగ్హాల్, టాయిలెట్స్ పరిసరాలను పరిశీలించారు. మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, కౌన్సిలర్లు గంట్ల గౌతమ్రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న గోదావరి
● సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 1,62,994 క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువన వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం 65,300 క్యూసెక్కుల నీటితో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. శనివారం ఉదయం 1,20,300 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం 1,65,994 క్యూసెక్కులకు పెరిగి ప్రవహిస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు రెట్టింపు నీటి ప్రవాహం పెరిగి ప్రవహిస్తోంది. బ్యారేజీ వద్ద ఉన్న గేట్లను ఎత్తి 1,62,994 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గుట్టగంగారంలోని దేవాదుల ఎత్తిపోతల వద్ద పది మోటార్లు ఉండగా అందులో తొమ్మిది మోటార్లను ఆన్ చేసి 2,306 క్యూసెక్కుల నీటిని దిగువలోని భీంఘన్పురం రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు కాళేశ్వరం: ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని సురారం గ్రామానికి చెందిన ఎం. వేణుపై పోక్సో కేసు నమోదు చేసి రి మాండ్కు తరలించినట్లు ఎస్సై సాంబమూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్నకు గురైన బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించిట్లు పేర్కొన్నారు. బాలికల పై జరిగే నే రా ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
విద్యుత్ ఆర్టిజన్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ ఈఈయూ కార్యాలయంలో పల్లా రవీందర్ రెడ్డి భవన్లో విద్యుత్ ఆర్టిజన్ల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐదేళ్లకు ఇవ్వాల్సిన గ్రేడ్ ప్రమోషన్లు ఎనిమిదేళ్లు పూర్తయినా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దేశంలో ఒకే సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ అమలులో ఉండడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, కంపెనీ కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్ నరేందర్ రెడ్డి, నాయకులు కట్ల సదయ్య, తులసి శ్రీమతి రెడ్డి, దొనికల సద య్య, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, పప్పు వెంకటేశ్వర్లు, సలీం పాషా, కోరుకొప్పుల రాంబాబు, చింతలపూడి సతీశ్ కుమార్ పాల్గొన్నారు. -
కాపుకాసి.. కత్తితో గొంతులో పొడిచి
ఖిలా వరంగల్: పాతకక్ష నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు ఏడాదిగా అదును కోసం వేసి చూసి అత్యంత కిరాతకంగా గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట సమీప కాలనీ బీఆర్ నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీఆర్ నగర్కు చెందిన మాడ అనిల్ (23) అదే ప్రాంతానికి చెందిన లారీ క్లీనర్ గిరబోయిన మహేశ్ స్నేహితులు. వీరిద్దరు గతేడాది డిసెంబర్ 31న మద్యం సేవించిన తర్వాత ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అనిల్.. మహేశ్ను కత్తితో పొడవగా తీవ్రగాయాలతో ఎంజీఎంలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. నాటి నుంచి అనిల్ హైదరాబాద్లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాడు మృతుడిపై మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు సైతం నమోదైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా అనిల్ను చంపాలని ఏడాదిగా మహేశ్ ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అనిల్ తమ కులదైవమైన బీరన్న బోనాలకు శుక్రవారం హైదరాబాద్ నుంచి బీఆర్నగర్కు చేరుకున్నాడు. ఈ విషయం మహేశ్ తెలుసుకున్నాడు. ఎలాగైనా చంపాలని మాటువేశాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో బీరన్న గుడికి బయలుదేరిన అనిల్ను మహేశ్ ఎదురెళ్లి ఆకస్మికంగా గొంతులో కత్తితో పొడిచాడు. వెంటనే అనిల్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. దారుణ హత్యను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కళ్లముందే తమ కుమారుడు హత్యగురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడు మహేశ్ నేరుగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈహత్యలో ప్రధాన నిందితుడు మహేశ్కు రాజు అనే వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి పోలీసులు.. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.అనిల్ హత్యతో బీఆర్నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడి ఇంటిపై మృతుడి బంధువులు దాడి చేయకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనిల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాగా.. మహేశ్ బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మా అబ్బాయి ఎవరికి అపకారం చేయలేదు. పాత గొడవను మళ్లీ లేపి చంపారు.. నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని మృతుడి తండ్రి కొమురయ్య కన్నీరుపెట్టుకున్నారు. యువకుడి దారుణ హత్య వరంగల్ నగరంలోని బీఆర్ నగర్లో ఘటన పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు? -
కూరగాయల తండా..
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్/గార్ల: మారుమూల తండాలో పుట్టారు. ఇంటర్, డిగ్రీ, వివిధ కోర్సులు పూర్తిచేసిన తండా యువత ఉద్యోగాలు రాలేదని చింత పడలేదు. ఉన్న కొద్దిపాటి భూమిలోనే బంగారం పండించాలని పట్టుబట్టారు. మూసపద్ధతిలో కాకుండా కాలానుగుణంగా పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో పంట చేతికి వచ్చేలా సాగు మొదలుపెట్టారు. బీర, కాకర, బోడ కాకరకాయ మొదలైన కూరగాయలు సాగుచేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు పంట చేతికి వచ్చింది. ఇలా మూడేళ్లుగా ఎకరం భూమిలో ఆరు నెలల్లో అన్ని ఖర్చులు పోను రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు లాభాలు పొందుతూ.. ఇతర రైతులకు దర్శంగా నిలిచారు గార్ల మండలం బాలాజీ తండా వాసులు. ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం. ఒక్కొక్కరుగా.. గార్ల మండలం బాలాజీతండాలో 90 కుటుంబాలు ఉంటాయి. తండాలో నివాసం ఉండేవారిలో ఎక్కువ మంది వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు. వీరి భూమి చదునుగా కాకుండా కొన్నిచోట్ల గుట్టలతో ఉంటుంది. అయితే గతంలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి సాగుచేసేవారు. పత్తి పంట సాగుచేసిన రైతులు అప్పుల పాలయ్యారు. మొక్కజొన్నను అడవి పందులు, కోతుల బారి నుంచి రక్షించడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో నలుగురు రైతులు తమకు ఉన్న భూమిలో అర ఎ కరం, ఎకరం మేరకు కూరగాయల సాగు చేసి లా భాలు పొందారు. దీంతో తండాలోని సగం మంది రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. వీరి రూటే.. సపరేట్.. గుట్టలు, కొండల మధ్య ఉన్న బాలాజీ తండాలో నీటి వనరులు అంతంత మాత్రమే. వర్షాలు కురిస్తేనే సమృద్ధిగా నీరు ఉంటుంది. లేకపోతే వేసి న బోర్లు సక్రమంగా పోయవు. కాగా, ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఒడిసిపట్టి సాగు చేపడుతున్నారు. ఇతర రైతులతో పాటు కూరగాయల సా గు చేశారు. అయితే పంట బాగా పండినా.. మార్కెట్లో ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన ఆ గ్రామ యువకులు జూన్లో కాకుండా మే నెలలోనే సాగు కు శ్రీకారం చుట్టారు. మండుటెండలో పంటలను కంటికి రెప్పలా కాపాడారు. ఉన్న కొద్దిపాటి నీటిని మొక్క మొక్కకూ పారించారు. 20 రోజుల నుంచి బీరకాయ పంట పండుతోంది. కాకర, బోడకాకర కాయలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో చేతికి వచ్చిన పంటలతో వారికి కాసుల వర్షం కురుస్తోంది. ఎకరం సాగుకు రూ. 50వేల మేరకు పెట్టుబడి పోతుంది. ఒక్క బీరకాయల మీదనే రూ.లక్ష మేరకు లాభం వస్తుందని, కాకర, బోడకాకర కాయలతో మరో రూ.లక్ష మేరకు వస్తాయని రైతులు ధైర్యంగా చెబుతున్నారు. నేరుగా మార్కెట్కు.. బాలాజీ తండా రైతులు తమ పంటను నేరుగా మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ప్రతీ రోజు క్వింటా నుంచి రెండు క్వింటాల మేరకు బీర, కాకర, బోడకాకర కాయల దిగుబడి వస్తుంది. మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, ఇల్లెందు, కుర వి, కారేపల్లి, పండితాపురం గ్రామాల్లోని సంతల కు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద అమ్ముతున్నా రు. మార్కెట్ రేటు కంటే తక్కువకు, తాజా కూరగాయలు దొరకడంతో ప్రజలు తీసుకుంటున్నారు. వేసవిలో మొక్కలు నాటిన బాలాజీతండా రైతులు కొద్దిపాటి నీటి వనరులను ఒడిసిపట్టి పంటలకు జీవం డిమాండ్ ఉన్న సమయంలో పంట చేతికి.. ఎకరానికి రూ.1.50లక్షల మేరకు లాభాలు -
సీపీఐ పోరాటాలతోనే హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం
● ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గార్ల: సీపీఐ పోరాటాల ఫలితంగానే గార్ల పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గార్ల సమీపంలోని పాకాల ఏటిపై నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా రాంపురం, మద్దివంచ జీపీల పరిధి గ్రామాల ప్రజలు గార్లకు రావడానికి రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధుల విడుదల కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, పార్టీ రాష్ట్ర నేత కట్టెబోయిన శ్రీనివాసరావు, అజయ్సారథి, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, రాగం రమేశ్, కృష్ణమూర్తి, జనార్దన్, గిరిప్రసాద్, హరినాయక్, భీముడు, వీరన్న, రమేశ్, వీరన్న, నాగేష్, నాగరాజు, లోకేష్, వెంకటేష్, సుధాకర్రెడ్డి, నీలమ్మ, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బమ్మెరలో కాకతీయుల నాటి ‘గుండా బ్రహ్మయ్య శూలాల శిల్పం’
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధి బమ్మెర గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన ‘గుండా బ్రహ్మయ్య శూలాల శిల్పం’ వెలుగులోకి రావడం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలకుర్తి మండల కేంద్రంలోని సోమన స్మారక మందిరంలోనూ ఇదే తరహా మరో శిల్పాన్ని గుర్తించినట్లు మట్టి ఫౌండేషన్ పరిశోధకులు వెల్లడించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుడు బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెరలోని పోతన మాన్యం భూముల్లో ఉన్న స్మారక మందిరం ప్రాంగణంలో మట్టిలో కూరుకుపోయిన కాకతీయుల కాలం నాటి శూలాల శిల్పాన్ని ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్రెడ్డి ఆధ్వర్యంలో మట్టి ఫౌండేషన్ బృందం వెలికితీసింది. ఫౌండేషన్ ప్రతినిధులు వినయ్ గోలి, ఆఖిల్, సముద్రాల రాజు,డాక్టర్ రాపోలు సత్యనారాయణ తదితరులు ఈ శిల్పాన్ని పర్యాటకుల సందర్శనార్థం నిలబెట్టారు. సుమారు నాలుగు అడుగుల ఎత్తైన ఈ శిల్పపై రెండు శూలాలు చెక్కి ఉండడం విశేషం, ఇవి వీరవైశ సంప్రదాయంలో గుండా బ్రహ్మయ్యల త్యాగానికి ప్రతీకలని పరిశోధకులు తెలిపారు. ఇదే తరహా శిల్పం వరంగల్ జిల్లా గవిచర్లలోని గూండా బ్రహ్మయ్య ఆలయంలో పూజలందుకుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పాలకుర్తి సోమన స్మారక మందిరంలో ధ్వజస్తంభం గద్దె వద్ద ఉన్న శిల్పం కూడా గూండా బ్రహ్మయ్యదేనని గుర్తించారు. పాలకుర్తి సోమన్న స్మారక మందిరంలో మరో శిల్పం గుర్తింపు ‘మట్టి ఫౌండేషన్’ పరిశోధనలో అరుదైన ఆధారాలు -
కర్రతో కొట్టి.. గోర్లతో మెడను పిసికి
దుగ్గొండి: మద్యం అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. మానవత్వాన్ని మంట కలుపుతోంది. రక్త సంబంధాలను సైతం మరిపిస్తోంది. దీనికి నిదర్శనమే ఈ ఘటన. మద్యం మత్తులో ఓ యువకుడు తన పెద్దనాన్నను కర్రతో కొట్టి గోర్లతో మెడను పిసికి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కుల సాంబరెడ్డి(56), తిరుపతిరెడ్డి అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోయారు. సాంబరెడ్డి మానసిక దివ్యాంగుడు కావడంతో పెళ్లి కాలేదు. తిరుపతిరెడ్డికి పెళ్లి అయి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిరెడ్డి భార్య క్యానర్తో చనిపోయింది. దీంతో సాంబరెడ్డి ఆలనాపాలన తమ్ముడు తిరుపతిరెడ్డి చూస్తున్నాడు. తిరుపతిరెడ్డి మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి తిరుపతిరెడ్డి పెద్ద కుమారుడు రాజు.. పెద్దనాన్న వద్ద ఉంటూ అతడికి వండి పెడుతున్నాడు. చిన్నకుమారుడు తిరుమల్ వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు పెళ్లి కాలేదు. మద్యానికి బానిసగా మారాడు. శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజుకు పెద్ద నాన్న సాంబరెడ్డి దుస్తుల్లోనే మల విసర్జన చేసి కనిపించాడు. దీంతో కోపోద్రెకుడైన రాజు పెద్దనాన్నను అర్ధరాత్రి కర్రతో విపరీతంగా కొట్టాడు. మెడ బాగాన్ని చేతులతో పిసికి గోర్లతో రక్కాడు. దీంతో సాంబరెడ్డి తెల్లవారుజామున మృతి చెందాడు. రైతుబీమా ప్రీమియం తీసుకున్న రాత్రే హత్య.. తిరుపతిరెడ్డికి వ్యవసాయ భూమి ఉండగా తన నామినీగా ఇద్దరు కుమారులను కాకుండా అన్న సాంబరెడ్డిని పెట్టుకున్నాడు. దీంతో తిరుపతిరెడ్డి మృతి అనంతరం రైతు బీమా కింద రూ. 5లక్షలు వచ్చాయి. శుక్రవారం గిర్నిబావిలోని ఏపీజీవీబీ బ్యాంకుకు సాంబరెడ్డి ఇద్దరు తమ్ముడి కుమారులతో కలిసి వెళ్లాడు. డబ్బులు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన రాత్రే హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. గొయ్యి తీసి పూడ్చడానికి ప్రయత్నం.. సాంబరెడ్డి మృతిచెందాడని తెలుసుకున్న రాజు.. మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి శనివారం తెల్లవారుజామున గుంత తీయడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు వారు వెళ్లి చూడగా సాంబరెడ్డి మృతి చెంది ఉన్నాడు. వెంటనే వా రు 100 నంబర్కు ఫోన్ చేశారు. దీంతో ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్సై రణధీర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడి చెల్లి చల్లా ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. కాగా, రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే తాను కర్రతో పెద్దనాన్నను కొట్టానని, చనిపోతాడని అనుకోలేదని తెలిపినట్లు సమాచారం. మద్యం మత్తులో పెద్దనాన్నను చంపిన యువకుడు దుగ్గొండి మండలం నాచినపల్లిలో దారుణం -
వైద్యరంగానికి భారీ ఊతం
సాక్షిప్రతినిధి, వరంగల్ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హానరేరియం, ఎంటీఎస్ ఉద్యోగాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేడర్లలో పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్కు పెద్దపీట వేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా పోస్టుల కేటాయింపు.. ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు. ● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ తదితర పోస్టులు ఇచ్చారు. ● మహబూబాబాద్కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏడుగురు ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఇచ్చారు. ● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వేతనాలకూ భారీ వ్యయం.. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.1.25 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, సీనియర్ రెసిడెంట్లకు రూ.1,06,461, ట్యూటర్లకు రూ.55 వేల వరకు పారితోషికం చెల్లించనున్నారు. ఇతర అవుట్సోర్సింగ్, సాంకేతిక సిబ్బందికి సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు అందజేయనున్నారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, రిమ్స్ ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన బడ్జెట్ హెడ్ల నుంచి ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. కాగా ఉమ్మడి వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆసుపత్రి, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల బోధన, వైద్య సేవలు కొనసాగేందుకు ఈ ఉత్తర్వులు మరింత కీలకంగా మారనున్నాయి. డీఎంఈ పరిధిలో పోస్టుల కొనసాగింపు... కొత్తగా కేటాయింపులు బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలకు భరోసా -
చిన్నారి హత్యకు యత్నించిన వ్యక్తి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు కొడకండ్ల : పాత గొడవలు, భూతగాదాలను దృష్టిలో ఉంచుకుని ఓ చిన్నారి హత్యకు యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం కేసు వివరాలను విలేకరులకు వివరించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన అందె మధు, జ్యోతి దంపతుల కుమార్తె నౌమిక శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తమ ఇంటి సమీపంలోని అందె సత్తార్ ఇంటి ఆవరణలోని సంపులో అనుమానాస్పదంగా పడి మూత పెట్టి ఉంది. అదే సమయంలో తన కూతురి కోసం తల్లి జ్యోతి వెతుకుతూ సంపు వైపు వెళ్లగా అమ్మ అని అరుపులు వినిపించాయి. దీంతో సమీపంలో ఉన్న అందె భవాని, ఉప్పలమ్మ సాయంతో సంపు నుంచి కూతురిని జ్యోతి బయటకు తీసింది. ఇదే సమయంలో తనను చూసి అందె రంజిత్ అనే వ్యక్తి పారిపోయాడని, అతనిపై అనుమానం ఉందని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని విచారించగా చిన్నారి తాత అందె వెంకన్నతో గత పాత గొడవలు, భూతగాదాలపై కక్ష పెంచుకుని నౌమిక హత్యకు యత్నించినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. పెరిగిన కోమళ్ల టోల్ ప్లాజా రుసుములు రఘునాథపల్లి : వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ ప్లాజా రుసుములు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి లింకింగ్ ఫ్యాక్టర్ పునరుద్ధరణతో 5 శాతం టోల్ ధరల పెంపునకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) హైదరాబాద్ ప్రాంతీయ ఆఫీస్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఈ నెల 27, జూలై 2026 నుంచి 31, మార్చి 2027 వరకు అమలులో ఉంటాయి. కారు, జీప్, వ్యాన్, లైట్ మోటారు వాహనం ఒక వైపు రూ 130, ఇరు వైపులా రూ. 190, నెల వారీ 4,295, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు ఒకవైపు రూ. 210, ఇరువైపులా రూ. 310, నెలవారీ రూ. 6,935, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ. 435, ఇరువైపులా రూ. 655, నెల వారీ రూ. 1,4530, త్రీ యాక్షల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ. 475, ఇరు వైపులా రూ. 715, నెలవారీ రూ.1,5850, హెచ్సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ. 685 ఇరువైపులా రూ.1,025, నెలవారీ రూ. 22,785, ఓవర్సైజ్ వాహనం ఒక వైపు రూ. 830, ఇరువైపులా రూ. 1,250, నెల వారీ రూ. 27,740కు పెంచారు. నెల వారి పాస్ రూ. 350 నుంచి రూ. 360కి పెరిగింది. ● రేపటి నుంచి అమల్లోకి ● ఐదు శాతం పెరగనున్న ధర -
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య
వరంగల్ క్రైం : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలసముద్రంలో శనివారం ఓ ఇంట్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్కలగుట్టలోని లిటిల్ మంకీస్ బేకరీలో పనిచేసే బాసిక నాగరాజు(25) ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు లేవనెత్తారు. ఘటనాస్థలిలో ఉరేసుకోవడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం అనుమానాలకు కారణమైంది. నడికూడ మండలం ధర్మరం గ్రామానికి చెందిన నాగరాజు ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బాలసముద్రం చేరుకున్నారు. కుటుంబ సభ్యులు రాకముందే మృతదేహం తొలగించాలని పోలీసులు యత్నించారని, గతంలో సుబేదారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై సుమన్ తమ కుమారుడిని అకారణంగా కొట్టారన్నారు. అప్పటి నుంచి నాగరాజు మానసిక వేదనకు గురైనట్లు ఆరోపించి తమకు న్యాయం చేయాలని కుటుంబీకులు, బంధువులు ఘటనాస్థలిలో రాత్రి 8.30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాగా, గతంలో బేకరీ నుంచి ఎస్సై సుమన్.. నాగరాజును బయటకు తీసుకెళ్తున్న వీడియో వైరల్గా మారింది. ఎస్సైతోపాటు ఇద్దరిపై కేసు నమోదు.. కుటుంబ సభ్యులు, బంధువులు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి నాగరాజు మృతిపై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కాగా, నాగరాజు తండ్రి చేరాలు ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్తో పాటు బేకరీ యజమాని శ్రీకాంత్, జిమ్ సెంటర్ యజమా ని సురేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. నాగరాజు ఆత్మహత్యతో వెలుగులోకి కుళ్లిన ఆహార పదార్థాలు.. నక్కలగుట్టకు చెందిన లిటిల్ మంకీస్ బేకరీ స్టోరేజీలో కుళ్లిన చికెన్తోపాటు ఇతర పాడైన ఆహార పదార్థాలు పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. నాగరాజు మృతదేహం చూడడానికి వచ్చిన వారికి కుళ్లిన ఆ హార పదార్థాలు దర్శనమిచ్చాయి. ఈ ఘటనలో ని ర్వాహకులపై ఇప్పటి వరకు టాస్క్ఫోర్స్, పోలీసు అధికారులు దృష్టిసారించకపోవడంపై పలు ఆరోపణాలు వస్తున్నాయి. ఫుడ్సెఫ్టీ అధికారులు కూడా బేకరీ, హోటళ్లపై దాడులు చేసి ఆహార పదార్థాలను తనిఖీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సుబేదారి ఎస్సైతో సహా ఇద్దరిపై కేసు నమోదు కుటుంబీకులు, బంధువుల ఆందోళన -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పూర్తి
● 4,5 తరగతుల్లో 28 మంది విద్యార్థులు ● డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4, 5వ తరగతుల్లో ప్రవేశాల ప్రక్రియ శనివారం పూర్తయిందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిభా ఎంపిక పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా, రెండో దఫాలో 28 మంది విద్యార్థులు స్కూల్లో చేరినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ చిన్న వయసు నుంచే ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు శాసీ్త్రయ విధానంలో క్రీడా శిక్షణ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్కూల్లో విద్యార్థులకు వసతి, పోషకాహారం, వైద్య సేవలు, విద్యా సౌకర్యాలు, క్రీడా సామగ్రి వంటి అన్ని వసతులను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి వారి ప్రతిభను మరింత మెరుగుపరచాలని డీవైఎస్ఓ ప్రశాంత్ సూచించారు. -
సూపరింటెండెంట్ పోస్టులు భర్తీచేయాలి
వరంగల్ అర్బన్: బల్దియాలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయాలని జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సూపరింటెండెంట్ పోస్టులు గత మూడేళ్లుగా ఖాళీ గా ఉంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు బొట్ల రమేష్, వర్కింగ్ అధ్యక్షుడు రాజారపు భాస్కర్, ప్రధాన కార్యదర్శి బాకం సంతోష్కుమార్, కోశాధికారి సర్జన్ రాజు, ప్రతినిధులు ఇజ్రాయిల్, విజయ్ ఉన్నారు. ట్రైసిటీలోని సమస్యలు పరిష్కరించాలి ట్రైసిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వెంకన్నను కలిసి వినతిపత్రం సమర్పించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, ఉపాధ్యక్షుడు నాగులగాం నర్సయ్య, హనుమకొండ సీడబ్ల్యూసీ మెంబర్ కజాంపురం దామోదర్ పాల్గొన్నారు. -
నీలా, నిత్యాక్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారిని నీలా, నిత్యాక్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యహ్నికపూజలు జరిగాయి. అనంతరం స్నపనమూర్తిని కాళీకల్పకంలోని నీలాక్రమంలో ఐదుశిరస్సులు, దశభుజాలు, నీలవర్ణ దేహం కలిగి ఎర్రపట్టుచీర, స్వర్ణాభరణ భూషితమైన గాయత్రిమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో నిత్యామాతగా అలంకరించి చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రాముల సునీత పర్యవేక్షించారు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మాడవీధులు, రాజగోపురం నిర్మాణం ప్లాన్ శ్రీకుడాశ్రీ అధికారి అజిత్రెడ్డితో కలిసి ఈఓ రామల సునీత, అర్చకులు భద్రకాళి పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈ వరుణ్, ఆలయ సిబ్బంది హరానిధ్, కృష్ణ, శ్యామ్సుందర్ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత జనగామ రూరల్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ నాజర్ శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణంలోని ధర్మకంచ ఏరియా పెద్దమోరి వద్ద ట్రాలీతో ఓ వ్యక్తి, మోటార్ సైకిల్తో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ట్రాలీని తనిఖీ చేసి సుమారు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు మహమ్మద్ అస్సాం జానీ, నాగులు, యాదగిరితోపాటు ట్రాలీ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. యువకుడి ఆత్మహత్య మహబూబాబాద్ రూరల్ : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా గ్రామపంచాయతీ పరిధి గడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ హెడ్ కానిస్టేబుల్ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డిగూడెం గ్రామానికి చెందిన మేడి యాదగిరి కుమారుడు గోవిందు (25) సుతారి కూలిపని చేస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం గోవిందు మధ్యాహ్నం వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఐడీఓసీ భవన ప్రారంభంలో నిర్లక్ష్యం : రవికుమార్ వరంగల్ చౌరస్తా: వరంగల్ జిల్లా ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) పనులు దాదాపు పూర్తికావచ్చినా ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. సుమారు రూ.80 కోట్ల ప్రజల సొమ్ముతో ఆజంజాహి మిల్లు మైదానంలో ఐడీఓసీ భవనాన్ని నిర్మించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్లే నేటికీ ప్రజలకు అందుబాటులోకి రాలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో మంత్రి కొండా సురేఖ పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. -
ఆర్టీసీలో సంస్థాగత మార్పులు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో సంస్థాగతంగా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నియామక విధానంలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే సౌకర్యార్థం జోన్ల మార్పుకు పూనుకుంది. ఈ మేరకు రెవెన్యూ జిల్లాల వారీగా సంస్థాగతంగా జోన్ల పునర్వ్యవస్థీకరిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి అనుగుణంగా నియామక నిబంధనలలోని రెగ్యులేషన్–8ను సవరించనుంది. ప్రస్తుతం సంస్థలో ఉన్న 11 రీజియన్లను జిల్లాస్థాయి స్థానిక కేడర్లుగా, కరీంనగర్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అనే మూడు జోన్లను జోనల్ కేడర్లుగా పరిగణిస్తున్నారు. ఇకపై 95 శాతం స్థానిక రిజర్వేషన్ సమర్థంగా అమలు చేసేందుకు సమీప జిల్లాలు, సమీప జోన్లను స్థానిక ప్రాంతాలుగా నిర్వచించి, ప్రతి రెవెన్యూ జిల్లా, జోన్ జనాభా నిష్పత్తి ఆధారంగా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జోన్ స్థాయి, డిపోల పునర్విభజన కొత్త సంస్థాగత నిర్మాణంలో భాగంగా వరంగల్, ఖమ్మం రీజియన్ను కరీంనగర్ జోన్నుంచి హైదరాబాద్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. జోన్ల మార్పు మేరకు డిపోల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వరంగల్ రీజియన్లోని భూపాలపల్లి డిపోను కరీంనగర్ రీజియన్లోకి మార్చారు. కొత్త జోన్ల నిర్మాణంలో భాగంగా జోన్–1లో వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం రీజియన్లు కలిపి మొత్తం 31 డిపోలు ఉంటాయి. జోన్–2లో రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లోని మొత్తం 37 డిపోలు. జోన్–3లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ రీజియన్లోని మొత్తం 29 డిపోలు ఉంటాయి. కొత్త సంస్థాగత నిర్మాణం ద్వారా స్థానిక కేడర్ల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ నియామకాలలో 95 శాతం స్థానిక రిజర్వేషన్ అమలు సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ల పునర్వ్యవస్థీకరణ కరీంనగర్ నుంచి హైదరాబాద్ జోన్లోకి వరంగల్ రీజియన్ వరంగల్లోని భూపాలపల్లి డిపో కరీంనగర్ రీజియన్కు.. -
ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి
హన్మకొండ: నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీకి బాధ్యుడిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం హనుమకొండ గోకుల్ కూడలిలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోదీ హఠావో.. దేశ్కీ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థుల ధర్నాకు మద్దతుగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్ష విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ.. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థినులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. కార్యక్రమంలో నాయకులు మొట్టె యామిని, కొమురమ్మ, రహీమన్నీసా, లలితా, స్వరూప, కవిత, కృష్ణవేణి, జ్యోతి. ప్రశాంతి, నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, బంక చంద్ర శేఖర్, కిశోక్, కేతిడి దీపక్రెడ్డి, రెండ్ల శ్రీనివాస్, అనిల్, ఎండీ.కరీం, పూరెళ్ల రవి కిరణ్, నేహాల్ పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ -
ప్రత్యామ్నాయ పంటల హ్యాండ్బుక్ భేష్
జనగామ రూరల్: ఎల్నినో ప్రభావ నివారణకు ప్రత్యామ్నాయ పంటల అమలుకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా వినూత్న రీతిలో శ్రీకారం చుట్టా రు. ఎల్నినో కాంటింజెన్సీ హ్యాండ్బుక్ను రూపొందించి దీని ఆధారంగా జిల్లాలో విసృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీతెలంగాణ వ్యవసాయ అత్యవసర – ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026్ఙ హ్యాండ్బుక్ను సచివాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో తొలిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మంచి పుస్తకాన్ని రూపొందించిన కలెక్టర్ను అభినందించారు. రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 35శాతం వర్షాభావం కారణంగా వరి, పత్తి పంటల సాగులో ఏర్పడిన 52,435 ఎకరాల లోటును ప్రత్యామ్నాయ వర్షాధార పంటలతో భర్తీ చేసేందుకు కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 నాటికి లక్ష్య సాధనలో జూలై 18 నాటికి నమోదైన 6,866 ఎకరాల 13.1శాతం ప్రగతి నుంచి మిగిలిన 45,569 ఎకరాల్లో ఆగస్టు 31 నాటికి విత్తనాలు వేసేలా కలెక్టర్ రోజువారీ కార్యాచరణను ఖరారు చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎల్నినో కమిటీ చైర్మన్ జి. చిన్నారెడ్డి, వ్యవసాయ సంచాలకుడు బి.గోపి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని పాల్గొన్నారు. జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను అభినందించిన మంత్రి తుమ్మల -
36 ఏళ్ల తర్వాత సోదరి ఇంటికి ఆశన్న
తొర్రూరు రూరల్: మాజీ మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న 36 ఏళ్ల తర్వాత మానుకోట జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలోని తన అక్క, బావ ఇంటికి శుక్రవారం వచ్చారు. దీంతో అక్కబావలైన కోమాళ్ల సౌమ్యదామోదార్రావుతోపాటు గ్రామ పెద్దలు ఆశన్నకు స్వాగతం పలికారు. తన చిన్నతనంలో వచ్చిన ఆశన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో పని చేసి అనేక ఏళ్ల తర్వాత జన జీవన స్రవంతిలోకి వచ్చారు. అక్క, బావలు అప్యాయత, ప్రేమతో ఆశన్నను ఆలింగనం చేసుకుని ఆనందంగా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బందు శ్రీనివాస్, నాయకులు కోమాళ్ల లింగారావు, కందాడి అచ్చిరెడ్డి, కొమ్ము యాకయ్య, బందు జంపన్న, గుంశావలి, గణేష్ పాల్గొన్నారు. -
దాడుల వీడియోలు చూసే తీరిక ఉండదా..?
రఘునాథపల్లి: ‘ఢిల్లీలో విద్యార్థులపై అమానుషంగా పోలీసులు దాడులు చేస్తే,, వీడియోలు చూసే సమయం లేదని కొందరు పెద్దలు అంటున్నారు. మరి దేనికి సమయం ఉంది. కార్పొరేషన్లకు మేలు చేసేందుకా’..? అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సమస్యపై దేశం మొత్తం అల్లాడుతుంటే..పట్టించుకునే తీరిక ఉండదా అని అన్నారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన యువత ఉద్యోగాలు రాక అసహనం నుంచి పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ అన్నారు. నిజంగా మీకు శ్రీరాముడిపై భక్తి ఉంటే,, ఇప్పటికై నా ప్రజలకు మంచి చేయాలన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత దూషణలు సబబు కాదని, సమస్య పక్కదారి పట్టించేందుకే ఈ రాజకీయమని పేర్కొన్నారు. కాళేశ్వరం సంబంధించి టెక్నికల్ సమస్య ఉందని, తాము కూడా చూశామన్నారు.. అయినా నీళ్లు కావాలని,, సీఎం రేవంత్రెడ్డి స్పందించి బ్యారేజీలు కొట్టుకుపోకుండా హైదరాబాద్కు తాగునీరు, రైతులకు సాగు నీరందించేందుకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో అవకాశవాదులు ఉన్నారని, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. వందేళ్ల సీపీఐలో నీతి, నిజాయితీగా ధర్మంగా పార్టీ కార్యకర్తలు ఎర్రజెండాతో పని చేస్తున్నారన్నారు. పార్టీ మండల కార్యదర్శి కావటి యాదగిరి అధ్యక్షతన జరిగిన తరగతుల్లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు ఇట్టబోయిన ఉమామహేష్, ఆది సాయన్న, పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, కందుకూరి మల్లేశం, సోమయ్య, సోమయ్య, రమేష్, శ్రీశైలం, సదానందం, కుమారస్వామి, యాదలక్ష్మి, ప్రశాంత్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
ప్రశస్త్.. ప్రయోజనాలు మస్త్
కాళోజీ సెంటర్: పాఠశాల విద్యార్థుల్లోని వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన ప్రభుత్వ సాయం, విద్యావనరులను అందించేందుకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన శ్రీప్రశస్త్శ్రీ మొబైల్ అప్లికేషన్ వారధిలా ఉపయోగపడనుంది. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో సహా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. రైట్స్ ఆఫ్ పర్సనన్స్ విత్ డిజబిలిటీస్ (ఆర్పీడబ్ల్యూడీ) చట్టం–2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలను స్క్రీనింగ్ చేసేందుకు ఉపాధ్యాయులకు ఈయాప్ ఎంతో దోహదపడనుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రశస్త్ యాప్లో పలు కొత్త మార్పులను తీసుకొచ్చారు. స్క్రీనింగ్ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో పూర్తి చేసేలా రూపొందించారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌనన్్ లోడ్ చేసుకోవాలి. పాఠశాల శ్రీయూడీఐఎస్ఈశ్రీ కోడ్, నమోదు చేసిన మొబైల్ నంబర్ (ఓటీపీ) ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే వివిధ వైకల్యాలపై అవగాహన కల్పించే 10 వీడియోలు కనిపిస్తాయి. ప్రతి ఉపాధ్యాయుడు ఈ వీడియోలను తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా తరగతి గదిలోని విద్యార్థుల మానసిక, శారీరక వైకల్యాలను సులభంగా గుర్తిస్తారు. మొదటి దశలో ఉపాధ్యాయులు గుర్తించిన విద్యార్థులను స్పెషల్ ఎడ్యుకేటర్ పునఃపరిశీలిస్తారు. ఒకవేళ మొదటి స్క్రీనింగ్లో ఉపాధ్యాయులు వైకల్యాన్ని తప్పుగా గుర్తిస్తే.. రెండో దశలో స్పెషల్ ఎడ్యుకేటర్ దానిని సరిచేస్తారు. స్పెషల్ ఎడ్యుకేటర్ రెండో స్క్రీనింగ్ పూర్తిచేసిన తర్వాతే ఆ పాఠశాల శ్రీప్రశస్త్శ్రీ స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తారు. సమగ్ర డిజిటల్ చెక్ లిస్ట్లోని 21 రకాల వైకల్యాలను ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా సులభంగా అసెస్ చేయవచ్చు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (సీడబ్ల్యూఎస్ఎన్) పాఠశాల స్థాయిలోనే గుర్తిస్తే వారికి తగిన బోధనా వనరులను సమయానుకూలంగా అందించవచ్చు. స్క్రీనింగ్ అనంతరం యాప్ ద్వారా జనరేట్ అయ్యే శ్రీపాఠశాల స్థాయి నివేదికశ్రీలను సంబంధిత అధికారులకు సమర్పించాలి. అనంతరం విద్యార్థులు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందే ప్రక్రియ వేగవంతమవుతుంది. వైకల్యాలు గుర్తించేందుకు ఉపయోగపడనున్న యాప్ పాఠశాలస్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్ స్క్రీనింగ్ -
ప్రకృతివైద్యంతో ప్రజలకు ప్రయోజనమే..
కేయూ క్యాంపస్: మానవాళికి ప్రకృతివైద్యం ఎంతో మేలు చేస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు రామేశ్వరం హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేటలో నిర్వహిస్తున్న ఇంటర్నేషల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్సెంటర్ 8వ వార్షికోత్సవం, ఆయన రాసిన ప్రకృతివైద్య గ్రంధాల సూచికల పుస్తకావిష్కరణ కార్యక్రమం కేయూలోని సెనెట్హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు ప్రకృతివైద్యమే బలమైన మూలాధారం అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా రామేశ్వరం మానవ సమాజానికి సమాజ ఉన్నతికి తనవంతు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఆహార నియమాలు భారతీయ సంస్కృతిలో ఎప్పటినుంచో ఉన్నాయన్నారు. కానీ వాటిని పాటించకపోవడం వల్లనే ప్రస్తుతం అనేక వ్యాధులకు కారణమన్నారు. కోవిడ్ వ్యాప్తి కాలంలో మానవాళి మనుగడకు ప్రకృతివైద్యం, సహజజీవన విధానాలు ఎంతగానో ఉపకరించాయని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ.. నేటి ఆధునిక సమాజంలో ప్రకృతి సిద్ధమైన స్వీయ స్వస్థత ప్రక్రియ ద్వారా(నేచురల్ హీలింగ్) ఆరోగ్యాన్ని పునరుద్దరించుకునేందుకు అవసరమైన ఓపిక, నిరీక్షణ, విశ్వాసం నేటితరంలో లేదన్నారు. ప్రకృతిసిద్ధమైన స్వీయ స్వస్థతపై అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ ఇంచార్జ్ డైరెక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ.. భారతదేశం యోగా, ప్రకృతి వైద్యంపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తుందని, అమూల్యమైన ఈ భారత వైద్య వారసత్వాన్ని భావితరాలకు అందించాలని అన్నారు. చరిత్రకారులకు కూడా తెలియని ఎన్నో విషయాలు రామేశ్వరం సేకరించారని కొనియాడారు. అనంతరం ఇంటర్నేషనల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్సెంటర్ వ్యవస్థాపకుడు ఆచార్య రామేశ్వరం మాట్లాడుతూ.. సమాజానికి తనవంతుగా సేవ చేయాలనే లక్ష్యంతో ఈప్రకృతి వైద్య సాహిత్య విజ్ఞాన సంపదతో లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్( కుర్తా) అధ్యక్షుడు ఆచార్య సదానందం అధ్యక్షతహించగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, ఢిల్లీలోని ఇండియన్ నేచర్క్యూర్ ప్రాక్టిషనర్ అసోసియేషన్ అధ్యక్షుడు ధన్లాల్షిండ్రే, డాక్టర్ అవదేశ్మిశ్రా, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రాజ్భౌజి, డాక్టర్ గోపి, డాక్టర్ వర్మ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ, డాక్టర్ రాధికారాణి, వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. అనంతరం రామేశ్వరం రాసిన ప్రకృతివైద్య వ్యాససూచికలకు సంబంధించిన 11 పుస్తకాలను ఆవిష్కరించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ప్రకృతివైద్యగ్రంధం సూచిక పస్తకాల ఆవిష్కరణ -
నిత్యాగా రాజరాజేశ్వరి దేవి
పంచబిల్వాలకు సంప్రోక్షణ నిర్వహిస్తున్న అర్చకుడుపంచబిల్వాలతో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకుడు హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని నిత్యాగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తులసి, బిల్వ, నిర్గుండి, జంబిరా, అమల్ల పంచబిల్వాలతో అర్చన చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. -
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు
మరమ్మతు కారణంగా బోర్వెల్ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపిన డ్రైవర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్లక్ష్యంగా రోడ్డుపక్కన నిలిపి యువకుల మృతికి కారణమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట శుక్రవారం గిరిజన గిరిజన సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేస్తూండగా కొంత మంది యువకులు పోలీస్స్టేషన్ ఎస్సై చాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసు సేష్టన్లో ఉద్రిక్తత నెలకొంది. సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బోరు బండి యాజమానులను పిలించి వారితో చర్చలు జరిపారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు. ఆస్పత్రికి వెళ్లొస్తూ బోర్వెల్ను ఢీ కొట్టిన యువకులు హెల్మెట్ ధరించకపోవడంతో ఇరువురూ మృత్యువాత పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబాల ఆందోళన స్నేహితుల మృతితో గ్రామంలో విషాదఛాయలు -
నకిలీ కాస్మొటిక్స్తో జాగ్రత్త
● పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో తనిఖీలు జనగామ: జనగామ పట్టణంలోని సూపర్ మార్కెట్లు, బ్యూటీ పార్లర్లు, ఫ్యాన్సీ స్టోర్లు, కాస్మటిక్స్ విక్రయ కేంద్రాల్లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. జనగామ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. తనిఖీల సందర్భంగా వివిధ రకాల కాస్మొటిక్ ఉత్పత్తుల లేబుల్స్ , నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యతా నిర్ధారణ కోసం పలు ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ సందర్భంగా అధి కారులు మాట్లాడుతూ.. కాస్మొటిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసే సందర్భంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, దిగుమతి చేసిన (ఇంపోర్టెడ్) ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో వాటిపై దిగుమతిదారు వివరాలు, అవసరమైన రిజిస్ట్రేషన్, అనుమతుల వివరాలను పరిశీలించాలని తెలిపా రు. కాస్మొటిక్స్ వాడిన తర్వాత చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, మంట లేదా ఇతర ప్రతికూ ల ప్రభావాలు కనిపిస్తే వినియోగాన్ని నిలిపివేసి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. -
ఖాళీ పోస్టులు.. అస్తవ్యస్తంగా సేవలు
హన్మకొండ: కీలక పోస్టుల ఖాళీతో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీ ఎన్పీడీసీఎల్) అస్తవ్యస్తంగా తయారైంది. వేలాది పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో విద్యుత్ సేవలు, నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పోస్టుల భర్తీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో 2,090కు పైగా జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు, 1,900కు పైగా సబ్స్టేషన్ ఆపరేటర్లు, సుమారు 100 చొప్పున అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులూ భర్తీకి నోచుకోలేదు. వినియోగదారులకు తప్పనితిప్పలు.. విద్యుత్ వినియోగదారులకు నేరుగా సేవలు అందించే జేఎల్ఎంల కొరత అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్కు స్పందించడం, తెగిపోయిన విద్యుత్ లైన్ల మరమ్మతులు, కాలిపోయిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ, దెబ్బతిన్న కేబుళ్ల మరమ్మతులు, గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ అంతరాయాల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు జేఎల్ఎంలపైనే ఉంటాయి. ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండటంతో సకాలంలో సేవలు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్స్టేషన్ ఆపరేటర్ల కొరత కూడా విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో కొత్తగా నిర్మించిన పలు సబ్స్టేషన్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. అయిదుగురు ఆపరేటర్లు పని చేయాల్సిన సబ్ స్టేషన్ను ఒక్కరిద్దరితో నెట్టుకొస్తుండడం గమనార్హం. నత్తనడకన అభివృద్ధిపనులు.. సెక్షన్ స్థాయిలో సాంకేతిక పర్యవేక్షణ నిర్వహించే ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో నిర్వహణ, తనిఖీలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్ ఆర్డర్ తీసుకునే వారు లేక అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. మరోవైపు జూనియర్ అసిస్టెంట్, జేఏఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో కార్యాలయ పరిపాలనా పనులు సైతం నిమ్మదిస్తున్నాయి. సంస్థలో ఖాళీల భర్తీకి అనుమతి ఇవ్వాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇవి కొత్త పోస్టులు కాకుండా రిటైర్మెంట్, పదోన్నతులు, ఇతర కారణాలతో ఖాళీ అయిననే వీటిని భర్తీ చేసినా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదు. అయినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించకపోవడంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే రెగ్యులర్ నియామకాలకు సమ యం పట్టినా, కనీసం సబ్స్టేషన్ ఆపరేటర్లను అవు ట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తే కొత్త సబ్స్టేషన్లు పూర్తిస్థాయిలో పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.టీజీఎన్పీడీసీఎల్లో ఖాళీగా 4000పైగా పోస్టులు కీలక పోస్టుల ఖాళీతో విద్యుత్ సేవలపై తీవ్రప్రభావం 2,090 జేఎల్ఎం, 1,900 సబ్ స్టేషన్ ఆపరేటర్లు, 100 చొప్పున ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులు -
వక్ఫ్ భూములు అన్యాక్రాంతం..
ధార్మిక సంస్థలు, పేదల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్ భూములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిషేధం. ఇప్పటికై నా అధికారులు స్పందించి జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. భూములపై జాయింట్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తేనే రూ. కోట్లాది విలువగల ప్రజల ఆస్తులు భవిష్యత్ తరాలకు మిగులుతాయి. – అఫ్జల్ మోహియొద్దీన్ (అధ్యక్షుడు, ఇస్లామియా ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ, వరంగల్) -
వ్యవసాయ, అనుబంధ
రంగాలపై దృష్టి సారించాలి● డాక్టర్ ఎం.కిషన్కుమార్ మామునూరు: ఎల్నినో పరిస్థితుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాని పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.కిషన్కుమార్ సూచించారు. శుక్రవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఎల్నినో పరిస్థితుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రత్యామ్నాయ చర్యలపై కిసాన్ మేళా, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడారు. కేవీకే చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులను వివరించారు. రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఐసీఏఆర్, ఎస్సీఎస్పీ, టీఎస్పీ పథకం కింద 66 మంది లబ్ధిదారులకు కేటాయించిన యూనిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్వీకే అధిపతి డాక్టర్ నర్సయ్య, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.అరుణ్జ్యోతి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ రాజు, రైతులు పాల్గొన్నారు. -
ఆయుష్ వైద్యసేవలకు నిధులెన్నిచ్చారు?
● పార్లమెంట్లో వరంగల్ ఎంపీ కావ్య ప్రశ్నకాశిబుగ్గ: వరంగల్ జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్సభలో ప్రశ్నించారు. జిల్లాలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతమేరకు నిధులు కేటాయించింది..? ఎలాంటి మౌలిక వసతులు కల్పించారు? ఆయుష్ సేవలను సాధారణ వైద్య వ్యవస్థతో ఎలా అనుసంధానం చేస్తోంది..? అనే అంశాలపై శుక్రవారం ఆమె ప్రశ్నలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ఎఎం) కింద వరంగల్ జిల్లాలో 9 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, శాశ్వత యోగా షెడ్ల నిర్మాణానికి కేంద్రం మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆస్పత్రి, ప్రభుత్వ ఆయర్వేద వైద్య కళాశాల అభివృద్ధితోపాటు తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్షరీలకు అవసరమైన మందుల సరఫరా కోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం గణనీయమైన నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. -
భార్యాభర్తల బలవన్మరణం
తిరుమలగిరి(తుంగతుర్తి): అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన వడియాల శ్రీనివాస్ (59) భార్య సోమలక్ష్మి (52)తో కలిసి తిరుమలగిరికి వలస వచ్చి ఇక్కడే కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్రావణ్ తన భార్యతో కలిసి గ్రామంలోనే వేరే ఇంట్లో నివాసం ఉంటూ తండ్రి కిరాణం చూసుకుంటున్నాడు. కుమార్తెకు పెళ్లికాగా వారు హైదరాబాద్లో ఉంటున్నారు. కొంత కాలంగా శ్రీనివాస్, సోమలక్ష్మి ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్లకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి పిలవగా ఎవరూ రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు. భార్యాభర్తలిద్దరూ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారి కుమారుడు శ్రావణ్కు సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆ బాధ భరించలేకనే చనిపోతున్నామని, త మ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దంపతుల ఆత్మహత్య -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాజీపేట, వరంగల్, ఖమ్మం మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నెల 26వ తేదీన తిరుపతి–చర్లపల్లి, 27న చర్లపల్లి–తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. తిరుపతి–చర్లపల్లి (07417) వెళ్లే ఎక్స్ప్రెస్ 26వ తేదీన రాత్రి 8గంటలకు తిరుపతిలో బయల్దేరి కాజీపేట జంక్షన్కు మరుసటి రోజు(27వ తేదీ) 07:15 గంటలకు చేరుతుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన చర్లపల్లి–తిరుపతి (07418) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు 18:30 గంటలకు చేరుకుని 28వ తేదీన ఉదయం 8గంటలకు తిరుపతికి చేరుతుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రెండు రైళ్లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట జంక్షన్లో అప్ అండ్ డౌన్ మార్గంలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. యాదగిరి గుట్ట థర్మల్ ప్రైవేటీకరణ సరికాదు హన్మకొండ: యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకో వాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సల్వాజి వెంకటరమణారావు డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గత 35 రోజులుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట థర్మల్ పవర్ స్టేషన్లో కోల్ హ్యాండలింగ్ ప్లాంట్, యాష్ హ్యాండలింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగుల సంఘాలన్నీ ఏకమైనప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు సబ్సిడీలు ఉండవని, కరెంట్ చార్జీలు పెరుగుతాయని, ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.దిలీప్, టి.కిరణ్, శ్రీకాంత్, పి.శ్రీనివాస్, సౌజన్య, ఉద్యోగులు పాల్గొన్నారు.● టీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వెంకటరమణారావు ● టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా -
వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువు
న్యూశాయంపేట: కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్ భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆస్తులు కాపాడేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసింది. కానీ, జీఓ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో ఇప్పటివరకు కమిటీల ఏర్పాటుకు అడుగు ముందుకు పడలేదు. అధికారుల ఉదాసీనత.. వక్ఫ్ భూములను గుల్ల చేస్తున్న భూబకాసురులకు వరంగా మారింది. జీఓ ఉంది ... అమలు శూన్యం జీఓ ప్రకారం కమిటీ చైర్మన్గా కలెక్టర్, మెంబర్లుగా ఎస్పీ/పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒక మహిళ, సీనియర్ ముస్లిం అడ్వకేట్లతో కమిటీ నిర్మాణం కావాలి. ప్రతి జిల్లాలో వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ చేయడం, ఆక్రమణలను గుర్తించి నోటీసులు ఇవ్వడం, కోర్టు కేసులను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం కమిటీల ప్రధాన విధి. అయితే, జీఓ ఉన్నా జిల్లాల్లో కలెక్టర్లు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. కమిటీల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. రూ.కోట్ల విలువైన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం యథేచ్ఛగా సాగుతోంది. వక్ఫ్బోర్డు, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మధ్య సరైన సమన్వయం ఉండడం లేదు. కలెక్టర్లు ఇతర పరిపాలన పనుల్లో తీరిక లేకుండా ఉండడంతో ఈ కమిటీల ఏర్పాటును పక్కన పెట్టేసినట్లు సమాచారం. వక్ఫ్బోర్డు ఆస్తులను సర్వే చేసేందుకు తగినంత మంది ఇన్స్పెక్టర్లు లేకపోవడం కూడా మరోశాపంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే కమిటీలను నియమించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్యాక్రాంతమవుతున్న విలువైన భూములు పరిరక్షణ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం -
గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం
● యువకుడి మృతి.. ఒకరికి తీవ్రగాయాలుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ముల విష్ణు (24), చెంద్రుగూడెం ఎస్సీ కాలనీకి చెందిన సదువాల భానూప్రకాశ్ బైక్పై ప్రధాన బస్టాండ్ సెంటర్లోని మూలమలుపునకు చేరుకున్నారు. అదే సమయంలో వెనకాల నర్సంపేట నుంచి మహబూబాబాద్ వైపు ఎర్రమట్టి లోడ్తో వెళ్తున్న లారీ.. వారి బైక్ను పక్కనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కొమ్ముల విష్ణు లారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న సదువాల భానుప్రకాశ్ లారీకి కొద్దిదూరంలో పడడంతో అతని కుడిచేతిపై నుంచి లారీ చక్రాలు వెళ్లాయి. స్థానికులు భానుప్రకాశ్ను సీహెచ్సీకి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై గిరిధర్రెడ్డి రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్కు తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఇదిలా ఉండగా గత సంవత్సరమే విష్ణు తండ్రి కొమ్ముల శ్రీను మృతిచెందగా.. తల్లి రేణుక, చెల్లితో హైదారబాద్లో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల నానమ్మ ముత్తమ్మ ఇంటికి పనిపై వచ్చాడు. మృతుడి నానమ్మ కొమ్ముల ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. బైకు ఢీకొని వ్యక్తి మృతి బచ్చన్నపేట : నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనగా మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచన్నపేటకు చెందిన మల్యాల బాలయ్య (56) రాత్రి కిరాణ షాపునకు వెళ్లి వస్తుండగా.. నారాయణపురం గ్రామ మూలమలుపు వద్ద ఆలేరు వైపు నుంచి వస్తున్న బైక్ ప్రమాదవశాత్తు బలంగా ఢీకొట్టింది. గాయపడ్డ బాలయ్యను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలయ్యకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. -
అట్రాసిటీ కేసు నమోదు
ఐనవోలు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మండలంలోని పెరుమాండ్లగూడెం గ్రామ సర్పంచ్ దుప్పెల్లి రాకేష్ ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములపై బుధవారం ఐనవోలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై కొంక అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పెరుమాండ్ల గూడెం సర్పంచ్ రాకేష్ వద్దకు అదే గ్రామానికి చెందిన పిడుగు లింగయ్య ఈ నెల 15న ఉదయం వచ్చి తమ్ముడు పిడుగు సంపత్తో భూ సమస్య ఉందని తెలిపారు. సంపత్ను పిలిపిస్తే పెద్దమనుషుల సమక్షంలో చర్చించుకొని పరిష్కరించుకుంటామని తెలిపాడు. దీంతో సర్పంచ్ రాకేష్ సిబ్బంది కందిక అనిల్ ద్వారా పిడుగు సంపత్ కుటుంబానికి సమాచారం అందించారు. కాగా పిడుగు సంపత్ అందుబాటులో లేకపోవడంతో వారి కుమారులు పిడుగు శ్రీకాంత్, పిడుగు రాకేష్లు ఈ నెల 15న ఉదయం గ్రామ పంచాయతీ వద్దకు వచ్చారు. తమను పిలిపించిన వారు ఎవరంటూ కుల ప్రస్తావన తీస్తూ నానా బూతులు మాట్లాడాడు. ఉద్దేశపూర్వకంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను అవమానపరిచారని సర్పంచ్ దుప్పెల్లి రాకేష్ ఈ నెల 22న ఫిర్యాదుచేయగా పిడుగు శ్రీకాంత్, పిడుగు రాకేష్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొంక అశోక్ తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ చెల్లించని వైన్స్కు తాళంస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్లు చెల్లించని వైన్షాపులకు మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం తాళం వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య వ్యాపార సముదాయాల నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని పలుమార్లు చెప్పినా వినడం లేదన్నారు. ప్రధానంగా వైన్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది వైన్షాపులకు తాళాలు వేయించినట్లు తెలిపారు. దీంతో స్పందించిన నలుగురు వైన్షాపుల యజమానులు ట్రేడ్ లైసెన్స్ చెల్లించారని, మిగిలిన షాపుల నిర్వాహకులు నేడు చెల్లిస్తామని అనుమతి తీసుకున్నారని తెలిపారు. వైన్షాపులు మాత్రమే కాదని, అన్ని వాణిజ్య, వ్యాపార సముదాయాల నిర్వాహకులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, అధికారులు సందీప్, శ్రీను, లింగయ్య, సిబ్బంది స్వామి, రాజు ఉన్నారు. -
ఆస్తి పంచి ఇవ్వలేదని..
మహబూబాబాద్ రూరల్ : అనారోగ్యంతో కుమారుడు మృతి చెందగా.. ఆస్తి పంచి ఇవ్వాలని కోరుతూ కోడలు.. ఆమె బంధువులు మామ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన మానుకోట మున్సిపాలిటీ పరిధి బేతోలు గ్రామశివారు మాన్సింగ్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్ సింగ్ తండాకు చెందిన బోడ హుస్సేన్, జమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బిక్కు గత ఏడాది జూలై 27న అనారోగ్యంతో మృతిచెందగా ఆ సమయంలో అతనికి రావాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోడలు తరపు బంధువులు హుస్సేన్ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈక్రమంలో శుక్రవారం బిక్కు సంవత్సరీకం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆస్తి విషయంలో హుస్సేన్, బిక్కు భార్య ఝాన్సీ తరఫు బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ తలెత్తింది. ఝాన్సీ, బంధువులు హుస్సేన్ ఇంటిపై దాడి చేసి ఇంటి ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకు పగలగొట్టారు. ఇంటి బయట ఉన్న పైపులు, కట్టెలను దగ్ధం చేసి, హుస్సేన్, భార్య జమ్మ, ఆమె కుమార్తెలు సునీత, జ్యోతి, రవీందర్ పై దాడిచేశారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న కురవి ఎస్సై సతీష్ అగ్నిమాపక వాహనాన్ని రప్పించి దగ్ధమవుతున్న పైపులు, కట్టెలను చల్లార్పించారు. ఇరువర్గాలు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు. ● వృద్ధుడిపై కోడలు ఆమె తల్లిగారి బంధువుల దాడి ● గతంలోనే కుమారుడి మృతి -
బాలసదనాల్లో భద్రతేది?
● పారిపోతున్న బాలికలు ● గాలింపు చేపట్టి పట్టుకుంటున్న పోలీసులు ● అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టారాజ్యంమహబూబాబాద్: జిల్లాలోని బాలసదనాల్లో భద్రతా వైఫల్యంతో బాలికలు పారిపోతున్నారు. ఈమేరకు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలికలను పట్టుకుని తిరిగి బాలసదనాల్లో అప్పగిస్తున్నారు. కాగా, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలసదనాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు భద్రతలేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐదురోజుల క్రితం బాలసదనం నుంచి ఓ బాలిక పారిపోగా.. ఈనెల 22న రాత్రి పోలీసులు పట్టుకుని బాలసదనంలో అప్పగించారు. జిల్లాలో ఐదు బాల సదనాలు.. జిల్లా సంక్షేమశాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు బాల సదనాలు ఉన్నాయి. వాటిలో మూడు ప్రైవేట్వి కాగా.. రెండు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. తొర్రూరు మండల కేంద్రంలో ప్రైవేట్ బాలికల బాల సదనం ఉండగా.. దానిలో 29 మంది బాలికలు ఉన్నారు. మానుకోట ప్రైవేట్ బాలుర బాలసదనంలో 12 మంది, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మరో ప్రైవేట్ బాల సదనంలో 12 మంది ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ బాలికల బాలసదనం ఉంది. అందులో 40 మంది బాలికలు, పాత కలెక్టరేట్ రోడ్డులో ప్రభుత్వ బాలుర బాలసదనంలో 20 మంది ఉన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లల కోసమే.. 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం ప్రభుత్వం బాల సదనాలు ఏర్పాటు చేసింది. అధికారులు, సి బ్బందికి లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, త ల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్న వారు, తప్పిపోయిన వారు, బాల కార్మికులు, బాల్యవివాహాలు చేసుకున్న వారు, రిస్క్ చేసిన పిల్లలకు బాలసదనాల్లో ఆశ్రయం కలిస్తున్నారు. మైనర్ బాలికలు వివాహాలు చేసుకుంటే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2025 ఆగస్టులో నలుగురు పరార్.. జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి 2025 ఆగస్టు 27న రాత్రి 11.16 గంటలకు నలుగురు బాలికలు తప్పించుకుని పారిపోయారు. ఆ మరుసటిరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వరంగల్లో ఇద్దరిని, హైదరాబాద్లో మరో ఇద్దరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సమస్యకు ముగింపుకార్డు పడింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఐదు రోజుల క్రితం బాలిక.. జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి ఐదు రోజుల క్రితం ఓ బాలిక పారిపోయింది. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఆతర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా.. ఈనెల 22న గూడూరులో ఆ బాలికను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్.. బాల సదనాల నుంచి పారిపోయిన వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులు స్పందించకుంటే బాలసదనాల్లో ఆశ్రయం కల్పించి ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సుల్లో చేర్పిస్తున్నారు. విచారణ చేపట్టాంబాలికల బాలసదనం నుంచి బాలికలుతప్పించుకుని పోయిన విషయంలో విచారణ చేస్తున్నాం. నివేదిక రూపంలో జిల్లా సంక్షేమాధికారికి అందజేస్తాం. తదుపరి చర్యలు జిల్లా అధికారి తీసుకుంటారు. –పుట్ట కమలాకర్, డీసీపీఓ -
పనులు సకాలంలో పూర్తి చేయాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ల కుట్టు పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన వ్యవసాయ పరిస్థితులు, తాగునీరు, విద్యుత్ తదితర విషయాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ.. ప్రతీ పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంట మార్పి డి, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించి సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అదికారులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తొర్రూరు: పేద విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ జెడ్పీ సీఈఓ ఆకుల అనురాధ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసి అభ్యంతరాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, మెనూ పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, బాలికలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సౌకర్యాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, ఎస్ఓ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి చిన్నగూడూరు: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్టినేటర్ మహేశ్వరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. పిల్లల అక్రమ రవాణా, హెల్ప్ లైన్ నంబర్లు (1098, 181, 100, 1930) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పోష్ చట్టం–2013పై అవగాహన కల్పించి అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం రెహమాన్, మహిళా సాధి కారత సిబ్బంది నలమాస అరుణ, సంధ్యారా ణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలిమహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో కేజీబీవీ యూఆర్ఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానోతు హరినాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ ఎదుట శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ నాయకులు ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ద్వారా సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరినాయక్ మాట్లాడుతూ.. 15 సంవత్సరాల నుంచి కేజీబీవీ యూఆర్ఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. మినిమం టైం స్కేల్, హెల్త్కార్డులు మంజూరు చేయాలని, సమ్మెకాలపు 29 రోజుల వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, సౌభాగ్య, భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేం.. డోర్నకల్: కోతుల బెడదతో కూరగాయలు, పప్పు దినుసుల పంటలు సాగు చేయలేమని రైతులు తేల్చి చెప్పారు. మండలంలోని చిలుకోడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతుండగా.. రైతులు అడ్డుతగిలి కోతుల బెడదతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేకపోతున్నామని తెలిపారు. పంటల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, మంకీగన్ వాడాలని డీఏఓ రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాయల వెంకటేశ్వర్రావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ రామకృష్ణ, డీఈ రమేశ్, ఏఈ కిషన్, వ్యవసాయశాఖ అధికారి అనిల్కుమార్, ఉద్యాన అధికారి శాంతిప్రియ, ఏఈఓ అవినాష్, ఉపసర్పంచ్ రమణబోయిన రాజు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి యోగా పోటీలు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి జమాండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో జిల్లాస్థాయి యోగా పోటీలు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తూనం పుష్పలీల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్ గ్రూప్లకు సంబంధించిన యోగా పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగా పోటీల్లో 10నుంచి 14 ఏళ్ల వయస్సు వారు, 14 నుంచి 18, 18 నుంచి 28, 28 నుంచి 38, 38 నుంచి 45, 45 నుంచి 55 ఏళ్ల వయస్సు వారికి విభాగాల వారీగా అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు 99851 85257, 89197 03008 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!
రామప్పకు యునెస్కో గుర్తింపు (వారసత్వ హోదా) వచ్చినా మారని రూపురేఖలుములుగు: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చి నేటి (శనివారం)కి ఐదేళ్లు పూర్తయినా ఏ మార్పూ కనిపించ డం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపదగా యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు 2021, జూలై 25న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి ఆలయ రూపురేఖలు మార్చేస్తామని, ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వినియోగంలోకి రాని ఉప ఆలయాలు రామప్ప ఆలయం ముందు ఉన్న గొల్లాల గుడికి మరమ్మతులు చేపట్టినప్పటికీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా కూలిపోతోందని దానికి సపోర్టుగా ఇనుపపైపులను అమర్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇటీవల ఆ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా కేంద్రం గుర్తించింది. మరికొన్ని ఉప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రారంభమెప్పుడో.. దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్ల నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ను నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లు రాలేదనే నెపంతో సెంటర్ను ప్రారంభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. 2022 డిసెంబర్లోగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు పునాదులకే పరిమితమైంది. రామప్ప సరస్సులోని ఐలాండ్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్లో భారీ శివుడి విగ్రహం, రెస్టారెంట్, కెఫిటేరియా, చిల్డ్రన్స్పార్కు, బటర్ ఫ్లై గార్డెన్ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించట్లేదు. పునాదుల్లోనే కామేశ్వరాలయం.. ముందుకు సాగని ఐలాండ్ పనులు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులు పూర్తయితే మరింత సుందరంగా ఆలయ పరిసరాలు -
విజిలెన్స్ దడ!
● విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ● నాలుగు మిల్లుల తనిఖీలు.. ఇద్దరిపై కేసు నమోదు ● ఎప్పుడు ఏ మిల్లుకు వెళ్తారో తెలియని పరిస్థితి ● ధాన్యం నిల్వలేని మిల్లర్లలో వణుకు.. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై నిఘాసాక్షి, మహబూబాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పెట్టాలి. అయితే మిల్లర్లు సకాలంలో బియ్యం పెట్టకుండా మొండికేయడం, జాప్యం చేయడం, ధాన్యం నిల్వలు లేకుండా అమ్ముకోవడంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు మిల్లులను తనిఖీ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేయడంతో.. ఎప్పుడు ఏ మిల్లులో తనిఖీ నిర్వహిస్తారో అని అక్రమాలకు పాల్ప డిన రైస్ మిల్లుల యజమానుల్లో దడ మొదలైంది. రూ.130కోట్ల బకాయిలు.. ధాన్యం దిగుమతి చేసుకొని రూ.130కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా మిల్లర్లు మొండికేస్తున్నారు. జిల్లాలో 2017–22 మధ్యకాలంలో యాసంగి, వానాకాలం సీజన్లలో సీఎంఆర్ పెట్టని ఐదు మిల్లుల యజమానులు రూ.15కోట్లు బకాయి పడ్డారు. దీంతో ఇప్పటికే వారిపై ఆర్ఆర్ యాక్ట్కింద కేసులు నమోదు చేశారు. 2021–22 సీజన్లో ధాన్యం తీసుకొని 10 రైస్మిల్లుల యజమానులు సుమారు రూ.15కోట్ల విలువచేసే బియ్యం పెట్టకుండా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 2022–23 సీజన్లో ధాన్యం దిగుమతి చేసుకున్న 21మంది మిల్లర్లు సీఎంఆర్ పెట్టలేదు. అయితే ఆ ధాన్యాని ప్రభుత్వం ఇతర వ్యాపారులకు వేలం ద్వారా కేటాయించింది. కాగా, వేలం వేసిన వారికి ధాన్యం ఇవ్వకుండా ఉన్నారు. ఇలా వీరి వద్ద నుంచి సుమారు రూ. 95కోట్లు రావాల్సి ఉంది. అయితే వీరికి ఆగస్టు 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అదే విధంగా ఆలస్యంగా పెట్టిన వారు రూ. 5కోట్ల బకాయి ఉన్నారు. ఇలా జిల్లాలో మొత్తం రూ. 130కోట్ల విలువ చేసే బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. దీనికి తోడు 2025–26 ఖరీఫ్లో దిగుమతి చేసుకున్న సన్నధాన్యం కూడా పలువురు మిల్లర్లు పక్కదారికి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం నిల్వలు లేకుంటే చర్యలుకొనుగోలు కేంద్రం నుంచి దిగుమతి చేసుకున్న ప్రతీ గింజా ధాన్యానికి లెక్క ఉండాలి. అయితే సీఎంఆర్ పెట్టాలి. లేకుంటే ధాన్యం నిల్వ ఉండాలి. అలా కాకుండా ధాన్యం అమ్ముకుంటే కేసులు పెట్టడమే కాకుండా రికవరీ చేస్తాం. వారం రోజులుగా జిల్లాలో నాలుగు మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రెండు మిల్లుల యజమానులపై కేసులు పెట్టారు. –రమేశ్, డీఎస్ఓ ఆకస్మిక తనిఖీలతో ఉక్కిరి బిక్కిరి.. జిల్లాలో వారం రోజులుగా రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో యజమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలోని తిరుమల బిన్నీ రైస్ మిల్లు, బాలాజీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు, వాసవి లక్ష్మీ రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లుకు దిగుమతి అయిన ధాన్యంలో మిల్లింగ్ చేసిన ధాన్యం పోగా.. మిగిలిన నిల్వల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో రెండు మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. అయితే ఒక మిల్లు యజమాని అనారోగ్యంతో మంచానికి పరిమితం కాగా.. మరో యజమానిని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అదే విధంగా శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలోని ప్రజ్వల రైస్ మిల్లును కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అయితే అక్కడ నిల్వల్లో తేడా ఉందా.. లేదా అనే విషయం బయటకు రాలేదు. ఇలా ఆకస్మికంగా మిల్లులను తనిఖీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతర రైస్ మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెడితే సమాజంలో పరువు పోతుందని కొందరు సీఎంఆర్ పెట్టేందుకు సిద్ధం కావడం, డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నిల్వల్లో తేడా ఉన్న పలువురు మిల్లర్లు మాత్రం ఏం జరిగితే అది జరుగుతుందని అనుచరులతో చెబుతున్నట్లు తెలిసింది. -
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
● వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్తొర్రూరు:‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి అమలు తీరు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, సాదా బైనామాలు తదితర భూ సంబంధిత అంశాలపై ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్లతో భూమి సునీల్ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూ భారతి ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతుందన్నారు. భూ భారతి చట్టం తేవడానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూ చట్టాలను పరిశీలించామని తెలిపారు. చట్టం అమలులో తహసీల్దార్, ఆర్డీఓకు ప్రత్యేక అధికారాలు పొందుపర్చినట్లు చెప్పారు. క్రయ విక్రయాల సమయంలో సర్వే మ్యాప్ వచ్చిన వారికి తాత్కాలిక భూధార్ కార్డు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. గతంలో విశిష్ట సంఖ్యను ఇచ్చినట్లుగానే భూధార్ కార్డును ఇస్తారన్నారు. ఏఓ అనిల్కుమార్, తహసీల్దార్లు, లీఫ్ సంస్థ ప్రతినిధులు జీవన్రెడ్డి, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, రవి పాల్గొన్నారు. -
మార్క్ఫెడ్ మక్కల బస్తాల అపహరణ.!
● తిరిగి మార్కెట్లో విక్రయిస్తుండగా పట్టుబడిన వైనం ● 24 బస్తాలు స్వాధీనంకేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ షెడ్లలో భద్రపరిచిన మార్క్ఫెడ్ మక్కల బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, అవే మక్కలను తిరిగి మార్కెట్లో విక్రయిస్తుండగా పట్టుబడ్డాయి. ఈ మేరకు 24 మక్కల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకుని మార్కెట్లో భద్రపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్క్ఫెడ్ ద్వారా కేసముద్రం, ధన్నసరి పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇటీవల మక్కలను కొనుగోలు చేశారు. ఆ బస్తాలను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ షెడ్లలో భద్రపరిచారు. కాగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ మక్కల బస్తాలను అపహరించారు. గురువారం ఆ మక్కలను విక్రయించేందుకు ఓ వ్యక్తి పేరుతో లాట్ ఐడీ తీసుకుని, యార్డులో పోశారు. కాగా, మార్కెట్ సిబ్బంది పరిశీలించి చూడగా.. ఆ మక్కల వద్ద ఎవరూ లేకపోవడం, అవి మార్క్ఫెడ్ మక్కలుగా గుర్తించి అధికారులు తెలియజేశారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పరార్ అయినట్లు తెలిసింది. కాగా అధికారులు పట్టుబడిన మక్కల బస్తాలను మార్కెట్లోని ఓ గదిలో భద్రపరిచారు. అయితే దొరికిన బస్తాలే 24 ఉంటే, ఇంకా ఎన్ని బస్తాలు మాయం అయ్యాయనే విషయంపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అధికారులు శుక్రవారం మక్కల బస్తాలను పరిశీలించారు. కాగా పత్తిషెడ్డులో నెట్గా వేసిన మక్కల బస్తాలు కూలి కిందపడి ఉండటంపై అధికారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
జర్మనీ బృందంతో వీసీ చర్చలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి ఉన్నత విద్యాశాఖాధికారుల, పలువురి వీసీల బృందంతో కలిసి ఇటీవల జర్మనీలో పర్యటించిన విషయం విధితమే. అక్కడి రెట్లిన్జెన్ యూనివర్సిటీలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా సమర్పించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్కు కొనసాగింపుగా ఆ జర్మనీ యూనివర్సిటీ బృందం గురువారం తెలంగాణను సందర్శించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ముందుస్తుగా హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందంతో విద్య, పరిశోధన, అధ్యాపకుల, విద్యార్థుల పరస్పర మార్పిడి కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కేయూలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 3ప్లస్2 విధానంలో మూడు సంవత్సరాలు, కేయూలో బీటెక్ విద్యనభ్యసించి అనంతరం రెండు సంవత్సరాలు జర్మనీలోని ఆ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసేలా అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. వీసీ వెంట కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, యూసీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్. రమణ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ కురవి: వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో మండల స్థాయి మూడు రోజుల ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. ఇంగ్లిష్, తెలుగు, గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని తెలిపారు. వారిలో నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించి తరగతిలో తోటి విద్యార్థులతో సమానంగా ఉండేలా చూడాలని, ఇలాంటి శిక్షణలు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో 62మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ బాలాజీ, ఆర్పీలు శివప్రసాద్, వెంకటేశ్, ఓంకార్, శేఖర్ పాల్గొన్నారు. అనంతరం కంచర్లగూడెం గ్రామంలో జరుగుతున్న నక్షా సర్వే, సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు పాల్గొన్నారు. -
అటవీ జంతువును వేటాడిన ముగ్గురి అరెస్ట్
ములుగు రూరల్ : అటవీ జంతువును వేటాడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ అమృత గురువారం తెలిపారు. ములుగు మండలం పత్తిపల్లి శివారు బుగ్గజలం అటవీప్రాంతంలో గ్రామానికి చెందిన కుక్కల రమేశ్, భట్టు రాంబాబు, లాకావత్ సోమ నాలుగు రోజుల క్రితం మనుబోతును వేటాడి చంపారు. దీనిపై సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకోగా వేటగాళ్లు గమనించి పరారయ్యారు. దీంతో మనుబోతును స్వాధీనం చేసుకుని గుంతతీసి పూడ్చి పెట్టారు. నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో లొంగిపోయారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. -
పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కేసముద్రం: పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ గురువారం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీట్పేపర్ లీక్తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, దీనిపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్రావు, జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, నీలం దుర్గేష్, బండారు వెంకన్న, కదిర సురేందర్, బండారు దయాకర్, పోలెపాక నాగరాజు, రావుల మురళి, ఎండి.అయూబ్ఖాన్, కీర్తి సురేందర్, చిదురాల వసంతరావు, గండి శ్రీను, చిలువేరు సమ్మయ్యగౌడ్, కొయ్యాడ అశోక్, తండా వెంకన్న, పోలెపల్లి వెంకట్రెడ్డి, కత్తెరశాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పీవీ విజ్ఞాన కేంద్ర పనులు త్వరగా పూర్తి చేయాలి
భీమదేవరపల్లి : పీవీ విజ్ఞాన కేంద్ర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేయడంతోపాటు వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న ‘పీవీ విజ్ఞాన కేంద్రం’ పనులను తనిఖీ చేశారు. నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యాలు, ప్రాంగణంలోని మొక్కల నిర్వహణను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ గజ్జెల సృజనరమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, డీఈ రఘు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఎస్ఓ జ్యోతి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
నిషేధిత జలపాతాలకు వెళ్తే కేసులు నమోదు
వాజేడు: పర్యాటకులు నిషేధిత జలపాతాలకు వెళ్తే కేసులు నమోదు చేయాలని కాళేశ్వరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని బొగత జలపాతం వద్ద గురువారం ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతులు లేని జలపాతాలకు ఎవరూ వెళ్లకుండా సిబ్బంది పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. దొంగ దారిలో ఎవరూ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, అందుకు జలపాతాలు ఉన్న సమీప గ్రామాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి సహకారాలు తీసుకోవాలని సూచించారు. సమా వేశంలో ములుగు డీఎఫ్ఓ వికాస్ మీనా, వెంకటాపురం ఎఫ్డీఓ ద్వాలియా, వాజేడు, వెంకటాపురం ఎఫ్ఆర్ఓలు నరేందర్, ముక్తార్ హుస్సేన్, ఏటూరునాగారం, ములుగు, తాడ్వాయి ఎఫ్డీఓలు, సిబ్బంది ఉన్నారు. -
సందర్శించిన శ్రీలంక బృందం
సహకార సంఘాన్నిభీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు, మార్కెటింగ్ సొసైటీని గురువారం శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో భాగంగా శ్రీలంకకు చెందిన 32 మంది ప్రజాప్రతినిధులు జూలై 20 నుంచి 29 వరకు భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బృందం ముల్కనూరు సొసైటీని సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి శ్రీలంక ప్రతినిధులకు సొసైటీ చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల ఆర్థిక బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల సందర్శన కోసం ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీని ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ముల్కనూరు మోడల్ ఇక్కడి సభ్య రైతుల జీవితాల్లో తెచ్చిన గణనీయమైన మార్పులకు ఈ సందర్శన నిదర్శనమన్నారు. శ్రీలంక ప్రతినిధులు తమ ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు ఈ మోడల్ విధానాలను అమలు చేసి రైతులకు మేలు చేకూర్చాలని సూచించారు. ఈ పర్యటనలో ముల్కనూరు సొసైటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో క్షయవ్యాధి నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సరైన సమయంలో క్షయను గుర్తించడం, సక్రమంగా చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. రెండు వారాలకు పైగా దగ్గు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్మూలకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేయడం, ఇంటి సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పోషణ సహాయం, నిక్షయ్ పథకం అమలు వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు గుర్తించిన క్షయవ్యాధి కేసులను తప్పనిసరిగా ప్రభుత్వ నిక్షయ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా టీబీ అధికారి అర్జున్, సూపర్వైజర్లు, హెల్త్ విజిటర్లు, సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
జనగామ/చిల్పూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. ఈ మేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జనగామ జిల్లా పరిధిలో జాతీయ రహదారి–163పై రఘునాథపల్లి మండలం నిడిగొండ–కోమళ్ల టోల్గేట్ ప్రాంతం, జనగామ మండలం యశ్వంతపూర్ వై–జంక్షన్తోపాటు ప్రమాదాలకు గురవుతున్న పలు బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్ల వద్ద రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, దిశానిర్దేశ సూచికలు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. హైవే వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు కరుణాపురం, వంగాలపల్లి, నష్కల్, చిన్నపెండ్యాల గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని హైవే అధికారులకు సూచించారు. అనంతరం ఎన్హెచ్–163పై రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సేవలు అంది స్తున్న అంబులెన్స్ను పరిశీలించి, అందులోని వైద్య సౌకర్యాలు, సిబ్బంది స్పందన తీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, జనగామ రూరల్, స్టేషన్ఘన్పూర్ సీఐలు శ్రీనివాస్రెడ్డి, వేణు, చేరాలు, ఎస్సైలు సిరిపురం నవీన్కుమార్, శ్రవణ్కుమార్, ఆర్ఎస్సై నవీన్, రోడ్డు రవాణా శాఖ, ఎకై ్సజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన -
ఊరిలోనే ఓటు ఉండాలి
నేను పదిహేను సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నా. అక్కడ సొంత ఇల్లు ఉంది. కానీ, ఏ ఎన్నిక వచ్చినా మా చిన్నగూడూరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసమే ఇప్పుడు కూడా మా గ్రామంలోనే ఓటు ఉండాలని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్యూమరేషన్ ఫాం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే అందం. – గాడిపెల్లి యాకయ్య, చిన్నగూడూరు సొంత ఊరిలో ఓటు వేయడం ఇష్టం మా సొంత ఊరు బొమ్మకల్లు. మేము హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం. అయినా ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. ఊరికి రావడం అంటే ఇష్టం. అలాగే ఊరిలో ఓటు వేసేందుకు రావడం అంటే అదో అనుభూతి. కుటుంబ సభ్యులందరికీ గ్రామంలోనే ఓటు ఉండాలని పట్టుబట్టి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇచ్చాం. – కేతిరెడ్డి అశ్వినిరెడ్డి, బొమ్మకల్లు, పెద్దవంగర -
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
మరిపెడ రూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డిప్యూటీ సీఈఓ పురుషోత్తం అన్నారు. గురువారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు 3న పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతీ ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా నమోదు చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్లో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, ప్రతీ ఇంటిని సందర్శించి అర్హుల వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ సోములునాయక్, కార్యదర్శి ముజఫర్, సిబ్బంది పాల్గొన్నారు. -
మామునూరు ఎయిర్పోర్టు పనుల్లో కదలిక
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు కీలక అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో టెండర్ పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు గురువారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఏఏఐ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒకేసారి 820మంది ప్రయాణికులకు సేవలందించే ఆధునిక టెర్మినల్ భవనం, రన్వే పునర్నిర్మాణం, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ఏరియా, మూడు ఆప్రాన్, లింక్ ట్యాక్సీవేలు, ఐసోలేషన్ బే, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితర పనుల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, అమలు విధానాన్ని వివరించినట్లు తెలిసింది. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఉంటుందని, ఆగస్టు 18న బిడ్ ఓపెన్, సెప్టెంబర్ 7న ఫైనాన్సియల్ బిడ్ తెరుస్తారని వివరించారు. ఇప్పటికే ఖరారైన పెరీమీటర్ వాల్ టెండర్ ఇప్పటికే విమానాశ్రయ భద్రత దృష్ట్యా రూ.21 కోట్లతో పెరీమీటర్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణానికి టెండర్ ఖరారైంది. అవసరమైన ప్రక్రియలు పూర్తికాగానే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. భూమి రక్షణ, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో ఈ పనులు కీలకంగా మారనున్నాయి. అలాగే రూ.270 కోట్ల అంచనా వ్యయంతో మెయిన్ంటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్మాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ మౌలిక సదుపాయాలు, యుటిలిటీ నెట్వర్క్లు, ఇతర అనుబంధ పనులకు మరో టెండర్ త్వరలోనే పిలవనున్నారు. రూ.203.49 కోట్ల పనులపై ఏఏ అధికారుల ప్రజెంటేషన్ తొలుత మామునూరు ఎయిర్పోర్టు స్థల సందర్శన హనుమకొండలో ప్రీబిడ్ మీటింగ్ -
మహిళలను లక్షాధికారులను చేయండి
కాజీపేట అర్బన్: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీమహిళకు నెలకు రూ.2,500 అందజేసి లక్షాధికారులను చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాజీపేట మండలం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్హాల్లో గురువారం పో చంపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 6,200 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేసి మాట్లాడారు. పుట్టినరోజు ఆర్భాటంగా చేసుకుని వృథాగా డబ్బులు ఖర్చు చే యడం కంటే ఆత్మీయతతో ఓ చిరునవ్వు అందిస్తే చాలు అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు కుట్టుమిషన్లను ఉపయోగించుకోవాలని కోరారు. మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవి త, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని రవీందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, సతీశ్బాబు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
జిల్లా పోలీసు కార్యాలయం సిద్ధం
మహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు కార్యాలయం ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది. ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలే లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో ఏర్పాట్లు చేసింది. కాగా, రాష్ట్రంలోనే విశాలమైన జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందినట్లు సమాచారం. మహిళా మోర్చా బలోపేతానికి కృషి మహబూబాబాద్ అర్బన్: మహిళా మోర్చా సంస్థాగత బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరోజ అధ్యక్షతన మహిళా మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఆమోదానికి ప్రధాని మోదీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని వాపోయారు. మహిళలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం మానుకోట రూరల్ అధ్యక్షుడు జహిందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగా.. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటీ మహేష్, గడ్డం అశోక్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఓర్సు పద్మ, జిల్లా కార్యాదర్శులు సతీష్, హిందూభారతి, కౌన్సిలర్ శ్రీదేవిబాలు నాయక్, నాయకులు శ్యామ్, చంద్రకళ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వంకాయ చెట్లకు సన్నజాజి మాదిరి పూలు గార్ల: వంకాయ చెట్లకు సన్నజాజి మాదిరి పూసిన పూలను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరా లు ఇలా ఉన్నాయి. మండలంలోని ముల్క నూరు గ్రామానికి చెందిన కుంట వెంకన్న తన ఇంటి పెరడులో 8 నెలల క్రితం వంకాయ మొ క్కలు నాటాడు. ఇప్పటి వరకు సాధారణంగా పూలతో పాటు కాయలు కాసిన చెట్లు.. మూడు రోజుల నుంచి చెట్ల పైభాగంలో సన్నజాజి పూల మాదిరిగా పూలు పూయడంతో స్థానికులు తరలివచ్చి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. జ్ఞాన శక్తిని, కుల సుందరీ అలంకరణలో అమ్మవారు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసి అమ్మవారి ఉత్సవమూర్తులను ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తా, కులసుందరి (రూపం) క్రమంలో అమ్మవారికి పూజలు చేశారు. షోడశీ క్రమాన్ని అనుసరించి భద్రకాళి మాతను జ్ఞానశక్తి కుల సుందరీదేవీగా అలంకరించగా.. ఆలయ పూజారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు జ్ఞాన శక్తి కుల సుందరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఈఓ రాముల సునీత తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పాల్గొన్నారు. రేపు జస్టిస్ విజయసేనారెడ్డి రాక వరంగల్ లీగల్ : హైకోర్టు న్యాయమూర్తి, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. -
31న నేషనల్ జావెలిన్ త్రో డే వేడుకలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 31వ తేదీన 5వ నేషనల్ జావెలిన్్ త్రో డే వేడుకలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అండర్–6 నుంచి అండర్–20 విభాగాల్లో మెన్ అండ్ ఉమెన్లో జావెలిన్ త్రో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఇందులో ఎంపికై నవారు ఆగస్టు 7న హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు, ఇతర వివరాలకు 93901 04499, 99120 22188 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. ట్రిప్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి ● రైళ్ల ట్రాఫిక్ క్లియర్ కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట–బల్లార్షా ట్రిప్లింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 11 కిలో మీటర్లు మేర చివరి దశ పనులు విద్యుద్దీకరణతో సహా పూర్తయినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో దశల వారీగా కాజీపేట–బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో గ్రాండ్ ట్రంక్మార్గంలో ప్రయాణించే రైళ్లు, సరుకు రవాణా రైళ్ల రాకపోలకు అంతరాయం ఉండదన్నారు. కాజీపేట–బల్లార్షా మార్గం దేశంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలక రైలు మార్గంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు. -
సూచికల ఆవిష్కరణలు
నేడు ప్రకృతి వైద్య గ్రంథ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యుడు గజ్జెల రామేశ్వరం హనుమకొండలోని ప్రకాశ్రెడ్డి పేటలో తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ శుక్రవారం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగిడబోతుంది. దేశ, విదేశీ భాషల్లో 5 వేలకు పైగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగానే చదువుకునే అవకాశం కల్పించిన విషయం విధితమే. అరుదైన ప్రకృతి వైద్య గ్రంథ సూచికలు రాసిన రామేశ్వరం నేచురోపతి లైబరీ రీసెర్చ్ సెంటర్లో ఉన్న అరుదైన ప్రకృతి వైద్య పుస్తకాలు, వివిధ జర్నల్స్ ముఖ్యంగా వివిధ రోగాలను ఎలా ప్రకృతి వైద్య పరంగా నివారించుకోవాలనే అంశంపై ఆచార్య రామేశ్వరం 25 గ్రంథ సూచికలు రాశారు. అందులో 11 వరకు ఈనెల 24న ఉదయం 10: 30 గంటలకు కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో ఆవిష్కరించబోతున్నారు. కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రకృతి వైద్య గ్రంథ సూచికల ఆవిష్కరణ, రీసెర్చ్ సెంటర్ 8వ వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు. ఆవిష్కరించనున్న ప్రకృతి వైద్య గ్రంథ సూచికలు ఇవే.. ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం రాసిన గ్రంథ సూచికల్లో ముఖ్యంగా ప్రకృతిజీవన్ మాసపత్రిక వ్యాస సూచిక, ప్రకృతి వైద్యంలో రోగ నివారణ వృత్తాంతములు, డాక్టర్ వెంకట్రావు ప్రకృతి వైద్య వ్యాస సూచిక, ప్రకృతి వైద్య గ్రంథసూచి, డాక్టర్ విజయలక్ష్మి ప్రకృతి వైద్యవ్యాస సూచి, యోగా గ్రంథ సూచి, ఇంగ్లిష్లో ఇండెక్స్ టుది ఇండియన్ నేచురోపతి ఉన్నాయి. అలాగే, మరో రెండు హిందీ, మరొకటి మరాఠీ భాషలో ప్రకృతి వైద్య గ్రంథ సూచికలున్నాయి. వీటిని అతిథులు ఆవిష్కరించబోతున్నారు. రానున్న రెండు వర్సిటీల వీసీలు, ప్రముఖులు ప్రొఫెసర్ రామేశ్వరం రాసిన ఈ ప్రకృతి వైద్య గ్రంథాల వ్యాస సూచికల ఆవిష్కరణ కార్యకమంలో ముఖ్య అతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల ఉప కులపతులు ఖాజాఅల్తాఫ్హుస్సేన్, టి. యాదగిరిరావు, రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్, హైదరాబా ద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్రావు, హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ డైరెక్టర్ పి. ప్రసాద్, తదితరులు పాల్గొనబోతున్నారని రామేశ్వరం తెలిపారు. ఈ సభకకు కేయూ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం అధ్యక్షత వహిస్తారు. నేచురోపతి ఇంటర్నేషనల్ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ 8వ వార్షికోత్సవం కూడా.. కేయూకు రానున్న రెండు వర్సిటీల వీసీలు.. ప్రకృతి వైద్య ప్రముఖులు -
స్వల్పకాలిక రకాలను నర్సరీల్లో పెంచాలి
కురవి: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నర్సరీదారులు స్వల్పకాలిక రకాల నారును పెంచాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లాలోని నర్సరీదారులకు ఎల్నినో పరిస్థితులు–నర్సరీ చట్టంపై అవగాహన స దస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా నర్సరీల్లో మేలైన మొక్కలు పెంచాలని సూ చించారు. వ్యవసాయశాఖ ఆమోదం పొంది, రైతులు అంగీకారం తెలిపిన రకాల నారు పెంచాలన్నా రు. నర్సరీ చట్టం ప్రకారం ఆరుబయట నారును పెంచవద్దని, లైసెన్స్ లేకుండా నర్సరీ నుంచి మిరప, కూరగాయల నారు అమ్మవద్దన్నారు. మల్యాల కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త ప్రశాంత్ భూసార, నీటి పరీక్షలు, కూరగాయల సాగు, పూలసాగు, నీటి ఎద్దడి, చీడపీడలను తట్టుకునే రకాలు, షేడ్నెట్స్, మల్చింగ్ పద్ధతుల గురించి వివరించారు. రైతులు పంట మార్పిడి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, శాస్త్రవేత్త సుహాసిని, హెచ్ఓలు ఆర్.శాంతిప్రియ, శాంత్రి ప్రియదర్శిని, ఎం.స్రవంతి, ఏఓ నరసింహరావు, ఏఈఓలు రాజేశ్వరి, విజయపాల్రెడ్డి, రమేశ్, నర్సరీ యజమానులు పాల్గొన్నారు. -
పాముకాటుతో యువకుడి మృతి
తొర్రూరు రూరల్: పాము కాటుతో ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో చోటు చేసుకుంది. తండా వాసుల కథనం ప్రకారం.. బానోత్ ప్రవీణ్(25) రోజువారీగా బుధవారం రాత్రి తన ఇంటి ఎదుట రేకులషెడ్లో కింద నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పాము కాటు వేసింది. వెంటనే నిద్రనుంచి లేచిన ప్రవీణ్ పామును చంపాడు. ఆస్పత్రికి వెళ్దామని కుటుంబీకులు చెప్పినా వినకుండా మళ్లీ నిద్రపోయాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే అంబులెన్స్లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత ఉంది. -
స్వీయ సంరక్షణే శ్రీరామ రక్ష..
జనగామ : తెలంగాణ రాష్ట్రంలో గుండె జబ్బులు, స్ట్రోక్ అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణను జీవన శైలిలో భాగం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. అత్యవసర సమయంలో 108 సేవలను వినియోగించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. వైద్యులు, ఆస్పత్రులపై పూర్తిగా ఆధారపడకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఈ క్రమంలో జూలై 24న అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు.. 108 ఈఎంఆర్ఐ అత్యవసర సేవల గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,940 ఛాతి నొప్పి కేసులు, 5,025 స్ట్రోక్ అత్యవసర కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమని రాష్ట్ర 108 అంబులెన్స్ సేవల కార్యనిర్వాహక అధికారి బి.సుధాకర్ వెల్లడించారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతుండగా, యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లడ్ ప్రెషర్, రక్తంలో చక్కెర స్థాయి, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వంటి అలవాట్లు ఆరోగ్య రక్షణకు అత్యంత అవసరమని సూచిస్తున్నారు. హార్ట్ అనే ఐదు దశల స్వీయ సంరక్షణ ప్రణాళికను కూడా ప్రజలు పాటించాలని తెలిపారు. ప్రాణ రక్షణకు ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రా ల్, ఒత్తిడితో కూడిన జీవనశైలి స్ట్రోక్, గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంపై సమాన శ్రద్ధతో పాటు డిజిటల్ డిటాక్స్ కూడా అవసరమని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్ సేవలకు వెంటనే కాల్ చేయడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే కాకుండా సామాజిక బాధ్యత అని సుధాకర్ స్పష్టం చేశారు. ప్రజల్లో స్వీయ సంరక్షణపై అవగాహన పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్స్లు జిల్లా అంబులెన్స్ల సంఖ్య జనగామ 12 వరంగల్ 15 హనుమకొండ 16 జేఎస్ భూపాలపల్లి 11 మహబూబాబాద్ 15 ములుగు 14 అప్రమత్తతతోనే ఆరోగ్య భద్రత అత్యవసరంలో 108కు కాల్ చేయడం కీలకం పెరుగుతున్న గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు నేడు స్వీయ సంరక్షణ దినోత్సవం -
చిన్నారిపై కుక్క దాడి
● తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు దంతాలపల్లి : ఏడాది బాలుడిపై కుక్క దాడికి పా ల్పడింది. ఈ ఘటనలో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. అసోం రా ష్ట్రానికి చెందిన కపిజ, అబ్దుల్ మాటింగ్ దంపతులు బతుకుదెరువు నిమిత్తం మండల కేంద్రానికి వ చ్చారు. ఇక్కడ ఓ పౌల్ట్రీ ఫామ్లో పని చేస్తూ జీవ నం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సంవత్సరం వయసు ఉన్న ఆ దంపతుల కుమారుడు నూర్ నబిపై పౌల్ట్రీ ఫామ్లో కుక్క దాడికి పాల్పడింది. ఈ ఘటనలో బాలుడి చెవికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దాశరథి జీవితం ఆదర్శప్రాయం
● అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరస్వామి విద్యారణ్యపురి: దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ మహా కవిగా ఎదిగారని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేరు వీరస్వామి అన్నారు. గురువారం హనుమకొండలోని సమత హైస్కూల్లో తెలంగాణ మహా కవి దాశరథి జయంతిని అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి రచనలు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ప్రధాన వక్తగా అరసం వరంగల్ ప్రధాన కార్యదర్శి మార్కశంకర్నారాయణ మాట్లాడుతూ దాశరథి సాంప్రదా యక కుటుంబం నుంచి వచ్చినా వామపక్ష భావాలతో ఎదిగి ప్రత్యక్షంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప యోధుడన్నారు. ‘తిమరంతో సమచం’ అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో దాశరథికి వచ్చిందన్నారు. కాగా, గద్వాల సోమన్న రాసిన సిరిమల్లె చెట్టు 103వ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షుడు నిధి బ్రహ్మచారి ఆవిష్కరించారు. బాధ్యుడు పిట్ట సాంబయ్య పుస్తకాన్ని సమీక్షించగా దాశరథిపై మార్క శంకర్నారాయణ రాసిన పాటను వీరస్వామి ఆవిష్కరించారు. ఆ హైస్కూల్ కరస్పాండెంట్ కరుణాసాగర్రావు, అరసం బాధ్యులు రామబ్రహ్మం, మాజీ జిల్లా విద్యాశాఖాధికారి రామేశ్వర రాజు, రాజన్న, వెంకటేశ్వర్లు, కోటేశ్వర్రావు, రాంగారావు, అనిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు(శుక్రవారం) ఇంటర్, ఉన్నత విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నాయకులు కాంపాటి పృథ్వీ, పట్ల మధు, వికాస్, మధు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో గురువారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 152సార్లు వివిధ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపిని బీజేపీని ఓడించాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చామన్నారు. నాయకులు నందీశ్వర్, గౌతమ్, జ్యోతిబసు, మహేష్, వంశీ, నవీన్, వినోద్, జశ్వంత్ పాల్గొన్నారు. -
ఆకలి తీరేనా?
మహబూబాబాద్ అర్బన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తొలిసారిగా మధ్యాహ్న భోజనం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే గిరిజన జిల్లా అయిన మానుకోటలో మాత్రం అమలు చేయకుండా ప్రభుత్వం చిన్న చూపుచూస్తోందని ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. ఇక్కడ కూడా మధ్యాహ్నభోజనం అమలు చేస్తే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అధ్యాపకులు కోరుతున్నారు. జిల్లాలో 10 కళాశాలలు.. జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 2,237 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం తిని సాయంత్రం వరకు క్లాస్లు విని ఆకలితో ఇంటికి చేరుకుంటున్నారు. కొంత మంది విద్యార్థులు తమ వెసులుబాటును బట్టి ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది భోజనం లేక సాయత్రం వరకు నీరసించి పోతున్నారు. ఈక్రమంలో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్నమే ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో హాజరుశాతం అంతంతగానే ఉంటోందని అధ్యాపకులు తెలుపుతున్నారు. దాతల సాయంతో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో జనవరిలో పరీక్షల సమయంలో అధ్యాపకులు, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, ప్రిన్సిపాళ్ల సాయంతో భోజనం సౌకర్యం కల్పించి విద్యార్థుల ఆకలి తీర్చారు. దాతలు ప్రస్తుతం ముదుకు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. కాగా, ఇప్పటికై నా ప్రభుత్వం జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లాలో జూనియర్ కళాశాలల్లో అమలు కాని మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఉదయమే కళాశాలలకు చేరుకుంటున్న విద్యార్థులు పగటిపూట అర్ధాకలితో క్లాస్లు వింటున్న వైనంమధ్యాహ్న భోజనం అమలు చేయాలి అన్ని జిల్లాలో మాదిరిగా మానుకోటలోనూ మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది గిరిజన, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఆకలి తీర్చవచ్చు. మధ్యాహ్న భోజనం అమలు లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతున్నా. –పొక్కుల సదానందం, మానుకోట బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది..ఉయదం తినకుండానే కళాశాలకు రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం డబ్బులు ఉంటే ఏదైనా బేకరిఫుడ్ తీసుకుంటాను. డబ్బులు లేకపోతే ఖాళీ కడుపుతోనే ఉంటాను. ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతుంది. అధికారులు స్పందించి మాకు మధ్యాహ్న భోజనం చేయాలి. –బానోతు అక్షయ, బైపీసీ ద్వితీయ సంవత్సరం -
అనుభవం ఆదర్శం..
సాక్షి, మహబూబాబాద్: ప్రపంచీకరణ అందిపుచ్చుకున్న శాస్త్ర విజ్ఞానానికి అనుగుణంగా పనిచేస్తేనే ఏ రంగమైన, ఏ శాఖ అయినా మనుగడ సాధిస్తుందనేది సత్యం. ఈ విధానాన్ని అమలు చేసే పనిలో ఎస్పీ శబరీష్ వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా జిల్లా పోలీస్శాఖలో హెడ్ కానిస్టేబుల్(హెచ్సీ), ఏఎస్సైలు, మూడు దశాబ్ధాల సర్వీస్ ఉన్నవారికి ప్రత్యేక ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి వారు చేసింది, చేయాల్సింది, పోలీస్శాఖలో వారి అనుభవాల ప్రాధాన్యంను వివరించారు. సుధీర్ఘ సర్వీస్లో సంపాదించిన అనుభవం పోలీస్శాఖకు, జూనియర్ సిబ్బందికి ఆదర్శంగా ఉండాలంటూనే.. మరో వైపు సర్వీస్ దగ్గర పడుతుంది.. జాగ్రత్తగా ఉండాలి.. పోలీస్శాఖను అప్రతిష్ట పాలు చేయొద్దని, శభాష్ పోలీస్ అనిపించుకునేలా పని చేయాలని ఉపదేశించారు. గత అనుభవాలను వివరిస్తూ.. గతంలో పోలీస్ అనగానే ఏదో తప్పు చేసిన వారిని శిక్షించడానికి వచ్చారనే నానుడి ఉంది. అప్పుడు చే సిన ఇంటరాగేషన్ వేరు.. శాస్త్ర పరిజ్ఞానం అంతగా లేకపోయినా నేరాలను చేధించేవారు. గతంలో జిల్లా ఆఫీసర్కు మారుమూల గ్రామాలు తెలియ దు. అక్కడినుంచి వచ్చి నేరుగా అధికారికి తమ స మస్యలను చెప్పుకోవడం అంతగా తెలియదు. అ ప్పుడు కొందరు అధికారులు, ఉద్యోగులు ఏం చేసినా బయట ప్రపంచానికి సంవత్సరాల తరబడి తెలిసేది కాదు.. ప్రజలతో సంబంధాలు కూడా తక్కువగానే ఉండేవి.. ఏ పరిజ్ఞానం లేకపోయినా నేరస్తులను పట్టుకొని శిక్షలు పడేలా చేసేవారు. ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ప్రతీఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ప్రపంచమే అరచేతిలోకి వస్తుంది. మీడియా ప్రాధాన్యం పెరిగింది. సోషల్ మీడియా వేగం పెంచింది. ఈ పరిస్థితిలో ప్రతీ కదలిక సమాజానికి తెలిసి పోతుంది. తప్పు చేస్తే అబాసు పాలు అవుతారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగింది. ప్రశ్నించేవారు ఎక్కువ అయ్యారు. ఎక్కడ తప్పటడుగులు వేసినా దొరికి పోయే ప్రమాదం ఉంది. ప్రతీ ఒక్క రు జిల్లా ఎస్పీనే కాదు.. డీజీపీ వంటి పెద్ద ఆఫీసర్లను కలిసే సౌకర్యం ఉంది. ఈ పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఐటీ, ఇతర సాంకేతిక పరి జ్ఞానం ఉన్నా నేరాలను చేధించలేక పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనతోపాటు నేరస్తుల్లో కూడా పరిణతి చెందినట్లు స్పష్టం అవుతుంది. అందుకే ప్రజల్లో మంచి పేరు, మమేకం అవసరం. ప్రజల్లో చర్చగా మారిన ఓరియంటేషన్..పోలీస్శాఖకు మంచి పేరు తేవాలంటే ముప్పై సంవత్సరాలుగా శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల పాత్ర కీలకమని ఎస్పీ నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులపై జిల్లా పోలీస్శాఖలోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చగా మారింది. కానిస్టేబుళ్లుగా నియామకం అయినప్పటి నుంచి స్థానికంగా (జిల్లాలో) పనిచేస్తున్నారు. వీరికి తెలియని ఊరు ఉండదు. ప్రజాప్రతినిధులు, నేరస్తులు, ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసు. ప్రస్తుతం స్టేషన్లల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్, కొత్తగా వచ్చిన ఎస్సైలు చిన్న వారు, అనుభవం లేని వారు. వీరికి సలహాలు, సూచనలు ఇస్తూ శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాల్సింది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎౖస్సైలు. రూ.500లకు, రూ.1000కి ఆశపడితే సర్వీస్లో చేసిన మంచి పోతుంది. నమ్మకం పోతుందని ఎస్పీ హెచ్చరించినట్లు ప్రచారం. మారిన చట్టాలు, కేసుల పరిశోధన, ప్రజలతో మమేకం, కంప్యూటర్, సీసీటీఎన్ఎస్పై పరిజ్ఞానం అవసరమని పోలీస్శాఖలో మార్పు కోసం ఎస్పీ చేసిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. మెరుగైన సేవలు అందించే ప్రయత్నం ప్రతీ ఉద్యోగి తమ బాధ్యతలు ఎరిగి పనిచేయాలి. మారిన పోలీసింగ్ వ్యవస్థపై అవగాహన ఉండాలి. అదేవిధంగా శాఖలో పనిచేసిన అనుభవాలు కింది తరాలకు అందించాలి. అప్పుడే నేర రహిత సమాజ నిర్మాణానికి చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. పోలీస్శాఖలో మూడు దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, సలహాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతాయనే ఉద్దేశంతోనే ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాం. – శబరీష్, ఎస్పీ ●సర్వీస్ దగ్గర పడుతుంది.. శాఖకు చెడ్డపేరు తేవద్దు ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలి హెచ్సీ, ఏఎస్సైలకు ఎస్పీ శబరీష్ ఓరియంటేషన్ తరగతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా బాస్ -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యంఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్తోపాటు, విండ్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ భవనాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజాబాట, పొలంబాట ద్వారా నేరుగా వినియోగదారుల ముంగిటికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ ఎన్పీడీసీఎల్ చేపట్టిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు -
తూకంలో తేడా!
● క్వింటాకు రెండు కిలోలు తక్కువ ● ఆవేదన వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు ● ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరుమహబూబాబాద్: తూకం వేయకుండా రేషన్ బియ్యం సరఫరా చేయడంతో క్వింటాకు సుమారు రెండు కేజీలు తక్కువగా వస్తుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నా.. గోదాం ఇన్చార్జ్లు ఆదేశాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారుల వద్ద మొర పెట్టుకున్నా స్పందించక పోవడంతో అడిషనల్ కలెక్టర్ వద్ద విన్నవించారు. గోదాంలో ఉన్న ప్రభుత్వం అందించిన 50 క్వింటాళ్లను తూకం వేసే కాంటాను వినియోగించుకోవాలని ఉన్నా.. గోదాం ఇన్చార్జ్లు ఉపయోగించడం లేదని, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 558 రేషన్ షాపులు జిల్లాలో 18 మండలాలకు గాను 558 రేషన్షాపులు ఉన్నాయి. 2,78,712 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. బయో మెట్రిక్, ఐరీష్, ఓటీపీ విధానాలతో పంపిణీ జరుగుతోంది. ప్రతీ నెల గోదాంల నుంచి 25 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు షాపులకు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఆరు ఎంఎల్ఎస్ పాయింట్లు జిల్లాలో ఆరు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా మండలాలకు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇందులో మానుకోట, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, కొత్తగూడ, గార్లలో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. దిగుమతి భారంగా ట్రాక్టర్ల నుంచి షాపులకు దిగుమతి చేయడానికి హమాలీలు క్వింటాకు రూ.10, డ్రైవర్ ఇతర ఖర్చులు కలిసి 50 క్వింటాళ్లకు రూ.1,000, వంద క్వింటాళ్లు అయితే రూ.2,000 ఖర్చు అవుతుందని డీలర్లు అంటున్నారు. క్వింటాకు రూ.1.40 పైసలు మాత్రమే కమిషన్ ఇస్తున్నారని, 100 క్వింటాకు రూ.14,000 కమీషన్గా వస్తుందన్నారు. అదనంగా కిరాయి, కరెంట్ బిల్లులు పోను రూ 5,000 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం విషయంలో వినతులు తూకం వేసి బియ్యం సరఫరా చేయాలని డీలర్లు వారం రోజులుగా డీసీఎస్ఓ కార్యాలయం, సివిల్ సప్లయీస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈనెల 20న సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహరావు, డీసీఎస్ఓ రమేశ్కు వినతులు ఇచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కె.అనిల్కుమార్ను కలిశారు. అడిషనల్ కలెక్టర్ సమక్షంలోనే తూకం విషయంలో చర్చలు జరుగగా ఎట్టకేలకు వేబ్రిడ్జి తూకంతో సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన్నట్లు డీలర్లు తెలిపారు. అయితే వేబ్రిడ్జి తూకంతో న్యాయం జరగది, గోదాంలో ఉండే 50 క్వింటాళ్లు వేసే కాంటా ద్వారా ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ‘వేబ్రిడ్జి’తోనే సరఫరా.. ఆగస్టు మాసంలో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. తూకం విషయంలో డీలర్లు వినతులు ఇవ్వగా మూడు నెలలు కావడంతో ఆలస్యమవుతుందని వేబ్రిడ్జి ద్వారా ఇస్తామని హామీ ఇచ్చాం. గోదాంలో యాబై క్వింటాళ్ల తూకం వేసే కాంటాలు ఉన్నా.. మూడు నెలల కోటాతో ఆలస్యమవుతుంది. ఈ ఒక్కసారి వేబ్రిడ్జి ద్వారా ఇచ్చి తర్వాత కాంటా ద్వారా పంపిణీ చేస్తాం. – జాటోత్ రమేశ్, డీసీఎస్ఓ -
‘సర్’లో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: ‘సర్’ ప్రక్రియలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సర్ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమర్పించిన వివరాల ప్రకారమే ఓటర్ జాబితా ప్రకారం మ్యాపింగ్ చేసి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఓటర్ల వివరాలు వెంటనే సంబంధిత అధికారులు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఫారాలు నింపే విషయంలో సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు ఉంటే ప్రత్యేక హెల్ప్డెస్క్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్, నాయకులు మార్నెని వెంకన్న, సురేష్నాయుడు, శ్యాంసుందర్శర్మ, రామారావు, పెరుగుకుమార్, నవీన్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేయాలి
● డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్ ● మరిపెడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికమరిపెడ: సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బుధవారం మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మరిపెడ మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికై న కో–ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీతరవీందర్రెడ్డి, కమిషనర్ నరేష్రెడ్డి, పీసీసీ పరిశీలకులు హఫీజ్ఖాన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
● అభినందించిన ఎస్పీ డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ రూరల్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే కాపాడారు. దీంతో ఎస్పీ డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారు జామున సుమారు 2:44 గంటలకు ఓ యువకుడు ఆత్మహత్మకు పాల్పడుతున్నట్లు డీజీ కంట్రోల్ రూమ్ నుంచి మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలికి సమాచారం అందింది. స్పందించిన సీఐ అంజలి వెంటనే వైర్ లెస్ సెట్ ద్వారా నైట్ పెట్రోలింగ్ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్సై సుదర్శన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఓసీ క్లబ్ సమీపంలో రైల్వే ట్రాక్పై పడుకుని ఉన్న యువకుడిని గుర్తించి చాకచక్యంగా పట్టుకుని సురక్షిత్తంగా బయటకు తీసుకువచ్చారు. ఈ విషయంపై రూరల్ సీఐ అంజలి మాట్లాడుతూ రక్షించబడిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన షేక్ వసీమ్గా గుర్తించామని, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపాడన్నారు. వసీమ్ను టౌన్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించామని, తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి సమక్షంలో అప్పగించామన్నారు. -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ● మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన మహబూబాబాద్ రూరల్: నీట్ వైఫల్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు భూక్య ఉమ డిమాండ్ చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఉమ మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఇరవై రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అమానుషంగా దాడి చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతిరమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య, సర్పంచులు కొత్త హేమంత్, గుండెల రేణుక, కౌన్సిలర్లు సలువాది దిలీప్, బొల్లు రాజు, అంబాల శివకుమార్, గాడిపల్లి నాగేశ్వర్ రావు, పుచ్చకాయల సరిత, నాయకులు ఎండీ హారుణ్, ఘనపురపు అంజయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వీరన్న సన్నిధిలో కలెక్టర్ దంపతుల పూజలు
కురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం కలెక్టర్, ఎస్పీ స్నేహశబరీష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారిపేరుతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై గోత్రనామర్చనలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో కలెక్టర్ దంపతులు, కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి వారిని సత్కరించారు. రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలిడోర్నకల్: రైల్వే రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం డోర్నకల్ రైల్వే స్టేషన్లో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రన్నింగ్ స్టాఫ్ విధుల్లో చేరినప్పటి నుంచి విధులు ముగిసే వరకు కనీసం 120 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో మజ్దూర్ యూనియర్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లోని లోకో లాబీ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రన్నింగ్ స్టాఫ్కు 120 కిలోమీటర్ల మైలేజీకి పైగా దూరం వెళ్లేలా విధులు కేటాయించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియర్ డోర్నకల్ బ్రాంచ్ చైర్మన్ చరణ్నాయక్, బ్రాంచ్ సెక్రటరీ అంజయ్య, వైస్ చైర్మన్లు సుందరయ్య, వీరన్న, నాగశేషు, అసిస్టెంట్ సెక్రటరీలు కరణ్సింగ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పురుగుల అన్నం ఇరుకు గదులు అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ బుధవారం కళాశాలలోని వంట గదులను, విద్యార్థుల ఇరుకు గదులు, కళాశాల ప్రాంగణం, తరగతుల గదులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. ఒకే గదిలో 50 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్లోకి వసతులు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 90 ఎకరాల భూమిలో నూతన భవన నిర్మాణం చేస్తామని, విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నాలో పాల్గొనవద్దన్నారు. సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలారాంనాయక్, కౌన్సిలర్ సల్వాదీ దిలీప్, నాయకులు ఎడ్ల రమేష్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలిగార్ల: విధుల్లో సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కొనసాగుతున్న ఇంగ్లిష్ భాషా ఇంప్రూమెంట్ ప్రోగ్రాం, డిజిటల్ క్లాస్లను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభలే అవకాశం ఉన్నందున పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.డీడీ వెంట హెచ్ఎం సీహెచ్ జోగయ్య, వార్డెన్ రూపాదేవి, పీడీ పద్మ, బుచ్చానాయక్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
● రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నయీంనగర్: ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం ఇందిరానగర్ సంక్షేమ హాస్టల్, కిషన్పురలో విద్యార్థులతో ముఖాముఖిగా ఏర్పాటు చేసిన ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్ను నిర్మించే యువతకు నాణ్యమైన విద్య, పారదర్శక పరీక్ష విధానం నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతన్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దులు, రీ–ఎగ్జామ్స్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూ లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా వారి కృషి వృథా అవుతోందని వాపోయారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల అరెస్టు
హన్మకొండ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘ఛలో మింట్ కాంపౌండ్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని ఎస్పీడీసిఎల్ కంపెనీ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు వెళ్లకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఆర్టిజన్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. ఆర్టిజన్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్లో కార్మికులు 10 రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి మరోసారి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టిజన్ కార్మికులను ఇళ్ల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు అధికారంలో ఉండి నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్.. తమ హక్కుల సాధనకు పోరాడుతున్న ఆర్టిజన్ కార్మికులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని ఆయా సంఘాల నాయకులు విమర్శించారు. -
భూపాలపల్లి వెనుకంజ
జనగామ ముందంజ..ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎవరు ఏ విషయంలో ముందున్నారంటే.. అత్యధిక మొత్తం స్కోరు: జనగామ (49.73) ఉత్తమ ఓఐఎంఎస్: ములుగు (9.80) ఉత్తమ రైతుల నమోదు: హనుమకొండ (8.34) ఉత్తమ భూ ధ్రువీకరణ: వరంగల్ (9.54) (ఈ ఆరు జిల్లాల్లో) ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారుల హాజరు: హనుమకొండ (6.01)సాక్షి, వరంగల్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు, రైతుల నమోదుతో పాటు డిజిటల్ సేవల పురోగతిని ఏడు కీలక పారామీటర్ల ఆధారంగా అంచనా వేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో జనగామ అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హనుమకొండ మూడో స్థానంలో నిలవగా, ములుగు ఎనిమిదో స్థానం సాధించింది. వరంగల్ జిల్లా మాత్రం 16వ స్థానంలో నిలవడం గమనార్హం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడ్డాయి.జూన్ 30 నాటికి రూపొందించిన నివేదికలో రైతుల నమోదు, రైతు మరణాల నమోదు, క్లెయిమ్ల పరిష్కారం, భూ ధ్రువీకరణ, ఫైవ్స్ యాప్ వినియోగం, ఓఐఎంఎస్ అమలు, వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) హాజరును పరిశీలించి జిల్లాలకు మార్కులు కేటాయించారు. హనుమకొండకు మూడో స్థానం.. 48.80 పాయింట్లతో హనుమకొండ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (8.34), ఓఐఎంఎస్ (9.78), భూ ధ్రువీకరణ (9.19), ఏఈఓ హాజరు (6.01)లో మంచి మార్కులు సాధించింది. అయితే రైతు మరణ క్లెయిమ్ల పరిష్కారంలో (1.74) పనితీరు తక్కువగా నమోదైంది. ములుగు టాప్–10లో చోటు.. 46.06 పాయింట్లతో ములుగు రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఓఐఎంఎస్ (9.80), భూ ధ్రువీకరణ (9.53)లో అత్యుత్తమ పనితీరు కనబర్చినా, రైతు మరణాల నమోదు (4.15), క్లెయిమ్లు (1.69)లో ఆశించిన పురోగతి కనిపించలేదు. వరంగల్కు మధ్యస్థానం.. 43.80 పాయింట్లతో వరంగల్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.68), భూ ధ్రువీకరణ (9.54), ఓఐఎంఎస్ (8.83)లో మంచి మార్కులు వచ్చినప్పటికీ, రైతు మరణ క్లెయిమ్లు (1.67), ఏఈఓ హాజరు (3.68) తక్కువగా ఉండడం ర్యాంకును ప్రభావితం చేసింది. మహబూబాబాద్ వెనుకంజ.. 45.04 పాయింట్లతో మహబూబాబాద్ 13వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.38), ఓఐఎంఎస్ (8.92), ఏఈఓ హాజరు (5.54) సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, రైతు మరణాల నమోదు (4.05), క్లెయిమ్లు (1.46), భూ ధ్రువీకరణ (8.83)లో మెరుగుదల అవసరమని నివేదిక సూచిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి పరిస్థితి.. 42.36 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతుల నమోదు (6.98), భూ ధ్రువీకరణ (8.82), ఓఐఎంఎస్ (9.27) బాగున్నప్పటికీ, రైతు మరణ క్లెయిమ్లు (1.48), ఏఈఓల హాజరు (3.88)లో పని తీరు తక్కువగా నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిజిటల్ సేవలు (ఓఐఎంఎస్,ఫైవ్స్), భూ ధ్రువీకరణలో చాలా జిల్లాలు మెరుగైన పనితీరు కనబర్చాయి. అయితే ‘రైతు మరణ క్లెయిమ్ల పరిష్కారం, ఫీల్డ్ స్థా యి పర్యవేక్షణ (ఏఈఓల హాజరు)’ లో అన్ని జిల్లాల్లోనూ తక్కువ మార్కులు రావడం ఆందోళన కలిగించే అంశం. రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే పెండింగ్ నమోదులు, క్లెయిమ్ల పరిశీలన వేగం చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యవసాయ విభాగాల్లో ఏడు కీలక పారామీటర్లలో జిల్లాల పనితీరుపై ప్రభుత్వం ర్యాంకింగ్ హనుమకొండకు మూడో స్థానం.. వరంగల్ 16వ స్థానానికి పరిమితంజనగామ అన్ని రంగాల్లో సమతూకం 49.73 పాయింట్లతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జనగామ జిల్లా దాదాపు అన్ని పారామీటర్లలో సమతూక పనితీరు కనబర్చింది. రైతుల నమోదు (7.79), భూ ధ్రువీకరణ (9.63), ఫైవ్స్ యాప్ (9.61), ఓఐఎంఎస్ (9.09)లో అధిక మార్కులు సాధించింది. రైతు మరణ క్లెయిమ్లలో (1.67) మాత్రం ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది. -
మూడేళ్లయినా మూడు వేల ఉద్యోగాలివ్వని సర్కారు
● మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ : తెలంగాణలో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మూడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఓ ఫంక్షన్ హాల్లో కేటీఆర్ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. మాయమాటలతో నిరుద్యోగ యువత ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంచిందని ధ్వజమెత్తారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరా రు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అబద్ధాల పునాదులపై ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తప్పుతోవ పట్టిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు ల క్షల ఉద్యోగాలు, నిరుద్యోగ బృతి ఇస్తామ ని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్, సునీల్, లోహిత, సైదిరెడ్డి, వీరేందర్, శరత్శంద్ర, ప్రశాంత్, వీరస్వామి, మనోజ్, రామ్మూర్తి, రజిని, శ్రీధర్, రాజు, చిన్న, వినిల్ రావు పాల్గొన్నారు. -
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
హన్మకొండ : విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కె.ఆర్. నాగరాజుతో కలిసి మల్లు భట్టి విక్రమార్క ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి హఠావో.. దేశ్ కి బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్నారు. విద్యార్థులపై పాశవికంగా వ్యవహరించినందుకు నిరసనగా వారికి అండగా ఉండేందుకు బాధ్యతగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, నాయకులు గుండు సుధారాణి, ఇ.వి.శ్రీనివాస్రావు, బత్తిని శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్ యాదవ్, కరాబు రాజేశ్వర్ రావు, అనిల్, అలువాల కార్తీక్, సతీశ్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా -
యువకుడి ఆత్మహత్య ఘటనలో నిందితుడి అరెస్ట్
వేలేరు: వ్యాపార భాగస్వామి వేధింపులతో హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లి గ్రామానికి చెందిన ఏదునూరి నరేశ్(29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు ఎల్.సురేశ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నరేశ్, సురేశ్ సుమారు 7 నెలల క్రితం డీజే సౌండ్స్, లైటింగ్, డెకరేషన్ వ్యాపారం ప్రారంభించారు. అయితే మూడు నెలల నుంచి వ్యాపారంలో లాభనష్టాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఈనెల 9న సురేశ్ కొంతమందితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లి భార్యాపిల్లల ఎదుట చంపుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ 20వ తేదీన మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సురేశ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
మందుల కొనుగోలుకు వచ్చి మృత్యుఒడికి..
మహబూబాబాద్ రూరల్ : మందులు కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి బైక్ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని రామన్నపేట కాలనీలో నివాసం ఉండే బంధువులు గుగులోత్ వెంకన్న, ఇస్లావత్ వీరన్న (55) మంగళవారం రాత్రి ముందుల కొనుగోలుకు ఓ ఆస్పత్రి వద్దకు వచ్చారు. కొనుగోలు అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు వెనుక నుంచి వీరన్నను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుకాగా వెంటనే స్థానికులు, కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువు వెంకన్న ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనకు బాధ్యుడైన బయ్యారం మండలం కస్తూరి నగర్కు చెందిన బాదావత్ నవీన్పై టౌన్ ఎస్సై బషీరుద్దీన్ కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ● బైక్ ఢీకొని వ్యక్తి మృతి ● మానుకోటలో ఘటన -
అద్భుత అవతారం
లక్ష్మీ నర్సింహస్వామి రూపం● త్రిదండి చినజీయర్స్వామి లింగాలఘణపురం : లక్ష్మీనర్సింహస్వామి వారి అవతారం అద్భుతమని త్రిదండి చినజీయర్ స్వామి ఉద్భోదించారు. బుధవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండం బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం, గుట్టపై శంఖుచక్ర నామాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి దశావతారాల్లో లక్ష్మీనర్సింహస్వామి, రాముడి అవతారం ఎవరు కోరకుండానే లోకకల్యాణార్థం వెలసిన అవతారాలన్నారు. ఆలయాల సంపదను కాపాడుకునేందుకు గ్రామస్తులంతా ఏకం కావాలన్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, అందుకు ముందుగా పూర్వకాలంలో పూజారులుగా ఉన్న శ్రీనివాసాచార్యుల నుంచి మొదలు పెట్టాలని, అప్పుడు మరోసారి ఆలయాన్ని సందర్శిస్తానన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వంచ మహేశ్వర్రెడ్డి, వంచ రాంరెడ్డితో పాటు సర్పంచ్ పోరెడ్డి సంతోషిమల్లారెడ్డిని అభినందించారు. కాగా ఆలయానికి రూ.లక్ష నుంచి రూ.50 వేల వరకు విరాళాలు ఇచ్చిన భక్తుల్లో ఎం.శ్రీధర్రెడ్డి, వి.మహేందర్రెడ్డి, సి.హెచ్ రవీందర్రెడ్డి, అన్రెడ్డి నర్సిరెడ్డి, కె.భాస్కర్రెడ్డి, ఎన్.అంజిరెడ్డి, సి.హెచ్ ప్రభాకర్రెడ్డి ఉన్నారు. కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరగగా జనగామ మున్సిపల్ చైర్మన్పర్సన్ కె.బాలమణిశ్రీనివాస్, స్థానిక ఉపసర్పంచ్ నవీన్, చెట్టిపల్లి రవీందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారి అపహరణకు యత్నం
● పట్టుకున్న స్థానికులు ● పోలీసులకు అప్పగింత ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం చిన్నారి (పాప) అపహరణకు యత్నం జరిగింది. నందమూరినగర్కు చెందిన పుట్ట రాజేందర్, భవాని దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భవాని ఏడాదిలోపు చిన్నారిని ఆడిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మంచినీరు కావాలని అడిగాడు. తల్లి ఎమరుపాటుగా ఉందని గ్రహించి ఆ చిన్నారిని అపహరించేందుకు యత్నించాడు. వెంటనే తెరుకున్న భవాని అతడిని వారించి కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి దుండగుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని విచారించగా పొంతలేని సమాధానం చెప్పాడు. ఒకసారి ఛత్తీస్గఢ్ అని, మరోసారి ఒడిశా అని.. తాము ముగ్గురు వ్యక్తులం పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చామని చెప్పడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చర్యలు వేగవంతం చేయాలి
సీబీఎం నిల్వల అభివృద్ధికిహన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు క్షేత్రాలు, ములుగు–భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్న కోల్ బెడ్ మిథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం లోక్సభలో కోరారు. సీబీఎం వనరుల శాసీ్త్రయ అన్వేషణ, వాణిజ్యపరమైన వినియోగం ద్వారా తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే గణనీయ నిల్వలు ఉన్నా వాటి అన్వేషణ, అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎం వెలికితీత, వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కూడా ప్రశ్నించారు. జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారో, అలాగే ఆహార ధాన్యాల కేటాయింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరాలు కోరారు. ఆహార ధాన్యాల కేటాయింపులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, భవిష్యత్లో లబ్ధిదారుల సంఖ్య పెరిగితే తగిన విధంగా కేటాయింపులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
మాల్ప్రాక్టీస్ ఘటనలో వ్యక్తికి మూడేళ్ల జైలు
ములుగు రూరల్: మరొకరి పరీక్ష రాసిన ఘటన (మాల్ప్రాక్టీస్)లో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిన్తూ ప్రిన్సిపల్ జీఎఫ్సీఎం జడ్జి జ్యోత్న్స తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మంగళవారం తెలిపారు. జగన్నాథం నాగార్జున అనే వ్యక్తి 2017లో తన బాబాయ్ జగన్నాథం సాంబయ్యకు బదులు పదో తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. ఈ సమయంలో ఇన్విజిలేటర్ హల్టికెట్ తనిఖీ చేస్తున్నాడు. హల్టికెట్లో ఉన్న వ్యక్తికి పరీక్ష కేంద్రంలో ఉన్న వ్యక్తికి తేడా ఉండడంతో గుర్తు పట్టి పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు ట్రయిల్ రన్కు రాగా కోర్టు కానిస్టేబుల్ దర్యాప్తు చేసిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇందులో నేరం రుజువుకావడంతో నేరస్తుడు నాగార్జునకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి ● హజారియా తండా గ్రామంలో ఘటన మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం హజారియా తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనంప్రకారం.. గ్రామానికి చెందిన ధరావత్ నరేశ్ (25)కు భార్య సింధు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం నీరు పెట్టడానికి పొలానికి వెళ్లిన నరేశ్ స్టార్టర్ ఆన్ చేస్తున్న చేస్తున్న క్రమంలో వైరు ఛాతిమీద పడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సింధు మంగళవారం మహబూబాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై పి.రాజు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజగోపుర నిర్మాణానికి భూసార పరీక్షలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణంలో భాగంగా రాజ గోపుర నిర్మాణ భూమి ధృడత్వాన్ని పరిశీలించేందుకు అంజీ జియో సొల్యూషన్స్ హైదరాబాద్ వారు మంగళవారం భూసార పరీక్షలు ప్రారంభించారు. ప్రతీ 1.5 మీటరు లోతులో మట్టిని సేకరించి పరీక్షించనున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం రాజగోపుర పునాది ప్రమాణాలు నిర్ణయిస్తారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఇంజనీరింగ్ సెల్ సహాయ స్తపతి ఎడ్ల శివశంకర్, ఆలయ పర్యవేక్షకుడు కూచన హరినాఽథ్, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పాల్గొన్నారు. కాగా, మూడు రోజుల పాటు భూసార పరీక్షలు కొనసాగుతాయని అంజీ జియో సొల్యూషన్స్కు చెందిన సాంకేతిక నిపుణులు తెలిపారు. -
విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే ఉన్నత విద్యాసంస్థల లక్ష్యమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం రూసా 2.0 ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల ప్రాజెక్టుల ఫెల్లోలతో విశ్వవిద్యాలయం రూసా నోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టుల ద్వారా నాణ్యమైన పరిశోధన ఫలితాలు వెలువడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ప్రచురించడంతోపాటు పేటెంట్లు సాధించాలన్నారు. రీసెర్చ్ ప్రాజెక్టుల, ప్రాజెక్టు ఫెల్లోలు తమ ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్లకు పూర్తి సహకారం అందించాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. కేయూలో ఏర్పాటుచేసిన కె హబ్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోనికి రానుందన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి మాట్లాడారు. -
ఖాతాల్లో ‘క్యాష్’.. పర్సులు ‘ఖాళీ’
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు పెరిగినా, నగదు అవసరం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నగదు కొరత రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. బ్యాంకుల్లో రూ.50 వేల నగదు తీసుకోవాలన్నా రెండు, మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తుండడంతో ప్రజలు ఒక ఏటీఎం నుంచి మరో ఏటీఎంకు తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని ఖాతాదారులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు, ఆస్పత్రి ఖర్చులు, కూలీల చెల్లింపులు, పెన్షన్ల కోసం నగదు అవసరమైన సమయంలో బ్యాంకులు పరిమిత మొత్తాలే చెల్లిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘క్యాష్ లేదు.. రేపు రండి’ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎస్ఎల్బీసీ రిపోర్టు ప్రకారం అన్ని బ్యాంకులు కలిపి సుమారు 1,285 వరకు ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 350కి పైగా అసలే పని చేయడం లేదు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు కొరత కనిపిస్తోందని ఏటీఎంల ఆపరేటర్లే చెబుతున్నారు. నగదు సమకూర్చడంలో ఇబ్బందులు, క్యాష్ లాజిస్టిక్స్ సమస్యల వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపి ఎక్కువగా మూతబడ్డాయి. కాగా, అనేక బ్యాంకు శాఖల్లోనూ మధ్యాహ్ననికే నగదు నిల్వలు అయిపోతున్నాయి. దీంతో ‘ఈరోజు క్యాష్ అయిపోయింది... రేపు రండి’, ‘ఒక్కొక్కరికి పరి మితంగా మాత్రమే ఇస్తాం’ అంటూ చాలాచోట్ల ఖా తాదారులను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. వృద్ధులు, రైతులపై తీవ్ర ప్రభావం.. నగదు కోసం ప్రజలు వరుసగా మూడు, నాలుగు ఏటీఎంలు తిరిగినా ఖాళీ చేతులతోనే వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు ఉపయోగించలేని వృద్ధులు, గ్రామీణ మహిళలు, చిన్న రైతులు పూర్తిగా నగదుపైనే ఆధారపడుతున్నారు. ఖాతాల్లో డబ్బు ఉన్నా నగదు అందక వైద్య ఖర్చులు, ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీల చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్నారు. కాగా, నగదు లేక ప్రజలు రావడం తగ్గడంతో కొన్ని గ్రామాల్లో ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఖాళీగా ఉండే ఏటీఎంలలో పశువులు తలదాచుకోవడం, మరికొన్ని చెత్తతో పేరుకుపోయి ఉంటున్నాయి. విత్డ్రాకు నగదు కరువు.. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రూ.50 వేల నగదు తీసుకోవాలన్నా రోజుల నిరీక్షణ ‘నో క్యాష్’ బోర్డులతో వెలవెలబోతున్న ఏటీఎంలు వృద్ధులు, రైతులు, గ్రామీణులకు తీవ్ర ఇబ్బందులు కుక్కలు, పశువులకు ఆశ్రయంగా ఏటీఎంలు బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఆన్లైన్, యూపీఐ లావాదేవీలు పెరగడంతో నగదు పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరెన్సీ చెస్ట్ల నుంచి నగదు సరఫరా పరిమితంగా రావడం లేదు. నగదు రవాణా, భద్రత ఖర్చులను తగ్గించే చర్యలు, ఏటీఎంలలో నగదు నింపే సంస్థల పరిమిత షెడ్యూళ్లు, కొన్ని శాఖల్లో నగదు అవసరాన్ని సరిగా అంచనా వేయకపోవడం వంటి కారణాలు నగదు కొరతకు దారితీస్తున్నాయని కొందరు బ్యాంకు అధికారులే చెబుతున్నారు. -
ఆగస్టు18 నుంచి తీజ్ ఉత్సవాలు
నయీంనగర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోర్ బంజారాలు శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 18 నుంచి 27వ తేదీ వరకు తీజ్ ఉత్సవాలను జరుపుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోర్ సిక్వాడీ మీడియా వింగ్ అధ్యక్షుడు బాదావత్ బాలాజీ నాయక్తో కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ పండుగ రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. చివరి రోజు సేవాలాల్ మహా రాజ్కు భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి మేరమాయాడికి పూజలు చేస్తామన్నారు. రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ నాయక్, చంద్రు తండా సర్పంచ్ రవి నాయక్, విజయ్ నాయక్, దేవేందర్, వెంకన్న, శ్రీధర్, నాగమణి, సోనాబాయి, అనూష బాయి, తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు
హన్మకొండ అర్బన్ : ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వివిధ శాఖల సంసిద్ధత, కాంటింజెన్సీ ప్రణాళికలపై మంగళవారం హనుమకొండ ఐడీఓసీ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో వివరించారు. వర్షాభావ పరిస్థితులకు తగినట్లు ప్రత్యామ్నాయ పంటలపై గ్రామస్థాయిలో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.. జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, పంచాయతీరాజ్, ఉద్యాన, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎంజీఎన్ఆర్ఈజీఎస్తో అనుసంధానించి 2,400 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు లక్ష్యాలు నిర్దేశించామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం.. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ఎల్నినో దృష్ట్యా మండల, గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. పప్పుధాన్యాలు, కూరగాయల సాగుతో పాటు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా రిజర్వాయర్ల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పైపులైన్ లీకేజీల మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. సాగుపై రైతులకు మార్గనిర్దేశం.. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా పంట మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగుపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు వాతావరణానుకూల సాగు విధానాలపై సూచనలు అందిస్తున్నారని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. దేవాదులపై సమగ్ర కార్యాచరణ.. ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకంపై జిల్లా స్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర మాన్యువల్ రూపొందిస్తున్నామని, ప్రస్తుతం పనిచేస్తున్న పంపులతోపాటు మిగతా పంపుల మరమ్మతులు, విడిభాగాల లభ్యత వంటి వివరాలను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణతోపాటు ఇతర జిల్లాల సూచనల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల ద్వారా రైతులకు పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించామన్నారు. మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, లెమన్ గ్రాస్ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. నానో యూరియా వినియోగం, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలపై కార్యాచరణ రూపొందించామని, రైతులకు ఎరువుల సరఫరా సులభతరం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.యూరియా కొరత లేదు.. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేద ని, డీఏపీ ఎరువుల సరఫరా మార్క్ఫెడ్ ద్వారా కొనసాగుతోందన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకు ని సీజ్ చేశామని చెప్పారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ, మున్సిపల్ స్థాయిలో పంట మార్పిడిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి నాట్లు గణనీయంగా తగ్గాయని, జిల్లాలోని ఎక్కువ చెరువుల్లో నీటిమట్టా లు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలసాగుపై దృష్టి సారిస్తున్నామని వివరించారు.2026 వానాకాల పంట సీజన్ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రూపొందించిన ‘ఎల్నినో కంటింజెన్సీ ప్లాన్–2026’ బుక్లెట్తో పాటు పంటల క్యాలెండర్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే క్రమంలో హనుమకొండ జిల్లా హసన్పర్తి, ఎల్క తుర్తి, దామెర, భీమదేవరపల్లి మండలాలకు చెందిన రైతులకు సబ్సిడీపై కంది, పెసర విత్తనాల ప్యాకెట్లను మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక చర్యలు ఉమ్మడి జిల్లా సమీక్షలో కలెక్టర్లు -
పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య
వరంగల్ అర్బన్ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా(సీఎస్ఆర్)గా నగరాలు, పట్టణాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తామని మెప్మా మిషన్ అడిషనల్ డైరెక్టర్ యాదగిరి రావు తెలిపారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మెప్మా అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనదించడానికి రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ (టీఎల్టీ) బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో వరంగల్ ఉమ్మడి జిల్లా ఒకటిఅన్నారు. సీఎస్ఆర్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్లు, వైఎస్ చైర్మన్లుగా సంబంధిత నగరాలు, పట్టణాల కమిషనర్లు, సభ్యులుగా మెప్మా అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఉండే పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్యనుఅందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. మెప్మా అధికారులు నూతన మహిళా సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటు పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మహిళా సంఘాలు కాకుండా అదనంగా 30శాతం సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, మెప్మా పీడీ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డీఎంసీలు రజితారాణి, రేణుక, విజయ, రాజేశ్వరి, ఇన్చార్జ్ డీఎంసీ హర్షవర్ధన్, ఏడీఎంసీలు వహీదా, సతీశ్, టీఏంసీలు రమేశ్, వెంకట్ రెడ్డి, సీఓలు సకినాల రమేశ్, ప్రవీణ్, శ్రీలత, రమాదేవి, రజిత తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా పాఠశాలలు మెప్మా మిషన్ అడిషనల్ డైరెక్టర్ యాదగిరి రావు -
హామీని వెంటనే అమలుచేయాలి
వరంగల్ చౌరస్తా : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి. కొండల్రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని రైతు భవన్లో సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమడి శ్రీనివాస్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కౌలు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంట ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నా వారికి ప్రభుత్వ సౌకర్యాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ అనేక ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తున్నదని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, నాయకులు రాజయ్య, మొగిలి, బాలరాజు, నాగేశ్, సంపూర్ణ, సురేశ్, ప్రసాద్, హంసాల్ రెడ్డి, రవీందర్, విజయ్, సుదర్శన్, సాంబయ్య, అనిత, రవీందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. వీరి ఇల్లు ఎక్కడ?
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో వరుసగా చోటు చేసుకుంటున్న చైన్స్నాచింగ్ ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సోమవారం పడమటిగూడెంలో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించిన ఘటన మరువక ముందే మంగళవారం మండలంలోని ఫతేషాపూర్లో మరో వృద్ధరాలిని లక్ష్యంగా చేసుకుని దుండగులు బంగారు గొట్టాలను అపహరించారు. గ్రామానికి చెందిన శివరాత్రి మల్లమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట కూర్చొని ఉండగా ఇద్దరు దుండగులు బైక్పై గ్రామంలో తిరుగుతూ గ్రామం చివరన ఉన్న ఆమె వద్దకు వచ్చారు. ఒకరు బైక్పైనే ఉండగా, మరొకరు సెల్ ఫోన్తో అమ్మా..మా చుట్టాల వారి ఇల్లు దొరకడం లేదు.. ఫొటో చూసి ఇల్లు చూపిస్తావా అంటూ మాటల్లో పెట్టాడు. వృద్ధురాలు సెల్ ఫోన్లోని ఫొటోలను వంగి చూస్తుండగా అదే అదునుగా భావించి ఆమె మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల తాడును లాక్కొని రామచంద్రగూడెం వైపునకు పరారయ్యారు. వృద్ధురాలు లబోదిబోమంటూ అరవడంతో సమీపంలో ఉన్న యువకులు పరిగెత్తుకొని వచ్చినా అప్పటికే దుండగులు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నరేశ్ ఘటనా స్థలికి చేరుకొని వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు.● వృద్ధురాలిని మాటల్లో దింపి చైన్ స్నాచింగ్కు పాల్పడిన దుండగులు -
ఉగ్ర, శివదూతీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం అమ్మవారిని ఉగ్ర, శివదూతీ క్రమాల్లో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం స్నపనమూర్తిని కాళీక్రమంలో ఉగ్రమాతగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేతరెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. జైశ్రీరామ్ ధాన్యానికి రికార్డు ధర కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జైశ్రీరామ్ (పాతవి) రకానికి చెందిన ధాన్యానికి రికార్డుస్థాయిలో ధర పలికింది. మార్కెట్కు జైశ్రీరామ్ ధాన్యం అమ్మకానికి వస్తుండగా, ఇటీవల గరిష్ట ధర రూ.3,800ల వరకు పలికింది. మంగళవారం 298 బస్తాల ధాన్యం మార్కెట్కు రాగా, జైశ్రీరామ్ రకానికి చెందిన ధాన్యానికి గరిష్ట ధర రూ.4,013లు, కనిష్ట ధర రూ.2,669లు పలికింది. పోలింగ్ బూత్ల పరిశీలన ఇనుగుర్తి: మండలంలోని పలు పోలింగ్ బూత్లను జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసులుతో కలిసి మండలంలోని చిన్ననాగారం గ్రామంలోని 77, 78 బూత ్లతో పాటు మండలకేంద్రంలోని 59 నుంచి 64 నంబర్ల పోలింగ్ బూత్లను తనిఖీ చేశారు. సర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో రెవెన్యూ అధికారులు, బీఎల్ఏ, బీఎల్ఓలు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతికి ప్రవేశ పరీక్షలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మామూనూరు నవోదయ ప్రిన్సిపాల్ ఎస్. ప్రవీణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 31వ తేదీ వరకు నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బాలికను గర్భవతిని చేసిన యువకుడు?● పొక్సో కేసు నమోదు? మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని ఓ గ్రా మానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని మా యమాటలు చెప్పి ఓ యువకుడు గర్భవతిని చేసిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు బాలిక, యువకుడి మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొ నసాగగా ఆమె గర్భవతి అయింది. విషయం కాస్త బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మహబూబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
పురుగుల అన్నం, ఇరుకు గదులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని జేఎన్న్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థులకు పురుగుల అన్నం, ఇరుకు గదులు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో మంగళవారం విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో 3 కోర్సులతో ప్రారంభించగా ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రకల్ కమ్యూనికేషన ఇంజనీరింగ్, ఈఈఈ, మోకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. బాలికలు, బాలురు కలుపుకొని మొత్తం 750 మంది విద్యార్థులతో ప్రస్తుతం కళాశాల తరగతులు కొనసాగుతున్నాయి. అన్ని కోర్సులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నా కళాశాలలో కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు ఇంజనీరింగ్ కళాశాల భవనంలో మొత్తం ఆరు గదుల్లో రెండు గదుల్లో ల్యాబ్లు, నాలుగు గదుల్లో తరగతులు నిర్వహిస్తారు. ఒక్కొక్క గదిలో సుమారు 50 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో సుమారు 300 మంది బాలికలు ఉంటున్నారు. బాలురలకు హాస్టల్ సౌకర్యాలు లేక దూరంలో అద్దె భవనంలో ఉంటున్నారు. పురుగుల అన్నం, నీళ్ల చారు.. బాలికల హాస్టల్లో పురుగుల అన్నం, నీళ్ల చారు, రుచి పచిలేని టిఫిన్ తినలేక విద్యార్థులు ఆన్లైన్లో భోజనం తెప్పించుకుని తింటున్నారు. టిఫిన్, భోజనం, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల మరమ్మతుపై వార్డెన్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ‘మా దగ్గర ఇలానే ఉంటాయి. ఇష్టమైతే చదువుకో లేకపోతే హాస్టల్లో ఉండకు’ అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని బాలికలు వాపోతున్నారు. ఈ విషయమై హాస్టల్లో ఏఎన్ఎం, వాచ్మెన్, మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై సుమారు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు, తహసీల్దార్, కళాశాల ప్రిన్సిపాల్ బలరాం నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని త్వరలోనే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ధర్నాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల వలయంలో ఇంజనీరింగ్ కళాశాల మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల ఆందోళన


