నేను కనిపిస్తున్నానా..
వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం పలు వార్డుల్లో ప్రచారం చేశారు. 7వ వార్డులో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అరూరి రమేశ్ మాట్లాడుతుండగా ఎర్రబెల్లి దయాకర్రావు అందరికీ కనిపించేలా కుర్చీ ఎక్కి నిలబడ్డారు. ఇది చూసిన కార్యకర్తలు ‘దయాకర్ సారు.. అందరికీ కనిపించేందుకు కుర్చీ ఎక్కాడు.. మీరు కూడా ఓట్లు వేసి మన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ కుర్చీ ఎక్కించాలి’ అనడంతో అందరూ నవ్వారు.
– వర్ధన్నపేట


