breaking news
Mahabubabad District Latest News
-
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద చేపట్టిన తుది దశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన క్యూ లైన్ స్థలాన్ని పరిశీలించి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో భాగంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈఓ వీరస్వామి, సర్పంచ్ భారతి పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం
● మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి అవగాహన పాలకుర్తి టౌన్ : మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం చేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సంతలో మైకులో మత్తు పదార్థాలు–అనర్ధాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్–సేవ్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. యువతను నన్మార్గంలో నడిపించేందుకు తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. -
లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం..
ములుగు రూరల్ : మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ అలియాస్ షకీల (దివంగత మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ. 20 లక్షల రివార్డు చెక్కును అందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఏఎస్పీ మమన్ భట్ పాల్గొన్నారు. రివార్డు చెక్కులు, హెల్త్ కార్డులు అందజేత మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు విలేకరుల సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ -
సొంతింటి కల సాకారమే ధ్యేయం
కమలాపూర్ : అర్హులైన పేద కుటుంబానికి సొంతిళ్లు అందించి వారి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరాణితో కలిసి మంత్రి పొంగులేటి సోమవారం గూడూరులో ప్రారంభించారు. కమలాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కమలాపూర్ మండలంలో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్ను, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు బండి వనజకళాధర్, పబ్బు సతీశ్, అదనపు కలెక్టర్ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థ నాయక్, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేష్కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు గూడూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి పొంగులేటితో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వాగ్వాదం డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభస చోటుచేసుకుంది. కమలాపూర్లో సోమవారం డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని, మీరిచ్చిన హామీలు అమలు చేయాలని, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రులను కోరారు. ఇందుకు మంత్రి పొన్నం కౌంటర్ ఇవ్వగా స్టేజీపైనే పొంగులేటి, కౌశిక్రెడ్డి కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడాతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పట్టి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతూ అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడాలని, ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ స్టేజీపైనే మంత్రితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు స్టేజీపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టిన మోదీ
నెహ్రూసెంటర్: దేశ ప్రజల ప్రయోజనాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, అమెరికాకు తాకట్టుపెట్టిందని ఎస్కేఎం నాయకులు ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని, రైతాంగానికి నష్టం చేకూర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో సోమవారం ఎస్కేఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా కన్వీనర్ గుజ్జు దేవేందర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేక వీరన్న, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనప పొమ్మన్న, ఆలకుంట్ల సాయిలు, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు హలావత్ లింగన్న మాట్లాడారు. కార్మిక వ్యతిరేక లేబర్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం, పంటలకు మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు, అమెరికాకు వత్తాసు పలుకుతూ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలను తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో నందగిరి వెంకటేశ్వర్లు, జడ సత్యనారాయణ, బూర్క వెంకటయ్య, సూర్యం, వీరభద్రం, పర్వత కోటేష్, గజ్జి సోమన్న, సామ పాపయ్య, బోనగిరి మధు, ఏపూరి వీరభద్రం, కోటమ్మ, జలగం ప్రవీణ్, రాజమల్లు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన, నాయకుల అరెస్టు -
సర్ ముగింపు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఎస్ఐఆర్(సర్) ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఓట్లు భద్రంగా ఉన్నాయి.. ఎన్ని ఓట్లు తొలగించనున్నారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కాగా, జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 48,144 ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. ఈమేరకు డ్రాఫ్ట్ జాబితాను ఈనెల 17న విడుదలు చేసి అభ్యంతరాలు రాకపోతే తొలిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 48,144ఓట్లు తొలగించే అవకాశం జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,84,935 మంది ఓటర్లు ఉన్నారు. బూత్లెవల్ అధికారులు మాత్రం 4,36,791 మంది ఓటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. మరో 3,013 మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. మొత్తంగా 4,36,735మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూరించిన తర్వాత తీసుకున్నారు. ఇందులో ముందుగా ప్రకటించిన విధంగా 2002 ఓటరు జాబితా ప్రకారం రక్తసంబంధీకుల ఓటర్లతో సరి అయినవి 2,40,970 ఓట్లు ఉండగా, 2025 జాబితాలో ఓటు ఉన్నవారు 1,80,883 మంది ఉన్నారు. వీరుపోగా అటు రక్తసంబంధీకులతో, ఇటు స్వయంగా జాబితాలో లేకుండా దేనితో సరికాని వారు 14,882 మంది(3.07శాతం) ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఫారాలు భర్తీ చేశారు. వీరు పోగా మిగిలిన వారిలో 9,376 మంది మరణించారు. 29,785 మంది ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతానికి ఓటు మార్చుకున్నారు. వీరితోపాటు 8,853 మందికి ఇతర ప్రాంతాల్లో కూడా ఓటు ఉన్నట్లు గుర్తించారు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉండి అందుబాటులో లేనివారు 862 మందిని గుర్తించారు. ఇలా మొత్తంగా 48,144మంది ఓటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసి సరైన సమాధానం, ఆధారాలు చూపకపోతే ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. సవరణ జాబితాలో 76,928 ఓట్లు.. ఓటరు సవరణ కార్యక్రమంలో తలెత్తిన సమస్యలు, తప్పులుగా నమోదు కావడం మొదలైన కారణాలతో జిల్లాలో 76,928 ఓట్లను సవరణ జాబితాలో చేర్చారు. ఇందులో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు(ఏఎస్డీ) మొత్తం 3,473 మంది ఉన్నారు. అదే విధంగా ఇంటిపేరు, తండ్రిపేరు, పేర్లు తప్పుగా నమోదు అయిన వారు 4,281 మంది, ఇతర వయస్సు, వారసుల పేర్లు తప్పు మొదలైన కారణాలతో సవరణ జాబితాలో చేర్చిన వారు 69,174 మంది ఉన్నారు. మరోసారి పరిశీలించి వారి వద్ద ఉన్న నిజమైన ఆధారాలతో సవరణ చేయనున్నారు. జిల్లాలో 842 గ్రామ పంచాయతీలు, 600లకు పైగా ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. అదివాసీ గూడేలు, తండాల నుంచి సమీపంలోని తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్, మరిపెడతో పాటు ఇతర జిల్లాలు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, సూరత్, బీమండీ, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి జీవిస్తున్నారు. అయితే, తాము ఎక్కడ ఉన్నా .. తమ సొంత గ్రామంలోనే మా ఓటు హక్కు కలిగి ఉండాలనే ఆలోచనతో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సమాప్తం తొలగించేందుకు సిద్ధంగా 48,144 ఓట్లు 17న డ్రాఫ్ట్ జాబితా విడుదల అభ్యంతరాల స్వీకరణ, సవరణకు నోటీసులు -
పెద్ది జ్ఞాపకాలతో కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ... ‘ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికా మన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజ లు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నా రు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
కేయూలో రెండ్రోజుల జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో కేయూ పరిపాలన భవనం సెనెట్ హాల్లో జాతీయ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఇందుకు సంబంఽధించిన ఆహ్వాన పత్రికను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి పలువురు ఆవిష్కరించారు. కేయూ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), స్టేట్ ఎక్సఫర్ట్ అప్రైజరల్ కమిటీ (ఎస్ఈఏసీ), ఎన్విరాన్మెంటల్ ప్రొఫెషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినరైజింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ స్ట్రాటెజిక్ అండ్ మల్టి–షేక్ హెల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్ అనే అంశంపై ఈ జాతీయ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల నుంచి ఇప్పటికే 150 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రిజిస్ట్రార్ -
వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి
శాయంపేట : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పల్లెబోయిన భిక్షపతి (45) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చేపలు పట్టేందుకు మండలంలోని జోగంపల్లి శివారులో చలివాగు ప్రాజెక్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలో ఉన్న చేపలు తీస్తుండగా ప్రమాదవశాత్తు భిక్షపతి కాళ్లు, చేతులు వలలో చిక్కుకోగా మృతిచెందాడు. తెల్లవారిన కూడా భిక్షపతి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు, తోటివారు చలివాగు వద్దకు వెళ్లి వెతకగా వలలో చిక్కుకొని భిక్షపతి మృతి చెంది కనిపించాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి.. ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నపేట రఘునాథ్కాలనీకి చెందిన బుర్ర సంపత్ (57) సోమవారం ఉదయం వరంగల్ ఫోర్ట్రోడ్డులో నడుచుకుంటూ రంగశాయిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ నుంచి రంగశాయిపేట వైపు అతివేగంగా వెళ్తున్న కారు సంపత్ను బలంగా ఢీకొట్టింది. దీంతో సంపత్ తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ.. జనగామ రూరల్ : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా ముత్యాలమ్మ (60) సోమవారం తన వ్యవసాయ భూమి వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. -
సీపీఎం జైల్భరోలో ఉద్రిక్తత
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన జైల్భరో కార్యక్రమం ఉద్రిక్తత నడుమ సాగింది. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనలో పలువురు మహిళలకు గాజులు కోసుక పోగా.. తోపులాటలో మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్తో సహా పలువురు నాయకులను అరెస్టు చేసి మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అని విమర్శించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం రూ. 600చెల్లించాలని, పని దినాలు ఏడాదికి 200 రోజు లకు పెంచాలని, పట్టణాల్లో పథకాన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సూర్ణం సోమయ్య, బానోత్ సీతారాం నాయక్, సమ్మెట రాజమౌళి, దుడ్డెల రాంమూర్తి, కుమ్మరి కుంట్ల నాగన్న, పట్ల మధు, గుండు సులోచన, కంపల్లి శ్రీనివాస్, కందునురి కవిత, యమగాని వెంకన్న, గారే కోటేశ్వరావు, చంగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట పలువురు నాయకుల అరెస్టు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీపై పోరు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఎంను కలిసిన డీడీఎన్ అర్చకులు హన్మకొండ కల్చరల్ : ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజ్జుల ప్రసాద్శర్మ, ప్రధాన కార్యదర్శి వెగ్గళం సంతోష్శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా డీడీఎన్ అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్శర్మ తదితరులు సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద వరుణయాగానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వారు సమస్యలను వివరించారు. ఉద్యోగ భద్రత కోసం దేవాదాయశాఖ ద్వారా నియామక పత్రాలు అందించాలని, పేస్కేల్ వర్తింపచేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీడీఎన్ అర్చకుల సమస్యలను పరిష్కరించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు నిధులు మంజూరు కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మొదటి ప్రాధాన్యత కింద టెయిర్–1లో రూ. 88.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. ఇరిగేషన్శాఖ రూ.60 కోట్లు, ఆర్అండ్బీ రూ.20.90 కోట్లు, పంచాయతీరాజ్ రూ. 5.90 కోట్లు, ఎండోమెంట్ రూ. 2 కోట్లు మంజూరు చేయగా.. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్న పుష్కర ఘాట్లకు రూ. వివిధ శాఖల ద్వారా రూ. 645 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారు. కాళేశ్వరంలో.. రూ.88.80కోట్లతో వివిధ శాఖలతో పాటు ఇరిగేషన్శాఖ నిధులతో అష్ట తీర్ధాల అభివృద్ధి, ఘాట్ల విస్తరణ, పలు దేవత విగ్రహాలు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఆర్అండ్బీ శాఖతో పలు చోట్ల కల్వర్టులు, హైలెవల్ వంతెనలు నిర్మించనున్నారు. పంచాయతీ రాజ్ నిధులతో మజీద్పల్లి, ప్రధాన రహదారి, ఇతర రహదారులు నిర్మించనున్నారు. రూ.198 కోట్లతో దేవస్థానం.. రూ.198కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా పునర్నిర్మాణం పనులు ముమ్మరం చేసింది.రాతి నిర్మాణం కోసం శ్రావణ మాసంలో భూమి పూజకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తర్వాత ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పది రోజులుగా కూల్చివేత పనులు తుది దశకు చేరాయి. చిన్నారిపై పిచ్చికుక్క దాడి టేకుమట్ల : మండల కేంద్రానికి చెందిన వారాల ఉమేష్ కూతురు ఆద్య సోమవారం ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అక్కడే ఉన్న పిచ్చికుక్క పాప ముఖంపై దాడి చేసింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు కుక్కను తరిమి వేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా కుక్క దాడిలో పాపకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.కన్నాయిగూడెంలో ఆరుగురిపై.. కన్నాయిగూడెం : మండలంలో వివిధ గ్రామాల్లో సోమవారం ఒక్కరోజే ఆరుగురిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెంలో ముగ్గురిపై, మండల కేంద్రంలో ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. -
స్పందన అంతంతే..
● ప్రణామ్ సెంటర్పై ప్రచారం కరువు ● నామమాత్రంగా తనిఖీలు ● నిర్వహణపై వయోవృద్ధుల అసంతృప్తిమహబూబాబాద్: వయో వృద్ధుల సంక్షేమం, వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన సెంటర్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సంబంధిత అధికారుల తనిఖీలు లేక.. నిర్వహణ సరిగా లేకపోవడంతో వయోవృద్ధులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నాలుగు నెలల క్రితం.. జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఽఖాదికారి కార్యాలయంలోని రెండు గదుల్లో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధుల కోసం ఆ సెంటర్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్ నిర్వహణ చేపడుతున్నారు. ఈనెల 8,9,10వ తేదీల్లో ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో సెంటర్ బంద్ చేశారు. ఆటవస్తువులు.. సెంటర్లో స్నాక్స్, టీ, అరటి పండ్లు, రాగి జావ, జొన్న గటిక ఇతర ఆహార పదార్థాలు ప్రతీరోజు ఇవ్వాలి. దానిలో క్యారమ్స్, చెస్, కథల పుస్తకాలు, టీవీ ఏర్పాటు చేశారు. వారానికి ఒక రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్లో సూపరింటెండెంట్, కుక్, ఏఎన్ఎం, మల్టీపర్సస్ వర్కర్ పని చేస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు.. సెంటర్ను సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో సూపరింటెండెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారని పలువురు వయోవృద్ధులు ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నా.. అఽధికారులు ఆమోదిస్తున్నారని పలువరు ఆరోపిస్తున్నారు. రెండు నెలలకు రూ.50,000 బిల్లు వచ్చినట్లు ఆసెంటర్ సూపరింటెండెంట్ లోకేష్ తెలిపారు. ప్రచార వైఫల్యంతో.. జిల్లా సంక్షేమశాఖ అధికారులు సెంటర్ నిర్వహణపై ప్రచారం చేయకపోవడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెంటర్కు ప్రతీరోజు 12నుంచి 13 మంది వస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, సూపరింటెండెంట్ మాత్రం సెంటర్కు ప్రతీరోజు 30మంది వయో వృద్ధులు వస్తున్నట్లు తెలిపారు. అయితే బిల్లులు, హాజరు పట్టిక ఇతర వాటిపై విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని పలువురు అంటున్నారు. రెండు నెలల బిల్లులు మాత్రమే ఇచ్చారు సెంటర్ ఏర్పాటు చేసి నాలుగు నెలలు పూరైంది. కానీ, రెండు నెలల బిల్లులు మాత్రమే వచ్చాయి. సెంటర్ మాత్రం సక్సెస్ అయింది. ఆ సెంటర్ మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ, ప్రతీరోజు కూడా భోజనం పెడుతున్నాం. సంబంధిత అధికారుల సహకారంతో సెంటర్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. – లోకేష్, సెంటర్ సూపరింటెండెంట్సెలవుల్లో కూడా ఉండాలని.. సెలవులు ఇస్తే సెంటర్ బంద్ చేస్తున్నారు. సెంటర్ బంద్ చేస్తే కాలక్షేపానికి ఇబ్బంది అవుతుందని, సెలవుల్లో కూడా సెంటర్ నిర్వహించాలని వయోవృద్ధులు కోరుతున్నారు. సెంటర్ను సక్రమంగా నిర్వహిస్తే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది. -
రహదారిపై లారీ, పాలవ్యాన్ బీభత్సం
మరిపెడ రూరల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆనెపురం స్టేజీ సమీపంలో కుడియా తండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని స్టేజీతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కుడియా తండాకు చెందిన అజ్మీరా సుశీల (50) ఆదివారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తోంది. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళ్తున్న పాల వ్యాన్ ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుశీలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మహిళను ఢీకొట్టిన పాల వ్యాన్ వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ అదుపు తప్పి పాల వ్యాన్ను ఢీకొట్టింది. అంతే వేగంతో లారీ అదుపు తప్పి రహదారికి కుడి వైపునకు దూసుకెళ్లింది. అక్కడ ఓ ఇంటి ఎదుట నిలిపిన కారు, ఆటోను ఢీకొట్టడంతో పాటు భారీ చెట్టు పెకిలించి పడేసింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ ప్రభాకర్రావు, క్లీనర్ తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అజ్మీరా సుశీలకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఇలా 563 జాతీయ రహదారిపై రాత్రివేళ క్షణాల్లో జరిగిన పెను ప్రమాదం తండా వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రమాదంలో మహిళ దుర్మరణం లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం
ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వరంగల్ హంటర్రోడ్డు ఉర్సుగుట్ట తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ పంప్ కాలనీకి చెందిన బంక కొమురయ్య (70) పని నిమిత్తం ఉర్సుగుట్ట వైపు వెళ్లి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కొమురయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో ఏఆర్ ఎస్సై.. వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.శామ్యూల్ (57) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట జంక్షన్ వద్ద తన నివాసం నుంచి రోజు వారీగా విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శామ్యూల్ మృతితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘పెద్ది’ విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దుర్మార్గం
నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందు కు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టి ధర్నా నిర్వహించా రు. అనంతరం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించిన పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఆవిష్కరించి తీరుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఆకుల శ్రీనివాస్, డాక్టర్ లెక్కల విగ్యాసాగర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు. -
వరుణయాగంతో వరుణుడి అనుగ్రహం
మహబూబాబాద్ రూరల్ : వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణయాగంతో వరుణుడి అనుగ్రహం లభిస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. సోమవారంనాగార్జున సాగర్ వద్ద కృష్ణానది తీరంలో వరుణయాగం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే మురళీనాయక్ వరుణయాగంలో పాల్గొన్నారు. సోమేశ్వరస్వామికి అన్నపూజ పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా బహుళ త్రయోదశి పురస్కరించుకొని స్వామివారికి అన్నపూజ నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అ ర్చనలు, కోడెమొక్కులు చెల్లింకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 49 మందిపై కేసులుమహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో పాటు మరో 24మందిపై కేసులు నమోదు చేశామని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి సోమవారం తెలిపారు. అదే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐలయ్యతో పాటు మరో 23మందిపై కేసులు నమోదు చేశామన్నారు. టేకు కలప స్వాధీనంబయ్యారం: మండలంలోని చుంచుబంధంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.76 వేల విలువైన టేకు కలపను సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీశాఖాధికారి రవికిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో టేకు కలప నిల్వ ఉందనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా.. కలప పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి నవీన్కుమార్సుమతి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో పని చేస్తున్న పాణిగంటి గణేష్కు రూ.24 వేలు వేతనాన్ని నవీన్కుమార్ దంపతులు అందించారు. -
విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ/వర్ధన్నపేట : వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని, నేడు ఆ కల నెరవేరుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పర్యటనకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. మామునూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, సమీప ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలని కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ మంత్రిని కోరారు. విమానాశ్రయం పునరుద్ధరణతో వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధితో పాటు వ్యాపార రంగానికి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నేతలు -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను, వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అదనపు కట్నం వేఽధింపులతో వివాహిత ఆత్మహత్య
● సముద్రాలలో ఘటన స్టేషన్ఘన్పూర్: అదనపు కట్నం వేఽధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జఫర్గఢ్కు చెందిన కోల ప్రతాప్ తన కుమార్తె సోని(28)ని ఐదేళ్ల క్రితం స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన తాడెం అనిల్కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నంగా రూ.5లక్షల నగదు, ఆరు తులాల బంగారంతో పాటు జఫర్గఢ్లో ఉన్న 100 గజాల ప్లాట్ అందించారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల వయస్సున్న కన్వీక్, ఏడాది వయస్సున్న క్రిష్విక్ ఉన్నారు. ఈ క్రమంలో అనిల్ తన భార్య వద్ద ఆరు తులాల బంగారాన్ని తన సొంత ఖర్చులకు అమ్ముకోవడంతోపాటు రెండేళ్ల క్రితం మరో యువతితో సంబంధం పెట్టుకుని సోనిని మానసికంగా, శారీరంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా సోనిని మంచిగా చూసుకుంటానని ఒప్పుకోవడంతో అనిల్ వద్దకు పంపించారు. అయితే పదిహేను రోజుల నుంచి అనిల్ అదనపు కట్నం కోసం సోనిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సోని తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పింది. ఈ క్రమంలో ఈనెల 8న అనిల్ తాగొచ్చి రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై మనస్తాపం చెందిన సోని అదే రోజు (శనివారం) రాత్రి గడ్డిమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే మృతురాలి తల్లి, సోదరుడు.. అనిల్కు ఫోన్ చేయగా అంబులెన్స్లో హనుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కోల ప్రతాప్ ఫిర్యాదు మేరకు అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు. మహాముత్తారం: అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊకంటి మనోహర్రెడ్డి(45) కుటుంబపోషణతోపాటు పిల్లల చదువులకు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి గ్రామ సమీపంలోని అడవిలో ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన బాటసారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భూపాలపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దాట్ల కుమారస్వామి తెలిపారు. -
ఆదివాసీ హక్కులు సాధించుకుందాం
కొత్తగూడ: రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదివాసీ హక్కులను సాధించుకుందామని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. షెడ్యూల్డ్ చట్టాలు, 1/70 చట్టం, పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. గాంధీనగర్ నుంచి కొమురంభీం విగ్రహం వరకు విద్యార్థుల థింసా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుడుంద్బె జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండా ఆవిష్కరించగా.. వివిధ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ఆదివాసీ నాయకులు, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, మాస్లైన్ పార్టీలు వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాయి. -
వైద్య విద్యలో వరంగల్ ఖ్యాతి
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణలో వైద్య విద్యకు కీలక కేంద్రంగా ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఐఐఆర్ఎఫ్–2026 (ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్) మెడికల్ ర్యాంకింగ్స్లో వరంగల్ కేఎంసీ 60వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 144 వైద్య కళాశాలలను వివిధ అంశాల ఆధారంగా అంచనా వేయగా.. కేఎంసీకి 870.10 స్కోర్ లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ 43వ ర్యాంకు (895.87 స్కోర్)తో ముందంజలో ఉండగా.. ఉస్మానియా మెడికల్ కాలేజీ 51వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత స్థానంలో కేఎంసీ 60వ ర్యాంకు (870.10 స్కోర్), ఆదిలాబాద్ రిమ్స్ 139వ ర్యాంకు (761.28 స్కోర్) సాధించింది. వైద్య విద్య.. వైద్య సేవలకు వెన్నెముక.. 1959లో ప్రారంభమైన కేఎంసీ ఆరు దశాబ్దాలకు పైగా వైద్య విద్యలో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్తోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ తది తర కోర్సులను అందిస్తోంది. కేఎంసీలో 32 విభా గాలు, 242 మంది ఫ్యాకల్టీ, అనుబంధంగా 8 ఆస్పత్రులున్నాయి. కేఎంసీకి అనుబంధంగా ఉన్న మహా త్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ స్థాయి వైద్యసేవల కేంద్రాల్లో ఒకటి. వరంగల్తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో కేఎంసీలో వైద్య విద్య అ భ్యసించే విద్యార్థులకు తరగతి గదులతోపాటు విస్తృతమైన క్లినికల్ ఎక్స్పోజర్ లభిస్తోంది. టాప్–50లోకి దూసుకెళ్లేందుకు దృష్టి.. కేఎంసీలో ఎంబీబీఎస్తోపాటు వివిధ పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో పీజీ కో ర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా యూరాలజీ, ిపీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, కా ర్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, కార్డియాలజీ వంటి విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ శిక్షణకు కూడా అవకాశాలున్నాయి. కేఎంసీ 60వ స్థానంతో ఆగకుండా.. పరిశోధన, మౌలిక వసతులు, వైద్య సే వలు, బోధనా ప్రమాణాలను మరింత బలోపేతం చేసి టాప్–50లోకి దూసుకెళ్లాలన్నదే ఇప్పుడు తదు పరి లక్ష్యంగా పనిచేసే దిశగా కళాశాల బృందం పనిచేయాలని ఆలోచిస్తోంది. జాతీయ స్థాయిలో కేఎంసీకి 60వ ర్యాంక్ ఐఐఆర్ఎఫ్ 2026 మెడికల్ ర్యాంకింగ్స్లో ఓరుగల్లు సత్తా 870.10 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం కేఎంసీకి కన్నా మెరుగ్గా గాంధీ, ఉస్మానియా కాలేజీలు భవిష్యత్లో టాప్–50లో ఉండడంపై సిబ్బంది దృష్టికేఎంసీకి వచ్చిన 60వ ర్యాంకు కేవలం వైద్య విద్య నాణ్యతపైనే ఆధారపడింది కాదు. బోధన–అభ్యసన వనరులు, పరిశోధన, విద్యార్థుల కెరీర్ ఫలితాలు, పరిశ్రమలతో అనుసంధానం, ప్లేస్మెంట్ వ్యూహాలు, భవిష్యత్ దృష్టి, కళాశాలపై బాహ్య గుర్తింపు వంటి అంశాలను ఐఐఆర్ఎఫ్ పరిశీలించింది. ప్రతీ విభాగంలో వచ్చిన స్కోర్లను నిర్దిష్ట వెయిటేజీతో కలిపి 1,000 పాయింట్లకు కేఎంసీ 870.10 స్కోర్ సాధించి దేశంలో 60వ స్థానంలో నిలిచింది. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. భారతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు ఉమ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కంకర అయ్యప్పరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయడానికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి యువజన కాంగ్రెస్ ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటినుంచి దేశంలో అనేక సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తూ యువజన కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు గార్లపాటి సాయితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉబ్బపల్లి శ్రావణ్, గూడూరు, నెల్లికుదురు మండలాల, కేసముద్రం టౌన్ అధ్యక్షులు బొల్లికొండ మధు, మద్ది రాజేష్, ఎండి.రియాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, శ్యామ్, నునావత్ రాజేష్, వేల్పుల శేఖర్, సాత్విక్, హరికిషన్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి
వరంగల్ క్రైం: పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు వరంగల్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటనలో భాగంగా నక్సలిజంపై పోరాటంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో ఆదివారం సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులు, బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ – వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సాయం, ఎక్స్గ్రేషియా, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్/టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోర్టల్ను రూపొందించిన ఎస్ఐబీ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు వెంటనే సమాచారం అందించి, ఆయా యూనిట్ల పరిధిలోని అన్ని పోలీస్ అమరవీరుల కుటుంబాల నుంచి సమస్యలు, ఫిర్యాదులు సేకరించి, వాటిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తూ వారి సమస్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను ఆదేశించారు. తన వృత్తి జీవిత ప్రారంభ దశలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్లో విధులు నిర్వహించిన తాను విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనని తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ అమరవీరుల కుటుంబాల కోసం ‘టీజీ వీర్’ నూతన కమిషనరేట్ భవన సముదాయం సందర్శనములుగు రూరల్/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలంలోని కర్రెగుట్టలను డీజీపీ సీవీ ఆనందర్ సోమవారం సందర్శించనున్నట్లు ములుగు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు డీజీపీ ములుగు జిల్లా కేంద్రం నుంచి కర్రెగుట్టలకు బయలుదేరుతారని పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు పామనూరు సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం గోవిందరావుపేట మండలం చల్వాయి ఐదో బెటాలియన్ సందర్శన, అనంతరం భోజనం చేస్తారు. అనంతరం ములుగు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ మావోయిస్టులతో సమావేశం కానున్నారు. చివరిగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
కాజీపేట దర్గా మత సామరస్యానికి ప్రతీక
కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు హిందూ, ముస్లిం మతసామరస్యానికి, సోదరభావానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాజీపేట దర్గాలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్, పారిశద్ధ్యం, వైద్య, పోలీస్ తదితర అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తి, శాంతితో ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు. దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చొరవతో ఈ ఏడాది దర్గాలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, రూ.40 లక్షలతో మంచి నీటి పనులు, రహదారి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 30 వేల మంది భక్తులకు బోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, ఇందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్ లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు హాజరుకానున్నారని, హిందూ ఆలయ పూజరులు, బ్రహ్మణులు, ఉలమాలు, ముషాయిఖ్లు పాల్గొని శాంతి సందేశాన్నిస్తారని తెలిపారు. సోమవారం ఉర్సు ఉత్సవాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీ న్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో దర్గా ఉపపీఠాధిపతి భక్తియార్బియాబానీ, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, సింగారపు రవిప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● నేటినుంచి దర్గా ఉత్సవాలు ప్రారంభం -
చోరీకి వచ్చాడు.. మహిళను హతమార్చాడు
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈమేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీసుస్టేషన్లో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించిన వివరాలు.. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్లైన్ గేమ్లతో అప్పుల పాలయ్యాడు. షాప్ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్, మాస్క్ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లు కావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించి మాస్క్ తొలగించి ప్రశాంత్ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో ఆమె తలపై మోదగా కన్నుమూసింది. అనంతరం గొలుసును దాచి పెట్టి ఇంటికి వెళ్లిన ఆయన తెల్లవారునుంచే ఏమీ తెలియనట్లే వ్యవహరించాడు. కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆతర్వాత ప్రశాంత్ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50లక్షల నగదు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దర్యాప్తులో భాగంగా పలువురి కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్పై అనుమానం వచ్చింది. దీంతో మహేష్ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈమేరకు నిందితుడు ప్రశాంత్తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేష్ను సైతం అరెస్ట్ చేశారు. కాల్డేట్, నగదు లావాదేవీల ఆధారంగా నిందితుల అరెస్ట్ -
దుర్గమ్మ ఆలయంలో చోరీ
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దుండగులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తు ల కథనం ప్రకారం.. దుండగులు తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కళ్లతో పా టు హుండీలను పగలగొట్టి భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. వీటితో పాటు కొంత నగదు కూడా అపహరించారు. అమ్మవారికి సంబంధించిన వెండి కళ్లు విలువ రూ. 25 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై సర్పంచ్ తాటికాయల మమత చేతన్కుమార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని కురవి గేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బండి అనూష ల్యాప్టాప్ చోరీకి గురైందని టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి ఆదివారం తెలిపారు. అనూష ఈ నెల 8వ తేదీన ఉదయం కుటుంబ సమేతంగా వరంగల్కు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే తాళాలు పగలగొట్టి ఇంటి తలుపు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే, ల్యాప్ టాప్ కూడా కనిపించ లేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై జి.సుదర్శన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు. -
మ్యాథ్స్ లెక్చరర్కు షోకాజ్ నోటీసు
గార్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేక్ సర్టిఫికెట్తో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్న సీహెచ్.సత్యనారాయణకు ఆర్జేడీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి ఆదివారం వెల్లడించారు. సత్యనారాయణ బిహార్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్ సర్టిఫికెట్ పొందినట్లు ఇంటర్ బోర్డు విచారణలో తేలింది. వారం రోజుల్లో ఇంటర్ బోర్డుకు లెక్చరర్ సత్యనారాయణ వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు. కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్హౌస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్జూబ్లీ ఉత్సవాల మీట్లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి ఉన్నారు. -
ఎత్తిపోస్తేనే సాగు
● పెద్ద చెరువును నింపితేనే సస్యశ్యామలం ● ఎత్తిపోతల పథకంలో చోరీకి గురైన విద్యుత్ మోటర్లు ● వినియోగంలోకి తేవాలంటున్న రైతులు డోర్నకల్: డోర్నకల్ పట్టణ శివారు మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారింది. పెద్దచెరువు కింద రెండు వందల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా.. ప్రతీ సంవత్సరం మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి. 2012లో ఎత్తిపోతల ఏర్పాటు.. మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించి ఆయకట్టు భూముల్లో రెండు పంటలు పండించాలనే ఉద్దేశంలో 2012లో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. వాగు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు రూ.1,53,91,000 నిధులతో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి 20 హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ మోటార్లు, కంట్రోల్ ప్యానల్ బోర్డు, రెండు స్టార్టర్లు, 3 హెచ్పీ వాక్యూ మ్ పంప్ మోటారునుు ఏర్పాటు చేశారు. లిఫ్ట్ కోసం షెడ్డు పక్కనే ప్రత్యేకంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. మున్నేరువాగు నుంచి పెద్ద చెరువు వరకు రెండు కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్ను ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల పాటు వాగు నుంచి చెరువుకు నీటిని తరలించారు. అనంతరం విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో లిఫ్ట్ సేవలు మూలనబడ్డాయి. విద్యుత్ మోటార్లు చోరీ.. లిఫ్ట్ పని చేయకపోవడం, షెడ్డుకు రక్షణ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఖరీదైన 20 హెచ్పీ విద్యుత్ మోటార్లను చోరీ చేశారు. ప్యానల్ బోర్డును ధ్వంసం చేసి దాంట్లో విలువైన పరికరాలను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైరును సైతం చోరీ చేశారు. గతేడాది మే నెలలో విద్యుత్ మోటార్ల చోరీని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నేటికీ చోరీపై విచారణ జరగలేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి. చెరువు కింద భూములు సాగు చేస్తున్న రైతులు లిఫ్ట్ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెరువు సందరీకరణ పనులు పూర్తవుతుండడం, బతకమ్మ పండుగ సమీపిస్తుండటంతో చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు ● చిత్రపటం వద్ద నివాళి ● పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ● రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంసాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి ఎర్రవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా.. నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. -
ప్రభుత్వం దృష్టికి ఆస్పత్రుల సమస్యలు
కాశిబుగ్గ: రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని వజ్ర గార్డెన్లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్–2026’ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఆస్పత్రుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో చర్చించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం కోసం వచ్చిన రోగులను ప్రేమపూర్వకంగా చూస్తూ, మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా మహాసభలో వైద్యరంగంలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రవీణ్ ప్రమాణ స్వీకారం.. థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన డాక్టర్ పి.ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా ఆస్పత్రుల సమస్యలను గుర్తించి సకాలంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహాసభ ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రవీణ్, కో చైర్మన్ ముక్కా దిలీప్కుమార్, సెక్రటరీ ఎల్.నాగేశ్వర్రావు, కోశాధికారి వి.నరేష్కుమార్, వద్దిరాజు రాకేష్, రాష్ట్ర అఽధ్యక్షుడు అరుణ్ కటారి, ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాద్, కోశాధికారి కె.అశోక్కుమార్, పూర్వ అధ్యక్షుడు ఎల్ సురేష్ గౌడ్, ఎస్.నౌనిపాల్ సింగ్, వి.అశోక్, మహేష్బాబు, గుండేటి రమేష్, కాళీప్రసాద్రావు, నర్సింగారెడ్డి, అశోక్రెడ్డి, నరసింహారావు, విజయ్చందర్రెడ్డి, కస్తూరి ప్రమీల, శేషు మాధవ్, విద్యాసాగర్, దశరథం, సుదీప్, సుధీర్కుమార్, కొత్తగట్టు శ్రీనివాస్, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు ఘనంగా థానాకాన్–2026 11వ వార్షిక రాష్ట్ర మహాసభ -
20 నుంచి పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్) ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి పి. శ్రీనివాస్ తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఫుడ్ సైన్స్ అండ్ టె క్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ం, ఎంఎస్డబ్ల్యూ తదితర కోర్సుల పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో నిర్వహించనున్నామని వారు తెలిపారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. టిఫిన్ సెంటర్లో చోరీ : ఇద్దరి అరెస్ట్కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ టిఫిన్ సెంటర్లో ఇటీవల చోరీకి పాల్ప డిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. పోలీస్స్టేషన్లో ఆదివారం ఎస్సైలు శివ, మోనికారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరటి అన్వేష్, జాడి రాజేష్ మూసిఉన్న తాజ్ టిఫిన్ సెంటర్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించారు. హోటల్ యజమాని పొగళ్ల జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని సామగ్రి పట్టుకున్నట్లు తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సిబ్బంది వి.క్రాంతికుమార్, జి.కుమారస్వామి, సల్మాన్ పాషాను సీఐ శ్యాంసుందర్ అభినందించారు. పుష్పాలంకరణలో మెట్టు రామలింగేశ్వరుడు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మెట్టుగుట్టపై పవిత్రోత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మెట్టు రామలింగేశ్వర స్వా మి సేవా సమితి ఆధ్వర్యంలో రెండో ఆది వారం సందర్భంగా మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించి రామలింగేశ్వరుడిని పుష్పాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, అర్చకులు అభిలాష్శర్మ, విష్ణువర్ధనాచార్యులు, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ రఘుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
● మరిపెడలో ఘటన మరిపెడ : లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మరిపెడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం దబ్బతండాకు చెందిన బానోత్ వెంకట్రాం(45) పనుల నిమిత్తం బైక్పై మండల కేంద్రానికి వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఖమ్మం నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలికి ఎస్సై గండ్రాతి సతీశ్ చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా సైబర్ మోసాలకు తావుండదని చెప్పారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకు డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ అన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. సోషల్ మీడియాకు ప్రజలు బానిసలవుతున్నారని, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో విడదీయరాని అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతీ రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
వాగులో పడి వృద్ధురాలి మృతి
కొత్తగూడ: మతిస్థిమితం లేని వృద్ధురాలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్జ నర్సమ్మ(80)కు మతి స్థిమితం లేదు. నాలుగు రోజులుగా నర్సమ్మ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పక్క గ్రామాల్లో గాలించినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆదివారం రాళ్లవాగులో పశులకాపరికి మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి నర్సమ్మగా గుర్తించిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
మాజీ ఎమ్మెల్యే సిద్ధయ్య మృతి
● నియోజకవర్గంలో విషాదం జనగామ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అప్పటి చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్ధయ్య (95) అనారోగ్యంతో హైదరాబాద్ పద్మారావు నగర్లోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్ పల్లికి చెందిన సిద్ధయ్య 1978లో చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన సిద్ధయ్యకు 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు జనగామ నియోజకవర్గంపై ప్రత్యేక అనుబంధం ఉండేది. కాగా, సిద్ధయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బచ్చన్నపేట మండలానికి 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయించడంలో కీలకంగా కృషి చేశారని స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు. గొర్రె సిద్ధయ్య మృతిపై కాంగ్రెస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. కొత్తపెల్లి రాజయ్య తదితరులు సంతాపం తెలిపారు. -
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్
● ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : గిరిజన మహిళల ఐక్యతకు, సంప్రదాయ పరిరక్షణకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లతండా గ్రామంలో తీజ్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై తీజ్ పండుగ విశిష్టతను, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. తీజ్ పండుగ గిరిజన మహిళల ఆధ్యాత్మిక విశ్వాసానికి, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తండాల్లో సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తండా పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. ‘తీజ్’ వేడుకల్లో ప్రభుత్వ విప్.. కురవి: మండలంలోని గాజాతండా గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తీజ్ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ పాల్గొన్నారు. యువతులతో కలిసి రాంచంద్రునాయక్ తీజ్ బుట్టలను ఎత్తుకుని నృత్యాలు చేశారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఆయన వెంట తండా యువతులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు, ఉద్యోగులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ యూనిట్లో స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. శనివారం కేయూ ఆడిటోరియంలో రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెడ్క్రాస్ సొసైటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి సుమారు 1000 మంది సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలోనే కేయూ ఎన్ఎస్ఎస్కు ఇండియన్ రెడ్క్రాస్ సేవా సర్టిఫికెట్ లభించిందని గుర్తుచేశారు. ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ యుద్ధాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుండి సహాయక చర్యలు చేపడుతుందని వివరించారు. అరుదైన రక్తగ్రూపు దాతల వివరాలను డేటాబేస్ రూపంలో సేకరించి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా ఈ బ్రాంచ్ పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి లైఫ్ అసోసియేట్గా, ఇతరులు లైఫ్ మెంబర్గా సభ్యత్వం పొందాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ నోడల్ అధికారి ఈసం నారాయణ, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, బీసీ సెల్ డైరెక్టర్ బి.సతీశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారి ఈసం నారాయణకు సభ్యత్వ దరఖాస్తు, నిర్ణీత రుసుము చెల్లించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ తొలి లైఫ్ మెంబర్గా సభ్యత్వం తీసుకున్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం -
ఆదివాసీ.. మానవాళికి మూలవాసి
ప్రకృతితో పెనవేసుకుని జీవిస్తున్న గొత్తికోయలుఏటూరునాగారం: ఆదివాసీలు.. మానవాళి మూలవాసులు. వీరి జీవనం పూర్తిగా ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. కట్టు, బొట్టూ.. ఆహారం, ఆహార్యం.. వేషధారణ, వస్త్ర ధారణ, ఆలోచన, ఆచారాలు పూర్తిగా మైదాన ప్రాంతవాసులకు భిన్నం. అడవి తల్లే వీరి జీవనాధారం. గుట్టలు, గూడేలే వీరి ఆవాసం. అడవుల్లోనే జీవించే ఆదివాసీలు నేటికీ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ నవజీవనాన్ని కొనసాగిస్తున్నారు. పండుగలు, శుభాకార్యాలను సైతం తమ కట్టుబాట్లు, నిబంధల మేరకే కొనసాగించుకుంటూ తమకంటూ ఓ జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ క్ర మంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా వారి జీవనం విధానం, అభివృద్ధి, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సేంద్రియ వ్యవసాయం.. నేటి సమాజంలో ఏ పంట దిగుబడి తీయాలన్నా రసాయన ఎరువులను అధికంగా వాడడం గమనార్హం. కానీ ఏజెన్సీలోని గొత్తికోయలు, ఆదివాసీలు సేంద్రియ వ్యవసాయం పాటిస్తున్నారు. కేవలం పశువుల పేడ, వేప ఆకులతో పంటలు పండిస్తున్నారు. కల్తీ లేని పంటలు పండించుకుంటున్నారు. ఇంటి చుట్టూ అరటిపండ్లు, కూరగాయలు, ఇతర పంటలు వేసుకుని వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అభివృద్ధికి ఆమడ దూరం.. ఆదివాసీ గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇంకా రోడ్లు, రవాణా సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నేడు అనారోగ్యంతో మూలుగుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారిన తమ తలరాతలు మారడం లేదని ఆదివాసీ ప్రజలు పేర్కొంటున్నారు. కాగా, 1986లో ఏటూరునాగారంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కార్యాలయాన్ని స్థాపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు, 177 షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా ఐటీడీఏ వ్యాప్తంగా 1,86,607 మంది ఆదివాసీ జనాభా ఉంది. పథకాలు అందని ద్రాక్ష.. ఐటీడీఏ పరిధిలో ఇంకా 30 వేల వరకు అటవీ హక్కు పత్రాలు కోసం ఆదివాసీలు ఎదురు చూస్తున్నారు. మాతా శిశు సంచార వైద్యశాల(వాహనాల) తొలగించడంతో గూడేలకు వాహనం వెళ్లడం లేదు. హార్టికల్చర్, అగ్రికల్చర్, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, మైనర్ ఇరిగేషన్ వంటి శాఖలు కనుమరుగయ్యాయి. గతంలో ఈ శాఖల ద్వారా ఆదివాసీలకు లబ్ధిచేకూరేది. ఇలా అనేక పథకాలు రోజు రోజుకూ కనుమరువుతున్నాయి.ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్ నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ, విగ్రహాలకు పూలమాలలు వేస్తామన్నారు. గిరిజన భవన్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీఓ పేర్కొన్నారు. గొత్తికోయగూడేలకు మిషన్ భగీరథ పైపులైన్, ప్రభుత్వ చేతి పంపులు లేవు. దీంతో వర్షాకాలంలో వాగులు, తోగుల నీరు మురికిగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వ ర్షం కురుస్తున్న సమయంలో బయట కర్రకు నాలుగు మూలలకు చీర కట్టి మధ్యలో రాయివేసి ఆ నీటిని బిందెలో నింపుకుంటారు. వాటిని తాగు నీటికి ఉపయోగించడం నానాటికీ కొనసాగుతోంది. గొత్తిగోయ గూడేలకు ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు. కేవలం దిగిటిలు, నెగల్లు పెట్టుకుని కారుచీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. ఇందులో 3,154 మంది జనాభా ఉంది. వారికి సరైన రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, పక్కా ఇళ్లు లేవు. తాత్కాలికంగా పెంకుటిల్లులు వేసుకుని జీవిస్తున్నారు. పాఠశాలలకు సరైన భవనం లేకపోడంతో మంత్రి సీతక్క కంటైనర్ పాఠశాలలు మంజూరు చేయించారు. అయితే మరికొన్ని గ్రామాల పాఠశాలలు పక్కా భవనం లేక గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గుండెంగవాయి, మామిడిగూడెం వంటి గ్రామాలకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారం కోసం మూడు కిలోమీటర్ల మేర పిల్లలను ఎత్తుకుని సమీపంలోని బూటారం కేంద్రానికి కాలినడకన చేరుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఆ గూడెంలోని 0–5 చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చాలీచాలని ఆహారం తీసుకుని రక్తహీనతకు లోనవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గొత్తికోయలకు అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయడం లేదని ఆదివాసీలు పేర్కొంటున్నారు. నేటికీ సంస్కృతి, సంప్రదాయాల ఆచరణలోనే.. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
అందరి సహకారంతోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ ● రూ.46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబాబాద్: అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డులో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులకు రూ.59 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరద కాల్వల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించామని దాంతో ముంపు ప్రాంతాల సమస్య తీరుతుందన్నారు. దశల వారీగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు బొల్లు రాజు, పుచ్చకాయల సరిత, బాబు, నాయకులు ఎడ్ల రమేష్, జ్ఞానేశ్వర్, వెంకట్, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ హెల్త్వర్సిటీ రిజిస్ట్రార్గా వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సి టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్గా డాక్టర్ జేవీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనపు డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల పాటు ఫారెన్ సర్వీసు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు హెల్త్ వర్సిటీ ఇన్చార్జ్ రిజి స్ట్రార్గా ఉన్న డాక్టర్ నాగార్జునారెడ్డి ఇకనుంచి జాయింట్ రిజిస్ట్రార్గా పనిచేయనున్నారు. కాగా, నూతన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఓరుగల్లుతో రిజిస్ట్రార్కు అనుబంధం.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా నియమితులైన డాక్టర్ వెంకటేశ్వర్లుకు ఓరుగల్లుతో అనుబంధం ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన 26 సంవత్సరాలపాటు ఆర్థోపెడిక్ విభాగంలో విధులు నిర్వర్తించారు. 1998 నుంచి 2024 వరకు ఎంజీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా, డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశారు. 2024 నుంచి 2025 వరకు యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. 2025 నుంచి 2026 సంవత్సరం ఇప్పటి వరకు భూపాలపల్లి వైద్య కళాశాలలో అడిషనల్ డీఏంఈ హోదాలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. -
ఆర్గానిక్లో జైపాల్రెడ్డిదే విజయం
కేసముద్రం మండలం తాళ్లపూసపెల్లి గ్రామానికి చెందిన రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి.. గత కొన్ని సంవత్సరాలుగా తనకున్న 40 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో పలు పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎల్ఓఎఫ్ఎం (లిక్విడ్ ఆర్గానిక్ ఫార్మేటెడ్ మైన్యూర్) బయో ఎరువును తయారుచేసి పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 15 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్, 10 ఎకరాల్లో మామిడి, ఐదు ఎకరాల్లో పెసర, కందులు, మినుములు, నువ్వులు, వేరుశనగ, మిర్చి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. లోక్ గ్లైసమిక్ ఇండెక్స్ వరి విత్తనాన్ని సాగు చేస్తూ, ఎకరానికి 18–20 క్వింటాల దిగుబడి సాధిస్తున్నాడు. పంట ఉత్పత్తులను పలు ప్రాంతాల నుండి వచ్చిన రైతులతో పాటు పలువురు నేరుగా గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తారని జైపాల్ రెడ్డి తెలుపుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే బయో ఎరువులను ఉపయోగిస్తూ పండించిన ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ బాగుంటుందని జైపాల్రెడ్డి చెబుతున్నాడు. -
పోలీసులు అంకిత భావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.4.38 కోట్ల విలువైన సీఎంఆర్ దుర్వినియోగం
చిట్యాల: ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) అప్పగించకుండా, ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.4.38 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్మిల్లులో చోటు చేసుకుంది. వివరాలి లా ఉన్నాయి. శుక్రవారం రాత్రి విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లులో ఉన్న ధాన్యానికి భారీగా తేడా కనిపించింది. 2022–23 రబీలో 556.400 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రూ.93,95,407 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.55 లక్షలు మాత్రమే మిల్లు యజమాని చెల్లించాడు. అలాగే, 2025–26 ఖరీఫ్లో 4,218.080 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 1,328.728 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. మిగిలిన నిల్వలో 1251.434 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లులో లేవని తనిఖీలో వెల్లడైంది. 2025–26 రబీలో కేటాయించిన 850.680 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 176.880 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2025–26 సంవత్సరానికి సంబంధిం మొత్తం 1,428.314 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ. 3,99,92,792 కాగా.. పాత బకా యిలు రూ.38,95,407తో కలిపి మొత్తం రూ.4,38,88,199 ప్రభుత్వ సొమ్మును మిల్లు యజమాని యాంసాని సంతోష్ దుర్వినియోగం చేశాడని అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాములు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం మిల్లు యజమాని యాంసాని సంతోష్పై క్రిమినల్ కేసు నమోదు చేసినుట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ రాకేశ్, తహసీల్దార్ లక్ష్మణ్, పౌరసరఫరాల శా ఖ ఇన్స్పెక్టర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్స్ రాహుల్, అరవింద్ తదితరులు ఉన్నారు. ● వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్మిల్లుపై అధికారులు దాడులు ● యజమానిపై కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు -
నేడు ‘థానా’ వార్షిక రాష్ట్ర మహాసభ
కాశిబుగ్గ: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్’–2026ను ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. వరంగల్ ఐఎంఏ హాల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు. ములుగురోడ్డులోని వజ్ర గార్డెన్స్లో జరిగే వార్షిక కాన్ఫరెన్స్ థానాకాన్కు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, వైద్యనిపుణులు, వైద్యులు, ఆరోగ్యరంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ , అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ప్రత్యేక అతిథిగా హాజరై ‘వైద్యుల కోసం సైబర్ భద్రత’ అంశంపై అవగాహన ఉపన్యాసం చేస్తారని వివరించారు. వరంగల్కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు పి.ప్రవీణ్ 2026–27 సంవత్సరానికి థానా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. సమావేశంలో థానా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కా దిలీప్కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్.నాగేశ్వర్రావు, కోశాధికారి వి.నరేశ్కుమార్, వద్దిరాజు రాకేశ్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
తెగిన రైల్వే విద్యుత్ తీగ
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్పర్తి–ఉప్పల్ మధ్య ఉన్న మెయిన్ డౌన్లైన్లో శనివారం రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగ తెగిపోయింది. దీంతో సెక్షన్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి–ఉప్పల్ మధ్య గల ఆర్వో బ్రిడ్జిపై కేబుల్ లాగుతుండగా రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగపై పడింది. ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే నాగ్పూర్ ప్యాసింజర్ సుమారు గంటన్నర పాటు ఉప్పల్–హసన్పర్తి మధ్య నిలిపివేసినట్లు తెలిపారు. అదేవిధంగా గూడ్స్ రైలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జమ్మికుంట, కాజీపేట రైల్వే ఓహెచ్ఈ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి సుమారు 11 గంటల వరకు మరమ్మతులు చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. నాగ్పూర్ ప్యాసింజర్ ఆలస్యంతో కాజీపేటకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్–హసన్పర్తి మధ్య ప్యాసింజర్, గూడ్స్ రైలు నిలిపివేత మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించిన రైల్వే సిబ్బంది -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. విద్యార్థులపై నిఘా ఉండాలి మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు, విద్యార్థులపై 24 గంటలు ప్రిన్సిపాల్స్ నిఘా ఉండాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కార్యాలయంలో ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని, గురుకుల పాఠశాల, కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అవసరమైన వాతావరణం కల్పించాలని, వారు క్రమశిక్షనతో చదివి లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని చెప్పారు. ఆత్మ కమిటీ చైర్మన్గా గోవర్ధన్ రెడ్డి మహబూబాబాద్ రూరల్/ మహబూబాబాద్ అర్బన్: ఆత్మ కమిటీ చైర్మన్గా మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన వెన్నం గోవర్ధన్ రెడ్డిని ఆత్మ కమిటీ సభ్యులు శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జెన్నారెడ్డి జనార్ధన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ను గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వార్డు కౌన్సిలర్ బోడ రవి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్, నాయకులు మిట్టకంటి రామిరెడ్డి, దూపటి వినయ్ కుమార్, చిదిరాల జ్ఞానేశ్వర్, గోనే శ్యాంరావు, చీరిక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి కొత్తగూడ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ డీడీ దేశీరాంనాయక్ సూచించారు. శనివారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగులు ఆదిలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు, సమ్మయ్య, నాయకులు సందీప్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. భూసేకరణపై విచారణకు ఆదేశించాలి గార్ల: మండలంలో చేపట్టిన మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై జాతీయ ట్రైబల్ కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ సమర్పించిన తప్పుడు నివేదికను తిరస్కరించి, ఆర్టికల్ 338ఎ(8) ప్రకారం తక్షణమే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలని టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ కోరారు. శనివారం గార్లలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్ను తిరస్కరించాలని షెడ్యూల్ తెగల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని జాతీయ ట్రైబల్ కమిషన్ను కోరారు. మండలంలోని ఏకై క నీటి వనరు మున్నేరు నది నీటిని లింక్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కు మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాలేరు రిజర్వాయర్కు ఇప్పటికే నాగార్జున సాగర్, సీతా రామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తున్నా, మున్నేరు నది నీళ్లు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లింకు కెనాల్ కోసం ఏర్పాటు చేసిన పీసా గ్రామసభల్లో 1/3 గిరిజనులు హాజరు కాకున్నా తప్పుడు సంతకాలు పెట్టించిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీ య ఎస్టీ కమిషన్ సమగ్రంగా విచారణ జరిపి తప్పుడు నివేదిక పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వరంగల్లో జెన్ జీ మూవ్మెంట్ తీసుకొద్దాం
‘యూత్ మీటప్ విత్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హన్మకొండ: వరంగల్లో జెన్జీ మూవ్మెంట్ తీసుకొద్దామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్జీ యువత తలుచుకుంటే రాజకీయాల్లో అనేక మార్పులు సాధ్యమవుతాయన్నారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్ వస్తోందని, అయితే దీనికి ముందు కులాన్ని తీసివేయాలని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, తాను బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కులగణనను వ్యతిరేకించినందుకు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి మళ్లిస్తే, సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేయూ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానన్నారు. గతంలో ఎమ్మెల్సీలకు ఉన్న అభివృద్ధి నిధులను సీఎంగా రేవంత్ వచ్చాక లేకుండా చేశారని విమర్శించారు. అనంతరం విద్యార్థులు, యువత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 1,800 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–06, 08, 10,12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18తోపాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మెత్తం 60 ఈవెంట్లలో జరిగిన పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్ల ప్రదానం -
తండాల్లో తీజ్ జోష్..
● శుక్రవారం నుంచి వేడుక ప్రారంభం ● ఉత్సాహంగా పాల్గొంటున్న గిరిజన యువతులు మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా తీజ్ వేడుకలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందిన రోజుకు గుర్తుగా తీజ్ నిర్వహిస్తారని ఇతీహాసం చెబుతుంది. తండాల్లోని యువతులు గోర్ బంజారాలు శ్రీసేవాలాల్ మహారాజ్, దండి మేరామ యాడీలను దైవ దూతలుగా కొలుస్తూ పంటలు బాగా పండాలని, భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుతూ తీజ్ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పండుగ.. తీజ్ నారు వలే తమ భావి జీవితాలు కూడా అభివృద్ధి చెందాలని, సేవాలాల్ మహారాజ్, మేరామ యాడీలను కొలుస్తూ యవతులు ఆషాడ / శ్రావణ మాసాల్లో తొమ్మిది రోజులు నిర్వహించే పండగే తీజ్. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వివాహితులు తమ భర్తల నుంచి ప్రేమను పొందడానికి తీజ్ నిర్వహిస్తారు. మొదటి రోజు.. తండా యువకుల సాయంతో పూజారి(నాయక్) క ర్ర సామగ్రి, రంగుల వస్త్రాలతో మంచెను తయా రు చేసిన అలంకరిస్తారు. మహిళలు పాటలు పాడుతుండగా ముందురోజు నానబెట్టిన గోధుమలను యువతులు బుట్టలో అలుకుతారు. తండా పెద్దల సమక్షంలో బుట్టలను మంచైపె పెడతారు. రెండో రోజు.. యువతీ యువకులు దగ్గరలోని చేలలో బోరడీ ఆటను ఆడుకుంటారు. నాన బెట్టిన శనగలను అమ్మాయిలు పాటలు పాడుతూ రేగు చెట్టు ముళ్లకు గుచ్చుతున్న సమయంలో తండా యువకులు కర్రతో చెట్టును కదలిస్తారు. కదిలే చెట్టు ముళ్లకు శనగలను గుచ్చలేక వారి బాధను పాటల రూపంలో వర్ణిస్తూ యువకులను ఒప్పించి శనగలను రేగు ముళ్లకు గుచ్చి ఆటను ముగిస్తారు. ఏడో రోజు.. తీజ్ పండుగలో ఏడోరోజు కీలకం. ఏడో రోజు ఢమోళి అనే పూజలో పూజారి సేవాలాల్ మహారా జ్కు చూర్మో ముద్దలతో భోగ్ రూపేణా సమర్పించిన అనంతరం సామూహిక మొక్కు చెల్లిస్తారు. తొమ్మిదో రోజు.. తీజ్ చివరి రోజున ‘కడావ్’ పూజ తర్వాత తీజ్ నిమజ్జనంతో వేడుక ముగుస్తుంది. సేవాలాల్ మహరాజ్కు తీపి పదార్థాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు. తీజ్ నిర్వహించే అమ్మాయిలు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి కేవలం శాఖాహారాన్నే భుజిస్తారు. తీజ్ చివరి రోజు సాయంత్రం మాత్రమే మేరామ మాత(యాడి) పూజను పొట్టేళ్ల బలితో మాంసాహారం ఉంటుంది. రాష్ట్ర పండుగగా గుర్తించాలి వేర్వేరు తండాల్లో వేర్వేరు తేదీల్లో కాకుండా గిరిజనులంతా ఒకేసారి నిర్వహించడం ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి లంబాడీల తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. ఢమోళీ తీజ్ పూజ రోజు సెలవు ప్రకటించాలి. – గుగులోత్ నందులాల్ నాయక్, జిల్లా అధ్యక్షుడు, సేవాలాల్ సేన -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రసాయనాలు వద్దు.. ఆర్గానిక్ ముద్దు అని నిర్ణయం ● ప్రధానంగా ఇంటి అవసరాలకు.. ● సేంద్రియ ఎరువులతో సాగు సాక్షి, మహబూబాబాద్: పెరిగిన శాస్త్ర విజ్ఞానం, అందిపుచ్చుకున్న ఆవిష్కరణలు అన్నీ మానవ సంపత్తే అయినా.. మానవ మనుగడకు ఉపయోగపడటమే కాకుండా మాన వినాశనానికి కూడా దోహద పడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.! వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, కొత్త వంగడాలు, హైబ్రీడ్ రకాలు, పంట పెరిగేందుకు, చీడపీడల నివారణకు దోహదపడుతాయి. కానీ అదే విధంగా వాతావరణాన్ని కలుషితం చేయడం, కేన్సర్ లాంటి భయానక వ్యాధుల బారిన పడేందుకూ కీలకంగా ఉంటున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తినడం రోగాలు కొని తెచ్చుకోవడం ఎందుకని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగానికి స్వస్తిచెప్పి సేంద్రియ ఎరువులు, పురాతన పద్ధతులతో వ్యవసాయం చేయడం అలవాటు చేసుకున్నవారు కొందరు. అయితే.. వ్యవసాయ భూమిలో ఏ పంటలు వేసుకున్నా.. తాము తినే పంటలను మాత్రం సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. మరికొందరు అయితే ఫామ్ హౌజ్ల్లో సేంద్రియ సాగుతో కూరగాయలు, పండ్లు పండించుకొని తిని తృప్తిపడుతున్నారు. సేంద్రియ కూరగాయలు.. -
ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.మధ్యవర్తుల వలలో పడొద్దు ● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు ● ఎంజీఎం అధికారుల స్పష్టీకరణ కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాలేదని ఎంజీఎం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఇటీవల 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని కూడా వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి అధికారులు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వరంగల్ జిల్లా సంగెం మండలంలో, పర్వతగిరి మండలంలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. తిమ్మాపూర్లో.. సంగెం : ద్విచక్రవాహనం ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొట్టడంతో మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తబ్బెట ఎల్లస్వామి(56) గురువారం రాత్రి ఇంటి సమీపంలోని కిరాణాషాపునకు వెళ్లి వస్తున్నాడు. అదేసమయంలో అదే గ్రామానికి చెందిన తాటికొండ మణికంఠ స్కూటీపై అతివేగంగా అజాగ్రత్త వస్తూ ఎల్లస్వామిని ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడడంతో ఎల్లస్వామి తల, మెడ, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అతన్ని వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడికి భార్య సుధ, ఇద్దరు కుమారులు రాజు, యాదగిరి ఉన్నారు. పెద్ద కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ.. పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామంలో మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ సలీమా(35) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద విద్యుత్ హీటర్ను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
పరుగు పందెంలో పాల్గొన్న బాలలు జంప్ చేస్తున్న బాలుడువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి 1వ పిల్లల అథ్లెటిక్స్ పోటీలు, జావెలిన్ డే వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న అథ్లెటిక్స్ మీట్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,757 మంది అథ్లెట్లు హాజరైనట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అండర్–06, 08, 10, 12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18 తో పాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పిల్లల అథ్లెటిక్స్, జావెలిన్ త్రో పోటీలు ముగిసినట్లు తెలిపారు. రెండో రోజు యూత్ విభాగంలోని అండర్–18 బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్పుట్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ లాంటి మెత్తం 60 ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ జేఎన్ఎస్లో ప్రారంభం వివిధ జిల్లాల నుంచి హాజరైన 1,757 మంది క్రీడాకారులు -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
కురవి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మానుకోట జిల్లా సీరోలు మండలం తాళ్లసంకీస గ్రామంలో గురువారం చోటుచేసుకున్నట్లు శుక్రవారం సీరోలు ఎస్సై సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసంకీస గ్రామంలో కొరిపెల్లి బాలకృష్ణ–స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం బాలకృష్ణ తన ఇంటికి తాళం వేసి మహబూబాబాద్లోని తన షాపునకు వెళ్లాడు. భార్య స్వరూప సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో విధులకు హాజరయ్యేందుకు వెళ్లింది. గురువారం సాయంత్రం బాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో పరిశీలించగా.. రెండు ఇనుప బీరువాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు గుర్తించాడు. విషయం తెలుసుకున్న సీరోలు పోలీసులు క్లూస్ టీం సభ్యుల బృందంతో ఘటనస్థలాన్ని పరిశీలించారు. 14 తులాల బంగారు అభరణాలు, రూ.2.05లక్షలు అపహరించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ విషయమై బాలకృష్ణ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 14 తులాల బంగారు ఆభరణాలు రూ.2.05లక్షల నగదు అపహరణ -
‘కాళేశ్వరం’ రాతి నిర్మాణానికి మట్టి పరీక్షలు
● శ్రావణ మాసంలో నూతన ఆలయానికి భూమిపూజ చేసే అవకాశంకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా పునర్నిర్మాణం కోసం హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల ను శుక్రవారం ప్రారంభించారు. దేవస్థానం నిర్మా ణం పూర్తిగా రాతితో చేపట్టనున్న నేపత్యంలో మట్టి గట్టితనంపై పరీక్షలు చేస్తున్నారు. మొత్తం దేవస్థా నం నిర్మాణ ప్రాంతంలో తొమ్మిది చోట్ల 30 నుంచి 40 ఫీట్ల మేర డ్రిల్లింగ్ చేపట్టారు. ఇప్పటికే నాలుగు డ్రిల్లింగ్ హోల్స్ వేశారు. మిగితావి శనివారం వరకు పూర్తి చేసి ల్యాబ్కు పంపిస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికి వేసిన నాలుగు హోల్స్లో గట్టి బండరాయిలాంటి మట్టి వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం పాత ఆలయాలన్ని 90 శాతం వరకు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో శ్రావణమాసం మొదలు కానుండడంతో సరికొత్త రాతి ఆలయ నిర్మాణానికి ముగ్గుపోసే ముహూర్తం ఖరారు కానుంది. -
వ్యవసాయ బావుల వద్ద చోరీలు
జనగామ: జనగామ మండలం చీటకోడూరు, వడ్లకొండ గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్కు పంపినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. చీటకోడూరు సర్పంచ్ కుకట్ల యాదగిరితోపాటు గ్రామానికి చెందిన మరో 44 మంది రైతులు, వడ్లకొండకు చెందిన 10 మంది రైతుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మధ్యాహ్నం వడ్లకొండ క్రాస్రోడ్ వద్ద ఎస్ఐ భరత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రంలోని కలహాండి జిల్లా ధర్మగర్ గ్రామానికి చెందిన రసిక్ మజ్హి, బింబదర్ పాత్ర, జాడు మజ్హి ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. దీంతో వారు రైతుల వ్యవసాయ పొలాల వద్ద బోర్లు, మోటార్ల వైర్లు, సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.80 వేల నగదు, పనిముట్లు, పరికరాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. రైతుల ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందించి, శాసీ్త్రయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టడం వల్ల నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని సీఐ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కేసు చేదనలో సీఐ పర్యవేక్షణలో ఎస్ఐలు భరత్, రతీష్, హెడ్ కాని స్టేబుల్ నాసర్, మహిళా పోలీసు కానిస్టేబుల్ మనీషా, పోలీసు కానిస్టేబుళ్లు కరుణాకర్, కృష్ణ, భాస్కర్, సాగర్, ఐడీ అసిస్టెంట్ సల్మాన్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.80 వేల నగదు, పరికరాలు స్వాధీనం -
విచారణపై అనుమానాలు!
హన్మకొండ చౌరస్తా: ‘నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది ఐటీఐ అధికారుల తీరు. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఐటీఐ అధికా రులే దారి తప్పి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను మీరుతూ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుతో నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. విచారణకు ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా నిజాలు బయటిపెట్టకుండా సదరు ఉద్యోగులను కాపాడుకునేందుకు ఉత్తుత్తి విచారణ చేపట్టి ఉన్నతాధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ సభలో పాల్గొనడంపై ఫిర్యాదు.. హైదరాబాద్లోని ఎంప్లాయ్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో ట్రెయినింగ్ ఆఫీసర్గా ఉన్న ఓంకార్ (ప్రస్తుతం మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపాల్గా ఉన్నారు.), పెద్దపల్లి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఫిబ్రవరి 02, 2025లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు. విధి నిర్వహణలో కొనసాగుతూనే రాజకీయ సభలో పాల్గొనడంపై ఓ వ్యక్తి ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్, గవర్నర్, ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ కమిటీని నియమించారు. డైరెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 25న హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. మహబూబ్బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ను వరంగల్లోని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆఫీస్లో విచారించారు. కానీ, అందుకు సంబంధించిన నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందించ చర్య లో జాప్యం నెలకొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఐటీఐ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్పై విచారణ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు అధికారుల తీరుపై విమర్శలుఓంకార్, మల్లికార్జున్ లపై వచ్చిన ఫిర్యాదుపై డైరెక్టర్ ఆదేశాలతో జూన్ 25న విచారణ జరిగింది వాస్తవమే. విచారణ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, సభ్యుడిగా నేను ఉన్నాం. అయితే ఫిర్యాదు ఎదుర్కొంటున్న వారిద్దరు, నేను ఒక్కటే అసోసియేషన్కు చెందిన వారమని తెలిపాను. దీంతో ఆర్డీడీ నర్సయ్య మరో కమిటీ వేసి మరోసారి విచారణ చేయాలని ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్కు నివేదించారు. తదుపతి కమిటీ విచారణ చేసే వరకు వేచిచూడాల్సిందే. – చందర్, ప్రిన్సిపాల్ ఐటీఐ వరంగల్విచారణ చేపట్టి నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ కమిటీ సభ్యుడిగా ఉన్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. తెలంగాణ టెక్నికల్ అసోసియేషన్లో బాధ్యుడు కాగా, అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు అధికారులు సైతం అదే అసోసియేషన్ బాధ్యులని తెలిసింది. సన్నిహితులు అయినందునే విచారణను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
దొంగల ముఠా అరెస్టు.. సొత్తు స్వాధీనం
మహాముత్తారం: ఓ వైన్స్లో, బైక్ను చోరీ చేసిన నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్ గ్రామానికి చెందిన భూతం ఆంజనేయులు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మహంకాళి కమల్, కరీంనగర్ ఆదర్శనగర్లో నివాసం ఉంటున్న శివరాత్రి అభిలాష్, కరీంనగర్ మండలం మండులపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి అరుణ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యామన్పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్లో చోరీ, ఒక హీరోస్ప్లెండర్ మోటార్ సైకిల్ను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులనుంచి 5 బీరు బాటిళ్లు, 25 రాయల్స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, రూ.5వేలు నగదుతోపాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్ కారు, 2 స్మార్ట్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు మహాముత్తారం ఎస్ఐ రమేష్ తెలిపారు. -
తిరుపతి–కరీంనగర్ ఎక్స్ప్రెస్ వేళలో మార్పు
● అక్టోబర్ 10 నుంచి అమలు కాజీపేట రూరల్: తిరుపతి నుంచి కరీంనగర్ (12761)కు వయా గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మీదుగా వెళ్లే బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేళలో స్వల్ప మార్పులు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 08ః05 గంటలకు బయల్దేరే ఈ ఎక్స్ప్రెస్ రాత్రి 07ః50 గంటలకు బయల్దేరుతుందని దెలిపారు. తిరుపతి నుంచి 15 నిమిషాల ముందే బయల్దేరేలా సమయం మార్చినట్లు తెలిపారు. ఈ మార్పు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్వో స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులకు పునుగు పిల్లి అప్పగింతశాయంపేట : ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యుడు మారెపల్లి సునీల్ ఓ పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డుపై పునుగు పిల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పశువైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిపారు. పునుగు పిల్లికి మెరుగైన చికిత్స కోసం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కోటేశ్వర్ రావు, వాచర్ అశోక్ జిల్లా పశువైద్యశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సునీల్, వన్యప్రాణి ప్రేమికుడు సాయికృష్ణ పాల్గొన్నారు. పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం ● ‘స్టేట్ యూత్ అంబాసిడర్– టీబీ అడ్వకసీ ఫెలో’గా సందీప్ ఎంపికపాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకర్తి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎలమకంటి సందీప్ ప్రతిష్టాత్మక ‘స్టేట్ యూత్ అంబాసిడర్ –టీబీ అడ్వకసీ ఫెలోగా’ ఎంపికయ్యారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూనైట్ ఇండియా ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. సందీప్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులతో టీబీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖాతో సమన్వయం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో టీబీ నివారణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిచడం ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి. ఈ సందర్భంగా సందీప్ పాలకుర్తికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పలువురు అభినందించారు. -
అథ్లెటిక్ ఈవెంట్ కాదు..!
వరంగల్ స్పోర్ట్స్: ఇలా తీగలను దాటడం కూడా అథ్లెటిక్స్ పోటీల్లో ఓ ఈవెంట్ అని అనుకుంటే పొరబడినట్లే. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ లోపలికి వెళ్లే ప్రధాన గేటు దాటగానే కుడి వైపు సైడ్ట్రాక్కు అడ్డుగా ఇనుప తీగలను కట్టారు. అటు వైపు వెళ్లే అథ్లెట్లు తీగలను దాటేందుకు ఫీట్లు చేయక తప్పలేదు. కొందరు పిల్లలు తీగలను గమనించకపోవడంతో మెడకు తగిలి పడిపోయారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు వారి తల్లిదండ్రులు, టెక్నికల్ అఫీషియల్స్ ఇనుప తీగలతో ఇబ్బందులు పడ్డారు. -
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్ : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాననే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానుకోట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రావు కాలనీలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుని జీవిస్తున్న కుంట రాకేష్ (23) రెండు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి ప్రేమ విషయంలో పలుమార్లు పెద్దల పంచాయతీలు ఘర్షణలు జరగ్గా అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదు. దీంతో రాకేష్ తండ్రి ఉప్పలయ్య అతడికి తొమ్మిది నెలల క్రితం వేరే అమ్మాయితో వివాహం జరిపించాడు. ఆషాడమాసం కావడంతో రాకేష్ భార్య తల్లిగారింటికి వెళ్లగా ఒంటరిగా ఉన్నాడు. ఈక్రమంలో గురువారం పండ్లు అమ్ముకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులు భోజన సమయానికి ఇంటికి వచ్చి చూసేసరికి రాకేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు. రాకేష్ తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నెక్కొండ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెక్కొండ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన బత్తుల సాయిరాం (20) పదో తరగతిలో ఫెయిల్ అవ్వడంతో జులాయిగా తిరుగుతున్నాడు. నిత్యం సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ పనులకు సాయం కోరిన తల్లిదండ్రులకు సాయిరాం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీతో నిత్యం సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తావా.. అంటూ తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన సాయిరాం నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
టెక్నాలజీతో విద్యుత్ సరఫరాను బలోపేతం చేయాలి
హన్మకొండ: విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఇంధన శా ఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్ట ల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాల యం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముందుగా వరుణ్ రె డ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్పీడీసీఎ ల్ పరిధిలో చేపట్టనున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఇందులో 33/ 11 కెవీ సబ్స్టేషన్లలో సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరే జ్ సిస్టమ్ ఏర్పాటు, రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్ కోసం 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు గురించి వివరించారు. రోజు రోజుకు వి ద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను వివరించారు. ఛార్జింగ్ సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించడంతో పాటు అదనపు గ్రిడ్ లోడింగ్ను నివారించవచ్చని చెప్పారు. 33 కేవీ ఫీడర్లపై రియాక్టివ్ కరెంట్ను తగ్గించడం లక్ష్యంగా 347 సబ్స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు పెట్టామన్నారు. 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకు కరెంట్ను తగ్గించి పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, మాధవ రావు, కె.వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, నాగ ప్రసాద్, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు, జీఎం ప్రభావతి, డీఈలు కె.అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ -
గాంధీపార్కు అభివృద్ధికి కృషి
మహబూబాబాద్: మానుకోట పట్టణంలోని గాంధీ పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కును శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కులో వాకింగ్ ట్రాక్, వేదిక ఇతర సందరీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులతో తయారు చేయిస్తామన్నారు. ఎస్టిమేషన్ను బట్టి నిధుల మంజూరుపై ఆలోచిస్తామన్నారు. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు స్థానికులు సహకరించాలన్నారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారు రూ.60 కోట్లు మంజూరు చేయించామని, ఆ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం బంధం చెరువు వద్ద జరుగుతున్న వరద కాల్వల పనులను పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ పనులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అజయ్సారథిరెడ్డి, డీఈఈ సీహెచ్.ఉపేందర్, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్, రాజు, నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, పెరుగుకుమార్, వీరన్న, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వర కు వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయ న వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కా రం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్ డీజీపీగా జిల్లాకు తొలిసారి వస్తున్న సీవీ ఆనంద్ -
టాస్క్ సెంటర్ ఏర్పాటులో జాప్యం
మహబూబాబాద్: జిల్లాలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సెంటర్ ఏర్పాటుకు అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రైవేట్ భవనాలు పరిశీలించగా అద్దె ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేశారు. త్వారీత ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. కాగా, టాస్క్ సెంటర్లో శిక్షణ కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి.. నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు టాస్క్ సెంటర్ మంజూరు చేసింది. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చిన అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పి స్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టాస్క్ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్లో టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం రీజినల్ మేనేజర్ సునీల్రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి మానుకోట పట్టణంలోని తొర్రూరు రోడ్డు, ఈదులపూసపల్లి రోడ్డులో ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ డీగ్రీ కళాశాలను కూడా పరిశీలించారు. జిల్లా పరిశ్రమలశాఖ, ఉపాధి కల్పన శాఖ సమన్వయంతో ఆ సెంటర్ పనిచేస్తుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇప్పటి వరకు 6,536 మంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్లీ భవనాల పరిశీలన.. ఇటీవల మళ్లీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను పరిశీలించారు. కానీ ఆ గదులకు బదులుగా అనుకూలంగా లేని వేరే రెండు గదులు ఇస్తామని చెప్పారు. అయితే టెక్నికల్ సమస్య వస్తుందని అధికారులు విముఖత వ్యక్తం చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీ, ఎస్పీ పాత కార్యాలయ భవనం, రెడ్యాలలోని ప్ర భుత్వ భవనాలను పరిశీలించారు. కాగా, ఎస్పీ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మారిస్తే.. టాస్క్ సెంటర్ను పాత ఎస్పీ కార్యాలయంలో ఏ ర్పాటు చేయాలనే ఆలోచిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అయితే నేటి వరకు సెంటర్కు భవనం కేటాయింపు జరగలేదు. రూ.30లక్షలు కేటాయింపు.. టాస్క్ సెంటర్లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్ స్నేహశబరీష్ ఇతర గ్రాంట్ నుంచి రూ.30 లక్షలు కేటాయించి కంప్యూటర్లు, మెటీరియల్స్, ఫర్ని చర్ ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలి పారు. కలెక్టర్ సెంటర్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకోసం బడ్జెట్ కేటాయించారని అఽ దికారులు తెలిపారు. అయితే అనువైన భవనం లేక సెంటర్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్రంలో ఇచ్చే శిక్షణలు.. కేంద్రంలో మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంటర్ ఓపెన్ చేసి ఉంటుంది. వారం నుంచి ఆరు నెలలు వరకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్, ఐసెట్, నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డెటా అనాలిటిక్స్, మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డవలప్మెంట్, పరిశ్రమల అవసరాలు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. యువత నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా టాస్క్ పని చేస్తుంది. ఇంటర్వ్యూల ద్వారా ఉపాధి.. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆతర్వాత పలు కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయించి ఉద్యోగ అవకాశాలు వారే కల్పిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. టాస్క్ సెంటర్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు చాలామంది ఉండడంతో.. సెంటర్కు మంచి స్పందన వస్తుంనది అధికారులు చెబుతున్నారు. నెలాఖరు వరకు సెంటర్ ఏర్పాటుప్రభుత్వ భవనంలో సెంటర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. అందుకే ఆలస్యమవుతోంది. మిగితా ప్రాసెస్ అంతా పూరైంది. నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వారికి సమాచారం ఇస్తున్నాం. యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరులోగా సెంటర్ ఏర్పాటు అవుతుంది. – శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్భవనాల పరిశీలనకే పరిమితం రెండు నెలలుగా కసరత్తు చేస్తున్న అధికారులు అనువైన ప్రభుత్వ భవనం లేకనే ఆలస్యం శిక్షణకు 271 దరఖాస్తులు ఇప్పటికే 271 మంది దరఖాస్తు టాస్క్ సెంటర్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. అందుకోసం గూగుల్ లింక్ ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 6వ తేదీ వరకు 271మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారంతా సెంటర్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కాంగెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శుక్రవారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, పట్టణాల అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. మూడు నెలలుగా తర్జనభర్జన.. జిల్లాలోని 18 మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపికపై మూడు నెలలుగా నాయకుల మధ్య తర్జనభర్జన కొనసాగింది. జిల్లాలో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నా యి. ములుగు, ఇల్లెందు, పారికుర్తి నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాలకు ఒక్కరి పేరు, మరికొన్ని మండలాలకు ఇద్దరి నుంచి ఐదుగురు పేర్లు ప్రతిపాదించినట్లు ప్రచారం. ఇలా జిల్లాలోని 18 మండలాలకు మొత్తం 50మందికి పైగా నాయకుల పేర్లు రాసి పంపించారు. అయితే ఎంపిక విషయంలో ఎంత మంది అబ్జర్వర్లు వచ్చినా.. ఎంత మంది నాయకులు ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్. కాగా, ఎమ్మెల్యేలు చూసించిన నాయకులపై మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. మరికొన్నిచోట్ల ఎంపీ బలరాంనాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మరికొన్ని మండలాల్లో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మండల అధ్యక్షుల ఎంపిక కోసం కొందరి పేర్లు సిఫారసు చేసినట్లు ప్రచారం జరిగింది. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూ రు, పెద్దవంగర మండలాల్లో ఏకాభిప్రాయంతో.. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రతిపాదించిన నాయకులపై కొందరు కార్యకర్తలు తెలిపిన అభ్యంతరాలపై చర్చ జరిగింది. అయితే తర్వాత సర్దిచెప్పి ఆరు మండలాల ఎంపిక పూర్తి చేశారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మండల అధ్యక్షుల ఎంపికపై ఉన్న చిక్కుముడి వీడలేదు. దీంతో జాబితా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వద్దకు చేరిందనే వార్తలు వచ్చాయి. బుజ్జగింపులు.. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని మండలాల అధ్యక్ష పదవులు అశిస్తున్న వారిలో ఎమ్మెల్యే కొందరి పేర్లు సూచించగా.. ఎంపీలు, ఇతర పార్టీ పెద్దల మరికొందరి పేర్లు చెప్పి పట్టుబట్టారు. దీనిపై ఎమ్మెల్యే, ఇతర నాయకుల సమాలోచనకు వచ్చి జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. అయితే పదవి ఆశించిన వారిని బుజ్జగించడం, మరో అవకాశం ఇస్తామని చెప్పడం, పీఏసీఎస్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. ఏదీ ఏమైనా ఎట్టకేలకు పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక వర్గాల మధ్య కుదిరిన సయోధ్య పోటీ ఎక్కువగా ఉన్న చోట సమన్వయం మరో అవకాశం ఇస్తామని బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే.. నియోజకవర్గం మండలం అధ్యక్షుడు మహబూబాబాద్ మహబూబాబాద్ బెల్లంకొండ శ్రీనివాస్ గూడూరు దారావత్ బాలాజీ కేసముద్రం చిలువేరు సమ్మి ఇనుగుర్తి బైరు అశోక్ గౌడ్ నెల్లికుదురు ఎదళ్ల యాదవ రెడ్డి డోర్నకల్ దంతాలపల్లి కొడుపుగంటి హరికృష్ణ నర్సింహులపేట బొబ్బ సోమిరెడ్డి కురవి బలగాని శ్రీనివాస్ గౌడ్ డోర్నకల్ బత్తుల శ్రీనివాస్ సీరోలు బుడిగం లక్ష్మీనారాయణ చిన్నగూడూరు మారబోయిన వెంకటేశ్వర్లు మరిపెడ గుగులోత్ రవినాయక్ మరిపెడ పట్టణం బానోత్ రాంలాల్ డోర్నకల్ పట్టణం కాల సుమీర్ జైన్ -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన..పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన.. ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ -
ప్రత్యామ్నాయ పంటలతోనే భరోసా
వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మహబూబాబాద్: రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పంటల సాగుపై ప్రతీ రైతుకు స్పష్టమైన సందేశం చేరేలా అధికారులు పని చేయాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,81,167 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు చెప్పారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలికురవి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం సీరోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, రికార్డులు, పోలీసింగ్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్లోని వివిధ రికార్డులు, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డయల్–112 కాల్స్పై స్పందన, గ్రామాల సందర్శన వివరాలు, గంజాయి ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచార సేకరణ, గ్రామస్థాయిలో వీపీఓ వ్యవస్థ పనితీరు, స్టేషన్ సిబ్బంది, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, నేరాల పరిస్థితి తదితర అంశాలపై సమీక్షించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్–112 ద్వారా వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలన్నారు. గ్రామాల సందర్శనను నిరంతరం కొనసాగిస్తూ గ్రామస్తులతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. గంజా యి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వీపీఓ వ్యవస్థను గ్రామస్థాయిలో సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజలతో మర్యాదపూర్వక వైఖరి, బాధ్యతాయుత సేవాభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్సై సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలినెల్లికుదురు: మోడల్ స్కూల్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని మోడల్ స్కూళ్ల ప్రత్యేక అధికారి సాయిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను శుక్రవారం ప్రత్యేక అధికారి సందర్శించారు. స్కూల్, కళాశాల, హాస్టల్ను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, కేర్టేకర్ అనిత పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కేయూ క్యాంపస్: విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి సూచించారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు శుక్రవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం, ఇంటర్నెట్, ఏఐ, ఆన్లైన్ వీడియో లెక్చర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. నిట్ ప్రొఫెసర్ బి.స్ఫూర్తి మాట్లాడుతూ.. కళాశాల జీవితం విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన దశ అని అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళాశాల కల్పిస్తున్న సదుపాయాలు, అకడమిక్ కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈనెల 11 నుంచి 16 వరకు నూతన విద్యార్థినులకు ఇండక్షన్ ప్రోగ్రాం గురించి కన్వీనర్ ఎస్.సాహితి, సహ కన్వీనర్ టి.వెంకటేశ్, ఇన్చార్జ్ డాక్టర్ శ్రీరామ్జ్యోత్స్న తెలిపారు. -
కూరగాయల సాగుతో ఆదాయం
మహబూబాబాద్ రూరల్ : ఆరుతడి, కూరగాయల పంటల సాగు మేలుదాయకమని, మహిళా సంఘాల సహకారంతో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. జిల్లాలో 4వేల ఎకరాల్లో కూరగాయలు సాగు విస్తీర్ణానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 524 ఎకరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా, వ్యవసాయ అధికారుల సహకారంతో కూరగాయలు సాగు చేపట్టినట్లు చెప్పారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బీర, సోర, కాకర, బోడ కాకర, బెండ, చిక్కుడు, ఆకుకూరలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు ఆధునిక పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం చేయాలన్నారు. రైతులు కూరగాయల పంటలు సాగుచేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఐకేపీ డీపీఎం శ్రీకాంత్, ఉద్యాన అధికారులు శాంతిప్రియదర్శిని, స్రవంతి, సిబ్బంది జ్యోత్స్న, సుకన్య, రామకృష్ణ ఉన్నారు. -
అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి
● ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రు నాయక్ కురవి: సర్పంచ్లకు అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ వీరబాబు అధ్యక్షతన జరిగింది. అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదని సభలో సర్పంచ్లు ఏకరువు పెట్టారు. ప్రతీ గ్రామంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఏఈ శారద పట్టించుకోవడంలేదని, ఫోన్ చేసినా ఎత్తడంలేదని సర్పంచ్లు మండిపడ్డారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్ల ఫోన్ ఎత్తకుండా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఏడీఈ రమేష్ సభకు వచ్చి సర్పంచ్లు తెలిపే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్లు శాంతించారు. కరెంట్ బిల్లులు చెల్లించాలని ఎంపీడీఓ, ఎంపీఓలు అడుగుతున్నారని సర్పంచ్లు ఆరోపించారు. 17 మంది బీఆర్ఎస్ సర్పంచ్లపై వివక్ష చూపుతున్నారని, ఈజీఎస్ పనులు రాకుండా చేశారని బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నాన్ స్టార్ట్ ఇందిరమ్మ ఇళ్లను ఇంత వరకు క్లియర్ చేయలేదని, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ వీరబాబుపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా పూర్తి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు. అధికారులు సర్పంచ్లకు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో భగీరథ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వేసవిలో ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్ విజయ, డీఈ జుంకీలాల్, చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, గార్లపాటి వెంకటరెడ్డి, కొర్ను రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
గడువులోగా జనగణన పూర్తి చేయాలి
మహబూబాబాద్: నిర్ణీత గడువులోగా జనగణన–2027 ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జనగణనపై సమీక్షించారు. ఈసందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, తాగునీరు తదితర అంశాలను సేకరించి జిల్లా గణన హ్యాండ్బుక్ నెట్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సంబంఽధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
భవనాన్ని అందుబాటులోకి తేవాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కేసముద్రం: కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని మహముద్పట్నం గ్రామంలోని కేజీబీవీని ఆయన సందర్శించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. అప్డేట్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన డీడీ రెండు రోజుల్లో అందజేస్తామని విద్యుత్శాఖ ఏడీకి తెలిపారు. 15 రోజుల్లో నూతన భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఇంగ్లిష్లోనే బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జీఈసీఓ గాయత్రి, ఇన్చార్జ్ ఎస్ఓ అర్చన, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు పాల్గొన్నారు. గోదాం ఖాళీ చేయించాలి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో హరికృష్ణ మూమెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సీఎం బ్రేక్ఫాస్ట్ సప్లైచేసే కేంద్రాన్ని డీఈఓ సందర్శించారు. గోదాంలో బస్తాలను ఖాళీచేసే పనులను ఆయన పరిశీలించారు. త్వరగా ఖాళీ చేయించాలని సూచించారు. -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు చెక్!
నాలుగు లెవల్ క్రాసింగ్ల వద్ద చేపట్టనున్న పనుల అంచనా వ్యయం రూ.197 కోట్లు కాగా, ఆ మేరకు నిధులు కేటాయించారు. ఈ నాలుగు పనుల్లో ఒక్కదానికి టెండర్ సైతం ఖరారు చేశారు. మిగతా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. ● వరంగల్–చింతలపల్లి మార్గంలోని ఎల్సీ నంబర్ 64 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.77 కోట్లు అంచనా వేశారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ● ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 69/ఎం వద్ద రూ.100 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ (జీఏడీ), అంచనాల తయారీ పనులు జరుగుతున్నాయి. ● ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 70 వద్ద రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో రైల్వేవాటా పూర్తయింది. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ● నెక్కొండ–ఇంటికన్నె మార్గంలోని ఎల్సీ నంబర్ 74 వద్ద రూ.8 కోట్లతో చేపట్టాల్సిన ఆర్యూబీ పనులు కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. సాక్షిప్రతినిధి, వరంగల్ : రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు చెక్ పడనుంది. ఉమ్మడి వరంగల్లో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. వీటి కోసం ఏకంగా రూ.197 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఒకచోట టెండర్ ఖరారుకాగా.. మరోచోట డిజైన్లు, అంచనాల రూపకల్పన జరుగుతోంది. ఇంకోచోట రైల్వే వాటా పనులు పూర్తికాగా.. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఒక ఆర్యూబీ పనులు మాత్రం నిలిచిపోయాయి. పెండింగ్ పనులపైన దృష్టి సారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంనుంచి మరో మూడు.. కేంద్ర రైల్వేశాఖ చేపట్టిన నాలుగు పనులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో మూడు ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. కాజీపేట–వరంగల్ మార్గంలోని ఎల్సీ నంబర్ 60, ఎల్గుర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 66, 67 వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాకపోకల అంతరాయానికి చెక్.. రాష్ట్రంలో మరో 118 ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అంచనా వ్యయం సుమారు రూ.4,883 కోట్లుగా స్పష్టం చేసిన రైల్వేశాఖ.. ఇందులోనే మూడు ఆర్వోబీలు, ఏడు ఆర్యూబీలు, ఎనిమిది లెవల్ క్రాసింగ్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వివరించింది. క్రాసింగ్ల వద్ద రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో.. వీటి స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగుచోట్ల ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం వరంగల్లో రైల్వే వంతెనలకు రూ.197 కోట్లు.. ప్రకటించిన కేంద్రం రైల్వే పెండింగ్ పనుల్లో ఎట్టకేలకు కదలిక -
నాణ్యమైన పిల్లలను పంపిణీ చేయాలి
మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీలో నాణ్యత, కొలతలు పాటించాలి. మూడు రకాల చేప పిల్లలను మాత్రమే అందిస్తున్నారు. అన్ని రకాల పిల్లలను చెరువుల్లో పోసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువులకు కేటాయించిన లెక్క ప్రకారం చేప పిల్లలు వదలాలి. అదను దాటకుండానే సమయానుకూలంగా పంపిణీ జరిగితే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. –పిట్టల వెంకన్న, తెలంగాణ మత్స్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంపిణీకి చర్యలు ప్రారంభించాం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన చర్యలు ప్రారంభించాం. చేప పిల్లల పంపిణీ టెండర్ల ప్రక్రియ కోసం చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి. చేప పిల్లల నాణ్యత, కొలతలు వంటివి మత్స్యకారులు, సంఘాల సభ్యులు చూసుకోవాలి. సీడ్ సక్రమంగా లేకుంటే తిప్పి పంపిస్తాం. –భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అఽధికారి -
ఆపన్నహస్తం అందించరూ!
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో శివరామాంజనేయస్వామి దేవాలయంలో అర్చకుడిగా కొనసాగుతున్న గాదెపాక రాములు ఆపన్నహస్తం ఎదురు చూస్తున్నారు. వా రం రోజుల క్రితం రాములుకు గుండెపోటు రావడంతో భక్తులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వైద్యులు ఆయనకు రెండు స్టంట్లు వేసి ప్రాణం కాపాడారు. అయితే క నీస ఖర్చులకు లేక ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సాయం అందజేయాలని వేడుకుంటున్నా రు. కాగా, దయార్థ హృదయులు స్పందించి రా ములుకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ కోరారు. దాతలు.. రాములు బంధువు (దేవేందర్) 9951262401 నంబర్కు ఫోన్పే ద్వారా పంపాలని అభ్యర్థించారు. కాగా, రాములు హనుమాన్ ఉపాసకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా 1,116 హనుమాన్ ఆలయాల్లో విగ్రహాలకు చందనం వేసే కార్యక్రమం చేపట్టి ప్రజల్లో భక్తిభావం పెంపునకు కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు. గుండెపోటుతో నిమ్స్లో చేరిన హనుమాన్ ఉపాసకుడు రాములు ఆర్థిక సాయం అందించాలని వేడుకోలు -
ఇలా.. 24 అంతస్తులు
కాశిబుగ్గ: హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మహానగరంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (24 అంతస్తులు) రూపు దిద్దుకుంటోంది. ఆ ధునిక హంగులు, అధునాతన సౌకర్యాలతో రోగులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ని ర్మిస్తున్న ఈ పెద్దాస్పత్రి ఈ ఏడాది చివరి నా టికి ప్రారంభోత్సవం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పడం లేదు. 12 ఎకరాలు.. 2,018 పడకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్లో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు చివరి దశ కు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల కు పెద్ద దిక్కువగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సమీపంలోనే జీ+23 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 2,018 పడకలతో దాదాపు 12 ఎకరా ల్లో చేపట్టారు. తెలంగాణలోని అతిపెద్ద సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులు ఇక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లకుండానే ఇక్కడ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో అంతస్తులో పలు వైద్య విభాగాల ఏర్పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పలు ప్రత్యేకతలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హైదరాబాద్కు వెళ్లకుండానే ఓరుగల్లులోనే మెరుగైన వైద్యం24 అంతస్తుల్లో ఉండే విభాగాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాద్లోని ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, 24 అంతస్తుల్లో ఏఏ విభాగాలు ఉంటాయో వైద్యాఽధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిన వివరాలు. ఒకటో అంతస్తు : ఓపీ, క్యాజువాలిటీ, అత్యవసర వైద్యసేవలు రెండో అంతస్తు : పూర్తిగా అధునాతన ఐసీయూ సేవలు మూడు, నాలుగు అంతస్తులు : పలు విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు 6 నుంచి 12 అంతస్తులు : పలు డిపార్ట్మెంట్ల వార్డులు 13వ అంతస్తు : ల్యాబ్లు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు 14, 15 అంతస్తులు : మెయింటెనెన్స్, టీచింగ్ 16, 17, 18 అంతస్తులు : ఫ్యాకల్టీ టీచింగ్, డెమో క్లాసులు 19, 20, 21 అంతస్తులు : రెసిడెంట్ డాక్టర్లు (పీజీలు) 22, 23 అంతస్తులు : ఆడిటోరియం, ఏబీసీ బ్లాకులు ఏర్పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, ఆంకాలజీ–క్యాన్సర్ పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఐసీయూ, ఆపరేషన్లు థియేటర్లు వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యసేవలు ఫిజియోథెరపి, ఆర్గాన్ ట్రిట్మెంట్, వృద్ధుల కోసం ప్రత్యేక చికిత్స హిమోఫిలిటీ (రక్త సంబంధ వ్యాధులు) సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్, కీమోథెరపి, సర్జరీలు న్యూక్లియర్ థెరపి, డయాలసిస్ సెంటర్ కార్డియో థోరాసిక్, ఓపెన్ హార్ట్ సర్జరీలుసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వైద్యులు త్వరితగతిన వచ్చి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా రోడ్డు సదుపాయం కల్పించారు. కాకతీయ మెడికల్ కాలేజీ, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్యులు నేరుగా వాహనాల్లో వచ్చే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేఎంసీకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టి పనులు చేపట్టారు. హాస్పిటల్కు వచ్చే రోగులు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండడంతో పలు సర్వీసులను సూపర్ స్పెషాలిటీ ఆవరణలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
28 కేజీల గంజాయి పట్టివేత
నర్సంపేట రూరల్ : ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. ఈనెల 05వ తేదీన ఒడిశాకు చెందిన బోలెరో వాహనంలో భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ బైపాస్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని నిలిపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురులో ఒకరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో వాహనం కింది భాగంలో సుమారు రూ. 14లక్షల విలువైన 28 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వెంటనే గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర ఆధ్వర్యంలో పంచానామా నిర్వహించి, కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్ ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకున్న ఎస్సై అరుణ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. మరిపెడలో 2.24 కిలోలు స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్ మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకుల గల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1.12 లక్షల విలువైన 2.240 కిలోల సరుకు, కారు, 4 సెల్ ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్సై సతీశ్, సిబ్బంది రవీందర్, రమేశ్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంత మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వారు తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీ సులు కారును నిలిపి తనిఖీ చేశారు. ఇందులో డ్రైవ ర్ సీటు కింద 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో నల్లగొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన గండికోట వంశీ, చిత్రం రాకేశ్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మాదాసు మ హేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండలో సెల్ఫ్ డ్రైవ్కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి నల్లగొండలో విక్రయించేందుకు వస్తున్నట్లు నిందితులు నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇద్దరి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
తప్పు చేస్తే శిక్ష తప్పదు
దంతాలపల్లి: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తప్పు చేస్తే శిక్ష తప్పదని సీడీపీఓ ఎల్లమ్మ అన్నారు. మండలంలోని దొనకొండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, శిశువుల తల్లులతో వాగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇస్తున్నారా.. ప్రతీ నెల శిశువు బరువు చూస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తుల వాగ్మూలం ప్రకారం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవుల శావణి, ఏసీసీడీపీఓ తేజాకల్యాణి, సూపర్వైజర్ శ్రీలత, ఉపసర్పంచ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సూపర్’ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పురోగతిపై 24 అంతస్తుల ఆస్పత్రి ఆవరణలోని కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంఽధిత శాఖ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్బాబు, విద్యుత్ ఎస్ఈ ఆనందం, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇంజనీర్ శ్రవణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఇఇ దేవిక చౌహాన్ పాల్గొన్నారు. -
నాగులమ్మకు నీడ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గద్దె పక్కన నాగులమ్మకు నీడనిచ్చేలా జువ్వి చెట్టును ఏర్పాటు చేశారు. 2014లో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షం వంద ఏళ్లకు పైగా వయసు ఉండి పూర్తిగా ఎండిపోవడంతో తొలగించారు. పలుమార్లు జువ్వి మొక్కలు నాటినా పెరగకుండా పోయాయి. దీంతో జువ్వి మొక్క నాటినా ఇప్పట్లో పెరగదనే ఆలోచన మేరకు దేవాదాయశాఖ అధికారులు ఎండోమెంటల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జూవ్వి వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా సమ్మక్క గద్దె పక్కన ఏర్పాటు చేశారు. ఈ చెట్టు సంరక్షణను ‘వటా ఫాండేషన్ ది బిగ్ ట్రీ క్వెస్ట్’ అనే సంస్థకు అప్పగించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షంపై జాతర సమయంలో నాగు పాము కనిపించేదని భక్తుల విశ్వాసం. సమ్మక్క గద్దె పక్కన జువ్వి చెట్టు ఏర్పాటు -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ: జిల్లాలో లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రత, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన ప్రతీ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస, లైంగిక దాడులు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత మహిళలకు చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, వైద్య సేవలు, పునరావాసం వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పలువురు బాధిత మహిళల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మహిళా కమిషన్ సెక్రటరీ ప ద్మజారమణ, రెవెన్యూ అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, జిల్లా న్యాయ సేవల సంస్థ, ‘షీ’ టీమ్స్, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, పోలీస్శాఖ అధికారులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలకు పోలీసులకు ఆదేశం -
నిర్వహణ గాలికి..
మహబూబాబాద్: మానుకోట పట్టణంలో ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్క్లు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్స్ పార్క్లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. జిమ్లోని పరికరాలు, ఆట వస్తువులు పాడైపోతున్నాయి. వాటి మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో పార్క్లు, ఓపెన్ జిమ్లలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో విషపురుగులు సంచరిస్తాయని ప్రజలు అటు వైపు వెళ్లడం లేదు. ఆరోగ్యం, ఆహ్లాదం కోసం.. మానుకోట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలు ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడు పార్క్లు, తొమ్మిది జిమ్లు ఏర్పాటు చేశారు. ఆహ్లాదం, ఆరోగ్యంతో పాటు గ్రీన్ ల్యాండ్ల పరిరక్షణలో భా గంగా వాటిని ఏర్పాటు చేశారు. ప్రహరీ ఏర్పాటు చేయడంతో కబ్జాకు గురికాకుండా ఉంటున్నాయి. ఏడు పార్కులు.. మానుకోట పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీ, ఇందిరాగ్రౌండ్, బ్రహ్మకుమారి మందిరం సమీపంలో, మహర్షి విద్యాలయం సమీపం, హౌజింగ్ బోర్డు కాలనీతో పాటు కలెక్టరేట్కు కూతవేటు దూరంలో కంబాలచెరువు పక్కన పార్క్ ఏర్పాటు చేశారు. 18వ వార్డు పరిధిలో బటర్ఫ్లై పార్క్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తొమ్మిది ఓపెన్ జిమ్లు.. ఎన్జీఓఎస్ కాలనీలోని పార్క్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇందిరాగ్రౌండ్లోని త్రివర్ణ పార్క్లో, బ్రహ్మకుమారి మందిరం సమీపంలోని పార్క్లో, యశోద గార్డెన్ ఎదుట, ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, శనిగపురం, హైమా గార్డెన్, కంకరబోడ్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ లేక అధ్వానంగా.. పార్క్లు, జిమ్లు, చిల్డ్రన్స్ పార్క్లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. వర్షాకాలంలో వాటి పరి స్థితి మరి దారుణంగా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలతో వాకర్స్ నడవడం కష్టంగా మారింది. విషపురుగులు, పాములు ఉంటాయని వాకర్స్ జంకుతున్నారు. పార్క్ల్లోని ఆట వస్తువులు, ఊయల ఇతర పరికరాలు చాలా వరకు పాడైపోయాయి. ఓపెన్ జిమ్లలో వ్యాయామ వస్తువుల కింద ఉన్న మ్యాట్లు పూర్తిగా పాడైపోయాయి. కేవలం సిమెంట్ ప్లాట్ఫాం మిగిలింది. మ్యాట్లు ఉన్నప్పుడు వ్యాయాయం చేసేందుకు చాలా అనుకూలంగా ఉండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల్లో జాప్యం.. జిమ్ పరికరాలు, ఆట వస్తువుల మరమ్మతులు చే యడంలో మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదని అంటున్నారు. కౌ న్సిల్ ఆమోదం ద్వారా ప్రత్యేక గ్రాంట్ నిధులు వి డుదల చేస్తే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. మానుకోటలో అధ్వానంగా పార్క్లు, ఓపెన్ జిమ్లు పాడైపోతున్న జిమ్ పరికరాలు, ఆట వస్తువులు వర్షాలతో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు పందులకు నిలయంగా చిల్డ్రన్స్ పార్క్లుపందులకు నిలయంగా చిల్డ్రన్స్ పార్క్లు.. జిల్లా కేంద్రంలోని ఎన్జీఓఎస్ కాలనీ, కృష్ణకాలనీతో పాటు పలు కాలనీల్లో చిల్డ్రన్స్ పార్క్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అయితే చుట్టూ ప్రహరీలు లేకపోవడంతో చిల్డ్రన్స్ పార్క్లు పందులకు నిలయంగా మారాయి. పందులతో ఆప్రాంత పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల సంఖ్య పెరిగి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భావజాల వ్యాప్తితో ఉద్యమం బలోపేతం
హన్మకొండ: తెలంగాణకు జరుగుతున్న న ష్టం, అన్యాయాన్ని భావజాల వ్యాప్తితో ప్ర జల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతమైందని, భావజాల వ్యాప్తికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎనలేని కృషి చేశారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, మధుసూదన్, సి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెక్కు అందజేతవిద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి టీజీ ఎన్పీడీసీఎల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ టౌన్ డివిజన్ కాజీపేట సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహస్తూ ఊకంటి ప్రకాశ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా, ఆయన భార్య సంధ్యకు యూనియన్ బ్యాంకు బీమా ద్వారా క్లెయిమ్ రూ.1.05 కోట్లు మంజూరు చేయగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి చెక్కు అందించారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
డీపీఓ ఆకస్మిక తనిఖీ
కురవి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీపీఓ రేవంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామాభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ స్వరూప, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి వేద రాజేశ్ పాల్గొన్నారు. కాగా డీపీఓ రేవంత్ మొదటి సారి కురవి గ్రామ పంచాయతీకి రావడంతో సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దైద భద్రయ్యలు సన్మానించారు. ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక జాబితా విడుదల మహబూబాబాద్ అర్బన్: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామక జాబితాను గురువారం ఎట్టకేలకు విడుదల చేశారు. నియామకాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, అర్హుల ఎంపికలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు జాబితను విడుదల చేశారు. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీ నుంచి ఇన్స్ట్రక్టర్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యవసాయ మార్కెట్కు సెలవులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు రోజులపాటు క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ గురువారం తెలిపారు. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు, సోమవారం బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవురోజుగా ప్రకటించిందన్నారు. మళ్లీ మంగళవారం యథావిధిగా వ్యవసాయ మార్కెట్ పరిధిలో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. రైతులు సెలవురోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురికావద్దని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం నెహ్రూసెంటర్: ఆదివాసీల స్వయం పాలన, రాజ్యాధికారం, హక్కుల కోసం పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. ఆగస్టు 9న ఆదివాసీ పోరాట దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, అటవీ హక్కులు, వనరుల కోసం, హక్కుల సాధనకే ఆదివాసీలు ఏళ్లుగా పారాటాలు సాగిస్తున్నారని, వారి పోరాటాల ఫలితంగానే పెసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం వచ్చాయన్నారు. అనంతరం న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన 15 కుటుంబాల వారు ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కార్యక్రమంలో బానోత్ ఉక్లా, ఆరెం కొటమ్మ, బానోత్ దేవేందర్, ఇరుగు నాగన్న, గణేష్, శివ, నారాయణ, సిద్దబోయిన జీవన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలి మహబూబాబాద్ రూరల్ : ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 6నుంచి దేశ వ్యాప్తంగా పార్టీ ప్రజా చైతన్య ప్రచార యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్లు గ్రామంలో అమరజీవి తండా రామచంద్రు స్తూపం వద్ద సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర గురువారం ప్రారంభించారు. విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బి.అజయ్ సారథిరెడ్డి, నాయకులు పాండురంగచారి, సందీప్, లింగ్యనాయక్, కుమార్, సాంబలక్ష్మి, వెంకన్న, రవి, వీరన్న, రవీందర్, రమేష్, వేణు పాల్గొన్నారు. -
గోడ కూలి వృద్ధురాలి మృతి
● పున్నేలులో ఘటన ఐనవోలు: ప్రమాదవశాత్తు ప్రహరీ (గోడ) కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడికందుల లక్ష్మీకాంతం(60) రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కులవృత్తిలో భాగంగా అదే గ్రామంలో గండి సదానందం ఇటీవల మృతి చెందగా వారి ఇంట్లో ఐదోరోజు కార్యక్రమానికి గురువారం కూలీకి పని వెళ్లింది. సదానందం ఇంటి ఎదుట పని చేస్తుండగా పక్కన ఉండే కత్తి కృష్ణమూర్తి ఇంటి ప్రహరీ కూలి లక్ష్మీకాంతంపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కోడలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. మృతురాలికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబీలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్ షేక్ ఉస్మాన్ అలీ, మాజీ సర్పంచ్ కత్తి దేవేందర్ ఉన్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య రఘునాథపల్లి: మద్యానికి బానిసైన రిటైర్డ్ రైల్వే ఉ ద్యోగి క్షణికావేశంలో గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి యాదగిరి (70) రైల్వేశాఖలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సరైన ఉపాధి లేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కనకలక్ష్మితో తరచూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడు. ఈ నెల 5న మరోసారి భార్యతో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగాడు. అనంతరం క్షణికావేశానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. -
‘మన’ స్ఫూర్తి.. ఘన ‘కీర్తి’
● ఎంఐటీలో ప్రతిష్టాత్మక హంఫ్రీ ఫెలోషిప్నకు జనగామ జిల్లాకు చెందిన ఐఏఎస్ ఎంపికజనగామ : జనగామ జిల్లా తరిగొప్పుల వాసి, ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో నిర్వహించే ప్రతిష్టాత్మక హ్యూబర్ట్ హెచ్.హంఫ్రీ ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపికయ్యారు. అసోం, మేఘాలయ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆమె ప్రస్తుతం అసోంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు సాగే ఈ ఫెలోషిప్లో కీర్తి జల్లి ‘టెక్నాలజీ పాలసీ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధన, విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాపాలన రంగంలోని మధ్యస్థాయి నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. కర్మశ్రీ అవార్డుతో సన్మానం.. కీర్తి జల్లి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసి సివిల్ సర్వీస్ సాధించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా, తల్లి గృహిణిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అసోంలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్తోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్–19 నియంత్రణ, వరద సహాయక చర్యల్లో చూపిన నాయకత్వానికి అసోం ప్రభుత్వం ఆమెను కర్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ప్రభుత్వ సేవల్లో సాంకేతికత వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత పరిపాలనపై ఈ ఫెలోషిప్లో కీర్తి ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. ఎంఐటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలో అధ్యయనం చేసే అవకాశాన్ని దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణమని పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
మార్కెట్ చరిత్రలో మక్కలకు రికార్డు ధర
● రూ.2,629 పలికిన పంట కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మక్కలకు మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. మక్కల సీజన్ ప్రారంభంలో క్వింటాకు ధర రూ.1,500 నుంచి 1,900 వరకు మాత్రమే పలికింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మద్దతు ధర రూ.2,400కు మించి పలుకుతూ వస్తుంది. కాగా, గురువారం మార్కెట్కు 55 బస్తాల మక్కలు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.2,629, కనిష్ట ధర రూ.2,400 పలికినట్లు అధికారులు తెలిపారు. కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి మక్కలకు రూ.2,629 పలికినట్లు తెలిపారు. మార్కెట్కు వరుస సెలవులు ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈనెల 8,9,10 తేదీల్లో వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 వారాంతపు సెలవు, 10 (సోమవారం) బోనాల పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో మా ర్కెట్కు వరుసగా మూడురోజులు సెలవు ఉంటుందన్నారు. తిరిగి 11న పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దన్నారు. బావిలో పడి రైతు మృతి ● కొత్తపేటలో ఘటన బయ్యారం: వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత సైదులు (50) ఉదయం తన వ్యవసాయ బావికి విద్యుత్ మోటారు, పైపులు బిగించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బావి వద్ద మోటారు బిగించి పైపులు సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. మృతుడి అల్లుడు సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. ప్రశాంత్బాబు తెలిపారు గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి.. తొర్రూరు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తొర్రూరుకు చెందిన రెడ్డబోయిన వెంకటనారాయణ(55) స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్డీఐ(స్పెషల్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్)గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే విధుల్లో ఉన్న వెంకటనారాయణకు చాతిలో నొప్పిగా అనిపించడంతో సహచరులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఉపేంద్ర, కుమారుడు మణిదీప్, కుమార్తె మానస ఉన్నారు. -
జయశంకర్ సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ స్నేహశబరీష్ కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘన ంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆయన సిద్ధాంతాలు, భావజాలం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి మహబూబాబాద్: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలపై స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేస్తామని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, ఆర్వో నాగలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
చేప పిల్లల పంపిణీకి కసరత్తు
● నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ● చర్యలు చేపడుతున్న అధికారులు ● టెండర్ ప్రక్రియ షురూజిల్లాలో చేప పిల్లలు, చేపల దిగుబడి వివరాలు నెహ్రూసెంటర్: జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. ఈమేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టేలా టెండర్ల ప్రక్రియకు అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 1,229 చెరువుల్లో గతేడాది సుమారు 2కోట్ల మేరకు చేప పిల్లలను పంపిణీ చేశారు. అదనుదాటిన తర్వాత పంపిణీ చేయడంలో మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతమైన త్వరగా చేప పిల్లల పింపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నాణ్యత పాటించాలని.. చేప పిల్లల పంపిణీలో నాణ్యత, కొలతలు, లెక్క ప్రకారం చెరువులోకి చేరడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చేప పిల్లల పంపిణీలో సరైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం చేరేలా.. జిల్లాలో 1,229 చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. అన్ని చెరువుల్లో కలిపి సుమారు 4కోట్లకు పైగా చేప పిల్లలను వదలనున్నారు. 35–40 ఎంఎం, 80–100 ఎంఎం సైజ్ చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. అయితే సహకార సంఘాలకు నగదు బదిలీ చేయడం ద్వారా నాణ్యమైన పిల్లల్ని కొనుగోలు చేసి వర్షాల ప్రారంభంలోనే చెరువుల్లో వదులుకుంటామని మత్స్యకారులు కోరుతున్నారు. టెండర్ల కోసం ఏర్పాట్లు... జిల్లాలో 200 మత్స్యసహకార సంఘాలు, సుమారు 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అదను దాటకుండానే చెరువుల్లో చేప పిల్లలను వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ టెండర్లను అహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం టెండర్దారులను ఎంపిక చేస్తామని, చేప పిల్లల పంపిణీకి సంబంధించిన చర్యలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2023–24 4.20 కోట్లు 9 వేల టన్నులు 2024–25 1.8కోట్లు 23 వేల టన్నులుచేప పిల్లల పంపిణీ -
గోదారమ్మా.. కరుణించు
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వర్షాధారమే దిక్కు.. సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని జీవిస్తున్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతీ సంవత్సరం వర్షం కురిస్తేనే పంటలు పండుతున్నాయి. వర్షాలు లేకపోతే ఏజెన్సీ అంతా ఏడారిగా మారుతుంది. కాగా, ఎన్నికల సమయంలో గోదావరి జలాలు తరలిస్తామని నాయకులు చెబుతున్నారే తప్ప.. ఆచరణలో చూపడం లేదు. ప్రభుత్వాలు కరుణించి గోదావరి నీటిని ఎత్తిపోస్తేనే జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల రైతుల సాగునీటి గోస తీరుతుంది. తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు అన్నట్లు ఉంది.. కొత్తగూడ మండలం రైతుల పరిస్థితి. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు కట్టమాత్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. చెరువు విస్తీర్ణం మాత్రం కొత్తగూడ మండలంలోని గ్రామాల్లో ఉంటుంది. నీటి నిల్వ పెరిగితే ఈ ప్రాంతం గ్రామాలే ముంపునకు గురవుతాయి. ఇక్కడి ప్రజలే ఇబ్బందులు పడుతారు. కానీ కొత్తగూడ మండలంలోని ఒక్క గ్రామానికి కూడా పాకాల చెరువు నుంచి పంటలకు నీరు మాత్రం రాదు. ఎత్తిపోస్తేనే.. భూములు సస్యశ్యామలం పాకాల చెరువు నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తేనే ఏజెన్సీ మండలాల్లో భూములు సస్యశ్యామలంగా మారుతాయి. గోదావరి జలాలు ఇప్పటికే ములుగు జిల్లాలోని రామప్ప చెరువు నుంచి పాకాల చెరువులోకి ఎత్తిపోస్తున్నారు. కాగా, పాకాల చెరువు బ్యాక్ వాటర్ను కొత్తపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో లిఫ్ట్పెట్టి ఎత్తిపోయాలి. ఇలా సుమారుగా 10కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ పైపులైన్లు వేసి మధ్యలో చెరువులు నింపుతూ గంగారం మండలం తిరుమలగండి చెరువు నుంచి పందిపంపుల వాగు వరకు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే కొత్తపల్లి, వేలుబెల్లి, ముస్మి, పోలారం, బత్తులపల్లి, కార్లాయి, గోపాలపురం, తాటివారి వేంపల్లి, పొగుళ్లపల్లి, ఓటాయి, కోనాపురం, సాధిరెడ్డిపల్లి, జంగంవానిగూడెం, గంగారం మండలం తిరుమలగండి, పుట్టలభూపతి, మడగుడెం, గంగారం గ్రామాలకు సాగునీరు వెళ్తుంది. అక్కడి నుంచి పందిపంపుల వాగులో నీటిని వదిలితే బయ్యారం పెద్దచెరువు గోదావరి జలాలతో నిండుతుంది. తద్వారా కొత్తగూడ, గంగారం మండలాలతోపాటు బయ్యారం, గార్ల మండలాల్లోని ప్రత్యక్షంగా 50వేల ఎకరాలు, పరోక్షంగా మరో 50వేల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది. ఎన్నికల హామీగానే.. పాకాల నీటిని ఎత్తిపోసే పథకం ఎన్నికల హామీగానే మిగిలింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే చందూలాల్ ఈ వాగ్దానమే ముందుకు తీసుకొచ్చారు. తర్వాత వరుస ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సీతక్కతోపాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే సీతక్క మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ పథకం కోసం సర్వే చేయించారు. లిఫ్ట్ ద్వారా పదికిలో మీటర్ల మేరకు భూగర్భ పైపులైన్తో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులతో రూ.300కోట్ల బడ్జెట్తో అంచనాలు వేశారు. అయితే రెండేళ్లు అయినా దీనిపై మళ్లీ మాట్లాడడం లేదు. ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. పాకాల చెరువు నుంచి కొత్తగూడ, గంగారం మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం సర్వే చేయించాం. పరిపాలనా అనుమతులు, బడ్జెట్ కేటాయింపులు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. ఎన్నికల హామీగానే గోదావరి జలాల తరలింపు పాకాల చెరువు నుంచి ఎత్తిపోయాలని రైతుల డిమాండ్ పందిపంపుల వాగులోకి లిఫ్ట్ చేస్తే బయ్యారం చెరువుకు జలకళ లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం -
కాళేశ్వరం ప్రధాన ఆలయం నేలమట్టం
కాళేశ్వరం: జీర్ణోద్దరణలో భాగంగా కాళేశ్వరం దేవస్థానం ప్రధాన ఆలయాన్ని నేలమట్టం చేశారు. బు ధవారం ఉత్తర, పడమర గోపురాలు కూల్చివేశారు. దీంతో దక్షిణ గోపురం కూల్చివేతను రాత్రివరకు చేపట్టనున్నారు. వందల సంఖ్యలో గ్రామస్తులు కూ ల్చివేతలను తిలకిస్తున్నారు. తూర్పు రాజగోపురం మాత్రం గోదావరి పుష్కరాల అనంతరం కూల్చి పనులు చేపడుతారని ఆలయవర్గాలు తెలిపాయి. శతాధిక వృద్ధురాలి మృతి మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు షేక్.సైదాబీ (102) వృద్ధాప్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. సైదాబీ తన 102 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేకుండా జీవించడం విశేషం. సైదాబీకి ఆరుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, మనువలు, మనువరాళ్లు, మునిమనువలు, మునిమననురాళ్లతో కలిసి కుటుంబ సభ్యుల సంఖ్య సుమారు 160 మందికి చేరిందని ఆమె మనువడు షేక్.ఖాదర్ బాబా తెలిపారు. కాగా, సైదాబీ మరణవార్త తెలుసుకున్న వెంటనే బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. పాముకాటుతో మహిళ..పరకాల: పాటు కాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరకాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పస్తం వసంత (44) బోళ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 3న బోళ్లు అమ్ముకొని వచ్చి అలిసిపోయి సాయంత్రం 5 గంటలకు గుడిసెలో నిద్రిస్తుండగా నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె రెండో కుమార్తె స్థానికుల సాయంతో బైక్పై పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6.30 గంటలకు మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు కోతుల దాడిలో నలుగురికి గాయాలుస్టేషన్ఘన్పూర్: రాఘవాపూర్ గ్రామంలో బుధవారం కోతుల వీరంగం సృష్టించాయి. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. దశరథం, నారాయణరెడ్డి, సాయి, షరీఫ్ తదితరులు తమ ఇళ్ల వద్ద పనులు చేసుకుంటున్నా రు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోకి కోతుల గుంపు వచ్చింది. వారించే ప్రయత్నం చేసిన వారిపై ఒక్కసారిగా దాడిచేశాయి. దాంతో చేతులు, కాళ్లకు గాయాలు కాగా బాధితులు స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకున్నారు. ట్రాక్టర్ల బ్యాటరీల అపహరణ రాఘవాపూర్లో వ్యవసాయ భూముల వద్ద ఉంచిన ట్రాక్టర్ల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బ్యాటరీలు దొంగిలించారు. బాధిత రైతులు మేరుగు మధు, కుక్కల రాజు కథనం ప్రకారం.. రాఘవాపూర్ శివారులోని తమ వ్యవసాయ భూముల వద్ద ట్రాక్టర్లతో పొలం దున్ని మంగళవారం సాయంత్రం రైతులు ఇంటికివచ్చారు. తిరిగి బుధవారం పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాక్టర్లకు ఉన్న బ్యాటరీలు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఒక్కో బ్యాటరీ ధర రూ.7వేల వరకు ఉంటుందని తెలిపారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఈ విషయమై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
స్కానింగ్ నిర్వాహకుడు ప్రవీణ్ అరెస్ట్
జనగామ: లింగనిర్ధారణ కేసులో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ భీంశర్మ వెల్ల డించారు. బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి ఏసీపీ విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఫీర్జాదిగూడకు చెందిన అంబాల భాస్కర్గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన (ప్రస్తుతం హనుమకొండ గోపాలపూర్ నివాసి) ల్యాబ్టెక్నీషియన్ ప్రవీణ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించినట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన కొందరు ఆర్ఎంపీలు, మధ్యవర్తుల ద్వారా గర్భిణులను ప్రవీణ్ వద్దకు పంపించగా.. ఒక్కోకేసుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేసినట్లు వెల్లడైందన్నారు. ఇదే తరహా కేసుల్లో గతంలోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు తేలిందన్నారు. 2021, 2023లో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం ఐదు కేసులు నమోదై, వాటిలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు. జనగామ పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసును పోలీస్ కమిషనర్ శ్వేత సూచన మేరకు వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీంశర్మ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి బృందం దర్యాప్తు చేపట్టింది. బుధవారం జనగామ మండలం శామీర్పేట బైపాస్ వద్ద సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడు ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 12 నుంచి 15 మంది వరకు ఈ వ్యవహారంలో భాగస్వాములై ఉండే అవకాశం ఉందని భావిస్తున్నామని, వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కరుణాకర్, సాగర్, కృష్ణ, భాస్కర్ను పోలీస్ కమిషనర్ అభినందించినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడు ప్రవీణ్ నుంచి రెండు అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, కారు, రెండు ఫోన్లు, రూ.15వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నర్సయ్య ఉన్నారు. మరో 12 నుంచి 15 మంది పాత్రపై దర్యాప్తు ఏసీపీ భీంశర్మ -
రైల్వే డిపో పనుల్లో పురోగతి
మహబూబాబాద్ రూరల్: సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైల్వే శాఖ ఉన్నత అధికారులు సుదర్శన్ శర్మ, మురళీకృష్ణను మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ బుధవారం కలిశారు. అత్యంత కీలకమైన రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో, రైల్వే 4వ లైన్ నిర్మాణ పనులు, మానుకోట ఎల్సీ–80 గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుౖకు ఇప్పటి వరకు దాదాపు 90 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారన్నారు. ప్రస్తుతం డీపీఆర్ సిద్ధం చేసి పంపాల్సి ఉందని, అనంతరం టెండర్ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే రైల్వే 4వ లైన్ నిర్మాణంలో భాగంగా ఎల్సీ 80 వద్ద రైల్వే పాతబజారు, కొత్తబజారు ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని అధికారులకు వివరించామని చె ప్పారు. అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరామని, ఈమేరకు రైల్వే అధికారులు ఎల్సీ 80 గేటు వద్ద అండర్ బ్రిడ్జి ప్రతిపాదనను కూడా ప్రాజెక్టులో భాగంగా చేరుస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే వివరించారు. రైల్వే ఉన్నత అధికారులను కలిసిన ఎమ్మెల్యే మురళీనాయక్ -
ప్రాణం తీసిన కారు సడన్ బ్రేక్..
● ఆగి ఉన్న కారును ఢీకొన్న బైక్ ● కానిస్టేబుల్ దుర్మరణం రఘునాథపల్లి: కారు సడన్ బ్రేక్ ఓ కానిస్టేబు ల్ ప్రాణం తీసింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక బైక్పై వస్తూ ఓ కానిస్టేబుల్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం హనుమకొండ– హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కునూరు గ్రామానికి చెందిన పారుపల్లి ధనుంజయ (43) హనుమకొండ జిల్లా హసన్పర్తి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రఘునాథపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్కు బైక్పై హాజరయ్యాడు. మధ్యాహ్నం తిరిగి విధులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోమళ్ల టోల్ ప్లాజా సమీపం మలుపు వద్ద ముందు వెళ్తున్న కారును డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి రహదారిపై నిలిపాడు. వెనుక ఉన్న ధనుంజయ కారును ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై ఎగిరి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించి ఉన్నా స్టిప్ తెగి పోవడంతో తల నుంచి ఎగిరిపోయింది. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య దీప, కుమారుడు కార్తీక్, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
అద్దెభవనంలో పాఠశాల ప్రారంభం
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారితండాలో అద్దెభవనంలో ప్రాథమిక పాఠశాలను డీఈఓ సత్యనారాయణమూర్తి బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు పక్కాభవనం లేక, ఇన్నేళ్లుగా రేకుల షెడ్డు కింద విద్యార్థులు చదువుతూ ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అద్దెభవనంలో పాఠశాలను ప్రారంభించామని, ప్రతీ నెల అద్దెను జిల్లా విద్యాశాఖ చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కాలేరు యాదగిరి, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్, డీఎస్ఓ అప్పారావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శ్రీశైలం, సంతోష్ పాల్గొన్నారు. పాఠశాలల్లో మొక్కలు నాటాలిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మొక్కలు నాటాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి ఈదులపూసపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం వన మహోత్సవం నిర్వహించగా.. డీఈఓ సత్యనారాయణమూర్తి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణ, ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాలల హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, వీరయ్య, కౌన్సిలర్ స్పందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల విద్యుద్దీకరణ పూర్తి చేయాలి
హన్మకొండ : అంగన్ వాడీ కేంద్రాల విద్యుద్దీకరణ పనులు ఈ నెల 10వ తేదీలోపు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(వీసీ)లో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్ వి.మోహన్ రావు, చీఫ్ ఇంజినీర్ సురేందర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ, ఖమ్మం, ములుగు, రాజన్న సిరిసిల్ల సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, కన్స్ట్రక్షన్ డీఈలు, ఉద్యోగులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించే పనుల పురోగతిపై ఈ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ఇంకా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ, ఖమ్మం, ములుగు, రాజన్న సిరిసిల్ల సర్కిళ్లలోని అంగన్వాడీ కేంద్రాల విద్యుద్దీకరణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుద్దీకరణ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా -
అరకొర వసతులు
ఇరుకు గదులు ..వరంగల్ స్పోర్ట్స్: క్రీడా పాఠశాలను జిల్లాకు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. ప్రారంభమైన రోజు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు అటువైపు తిరిగి కన్నెత్తి చూడలేదు. క్రీడాకారులకు మెరుౖగైన వసతులు కల్పించామా.. పిల్లలకు ఏమైనా సమస్యలున్నాయా అని ఆరాతీసిన వారే కరువయ్యారు. క్రీడా పాఠశాల ప్రారంభమైన రెండో విద్యా సంవత్సరానికే నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. మెరుగైన వసతులు కల్పించాల్సిన అధికారులు ఏదో నడిస్తే చాలు అన్నట్లు మమ అని పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడా పా ఠశాలపై నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరో ఏడాది కొనసాగడం కష్టమేనని పలువురు వాపోతున్నారు. ఆర్భాటంగా ప్రారంభం.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 16వ తేదీన మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ చేతుల మీదుగా క్రీడా పాఠశాల ఆర్భాటంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలతో తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ పిల్లలను క్రీడా పాఠశాలలో చేర్పించారు. తీరా చూస్తే చెప్పిన మాటలకు ఇక్కడి పరిస్థితులకు పొంతన లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. 141 మంది విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు పలు జిల్లాలకు చెందిన విద్యార్థులతో మొదటి సంవత్సరం క్రీడా పాఠశాలలో 4వ తరగతి కొనసాగింది. ఈ విద్యా సంవత్సరంలో 4 తరగతితో పాటు 5 వ తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ప్ర స్తుతం క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో బాలురు 39, బాలికలు 40 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 5వ తరగతిలో బాలురు 34 మంది, బాలికలు 28 మంది ఉన్నట్లు క్రీడాశాఖ అధికారులు తెలిపారు. విద్యాబోధన కోసం ముగ్గురు ఉపాధ్యాయినులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రిన్సిపాల్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కరువైన ధోబీ.. క్రీడా పాఠశాల చిన్నారుల బట్టలు ఉతికేందుకు ధోబీ లేకపోవడం బాధాకరం. గత ఏడాది ధోబీ బట్టలు ఉతకగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ధోబీని నియమించడంలో క్రీడాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నం తినడమే సరిగా రాని చిన్నారులు వారి బట్టలను వారే ఉతుక్కోవాల్సిన దుస్థితి నెలకొనడం శోచనీయం. బాటిల్ నీళ్లతోనే సరి.. చిన్నారులు మెస్లో భోజనం చేసిన అనంతరం బాటిల్లో వాటర్ పట్టుకుని రావాల్సిందే. బాటిల్లో నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు. స్పో ర్ట్స్ స్కూల్ విద్యార్థులు పడుకునే గదుల్లో కనీసం తాగునీటి వసతి కల్పించకపోవడం అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.ధోబీ కావాలని ప్రతిపాదనలు పంపించాం..గత విద్యా సంవత్సరం చేసిన ధోబీ రేటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో మానేసింది. దీంతో ధోబీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పిల్ల లు పడుకునే గదుల వద్ద తాగునీటి కోసం త్వరలోనే రిఫ్రిజరేటర్లను ఏర్పాటు చే స్తాం. దోమల బెడద నుంచి కిటికీలకు మెష్ డోర్లను సైతం ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతానికి నాలుగు గదుల్లో 73 మంది విద్యార్థులను సర్దుబాటు చేశాం. ఇంకో రెండు గదులు కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. వీలైనంత తొందర్లోనే గదుల కొరత లేకుండా చూస్తాం. – ప్రశాంత్, డీవైఎస్ఓ, హనుమకొండ4 గదులు.. 73 మంది బాలురు 4, 5 తరగతులకు 68 మంది బాలికలు, 73 మంది బాలురు ఉన్నారు. రాత్రి బస అనంతరం పడుకోవడానికి బాలికలను స్టేడియంలోని రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్కు చెందిన సీనియర్ క్రీడాకారిణులతో జత చేర్చారు. బా లురకు మాత్రం 4 గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 10 బెడ్లు వేయగా రెండు బెడ్లలో ముగ్గురు పడుకునేలా ఏర్పాటు చేశారు. కాగా, బెడ్షీట్లు, దుప్పట్ల పంపిణీ కరువవయ్యారు. కిటికీలకు మెష్ లేకపోవడంతో రాత్రంతా విద్యార్థులు దోమలతో సహవాసం చేస్తున్నారు. టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడంతో దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులే బట్టలు ఉతుక్కోవాలి బెడ్షీట్లు, దుప్పట్ల పంపిణీ కరువు దోమలతో విద్యార్థుల సహవాసం తాగునీటికి తప్పని తిప్పలు చతికిలపడిన క్రీడా పాఠశాల నిర్వహణ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట -
గోల్డ్చైన్ చోరీ.. మహిళ అరెస్ట్
రఘునాథపల్లి: గోల్డ్చైన్ చోరీ చేసిన మహిళను రఘునాథపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన గుడి ప్రమీల ఇంట్లోకి గతనెల 23న తాళ్లమూడి శైలజ వచ్చింది. మాయమాటలతో అక్కడే బసచేసి తెల్లవారుజామున తులం బంగారు గొలుసుతో శైలజ పరారైంది. బుధవారం రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోల్డ్ చైన్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇవే తరహా నేరాలకు ఆమె పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం జనగామ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఆమెను నర్సంపేట జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పుస్తెలతాడు చోరీ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 13వార్డుకు చెందిన ఎంపెల్లి సరోజన మెడలో బంగారం పుస్తెలతాడును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇంటి వద్ద వరండాలో నిద్రిస్తుండగా మెడలో నుంచి 3.15 తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. -
గురుకులాలకు వచ్చిన ఏకరూప దుస్తుల క్లాత్
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026వ్యవసాయ శాఖ పథకాలపై సమీక్షమహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పథకాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు బుధవారం సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలు, ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలసాగు వివరాలు, ఎరువుల లభ్యత, విత్తన నమూనాల సేకరణపై సమీక్ష నిర్వహించారు. వీసీలో డీఏఓ విజయచంద్ర, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. స్థల పరిశీలనఇనుగుర్తి: మండల కేందంల్రో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని బుధవారం అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పరిశీలించారు. భవన నిర్మాణానికి స్థలం అనుకూలత, సర్వే నంబర్ల వివరాలను రెవెన్యూ అధికారులరు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు త్వరి తగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ బండారు పార్థసారథి, డీఈ లూర్ద్, ఆర్ఐలు బషీర్, మున్వర్ అలీ, దిశ కమిటీ సభ్యుడు గుజునూరి బాబురావు, ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా దర్శన్కుమార్నెహ్రూసెంటర్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)గా దర్శన్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండలో టెక్నికల్ డీఈగా పనిచేసిన ఆయన పదోన్నతిపై మహబూబాబాద్కు బదిలీ అ య్యారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన విజయేందర్రెడ్డి వరంగల్కు బదిలీ అయ్యారు. మీసేవ నిర్వాహకులు మార్గదర్శకాలు పాటించాలిగార్ల: మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించి, దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా మీసేవ మేనేజర్ యుగంధర్ సూచించారు. బుధవారం గార్లలోని మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారదర్శకంగా, నాణ్యతతో సకాలంలో సేవలు అందుతున్నాయా అని మీ సేవకు వచ్చిన దరఖాస్తుదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ మీసేవ కేంద్రంలో సిటిజన్ చార్టర్ ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు. సిటిజన్ చార్టర్లో మీసేవ అందించే సేవలు, సేవల రుసుములు, సేవల కాలపరిమితి, ప్రజల హక్కులను ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. సేవలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఎదురైతే ప్రజ లు నేరుగా జిల్లా మేనేజర్ సెల్ నంబర్ 79950 16039కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుముకు మించి అదనంగా చార్జీలు వసూలు చేయొద్దని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులు అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు అందించలేదు. ఏటా పాఠశాలల పునఃప్రారంభం రోజే ఇవ్వగా..ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దుస్తుల రంగులు మారుస్తాం.. పద్రాగస్టుకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సగం బడులకు మాత్రమే క్లాత్ పంపించింది. ఇందులో కూడా అంగీ క్లాత్ ఉంటే.. లాగు క్లాత్ సరిగా లేకపోవడం.. లాగు క్లాత్ ఉంటే అంగీ క్లాత్ సరిగా లేదు. ఇటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పంద్రాగస్టు వేడుకలకు పాత దుస్తులే దిక్కుగా మారనున్నాయి. సగం పాఠశాలలకు క్లాత్.. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు అవుతోంది. మొదటి రోజు ఇవ్వాల్సిన దుస్తులు ఇప్పటి వరకు అందించలేదు. దుస్తులు కుట్టించేందుకు జిల్లాలకు క్లాత్ పంపిచామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో సగం పాఠశాలలకు కూడా క్లాత్ రాలేదని తెలిసింది. జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్స్, మోడల్ స్కూల్స్ ఇలా మొత్తం 11 విభాగాలకు చెందిన 928 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 71,188 మంది విద్యార్థులు చదువుతున్నారు. చిన్నపిల్లలకు నిక్కర్, షర్ట్, పెద్ద పిల్ల లకు ప్యాంట్, షర్ట్, బాలికలకు టాప్, పర్కిన్, లెగ్గిన్లతో కూడిన రెండు జతలు, ఒక వైట్ డ్రస్ ఇవ్వాలి. మొత్తం 1,68,434 జతలకు గాను ఇప్పటి వరకు 26,940 జతలకు మాత్రమే క్లాత్ వచ్చింది. మిగిలిన క్లాత్ ఇప్పటి వరకు రాలేదు. ఇందులో కేజీబీవీలు, జ్యోతిరావుపూలే, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య పాఠశాలకు మాత్రమే కొన్నచోట్ల రెండు జతలకు, మరికొన్నిచోట్ల ఒక్క జతకు క్లాత్ వచ్చింది. అన్ని విభాగాల పాఠశాలలు 928విద్యార్థులు: 71,188అందిన దుస్తులు: 15,861అందాల్సినవి 55,327● ప్రమాదకర లో–లెవల్ వంతెనపై రాకపోకలకు అనుమతిమరో వారం రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పంద్రాగస్టుకు కొత్త దుస్తులు వేసుకోవడం పరిపాటి. అయితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సగం మందికి కొత్తదుస్తులు లేకపోవడంతో పాత వాటితోనే జెండా పండుగ జరుపుకోనున్నారు. ప్రధానంగా కొన్ని పాఠశాలలు అందులో కేజీబీవీలు, జ్యోతిరావుపూలే, మైనార్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్తో పాటు ఏకలవ్య గురుకులాలకు కొత్తదుస్తులు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 135 గురుకులాలు, పాఠశాలలకు చెందిన 24,069 మంది విద్యా ర్థులకు మెప్మా సంఘాల మహిళలతో, మండలాల్లోని పాఠశాలలు, గురుకులాల్లో చదివే 47,119మంది విద్యార్థులకు ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలతో దుస్తులు కుట్టిస్తున్నారు. అయితే ఇందులో కేజీబీవీల్లో చదివే 352 మంది, జ్యోతిరావుపూలే గురుకులాల్లో చదివే 304 మంది, ట్రైబల్ వెల్ఫేర్లో చదివే 593 మంది విద్యార్థులకు పర్కిన్, పైజామా క్లాత్ రాగా.. టాప్ క్లాత్ తక్కువగా వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, తెలంగాణ మోడల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు క్లాత్ రానందున వారికి పంద్రాగస్టుకు దుస్తులు ఇచ్చే అవకాశం లేదు. పాత దుస్తులతోనే హాజరుకానున్నారు. పాత దుస్తులతోనే.. జిల్లాలోని విద్యార్థుల వివరాలు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరాలో జాప్యం వచ్చిన క్లాత్ కుట్టించేందుకు అధికారుల తంటాలుత్వరగా కుట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం.. జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు పంద్రాగస్టుకు కొత్తదుస్తులు అందించే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో కొన్ని జతలు మెప్మా, మరికొన్ని జతలు సెర్ప్ మహిళలకు అందజేశాం. అవి కుట్టి ఇస్తున్నారు. ఇప్పటి వరకు క్లాత్ రాని చోట్ల త్వరగా క్లాత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరగా దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. – సత్యనారాయణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి -
స్కూల్ యూనిఫామ్ త్వరగా అందించాలి
గూడూరు: ప్రభుత్వం విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మండలంలోని కొల్లాపురంలో శ్రీ సమ్మక్క–సారక్క గిరిజన ఆదివాసీ టైలర్ సంఘం ఆధ్వర్యంలో కుడుతున్న దామరవంచ స్కూల్ పిల్లల యూనిఫామ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా దుస్తులు కుట్టే మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దామరవంచ గురుకులానికి చెందిన 500 మంది విద్యార్థుల యూనిఫామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నీటి కుంటలు సద్వినియోగం చేసుకోవాలి.. భూగర్భ జలాల పెంపు, కరువుకాలంలో పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడే నీటి కుంటలను రైతులు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. మండలంలోని గుండెంగలో వీబీజీ రాంజీ పథకంలో రైతుల పంట భూముల్లో తవ్వించిన ఫామ్ పాండ్స్ (నీటి కుంటలు)లను కలెక్టర్ పరిశీలించారు. కొలతల ప్రకారం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి నీటి కుంటలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈజీఎస్ ఏపీడీ మల్లీశ్వరి, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలి మహబూబాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియకు పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ కోరారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్ఓలు, సూపర్వైజర్లు ఓటరు డిజిటలైజేషన్ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో నిమగన్నమై పని చేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల నాయకులు బీఎల్ఓలకు, అధికారులకు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు మార్నేని వెంకన్న, సురేష్నాయుడు, శ్యాంసుందర్శర్మ, రామారావు, విజయ్కాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ -
మహిళపై కొండచిలువ దాడి
జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న ఓ మహిళపై భారీ కొండ చిలువ బుధవారం దాడికి పాల్పడింది. అప్రమత్తతతో వ్యవహరించిన మహిళ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు గ్రామస్తులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన స్వప్న తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా అక్కడ దాక్కున్న సుమారు 12 అడుగులకు పైగా పొడవున్న భారీ కొండ చిలువ ఒక్కసారిగా ఆమెను నోటితో కరిచింది. ఈ ఘటనతో షాక్కు గురైన స్వప్న ధైర్యం కోల్పోకుండా పాము నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అరుపులు విన్న సమీప రైతులు, కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం కొండ చిలువను చంపి సంచిలో వేసుకుని, గాయపడిన స్వప్నతో కలిసి జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్ కల్నల్ భిక్షపతి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం స్వప్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు. మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా ఘటన -
భద్రతా చర్యలు శూన్యం..
బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక రహదారికి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, ఇనుప రక్షణ కంచెలు, వంతెనపై సీసీ నిర్మాణం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. హైవే అథారిటీ అధికారులు స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, లేదంటే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, హైవే అథారిటీ అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక వంతెన వద్ద రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు దుమ్మ, ధూళి నియంత్రణకు సీసీ నిర్మాణం ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
వీపీఓలు @ పోలీసింగ్ బలోపేతం
● గ్రామ పోలీసు అధికారులతో సేవలు సులభతం ● సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి మహబూబాబాద్ రూరల్: గ్రామస్థాయిలో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడానికి గ్రామ పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేస్తూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో వీపీఓలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తూ వీపీఓలు అందరి మన్ననలు పొందుతున్నారు. వారి విధులు.. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి రవాణా, విక్రయాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ మద్యం తయారీ, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం సేకరించి వెంటనే స్థానిక పోలీసులకు అందిస్తున్నారు. నేరాల నియంత్రణ, రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. పెట్టుబడులు, పార్ట్టైమ్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్టు, కస్టమర్ కేర్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలుపుతున్నారు. ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులను వీపీఓలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ గ్రూపుల ద్వారా పోలీసు శాఖ జారీ చేసే సూచనలు, సైబర్ నేరాల హెచ్చరికలు, మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రభుత్వ సూచనలు, ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే ప్రజలకు చేరవేస్తున్నారు. సందేహాల నివృత్తి.. గ్రామస్తులకు ఏమైనా సందేహాలు, సమస్యలు లేదా పోలీసు శాఖకు సంబంధించిన సమాచారం అవసరమైనప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీపీఓలు వెంటనే స్పందించి సరైన అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు చేరవేసి సత్వర చర్యలు తీసుకునేలా వారధిగా వ్యవహరిస్తున్నారు. ప్రజా భద్రత, చట్టాలపై అవగాహన, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ బాధ్యతాయుత పౌరస్ఫూర్తిని పెంపొందిస్తున్నారు. ప్రజల సహకారంతో సురక్షిత సమాజ నిర్మాణం గ్రామస్తుల సహకారంతోనే నేరరహిత, ప్రశాంత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. గ్రామాలను సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. గ్రామ స్థాయిలో పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడానికి గ్రామ పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేస్తూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో వీపీఓలు కీలక పాత్ర పోషిస్తున్నారు. – డాక్టర్ పి.శబరీష్, ఎస్పీ ప్రత్యేకించి యువత చెడు వ్యసనాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర సామాజిక దురాచారాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సాధన, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో శ్రమిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యువతకు స్ఫూర్తినిస్తున్నారు. జిల్లాలోని ఓ గ్రామంలో స్థానికులతో మాట్లాడుతున్న వీపీఓ(ఫైల్) -
నా శరీరం కాలి మండుతుంది.. చల్లదనం కావాలి
కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం బర్న్స్ వార్డులో ఓ బాధితుడు చల్లదనం కోసం మొరపెట్టుకుంటున్నా డు. ‘కాలిన బొబ్బలతో ఉన్న నా శరీరం మండుతుంది. సల్లగాలి తగులక సల సల కాగినట్లుంది. సార్లు... జెరా చల్లగాలి వచ్చేటట్లు చేయండి’ అంటూ వేడుకుంటున్నాడు. మంగళవారం రాత్రి కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఉర్సు కరీమాబాద్కు చెందిన మెరుగు పవన్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని తీవ్రమైన కాలిన గాయాలకు గురికాగా ఎంజీఎం బర్న్స్ వార్డుకు తరలించారు. అయితే రాత్రి నుంచి మరుసటి రోజు వరకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ శరీరంపై ఉపశమనం కోసం ఏసీలు పనిచేయకపోవడంతో కాలిన గాయాల మంటను తట్టుకోలేకపోయాడని బాధితుడి మిత్రులు తెలిపారు. బుధవారం బాధితుడి బాధ చూడలేక కుటుంబీకులు ఇంటి వద్ద నుంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి కాస్తంతా ఊరట కలిగించారని పేర్కొన్నారు. అయితే దాదాపు నెలరోజుల పైనుంచి వార్డులో ఏసీలు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఎంజీఎం బర్న్స్ వార్డులో ఓ బాధితుడి మొర వార్డులో ఏసీలు పనిచేయక.. టేబుల్ ఫ్యాన్తో ఊరట -
నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలి
● ఎస్పీ శబరీష్ నెహ్రూసెంటర్: సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతీ ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. ‘సురక్షా కా తిరంగా–సైబర్ స్వాతంత్య్ర తెలంగాణ’ అనే సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులతో సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించిన అనంతరం డిజిటల్ సెక్యూరిటీ, ఆన్లైన్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ముఖచిత్రాలు, ఆడియోలు, వీడియోలు సృష్టించి ఉన్నతాధికారులు, స్నేహితులు, అధికా రుల పేరుతో వచ్చే కాల్స్, సందేశాలను నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ ద్వారా అత్యవసర డబ్బు పంపాలని వచ్చే సందేశాలను నమ్మి మోసపోతున్నారని, భవిష్యత్లో ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రతీ అధికారి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకుని తమ ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల్లో 30 శాతం ఇన్వెస్ట్మెంట్ మోసాలే ఉన్నాయని, పదవీ విరమణ ఉద్యోగులు, ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లపై చర్యలు తీసుకుని నేరగాళ్లను గుర్తించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సైబర్ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతీపౌరుడి బాధ్యతని, అప్రమత్తతే సైబర్ మోసాలకు నివారణ అని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైబర్సెల్ ఇన్స్పెక్టర్ నరేష్, జీఎంసీ ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం
పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన కుమ్మరి అంకయ్య (60) మంగళవారం గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. బుధవారం మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, పలిమెల ఎస్సై శశాంక్ అధ్వర్యంలో డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గోదావరిలో ముమ్మర గాలింపు చేపట్టగా మధ్యాహ్నం అంకయ్య మృతదేహం లభ్యమైనట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
విద్యార్థులకు సైబర్ నేరాలపై
అవగాహన కల్పించాలి● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం : విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో సైబర్ నేరాలపై ప్రభుత్వ పాఠాశాల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎంతో సైబర్ మంది నేరగాళ్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు వింటున్నా, సైబర్ నేరాలపై అవగాహన ఉన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారన్నారు. ఇందుకు ప్రధానంగా అత్యాశే కారణమన్నారు. దీంతోపాటు భయం, అత్యవసరం లాంటి కారణాలతో సైబర్ మోసాల బారిన పడుతున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫొటోలపై క్లిక్ చేయడం ప్రమాదమన్నారు. అలాగే, పిల్లలకు ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్పై అవగాహన కల్పించాలన్నారు. ఎంతో మంది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాల ద్వారా పంచుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, విద్యాశాఖ సీఎంఓ సుమ, హనుమకొండ, సైబర్ క్రైం, ఎస్బీ ఏసీపీలు నర్సింహరావు, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్న్స్పెక్టర్లు రంజిత్, శివకుమార్, రవికుమార్,అశోక్, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు
వరంగల్ అర్బన్: లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు. బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్రప్రియాంకతో కలిసి కమిషనర్ లక్ష్మీపురం మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ పరిధిలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను ఆలస్యం లేకుండా సకాలంలో తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలించడంలో జాప్యం అవుతున్నందున చెత్తను ముందుగా బాలసముద్రం ట్రాన్న్స్ఫర్ స్టేషన్న్కు తరలించి అక్కడి నుంచి శాసీ్త్రయ పద్ధతిలో తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రధాన మురుగు కాల్వలు, డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నానన్వెజ్ మార్కెట్ను కమిషనర్ పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్బాబు పాల్గొన్నారు. పథకాలను వేగవంతంగా అమలు చేయాలి మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కేంద్రాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం పోతననగర్లో నిర్మించిన ఆధునిక యాంత్రీకృత ధోభీఘాట్ను మహిళా సంఘాలు లేదా రజక సంఘాల ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వరరావు, ఉప కమిషనర్ సమ్మయ్య, డీఎంసీలు రజితారాణి, రేణుక, పీఎంసీలు రమేశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న -
ఒకటో తేదీన వేతనాలు విడుదల శుభపరిణామం
మహబూబాబాద్ రూరల్: ధూప దీప నైవేద్య పథకం పరిధిలో పనిచేస్తున్న అర్చకులకు ఈ నెల 1వ తేదీన వేతనాలు విడుదలకావడం శుభపరిణామమని డీడీఎన్ గౌరవ అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, గౌరవ సలహాదారు లక్ష్మీనరసింహాచార్యులు, జిల్లా అధ్యక్షుడు చక్రధరాచార్యులు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకుల బాధలను గుర్తించి ప్రభుత్వం ఒకటవ తేదీన వేతనాలు విడుదల చేయడం శుభపరిణామామన్నారు. డీడీఎన్ పరిధిలోని దేవాలయాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ గుర్తింపు ఇచ్చి దేవాదాయ శాఖలో విలీనం చేసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వేతనాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావుకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వరాచార్యులు, వేణుగోపాల్, రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు శిశువుకు శ్రేష్టమైనవిగార్ల: నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని జిల్లా సంక్షేమ అధికారిణి కే.శిరీష అన్నారు. మండలంలోని గోపాలపురం సెక్టార్ పరిధిలోని బాలాజీతండాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం తల్లిపాల నుంచే లభిస్తుందని, తల్లిపాలు ఇవ్వడంతో పిల్లలకు, తల్లికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. తల్లిపాల ఆవశ్యకత, ముర్రుపాల ప్రాముఖ్యతను బాలింతలు, గర్భిణులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సర్పంచ్ భట్టు అనిత నాగరాజు, ఉపసర్పంచ్ బాలు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సూపర్వైజర్ సంపూర్ణ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ.. మహబూబాబాద్: తల్లిపాలు అమృతంతో సమానమని ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమాధికారి కార్యాలయంలో మంగళవారం ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలపై రూపొందించిన పోస్టర్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ చైతన్య, బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ రమేశ్, సంస్థ ప్రతినిధులు వీరన్న, సహజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.53.97లక్షలుకురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.53,97,671 సమకూరినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి తెలిపారు. మార్చి 25వ తేదీ నుంచి ఈనెల 3వ తేదీ వరకు స్వామి, అమ్మవారికి సంబంధించిన 17 హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం లెక్కించినట్లు తెలిపారు. వీరభద్రస్వామి హుండీ ద్వారా రూ.40,53,701, భద్రకాళీ అమ్మవారి హుండీ ద్వారా రూ.13,43,970 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే యూఎస్ఏ డాలర్స్ 101, నేపాల్ రూపీ 40, సింగపూర్ డాలర్స్ 4, ఇరాక్ దినార్స్ 10 వేలు, ఇంగ్లాండ్ పౌండ్స్ 10 వచ్చినట్లు తెలిపారు. హుండీల్లో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం సంచిలో తేదీ రాసి తిరిగి హుండీలో వేయడం జరిగిందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ మహబూబాబాద్ ఇన్స్పెక్టర్ సంజీవరెడ్డి, ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, దొంగల జనార్దన్రెడ్డి, గడీల భిక్షపతి, గుగులోత్ సోమ్లా, శ్రీ లక్ష్మీ శ్రీనివాసా సేవా ట్రస్ట్, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవా ట్రస్ట్, శ్రీ అనంతాద్రి సేవా ట్రస్టు సభ్యులు, శ్రీ దుర్గ శివసాయిసేవా ట్రస్టు సభ్యులు హుండీలను లెక్కించారు. -
నేలకూలిన వృక్షాల ప్రాంతాన్ని పరిశీలించిన సీసీఎఫ్
మంగపేట : ములుగు జిల్లా మంగపేట సమీపంలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతంలో గత నెల 28న భారీ సుడిగాలికి వందకు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైన విషయం తెలిసింది. ఈ ప్రాంతాన్ని మంగళవారం అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్.. డీఎఫ్ఓ వికాస్ మీనాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుడిగాలికి నేలమట్టమైన భారీ వృక్షాలతో పాటు యూకలిప్టస్ ప్లాంటెన్లో పడిపోయిన చెట్లను గుర్తించి నంబరింగ్ ఇచ్చిన వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. ఎక్కువ వయసు కలిగి బలహీనంగా ఉన్న చెట్లు పడిపోయినట్లు తెలిపారు. సాధారణ విజిట్లో భాగంగా విషయం తెలిసి ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎఫ్డీఓ వజ్రారెడ్డి, మంగపేట ఇన్చార్జ్ రేంజ్ అధికారి లాయక్ హుస్సేన్, ఎఫ్బీఓ రవీన్, జ్యోతి, శ్రీకాంత్, తామ్సన్, పుణ్యలత, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
సేవలు అందాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
మహబూబాబాద్ రూరల్: పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా, పారదర్శకంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నా.. జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్ పరిధిలో ఇందుకు భిన్నంగా సేవలు అందుతున్నాయి. సబంధిత పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఒకరికి నోటీసు ఇచ్చే సమయంలో పోలీసులు అడిగిన మేరకు కొంత మొత్తాన్ని బాధితుడు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అతడు వాహనాన్ని కోర్టు ద్వారా విడుదల చేయించుకుని ఉత్తర్వులు తీసుకు రాగా మళ్లీ మరికొంత డబ్బులు కావాలని బాధితుడిని పోలీసులు ఇబ్బందిపెట్టారు. దీంతో సంబంధిత పోలీసు ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆ మొత్తాన్ని బాధితుడికి అప్పగించి వాహనాన్ని విడుదల చేశారు. -
బుధవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2026
చనిపోయిన వారి పేరిట నొక్కేసిన బినామీలు ● ప్రతీ నెల రూ.75 లక్షలకు పైగా పక్కదారి ● ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 2,702, మున్సిపాలిటీల్లో 1,201 పింఛన్ల తొలగింపుజిల్లాలో పింఛన్ల వివరాలుసాక్షి, మహబూబాబాద్ : వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ఆసరాగా ఉండేందుకు అందించే పింఛన్లు పక్కదారి పట్టాయి. చనిపోయిన వారితో పాటు నెలల తరబడి అందుబాటులో ఉండకుండా పోయిన వారి పేరిట వచ్చే పింఛన్ డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటున్న వారి గుట్టురట్టు చేయగా తాజాగా మహబూబాబాద్ పట్టణంతోపాటు బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకునేవారిలో బినామీలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు మొత్తం కలిపి 3,903 బినామీ పింఛన్లు ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా నెలకు రూ.75లక్షలకు పైగా డబ్బులు పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో.. చేయూత పింఛన్లలో జరుగుతున్న అవకతవలపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గతేడాది జూలై నెల నుంచి మొఖ గుర్తింపు పద్ధతి (ఎఫ్ఆర్ఎస్) ద్వారా పింఛన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పద్ధతి ద్వారా పింఛన్లు ఇవ్వడం ప్రారంభించారు. అయితే గతేడాది మార్చిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 94,399 మంది పెన్షనర్లు ఉంటే.. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిన పెన్షన్ల పంపిణీ, వరుసగా మూడు నెలలు పెన్షన్కు రాకపోతే పేరు తొలగించే ప్రక్రియ చేపట్టారు. దీంతో ఇప్పుడు పెన్షనర్ల సంఖ్య 91,697కు చేరింది. అంటే 2,702 మంది పెన్షనర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో సగం మంది చనిపోయిన వారు ఉంటే మిగిలిన సగం పెన్షన్లు బినామీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో ... చనిపోయిన వారి పేరున పింఛన్లు డ్రా చేస్తున్న విషయంపై గ్రామీణ ప్రాంతాల్లో నిగ్గుతేల్చిన అధికారులు ఇప్పుడు మున్సిపాలిటీల గుట్టు రట్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చనిపోయిన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. కానీ పట్టణాల్లో గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెన్షన్లు బ్యాంకుల ద్వారా అందిస్తున్నారు. ఇలా చేయడం మూలంగా గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన వారి పింఛన్ డబ్బులు కాజేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మండలాల్లో మొత్తం 12,569 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇందులో బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకునే వారు 5,603 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరి మొఖ గుర్తింపు తీసుకునేందుకు రెండు నెలలుగా మున్సిపల్ ఉద్యోగులు శ్రమించారు. ఇందులో ఇప్పటి వరకు 4,545 మంది పెన్షనర్లను గుర్తించగా 1,201 మంది అందుబాటులోకి రాలేదు. ఇందులో 483 మంది మరణించినట్లు నిర్ధారించారు. మిగిలిన 718లో అసలైన లబ్ధిదారులు ఉన్నారా.. బినామీలు ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. లబ్ధిదారులుపెన్షన్ రకంగ్రామీణ ప్రాంతాల్లో తొలగించిన పెన్షన్లు 2,702 మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో 1,201రికవరీ చేయిస్తాం.. లబ్ధిదారుడు మరణిస్తే అతని పింఛన్ నిలిపేస్తాం. అయితే కుటుంబ సభ్యులు, ఇతర ఉద్యోగులు ఈ విషయం మభ్యపెడుతున్నారు. దీంతో చనిపోయిన వారి పేరున నెలల తరబడి పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అవుతున్నాయి. మున్సిపాలిటీల్లో మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా బ్యాంకులో పడిన డబ్బులు, డ్రా చేసిన డబ్బులు రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. – మధుసూదన్ రాజు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి -
హైదరాబాద్–గోరఖ్పూర్ రైళ్ల సర్వీస్ల పొడిగింపు
● సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అమలు కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా హైదరాబాద్–గోరఖ్పూర్–హైదరాబాద్ మధ్య నడుస్తున్న రైళ్ల సర్వీస్లను సెప్టెంబర్ 4 నుంచి పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సెప్టెంబర్ 4,11,18, 25వ తేదీల్లో 4 సర్వీస్ల కు గాను హైదరాబాద్–గోరఖ్పూర్ (07075) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో 4 సర్వీ స్లకు గాను గోరఖ్పూర్–హైదరాబాద్ (0707 6) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వె ళ్తుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే అండ్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగ్పూర్లో హాల్టింగ్ కల్పించారు. కామన్మెస్ బిల్లులను పరిశీలించిన కమిటీ.. ● నివేదిక రిజిస్ట్రార్కు అందజేత కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్లో బిల్లులు అధికంగా వచ్చాయని, అవకతవకలు చోటుచేసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలతో ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం విఽధితమే. ముఖ్యంగా బీఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమకు నోడ్యూస్ ఇవ్వాలని, సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన మెస్ బిల్లు తొలుత ఒక్కో విద్యార్థికి రూ. 2,600గా చూపారని, ఆ తర్వాత హాస్టల్ డైరెక్టర్ ఆఫీస్లోని లెడ్జర్లో మాత్రం రూ. 3,100 ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత హాస్టల్ డైరెక్టర్ హయాంలో కొన్ని నెలల మెస్ బిల్లుల పరిశీలనకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ను చైర్మన్గా, ఫార్మసీ కళాశాల డీన్ ఎన్. ప్రసాద్, జూవాలజీ విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య మెంబర్లుగా, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నర్సింహారావు మెంబర్ కన్వీనర్గా కమిటీని నియమించారు. ఆ కమిటీ ఈనెల 2, 3 తేదీల్లో పలు బిల్లులు పరిశీలించింది. అందులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆ నివేదికను మంగళవారం రిజిస్ట్రార్ రామచంద్రంకు సమర్పించింది. అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ కమిటీ సూ చించినట్లు సమాచారం. కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి ఈనెల 6న యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది. అదే రోజు ఆ రిపోర్టును పరిశీలించే అవకాశాలున్నాయని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. కేవీకేను సందర్శించిన అగ్రికల్చర్ విద్యార్థులుమామునూరు : వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్(మధ్యప్రదేశ్)కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు. ఈసందర్భంగా సాగు విధానం, నూతన సాంకేతిక వ్యవసాయ విధానం, గ్రామీణ వనరులు, సౌకర్యాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామాన్ని సందర్శించి ప్రధాన వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రధాన వనరుల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ భవనం, పీహెచ్సీ, పశువైద్యశాల ఇతర వనరులను మ్యాప్ ద్వారా చూపించారు. కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్ అరుణ్జ్యోతి, శాస్త్రవేత్తలు రాజు, గణేశ్, సాయి కిరణ్, మాజీ కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్, గ్రామ పెద్దలు రేగురు లక్ష్మారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, రేగురి రఘుకుమార్రెడ్డి, బండి సాంబయ్య, సల్లూరి రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాప్రగతికి విశేష కృషి
● తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణ, సంచాలకుడు రమేశ్ హన్మకొండ కల్చరల్: విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన పుస్తకాలు అందించి విద్యాప్రగతికి విశేష కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, సంచాలకుడు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ అన్నారు. మంగళవారం వరంగల్ హంటర్రోడ్లోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన కూరపాటి వెంకటనారాయణ, భట్టు రమేశ్కు సన్మా నం, ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాజ్మహ్మద్, బ్రాహ్మణసేవా సమితి నాయకుడు జీవీఎస్ శ్రీనివాసాచారి పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. భట్టు రమేశ్ మాట్లాడుతూ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో జరిగిన పరిశోధనలు అమూల్యమైనవన్నారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ తెలుగు అకాడమీ విద్యారంగానికి విశేషసేవలందిస్తోంన్నారు. బన్న అయిలయ్య మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. రాజ్మహ్మద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యాంశాలు అందించాలని కోరారు. తెలుగు విశ్వవిద్యాలయం డీన్ భూక్య బాబురావు, వి.నాగేశ్వరరావు, వరంగల్ మిత్రమండలి అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, రవీందర్, భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దామోదర్, సురేశ్, రవికుమార్, గోపాల్రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. -
సురక్ష కా తిరంగా
స్వాతంత్య్ర మాసాన్ని పురస్కరించుకుని సైబర్ మోసాలపై పోలీస్శాఖ అవగాహనసైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన జాతీయ సైబర్ జాగృక్తా దివస్ సందర్భంగా నేటి నుంచి ఆగస్టు మాసం చివరి వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గ్రామ పంచాయతీలు, సాధారణ ప్రజల భాగస్వామ్యంతో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయాలి. – ఎస్పీ డాక్టర్ శబరీష్ ● నేడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎస్పీమహబూబాబాద్ రూరల్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో స్వాతంత్య్ర మాసాన్ని పురస్కరించుకుని ‘సురక్ష కా తిరంగా సైబర్ స్వాతంత్య్ర తెలంగాణ’ ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సైబర్ మోసాలపై ప్రచార కార్యక్రమాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నేడు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన.. ఆగస్టు నెల మొత్తం జిల్లాలో సైబర్ నేరాల నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం, సైబర్ నేరాలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇటీవల కాలంలో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బిజినెస్ పెట్టుబడి (ఇన్వెస్ట్మెంట్) మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లోన్ యాప్లు, ఓటీపీ, కేవైసీ, సోషల్ మీడియా, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు అధికంగా జరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘ఆగు ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు’ అనే సందేశాన్ని ప్రతిఒక్కరూ జీవితంలో ఆచరించాలి. -
‘సాహస యువత’కు పురస్కారాలు
తొర్రూరు: సాహస యువతకు సువర్ణావకాశం. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ పేరిట జాతీయ పురస్కారాలు అందించి సత్కరించనుంది. దీనికి కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సాహస పురస్కారానికి కావాల్సిన అంశాలు.. ● భూమిపై చేసిన సాహస యాత్రలు ● సముద్రం, ఆకాశంలో చేసే సాహస యాత్రలు ● అభ్యర్థులు 2023, 2024, 2025 సంవత్సరాల్లో సాధించిన సాహస కృత్యాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ● సాహస కృత్యాల్లో పాల్గొన్న ధ్రువీకరణ పత్రాలు అధికారిక పోర్టల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ● అవార్డు గ్రహీతలకు టెన్సింగ్ నార్గే కాంస్య విగ్రహం, ప్రశంస పత్రం, బ్లేజర్తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. పోర్టల్, దరఖాస్తు తేదీ ఇలా.. http:///awards.gov.in పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 20 తేదీలోపు పైన తెలిపిన పోర్టల్లో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయాలి. ఆఫ్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తారు. మరిన్ని వివరాలకు జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 20 వరకు గడువు -
ఏమనుకుంటున్నావు.. సస్పెండ్ చేస్తా
హన్మకొండ: ‘ముందే చెప్పాను కదా... ఆర్టీసీ ఆస్తులు చూస్తానని. ఇక్కడ మూడు డిపోలు ఉన్నాయని ఎందుకు చెప్పలేదు... బస్టాండ్కు వచ్చిన తర్వాత హనుమకొండ చౌరస్తాలో ఆర్టీసీ స్థలం ఉందని తీసుకెళ్లారు.. ఏమనుకుంటున్నావు... సస్పెండ్ చేస్తా’ అంటూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.. ఆర్ఎం భవానీప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఈడీ సోలోమన్కు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ యారం నాగిరెడ్డి మంగళవారం వరంగల్ రీజియన్ తనిఖీలో భాగంగా ఈడీలు సోలమన్, రాజశేఖర్, వరంగల్ ఆర్ఎం భవానీప్రసాద్తో కలిసి ముందుగా వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ స్థలానికి చేరుకుని పరిశీలించారు. పనులు జాప్యం కావడంతో ‘కుడా’ అధికారులు, కాంట్రాక్టర్పై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ‘కుడా’ అధికారులు ఏప్రిల్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హనుమకొండ చౌరస్తా బస్టాండ్ను పరిశీలించారు. రీజియన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడి నుంచి హనుమకొండ బస్ స్టేషన్కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ.. నేరుగా వరంగల్–2 డిపోనకు చేరుకున్నారు. డిపోలో వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లు పేరుకు పోవడాన్ని చూసి జనావా సాల మధ్య వ్యర్థాలు ఇలా ఉంటే ఎలా అని డిపో మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్–1 డిపోనకు చేరుకుని పరిశీలించారు. డిపోలో స్క్రాప్ చూసి డీఎంపై అసహనం వ్యక్తం చేశారు. స్క్రాప్ భారీగా పోగవడమేమిటని ప్రశ్నించారు. సెల్ఫోన్లో స్వయంగా ఫొటోలు, వీడియో తీసుకున్నారు. గ్యారేజీని, డిపో పరిసరాలను పరిశీలించారు. ఇక్కడి నుంచి హనుమకొండ బస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించారు. రోడ్డుకు దిగువగా ఉండడం ఏమిటి సీనియర్ అధికారులున్నారు.. బ్రెయిన్ పెట్టి పని చేయలేదు... అందుకే వరద నీరు బస్టాండ్లోకి వస్తుందని కరీంనగర్ ఈడీ సోలమన్ను ప్రశ్నించారు. ఇక్కడి నుంచి హనుమకొండ రాంనగర్లోని హనుమకొండ డిపోనకు చేరుకుని పరిశీలించారు. ఈ డిపోలో రవాణ శాఖ అధికారుల తనిఖీలో పట్టుబడిన వాహనాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వాహనాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ను ఆదేశించారు. ఈ క్రమంలో బస్ డిపో ఎదురుగా నిర్మిస్తున్న భవనాన్ని చూసి ఇది ఎక్కడిదని ప్రశ్నించగా ఆర్టీసీ క్వార్టర్స్ స్థలమని, లీజ్కు ఇచ్చామని డిపో మేనేజర్ ధరంసింగ్ చెప్పగా, ఇంతకు ముందు ఎవరో ప్రైవేట్ వ్యక్తులదని చెప్పారని అంటూ సెల్ ఫోన్లో ఫొటో, వీడియో తీసుకున్నారు. ఇక్కడి నుంచి వరంగల్ ములుగు రోడ్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి చేరుకుని పరిశీలించారు. వరంగల్ నగరానికి కేటాయించిన 100 విద్యుత్ బస్సులు వస్తున్న క్రమంలో ప్రతిపాదిత డిపో ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నేరుగా హనుమకొండలోని వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకుని 9 డిపో మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో వారీగా ప్రగతిని సమీక్షించారు. సీ సీఈ కవిత, విజిలెన్స్ ఆఫీసర్ బాబురావు, డిప్యూటీ ఆర్ఎంలు శ్రీహర్ష, కిషన్ రావు, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ వరకు వరంగల్ జిల్లా బస్ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందని ఆర్టీసీ వరంగల్ ఎండీ వై.నాగిరెడ్డి చెప్పారు. అసంపూర్తి సమాచారంపై ఆర్ఎంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆగ్రహం వరంగల్ బస్స్టేషన్ పనుల తనిఖీ, హనుమకొండ బస్స్టేషన్ ఆవరణ, డిపోల పరిశీలన -
ఓపెన్స్కూల్ సువర్ణవకాశం
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ చదువు మధ్యలో నిలిపేసిన విద్యార్థులకు, ఉద్యోగులకు, గృహిణిలకు తిరిగి విద్యను కొనసాగించేందుకు ఒక సువర్ణవకాశమని డీఈఓ ఏ. సత్యనారాయణమూర్తి అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం 2026–27 విద్యా సంవత్సరం ఓపెన్ స్కూల్స్ ప్రవేశాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, మండల విద్యాధికారులు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు తమ పరిధిలో బడిమానివేసిన వారికి అవగాహన కల్పించాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్జీ అనే వెబ్సైట్లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రూ.50 లేటు ఫీజుతో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, అధికారులు శంకర్, గాయత్రి, సతీష్, శ్రీకాంత్, శ్రీనివాస్, ఎంఈఓలు లచ్చిరాంనాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణమూర్తి -
ఆలయ సత్రాలు శిథిలం
కురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన సత్రాలు (గదులు) శిథిలావస్థకు చేరుకోవడంతో దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా సరైన నిర్వహణ, మరమ్మతు లేకపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలవని పరిస్థితి నెలకొంది. ఆలయ పరిధిలో మొత్తం నాలుగు బ్లాకులు ఉండగా ఏ, బీ బ్లాకులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబ్ పైపెచ్చులు ఊడి కిందపడిపోతుండడంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉంది. గదుల్లో భోజనాలు చేసే సమయంలో పెచ్చులూడి పలువురికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి. శిథిలమైన భవనాలను తొలగించాలి ఏళ్ల క్రితం నిర్మించిన సత్రాలు (గదులు) శిథిలావస్థకు చేరుకోవడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం శిథిలమై ఉన్న సత్రాలు మొత్తం భక్తులు నిర్మించుకున్నవే. వాటిని తొలగించి ఫ్రభుత్వ నిధులతో కొత్తగా గదులను నిర్మిస్తే మరో కొన్నేళ్లపాటు భక్తులకు ఇబ్బందులుండకుండా ఉంటుంది. ఆలయ పాలకవర్గం చొరవ చూపి ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి నూతన భవనాలు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. వసతిలేక ఇబ్బందులు పడుతున్న భక్తులు నూతన గదులు నిర్మించాలని వేడుకోలు -
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సీతక్క ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగతా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క భవన్లో ‘మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. 45 రోజుల శిక్షణ పూర్తిచేసిన ప్రతీ అభ్యర్థికి సర్టిఫికెట్ అందజేస్తామని, మేడారం, పరిసర గ్రామాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవించందర్, డీఈఓ సిద్దార్థరెడ్డి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సర్పంచ్ పీరిళ్ల భారతి పాల్గొన్నారు. రామప్ప ఆలయ అభివృద్ధికి రూ. 61.99 కోట్లు వెంకటాపురం(ఎం): మండలంలోని రామప్ప దేవాలయం వద్ద ప్రశాద్ పథకంలో భాగంగా రూ.61.99 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క.. కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప రిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడి గి తెలుసుకుని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూ ర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, టూరిజం డీఈ నటరాజ్, ఏఈ విజయ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, వెంకటాపూర్ మండలం జవహర్నగర్లో రూ.2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా విద్యాలయం నూతన భవనం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
మహిళా ఉద్యోగులకు శక్తి రక్షణ కవచం
సాక్షిప్రతినిధి, వరంగల్: కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తూ జీఓఆర్టీ నంబర్ 277ను మంగళవారం జారీ చేసింది. దీంతో ఈ శాఖ పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే లైంగిక వేధింపులపై అధికారికంగా ఫిర్యాదు చేసి, విచారణ కోరే అవకాశం కలిగింది. నలుగురితో ఐసీసీ.. ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ టు ఎంజీ మాధవి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సెక్షన్ ఆఫీసర్ యు.గాయత్రీదేవి, ఏఎస్ఓ ఎస్.రజితారెడ్డి, ఏఎస్ఓ ఎ.జయశ్రీ సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడినుంచైనా మహిళా ఉద్యోగులనుంచి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను కమిటీ స్వీకరించి, విచారణ జరిపి సమగ్ర నివేదికను రూపొందించనుంది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శికి సమర్పిస్తుంది. విచారణ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అవసరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్లోనూ ప్రాధాన్యం.. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం, ఫిర్యాదుల పరిష్కారానికి ఉద్దేశించిన 2013 నాటి ‘పోష్’ చట్టం ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2023 మే 12న సివిల్ అప్పీల్ నంబర్ 2482/2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వద్ధుల సంక్షేమ శాఖ అన్ని సచివాలయశాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు శక్తి శాఖ తాజాగా ఐసీసీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పరిధిలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి ఆయా కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండనుంది. ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారణ చేపట్టేందుకు ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు లైంగిక వేధింపులుంటే విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్లోనూ పటిష్టంగా అమలు -
గ్రేటర్కు మరో 100 విద్యుత్ బస్సులు
● ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధికి పీఎం ఈ–బస్ సేవలో భాగంగా 100 విద్యుత్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తెలిపారు. వరంగల్ రిజియన్ తనిఖీలో భాగంగా మంగళవారం ఆయన నగర పరిధిలోని వివిధ డిపోలను పరిశీలించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త బస్సులను హనుమకొండ డిపోతో పాటు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో నూతనంగా నిర్మించనున్న డిపోకు కెటాయించనున్నట్లు వివరించారు. 100 బస్సులు ఒకే డిపో ద్వారా నడుపడం సాధ్యం కాదని, రెండు డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుతోపాటు ఈ మేరకు అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్ పోర్టు సమీపంలో ఆర్టీసీకి స్థలం లేదని, మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం, లేదా ఎయిర్ పోర్టు అథారిటీ వారు కెటాయిస్తే పరిశీలిస్తామన్నారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నిర్మాణ సమయంలో ఎత్తు పెంచితే బాగుండేదన్నారు. వరద నీటి నిలువ సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనికి ప్రతిపాదనలు రూపొందించామని, టెండర్లు పూర్తయ్యాయన్నారు. మొత్తానికి ఖర్చు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. -
డ్రగ్ ఫ్రీ క్యాంపస్ లక్ష్యంగా కార్యాచరణ
● కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : డ్రగ్ ఫ్రీ క్యాంపస్ లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల వీసీ, తదితరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పరిధిలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వివిధ కోర్సుల్లో 1.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. కేయూ పరిధిలో కళాశాలల్లోని 356 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా 35,600 మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై సీనియర్ అధ్యాపకుల, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలి పారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లతోపాటుఇతర విద్యార్థులను కూడా ‘మై భారత్ ’పోర్టల్లో నమోదు చే సుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కాగా, లోక్భవనలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మై భారత్’ పోర్టల్లో విద్యార్థుల నమోదు, యూత్ రెడ్క్రాస్ ఏర్పాటు, నషా ముక్త్ భారత్ అభియాన్ అమలులో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంపై జరిగిన చర్చలో ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
తుది దశకు ‘కాళేశ్వరం’ కూల్చివేతలు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా చేపడుతున్న కూల్చివేతలు తుదిదశకు చేరాయి. వారం క్రితం శ్రీశివరామ్ అండ్ కంపెనీ టెండర్ దక్కించుకుని కూల్చివేత పనులు మొదలు పెట్టింది. ముందుగా దక్షిణం వైపు నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. శివుడి విగ్రహం వద్ద పిల్లర్ల దశలో ఉన్న అక్షరస్వీకారం మండపానికి వేసిన పిల్లర్లను తొలగించారు. తర్వాత ప్రాకారాలు నైరుతి మూలన ఉన్న విజయగణపతి, శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం, అద్దాల మండపం, అభిషేక మండపం, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయం, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను తొలగించారు. మంగళవారం ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్న అనివెట్టి మండపం, ప్రధాన ఆలయ మండప పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాత్రి వరకు ప్రధాన ఆలయం తొలగిస్తారు. దక్షిణ, పడమర, ఉత్తర గోపురాలకు ఆనుకుని ఉన్న ప్రాకారాలు తొలగించారు. ఆ మూడు గోపురాలు తొలగిస్తే కూల్చివేత పనులు ముగిసినట్లే అని ఆలయ వర్గాలు తెలిపాయి. తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. -
సమయపాలన తప్పనిసరి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మండల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గూడూరు, కోమట్లగూడెం, కొత్తగూడ, తీగలవేణి, గంగారం పీహెచ్సీల్లో 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సీజనల్ వ్యాధులు ప్రారంభమవుతున్న నేపధ్యంలో విషజ్వరాలు, పాముకాటు, తేలుకాటు మందులు అందుబాటులో ఉన్నాయని, డెంగీ, మలేరియా, జ్వరాల వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తల్లిపాల ప్రాముఖ్యాన్ని వివరించాలన్నారు. విషజ్వరాలను నివారించేందుకు ఇంటింటి సర్వే, డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జీపీ సిబ్బందితో కలిసి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పోగ్రాం అఽధికారి శివకుమార్, డెమో రాజ్కుమార్, స్వామి, పీహెచ్సీల అధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు. ఏజెన్సీ పీహెచ్సీల్లో 24గంటల వైద్యసేవలు గంగారం: ఏజెన్సీ మండలమైన గంగారం మండలంలోని గంగారం, కోమట్లగూడెం పీహెచ్సీలకు 24గంటల వైద్యసేవలు అందించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బి. రవి రాథోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో ఆయా పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ప్రకృతి వ్యవసాయం మేలుదాయకం
● డీఏఓ విజయచంద్ర మహబూబాబాద్ రూరల్ : జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని డీఏఓ విజయచంద్ర అన్నారు. సహజ వ్యవసాయంపై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏఓ మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో ఒక క్లస్టర్ పరిధిలో 125 మంది రైతులతో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారని తెలిపారు. జిల్లాలోని సీఆర్పీ, బీఆర్సీలు సమన్వయకర్తలుగా ఉంటారని, రైతులతో వారు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నేల పరిరక్షణ కోసం తయారు చేయించి, వారి పొలాల్లో వాడే విధ ంగా ప్రోత్సహించాలని సూచించారు. రిసోర్స్ ప ర్సన్, మల్యాల హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రశా ంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ రైతు జైపాల్ రెడ్డి, మరిపెడ ఏడీఏ మురళి, ఏపీఎం బాబు ఉన్నారు. -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈఏడాది మే లో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో నిర్వహించిన మొదటి, రెండో, మూడో, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్తో కలిసి విడుదల చేశారు. మొ దటి సెమిస్టర్లో 25,461మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 7,112మంది (27.93శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండో సెమిస్టర్లో 50,292 మందికి 16,386 మంది (32.58శాతం) ఉత్తీర్ణత సాధించారు. మూడో సెమిస్టర్లో 18,286 మందికి 6,991మంది (38.23శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాల్గవ సెమిస్టర్లో 38,033మందికి 14,619మంది విద్యార్థులు (38.44శాతం) ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్ లో చూసుకోవచ్చని తెలి పారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ నాగరాజు, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఆసిం ఇక్బాల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామావెంకటేశ్వర్లు, నాయకపు సమ్మయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రీవాల్యూయేషన్ కోసం విద్యార్థులకు 15 రోజుల అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆన్లైన్లో నిర్దేశిత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఏ జర్నలిజం ఫలితాలు వెల్లడించలేదు.. ఇదిలా ఉండగా.. బీఏ జర్నలిజం పేపర్ (ఒక సబ్జెక్టు)కు సంబంధించిన ఫలితాలను సాంకేతిక కారణాలతో వెల్లడించలేదని పరీక్షల నియంత్రణాధి కారి రాజేందర్ తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లోనే వెల్లడిస్తామన్నారు. అలాగే యూనివర్సిటీ పరిధిలో తొమ్మిది డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల మొదటి, రెండు, మూడు, నాల్గో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను నిలిపివేశామని తెలిపారు. ఆయా కళాశాలలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన (సీడీసీడీన్, అకాడమిక్ డీన్ ఆఫీస్లకు) వివిధ ఫీజులు చెల్లించలేదని దీంతో ఫలితాలను నిలిపివేసినట్లు రాజేందర్ స్పష్టం చేశారు. ఆయా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. -
కేయూ మహిళా హాస్టల్లో ఆందోళన
● హాస్టల్స్ను, మెస్ను సందర్శించిన రిజిస్ట్రార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్స్, మెస్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పోతన హాస్టల్ ఎదుట విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా పాల్గొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పోతన హాస్టల్ వద్దకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. పోతన హాస్టల్ వద్ద డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేదని దీంతో అపరిశుభ్రతతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హాస్టల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు రిజిస్ట్రార్ రామచంద్రం కలిసి మెస్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా విద్యార్థినులు తమ సమస్యలను రిజిస్ట్రార్కు విన్నవించారు. పరిశుభ్రంగా ఉండడంలేదని సమాయనికి టిఫిన్స్, భోజనం అందించడంలేదని ఆరో పించారు. హాస్టల్ వద్ద దుర్వాసన వెదజల్లుతుందన్నారు. కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. వారంరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థినులకు హాలమీ ఇచ్చారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్, యూనివర్సిటీ అధ్యక్షుడు చెన్నూరి సాయికుమార్, జస్వంత్, రాహుల్, అరుణ్ పాల్గొన్నారు. -
కన్స్ట్రక్షన్ సీఈగా కె.గౌతం రెడ్డి
● టీజీ ఎన్పీడీసీఎల్లో పదోన్నతులు హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్గా కె.గౌతం రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్–2 జనరల్ మేనేజర్గా పని చేస్తున్న గౌతం రెడ్డికి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించడంతో సోమవారం కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, ఏడీఈలు ఇంద్రసేనా రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఆదిలాబాద్ ఎస్ఈగా పని చేస్తున్న శేషారావుకు చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించి సీజీఆర్ఎఫ్ వరంగల్ టెక్నికల్ మెంబర్గా నియమించారు. కార్పొరేట్ కార్యాలయంలో ఐపీసీ ర్యాక్లో డీఈగా విధులు నిర్వహిస్తున్న అమర్నాథ్కు పదోన్నతి కల్పించి పర్చేజ్ అండ్ మేనేజిమెంట్ జనరల్ మేనేజర్గా నియమించారు. హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో టెక్నికల్ డీఈగా విధులు నిర్వహిస్తున్న దర్శన్ కుమార్కు పదోన్నతి కల్పించి మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా నియమించారు. ఖమ్మంలో డీఈగా పని చేస్తున్న చిన్నబాబు రావుకు పదో న్నతి కల్పించి కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్–1 జనరల్ మేనేజర్గా నియమించారు. కొత్తగూడెం ఏడీఈగా పని చేస్తున్న కిరణ్కుమార్కు పదో న్నతి కల్పించి ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో టె క్నికల్ డీఈగా నియమించారు. ఖమ్మం కన్స్ట్రక్షన్ ఏ డీఈగా పని చేస్తున్న కిరణ్ చైతన్యకు పదోన్నతి క ల్పించి ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈగా నియమించారు. -
సీపీఎం రాష్ట్ర నాయకుడు చంద్రారెడ్డి కన్నుమూత
● నర్సంపేట మెడికల్ కళాశాలకు మృతదేహం అప్పగింత దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు పుచ్చకాయల చంద్రారెడ్డి(95) అనారోగ్యంతో మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న చంద్రారెడ్డిని కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పొందుతూ సోమవారం మృతి చెందారు. చంద్రారెడ్డి 1954లో సీపీఐలో చేరి ఎనిమిది మందితో గ్రామశాఖను ప్రారంభించి, కొంత కాలానికి సీపీఎంలో చేరి నర్సంపేట డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యుడిగా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సేవలందించారు. తన మరణం అనంతరం మృతదేహాన్ని వైద్య పరిశోధన కోసం మెడికల్ కళాశాలకు అందించాలని చంద్రారెడ్డి ముందే రాసుకున్న ప్రకారం.. గ్రామంలో కాసేపు ప్రజల సందర్శన అనంతరం ఆయన కుమారులు భాస్కర్రెడ్డి, జనార్ధన్రెడ్డి, కూతురు అరుణశ్రీ, భార్య మల్లక్క.. నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి ఆధ్వర్యంలో చంద్రారెడ్డి మృతదేహా న్ని అప్పగించారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పార్టీ నేతలతో కలిసి చంద్రారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. చాలా ఏళ్లు పార్టీ అకౌంట్స్ను చాలా నిబ్దదతగా చూశారని గుర్తు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, పాలడుగుల భాస్కర్, జిల్లా కార్యదర్శి రంగయ్య, హనుమకొండ, ములుగు జిల్లా కార్యదర్శులు గాదె ప్రభాకర్రెడ్డి, బీరెడ్డి సాంబశివ, జిల్లా నాయకుడు ఈసంపల్లి బాబు, మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, మహేందర్రెడ్డి, నర్సింహారెడ్డి, మొగిలి, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజా వాణి నిర్వహించగా కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేసి వినతులను త్వరగా పరిష్కరించాలని, లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 145 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పైళ్లకు భద్రతేది? ఫైళ్ల విషయంలో భద్రత లేదని, అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన నోట్ ఫైళ్లు బయటికి ఎలా ఇచ్చారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం కోసం సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు లేకుండా, కనీసం దరఖాస్తు ఇవ్వకుండానే నోట్ఫైళ్లు బయటికి ఎలా వస్తున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్పై శ్రద్ధపెట్టి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● బయ్యారం మండలం బాలాజీపేట గ్రామస్తులు గ్రామంలో ప్రభుత్వ భవనం కోసం కేటాయించిన స్థలం కబ్జా జరుగుతుందని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు. ● జిల్లా కేంద్రానికి చెందిన శంకర్ తన స్థలం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిన లాగిన్లో ఉందని, ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని వినతి ఇచ్చాడు. ● సీనియర్ జర్నలిస్టు మట్టూరి నాగేశ్వర్రావు వైద్యా ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ ప్రజావాణిలో 145 వినతులు -
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క కొత్తగూడ: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక బుక్ తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తామని చెప్పారు. గతంలో మంజూరైన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేస్తే కొత్తవి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు రూప్సింగ్, పదవీ విరమణ చేసిన వజ్జ సారయ్యలను శాలువాతో సత్కరించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు మల్లెల భాగ్యమ్మ, నాయకులు ఇర్ప రాజేశ్వర్, స్కురబోయిన మొగిళి, పుల్సం పుష్పలత, కారోజు రమేష్, మల్లెల రణధీర్, చెన్నూరి మహేందర్, 23 గ్రామపంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్కు జైలుశిక్ష
వరంగల్ లీగల్ : అజాగ్రత్తగా అతివేగంతో లారీ నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇరువురి మృతికి కారణమైన లారీ డ్రైవర్ టి.వెంకన్నకు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ రెండో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్డు జడ్జి బి.అనూష సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లష్కర్సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల విజయ్కుమార్ తన సోదని శ్వేతతో కలిసి 2016 అక్టోబర్ 16న ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి దేశాయిపేటకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ములుగు రోడ్డు జంక్షన్ వద్ద వరంగల్ వైపు నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో విజయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్వేత చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సీతామియ తండాకు చెందిన లారీ డ్రైవర్ టి.వెంకన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో లారీ డ్రైవర్కు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనూష తీర్పు వెల్లడించారు. నా కుమారుడి మృతిపై అనుమానాలు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి కాశిబుగ్గ : హత్యకేసులో నిందితుడిగా ఉన్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన జంగం వెంకన్న అలియాస్ వెంకటేష్ (35) మహబూబాబాద్ సబ్జైలులో అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్నది అబద్ధమని, తనకు అనుమానాలు ఉన్నాయని అతని తల్లి మైసమ్మ మంగళవారం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశ్ నగరంలోని కాశిబుగ్గలో పనిచేస్తుండగా గత నెల 31న గూడూరు పోలీసులు వచ్చి పాత కేసు విషయం ఉందని చెబుతూ తీసుకెళ్లారని తెలిపింది. మహబూబాబాద్లోని సబ్ జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఈనెల 1న జైలులో నొప్పి రావడంతో స్థానికంగా చికిత్స చేయించి, ఎంజీఎంకు తీసుకొచ్చి, 2న చనిపోయాడని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న కుమారుడు 24 గంటల వ్యవధిలో ఎలా చనిపోతాడని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పేర్కొంది. కాగా ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వరంగల్, సిద్దిపేట, నర్సంపేటకు చెందిన ముగ్గురు ఫొరెన్సికల్ ప్రొఫెసర్ల సమక్షంలో మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రైస్ మిల్లర్ల అరెస్ట్శాయంపేట: మండలంలోని గట్లకానిపర్తిలోని లక్ష్మీ నరసింహ, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లు యాజమానులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని గట్లకానిపర్తికి చెందిన లక్ష్మీనరసింహ, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు సీఎంఆర్ వరి ధాన్యం అవకతవలపై తనఖీలు చేశారు. లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో 15,318.14 టన్నులు షార్టేజ్ రాగా, దాని విలు వ రూ.4.42 కోట్లు, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్లో 15,969.87 టన్నులు షార్టేజ్ రాగా, వాటి విలువ రూ.4.61 కోట్లు తేడా వచ్చాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లర్లపై కేసు నమోదు చేసి సోమవారం రైస్ మిల్లల యజమానులు చౌళ్ల లక్ష్మణ్రావు, పెంచాల కిరణ్ను అరెస్ట్ చేసి పరకాల న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు నిందితులకు రిమాండ్ కు విధించింది. ఇద్దరిని పరకాల సబ్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. ఆయన వెంట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేశ్, ఉన్నారు. -
భార్యపై భర్త దాడి
● అడ్డువచ్చిన ఆమె తమ్ముడిపై కూడా.. జనగామ రూరల్: భార్యపై భర్త బెస్ బాల్ బ్యాట్తో దాడి చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్కేశావాపూర్ గ్రామానికి చెందిన మోకు మహేందర్రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహేందర్కు మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలవడంతో మాధవి మే నెలలో సరూర్నగర్లో తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాధవి 2వ తేదీన (ఆదివారం) గ్రామానికి వచ్చింది. పంచాయితీకి భర్త రాకపోవడంతో గ్రామ పెద్దమనుషులు ఇంటి తాళం పగలగొట్టి ఉండమని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం సుమారు 4 గంటల సమయంలో మహేందర్రెడ్డి ఇంటికి వచ్చి వెంట తెచ్చుకున్న బేస్బాల్ బ్యాట్తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన మాధవి సోదరుడిని కూడా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన మాధవిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. దాడి అనంతరం మహేందర్ రెడ్డి ఇద్దరు పిల్లల ను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
12, 13 తేదీల్లో కేయూలో జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), స్టేట్ ఎక్స్ఫర్ట్ అప్రయిజల్ కమిటీ(ఎస్ఈఏసీ) తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో సెనెట్హాల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలెట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్ తెలిపారు. సోమవారం కెమిస్ట్రీ విభాగంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘సినర్జిసింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజిక్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్థిరమైనఅభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్ధలు విద్యాసంస్థల మధ్య సమన్వయ బలోపేతం చేయడంలో భాగంగా ఈసదస్సులో చర్చలు జరుగుతాయన్నారు. ఈనెల 12న సదస్సుకు ముఖ్య అతిథిగా కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ వీసీ ఆచార్య రవీంద్రనాథ్ ప్రారంభోపాన్యాసం చేస్తారని తెలిపారు. జీడిమెట్ల జేఈటీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బక్కారెడ్డి, హైదరాబాద్ టీఎస్డీఎఫ్ ప్రాంతీయ అధిపతి డాక్టర్ రాధాకృష్ణసాయి, హిటెరో డ్రగ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఈహెచ్ఎస్ హరి ప్రొఫెసర్ పీవీ రావు, ఆచార్య శ్రీధర్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈనెల 13న జరిగే సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి జి.రవి, మాజీ సభ్యకార్యదర్శి డాక్టర్ సెన్గుప్తా, రాష్ట్ర ప్రధాన సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, భారత ప్రభుత్వశాస్త్రవేత్త డాక్టర్ సుందర్రామనాథన్, రాష్ట్ర ప్రధాన అటవీశాఖ సంరక్షణాధికారి డాక్టర్ ప్రియాంక వర్గీస్, తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావునాయుడు, రాష్ట్ర ఎక్స్ఫర్ట్ అప్రైయిజల్ చైర్మన్ డాక్టర్ రాంగోపాల్రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సుకు ఇప్పటికే దేశంలో వివిధ యూనివర్సిటీలు, వివిధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు 150మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కెమిస్ట్రీ విభాగం అధిపతి ఆచార్య వాసుదేవరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మమత తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన రిజిస్ట్రార్ రామచంద్రం -
మత్తడి @ రెండు చెరువులు
మహబూబూబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువుల్లో కొంతమేర నీటిమట్టం పెరిగింది. జిల్లాలో 1,590 చెరువులకు గానూ 221 చెరువులు నిండగా.. అందులో రెండు చెరువులు మాత్రమే మత్తడి పోస్తున్నాయి. అయితే చెరువుల కింద ఆయకట్టు రైతులు వానాకాలం పంటపై ఆశలు పెంచుకుంటున్నారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండి పంటలు సాగు చేస్తామని భావిస్తన్నారు. అయితే ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం. జిల్లాలో 1,590 చెరువులు.. జిల్లాలోని 18 మండలాల్లో 1,590 చెరువులు ఉండగా.. అందులో 1,097 చెరువులు 25శాతం నిండాయి. 250 చెరువులు 25 నుంచి 50 శాతం, 20 చెరువులు 50నుంచి 75 శాతం, 221 చెరువులు 75 నుంచి 100 శాతం నిండాయి. ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారం మండలంలో రెండు చెరువులు మాత్రమే నిండి మత్తడి పోస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గంగారం మండలంలో 213 చెరువులు నిండాయి. ఎస్సారెస్పీపైనే ఆధారం.. జిల్లాలో ఎస్సారెస్పీ డీబీఎం 48, డీబీఎం 60 కాల్వ లు, ఉపకాల్వల ద్వారా చెరువులకు నీటి సరఫరా చేస్తారు. ప్రతీ సంవత్సరం రెండుసార్లు ఎస్సారెస్సీ జలాలు విడుదల చేస్తారు. డీబీఎం 48కాల్వ కింద 1,24,336 ఎకరాల ఆయకట్టు ఉండగా.. డీబీఎం 60కాల్వ కింద 80,719 ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, ఎస్సారెస్పీ నిండితేనే నీరు విడుదల చేస్తారు. 1,93,850 ఎకరాల్లో సాగు.. వానాకాలం సాగు అంచనా 4,56,136 ఎకరాలు ఉండగా.. నేటి వరకు 1,93,850 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర, మినుములు, జొన్న, ఇతర పంటలు సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుతాయనే ఆశతో రైతులు ఉన్నారు. ఈసారి వర్షాలు తక్కువేనని, ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పించనప్పటికీ రైతులు మాత్రం వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 1,590 చెరువులు.. నిండినవి 221 మాత్రమే మత్తడి పోస్తున్న రెండు తటాకాలు వర్షాలపైనే అన్నదాతల ఆశలు చెరువులు నిండితే సాగు పెరిగే అవకాశం -
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితులను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్ల చోరీలకు పాల్పడుతున్న నిందితులు అనంతరం చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసుల్లో బైక్ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు సీపీ తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి గ్రామం, ఎల్కతుర్తి శివారులో 28 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాహనాల చోరీలు ఇలా... నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో–8, కరీంనగర్ కమిషనరేట్లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్లో –2 హైదరాబాద్ కమిషనరేట్లో–3, రాచకొండ కమిషనరేట్లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు. రూ.25 లక్షల విలువ గల 28 బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ శ్వేత -
అన్ని ఎరువులకు ఒకే యాప్
జనగామ/సంగెం/ కొత్తగూడ: రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం యూరియాను మాత్రమే యాప్ ద్వారా పంపిణీ చేస్తుండగా ఇక నుంచి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకూ వర్తింపజేయడానికి కేంద్రం కొత్త యాప్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్)ను తీసుకొస్తుంది. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతోపాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు మరో కొత్త యాప్ రైతుల ముందుకు రానుంది. ఇప్పటివరకు యూరియా బుకింగ్ కోసం వినియోగిస్తున్న ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ స్థానంలో ‘ప్రేమ్వర్క్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్)అనే పేరుతో యాప్ను తీసుకోస్తున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన యాప్ స్థానంలో మరో కొత్త యాప్ అమల్లోకి రానుండడంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా యూరియాతో పాటుగా రైతుకు అవసరమైన డీఏపీ, పోటాస్, 20–20–0–13, 28–28–0, 14–35–14, 15–15–15, 16–16–16 వంటి ఇతర కాంప్లెక్స్ ఎరువులన్ని బుకింగ్ చేసుకుని కొనుగోలు చేసే విధంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అవకాశం కల్పిస్తున్నది. ఒకే కేంద్రంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేకపోతే వేర్వేరు ఎరువులకు వేర్వేరు డీలర్లను ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కూడా యాప్లో కల్పించారు. కొత్త యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్కు లింక్ అయిన ఫోన్నంబర్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. భూమి ధ్రువీకరణతో.. ఎరువుల కొనుగోలు సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్ను స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతీ ఒక్కరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని రైతు ఆధార్ నంబర్గాని, రైతు రిజిస్ట్రేషన్ నంబర్ గాని నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆతర్వాత రైతుకు ఉన్న భూమి సర్వే నంబర్లవారీగా కనిపిస్తుంది. ఆయా సర్వేనంబర్లలో ఏ పంటను సాగుచేశారో నమోదు చేయాలి. ఎరువు, పరిమాణం నమోదు చేయాలి. తనకు అవసరం ఉన్న ఎరువు ఏ రిటైలర్ షాపులో ఉన్నవో ఎంచుకోవాలి. రైతు స్వయంగానా లేదా మరోకరికోసమా ధ్రువీకరించాలి. సంప్రదింపుల కోసం ఫోన్ నంబర్ను నమోదు చేయాలి అపుడు క్యూ ఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను తీసుకుని ఎంచుకున్న రిటైలర్ వద్దకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.ఉమ్మడి వరంగల్లో సాగు లక్ష్యం (ఎకరాల్లో) జిల్లా సీజన్ లక్ష్యం హనుమకొండ 2,38,964 వరంగల్ 2,81,943 జనగామ 3,59,281 మహబూబాబాద్ 3,71,318 ములుగు 1,29,824 జేఎస్. భూపాలపల్లి 2,11,670 మొత్తం 15,93,000 కొత్తగా రూపొందించిన కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు శిక్షణకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే యాప్ ఏజెన్సీ రైతులకు శాపంగా మారనుందా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన యూరియా యాప్లో పట్టా, హక్కు పత్రాలు ఉంటే వాటి నంబర్ ఆధారంగా.. అలాగే ఎలాంటి ఆధారాలు లేని రైతులకు వ్యవసాయాధికారుల ధ్రువీకరణతో ఆధార్ నంబర్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాప్లో అలాంటి వెసులుబాటు లేదు. భూమి రికార్డులు తప్పనిసరి చేసింది. ఇలా అయితే ములుగు, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల రైతులకు శాపంగా మారనుంది. ఇక్కడి చాలామంది గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు లేవు. ఇక గిరిజనేతర రైతులకు అసలే రికార్డులు ఉండవు. వీరి వ్యవసాయానికి ఎరువులు ఎలా వస్తాయి. ఇదిలా ఉంటే ఇక్కడి గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ ఉండవు. చాలా మంది రైతులకు సెల్ఫోన్ వినియోగించడమే రాదు. వారు ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలి.. వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి అంటూ చర్చ సాగుతోంది. ప్రారంభ దశలోనే ఉంది..యాప్ ప్రారంభ దశలో ఉంది. కొన్ని జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడ వస్తున్న సమస్యలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. రైతులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులు దుర్వినియోగం జరగకుండా కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. – విజయచంద్ర, డీఏఓ మానుకోట -
నాణ్యమైన పోలీసు సేవలే లక్ష్యం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు మరింత నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బందికి వారంరోజుల ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ సమావేశ మందిరంలో సోమవారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ విధులు, దర్యాప్తు విధానాలు, రికార్డుల నిర్వహణ, చట్టాల అమలు, ఎఫ్ఐఆర్ నమోదు, కేసు డాక్యుమెంటేషన్, కోర్టు సంబంధిత ప్రక్రియలు, ప్రాక్టికల్ అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగాలంటే ప్రతీ కేసు చట్టబద్ధంగా, పారదర్శకంగా, నాణ్యతతో దర్యాప్తు జరగాలన్నారు. ప్రతీ పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిపాలనలో రైటర్ల పాత్ర అత్యంత కీలకమని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పత్రాన్ని నిర్దేశిత సమయంలో సిద్ధం చేయాలని, చట్టాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీసు సిబ్బంది తమ విధులను బాధ్యతగా కాకుండా ప్రజాసేవగా భావించాలని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రతీరోజు విధుల్లో అమలు చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. -
ఈ నెల 7వరకు తల్లి పాల వారోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు
తొర్రూరు: శిశువుకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లి పాలు తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగం, అనారోగ్య సమస్యలు, సౌందర్యంపై మక్కువతో కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. పలు అపోహల వల్ల చాలా మంది తల్లులు పిల్లలకు బయటి పాలు పట్టిస్తుంటారు. దీంతో పిల్లల్లో పూర్తిస్థాయిలో రోగ నిరోధక శక్తి లేక తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏటా ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఎందుకు ప్రాధాన్యం అంటే.. తల్లిపాలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు, గుండె, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. తల్లి పాలు అందకుంటే చిన్నారులు న్యుమోనియా, అతిసారం వంటి వ్యాధులతో పాటు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలు ఇవ్వకుంటే తల్లుల్లో కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని అవగాహన కల్పిస్తున్నారు. తల్లికి ఎంతో మేలు.. ● చనుబాలు పట్టే తల్లులకు కేలరీలు కాస్త ఎక్కువగా ఖర్చవుతాయి. పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్.. గర్భసంచి పూర్వ స్థితికి రావడానికి, కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గడానికి దోహదపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గుతారు. ● రొమ్ము క్యాన్సర్ ముప్పు 28 శాతం, అధిక రక్తపోటు ముప్పు 11 శాతం, షుగర్ తలెత్తే ప్రమాదం 26 శాతం చొప్పున తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపట్టే కార్యక్రమాలివి.. ● ప్రతీ గ్రామం, వార్డుల్లో పాలిచ్చే తల్లులకు కౌన్సెలింగ్తో పాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన ● ఆస్పత్రులను సందర్శించి శిశువు పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టేలా అవగాహన కల్పించడం, ఆస్పత్రులు, ఐసీడీఎస్ కార్యాలయాల్లో వాల్ పోస్టర్లు అతికించడం ● పని ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థల అధిపతులను చైతన్యపర్చడం ● అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు నిర్వహించడం ● పాలిచ్చే పద్ధతులు, చిన్నారుల బరువు, ఎదుగుదలపై అవగాహన ● అన్న ప్రాసనపై అవగాహన, అంగన్వాడీ కేంద్రాల్లో సరైన సమయానికి అనుబంధ ఆహారం ప్రారంభించడం, రెండేళ్ల వరకు తల్లి పాలిచ్చేలా చైతన్య కార్యక్రమాలు ● 6 నుంచి 24 నెలల వయసున్న చిన్నారుల ఇళ్లను సందర్శించి తల్లి పాలతో పాటు ఆహారంపై అవగాహన కల్పించడం, ఆరు నెలల్లోపు చిన్నారులకు తల్లిపాల ఆవశ్యకతను వివరించడం -
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లికి 126, మహబూబాబాద్కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి. మనదే అత్యధిక వాటా.. పోలీస్ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 721, ఏఆర్ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్, 2 మహిళా వార్డర్ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ కానిస్టేబుల్, 15 ఫైర్ ఫైటర్, 11 పురుష వార్డర్, ఒక మహిళా వార్డర్ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి.పోలీస్ ఉద్యోగం ప్రజాసేవకు మంచి అవకాశంపోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు. ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం. అర్హత ఉన్న ప్రతీ అభ్యర్థి నోటిఫికేషన్ను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలకు ఇప్పటినుంచే క్రమశిక్షణతో సిద్ధం కావాలి. ఎలాంటి మధ్యవర్తులను నమ్మకుండా ప్రతిభతో ఉద్యోగం సాధించాలి. అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. – రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్), వరంగల్ కమిషనరేట్పట్టుదలతో కృషి చేస్తే విజయంఉద్యోగాల నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. మీ విజయం మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండవరంగల్ కమిషనరేట్ పరిధిలో 656 ములుగుకు ప్రాధాన్యం కింద 189 పోస్టులు.. మూడు జోన్లలో మరో 101 మందికి అవకాశాలు -
బాక్సింగ్ కోచ్గా రాణించడమే లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్: బాక్సింగ్ అంటేనే ప్రత్యర్థి ముఖంపై పిడిగుద్దులతో ఊపిరాడకుండా చేయడం. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ పోరాడాదే ముష్టియుద్ధం. అందుకే బాక్సింగ్ అంటేనే భయపడుతుంటారు. అయితే, బాక్సింగ్లో రాణించాలంటే కండ బలం ఉంటే సరిపోదు .. అందుకు బుద్ధిబలం తోడైనప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఎలాగైనా బాక్సింగ్లో రాణించాలన్న ఓ యువతి లక్ష్యానికి తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తి తో డైంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు కఠోర శ్రమ చేసి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక పతకాలు సాధించింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు.. తాను సాధించిన పతకాలకు తోడు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక రికార్డు సొంతం చేసుకుంది. బాక్సింగ్లో నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) పాటియాలలో శిక్షణ పూర్తి చేసుకున్న తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యేక రికార్డు సాధించిన హనుమకొండలోని పద్మాక్షికాలనీకి చెందిన చుక్క దివ్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. హనుమకొండ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ కాలేజీలో పీజీ (ఎంఏ) చదువుతున్న దివ్య 2016లో బాక్సింగ్ క్రీడలో అరంగేట్రం చేసింది. హనుమకొండ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బాక్సింగ్హాల్లో శిక్షణ తీసుకున్న దివ్య పదేళ్లలో 12 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. 12 బంగారు పతకాలు సాధించడం ఆమె ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం. పంజాబ్లోని పాటియాలలో 2025–26లో ఎన్ఐఎస్లో సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుంది. దేశ వ్యాప్తంగా 54 మంది మహిళలు శిక్షణ తీసుకోగా అందులో దివ్య 6వ స్థానంలో నిలవడం విశేషం. ఎన్ఐఎస్ శిక్షణ పూర్తి చేసి తొలి క్రీడాకారిణిగా రికార్డు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొన్న యువతి తండ్రి స్ఫూర్తితో బాక్సింగ్లో రాణిస్తున్న చుక్క దివ్య -
ముగిసిన జిల్లాస్థాయి బాల్బ్యాడ్మింటన్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్బ్యాడ్మింటన్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎంపిక పోటీలు సాయంత్రం ముగిశాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు అడ్హక్ కమిటీ కన్వీనర్ రవీందర్కుమార్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 8, 9 తేదీల్లో వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ జిల్లా అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వీవీ రమణ, పరిశీలకులు బంగారు రాజన్న, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. రూ. 62,670 విలువైన మద్యం పట్టివేత సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో బెల్టుషాపుల్లో విక్రయిస్తున్న రూ. 62,670 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదివారం దాడులు చేయగా గ్రామానికి చెందిన గుర్రం సాంబయ్య కిరాణాషాపులో రూ.36,530, చెవ్వ బాలయ్య కిరాణాషాపులో రూ. 17,560, చెవ్వ మొగిళి కిరాణాషాపులో రూ. 8,580.. మొత్తం రూ. 62,670 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని నిర్వాహకులను తదుపరి చర్యల నిమిత్తం సంగెం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ పెండ్యాల దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్లగూబను పోలిన వింత చేప! చిన్నగూడూరు: గుడ్లగూబను పోలి ఉన్న వింత చేప ఓ వ్యవసాయ బావిలో లభ్యమైన ఘటన మండలంలోని విస్సంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విస్సంపల్లి గ్రామానికి చెందిన రైతు ఈరబోయిన సుధాకర్ ఆదివారం వ్యవసాయ బావి నుంచి పొలానికి నీళ్లు పారిస్తున్న క్రమంలో లభించినట్లు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బావిలో నీరు అడుగంటడంతో చేప కనిపించింది. వెంటనే బావిలోకి దిగి వింత చేపను చాకచక్యంతో పట్టుకున్నాడు. అరుదుగా కనిపించే ఈ చేపను స్థానికులు రాక్షసి చేపగా పిలుస్తున్నారు. విద్యుత్ మోటారు చోరీ దంతాలపల్లి: విద్యుత్ మోటారు చోరీకి గురికావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సోమారపు కవితకు చెందిన వ్యవసాయ భూమి వద్ద ఉన్న విద్యుత్ మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో స్టేడియాలు చూస్తే బాధగా ఉండేది
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ స్పోర్ట్స్ : ‘హెదరాబాద్ బషీర్బాగ్లో మా ఆఫీస్ ఉండేది. బందోబస్తు లాంటి అనేక సందర్భాల్లో పక్కనే ఉన్న ఎల్బీ స్టేడియానికి వెళ్తే అక్కడి పరిస్థితులు చూస్తే బాధగా ఉండేది’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. రెండో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్ సెమినార్ ఆదివారం హనుమకొండ ‘కుడా’ కాంప్లెక్స్లోని శ్రీహర్ష కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతో మంది మెడలిస్టులను తయారు చేసిన ఎల్బీ స్టేడియం నగరం మధ్యలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందనే బాధగా ఉండేదన్నారు. నెల రోజుల క్రితం వరంగల్కు రాగానే, ఉదయం రన్నింగ్కు వెళ్లాలని తమ సిబ్బందితో చెబితే జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి తీసుకొచ్చారన్నారు. స్టేడియం చూడగానే సంతోషంతో పాటు గర్వంగా అనిపించిందన్నారు. ఇక్కడి ప్రజలు, అసోసియేషన్, కోచ్లు, క్రీడాకారులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఇక్కడి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎప్పటికై నా తెలంగాణకు వరంగల్ స్పోర్ట్స్ హబ్గా కావాలని కోరుకుంటున్నానన్నారు. వరంగల్ క్రీడాకారుల అభివృద్ధికి తమ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సీపీ శ్వేతకు ట్రాక్ సూట్ అందజేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిసోర్స్ పర్సన్ హరిదాసు, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. సారంగపాణి, వరంగల్ జిల్లా చైర్మన్ గట్టు మహేశ్బాబు, అసోసియేషన్ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, టెక్నికల్ కమిటీ చైర్మన్ జి.జగన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరస్వామికి అన్నపూజ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ చవితి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల మహాగణపతికి హరిద్రాకుంకుమ విలేపనాభిషేకం, గరికపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్కు చెందిన శివభక్తుడు వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ సౌజన్యంతో 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్ర పఠనంతో రుద్రేశ్వర మహాశివలింగాన్ని రుద్రగణపతిగా అలంకరించి అన్నపూజ చేశారు. అనంతరం మహాహారతి, మహానివేదన, నీరాజనమంత్రపుష్పం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ కుటుంబ సభ్యులతో దేవాలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
స్వతంత్రతను కోల్పోతున్న రాజ్యాంగ సంస్థలు
నయీంనగర్: దేశంలోని రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోతున్నాయని వక్త కల్పన కన్నాభిరాన్ అన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్ కుమార్ రచించిన వీధి బతుకులు విస్థాపనులు, సజీవ స్మృతులు పుస్తకాలను ఆదివారం కల్పన కన్నాభిరాన్ ఆవిష్కరించి మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలపై పరిశోధనలకు అనుమతులు ఇవ్వడం లేదని, కొన్ని అంశాలకు మాత్రమే అనుమతి ఇస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ జీవన్కుమార్ తన 30 ఏళ్ల మానవ హక్కుల కార్యాచరణలో భాగంగా ప్రస్తావించిన సమస్యలు ఇప్పటికై నా పరిష్కారమైతే బాగుండని అన్నారు. సామాజిక సమస్యలను ప్రస్తావించే తమలాంటి వారిపై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాల రచయిత జీవన్కుమార్ సమావేశంలో తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డా.తిరుపతయ్య, కాత్యాయనీ విద్మహే, వేమన వసంతలక్ష్మి, దేవులపల్లి అమర్, విమల, మెట్టు రవీందర్, కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
భయం లేదు.. భద్రత లేదు
● గురుకులాలు, హాస్టళ్లలో పెరుగుతున్న బాలికల మిస్సింగ్ సంఘటనలు ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులుసాక్షి, మహబూబాబాద్: గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో బిడ్డలకు భద్రత ఉంటుందని నమ్మిన తల్లిదండ్రుల్లో జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎదిగే దశలో బాలికల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కౌన్సెలింగ్, గైడెన్స్ లేకపోవడం, రక్షణగా ఉండాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రచారం జరగడంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో అనే మీమాంసలో తల్లిదండ్రులు ఉన్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. 16వేల మందికి పైగా బాలికలు.. జిల్లాలోని ఆశ్రమ, గురుకులాల్లో మొత్తం 16వేలకు పైగా బాలికలు చదువుకుంటూ ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో ప్రధానంగా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జ్యోతిరావుపూలే, ఆశ్రమ, మైనార్టీ, ఎకలవ్య, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్ మొదలైన కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో ఐదో తరగతి నుంచి డిగ్రీ, మెడిసిన్, ఫార్మసీ వరకు చదివే విద్యార్థులు ఉంటున్నారు. వీరందరూ జిల్లాలోని నలుమూలలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉంటారు. వరుస సంఘటనలతో ఆందోళన.. పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకోసం ప్రభుత్వ ఆశ్రమాల్లో ఉంచితేనే మేలని నమ్మిన తల్లిదండ్రులను వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల నుంచి పిల్లలు బయటకు పోవడం, రోజుల తరబడి అటు ఇంటికి, ఇటు పాఠశాలలకు, కళాశాలలకు రాకుండా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనే జరిగిన పలు సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారాయి. -
16 రకాల నిత్యావసరాలు అందించాలి
నెహ్రూసెంటర్: ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి, కేరళ తరహాలో 16 రకాల నిత్యవసరాలను అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందజేయడం లేదని, ప్రజల అవసరాలకు అనగుణంగా పంపిణీ చేసే సరుకుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న నిర్వహించనున్న జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాదుల శ్రీనివాస్, అల్వాల వీరయ్య, ఎండీ.యాకూబ్, వంగూరు వెంకటేశ్వర్లు, బాణాల రాజన్న, గోడిశాల వెంకన్న, కుంట ఉపేందర్, పాల్వాయి దుర్గయ్య, ఆనంద్రావు, కుంట రామకృష్ణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హులైన ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని, ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులందరు, ఉపాధ్యాయుల ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ సాయత్రం 5గంటల వరకు జిల్లా వి ద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. పోలీస్ శిక్షణ ప్రవేశ పరీక్ష ప్రశాంతం మహబూబాబాద్ అర్భన్: జిల్లా కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయం, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శ్రీ చైతన్య హైస్కూల్, తొర్రూరులోని సమత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,058 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టడంతో పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో సజావుగా ముగిసింది. అభ్యర్థులకు అవసరమైన సూచనలు అందించడంతో పాటు రవాణా సౌకర్యం అవసరమైన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా వాహన సౌకర్యం కల్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్ అందించడంతో పోలీస్ ఉద్యోగాల సాధనకు తోడ్పడడం ఆనందంగా ఉందన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డోర్నకల్ డయోసీస్ బిషప్గా సేనంరాజు డోర్నకల్: ప్రతిష్టాత్మక చర్చి ఆఫ్ సౌత్ ఇండియా డోర్నకల్ డయోసీస్ 10వ బిషప్గా రెవ సేనంరాజు నియమితులయ్యారు. స్థానిక ఎఫిఫనీ చర్చిలో ఆదివారం డయోసీస్ బిషప్గా సేనంరాజు పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఎఫిఫనీ చర్చిలో సీఎస్ఐ మోడరేటర్, కరీనగర్ బిషప్ రూబెన్ మార్క్ సేనంరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం బిషప్గా సేనంరాజు పట్టాభిషక్తుడయ్యారు. అనంతరం ఎఫిఫనీ చర్చి ఆవరణలో జరిగిన సన్మానభలో బిషప్ సేనంరాజు, విజయసేనంరాజు దంపతులను సీఎస్ఐ మోడరేటర్ రూబెన్ మార్క్ సన్మానించారు. ఈ సందర్భంగా సేనంరాజు మాట్లాడుతూ.. డోర్నకల్ డయోసీస్ పరిధిలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తామని తెలిపారు. నియామకాలు, బదిలీలు, ఇతర విషయాల్లో ఎలాంటి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందరి సహకారంతో డోర్నకల్ డయోసీస్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
నల్లబెల్లం పౌడర్ ముఠా గుట్టురట్టు
జనగామ : నల్లబెల్లం పౌడర్తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని అపహరించిన ముఠా గుట్టును ఎకై ్సజ్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో నల్లబెల్లం పౌడర్, ఆలంను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎన్.అంజిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన బి.వెంకన్న, హరికృష్ణతోపాటు మరో ముగ్గురు కలిసి దేవరకొండకు చెందిన సంపంగి విక్రమ్ ప్రయాణిస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని పటాన్చెరు ప్రాంతంలో ఇటీవల అపహరించారు. ఆ వాహనంలో 80 సంచుల నల్లబెల్లం పౌడర్ (1,590 కిలోలు), మూడు సంచుల ఆలం (120 కిలోలు) ఉంది. దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు బెల్లం వ్యాపారులు అక్రమంగా బెల్లం పౌడర్ సరఫరా చేస్తున్నారని ముందుగా తెలుసుకున్న నిందితులు.. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని యత్నించినట్లు విచారణలో తేలింది. వ్యాపారులు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో సరుకును తమ ఆధీనంలోకి తీసుకుని విక్రయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో 27 సంచుల నల్లబెల్లం పౌడర్ను దించి మిగిలిన సరుకుతో వరంగల్ వైపునకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలో ఘట్కేసర్ వద్ద వాహనం ఆపారు. బొలెరో డ్రైవర్ సంపంగి విక్రమ్ అప్రమత్తంగా వ్యవహరించి నిందితులు ఉపయోగిస్తున్న మారుతి స్విఫ్ట్ కారును తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో నిందితుల ప్రణాళిక మలుపు తిరిగింది. మిగిలిన నల్లబెల్లం పౌడర్ను విక్రయించేందుకు నిందితులు పలువురు కొనుగోలుదారులను సంప్రదిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న డీటీఎఫ్ సిబ్బంది, జనగామ ఎకై ్సజ్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పెంబర్తి వద్ద శనివారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మహీంద్రా బొలెరో వాహనం, 1,590 కిలోల నల్ల బెల్లం పౌడర్, 120 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేయగా, అరెస్ట్ చేసిన ఇద్దరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. హైదరాబాద్ కొత్తపేటలో దింపిన 27 సంచుల న ల్లబెల్లం పౌడర్, నిందితులు ఉపయోగించిన మా రుతి స్విఫ్ట్ కారు, దేవరకొండకు చెందిన పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కేసును డీటీఎఫ్ ఎస్సై మధు, జనగామ సీఐ ప్రభావతి, ఎకై ్సజ్ ఎ స్సై జనార్దన్ చాకచక్యంగా ఛేదించినట్లు తెలిపారు. పెంబర్తిలో ఇద్దరి అరెస్ట్.. పరారీలో ముగ్గురు 1,590 కిలోల నల్లబెల్లం, 120 కిలోల ఆలం పట్టివేత వివరాలు వెల్లడించిన జనగామ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎన్.అంజిరెడ్డి


