breaking news
Mahabubabad District Latest News
-
పారదర్శకంగా నిర్వహించాలి
తొర్రూరు: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్, పాలకుర్తి నియోజకవర్గ ప్రత్యేక అధికారి బెన్షాలోమ్ సూచించారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఇంటింటకీ వెళ్లి కొత్త ఓటరు గణన, పేర్లు, చిరుమానాలు, ప్రాంతాల మార్పులు, మరణించిన, అనర్హత ఓటర్ల తొలగింపు వంటి సవరణలు చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు, జీపీఓలు పాల్గొన్నారు.. నేడు శనిత్రయోదశి పూజలు హన్మకొండ కల్చరల్: శనిత్రయోదశి పుస్కరించుకుని శనివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనిపూజలు, నవగ్రహ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఏలిననాటి శని, అష్టమ శని గ్రహప్రభావాలతో బాధపడుతున్న వారు పూజల్లో పాల్గొనాలని, తైలాభిషేకాలు, తిల పూజలు, తిల దానాలు, వస్త్రదానాలు చేసి శని పీడ నుంచి విముక్తులు కావొచ్చని వారు పేర్కొన్నారు. భర్తీ ఎప్పుడు? ● సీకేఎంలో ఇంకా ఖాళీగా ఆర్ఎంఓ పోస్టుకాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జ్ ఆర్ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ను కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. -
ఇల్లుపీకి.. పందిరేసి
సాక్షి, మహబూబాబాద్: పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు రూ.287.24కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 5,415 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2,773ఇళ్లు పూర్తికాగా.. 1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి చేరగా.. 975 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. మిగిలిన 2,542 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. ముఖం చాటేసిన కాంట్రాక్టర్ డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండానే ముఖం చాటేశాడు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు తోడు ఒక్కో లబ్ధిదారుడి నుంచి అదనంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేశాడు. మరికొన్ని గ్రామాల్లో నాయకులకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు ముట్టచెప్పామని లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాడు. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టగా.. మరికొన్ని గ్రామాల్లో లబ్ధిదారుల సొంత స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. స్లాబ్ లెవల్ వరకు కొన్ని, పిల్లర్లు, బేస్మెంట్ వరకు మరికొన్ని నిర్మించి వదిలి పెట్టాడు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మించి ఇళ్ల పరిస్థితి అలాగే ఉన్నా. ఇల్లు పీకి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మొండిగోడలపై గోనెబస్తాలు, పాత చీరలు కట్టుకొని.. డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు కావడంతో నిర్మాణం కోసం పాత ఇళ్లు కూల్చివేశారు. కొత ఇళ్లు స్లాబ్పోసి కాంట్రాక్టర్ వదిలేశాడు. దీంతో ఐదు సంవత్సరాలుగా లబ్ధిదారులు గోడలు, పిల్లర్ల మధ్యలో గోనె సంచులు, పాత చీరలు కట్టుకొని ఉంటున్నారు. మరికొందరు ఇంట్లో ఉన్న బర్రెలు, బంగారం అమ్ముకొని, ఇంకొందరు గిరిగిరి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్, డ్వాక్రా రుణాలతో వచ్చిన డబ్బులతో గోడలు పెట్టుకున్నారు. అప్పులు తీర్చేందుకు కొన్ని కుటుంబాలు గ్రామం విడిచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాలకు వలస వెళ్లి పనిచేసుకొని వచ్చిన డబ్బులతో కిస్తీలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ ఫొటోలోని మహిళ కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ ధనమ్మ. ఐదు సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇల్లు పొందేందుకు అర్హత సాధించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు రూ.2లక్షల అదనంగా ఇస్తే ఇల్లు మంచిగా నిర్మిస్తానని కాంట్రాక్టర్ నమ్మబలికాడు. దీంతో ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చింది. పాత ఇల్లు కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్లాబ్ లెవల్ వరకు పనులు చేపట్టి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ ముఖం చాటేశాడు. దీంతో పుస్తెల తాడు అమ్ముకొని గోడలు పెట్టుకొని అసంపూర్తి ఇంట్లో ఉంటున్నారు.’ మొండిగోడల్లో బస్తా సంచులు, పాత చీరలు కట్టుకొని జీవనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పాత ఇళ్లు కూల్చివేత కాంట్రాక్టర్కు ఒక్కో ఇంటికి రూ.2లక్షలకు పైగా ఇచ్చిన లబ్ధిదారులు అసంపూర్తి నిర్మాణాలతో ముఖం చాటేసిన కాంట్రాక్టర్ ఐదేళ్లుగా అవస్థలు పడుతున్న పేదలుఅసంపూర్తి నిర్మాణాలకోసం కొత్త ప్రణాళిక జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకోసం జీఓ నంబర్ 5 ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇప్పటికే వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్మాణాలు మొదలు పెడతాం. బిల్లులు వసూళ్లు చేసి నిర్మాణాలు ఆపివేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం. –పురుషోత్తం, ఇన్చార్జ్ హౌసింగ్ ప్రాజెక్టు అధికారి -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులు
● 170 మంది కేటాయింపు కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. -
మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం
● డీఎస్పీ ఎన్.తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం అవుతుందని, యువత మత్తువదిలి మంచిగా బతకాలని డీఎస్పీ నంబూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ సబ్ జైలులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ తిరుపతిరావు హాజరై జైలులోని ఖైదీలచే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించి మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేవి యువతను నిర్వీర్యం చేస్తూ వారి భవిష్యత్ను అంధకారం చేస్తున్నాయని, నేర అవి నీతి రహిత సమాజమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిలాంటి మత్తు పదార్థాలు ఏరూపంలో ఉన్నా, సేవించినా, ఇతరులకు అమ్మినా, రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ బారినపడిన యువత తీవ్ర నేరాలకు పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వాపోయారు. డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించేందుకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని, ఇందులో భాగంగా గంజాయి సాగు, అమ్మకంతో పాటు ఉపయోగించే వారిపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, పోలీసులకు సమాచారం ఇచ్చినవారికి రూ.5 వేల పారితోషకం కూడా ఉంటుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అనంతరం గంజాయితో పాటు వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలకు ప్రత్యేకంగా సూచనలు, సలహాలతో కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జైలర్ మల్లెల శ్రీనివాసరావు సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది ఖలీల్, లక్ష్మన్, వీరన్న, జనార్దన్, రామాంజనేయులు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పార్కింగ్ కష్టాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధి కొత్త బజార్ వైపు వాహనాల పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మూడో నంబర్ ప్లాట్ ఫారం వైపున ఉన్న ఖాళీ ప్రదేశం మొత్తం తమ పరిధిలోకి వస్తుందంటూ ప్రయాణికుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను రైలెక్కిచ్చి వచ్చేలోపు తమ వాహనాలను గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నో పార్కింగ్ పేరిట.. నో పార్కింగ్ పేరిట ఇష్టం వచ్చినట్లు బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాహనాలు నిలిపినవారిని నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. రైల్వే పార్కింగ్ స్థలానికి కేటాయించిన ప్రదేశం కంటే అధిక మొత్తంలో స్థలాన్ని ఆక్రమించి ఎక్కడ కూడా వాహనాలు పార్కింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తమ వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లి వచ్చేలోగా గొలుసులు, తాళ్లుకట్టి పెడితే ఆయన పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందించి నో పార్కింగ్ పేరిట డబ్బుల వసూళ్లు, పార్కింగ్ స్టాండ్ నిర్వహణ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వాహనాలు నిలుపనివ్వటం లేదు రైల్వే స్టేషన్ ఆవరణలోని పార్కింగ్ స్టాండ్ సమీపంలో ప్రయాణికులు ద్విచక్ర వాహనాలు, కార్లు తీసుకుని వస్తే ఇక్కడ నిలుపనివ్వడంలేదు. ప్రయాణికులు వచ్చివెళ్లేలోగా గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యంగా వ్యవహరిస్తూ పార్కింగ్ మొత్తం తమ పరిధిలోకి వస్తుందని బెదిరిస్తున్నారు. టికెట్లు కొనుగోలు చేసి వచ్చేసరికి వాహనాలు ఇక్కడి నుంచి తీసేయాలని అంటున్నారు. –గిద్దల రమేశ్, పర్వతగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, వారి బంధువుల ఇబ్బందులు పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారుల ఆరోపణ నో పార్కింగ్ పేరిట వసూళ్లు -
వరద కాల్వలకు మోక్షం
మహబూబాబాద్: మానుకోట పట్టణంలో ముంపు ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు రూ.12 కోట్లు కేటాయించగా.. పనులకు అగ్రిమెంట్ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నీటి పారుదలశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ ఈనెల 22న సంబంధిత అధికారులతో ఆ స్థలాలను పరిశీలించి ఫైనల్ చేశారు. గతంలో కొన్ని.. వర్షాకాలంలో మానుకోటలోని పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే ముంపునకు గురవుతున్నాయి. కాగా, గతంలో బస్తీదవాఖాన ఎదుట, బ్రహ్మకుమారీస్ మందిరం సమీపం, పీఎస్ఆర్ గార్డెన్ సమీపం, రాహుల్ నగర్లో మేజర్ వరద కాల్వలు, వాటితో పాటు సుమారు 10 మైనర్ వరద కాల్వల నిర్మాణం చేశారు. ప్రస్తుతం మరిన్ని నిర్మాణం చేయనున్నారు. రూ.12కోట్ల కేటాయింపు.. మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.59 కోట్లు విడుదల చేయించారు. కాగా, వాటిలో రూ.12 కోట్లు వరద కాల్వలు కోసం కేటాయించారు. వరద కాల్వ లు నిర్మాణం జరిగే ప్రాంతాలివే.. ● బంధం చెరువు నుంచి పాషివాగు నుంచి జనాల చెరువు వరకు 835 మీటర్ల మేర వరద కాల్వ నిర్మాణం చేస్తారు. ● జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ నుంచి బంధం చెరువు వరకు 805 మీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ● నర్సంపేట ఎన్హెచ్ బైపాస్ నుంచి గుండ్లకుంట చెరువు వరకు 100 మీటర్ల వదర కాల్వ నిర్మాణం. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ నుంచి నిజాం చెరువు వరకు 700 మీటర్ల కాల్వ. ● హస్తినాపురం నుంచి నిజాం చెరువు వరకు 250 మీటర్ల కాల్వ, సిగ్నల్ కాలనీ నుంచి రైల్వేట్రాక్ కింది నుంచి నిజాం చెరువు వరకు 400 మీటర్ల వదర కాల్వ. నిజాం చెరువు నుంచి రాబంద్రుచెరువు వరకు 436 మీటర్లతో కాల్వ నిర్మాణం చేయనున్నారు. చెరువులకు అనుసంధానం.. వరద కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు. దీంతో నీరు వృథా కాదు, భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు ప్రాంతాలు జలమయం కావు. చెరువులకు అనుసంధానం చేయనుండటంతో నీటిపారుదలశాఖ అధికారుల సూచనలు, సలహాల ప్రకారం నిర్మాణం చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆ స్థలాలకు ఇరిగేషన్ అధికారుల నిర్ణయం మేరకు మార్కింగ్ చేశారు. ఏడాది గడువు.. వరదకాల్వల పనులను ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంది. కాగా ఈనెలలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్య తీరుతుంది. ముంపు ప్రాంతాల గుర్తింపు మానుకోట పట్టణంలోని స్నేహనగర్, రామన్నపేట కాలనీ, మన్మదతోట ప్రాంతం, గుండ్ల కుంట కాలనీ, జమాండ్లపల్లిలో కొంతభాగం, బంధం చెరువు ప్రాంతం ప్రధానమైన ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వీటితో పాటు జగ్జీవన్రావు నగర్ కాలనీ, ఏల్ నగర్ కాలనీ, ధర్మన్న కాలనీ శివారు కొంతభాగం (కృష్ణస్వామి కుంట), ఏటి గడ్డ తండా, సిగ్నల్ కాలనీలో కొంతభాగం, తదితర ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో కసరత్తు చేస్తున్నారు. కాల్వలతో సమస్య తీరుతుంది వరద కాల్వల నిర్మాణాలతో ముంపు సమస్య తీరుతుంది. వాటిని చెరువులకు లింకు చేయడం వల్ల నీరు వృథా కాదు. మళ్లీ నిధులు విడుదల కాగానే మిగిలిన ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేస్తాం. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తూ గడువులోపు పూర్తి చేస్తాం. –ఎం.వినోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ రూ.12కోట్లు కేటాయింపు.. అగ్రిమెంట్ పూర్తి ముంపు ప్రాంతాల్లో త్వరలోనే పనులు ప్రారంభం ఆ కాల్వలు చెరువులకు అనుసంధానం ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పనులు -
ప్రభుత్వం సూచించిన సన్నరకాలకే బోనస్
బయ్యారం: ఖరీఫ్లో ప్రభుత్వం సూచించిన వరి సన్న రకాలు సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తారని డీఏఓ విజయచంద్ర సూచించారు. మండలంలోని కొత్తపేట రైతువేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన సందర్శించి మాట్లాడారు. వరిపంటలో యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. పంటమార్పిడితో అధిక దిగుబడులు.. గార్ల: పంట మార్పిడి విధానం ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు, పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని డీఏఓ విజయచంద్ర సూచించారు. శుక్రవారం గార్లలోని రైతు వేదికలో కొనసాగుతున్న విత్తన మేళాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఖరీఫ్లో సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంచుకొని యాజమాన్య పద్ధతులను అవలంభించడం, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం వల్ల పంటల్లో దిగుబడులు పెరుగుతాయన్నారు. ఏఓ కావటి రామారావు, ఏఈఓలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్లో నూతనంగా చేరిన విద్యార్థినుల వివరాలను తెలుసుకుని వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన ప్రతీ ఏడాది గోదావరి వరదలతో ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి మల్లారం, ఓడగూడెం తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. మంగపేట, రామన్నగూడెం ప్రాంతాల్లో వరద ఉధృతి గ్రామాలపై ప్రభావం చూపకుండా జియో ట్యూబ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ ఏడాది వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించే పరిస్థితి రాకుండా దీర్ఘకాలిక, శాశ్వత రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొండాయి వద్ద బ్రిడ్జి పిల్లర్లు పూర్తి కాగా గడ్డర్ల నిర్మాణం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఫిరంగి, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఇరిగేషన్ డీఈ ప్రవీణ్, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికే ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
మహబూబాబాద్: క్షేత్రస్థాయిలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రత్యేక అఽధికారి, జెన్కో సీఎండీ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ప్రజాపాలన ప్రగతి– ప్రణాళిక 99రోజుల కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొన్ని విషయాల్లో పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటలు, అధిక లాభాలు కలిగిన పంటలు సాగే చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. టాస్క్ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. యూ రియా తగ్గించి నానో యూరియా వాడే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. -
రోడ్డు దాటుతూ తిరిగిరాని లోకాలకు..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి దాటుతున్న పంచాయతీ కార్మికుడిని ఓ గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు కారు బానెట్పై పడడంతో దాదాపు 300 మీటర్ల దూరం వెళ్లాక బ్రేక్ వేయడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కర్రె ఎల్లయ్య (56) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆర్వీఎస్ కాంప్లెక్స్ నుంచి జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఎల్లయ్యను ఢీకొంది. ఈ ఘటనలో ఎల్లయ్య కారు బానెట్పై పడగా డ్రైవర్ ఆపకుండా 300 మీటర్ల దూరం తీసుకెళ్లి బ్రేక్ వేయడంతో రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య నాగమణి, కుమారుడు రాజు, కుమార్తె హేమలత ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. బైక్ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి రేగొండ: బైక్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్కు చెందిన ఒన్నాల మొగిలి (59), సరోజన దంపతులు బైక్పై తిరుమలగిరిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దమ్మన్నపేట క్రాస్ వద్ద కారు వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా మొగిలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరోజనను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు.. రఘునాథపల్లి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాములు,రాజమ్మ దంపతుల కుమారుడు రాజు అలియాస్ నితిన్ (22) తన ద్విచక్రవాహనంపై స్టేషన్ఘన్పూర్లో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి కోమటిగూడెం మీదుగా తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఓ రైతు పైపులైన్ కోసం తవ్వి పూడ్చగా.. ఎత్తుగా ఉండడతో బైక్ అదుపు తప్పి కిందపడింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న రాజు అలియాస్ నితిన్కు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారు ఢీకొని పంచాయతీ కార్మికుడు మృతి -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
బచ్చన్నపేట : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొ డవటూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లపు నరేశ్ (38) గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం అప్పు చేశాడు. అయితే ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలిని హెడ్ కానిస్టేబుల్ బాలయ్య సందర్శించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధ్ది
కేయూ క్యాంపస్: వికసిత్ భారత్–2047 లక్ష్యం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాదని, సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధి సాధ్యమని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్హా ల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కా మర్స్ అసోసియేషన్ ఏడో వార్షిక సదస్సులో ఆయ న మాట్లాడారు. విలువలే దేశ భవిష్యత్ను నిర్దేశిస్తాయని, వికసిత్ భారత్–2047 సాధనలో కామర్స్, మేనేజ్మెంట్ విద్య కీలకంగా నిలవనుందన్నారు. ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం : బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కామర్స్మేనేజ్మెంట్ విద్య విస్తృత ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ఆయన మాట్లాడారు. డిగ్రీ, పీజీలో సిలబస్ సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. అలాగే, రాష్ట్రం కూడా రైజింగ్ తెలంగాణ దిశగా పురోగమిస్తోందని వివరించారు. యువతకు ఉపాధికోసం ప్రత్యేక పోర్టల్ : చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డి.చెన్నప్ప అన్నారు. 2017లో స్థాపించిన కామర్స్ అసోసియేషన్లో ప్రస్తుతం 1,177 మంది సభ్యులు ఉన్నారని వవరించారు. ఉచిత శిక్షణ ద్వారా వందమంది విద్యార్థులకుపైగా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారన్నారు. ఎస్బీఐ ఆర్ఎం బండి మురళీమోహనకృష్ణ, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసమూర్తి, కేయూ మాజీ రిజిస్ట్రార్ శంకరయ్య, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, సదస్సు సెక్రటరీ పి.వరలక్ష్మి, కామర్స్ డీన్ కె.రాజేందర్, పి.అమరవేణి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సెక్రటరీ అకాహ్రాయ్జాస్తి, రిటైర్డ్ ఆచార్యులు కృష్ణమాచార్య, రవికుమార్ మాట్లాడారు. సదస్సులో 150 పరిశోధన పత్రాల సారాంశాల (అబ్స్ట్రాక్ట్) సంకలనాన్ని విడుదల చేశారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వెబ్సైట్ను కూడా అతిథులు ఆవిష్కరించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
చిట్యాల: నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని తిర్మలాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కంచు మౌనిక–బీరన్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, బీరన్న తన గొర్రెలమందను మేతకోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. మందలోని ఒక గొర్రెపిల్లకు పాము కరవడం గమనించి ఆయన భార్య మౌనికకు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించి మందులు, ఇంజక్షన్లు పంపించమని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువుల ద్వారా గొర్రెలమంద వద్దకు మందులు పంపించింది. పాము కరిచిన గొర్రెపిల్ల ఎలా ఉందని తెలుసుకునేందుకు మౌనిక పక్కింటికి వెళ్తుండగా.. కూతురు హాన్వి ఆమె వెనుకే వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. తన ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టెలో చూడగా కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ కూతురు హాన్విని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తినుబండారాలపై టాస్క్ఫోర్స్ దాడులు
● పాడైన రూ.1.06 లక్షల విలువైన సరుకులు స్వాధీనం రామన్నపేట/ఖిలావరంగల్ : పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న వ్యాపారి ఇంటిపై టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఇందులో సుమారు రూ.1,06,780 విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారుల కథనం.. టాస్క్ఫోర్స్ బృందం.. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చింతల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న మరియా ట్రేడర్స్పై తనిఖీలు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలో వినియోగానికి అనర్హమైన వంటనూనెలు, ఫుడ్ కలర్లు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అనంతరం పరిశ్రమ యజమానిని తరమం ఆశీర్వాదంగా గుర్తించి 361 కిలోల ఖారా, 114 కిలోల భోంది, 80 కిలోల చేగోడి, 30 కిలోల కారం, 8 బాక్సుల ఫుడ్ కలర్తోపాటు సుమారు 60 కిలోల పాడైపోయిన వంటనూనెలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.1,06,780 ఉంటుందని అధికారుల అంచనా. షాపు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మంగీలాల్, ఎస్సై చందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి
కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలో అపరిశుభ్ర వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తూ, నిల్వ ఉంచుతున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. గురువారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కుళ్లిన పచ్చడి ముడి సరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా షాపులు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అరికెల శ్రీనివాస్ను అదుపులో తీసుకున్నారు. అలాగే, 750 కిలోల టమాట, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం–వెల్లుల్లి ఫేస్ట్తో కూడిన మొత్తం రూ.2,25, 000 విలువైన కుళ్లిన కల్తీ ఆహార నిల్వ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల నిమిత్తం ఇంతెజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.2.25 లక్షల కల్తీ నిల్వలు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
బదిలీల పర్వం..
నెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య ఆరోగ్యశాఖ, డీఎంఈ, టీవీవీపీ విభాగాల్లో బదిలీల ప్రక్రియ పూర్తికావొస్తుంది. ఒకచోట 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు, స్టాఫ్నర్సులు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది బదిలీపై వెళ్లారు. దీంతో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్థానచలనం తప్పలేదు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు బదిలీపై వెళ్లకుండా.. ఒక విభాగం నుంచి మరో విభాగానికి డిప్యుటేషన్ల ఉత్తర్వులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే విధంగా ఇప్పటి వరకు వారు కొనసాగిన స్థానంలోనే ఉండేలా పైరవీలు సైతం ప్రారంభించినట్లు సమాచారం. ఏళ్లుగా తిష్ట.. ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అయినప్పటికీ.. కొంత మంది వారికి అనుకూలమైన ప్రాంతంలోనే ఉద్యోగం చేసేలా పైరవీలు, డిప్యుటేషన్ ద్వారా తిష్ట వేయాలని చూస్తున్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఈ లోపు శాఖల్లో ఉన్న లోటుపాట్లను అడ్డం పెట్టుకుని మళ్లీ స్థానికంగా కొనసాగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కూడా బదిలీలు చేయాల్సి ఉండగా.. కేవలం కొంది మంది ఉద్యోగులకే బదిలీ కావడంతో పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. పైరవీలు.. కొంది మంది ఉద్యోగులు స్థానికంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోస్టింగ్ల కోసం హైదరాబాద్లో పైరవీలు చేయడంతో పాటు డిప్యుటేషన్లు, ఇతర పద్ధతుల్లో యథావిధిగా కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జీఎంసీ ప్రిన్సిపాల్ బదిలీ.. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లకావత్ వెంకట్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. ప్రిన్సిపాల్తో పాటు ప్రొఫెసర్లు, నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారందరికీ బదిలీలు తప్పలేదు. ఈ నెల చివరి వరకు బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి రానుంది. వైద్యశాఖలో ఎట్టకేలకు ట్రాన్స్ఫర్స్ ఏళ్లుగా ఒకేచోట తిష్టవేసిన కొందరు ఉద్యోగులు పాత స్థానాల్లోనే పని చేసేందుకు పైరవీలు -
కాలం కలిసొచ్చేనా..?
● మొక్కజొన్న సాగుపై ఏజెన్సీ రైతుల సందిగ్ధం ● వర్షాలు సరిగా లేక ఆందోళన బయ్యారం: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఏటా వానాకాలం సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేసే రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు మోస్తరు వర్షం కూడా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, మహబూబాబాద్ మండలాల పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్లో వానలపై ఆధారపడి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రతీ వానాకాలం వర్షాలు అనుకూలంగా పడుతుండడంతో కాలం కలిసొచ్చి పంటలు పండేవి. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు లేక మొదలు కాని దుక్కులు.. గత ఏడాది మే చివరలో ఆశాజనకంగా వానలు కురవడంతో జూన్ మొదటివారంలోనే వర్షాధారంగా మొక్కజొన్న పంట సాగు చేసే రైతులు దుక్కులు సిద్ధం చేసుకొని జూన్ చివరి నాటికి విత్తనాలు విత్తా రు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొన్నిచోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో ఆశాజనకమైన వానలు కురవకపోవడంతో దుక్కులు దున్నని పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాధారిత భూముల్లో పంటల సాగుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఆ తరువాత ముఖం చాటేస్తే.. మరికొన్ని రోజుల్లో భారీ వర్షం కురుస్తే పంట సాగుకు దుక్కులు దున్ని విత్తనాలు విత్తొచ్చు. మొక్కజొన్నకు పంట విత్తే సమయంలోనే దుక్కిదున్నే కూళ్లు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఎకరానికి రూ.20 వేల వరకు రైతులు భరించాల్సి వస్తుంది. సాగు చేసిన పంటలో ఒకసారి కలుపుమందు పిచికారీ చేయటంతో పాటు మూడు దఫాలుగా యూరియా వేస్తే మూడు నెలల తరువాత పంట చేతికి వస్తుంది. పంట సాగు చేసిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో పది నుంచి పదిహేను రోజుల పాటు వానలు పడకపోతే పంట ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వానలు ఏం చేస్తాయోనని భయం అవుతోంది ఈ ఏడాది ఇప్పటి వరకు పెద్దవాన పడలేదు. చిన్నవానలకు కొద్దిగా దుక్కి చేశాం. వానలు పడితేనే పండే భూముల్లో ఇప్పుడు మొక్కజొన్నలు విత్తితే వానలు ఏం చేస్తాయోనని భయం అవుతుంది. – బి.విశ్వనాథం, మొట్లతిమ్మాపురం -
గోడ కూలుస్తుండగా ప్రమాదం
మామునూరు: పాత ఇంటి గోడ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు కూలి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సూర యాకయ్య (45) కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అదేకాలనీకి చెందిన కుంచం పురుషోత్తంతో కలిసి యాకయ్య కూలి పనులకు వెళ్తున్నాడు. రోజు వారీగానే మామునూరు గ్రామంలో ఎర్ర సంతోష పాత ఇంటిని కూల్చివేసేందుకు గురువారం ఉదయం యాకయ్య, పురుషోత్తం కూలికి వెళ్లారు. కూల్చివేసే క్రమంలో ఆకస్మికంగా కూలీలపై గోడ పడిపోవడంతో సూర యాకయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాకయ్య మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మామునూరులో ఘటన -
కాజీపేట క్రూ డిపోకు ట్రైన్ మేనేజర్లు
● ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే లోకోపైలెట్ల క్రూ డిపో కార్యాలయానికి 8 మంది ట్రైన్ మేనేజర్లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ అయినట్లు రైల్వే నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కాజీపేట క్రూ డిపోకు సిబ్బంది బదిలీపై వచ్చారని, ఈ ఏడాది 8 మంది ట్రైన్ మేనేజర్లును కాజీపేటకు బదిలీ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే సంఘ్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్కుమార్ తెలిపారు. విజయవాడ వద్ద గల గాలా క్రూ డిపో కార్యాలయం నుంచి 8 మంది ట్రైన్ మేనేజర్లు రెక్వెస్ట్ బదిలీపై త్వరలో కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కృషితో ట్రైన్ మేనేజర్ల బదిలీలు జరుగుతున్నాయని రాజ్కుమార్ తెలిపారు.అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం ● కాశిబుగ్గలోని ఓ హోటల్లో ఘటన ● రూ.10వేల జరిమానా విధించిన అధికారులు కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్లో అల్పాహారంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన వినియోదారుడు షాక్కు గురయ్యాడు. గురువారం కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఆ వ్యక్తి వడ తింటున్న సమయంలో బల్లి కళేబరం ముక్కలుగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన ఆహార పదార్థాలు, పిండిని పరిశీలించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక హోటల్ నిర్వాహకుడికి రూ.10వేల జరిమానా విధించడంతో పాటు వారం రోజులు టిఫిన్ సెంటర్ మూసివేయాలని ఆదేశించారు. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి ● శంకరంతండాలో ఘటన చెన్నారావుపేట: మొరం తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు (24) ట్రాక్టర్లో మొరం తరలిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని శ్మశానవాటిక వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. -
వేతన వెతలు!
కూరగాయలు కొందామంటే పైసల్లేవు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు నెలకు రూ.17,300 జీతం వస్తుంది. గత ఆరునెలలుగా జీతాలు రాక కూరగాయలు కొనుక్కుందామంటే పైసల్లేవు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలకు నోట్ బుక్స్, బ్యాగులు కొందామంటే డబ్బులు లేవు. అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలి. – రఘుపతి, కంప్యూటర్ ఆపరేటర్, నర్సింహులపేట పెండింగ్ జీతాలు అందించాలి ఐదు నెలలుగా జీతాలు వస్తలేవు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే సమస్య ఉందని చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుతో నలిగిపోతున్నాం. అధికారులు పెండింగ్ వేతనాలు ఇప్పించి తమకు న్యాయం చేయాలి. –కొమురయ్య, ఫిజికల్ డైరెక్టర్, నెల్లికుదురు మోడల్ స్కూల్ మహబూబాబాద్ అర్బన్: సకాలంలో వేతనాలు అందక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 8 మోడల్ స్కూళ్లలో పీడీ, కంప్యూటర్ ఆపరేటర్, నైట్ వాచ్ మెన్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు గోసపడుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అప్పుల తెచ్చి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా పెండింగ్లో.. జిల్లాలో 8 మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ విధానంలో 34 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీడీలకు నెలకు రూ. 28,935 కాగా, రూ.22,750 మాత్రమే అందిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.19,500లకు రూ. 17,300, నైట్ వాచ్మమెన్, అటెండర్లకు రూ. 15,600లకు బదులు రూ.13,000 అందిస్తూ పీఎఫ్, ఈ ఈఎస్ఐ పేరుతో కట్ చేస్తున్నారు. రెన్యూవల్ తేల్చడంలో తాత్సారం. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏటా సాధారణంగా ఏప్రిల్లో రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. అలాగే ఒక్కరికి కూడా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించలేదు. వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని సదరు ఏజెన్సీల నిర్వాహకులను ప్రశ్నించే సిబ్బందికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా అర్హత లేని ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు అప్పగించడంతో వేతనాలు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని జీతాలు ఐదు నెలలుగా పెండింగ్ జిల్లాలో 8 మోడల్ స్కూళ్లలో 34 మంది నిర్లక్ష్యంగా ఏజెన్సీ నిర్వాహకులు -
ఆదరణ అంతంత మాత్రమే!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో సోలార్ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే చెల్లించే యూనిట్ ధరపై ఇప్పటికే రైతులు పెదవి విరుస్తుండగా.. ఉరుము ఉరిమి మీదపడిన చందంగా డిస్కంలు రైతులకు చెల్లించే యూనిట్ ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్ కాస్ట్ తక్కువగా ఉందని సోలార్ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. పీఎం కుసుం పథకం కింద యూనిట్ ధర రూ.3.13 చెల్లిస్తామని డిస్కం పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) చేసుకుంది. ప్లాంట్కు ఉపయోగించే ఉపకరణాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్లాంట్ ఏర్పాటు వ్యయం తగ్గుతున్న క్రమంలో యూనిట్ కాస్ట్ తగ్గించాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.3.13 నుంచి రూ.2.98కి అంటే 15 పైసలు తగ్గించాలని కోరుతూ టీజీ ఎన్పీడీసీఎల్ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో పిటిషన్ వేసింది. దీనిపై జూలై 8న బహిరంగ విచారణ చేపట్టాలని ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 వరకు ఈఆర్సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాలో మొత్తం 2098 మంది 2,788.900 మెగావాట్ల సోలార్ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ. లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. పీపీఏ మాత్రం 643 మెగావాట్లకు 447 మంది రైతులు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో మాత్రమే పీపీఏలు చేసుకోవడాన్ని చూస్తే రైతులు డిస్కంలు చెల్లించే రేటుపై విముఖత ఉన్నట్లు అర్థమవుతోంది. గిట్టుబాటు కాని ధర.. రుణవాయిదాలు 12 ఏళ్ల వరకు చెల్లించాల్సి రావడం.. 25 ఏళ్ల వరకు యూనిట్ రేట్ పెంచకపోవడం వంటి కారణాలతో రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావొచ్చనే ఆలోచన.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతీ నెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ప్లాంట్ ఏర్పాటుపై విముఖత వ్యక్తమైంది. దరఖాస్తులు చేసిన నాటి ఉత్సాహం ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పీపీఏ చేసుకోవడంలో లేదు. పీపీఏ చేసుకున్న వారందరు కూడా సోలార్ప్లాంట్ ఏర్పాటు అంశంపై సందిగ్ధంలో పడ్డారు. దీంతో 447 మంది 643 మెగావాట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు 18 మెగావాట్ల 9 సోలార్ ప్లాంట్లు పూర్తికావడం చూస్తే రైతుల్లో విముఖతకు నిదర్శనం. రైతుల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడం, ప్రాజెక్టులో పురోగతి మందగించడంతో విద్యుత్ కొనుగోలు ధర తగ్గింపు ప్రతిపాదనపై ఈఆర్సీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి కూ డా డిస్కంలు ఈఆర్సీకి 15 పైసలు తగ్గింపు కోరు తూ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తక్కువగా ఉన్న ధరను మరింత తగ్గిస్తే పథకం అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరచని రైతులు యూనిట్కు 15 పైసలు తగ్గించాలని డిస్కంల నిర్ణయమే కారణం ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ దరఖాస్తులు 2,098.. పీపీఏ చేసుకున్నది 447 మంది ఇప్పటి వరకు పూర్తయిన సోలార్ప్లాంట్లు 9 మాత్రమేసోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు పీఎం కుసుం..కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వ నరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎ స్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
ఎమ్మార్పీకే విక్రయించాలి
మహబూబాబాద్ రూరల్ : ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే లైసెన్స్లు రద్దు చేస్తామని డీఏఓ విజయచంద్ర హెచ్చరించారు. మహబూబాబాద్ పట్టణంలోని వివిధ ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లోని యూరియా, డీఏపీ, వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువులను ఈ–పాస్ మిషన్ ద్వారానే అమ్మాలని తెలిపారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి ఎస్.తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారిగా కనకదుర్గ మహబూబాబాద్ రూరల్: జిల్లా ఎకై ్సజ్ అధికారిగా బి.కనకదుర్గ విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం జిల్లా ఎకై ్సజ్ అధికారిగా పనిచేస్తున్న బి.కిరణ్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నాచారం డిస్టిలరీ అధికారిగా పనిచేస్తున్న బి.కనకదుర్గ బదిలీపై జిల్లా ఎకై ్సజ్ అధికారిగా రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా, వ్యక్తిగత కారణాలతో అధికారి కనకదుర్గ విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆమె విధుల్లో చేరుతారా లేక ఆమె స్థానంలో మరెవరైనా జిల్లా ఎకై ్సజ్ అధికారిగా బదిలీపై వస్తారా అనే అంశం జిల్లా ఎకై ్సజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలందరికీ పోలియో చుక్కలు నెహ్రూసెంటర్: జిల్లాలోని 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. పల్స్పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమానికి 469 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ శివకుమార్, కోఆర్డినేటర్లు స్వామి, పురుషోత్తం, డిప్యూటీ డెమో రాజ్కుమార్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాథచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ వద్దు.. ప్రభుత్వ స్కూల్ ముద్దు కురవి : ప్రైవేట్ స్కూల్ వద్దు.. ప్రభుత్వ స్కూల్ ముద్దు అనే నినాదంతో మండలంలోని బలపాల శివారు లింగ్యా తండా గ్రామంలో ప్రజలు ముందుకు వచ్చారు. గురువారం తండాకు వచ్చిన పలు ప్రైవేట్ స్కూల్ బస్సులను సర్పంచ్ మాలోత్ స్వరూపహరిలాల్ ఆధ్వర్యంలో ఆపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. డీఎన్టీపీఎస్ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా ఆపేస్తామని, ప్రజలు సహకరించాలని సూచించారు. సంక్షేమ పథకాలు పొందే ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తెలిపారు. ఇక నుంచి పిల్లలను ప్రైవేట్ బడికి పంపిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. -
దాచుకున్న డబ్బులు మాయం!
కొత్తగూడ : పోస్టాఫీస్లో దాచుకున్న డబ్బు మాయమైంది. ఖాతాదారుకు తెలియకుండా ఆ సొమ్ము డ్రా చేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఏంపెల్లి సందీప్(25) గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య రచన, ఏడాది వయసున్న పాప ఉంది. ఆ నిరుపేద కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిందని పలువురు దాతలు తమకు తోచిన మేర ఆర్థిక సాయం అందించారు. ఇలా వచ్చిన డబ్బును రచన పేరుతో పోస్టల్ అకౌంట్ ప్రారంభించి సెప్టెంబర్ 09, 2025న డిపాజిట్ చేశారు. అకౌంట్లో ఉన్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బాధితులు గురువారం పోస్టాఫీస్కు వెళ్లింది. ఈ క్రమంలో అకౌంట్లో ఉన్న డబ్బు నుంచి డిసెంబర్ 27, 2025న రూ.లక్షా 99 వేలు డ్రా చేసినట్లు ఉందని ప్రస్తుత మేనేజర్ తెలిపాడు.అయితే తాను డ్రా చేయలేదని, డిపాజిట్ చేసినప్పటి నుంచి నేటి వరకు పోస్టాఫీస్కు రాలేదని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. డ్రా చేసిన సమయంలో మేనేజర్ బదిలీ అయ్యాడని, తనకు ఏమీ తెలియదని ప్రస్తుత మేనేజర్ సమాధానం ఇచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు సిద్ధమైంది. మధ్యవర్తులతో మంతనాలు.. బదిలీపై వెళ్లిన పోస్టాఫీస్ మేనేజర్కు విషయం తెలియగానే మధ్య వర్తుల ద్వారా బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా మంతనాలు నిర్వహించినట్లు సమాచారం. తన డబ్బులు మేనేజర్ డ్రా చేసినట్లు అంగీకరించి డ్రా చేసిన మొత్తానికి మరి కొంత డబ్బు అదనంగా ఇచ్చేందుకు చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా, ఆ మొత్తాన్ని మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి వద్ద ఉంచినట్లు సమాచారం. విషయం బయట పడింది కాబట్టి ఎక్కువ సొమ్ము ఇచ్చాడని, ఇంకా బయటకు రాని ఎంతమంది డబ్బులు ఇలా వినియోగించుకున్నాడో అనే చర్చ సాగుతోంది. చిన్న పాప కోసం దానం చేసిన డబ్బులు కాజేసిన మేనేజర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.పోస్టల్ అకౌంట్ నుంచి ఖాతాదారుకు తెలియకుండా రూ.1.99లక్షలు డ్రా విషయం బయటకు రావడంతో మధ్యవర్తులతో మంతనాలు ఫిర్యాదు చేయకుండా ఎక్కువ డబ్బుల ఆశ ఇంకా ఎన్ని అకౌంట్ల నుంచి తీశారోనని అనుమానాలుమేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలి నిరుపేద ఆదివాసీ బిడ్డకు దాతలు సాయం చేసిన డబ్బులు కాజేసిన పోస్టల్ బ్రాంచ్ మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. అతడు పని చేసిన కాలంలో ఇంకా ఎంత మంది డబ్బులు వినియోగించుకున్నాడో విచారణ చేపట్టాలి. లేదంటే ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతుంది. –సందీప్, తుడుందెబ్బ నాయకుడు -
పైరవీల జోరు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామక ప్రక్రియపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రోజుకో తీరు నిబంధనలు, గంటకో ఆదేశాలు ఇస్తూ అర్హులైన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే నియామక ప్రక్రియలో ఏ సర్టిఫికెట్కు ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టంగా పొందుపర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత చేపడుతున్న నియామకాలు కావడంతో రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిన ట్లు జిల్లా విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ముందు చెప్పిన అర్హతలు.. ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా నిర్వహించే ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులు, ఎంపిక ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా ప్రకటించారు. ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత, అదీ లేకపోతే డీఈడీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలకు కాకుండా ఇప్పుడు కేవలం ఇంటర్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని కొందరు అంటుంటే.. డీఈసీఏ సర్టిఫికెట్ కీలకం అని ఇంకొందరు.. డీఈడీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు, బీఈడీ ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఆందోళనలో అర్హులు.. ఉన్నత చదువులు చదివి టీచర్ ఉద్యోగం రాక ఇంటి వద్దనే పనిచేసుకుంటున్న సమయంలో ప్రీప్రైమరీ స్కూల్స్ టీచర్ పోస్టులు పడడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఒక వైపు అధికా రుల నుంచి స్పష్టత లేకపోవడం, మరోవైపు దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని తిరగడం.. మరో వైపు రాజకీయ నాయకులు మా లీడర్తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని, ఇప్పటికే జాబితా తయారైందని చెప్పడంతో అన్ని అర్హతలు ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఏం జరుగుతుందో అనే భయం కూడా పట్టుకుంది. అధికారులు స్పందించి నియామక ప్రక్రియ వివరాలను స్పష్టంగా పొందుపరిచి అందరికి అందుబాటులో ఉండే బెల్ సైట్లో గానీ, డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల వద్ద గానీ డిస్స్లే చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రీప్రైమరీ పాఠశాలలుడిగ్రీ 413 దరఖాస్తులు ఇంటర్ 511 దరఖాస్తులు ఇన్స్ట్రక్టర్ పోస్టులుబీటెక్/ పాలిటెక్నిక్ 14 దరఖాస్తులుఆయా పోస్టులు:76 వచ్చిన దరఖాస్తులు: 428పీజీ 128 దరఖాస్తులు ● ప్రీప్రైమరీ పోస్టుల ఎంపికలో తర్జనభర్జన ఇంటర్, టీటీసీకి ప్రాధాన్యం అంటున్న అధికారులు ఇంటర్, బీఈడీ ఉన్నచోట పరిస్థితిపై స్పష్టత కరువు రాజకీయ నాయకుల నుంచి పెరిగిన ఒత్తిడి ఆందోళనలో అర్హులైన అభ్యర్థులు 118676నిబంధనల ప్రకారమే నియామకాలుప్రీప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీచేసిన నిబంధనల ప్రకారమే నియామకాలు జరుగుతాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా జిల్లా సెలక్షన్ కమిటీ తుది జాబితా తయారు చేస్తుంది. తయారు చేసిన జాబితాలో ఎటువంటి గోప్యత ఉండదు. – సత్యనారాయణమూర్తి, డీఈఓ -
శిథిల భవనం!
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వందేళ్లు దాటిన భవనాలు.. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం 1914లో నిర్మించిన భవనంలో నేటికీ కొనసాగుతోంది. అధికారులు, సిబ్బంది భయంతో ఉద్యోగం చేస్తున్నారు. నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం 1926లో నిర్మాణం చేసి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. ఈనెల 22న ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆ కార్యాలయాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిజాంకాలం నాటి భవనంలో.. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కూడా కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. వర్షం వస్తే చాలా వరకు కురుస్తుంది. స్లాబ్ పెచ్చులు నేటికీ ఊడి కింద పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆఫీసర్ క్లబ్ భవనం కూడా కూలిపోయే దశలో ఉంది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. కూలిపోయే దశలో.. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవరణ అంతా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పాములు సంచరిస్తున్నాయి. పందులకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ క్వార్టర్స్ సగం కూలిపోగా.. మిగిలినవి కూడా కూలిపోయే దశలో ఉన్నా యి. ఖాళీగా ఉన్నవాటిని కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాల కూడా శిథిలావస్థలో ఉంది. నోటీసులు.. వర్షాకాలం రాగానే కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తున్నారు. కానీ, శిథిల భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. పలు కార్యాలయాల భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిపాదనల ఫైళ్లలో కదలిక లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా అవుతున్నాయే తప్ప సమస్య తీరడం లేదు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఇటీవల బాలరక్షా భవన్ అద్దె భవనంలో ఉండగా సఖి కేంద్రంలోకి మార్చారు. డీటీఓ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు మార్చారు. దీంతో అద్దెకు అవకాశం లేకపోవడంతో శిథిల భవనాల్లో ఉండాల్సి వస్తోంది. నిజాంకాలం నాటి భవనాల్లో పలు కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఇబ్బందులు తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా -
27న మెగా జాబ్ మేళా
నయీంనగర్ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27 కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన 100 పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ రానున్న నల్లగొండ– వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ తరఫున కపిలవాయి దిలీప్కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. టీఆర్ఎల్డీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంప్రసాద్, నాయకులు రాజ్కుమార్ రెడ్డి, బుల్లెట్ వెంకన్న, కుందె గిరి, కోటి, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ -
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి
మహబూబాబాద్: విద్యా ప్రమాణాలు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల ముఖగుర్తింపు హాజరు, తదితర విషయాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దాని లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మూతబడిన పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ఇందుకు సమయపాలన ముఖ్యమన్నారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా రోజువారి హాజరు నమోదు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బోధన పద్ధతులపై ఉపధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
● ఎస్పీ శబరీష్కేసముద్రం: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం కేసముద్రం జెడ్పీహైస్కూల్లో మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై 9, 10, ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్ను నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్పర్సన్ అల్లం రమ, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, హెచ్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులకు యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు సరఫరా విధానం అమలు, వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాల తీరు, ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, పంటల మార్పిడి, అపరాల సాగు పెంపుపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని రైతువేదిక కార్యాలయం నుంచి డీఏఓ ఎస్.విజయచంద్ర, మరిపెడ ఏడీఏ శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటింటికి సర్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) లోని ముఖ్య ఘట్టం ఇంటింటి గణన గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే జిల్లాలో ఈ పక్రియ సజావుగా నిర్వహించేదుకు చేపట్టిన ఓటరు మ్యాపింగ్ 94శాతం పూర్తి చేసుకొని జిల్లాను రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిపారు. ఓటరును గుర్తించేందుకు ఫాంలు పూర్తి చేసి ఇచ్చేందుకు అన్ని పార్టీల ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అసలు ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్ట్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లైమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యూమరేషన్ ఫామ్స్పై నిర్ణయం.. అభ్యంతరాల పరిష్కారం మొదలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటో తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందరూ అప్రమత్తం.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకోకపోతే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో అటు అధికా రులు, ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, ప్రభుత్వ సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సర్వే అధికారులకు చూపించాలి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు తమ ఉద్యోగ గుర్తింపు కార్డు చూపెట్టవచ్చు. కాగా, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్ఐసీ, పీఎస్యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్ఆర్సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టేదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు చూపించి ధ్రువీకరించుకోవచ్చు. అయితే బీఎల్ఓలు ముందుగా ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు పత్రం అందజేస్తారు. వీటిని పూర్తి చేసి ఓటరు నేరుగా గానీ, రాజకీయ పార్టీల ఏజెంట్ల ద్వారా గానీ బూత్లెవల్ ఆఫీసర్కు అప్పగించాలి. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక వెట్సైట్లో ఏరోజు ఫాంను ఆరోజుగా స్కాన్ చేసి ఆన్లైన్ చేయాలి. అయితే ఈ ప్రక్రియపై బీఎల్ఓలకు అనేకమార్లు శిక్షణ ఇచ్చినా.. కొందరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రధానంగా కొంత మంది అంగన్వాడీ టీచర్లు ఫాంలో వివరాల నమోదు, స్కాన్ చేయడం, అప్లోడ్ చేయడం వంటి ప్రక్రియలు చేయలేని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికోసం సహాయకులు, సూపర్ వైజర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవస రం ఉంది. బీఎల్ఏలకు నాయకుల దిశానిర్దేశం ఒక్క ఓటు గెలుపోటములను తారుమారు చేసే అవకాశం ఉంది. కావునా.. తమ తమ ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇటీవల బీఎల్ఏ(బూత్లెవల్ ఏజెంట్లు)లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ఫాం ఎలా నింపాలి. ఏ ఆధారాలు చూసుకోవాలి. 2002లోని ఓటరు జాబితాను ఎలా సరిచూడాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. బీఎల్ఓలు.. ఇచ్చిన ఫాం సరి చూడడం, వాటిని దగ్గరుండి భర్తీ చేయడం, తప్పులు ఉంటే సరిచేయడం వంటి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 555/94%288/96%4,84,9404,57,819267/91%2,24,1722,60,7612,51,6932,06,126మహబూబాబాద్డోర్నకల్నేటి నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఇప్పటికే బీఎల్ఓలకు శిక్షణ ఫాం పూర్తి చేసి ఇస్తేనే ఓటు భద్రం అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల అప్రమత్తంమ్యాపింగ్ ప్రక్రియ ఇలా.. పీఎస్లు ఓటర్లు మ్యాపింగ్ శాతం -
31 జంటలకు ఉచిత కల్యాణం
కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని సప్తధామంలో 31 జంటలకు ఉచితంగా కల్యాణం నిర్వహించారు. బుధవారం జరిగిన వివాహ మహోత్సవంలో నూతన వధూవరులకు బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, బట్టలు, పూజా సామగ్రి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 19 జంటల నెంది గిరిజనులు, కోయలు, నర్సంపేట, కొత్తగూడెం నుంచి 7 జంటలు, వరంగల్ నుంచి 5 జంటలు పాల్గొన్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపురనేని గోపిచంద్ తెలిపారు. వానవాసి కల్యాణ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య, ఎంఎల్ ధర్మారావు, చాంబర్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, గట్టు మహేష్బాబు, సభ్యులు సదాశివుడు, సాయి, ఉమాశంకర్, వెంటకరమణ, భాస్కర్, మహిపాల్, రాంప్రసాద్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
మురుగు.. పరుగు
బ్యాంకు స్ట్రీట్లోని డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరు, సాయినగర్లో నూతనంగా నిర్మించిన కాల్వలో నిలిచిన మురుగు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు, సైడు కాల్వల్లో మురుగు, వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్యలోపం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, అధికారులు డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పలు వార్డుల్లో.. మున్సిపాలిటీ పరిధిలో 15వార్డులు ఉన్నాయి. కాగా, కొంతకాలంగా డ్రెయినేజీలు, సైడు కాల్వ లను శుభ్రపరచకపోవడంతో మురుగు, వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బ్యాంకు స్ట్రీట్ నుంచి పాతడోర్నకల్ వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలను నెలల తరబడి శుభ్రపర్చడం లేదు. దీంతో మురుగు, వ్యర్థాలతో డ్రెయినేజీ నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే దోమల బెడద పెరగడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో డ్రెయినేజీలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడంతో శుభ్రం చేసే అవకాశాలు లేక వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులతో డ్రెయినేజీలు మూసుకుపోయాయి. పెరిగిన సైడు కాల్వలు.. ఇటీవల ఒక్కో వార్డుకు కోటి రూపాయల నిధులు మంజూరు కావడంతో 15 వార్డుల్లో సైడు కాల్వలను నిర్మించారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో సైడు కాల్వల పొడవు పెరిగింది. సైడు కాల్వలు నిర్మించి నెలలు గడుస్తున్నా .. నేటి వరకు శుభ్రపరచకపోవడంతో మట్టి, వ్యర్థాలు, మురుగుతో మూసుకుపోతున్నాయి. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు డోర్నకల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరతతో పారిశుద్ధ్య సమస్యలు సిబ్బంది కొరత.. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో డ్రెయినేజీలు, కాలువలు శుభ్రపరిచేందుకు ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో అరకొరగా కాల్వలను శుభ్రపరుస్తున్నారు. ప్రస్తుతం అమృత్ పైపులైన్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో తరచూ పైపులు పగులుతుండగా.. సిబ్బందిని పైపులైన్ల మరమ్మతులతో పాటు ఇతర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో నెలల తరబడి కాల్వలను శుభ్రపరచకపోవడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై వర్షాలు పడుతుండడంతో అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయనిఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు స్పందించి డ్రెయినేజీలు, సైడు కాల్వలను శుభ్రపరిచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి
మహబూబాబాద్ రూరల్ : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాను దుకాణం నుంచి సామగ్రిని డీసీఎంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వాహనం జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా మీదుగా వెళ్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. ఈఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎల్లగొండ లాలయ్య (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్సై శివరామకృష్ణ ఆస్పత్రిలో మృతుడి వివరాలు సేకరించారు. లాలయ్య కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మానుకోట శివారులో ఘటన మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి -
దొంగ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
పాలకుర్తిటౌన్:(దేవరుప్పుల) : అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సృజన్కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చింత సుదర్శన్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి దొంగ నోట్లు, ప్రింటర్, కారు, రూ. 8500 నగ దు, నాలుగు సెల్ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పాలకుర్తి ఇన్చార్జ్ సీఐ, వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్రావు పర్యవేక్షణలో స్థానిక ఎస్సై సృజన్కుమార్ ఆ నలుగురిని బుధవారం రిమాండ్ నిమిత్తం జనగామ జైలుకు తరలించారు. కాగా, దొంగ నోట్ల గుట్టు రట్టులో ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. ప్రింటర్, కారు, ఇతర సామగ్రి స్వాధీనం వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య -
వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలి
మహబూబాబాద్: లోతట్టు, వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం వర్షాకాలం సన్నద్ధతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నీరు నిల్వ కాకుండా కాల్వలను శుభ్రం చేయాలన్నారు. అత్యవసర స్పందన బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రమాదకరమైన చెట్లు తొలగించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ మూడురోజులు బంద్మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. ఈ నెల 26న శుక్రవారం మొహర్రం పండుగ, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. రైతులు సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు తమ పంట ఉత్పత్తులు తీసుకురావాలని సూచించారు. అడవులు, జంతువుల రక్షణకు సహకరించాలిగూడూరు: గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో అడవులు, జంతువుల రక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి (ఎఫ్డీఓ) వెంకటేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎఫ్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. మహబూబాబాద్ ఎఫ్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఉన్నతాధికారులు గూడూరు ఎఫ్డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఎఫ్డీఓ వెంకటేశ్వర్రావుకు ఎఫ్ఆర్వో ప్రసాదరావు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పిలికారు. -
కోలుకుంటున్న చిన్నారి పాయల్
● ఎంజీఎం ఐసీయూ వార్డులో చికిత్స చేస్తున్న వైద్యులు ● వారం రోజుల క్రితం తీవ్రంగా గాయపరిచిన కుక్క కాశిబుగ్గ: వరంగ ల్ లేబర్కాలనీ స మీపంలోని శాలి నీనగర్లో కుక్కకాటుకు గురైన చిన్నారి పాయల్ ఎంజీఎం ఆస్పత్రిలో కోలుకుంటోంది. శాలినీనగర్లో వారం రోజుల క్రితం జరిగిన కుక్కదాడి ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో చిన్నారి పాయల్ ముఖం, ముక్కు, కన్ను, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈఎన్టీ వార్డులో అడ్మిట్ అయిన ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందించడానికి వీలుగా పిల్లల వార్డులోని ఐసీయూలో ఉంచారు. ఈఎన్టీ డాక్టర్తోపాటు పిల్లల వైద్య నిపుణులు చిన్నారి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఒక దశలో పాయల్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండగా క్రమక్రమంగా కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాయల్ ఆరోగ్యం రికవరీ అవుతోందని, ప్రస్తుతం గాయపడిన చోట వైద్యులు కుట్లు వేసే దిశగా ప్రయత్నిస్తున్నారని ఆర్ఎంఓ అశ్వినికుమార్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాపాయం ఉంచి బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు. కూలిపని కోసం వచ్చి... పాయల్ కుటుంబం ఛత్తీస్గఢ్ నుంచి కూలిపని కోసం వచ్చి శాలినీనగర్లోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేసున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో వారు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంజీఎంలో అన్ని రకాల వైద్యసేవలు వైద్యసేవలు అందుతున్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. -
భవితకు బంగారు బాట..
ఖానాపురం : ఆ పాఠశాలలో సీటు సాధిస్తే భవిష్య త్ బంగారమే. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలు.. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం.. ఉద్యోగావకాశాల కోసం కావాల్సిన శిక్షణ..వెరసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అదే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గిరిజన సైనిక స్కూల్. 1985లో ఏర్పాటు చేసిన ఈ గిరిజన గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యాభ్యాసం పొందుతూ వస్తున్నారు. 2018లో గిరిజన గురుకుల పాఠశాలను గిరిజన సైనిక్స్కూల్గా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవతో గత ప్రభుత్వంలో సైనిక్స్కూ ల్ను ప్రారంభించారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయించి వసతులు కల్పించడంతో గిరిజన సైనిక్స్కూల్లో బోధనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 710 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 40 మంది అధ్యాపకులు, 27 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సైనిక్స్కూల్లో సీటు కోసం అనేక మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి సీటు పొందుతున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం, ఉద్యోగ అవకాశాల కోసం కావాల్సిన శిక్షణలు విద్యార్థులకు అందుతున్నాయి. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ.. గిరిజన సైనిక పాఠశాలలోని విద్యార్థులకు ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు, సా యంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆర్మీ ఉద్యోగా లకు కావాల్సిన శిక్షణను ముగ్గురు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, ముగ్గురు పీడీల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. సమయానికి నిద్రలేవడం, వ్యాయా మం, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి సుమారు 135 మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 71 మందికి ఉద్యోగాలు.. గిరిజన సైనిక్స్కూల్లో ప్రవేశాలు పొందిన అనంతరం విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు పడుతున్నాయి. అధ్యాపకులు ప్రత్యేక చొరవతో విద్యార్థులకు బోధన చేపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 71 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇందులో అగ్నివీర్లో 46, పోస్టల్శాఖలో 9, పోలీస్ శాఖలో (కానిస్టేబుల్) 5, జీడీ (కానిస్టేబుల్)లో 5, నేవీలో 3, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లో 3, అగ్నిమాపక శాఖలో(ఫైర్మెన్) 2 చొప్పున ఉద్యోగాలు సాధించారు. వీరితో పాటు ఎన్ఐటీ, ఐఐఐటీ, జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలకు 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.సైనిక్ స్కూల్.. గిరిజన విద్యార్థులకు వరం ప్రస్తుతం పాఠశాలలో 710 మంది స్టూడెంట్స్ ప్రతీ రోజు ప్రత్యేక శిక్షణలు ఇప్పటికే వివిధ ఉద్యోగాలు సాధించిన 71 మంది విద్యార్థులు -
అధికారుల కసరత్తు..
నెహ్రూసెంటర్: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా, పిల్లలకు అంగవైకల్యం రాకుండా ఉండేందుకు 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కలను పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలోని పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో 76 వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలుండగా.. వారికి ఈ నెల 28న పోలియో చుక్కలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోజు వేసుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. పిల్లలందరికీ పంపిణీ చేసేలా.. జిల్లాలోని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు పంపిణీ చేసేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 20 పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, 5 సీహెచ్సీలు, బస్తీ దవాఖానా, జీజీహెచ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో, అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 76వేల కు పైగా చిన్నారులను గుర్తించగా.. వారందరికీ పంపిణీ చేయనున్నారు. మూడు రోజులు .. పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆరోజు మిగిలిన పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి కార్యక్రమంలో భాగంగా చుక్కల మందు వేస్తారు. ఈ నెల 28న పోలియో చుక్కల పంపిణీ జిల్లాలో 76వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా వేయించాలిఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుంగా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు పింపిణీ చేస్తారు. చిన్నారులు మిస్కాకుండా చూసుకోవాలి. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్–మే నెలలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు బుధవారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా అందులో 5,260మంది విద్యార్థులు ఉత్తీర్ణత (41.33శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 33,205 మంది హాజరుకాగా 16,119 మంది విద్యార్థులు (48.54శాతం) ఉత్తీర్ణత సాధించారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు పి. వెంకటయ్య, తిరుమలాదేవి, నాగరాజు, ఆసిం ఇక్బాల్, పి. శ్రీనివాస్, పద్మజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామావెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్ నాయకపు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కేయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులకు అవకాశం.. డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.15రోజుల్లో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫీజులు చెల్లించని కళాశాలల ఫలితాలు నిలిపివేత.. సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. తమ ఫలితాలు కేయూ వెబ్సైట్లో కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. దీనిపై పలు కళాశాలల యాజమాన్యాలు పరీక్షల విభాగం అధికారులను సంప్రదించారు. ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు వెబ్సైట్లో పెట్టలేదని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దీంతో సాయంత్రం వరకు సుమారు 10 కళాశాలల వరకు యూనివర్సిటీకి ఫీజులు చెల్లించాయి. ఫలితంగా ఆ కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెల్లడించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకూ యూనివర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు నిలిపివేశామన్నారు. ఐదో సెమిస్టర్లో 41.33 శాతం, ఆరో సెమిస్టర్లో 48.54శాతం ఉత్తీర్ణత వర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల ఫలితాలు నిలిపివేత రీవాల్యుయేషన్ దరఖాస్తులకు అవకాశం -
నూతన కరిక్యులం, సిలబస్కు ఆమోదం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ కోర్సుల్లోని ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలల్లో నూతన కరిక్యులం, సిలబస్ను బుధవారం క్యాంపస్లోని కమిటీహాల్లో నిర్వహించిన ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాల అధిపతులు, బీఓఎస్లు, డీన్, అధ్యాపకుల సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల బీఓఎస్లు తమ విభాగాల్లోని నూతన కరిక్యులం, మార్పులు చేసిన సిలబస్ క్రెడిట్స్ గురించి ఈ సందర్భంగా వివరించారు. ఆయా పీజీ కోర్సుల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక అంశాలను సిలబస్లో ప్రవేశపెడుతున్నట్లు డీన్ బి. సురేశ్లాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు సుధాకర్రెడ్డి, విజయ, కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఆర్ట్స్, సోషల్సైన్స్ విభాగాల డీన్ బి. సురేశ్లాల్, ప్రొఫెసర్ పి. శ్రీనివాస్రావు, రాధికారాణి, మేఘనారావు, నిర్మల, దీపాజ్యోతి, కె. వీరస్వామి, చిర్రరాజు, కృష్ణయ్య, స్వర్ణలత పాల్గొన్నారు. ఆమోదం లభించని సోషల్ వర్క్ పీజీ కోర్సుల సోషల్సైన్స్లో ఒక్క సోషల్వర్క్ విభాగానికి సంబంధించిన నూతన పాఠ్యప్రణాళిక విషయంపై చర్చించిన సందర్భంగా వారానికి రెండు రోజులు ఫీల్డ్వర్క్కు కేటాయించటంపై ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సమావేశంలో వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో మళ్లీ ఆ విభాగం ఫీల్డ్ వర్క్ తగ్గించి కరిక్యులం, సిలబస్లోమార్పులు చేసుకోవాలని సంబంధిత విభాగం బీఓఎస్కు ఇతర ఆచార్యులు సూచించారు. దీంతో సోషల్వర్క్విభాగానికి సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం లభించలేదు. కాగా, ఈవిద్యాసంవత్సరం 2026–2027లోనే ఈ నూతన పాఠ్యప్రణాళికను అమలులోకి తీసుకొస్తారు. -
నిర్లక్ష్యం ఎవరిది?
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 7: 30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఓ బాలుడు అక్కడికక్కడే, ఇద్దరు ఎంజీఎంలో మృతి చెందారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఎల్లగౌడ్, అహ్మద్ చికిత్స పొందుతూ రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు అర్ధరాత్రి ముగ్గురి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరుసటి రోజు ఉదయం సుమారు 10: 30 గంటలకు పోస్టుమార్టం నిర్వహించాల్సిన వైద్యులు సాయంత్రం 4 గంటల సమయంలో నిర్వహించి 5 గంటలకు మృతదేహాలను అప్పగించారు. దీనిపై బంధువులు, స్థానికులు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై ‘దయనీయస్థితిలో మృతదేహాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఎంజీఎం అధికారులు వివరణ ఇచ్చారు. ముగ్గురి మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియలో వైద్యుల ఆస్యమేమీకాలేదని, పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించారన్నారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఘటనలో నిర్లక్ష్యం పోలీసులదా..? వైద్యులదా? అనే అంశంపై పలువురి అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సోమారం గ్రామ సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ పోస్టుమార్టం నిర్వహించే కిందిస్థాయి సిబ్బంది ఒక మృతదేహానికి రూ.5,500 ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో పోస్టుమార్టం ప్రక్రియ గంట ఆలస్యం చేశారని తెలిపారు. ఈ విషయాలపై ఎంజీఎం అధికారుల వివరణలో వాస్తవం లేదన్నారు. పోస్టుమార్టం ఆలస్యంపై ఎంజీఎం అధికారుల వివరణ -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుపతి–చర్లపల్లి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈనెల 25, 27వ తేదీల్లో చర్లపల్లిలో 18:10 గంటలకు బయలుదేరే చర్లపల్లి–తిరుపతి (07819) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు 20:00 గంటలకు చేరుకుని మరుసటి రోజు 07:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 26, 28వ తేదీల్లో తిరుపతిలో 15:00 గంటలకు బయలుదేరే తిరుపతి–చర్లపల్లి (07820) ఎక్స్ప్రెస్ కాజీపేటకు మరుసటి రోజు 2:30 గంటలకు చేరుకుని చర్లపల్లికి 04:30 గంటలకు వెళ్తుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్క్లాస్ కోచ్ల సౌకర్యంతో ఉన్న ఈ రైళ్లకు చర్లపల్లి–తిరుపతి మధ్య అప్అండ్డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. క్యాన్సర్తో చిన్నారి మృతి ● పర్వతగిరిలో విషాదం మహబూబాబాద్ రూరల్ : క్యాన్సర్(బోన్)తో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెలమల్ల నరేశ్, స్రవంతి దంపతుల రెండో కుమార్తె సాయిశృతి (13) నాలుగేళ్ల నుంచి క్యాన్సర్తో బాధపడుతోంది. దీంతో చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి బుధవారం మృతిచెందింది. కాగా, సాయిశృతి మృతితో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ● నేటి నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు -
29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల 29న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వరంగల్ రానున్నారు. ఈ దిశగా పర్యటన విజయవంతానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సభ నిర్వహణకు గాను బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్థల పరిశీలన చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని కుడా (హయగ్రీవచారి) మైదానం, వరంగల్లోని అజాంజాహి మిల్లు గ్రౌండ్, మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ను పరిశీలించారు. చివరకు హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో సభ నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్లో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్.గౌతం రావు మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంటా రవికుమార్, ఆయా జిల్లాల అధ్యక్షుడు బలరాం నాయక్, శశిధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. స్థల పరిశీలన చేసిన నాయకులు -
అర్ధరాత్రి ఇసుక దందా!
ఆకేరు, మున్నేరు వాగుల నుంచి విచ్చలవిడిగా అక్రమ రవాణా చిన్నగూడూరు మండలంలో ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు(ఫైల్) ●సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేసేందుకు కూపన్లు ఇస్తున్నారు. అయితే కూపన్లు ఇచ్చేందుకు గృహనిర్మాణ శాఖ, గ్రామ కార్యదర్శి ద్వారా ధ్రువీకరించిన పత్రాలు చూపించాలి. అప్పుడు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారు. ఇదే అదునుగా ఒక్క కూపన్ చూపించి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు కాకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు చేసి అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం. అర్ధరాత్రి వేళ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వేచ్ఛగా పగలు ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ ఆదేశించారు. కూపన్ల పంపిణీపై రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిఘా పెట్టాలని పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఇందిరమ్మ మొదటి విడత నిర్మాణాలు సగానికి మించి పూర్తయ్యాయి. దీంతో పలు మండలాల్లో ఇసుక కూపన్ల పంపిణీ నిలిపివేశారు. అయితే ఉదయం పూట కూపన్ల పేరుతో రవాణా చేయడంతో పాటు.. వారం రోజులుగా జిల్లాలో రాత్రిపూట ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు ప్రచారం. రాత్రి 10నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు నిరాటంకంగా రవాణా చేస్తున్నారు. నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు మండలాల్లో దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయినాకు ఆకేరు వాగు పక్కనే మూడెకరాల పొలం ఉంది. ప్రతీ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు సాగు చేస్తే పుష్కలంగా వరి పంట పండేది. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేద్దామన్న నీళ్లు నిల్వ లేని పరిస్థితి. ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. చెక్ డ్యామ్ కుడి ఆనకట్టకు మరమ్మతులు చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – భర్తాపురం కొమురెల్లి, రైతు, ఉగ్గంపల్లి రాత్రిపూట ఇసుక రవాణా నిలిపివేయాలిఆకేరు వాగు నుంచి రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో ముంగిమడుగు, రామన్నగూడెం, నర్సింహులపేట ప్రజలకు నిద్రలేకుండా పోతుంది. మితిమీ రిన వేగంతో ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం వేస్తుంది. అక్రమంగా రవాణా జరుగుతున్న ఇసుకను అధికా రులు అరికట్టాలి. రాత్రి వేళల్లో మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమ రవాణాను నియంత్రించి ఇందిరమ్మ ఇళ్లకు పేద లబ్ధిదారులకు తక్కువ ధరలకు పంపిణీ జరిగేలా చూడాలి. – కొంపెల్లి నరేష్, నర్సింహులపేట అధికారుల మౌనం వెనుక.. అర్ధరాత్రి ఆకేరు, మున్నేరు వాగుల నుంచి ఇసుకను తరలిస్తూ స్థానికంగా డంప్లు పోయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల సమీపంలో పోయడం, గోదావరి ఇసుకలో కలపడం వంటివి చేస్తున్నారు. మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు వారానికి ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.5వేలు, నెలకు రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం. జిల్లాలో సుమారుగా 300లకు పైగా ట్రాక్టర్లు ఈ దందాలో భాగం అవుతున్నట్లు ప్రచారం. ఇందుకోసం ఓ ఇసుక మాఫియా డాన్ అందరి వద్ద వసూళ్లు చేయించి.. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ రవాణాశాఖ అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి ప్రైవేట్లో అమ్మకాలు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు కలెక్టర్ ఆదేశించినా ఆగని అక్రమ సరఫరా -
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
మహబూబాబాద్ రూరల్ : బూత్స్థాయి ఏజెంట్లు పార్టీకి వెన్నెముక లాంటి వారని, ప్రతీ ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు క్యాడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా బీఎల్ఏల శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రామిరెడ్డి, బండి శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అర్థమయ్యే రీతిలో బోధించాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కేసముద్రం: విద్యార్థులకు ప్రాథమిక విద్యను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఇంగ్లిష్లో సంభాషిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం డీఈఓ మాట్లాడారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ఇన్చార్జ్ హెచ్ఎం ఆర్.ఏకాంబ్రం, పీఎస్ హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి, పీడీ కొప్పుల శంకర్, నాగేందర్, బేతి సత్యనారాయణ, మార్గం శ్రీనివాస్, సీఆర్పీ ఉదయ్ పాల్గొన్నారు. -
విద్యార్థినులు చదువులో రాణించాలి
మరిపెడ రూరల్: కేజీబీవీ విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జీఈసీఓ గాయత్రి అన్నారు, మంగళవారం మరిపెడ మండలం గుండెపూడి శివారు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. ఉదయం అల్పాహారం ప్రారంభంతో పాటు ప్రార్థన సమయంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు. ఈ ఏడాది 6వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులకు చెలిమి ప్రోగ్రామ్స్తో పాటు ఎస్బీ ద్వారా ప్రత్యక్ష బోధన, ఖాన్ అకాడమీ ద్వారా విద్య, సైన్స్ ల్యాబోరేటరీ, గ్రంథాలయం వినియోగం, క్రీడలు, వివిధ రంగాల్లో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీఆర్టీలతో మాట్లాడుతూ.. పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేసుకుని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఓ చాందిని, సీఆర్టీలు పాల్గొన్నారు. -
భూ సమస్య కొలిక్కి..
సాక్షి, మహబూబాబాద్ : నారాయణపురం గ్రామ భూ సమస్య త్వరలో కొలిక్కి రానుంది. అధికారులు దీనికి సంబంధించిన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో ఉన్న తండాలను కలుపుకుని ఉమ్మడి నారాయణపురం గ్రామాన్ని నెల్లికుదురు మండలం చెట్లముప్పారం రెవెన్యూ గ్రామం నుంచి వేరుచేసి రెవెన్యూ విలేజ్గా మార్చారు. ఆ తర్వాత కేసముద్రం మండలంలో కలిపారు. ఈ క్రమంలో పొరపాటున అధికారులు ఆ గ్రామ భూములన్నింటినీ అటవీ శాఖలో కలపగా, అప్పటి నుంచి ఆ గ్రామ రైతులకు రైతుబంధు (ప్రస్తుతం రైతు భరోసా), రైతుబీమా, బ్యాంకు రుణాలు అందకుండా పోయాయి. ఆ తర్వాత పలుమార్లు ఆ గ్రామ రైతులు మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. అలాగే, అప్పటి ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో వీరు పలు మార్లు అప్పటి కలెక్టర్ శశాంకతో చర్చించారు. చివరకు అప్పటి సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు కూడా ఈ సమస్య చేరింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. చివరకు సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. సిద్ధమవుతున్న పట్టాదారు పాస్ పుస్తకాలు పది సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు నోచుకోని నారాయణపురం రెవెన్యూ విలేజ్ రైతులకు త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించనున్నారు. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి అధికారులు, ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా తండ్రి పేరున ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరు పాస్ పుస్తకాలు ఇవ్వడం, చనిపోయిన వారి స్థానంలో వారసుల పేర్లు చేర్చడం, వివిధ కారణాలతో కాస్తులో ఒకరు, పట్టాదారుగా మరొకరు ఉన్న వాటిని పరిశీలించి నిజమైన రైతుకు పాస్ పుస్తకాలు అందచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ కేసముద్రం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పాస్ పుస్తకాల పంపిణీకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగాయన్నారు. పాస్ పుస్తకాల తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటే.. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడమా.. మెడికల్ కళాశాల ప్రారంభానికి రానున్న సీఎం చేతుల మీదుగా ఇప్పించడమా అనే విషయంపై చర్చ జరుగుతోంది.906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు సిద్ధం పొరపాట్లను సవరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం త్వరలో నారాయణపురం గ్రామ అన్నదాతల చేతుల్లోకి పట్టాలురాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారాయణపురం సమస్య తీరకపోవడంతో అక్కడి రైతులు పలుమార్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీ నాయక్ ద్వారా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత 15 రోజుల నుంచి నారాయణపురం సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ వివేక్ను ఆదేశించారు. దీంతో నారాయణపురం రెవెన్యూ పరిధిలోని నారాయణపురం, క్యాంపుతండా, పీక్లాతండా రైతుల భూమిని పరిశీలించి సర్వే నిర్వహించారు. చివరకు 1,411 భూ ఆధార్ మ్యాపింగ్లను గుర్తించారు. అటవీ, ఇతర ప్రభుత్వ భూములను వేరు చేశారు. చివరకు 906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
డబ్బులు ఇప్పించాలి
మహబూబాబాద్ రూరల్: మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యాపారి రెండు నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ధర్నా చేపట్టారు. వెంటనే డబ్బులు చెల్లించాలని మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా చేశారు. మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. రైతులు వెంకన్న, అనిల్ కుమార్, రాంజీ, కోటేష్, కట్టయ్య, నరేష్ మాట్లాడుతూ.. మానుకోట వ్యవసాయ మార్కెట్ పరిధిలో, మార్కెట్ బయట సుమారు 40 మంది రైతుల వద్ద నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ యజమాని శేఖర్ మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేశారన్నారు. మొత్తం రైతులకు చెందిన సుమారు రూ.40 లక్షలకుపైగా రావాల్సి ఉందన్నా రు. వెంటనే డబ్బులు ఇప్పించేలా వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ ను వివరణ కోరగా ఎన్.ఎస్.ట్రేడర్స్ యజమాని శేఖర్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మిర్చి, మొక్కజొన్న విక్రయించిన రైతులు డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ధర్నా -
ప్రభుత్వం సూచించిన విత్తనాలు వేయాలి
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నాణ్యమైన విత్తనాలు వేసి రైతులు లాభాలు పొందాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామ రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో 7 రకాల సన్న వరి విత్తనాలను రైతులు సాగు చేసుకుని, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయించినట్లయితే వెంటనే పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు తెలియజేయాలన్నారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలన్నారు. అదే విధంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని, రైతులు గమనించి ఆరుతడి పంటలైన పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను, విత్తన డీలర్లు ఏర్పాటు చేసిన వరి, పెసర, జీలుగ విత్తనాలను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం కాకుండా వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, కేసముద్రం పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్రెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఏఓ వెంకన్న, జిల్లా విత్తన డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నివేదికలు సమర్పించాలి మహబూబాబాద్: రోడ్డు నిర్వహణ మరమ్మతులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు సేఫ్టీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వైద్యం అందించాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మ్యాపింగ్ మార్కింగ్పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ఎన్నికల మ్యాపింగ్లో పారదర్శకత అవసరం అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు.. ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్నేహశబరీష్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ పక్కన 255 సర్వే నంబర్ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్నారు. ఆక్రమించిన భూమిని ప్రభుత్వ నిబంధనల ప్రకా రం స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళా ల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ కల్వల రైతువేదికలో విత్తన మేళాకు హాజరు -
గంజాయి రహిత సమాజమే లక్ష్యం
● ఎస్పీ శబరీష్ దంతాలపల్లి: గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్లాడ గ్రామంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతీ ఒక్కరు మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తే గ్రామాలు బాగుపడుతాయని అన్నారు. యువత మత్తుకు బానిసై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ప్రాణాలను కోల్పోవడమే కాకుండా కన్నవారికి కడుపుకోత మిగిల్చిన వారవుతారని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనం కలిగిన ప్రతీ ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి కుటుంబానికి రక్షణగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ గణేష్, ఎస్సై రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఆడిట్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో మంగళవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సంపత్రావు ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీ సభ్యులు పాఠశాల సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చే నిధులు వినియోగం, వనరులు, సదుపాయాలపై ఆడిట్ నిర్వహించారు. పాఠశాలకు వచ్చిన నిధులు, ఖర్చుల గురించి ప్రభుత్వానికి నివేదికను తయారు చేసి అందజేయనున్నారు. ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం సిరినాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కోచింగ్మహబూబాబాద్ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అర్హులైన మైనార్టీ విద్యార్థులకు నాలుగు నెలలు పాటు మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ హైదరాబాద్ సహకారంతో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి టీఏవీ.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, ఎస్ఎస్సీ, సీజీఎల్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఆర్ఆర్బీ, తెలంగాణ పోలీస్ నియామకాలు, ఐబీపీఎస్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్, ఇందిర ప్రియదర్శిని కౌన్సెలింగ్ సెంటర్ నాంపల్లి హైదరాబాద్లో నేరుగా విద్యార్థులు అందజేయాలని, పూర్తి వివరాలకు మానుకోట కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ ఆఫీస్ను సంప్రదించాలన్నారు. 791 పేద కుటుంబాల గుర్తింపుగంగారం: నీతి ఆయోగ్ స్కీంలో మండలంలో 791 పేద కుటుంబాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గుర్తించి నివేదిక రూపొందించారు. మండలంలోని గుర్తించిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సోమవారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్కు కలెక్టర్ వివరించారు. ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలితొర్రూరు: ఆర్టీసీ అభివృద్ధికి సిబ్బంది సహకరించాలని డీఎం ప్రసూనలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను మంగళవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ కుమార్, డిపో కార్యదర్శి జిలుకర యాదగిరి, నాయకులు ఎంకే రావు, సతీష్, సత్తయ్య, వనజ, రాజేశ్వరి, శ్రీలత, రాధిక, ధనుంజయ్, టీవై రెడ్డి పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వివిధ సంక్షేమ హాస్టళ్లను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు దాటినా విద్యార్థులందరూ రాకపోవడంతో సంక్షేమ హాస్టళ్లు వెలవెలబోతున్నాయన్నారు. సరైన మరుగుదొడ్లు, బాతురూమ్లు, తలుపులకు కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను జిల్లా అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండ్ల రాకేష్, చందు, విక్రమ్, వినోద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఛాతీపై కూర్చుని.. చున్నీతో గొంతు బిగించి..
నాగోలు: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య అత్యంత దారుణంగా గొంతు నొక్కి హత్య చేసింది. ఆత్మహత్యగా నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆమెను ఎల్బీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్నాయక్ (33)కు బోడ స్వరూపతో 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు వరంగల్ గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది. చిన్న కూతురు హయత్నగర్లో 8వ తరగతి చదువుతుంది. కొత్త కాలంగా నర్సింగ్ తన భార్యతో కలిసి ఎల్బీనగర్లోని ఎన్టీఆర్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కాగా, బోడ స్వరూపకు తన స్వగ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. దీంతో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి సర్ది చెప్పినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ మూడురోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపడానికి స్వరూప పథకం పన్నింది. ఈనెల 20న మధ్యాహ్నం తన భర్తను శారీరకంగా లొంగదీసుకుని, అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా చిత్రీకరించి నమ్మించే ప్రయత్నం చేసింది. అదేరోజు రాత్రి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటన స్థలాని కి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సింగ్ మృతిపై తన అన్న బిచ్యానాయక్ అనుమానం వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక ద్వారా నర్సింగ్ది హత్య అని తేలింది. నిందితురాలి అరెస్టు.. నిందితురాలు స్వరూప భర్తను హత్య చేసి తన ప్రియుడికి ఫోన్ చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేసింది. ఈ మేరకు సోమవారం పోలీసులు స్వరూపను అల్కాపురి వద్ద అరెస్టు చేసి, విచారణ చేయగా తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఏకాంత సమయంలో భర్తను హత్య చేసిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే! ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం విఫలం కేసు ఛేదించిన పోలీసులు.. భార్య అరెస్టు -
విగ్రహాల తొలగింపు.. భద్రపరిచేందుకు ఏర్పాట్లు
● ఫొటో, వీడియో చిత్రీకరణలో కొనసాగుతున్న పనులుకాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రాకారాల్లో విగ్రహాలు, ఉప ఆలయాల్లో మూలవిరాట్టులను తొలగిస్తున్నారు. ప్రధాన గర్భగుడిలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి జోడు లింగాలను అక్కడే మూసివేశారు. గర్భగుడి స్తంభా లను కూడా తొలగిస్తారు. ప్రాకారంలోని భారీ హ నుమాన్, మత్స్య విగ్రహాలను, ప్రధాన ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహం, శ్రీసరస్వతి అమ్మవా రి ఆలయంలోని విగ్రహాన్ని తీశారు. నవగ్రహాలు, స్పటిక లింగం తొలగించారు. ఇంకా శ్రీశుభానందా దేవి, శృంగీ, బృంగీ విగ్రహాలు, పడమర, దక్షిణం, ఉత్తర నందులు తొలగించాల్సి ఉంది. సరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లోని వెండి ఆభరణాలను భద్రపరుస్తున్నారు. తొలగించిన వి గ్రహాల కోసం ప్రత్యేకంగా దేవాదాయశాఖ ఏర్పా ట్లు చేపట్టింది. శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో ఫ్లైవుడ్తో బాక్స్లు తయారు చేస్తున్నారు. ఆ బాక్సుల్లో ధాన్యం పోసి విగ్రహాలను భద్రపరిచేందకు తమిళ శిల్పులతో తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ధాన్యం 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సుమారు 25మంది వరకు తమిళ శిల్పులు తొలగింపు పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులను ఫొ టోలు, వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ తొర్రూరు: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తొర్రూ రు ఆర్డీఓ గణేష్ అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి తీసుకుంటున్న దరఖాస్తులను నెలరోజుల్లో పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతీవారం నిర్వహించే ప్రజావాణిలో మండలస్థాయి అన్నిశాఖల అధికారులు హాజరు కావాలన్నారు. డీఎల్పీఓ పుల్లారావు, లేబర్ ఆఫీసర్ రవి, ఏటీడబ్ల్యూ ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్నాయక్, సీడీపీఓ రేష్మ, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్ ఉన్నారు. -
నిషేధిత బీటీ–3 విత్తనాల పట్టివేత
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు అక్రమ విక్రయాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సుమారు 12 కిలోల నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ, ని షేధిత విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే, సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రజా సమస్యలపై మీడియా అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల అధికారులు వేగంగా స్పందిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ కి గ్రామస్తుల కృతజ్ఞతలు -
బడికి పంపకండి..
డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకు చదువులు చెబుతాం‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది దంతాలపల్లి మండలం పెద్దముప్పా రం గ్రామానికి చెందిన ధర్మారపు వేణు. ఈయన కుమారుడు వరుణ్ తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం కల్పించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ఎంపికై న వరుణ్ ఆరో తరగతి నుంచి ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అయితే ‘రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు వి డుదల చేయడం లేదు.. మీ అబ్బాయికి చదువు చెప్పలేం.. మీకు ఫీజు చెల్లించే స్తోమత ఉంటేనే బడికి పంపించండి.. లేకపోతే వేరే పాఠశాలకు పంపించుకోండి’ అని పాఠశాల యాజమాన్యం మెసేజ్ పెట్టింది. దీంతో దిక్కుతోచని వేణు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన బిడ్డ పరిస్థితి ఏమిటని ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించుకున్నాడు.’ ●సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం పలురువు పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తోంది. ఇటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బోధనతో పాటు, హాస్టల్ వసతి, పుస్తకాలు, దుస్తులు, టై, బెల్ట్, షూ మొదలైన ఖర్చులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అయితే, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని, ఈ ఏడాది జిల్లాలోని పలు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అంటున్నాయి. మరి కొన్ని పాఠశాలలు డబ్బులు చెల్లించి విద్యార్థులను పంపించాలని చెబుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న తల్లిదండ్రుల పిల్లలు బడికి వెళ్తుండగా.. నిరుపేద విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. బడికి వద్దంటూ.. జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ ప్రైవేట్ పాఠశాల, లిటిల్ప్లవర్, పీఎస్ఆర్, అర్యభట్ట, మహబూబాబాద్ పట్టణంలోని విద్యాభివర్థని, ఎస్వీ విద్యాలయంలో 496 మంది చదువుతున్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ స్కూల్ మహబూబాబాద్ పట్టణంలోని విద్యాభారతి, కృష్ణవేణి, గాదె రుక్మారెడ్డి, డోర్నకల్ పట్టణంలోని సెయింట్ హానర్స్ పాఠశాలలో 260 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా 756 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు ఏడాదికి రూ. 28వేల చొప్పున, 5నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేలు, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 5నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేల చొప్పున చెల్లిస్తారు. అయితే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. మొత్తం రూ. 5కోట్లకు పైగా డబ్బులు రావడం లేదు. ఇప్పుడు పలు పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తేనే పిల్లలను పంపండి అని చెబుతున్నాయి.తల్లిదండ్రులు సతమతం ఫీజులు చెల్లిస్తేనే పిల్లవాడిని బడికి పంపించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. ఫీజులు చెల్లించే స్తోమత లేక పాఠశాలకు పంపించలేమని, అలాగని పిల్లవాడిని వేరే పాఠశాలకు పంపిస్తే చదువులు ఆగం అవుతాయని.. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రెండు, మూడు సార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాల మెసేజ్ అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు త్వరగా బకాయిలు చెల్లించాలని కలెక్టర్కు విన్నపం -
వెంకన్న మృతితో విషాదఛాయలు
మరిపెడ: భూపాలపల్లి డీటీఓ మద్దోజు వెంకన్న (45) మృతి తో మరిపెడ మున్నిపాలిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. డీటీఓ వెంకన్న సోమవారం భూపాలపల్లి ఆర్డీఓ కా ర్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆయన స్వస్థలం మరిపెడలో స్థానికులు, బంధువులు కన్నీరుమున్నీయ్యారు. మరిపెడకు చెందిన మద్దోజు బ్రహ్మయ్య, ధనమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉమారాణి, రమ, కుమారుడు వెంకన్న సంతానం. బ్రహ్మయ్య మరిపెడలో ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగ విరమణ పొందాడు. కాగా, వెంకన్నకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. విద్యాభ్యాసం.. డీటీఓ వెంకన్న మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో 3 నుంచి 7వ తరగతి వరకు చదివారు. 7నుంచి 10 వరకు మరిపెడ జెడ్పీపీఎస్ఎస్లో, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో, బీటెక్ హైదరాబాద్లో చదివారు. అనంతరం విద్యుత్ శాఖలో పరీక్ష రాసి 2006–07 మధ్య భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. సుమారు ఐదు సంవత్సరాల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం గ్రూప్–1 పరీక్ష రాసి ఆర్టీఓగా అశ్వరావుపేటలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జనగామ, జగిత్యాలలో ఆర్టీఓగా విధులు నిర్వహించి పదిహేను రోజుల క్రితమే డీటీఓగా భూపాలపల్లి జిల్లాకు ప్రమోషన్పై వచ్చారు. వెంకన్న పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి హన్మకొండ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఆర్టీఓ వెంకన్న పార్థివదేహాన్ని హనుమకొండ అశోక కాలనీలోని నివాసానికి తీసుకొచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజు, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెక్పోస్టులు ఎత్తివేసిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు ఇది సందర్భం కాదన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. అక్రమ రవాణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెంకన్న మృతి బాధాకరం.. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి బాధకరమని, క్రమశిక్షణ కలిగిన అధికారిని కోల్పోయామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే గండ్ర.. వెంకన్న పార్థివ దేహానికి నివాళులర్పించి మాట్లాడారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి డీటీఓ మృతికి కారణమైన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా చూస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కన్నీరుమున్నీరైన గ్రామస్తులు, బంధువులు -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
కార్యకర్తలకు అండగా ఉంటా
హన్మకొండ : రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఓటములు ఎదుర్కొన్నా పార్టీ వెంట నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాల బాట పట్టించిన ప్రతీ ఒక్కరిని పేరుపేరునా గుర్తుంచుకుని, వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోమవారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఆర్ఐ, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే ఏకై క లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం ఫరిడవిళ్తే, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం నెలకొందని విమర్శించారు. 30 నెలల కాలంలో రాష్ట్రానికి చేసిన మంచి పని ఒక్కటి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించే రేవంత్ రెడ్డి ముఠాను, అధికారులను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ని నమ్మి ఓటేస్తే అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం లబ్ధి జరిగింది, ఎన్ని కొత్త పథకాలు వచ్చాయి, ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంట్ కోతలు, కొత్తగా రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రలు, రైతుబంధు ఎగవేత, రైతుబీమా రద్దు ఇలా దుర్మార్గంగా రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రిని ఎంత తిట్టినా తక్కువేనన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం చేస్తా.. ప్రతీ గింజ కొంటా అని చెప్పి ఇప్పుడు మళ్లీ నాలుక మడతేసి తాను చెప్పిన తీస్మార్ ఖాన్ డైలాగులు మర్చిపోయి రేవంత్ రెడ్డి బుడ్డర్ఖాన్ మాటలు మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. నాడు రైతుబంధు మేమెందుకు ఎగగొడతాం.. దివానా గాల్లమా, మాకు జ్ఞానం లేదా? అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతుబంధుతో పాటు రైతన్నల ఎరువు, కరెంట్ అన్నింటిని ఎగగొట్టే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై తిరగబడి కొట్లాడితేనే పరిస్థితులు మారుతాయన్నారు. ఇంకో ఏడాదిన్నర కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలకొచ్చాన్నారు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు. సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాఽథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణా రెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏనుగుల రాకేశ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
పుస్తక భారం..
గుర్తింపు రద్దు చేయాలి ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులకు పుస్తకాలు అమ్మకాలు చేస్తున్న పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో గుర్తింపు రద్దు చేయాలి. జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేపట్టాలి. – బోనగిరి మధు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువ ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ఎంఈఓలు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాటించాలి. – సత్యనారాయణమూర్తి, డీఈఓ మహబూబాబాద్ అర్బన్: జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ కాకుండా యూనిఫామ్లు కూడా పాఠశాలల పరిధిలో సిబ్బందితో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంతైనా వెచ్చించి నాణ్యమైన విద్యను అందించేందుకు పోటీ పడుతున్నారు. ఈ పోటీనే ప్రైవేట్ పాఠశాలల పాలిట కల్పతరువుగా మారుతోంది. నిబంధనల ప్రకారం.. జిల్లాలో 121ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ గుర్తింపు పొందిన పుస్తకాలను తీసుకొని పాఠ్యాంశాలు బోధించాలి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంఈఓ కార్యాలయం ద్వారా వీరు పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఇక నోటుబుక్స్ విద్యార్థుల అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను గంపగుత్తగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కట్టబెట్టి తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. పుస్తకాల ధరలపై రెట్టింపుగా వసూలు చేయడం గమనార్హం. ఇష్టానుసారంగా ధరలు.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ధరలు రూ.280 నుంచి రూ.648వరకు ఉన్నాయి. అదనంగా నోట్బుక్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. గరిష్టం రూ.1,500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేల వరకు పుస్తకాల ఖర్చు అవుతుంది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల మోత మోగిస్తున్నాయి. యూకేజీ పుస్తకాలకు రూ.3100, స్పోర్ట్స్ డ్రెస్కు రూ.770, యూనిఫామ్కు రూ.750, టై ,బెల్ట్లకు రూ 200.. ఇలా అన్ని కలుపుకొని మొత్తం రూ.4800 వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.20 వేలు వరకు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ పుస్తకాల బిల్లు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలు యథేచ్ఛగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ దందా అధిక ధరలకు విక్రయాలు విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పింఛన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్శాఖకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అఽధికారులు పని చేయాలన్నారు. 172 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు తెలిపారు. వచ్చిన కొన్ని వినతులు పరిశీలిస్తే.. గూడూరు మండలం గాజులగట్టు గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు మొత్తం బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. వినతి ఇచ్చిన వారిలో రమేశ్, దేవా, ఈర్యా, వీరన్న ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులు జారీ చేయాలని, 2024 మార్చి నుంచి బకాయిలు ఇవ్వాలని వినతి అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, నాయకులు కిషన్ నాయక్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ ప్రజావాణిలో 172 వినతులు -
వరద కాల్వలను త్వరగా పూర్తి చేయాలి
మహబూబాబాద్: వరద కాల్వలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో వరద కాల్వల నిర్మాణ స్థలాలను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు వరద కాల్వలను నిర్లక్ష్యం చేయడం వల్లే వర్షాకాలంలో సమస్యలు వస్తున్నాయన్నారు. కాల్వల సమస్య పరిష్కారం కోసం రూ.12 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఈఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కార్యాలయ భవనం స్లాబ్ పెచ్చులు ఊడడం చూసి.. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్లు చిదిరాల అరుణ, బోడ రవి, డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. స్థల పరిశీలననెల్లికుదురు: తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటులో భాగంగా సోమవారం జాయింట్ డైరెక్టర్, ఇన్చార్జ్ ఆర్జేడీ పి.మదన్మోహన్ మండల కేంద్రంలో సోమవారం స్థల పరిశీలన చేశారు. అనంతరం డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ఈఈ అరుణ్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రకాశ్ బాబు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ హెచ్ఎంలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ (2024–25, 2025–26 బ్యాచ్ల రెగ్యులర్ విద్యార్థులకు) అలాగే 2023–24 ఎక్స్ విద్యార్థులకు పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలో 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. హనుమకొండలో పలు పరీక్ష కేంద్రాలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ పద్మజ సందర్శించి పరిశీలించారు. హనుమకొండలోని ఒక పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడగా సంబంధిత అధికారులు డీబార్ చేశారు. జూలై 6 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. -
ఆర్ఎంపీ వైద్యంపై విచారణ..
లింగాలఘణపురం : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారంలో ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి గౌసియాబేగం అనే మహిళ మృతి చెందండంపై డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు స్పందించారు. ఈ నెల 20న సాక్షిలో ‘ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్ఓ స్పందించి మండల వైద్యాధికారి ఉదయ్కిరణ్ను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో సోమవారం ఆయన కుందారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సదరు మహిళ ఎప్పుడు మృతి చెందింది.. ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ ఇంటికి వెళ్లి విచారణ చేయగా తాను ఎలాంటి వైద్యం చేయడం లేదని, సదరు మహిళ ఓ ఇంజక్షన్ తీసుకొచ్చి ఇవ్వాలని వేడుకోవడంతో ఇచ్చానని, తాను ఎలాంటి వైద్యం చేయడంలేదని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్కిరణ్ను వివరణ కోరగా నివేదికను డీఎంహెచ్ఓకు సమర్పించనున్నట్లు వివరించారు. డీఎంహెచ్ఓకు నివేదిక ఇవ్వనున్న మండల వైద్యాధికారి -
ఎంజీఎంలో దయనీయ స్థితిలో మృతదేహాలు
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీలో తరలించారు. అయితే ఆ మృతదేహాలు కొంత సమయం వరకు దయనీయ స్థితికి చేరుకున్నాయి. పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై బోగం ప్రవీణ్, సిబ్బంది ఉదయం 10గంటలకే ఎంజీఎం మార్చురీ వద్దకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే పోస్టుమార్టం నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించారు. దీంతో మృతుల బంధువులో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం.. ఒక్కొ మృతదేహానికి రూ.5,500 చెల్లిస్తేనే పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు ఖరాకండిగా చెప్పడంతో మృతుల బంధువులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ప్రక్రియకు డబ్బులు అడగడం సిగ్గుచేటన్నారు. చరణ్కు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం.. మృతుడు బుద్దె చరణ్ స్నేహితుడు చరణ్ ప్రాణా పాయ స్థితిలో ఉండగా అతని బంధువులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. అయితే ఆస్పత్రిలో చేర్పించి రెండు గంటలు గడిచినా వైద్యులు చరణ్కు ప్రాథమిక చికిత్స చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు ఆరోపించారు. ప్రాథమిక చికిత్స చేయకపోవడంతో హనుమకొండ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు.. మండల కేంద్రంలోని ‘మారి’ సంస్థ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలిని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్ సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు. పోస్టుమార్టం నిర్వహణలో వైద్యుల నిర్లక్ష్యం ఒక్కో మృతదేహానికి రూ.5,500 చెల్లించాలని హుకుం ఆందోళన వ్యక్తం చేసిన మృతుల బంధువులు -
విత్తనానికో పండుగ
కొత్తగూడ : కడుపు నింపే ఎలాంటి ధాన్యం అయినా విత్తనం నుంచి రావాల్సిందే. అందుకే ఆదివాసీ సమాజం విత్తనాన్ని దైవ సమానంగా భావించి దీనిని మొదటి పండుగగా నిర్వహిస్తారు. తొలకరి పలకరించిందంటే ఏజెన్సీ గూడెల్లో విత్తన పండుగ సందడి మొదలవుతుంది. గ్రామంలోని పెద్దలు ఒక రోజు నిర్ణయించుకుని ఆ రోజు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. ముందుగా ఇలవేల్పులకు ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. వెదురు బుట్టల ను ఆవు పేడతో అలికి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఆ బుట్టల్లో నవ ధాన్యాలు పోసుకుని ఇంటికో బుట్ట తీసుకుని సంప్రదాయ వాయిద్యాలతో బొడ్రాయి (గ్రామ దేవత) వద్దకు చేరుకుంటారు. గ్రామ దేవతను నీటితో అభిషేకించి ముగ్గు వేసి చిన్న గొయ్యి నాగలి కర్రుతో తవ్వుతారు. గ్రామ పెద్ద గొయ్యిలో నవ ధాన్యాల్లో కొన్ని తీసి పోస్తాడు. అనంతరం మిగతా వారు తలా కొన్ని ఆ గొయ్యిలో వేస్తారు. దాన్ని పూడ్చి నీరు పోస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లిస్తారు. ఈ పండుగ చేయనిదే ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు విత్తనం వేయరు. కాగా, శనివారం ఆదివాసీలు విత్తన పండుగ జరుపుకున్నారు. గ్రామదేవత వద్ద నవధాన్యాలు వేస్తున్న కొత్తగూడ గ్రామస్తులు, వెదురు బుట్టల్లో నవధాన్యాలతో ఆదివాసీలు మా తాతల కాలం నుంచి విత్తన పండుగ ఆనవాయితీగా వస్తోంది. విత్తనాన్ని మేం దైవంగా భావిస్తాం. విత్తనానికి పూజ చేయనిదే ఎవుసం మొదలు పెట్టం. గ్రామ దేవతల ఆశీర్వాదం, పంచ భూతాల సాకారం కోరుతూ విత్తన పండుగ చేసుకుంటాం. – మల్లెల రామయ్య, గ్రామపెద్ద, కొత్తపల్లిఆదివాసీ సమాజం ప్రకృతితో మమేకమై ఎన్నో పండుగలు నిర్వహిస్తుంది. అందులో విత్తన పండుగ ఒకటి. ఇలాంటి పండుగలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి. విత్తన పండుగకు ఒక తేదీ నిర్ణయించి సెలవు ప్రకటించాలి. ఉద్యోగులు, విద్యార్థులు విత్తన పండుగలో పాల్గొనే అవకాశం కల్పించాలి. – నర్సింగరావు, తుడుందెబ్బ నాయకుడు ఆదివాసీ గూడెల్లో సందడి.. మృగశిర కార్తెతో వ్యవసాయం మొదలు -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
‘కార్పొరేషన్’లో అభ్యర్థులను నిలబెడతాం
● దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ సుదర్శన్ ఖిలా వరంగల్ : రానున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 స్థానాలకు దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి అభ్యర్థులను స్వతంత్ర హోదాలో నిలబెడతామని రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ మొగిలిచెర్ల సుదర్శన్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్లోని సమాఖ్య కార్యాలయంలో మురహరి కార్తీక్ అధ్యక్షతన వినియోగదారుల సమాఖ్య సమితి డివిజన్ బాధ్యుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుదర్శన్ హాజరై మాట్లాడారు. సెలెక్టెడ్ కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిడ్డి లక్ష్మీనారాయణ అభ్యర్థుల ఎంపిక చేశారని, డివిజన్కు 10 నుంచి 14 మంది గుర్తించి 120 స్థానాల్లో 1,367 మందిని కమిటీ ఎంపిక చేసిందని గుర్తు చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా విభాగాలకు సమానంగా ఉన్నారని వివరించారు. ఓటు అమ్ముకోకుండా ఓటింగులో ఎంత మంది పాల్గొన్నారనేది ఒక సామాజిక పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్స్ మురరిశెట్టి యశ్వంత్కుమార్, ఆర్.ఆనందరావు, బండి అనిల్కుమార్, బత్తిని శ్రీనివాస్రావు, కృపాకర్, సభ్యులు హరికృష్ణ, సాయిచంద్, రాజేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాలకు గుర్తింపు లేదు
● ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : త్యాగాలకు గుర్తింపు, గౌరవం లేదని తెలంగాణ ఉద్యమకారుల్లో ఆవేదన ఉందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మహబూబాబాద్లోని ఓ గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ జిల్లా సదస్సు ఆదివారం నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరుడు, జయశంకర్ చిత్రపటానికి కోదండరాం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీకి తెలియజేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను కూడా ఉద్యమకారులుగానే గుర్తించాలన్నారు. తెలంగాణ సంస్కృతిపై దాడులు.. తెలంగాణ సంస్కృతిపై ఇటీవల దాడులు జరుగుతున్నాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రానివ్వడం లేదని కొంతమంది హైదరాబాద్లో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారు తీసిన సినిమాలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, వారికి ఆదాయం తెలంగాణ ప్రజలు తీసుకున్న టికెట్ల రూపంలో రావడం లేదా అని వివరించారు. రావాల్సిన గోదావరి, కృష్ణా నదుల నీటి వాటా గురించి మాత్రం మాట్లాడరని తెలిపారు. ఎస్ఐఆర్ విషయమై మాట్లాడుతూ ఓటు నమోదు చేసుకోవాలని, లేకుంటే ఓటు హక్కు ముడిపెడితే అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు పిల్లి సుధాకర్, మేక సురేష్రెడ్డి, పీరయ్య, శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, లింగన్న, చంద్రన్న, వెంకన్న శ్రీశైలం, శంతన్రామరాజు, కేకే, ఐల్లేష్, మల్లయ్య, హరి, సత్యనారాయణ, పాల్గొన్నారు. -
‘హామీలు విస్మరించిన ప్రభుత్వం’
హన్మకొండ: ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఓ హోటల్లో జరిగిన రైతు, ప్రజా సంఘాల జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యం కొంటామని చెప్పి ప్రభుత్వం చేతులెత్తేసిందని, రూ.500 మద్దతు ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరం మేరకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, బోనస్, కరెంట్ సరఫరాలపై కోతలు విధించి రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిందన్నారు. బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, రాయపాటి వెంకటేశ్వర్ రావు, చకిలం రాజేశ్వర్ రావు, సాయికుమార్, గోపాల్ రావు పాల్గొన్నారు. -
‘సైక్లింగ్’ అభివృద్ధికి కృషి చేద్దాం
వరంగల్ స్పోర్ట్స్ : సైక్లింగ్ క్రీడా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. రెడ్డికాలనీలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బొద్దిరెడ్డి హాజరై మాట్లాడారు. హనుమకొండలో జూలై, ఆగస్టులో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. యువతలో ఫిట్నెస్పై అవగాహన పెంపొందించడంతో పాటు సైక్లింగ్ను ఒక క్రీడ పోటీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాష్ యాదవ్, హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అడప వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఐత కిషన్, కోశాధికారి గద్దల అనిల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యవర్గ సభ్యులు దుపాకి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు తీగల సుదన్, రామకృష్ణ, అక్రమ్, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి -
నిత్యం యోగా సాధన చేయాలి
● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. ఆదివారం వరంగల్ కమిషనరేట్లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కమిషనరేట్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగా, ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యే పోలీసులకు యోగా ఓ దివ్య ఔషధమని వివరించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసినందుకు భారతీయులుగా మనం గర్వపడాల్సి ఉంటుందని తెలిపారు. ‘పచ్చదనం–దేశభక్తి–క్రమ శిక్షణ’ అనే మూడు విలువలను ప్రతిబింబించేలా పచ్చని మొక్కలతో ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు సురేష్కుమార్, శ్రీనివాస్ యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రతినిధి శోభ, ధ్యాన శిక్షకురాలు మాధవితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీలో డ్రైవర్లే కీలకం
హన్మకొండ : టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల పాత్ర కీలకమని, డ్రైవింగ్తోపాటు కండక్టర్ బాధ్యత నిర్వహిస్తున్నారని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ పద్మాక్షికాలనీలోని దేవాలయ ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ డ్రైవర్ల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ గతంలో ఒక్క యాక్సిడెంట్ విషయంలోనే ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు టికెట్ జారీ, బస్సులు సరిగ్గా ఆపలేదని, కేఎంపీఎల్ తీసుకురావడం లేదని వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట చేయని తప్పునకు శిక్ష విధిస్తున్నారని మండిపడ్డారు. వన్మ్యాన్ సర్వీస్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, ఘాట్ రోడ్లలో 14 గంటల పాటు వన్మ్యాన్ సర్వీస్లపై విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా ఉందన్నారు. సింగిల్ క్రూ డ్యూటీలతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. సదస్సులో చేసిన తీర్మానాలు.. శాసీ్త్రయమైన రూట్ సర్వే చేసి డ్యూటీ 141 చార్టు తయారు చేయాలి. ఎండీడబ్ల్యూ యాక్ట్కు అనుగుణంగా డ్యూటీలు మార్చాలి. 12 గంటలకు మించి డ్యూటీ ఉండరాదు. 12 గంటల డ్యూటీకి స్పెషల్ ఆఫ్ విధిగా అమలు చేయాలి. ట్రాఫిక్ చలాన్లకు డ్రైవర్ను బాధ్యుడి చేయొద్దు, చలాన్లు సంస్థే భరించాలి. ఎక్స్ప్రెస్ డ్యూటీలు, ఘాట్ రోడ్ల రూట్లో కండక్టర్ సర్వీస్లు నడుపాలి. రాత్రి పూట 4 గంట లకు మించి డ్రైవింగ్ చేయకుండా డ్యూటీలు వేయా లి. వేసవిలో రోజుకు రూ.100 చొప్పున హీట్ అలవెన్స్ ఇవ్వాలి. డ్యూటీ రిపోర్టింగ్ చేయకముందే బ్రీ తింగ్ టెస్ట్ చేయాలి. 30 ఎంజీ/100 గ్రాములు దా టితే ఆ రోజు డ్యూటీకి పంపొద్దు, మూడుసార్లు పా జిటివ్ వస్తే రిహాబిలిటేషన్ సెంటర్కు పంపాలి. ఉ ద్యోగ భద్రత 2022 గైడ్లైన్స్ రద్దు చేయాలి. ఎంవీ యాక్టు 2019 సెక్షన్ 178 (2ఏ), (2బీ)ని అమలు చే యాలి. డ్రైవర్పై కేసులు రాయొద్దు, స్పాట్ ఎక్స్ప్లనేషన్, డిపోస్పేర్ రద్దు చేయాలి. ఎస్డబ్ల్యూఎఫ్ ప్ర చార కార్యదర్శి పీఆర్ రెడ్డి, సీహెచ్ రాంచందర్, బ త్తుల సుదాకర్, శ్రీనివాస్, తాళ్లపల్లి ఎల్లయ్య, ఉపే ంద్రచారి, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు పాల్గొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు పద్మాక్షికాలనీలో ఆర్టీసీ డ్రైవర్ల రాష్ట్రస్థాయి సమావేశం -
ప్లాట్లు, ఫ్లాట్లకు ‘కుడా’ వేలం
నయీంనగర్ : హనుమకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేడ్కర్ భవన్ సమీపంలో నిర్మించిన ఫ్లాట్లకు ఆదివారం ‘కుడా’ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. కుడా వైస్ చైర్పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమక్షంలో నిర్వహించిన ఈ వేలానికి బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. బాలసముద్రంలో ఉన్న కమర్షియల్ ప్లాట్లకు సంబంధించి గజానికి కనీస ధర రూ.65 వేలు నిర్ణయించారు. వేలంలో బిడ్డర్లు పోటీపడగా గరిష్టంగా రూ.97 వేల వరకు ధర పలికింది. మొత్తం 8 కమర్షియల్ ప్లాట్లలో 6 ప్లాట్లు అమ్ముడయ్యాయి. అంబేడ్కర్ భవన్ సమీపంలో కుడా ఆధీనంలో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లు వేలం వేశారు. రెండు ఫ్లాట్లను బిడ్డర్లు చదరపు అడుగుకు రూ.4,200 చొప్పున దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా కుడాకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాట్లు, ఫ్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లకు కుడా వీసీ, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అలాట్మెంట్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాట్లు, ఫ్లాట్ల వేలానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. భవిష్యత్లో కూడా ప్రజలకు మరిన్ని నాణ్యమైన కుడా ప్లాట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, బిడ్డర్లు పాల్గొన్నారు. -
బావిలో పడి యువకుడి మృతి
మహబూబాబాద్ రూరల్ : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. టౌన్ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బెస్త బజారుకు చెందిన దుగ్గి మురళి (30) స్థానిక వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకపోవడంతో తల్లి పద్మ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అతడు పనిచేసే షాపు యజమానికి ఫోన్ చేసి అడగగా మురళి బుధవారం షాపునకు రాలేదని చెప్పాడు. దీంతో మురళి ఆచూకీ కోసం తల్లి చుట్టుపక్కల వారికి, తెలిసిన వారికి చెప్పగా ఎలాంటి సమాచారం లభించలేదు. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వ బాలుర కళాశాల సమీపంలో గల బావిలో ఒకరు మృతి చెంది ఉన్నట్లుగా స్థానికులు చెప్పారు. దీంతో పద్మ, ఆమె చిన్నకుమారుడు సురేష్ అక్కడికి వెళ్లి పరిశీలించి చూశారు. మృతిచెందిన వ్యక్తి మురళిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టంకు మృతదేహాన్ని తరలించారు. -
అర్హత లేకున్నా అందలం!
హన్మకొండ చౌరస్తా: ‘వడ్డించే వాడు మనోడైతే .. పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే’ అనే సామెత వరంగల్ ప్రభుత్వ ఐటీఐ అధికారులకు సరిగ్గా సరిపోతుంది. జీఓలు, నిబంధనలను పక్కనపెట్టి మరీ ఓ ఉద్యోగికి పదోన్నతి కల్పించారు. అలా ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు పదోన్నతి కల్పించి మనవాడేనని అనిపించుకున్నారు. ఇదేమని నిలదీస్తే అ తడికి అన్ని అర్హతలు ఉన్నాయంటూ బుకాయించా రు. అనుమానం వచ్చిన సహచర ఉద్యోగులు స మాచార హక్కు చట్టం ద్వారా అక్రమ పదోన్నతి పొ ందిన ఉద్యోగి చిట్టాను బయటికి తీశారు. న్యాయంగా తమకు రావాల్సిన పదోన్నతిని అక్రమంగా మరొకరికి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 23కు విరుద్ధంగా.. ఐటీఐలో ఉద్యోగులు డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందాలంటే 24 జూన్ 1995లో ప్రభుత్వం జీఓ 23ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం డీటీఓ, టీఓగా పదోన్నతి పొందాలంటే హైదరాబాద్లోని సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ఏడాది పాటు శిక్షణ పొందాలి. అందులో పొందుపరిచిన 5 సబ్జెక్టుల్లో సెమిస్టర్ ప్రకారం ఉత్తీర్ణత సాధిస్తే నేషనల్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికెట్ను అందిస్తారు. ఆ సర్టిఫికెట్ను పొందిన వ్యక్తికి మాత్రమే సీనియారిటీ, మెరిట్ ఆధారంగా పదోన్నతి కల్పించాలని జీఓ స్పష్టంగా చెబుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ట్రైనింగ్ ఆఫీసర్గా.. హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి హనుమకొండ ములుగురోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో టెక్నికల్ అసిస్టెంట్గా 1999లో కొలువులో చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఇక్కడే విధులు నిర్వహించాడు. 2003లో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా పదోన్నతిపై మహబూబ్బాద్కు బదిలీపై వెళ్లాడు. 2019లో మరోసారి పదోన్నతి.. అప్పటికే సీటీఐ పాస్ కాకుండానే డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్గా అక్రమ పదోన్నతి పొందిన సదరు ఉద్యోగికి 2019లో ట్రైనింగ్ ఆఫీసర్గా మరోసారి పదోన్నతి కల్పించారు. ఇప్పుడు కూడా సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా సంవత్సరం శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించాలి. అయితే సెమిస్టర్ పద్ధతులను పక్కనపెట్టి మాడ్యులర్గా మార్కులను ఆధారంగా చూపించి పదోన్నతి పొందాడు. ఇద్దరితో కూడిన కమిటీ విచారణ.. సదరు ఉద్యోగి అక్రమంగా పదోన్నతి పొందడంటూ సహచర ఉద్యోగులు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చిన ఆధారాలను ఐటీఐ ఆర్డీడీ ముందుంచారు. దీంతో పూర్తి విచారణ కోసం ఇద్దరితో కూడిన కమిటీని నియమించారు. విచారణ చే సిన కమిటీ సైతం సీటీఐగా ఉత్తీర్ణత సాధించలేదని, అతడు అక్రమంగా పదోన్నతి పొందాడని 2024 ఏప్రిల్ 8న నివేదిక అందజేసి, కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. స్పందించిన కలెక్టర్ వివరణ కోరగా సదరు ఉద్యోగి ఇచ్చిన వివరణతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్కు సూచించారు. డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం..అక్రమ పదోన్నతి లాంటి అంశాలపై లిఖిత పూర్వకంగా ఇస్తే పరిశీలిస్తాం. మా ఉన్నతాధికారులు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చూస్తాను. పదోన్నతులే కాకుండా ఎలాంటి అక్రమాలు జరిగినా పూర్తి ఆధారాలతో మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకోవడానికి మేము, మాపై అధికారులు ఎప్పుడు సిద్ధమే. – రాజా, ఆర్డీడీ, ఐటీఐ వరంగల్మహబూబాబాద్లో ఏటీఐగా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వర్తించిన సదరు ఉద్యోగి 2012లో ఉట్నూరు ఐటీఐలో డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్గా కండీషన్తో పదోన్నతిపై వెళ్లాడు. సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉత్తీర్ణత సాధించకపోతే ప్రమోషన్ రివర్షన్ చేస్తామని కండీషన్లో పేర్కొన్నారు. కేవలం మూడు నెలలు శిక్షణకు హాజరైన ఉద్యోగి ఉన్నతాధికారులకు మాత్రం శిక్షణ పూర్తయినట్లు తప్పుడు నివేదిక అందజేశారు. నివేదికను అధికారులు పట్టించుకోకుండా 2012లో ఉట్నూరు ఐటీఐలో డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించారు. ప్రభుత్వ ఐటీఐలో అక్రమ పదోన్నతి ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి తమకు అన్యాయం చేశారని సహ ఉద్యోగుల ఆవేదన -
వరంగల్ ఆర్వోపై విజిలెన్స్ ఆరా!
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏసీబీ దాడులు జరిగి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్కు గురైన కూడా వరంగల్ ఆర్వో తీరు మారలేదని, అక్రమ వసూళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తెలిసింది. కొంతమంది రాత్రి వేళ సైతం కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటున్నట్లు సమాచారంతో నిఘా పెంచినట్లు వినికిడి. విష ఆహారం తిని కోళ్లు మృత్యువాత! నర్సంపేట రూరల్ : విష ఆహారం తిని 500 కోళ్లు మృతిచెందిన సంఘటన నర్సంపేట పట్టణంలోని నాగుర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మాధన్నపేటకు చెందిన కందికొండ సదానందం కొన్ని నెలలుగా నాగుర్లపల్లి శివారులో నాటుకోళ్ల ఫాం ఏర్పాటుచేసి కోళ్లను పెంచుతున్నాడ. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దాణవేసి నీళ్లు పెట్టి వెళ్తుంటాడు. ఈక్రమంలో ఆదివారం కోళ్ల ఫాం వద్దకు వచ్చి చూడగా కోళ్లన్ని మృతి చెంది కనిపించాయి. సుమారు 500 కోళ్లు మృత్యువాత పడ్డాయని, వీటి విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపారు. కోళ్లు తినే ఆహారంలో విషప్రయోగం జరిగి ఉంటుందని భావిస్తున్నాడు. ఈవిషయమై నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు సదానందం తెలిపారు. పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుకఖిలా వరంగల్: వరంగల్ ఎస్ఆర్ఆర్తోట సమీపంలోని ఓ కిరాణా షాపులో ఆదివారం కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. బాధితుడి కథనం ప్రకారం.. కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ప్యాకెట్ను కట్ చేయగా అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించింది. వెంటనే అతడు కిరాణా యజమానిని నిలదీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు పెరుగు ప్యాకెట్ విక్రయించిన షాపును పరిశీలించారు. వెంటనే ఆ బ్యాచ్కి సంబంధించిన ప్యాకెట్ల అమ్మకాలు నిలిపివేశారు. జనగామలో 50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్ ఏరియా, హనుమకొండ భవానీనగర్లోని షాపుల్లో ఆ బ్యాచ్కి చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విక్రయించొద్దని షాపు నిర్వాహకులను ఆదేశించారు. వరంగల్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ మౌనిక కరీమాబాద్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, ఆ బ్యాచ్కు సంబంధించిన పెరుగు అమ్మకాలు నిలిపివేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్/మహబూబూబాద్ అర్బన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ మానుకోట శాఖ ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక గిరిజన భవన్లో అంతర్జాతీయ యో గా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకుని, ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ప్రధానంగా యువత యోగాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒత్తిడి, ఉరుకులు, పరుగుల జీవితంలో శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా అసరమన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగాతో అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఆరోగ్యాన్ని మించిన అస్తి లేదనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్రామానుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులు గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుదశ చెల్లింపు (రూపాయల్లో) పునాది పూర్తి 1,00,000 లెంటెల్ స్థాయి 1,50,000 స్లాబ్ పూర్తి 1,50,000 ఇల్లు పూర్తి 1,00,000 మొత్తం 5,00,000జిల్లా నియోజకవర్గాలు మంజూరు పూర్తి హనుమకొండ 2 8,000 2,400 వరంగల్ 3 9,000 1,760 జనగామ 2 5,600 1,860 మహబూబాబాద్ 2 10,148 2,750 ములుగు 1 5,100 1,165 జేఎస్ భూపాలపల్లి 1 4,152 565 మొత్తం 11 42,000 10,500 -
ప్రశాంతంగా ‘నీట్’
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగింది. సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 353 మంది విద్యార్థులకు 307 మంది హాజరై.. 46 మంది గైర్హాజరయ్యారు. మోడల్ స్కూల్లో 144 మంది విద్యార్థులకు 123 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరయ్యారు. బాలబాలికలను వేర్వేరుగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఇద్దరు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ శబరీష్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, తహసీల్దార్ రాజేశ్వరరావు, సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి పాల్గొన్నారు. -
వరదొస్తే.. వణుకే
డోర్నకల్ : డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని కొర్లకుంటకు వరద పోటెత్తితే చర్చి కాంపౌండ్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతేడాది భారీ వర్షాలతో కొర్లకుంటకు వరద పోటెత్తి రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలతో పాటు సుభాష్వీధి ముంపునకు గురయ్యాయి. కొంతమంది కుంటలోని కొంతభా గాన్ని ఆక్రమించి కట్టను తొలగించి చదును చేయడంతో కాల్వ నుంచి పెద్ద చెరువుకు వెళ్లాల్సిన వరద రైల్వే స్టేషన్ను ముంచెత్తి రైల్వే కాలనీల్లోకి వచ్చింది. ఆసమయంలో రైల్వే ఉద్యోగులు ఇబ్బందు పడ్డారు. ప్రస్తుతం అప్రమత్తమైన రైల్వేశాఖ కుంటకు అడ్డుగా రక్షణ గోడ నిర్మిస్తోంది. కాగా, కుంట కాల్వ పూడుకుపోవడంతో వరద వస్తే చర్చికాంపౌండ్తో పాటు పలు కాలనీలు నీట మునగనున్నాయి. 20 ఎకరాల్లో కుంట.. రైల్వే జంక్షన్ సమీపంలో 19, 21 సర్వే నంబర్లలో 20 ఎకరాల్లో కొర్లకుంట విస్తరించి ఉండగా దీనిలో 12 ఎకరాల భూమి ఓ వ్యక్తి పేరిట పట్టా ఉంది. ఎగువ ప్రాంతంలోని గార్ల మండల పరిధి వెంకటాపురం, వడ్లకుంట, శనగకుంట తదితర ప్రాంతాల్లోని వరద నీరు కొర్లకుంటకు చేరుకుని తూము మత్తడి ద్వారా జయపురం, చర్చి కాంపౌండ్, నెహ్రూస్ట్రీట్ ప్రాంతాల మీదుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర కాల్వ నుంచి పెద్ద చెరువుకు వరద ప్రవహిస్తుంది. ముంచెత్తిన వరద.. గత ఏడాది సెప్టెంబర్ 30న భారీ వర్షాలతో కొర్లకుంటకు వరద పోటెత్తింది. కుంట నుంచి వరద వెళ్లే మార్గం లేకపోవడంతో సమీపంలోని రైల్వే ట్రాక్ మీదుగా రైల్వే స్టేషన్లోకి భారీ వరద ప్రవేశించింది. దీంతో రైల్వే ట్రాక్ మునగడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచాయి. రైల్వే స్టేషన్ నుంచి వరద రైల్వే కాలనీల్లోని ఇళ్లను ముంచెత్తడంతో రైల్వే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేషన్లోకి వరద రావడంతో 24 గంటల పాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. మేల్కొన్న రైల్వేశాఖ... కొర్లకుంట వరద రైల్వే స్టేషన్ను ముంచెత్తడంతో మేల్కొన్న రైల్వేశాఖ కుంట పక్కన రైల్వే జంక్షన్ పరిధి స్థలంలో భారీ గోడ నిర్మాణం చేపట్టింది. కుంట పరిధిలో భవిష్యత్లో వరద ముప్పు రాకుండా గోడను పటిష్టంగా నిర్మిస్తున్నారు. కొర్లకుంటకు అడ్డుగా రైల్వేశాఖ రక్షణ గోడ నిర్మాణం గత వానాకాలంలో రైల్వే స్టేషన్, రైల్వే కాలనీలను వరద ముంచెత్తడంతో నిర్ణయం మూసుకుపోయిన కాల్వతో చర్చి కాంపౌండ్కు తీవ్ర ముప్పు పలు కాలనీవాసుల ఆందోళనపాలకుల నిర్లక్ష్యం.. కొర్లకుంట ఆక్రమణకు గురి కావడం, రైల్వేశాఖ గోడ నిర్మించడంతో కుంటకు వరద పోటెత్తితే జయపురం, చర్చికాంపౌండ్, న్యూనెహ్రూస్ట్రీట్, కిరీటాపురంనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కొర్లకుంట నుంచి పెద్ద చెరువు వరకు ఉన్న కాల్వ ప్రస్తుతం చెట్లు, చెత్తతో మూసుకుపోయింది. గోడ నిర్మాణం, కాల్వ మూసుకుపోవడంతో తమకు వరద ముప్పు ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొర్లకుంటకు వరద పోటెత్తి కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైనా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు నే టికీ స్పందించలేదు. కుంటకు పూర్తిస్థాయి కట్ట నిర్మించడం, కాల్వలోని చెట్లను తొలగించి శుభ్రపరచడం ద్వారా వరద ముప్పును అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రాంరభం కావడంతో మున్సిపాలిటీ అధికారులు ముప్పును అధికమించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
ప్రత్యామ్నాయమే మేలు..
మహబూబాబాద్ రూరల్: వరుణుడు కరుణించడం లేదు. పంటల సాగుకు అదును దాటుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరి, పత్తి పంటలకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పప్పు దినుసులు, కూరగాయల సాగు చేయాలని అంటున్నారు. తక్కువ నీటి వినియోగం, పంటల సాగు సమయం తక్కువగా ఉండటం, తక్కువ పెట్టుబడితో కర్షకులు పంటలు సాగు చేయవచ్చని పేర్కొంటున్నారు. కందిపంట.. కంది పంటకు ఎర్ర నేలలు, నీరు నిల్వ ఉండని భూములు అనుకూలం. జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనాలు అవసరం. ఇది వర్షాధార పంట, అవసరమైతే పూత, కాత దశలో నీరు ఇవ్వాలి. కాగా, ఎకరానికి 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పెసర పంట.. పెసర పంటను తేలికపాటి నుంచి మధ్యస్త నేలల్లో పండించొచ్చు. ఖరీఫ్లో జూన్ నుంచి జూలై, రబీలో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. పంటకు 2 నుంచి 3 తడులు సరిపోతాయి. ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మినుము పంట.. మినుము పంట సారవంతమైన ఎర్ర, నల్ల నేలల్లో పండుతుంది. ఖరీఫ్లో జూన్ నుంచి జూలై, రబీలో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం. అవసరాన్ని బట్టి 2 నుంచి 3 వరకు నీటి తడులు అందించాలి. ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చిరుధాన్యాల సాగులో.. చిరుధాన్యాలు (సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు మొదలైనవి) తక్కువ నీటితో సాగు చేయగల పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు. మంచి దిగుబడి కోసం అధికారుల సూచనలు పాటించాలి. అలాగే వేరుశనగ, శనగ కూరగాయల పంటలు పండించుకోవచ్చు. కూరగాయలతో లాభాలు.. వర్షాభావ పరిస్థితుల్లో కూరగాయల సాగు ద్వారా లాభాలు సాధించవచ్చు. టమాట, వంకాయ, మిర్చి, బీరకాయ, బెండ తదితర పంటలు సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. నాణ్యమైన, మార్కెట్లో డిమాండ్ ఉండే విత్తనాలు నాటి అధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు ఆలస్యం.. ఆరుతడి పంటలు అనుకూలం పప్పు దినుసులు, కూరగాయల సాగు మేలుదాయకం అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు -
తారు రోడ్డు పనులు ప్రారంభం
డోర్నకల్: డోర్నకల్, గార్ల మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద తారు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. డోర్నకల్, గార్ల మార్గంలో 90వ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద నూతనంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయి, చిన్నచిన్న పనులు వల్ల వాహనాల రాకపోకలకు అనుమతివ్వడం లేదు. ఈమేరకు సాక్షి దినపత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. బ్రిడ్జిపై తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేపటి నుంచి విత్తన మేళామహబూబాబాద్ రూరల్: వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 23నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు విత్తనమేళా జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వర్ణ విజయచంద్ర అన్నారు. విత్తన మేళా ఏర్పాట్ల వివరాలను డీఏఓ ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 59 రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహిస్తామని, వివిధ రకాలైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ విత్తన మేళాలో వరిలో సన్న రకాలైన బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638, కేఎంఎం 7715, హెచ్ఎంటీ సోన, జైశ్రీరామ్ వంటి ప్రభుత్వం సూచించిన సన్న రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. వాటితో పాటు పెసర, కంది, మినుము, అపరాల విత్తనాలు, వివిధ రకాలైన కూరగాయల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గుళిక రూపంలో ఉండే యూరియాకు ప్రత్యామ్నాయమైన నానో యూరియా, నానో డీఏపీలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న రైతు వేదికను సందర్శించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని దక్షిణం, పడమర, ఉత్తరం వైపు వరకు ఉన్న ప్రాకార దేవతామూర్తుల విగ్రహాలను తమిళ శిల్పులు తొలిగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన సుమారుగా 50కిపైగా విగ్రహాలను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో విగ్రహాలు భద్రపరచడానికి కింద వరిధాన్యం పోసినట్లు తెలిసింది. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 23న హైదరాబాద్లో టెండర్లు పూర్తి కానున్నట్లు సమాచారం. అనంతరం ఆలయాల కూల్చివేతలు ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే రాతితో కట్టడాల నమూనా చిత్రాలను కమిషనర్ హనుమంతరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. -
లక్నవరంలో సందడి
గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. దీంతో బోటింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫాదర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
సత్వర న్యాయం.. లోక్ అదాలత్ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి అన్నారు. ఇన్చార్జ్ జిల్లా జడ్జి ఎం.ఆర్.సునీత ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భం శాలిని షాకెల్లి మొదటగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి 2017లో దాఖలైన ఒక సివిల్ వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించి లోక్ అదాలత్ అవార్డును జారీ చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తమ విలువైన సమమం, డబ్బును ఆదా చేసుకోవడంతో పాటు సమాజంలో శాంతి సామరస్యాలు నిలదొక్కుకుంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గంగా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, ఇందుకు న్యాయవాదులు తగిన సహకారం అందిస్తారన్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి 94 కేసులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ 206 కేసులు, రెండో శ్రేణి మేజిస్ట్రేట్ రవికుమార్ 2,078 పెట్టి కేసులు రాజీమార్గంలో పరిష్కరించా రు. 10 ఇతర సివిల్ కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాదులు తోర్నాల నగేష్ కుమార్, ఆరెల్లి శ్రీనివాస్, తాటిపాముల సునీత, న్యాయవాదులు జి.కమల్ కుమార్, ఎన్.శృతి, కె.మౌనిక, వి.సుభాష్, టి.సైదులు తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.. తొర్రూరు: లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ కోరారు. శనివారం డివిజన్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్కుమార్ మాట్లాడుతూ.. చిన్న, చిన్న సమస్యలతో గొడవ పడి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న శాంతియుత మార్గంలో పరిష్కరించుకుంటూ మంచి జీవితాన్ని పొందాలన్నారు. రాజీమార్గం ద్వారా 391 పరిష్కరించగా, రూ.16.67 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సెకండ్ క్లాస్ జడ్జి రాంరెడ్డి, పీపీ రేవతిదేవి, న్యాయ వాదులు, కానిస్టేబుళ్లు, కక్షిదారులు పాల్గొన్నారు.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి -
నాన్న హమాలీ పనిచేసి చదివించారు..
● మానుకోట మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్మహబూబాబాద్: ‘మా నాన్న హమాలీ పని చేసి ఉన్నత చదువులు చదివించారు.. నేను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అయితే డీఎస్పీ కొంచెంలో మిస్సై కమిషనర్ అయ్యా’ అని మానుకోట మున్సిపల్ కమిషనర్ ఎం.వినోద్కుమార్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా కమిషనర్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మారుమూల తండా నుంచి.. మాది నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పెద్ద అడిశర్ల మండలం(పీఏ పల్లి)లోని పెద్దగట్టు తండా. మా తల్లిదండ్రులు మూడావత్ శంకర్, బుజ్జి. అమ్మానాన్నలకు ఇద్దరు కొడుకులం.. నేను పెద్దవాడిని. మాది మారుమూల తండా కావడంతో కొన్ని సంవత్సరాలు కరెంట్ సక్రమంగా లేదు. దీంతో పంటలు పండేవికాదు. మా చదువుల కోసం మా నాన్న మిర్యాలగూడ ఎఫ్సీఐ గోదాంలో హమాలీ పని చేశారు. తండాలోనే ఐదో తరగతి వరకు చదువుకున్న. తర్వాత మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన. గుంటూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్(ఎంపీసీ)పూర్తి చేశా. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీర్ పూర్తి చేశా. అనంతరం యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కోసం ఢిల్లీ వెళ్లిన.. ఐఏఎస్ కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ రాలేదని కమిషనర్ వినోద్కుమార్ అన్నారు. 2025లో గ్రూపు–1లో.. 2025 మార్చిలో విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో సెలెక్ట్ అయి మున్సిపల్ కమిషనర్ పోస్టు సాధించించా. డీఎస్పీ కోసం ప్రయత్నించినా.. కొంచెంలో మిస్ అయినట్లు కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. మానాన్న కష్టం గుర్తుకు వచ్చి కష్టపడి చదివినా కలెక్టర్ ఉద్యోగం రాలేదు. మళ్లీ చదివి నాన్న కల నెరవేర్చడమే నా లక్ష్యం. నాన్నే నాకు అన్ని విషయాల్లో ఆదర్శం. -
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
నెహ్రూసెంటర్: ఏటా వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తుతం ఇల్లు, బయట, వ్యవసాయ క్షేత్రాల వద్ద విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గాలి వానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్లైన్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాగా, ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు తెలుపుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదాలు.. జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద పశువులు, రైతులు మృతి చెందుతున్న సంఘటనలు ఉన్నాయి. వర్షాలు, గాలి వానల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు, ప్రజలు వానాకాలం విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తీగలపై దుస్తులు ఆరవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వర్షానికి తడిసిన గోడలను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదు. విద్యుత్ సరఫరా, ప్రమాదాల సమయాల్లో టోల్ఫ్రీ నంబర్ 1800 425 0028, హెల్ప్లైన్ 1912 నంబర్, వాట్సాప్ నంబర్ 87124 81489 ద్వారా విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలివర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగి పడడం వంటివి జరిగితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. – పి. విజేందర్రెడ్డి, ఎస్ఈ ●అత్యవసర సేవలకు 1912 టోల్ఫ్రీ నంబర్ వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం వాట్సాప్ నంబర్ 87124 81489 ద్వారా విద్యుత్ సేవలు -
ప్రయాణికుల కష్టాలు
కిటికీల నుంచి సీట్లను ఆపుకుంటున్న ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారుతోంది. ప్రతీరోజు పెరుగుతున్న రద్దీతో పాటు రూట్లలో సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా, శనివారం బస్టాండ్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించారు. బస్సులు రాగానే సీట్ల కోసం ఎగబడ్డారు. – నెహ్రూసెంటర్ పలు రూట్లలో సరిపడా లేని సర్వీసులు బస్సుల కోసం తప్పని ఎదురుచూపులు -
ఇంగ్లిష్లోనే బోధించాలి.. మాట్లాడాలి
● పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై కలెక్టర్ అసంతృప్తిబయ్యారం: ఇంగ్లిష్ మీడియం పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇంగ్లిష్లోనే బోధించడంతో పాటు మాట్లాడాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎస్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ముస్తాఫానగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీపీఎస్ పాఠశాలలో తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల హాజరుతీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ జరిగిందా లేదా అని ఆరా తీశారు. నోట్పుస్తకాలు పంపిణీ చేయకపోవంతో అసహనం వ్యక్తం చేసి వెంటనే అందజేయాలని హెచ్ఎంను ఆదేశించారు. అనంతరం తరగతిగదిలో కూర్చొని ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠం తీరును గమనించారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు తెలుగులో పాఠాలు బోధించటం సరికాదని, ఇంగ్లిష్లోనే బోధించాలని, విద్యార్థులతో ఇంగ్లిష్లోనే మాట్లాడాలన్నారు. బయ్యారం బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో బోధించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియం బోధనపై ప్రత్యేకదృష్టి సారించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. లోపాలు లేకుండా విద్యావ్యవస్థను నడిపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న వంట వర్కర్లందరికీ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. అనంతరం ముస్తాఫానగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన పిల్లల వివరాలను రిజిస్టర్లో పరిశీలించి వారితో మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఎంఈఓ లక్ష్మణ్రావు, ఎస్సై ప్రశాంత్, పాఠశాల హెచ్ఎంలు ధనుంజయ్, బాలునాయక్ తదితరులు ఉన్నారు. గడువులోగా ఆస్పత్రి పనులు పూర్తిచేయాలి● ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ మరిపెడ: నిర్ణీత గడువులోగా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఆదేశించారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీలోని 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరిపెడలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరిపెడ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా మైనార్టీ నాయకులు అఫ్జల్, జర్పుల విజయ్ తదిరులు పాల్గొన్నారు. -
విద్యుత్ భద్రతపై రాజీ లేదు
హన్మకొండ : విద్యుత్ భద్రతపై రాజీ లేదని, క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేని వ్యక్తులకు ఎల్సీలు ఇవ్వడం తీవ్ర తప్పిదమని హెచ్చరించారు. ప్రతీ పనికి భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అనధికారంగా ఇతరులను విద్యుత్ స్తంభాలు ఎక్కించి పనులు చేయించడం నేరమన్నారు. ఆపరేషన్ సిబ్బంది హెడ్క్వార్టర్స్లో ఉంటూ పనులు చేపట్టాలని ఆదేశించారు. లైన్ క్లియరెన్స్లు తప్పనిసరిగా ఎల్సీ యాప్ ద్వారానే జరగాలని, లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాణం కంటే విలువైదని ఏది కాదని, విద్యుత్ పనులు చేపట్టే సమయంలో అన్ని భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు స్తంభాలు విరిగి, లైన్లకు నష్టం కలిగిన వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలన్నారు. డైరెక్టర్లు వి. మోహన్ రావు, సి.ప్రభాకర్, సి.ఈలు కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, మాధవ రావు, అన్నపూర్ణ, నాగ ప్రసాద్, సురేందర్, జీఎంలు నాగప్రసాద్, శ్రీనివాస్, ఈఈ (సివిల్) వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి
న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో వందశాతం అడ్మిషన్లు సాధించే దిశగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ దామోదర్రెడ్డి సూచించారు. శనివారం పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డులోని హనుమకొండ(బి1) గురుకులంలో ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందించే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉన్న మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. సమావేశంలో ఆర్ఎల్సీ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాష, కో–ఆర్డినేటర్ రుహీనా, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, శ్రీనివాస్, కృష్ణకుమారి, నీలిమాదేవి, నీరజ, శ్రీపాల, రాజు, మాధవిలత, శ్రీలత, అన్నపూర్ణ, ఆయేషా, వందన, తదితరులు పాల్గొన్నారు. టెమ్రిస్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ దామోదర్రెడ్డి -
గుండ్లసింగారంలో ఉద్రిక్తత
హసన్పర్తి: మండలంలోని గుండ్లసింగారంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూమిలో వేసిన గుడిసెలను శనివారం తెల్లవారుజామున రెవెన్యూ, పోలీస్, మున్సిపల్శాఖ అధికారులు కూల్చివేశారు. ఐదేళ్ల క్రితం వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది గుడిసెలు వేసుకుని సురవరం సుధాకర్రెడ్డి పేరిట కాలనీ ఏర్పాటు చేశారు. గుడిసెలు కూల్చివేస్తున్నారనే సమాచారంతో సీపీఐ నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. వారిని ముందస్తుగా అరెస్ట్చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. గుడిసెలను కూల్చివేస్తుండగా అడ్డువచ్చిన వారిని పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారు. కాగా, తాము ఇక్కడే ఉంటున్నట్లు ఆధార్, రేషన్కార్డులు కూడా పొందినట్లు పలువురు గుడిసెవాసులు చెప్పారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని కోరారు. కాగా, రెండు రోజుల క్రితం ప్రారంభించిన పార్టీ కార్యాలయాన్ని కూడా నేలమట్టం చేశారు. గుడిసెలు కూల్చివేయడం దుర్మార్గం.. గుండ్లసింగారంలో గుడిసెలు కూల్చివేసిన ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించారు. ఈసందర్భంగా బాఽధితులతో మాట్లాడారు. తమ ను ఇళ్లనుంచి బలంతంగా బయటికి గెంటేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీ సుకోవడం లేదని పేర్కొన్నారు. అదే నీడ కోసం 50 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ ప్ర జా వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. భూ సమస్యపై హైదరాబాద్లో అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు భిక్షపతి, బాబామియా, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, నాయకులు భిక్షపతి, అశోక్ స్టాలిన్, లక్ష్మణ్, రాజేందర్, రాము, గోపాల్ పాల్గొన్నారు. 300 గుడిసెలు నేలమట్టం.. ముందుస్తు సీపీఐ నాయకుల ఆరెస్ట్ -
నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ రూరల్: నకిలీ విత్తనాలపై రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. విజయచంద్ర సూచించారు. మండలంలోని గుండెపూడి గ్రామానికి చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నుంచి కేంద్ర ప్రభుత్వ నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలను సిండికేట్గా మారి రహస్య మార్గంలో దిగుమతి చేసుకుని తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో విక్రయిస్తున్నారు. దీనిపై ‘గుంటూరు టు గుండెపూడి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారులు మరిపెడలోని సీతారామ, సూర్యతేజ ఏజెన్సీస్ విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించని డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అమాయక రైతులను మోసం చేసే వ్యక్తులు, నకిలీ విత్తనాలు విక్రయించే వారి వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలిపాలని కోరారు. బీటీ–3 పత్తి, నకిలీ విత్తనాలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీదేవి, ఏఓ బోడ వీరసింగ్ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర మరిపెడలో విత్తన దుకాణాల్లో తనిఖీలు -
నిరంజన్కు రూ.5 లక్షల ఆర్థిక సాయం
నయీంనగర్: జన్యుపరమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు నిరంజన్కు సినీ ని ర్మాత బండ్ల గణేశ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. శనివారం ఉదయం నిరంజన్ ఇంటికెళ్లి అతడితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం గణేశ్ మీడియాతో మాట్లాడుతూ కారులో తిరగాలనే బాలుడు నిరంజన్ కోరిక మేరకు వాహనం కొనుక్కొమని రూ. 5 లక్షలు ఇచ్చానన్నారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానస దంపతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆన్లైన్ మోసం.. ● రూ.67 వేలు కాజేసిన కేటుగాళ్లు రామన్నపేట : పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టించి ఓ యువకుడి నుంచి రూ.67 వేలు కాజేసిన ఘటన శనివారం వరంగల్లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ డాక్టర్స్ కాలనీ–2లోని స్నేహనగర్కు చెందిన నాయిని సాయి తేజ (26) ఫేస్బుక్లో పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా ఒక అప్లికేషన్ కనిపించింది. దానిని డౌన్లోడ్ చేసి తన వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నాడు. అనంతరం పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని యాప్లో చూపించడంతో నమ్మి మోసగాళ్లు అందించిన క్యూఆర్ కోడ్కు ఇటీవల తన ఫోన్పే ఖాతా ద్వారా మొదట రూ.50 వేలు పంపించాడు. తర్వాత మరో రూ.14 వేలు, రూ.2, 994 కూడా పెట్టుబడిగా చెల్లించాడు. కొంతకాలానికి తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి 1930 నంబర్కు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ.67 వేలునష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొనగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే పార్ట్టైమ్ ఉద్యోగాలు, ఆన్లైన్ టాస్కులు, అధిక లాభాల పెట్టుబడుల ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లించొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
టీజీపీఓఏ ఎన్నికలకు గ్రీన్సిగ్నల్
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు డీజీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యుటేషన్ సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ టీజీపీఓఏ ఎన్నికలు ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ ఎంఎస్ నం:539 (06.08.1979), జీఓ ఎంఎస్ నం: 113 (16–06–2008) నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యుటేషన్ సంస్థల్లో ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని, జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల నిర్మాణం జరగాలని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లాలు, కమిషనరేట్లలో పదవుల విషయానికి వస్తే ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి పోస్టులు, ఆరుగురు కార్యవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలు, కమిషనరేట్లలో ఇలా.. అధ్యక్ష పదవి సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్కు చెందిన అధికారి చేపట్టవచ్చు. అధ్యక్షుడిగా ఎస్ఐ/ఇన్స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్గా ఉండాలి. అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్ఐ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులుగా ఉండాలి. కార్యదర్శి పదవి ఎస్ఐ/ఆర్ఎస్ఐ లేదా అంతకంటే పైస్థాయి అధికారులకు మాత్రమే. కోశాధికారి పదవి సివిల్ పోలీస్ విభాగానికి చెందిన ఏ ర్యాంకు అధికారి అయినా చేపట్టవచ్చు. కార్యవర్గ సభ్యుల్లో నలుగురు సివిల్ పోలీస్ నుంచి, ఇద్దరు ఆర్ముడ్ రిజర్వ్ (ఏఆర్) నుంచి ఎన్నిక కావాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానం మహిళా పోలీసులకు రిజర్వ్ చేస్తారు. మెట్రో కమిషనరేట్లకు ప్రత్యేక కమిటీలు.. పదవులు ఇలా.. హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఉమెన్ పోలీస్ యూనిట్లకు ప్రత్యేక కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలలో ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కోశాధికారి పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ కార్యదర్శులు ఇద్దరు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఐదుగురు, కార్యవర్గసభ్యులు 14 మంది ఉంటారు. ఆర్గనైజింగ్ కార్యదర్శుల కోటాలో ఇద్దరు లా అండ్ ఆర్డర్, ఒక్కొక్కరు క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచిల నుంచి అవకాశం ఉంటుంది. సీఏఆర్ యూనిట్కు సఫరేట్.. సిటీ ఆర్ముడ్ రిజర్వుడు (సీఏఆర్) యూనిట్కు ప్రత్యేక కమిటీ ఉండనుంది. ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక్కోటి చొప్పున కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పోస్టులు, ముగ్గురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 8 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు అసోసియేషన్ బైలాస్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నవంబర్ మొదటి వారంలో నిర్వహించాల్సి ఉండగా, అంతకు ముందు జిల్లా, యూనిట్ కమిటీల ఎన్నికలు ఆగస్టు ప్రారంభంలో మొదలై సెప్టెంబర్ చివరి నాటికి ముగించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యూటేషన్ సంస్థల్లో ఎన్నికలు 2026 సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని డీజీపీ ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత టీజీపీఓఏ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. పోలీసుశాఖలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలీస్ శాఖలో మళ్లీ ఎన్నికల సందడి జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి వరకు పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి నోటిఫికేషన్ జారీ చేసిన డీజీపీ సీవీ ఆనంద్ ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత టీజీపీఓఏ ఎన్నికలు -
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు
హన్మకొండ అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయి, డీసీపీ ధార కవితతో కలిసి భూ సమస్యలు, అట్రాసిటి కేసులు, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీపై సమీక్ష నిర్వహించారు. అట్రాసిటి కేసుల నమోదు నుంచి చార్జ్షీట్ దాఖలు వరకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు చట్టప్రకారం రక్షణ, ఆర్థిక సాయం, పునరావాసం, న్యాయ సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే వినియోగించాలని, పెండింగ్ భూ సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో కార్మికులకు తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. భద్రకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కుటుంబాలకు న్యూ శాయంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అనంతరం చెరబండరాజు కాలనీకి చెందిన అర్హులైన కుటుంబాలకు ఇళ్ల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులు రడపాక పరంజ్యోతి, సింగారపు రవిప్రసాద్, మంద కుమార్, పుట్టరవి తదితరులు ఉన్నారు. భూ సమస్యలు, అట్రాసిటి కేసులపై ప్రత్యేక దృష్టి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందని వరంగల్
హన్మకొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందలేదని, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్క విద్యా సంస్థ రాలేదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఆమె హనుమకొండ, వరంగల్లో పర్యటించారు. వరంగల్లోని ఏనుమాముల, హనుమకొండలోని కేయూసీ వద్ద టీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ బాలసముద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ వచ్చి రూ.5,200 కోట్లతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ నిర్మిస్తామని చెప్పినా దిక్కు మొక్కు లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా అతిగతీ లేదని విమర్శించారు. కనీసం మాస్టర్ప్లాన్ రూపొందించుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏనుమాముల మార్కెట్కు వెళ్లానని అక్కడ ఎక్కడా చూసిన ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, ధాన్యం కొనే వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం మిల్లర్లను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని, అందుకే మిల్లర్లు ముందుకు రావడం లేదని తూర్పారబట్టారు. వరంగల్ టెక్స్టైల్స్ పార్కుకు పరిశ్రమలు తీసుకురాకుండా, 2,400 ఎకరాల పార్కు స్థలాన్ని లేఅవుట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించి పరిశ్రమలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీజేపీ గొప్పలు చెప్పుతున్న మామునూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ పూర్తి కాలేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 90 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వచ్చామన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్సింగ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల ఇన్చార్జ్ నడిపల్లి వెంకటేశ్వర్ రావు, నాయకులు ఇస్మాయిల్, డేవిడ్, శ్రీకాంత్ గౌడ్, రాజు యాదవ్, శ్రీశైలం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
నా కొడుకుకు ఫ్రీ బస్ పాస్ ఇయ్యండి..
కాశిబుగ్గ: ‘నా కొడుకుకు కాళ్లు, చేతులు సరిగా లే వు.. నాకు చాత కాదు. దివ్యాంగుడైన కన్నకొడుకును చూసుకుంటూ బతుకుతున్నా. ఓ పూట తింటూ, మరో పూట పస్తులుంటూ కాలం గడుపుతు న్నా. మంచానికి పరిమితమైన కొడుకును పొద్దున, రాత్రి చూసుకుంటున్నా. ఎంజీఎం దవాఖాన సార్లు నా కొడుకుకు ఫ్రీ బస్ ఇచ్చి, నాకు సగం టికెట్ ఉండే బస్ పాస్ ఇయ్యండి’ అంటూ జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహముత్తారం మండలం ములు గుపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు జాడి అంకయ్య వేడుకుంటున్నారు. శుక్రవారం కొడుకు రాజయ్య ను వీల్చైర్లో తీసుకొచ్చి ఎంజీఎం పరిసరాల్లో తచ్చాడుతున్నాడు. మూడు రోజుల నుంచి తన కొడుకుకు బాగా లేకుంటే సర్కారు దవాఖానకు తీసుకొచ్చానని, గట్లనే బస్పాస్ ఇస్తే తీసుకెళ్తానని చెబుతున్నాడు. మూడేళ్ల క్రితం నా కొడుకుకు ఆఫ్ టికెట్ బస్ పాస్ ఇచ్చారని, నాకు ఫుల్ టికెట్ తీసుకుంటున్నారని చెప్పాడు. మా దుస్థితి జరా చూసి ఫ్రీ బస్ పాస్ ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని సదరం క్యాంపు అధికారులను అంకయ్య వేడుకుంటున్నాడు. సదరం క్యాంపు అధికారులను వేడుకుంటున్న వృద్ధుడు -
గార్ల డిప్యూటీ తహసీల్దార్గా శ్రీరాం రాథోడ్ నియామకం
గార్ల: గార్ల డిప్యూటీ తహసీల్దార్గా భూక్య శ్రీరాంరాథోడ్ను నియమిస్తూ శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎనీమియా రహిత సమాజమే లక్ష్యంతొర్రూరు: సికిల్సెల్ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యంగా పని చేయాలని తొర్రూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని సికిల్సెల్ ఎనీమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుగుణాకర్రాజు మాట్లాడుతూ.. మేనరిక వివాహాలు, వంశపారపర్యంగా సికిల్సెల్ ఎనీమియా వ్యాధి సంక్రమిస్తుందన్నారు. అందుకే ప్రతీ కుటుంబం అవగాహనతో ఉంటూ ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జ్వలిత, నందనాదేవి, ప్రియాంక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలిమహబూబాబాద్ అర్బన్ : చిన్నారులు, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నాణ్యమైన పోషకాహారం అందిస్తుందని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో శుక్రవారం విద్యార్థులకు హైజెనిక్, హెల్తీ మీల్ ప్రిపరేషన్ అంశంపై ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కుక్, హెల్పర్లు ఆహార పదార్థాల సురక్షిత నిల్వ, వంటశాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత ఆహార తయారీ విధానాలు, పోషకాహార ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పి.వీరయ్య, నరేందర్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, జిల్లా కోఆర్డినేటర్లు పి.పూర్ణచందర్, వి.సురేష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జ్ ఎం.గణేష్, శ్రీకాంత్, సాయిచరణ్, ముజాహిద్ అలీ పాల్గొన్నారు. ఆకేరు వాగు పరిశీలననర్సింహులపేట: మండలంలోని ఆకేరు వాగును తొర్రూరు ఆర్డీఓ గణేష్, జిల్లా గనులు, భూగర్భ సహాయ సంచాలకులు వెంకటరమణ, తొర్రూరు సీఐ గణేష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. మండలంలోని ముంగిమడుగు, రామన్నగూడెం, జయపురం, కౌసల్యదేవిపల్లి పరిధిలో వాగును పరిశీలించారు. ఇసుక లభ్యత, రీచ్ల వద్ద భద్రత, ఇసుక అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్బాబు, ఎస్సై బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిమహబూబాబాద్ రూరల్: వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండలస్థాయి అధికారుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ సీఈఓ పురుషోత్తం హాజరై మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, తండాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాల ని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉన్నప్పుడే సమస్యలు రాకుండా చూడగలు గుతామన్నా రు. వర్షాలు, వరదల వల్ల గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ రఘుపతిరెడ్డి ఉన్నారు. -
తలవంచుతున్న వైకల్యం..
టేకుమట్ల : ఆ వ్యక్తి 14 సంవత్సరా ల క్రితం చెయ్యి కోల్పోయాడు. అ యినా జీవితంపై ఏ మాత్రం ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోలేదు. ఒంటి చేతితో పనులు చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే జయశంకర్ భూ పాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆరెపల్లికి చెందిన గురి జాల మల్హల్రావు. బాల్యంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మల్హల్రావు చేతికి గాయమైంది. కాలక్రమేణా ఇన్ఫెక్ష న్ కారణంగా 2012లో వైద్యులు చెయ్యిని పూర్తిగా తొలగించారు. అయినా ఏమాత్రం బాధపడలేదు. అధైర్య పడలేదు. అప్పటి నుంచే ఒంటి చేతితో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అంతే కాకుండా బైక్ను కూడా సునాయాసంగా నడపడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని రోజులుగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో పనులకు కూడా వెళ్తూ ఒంటి చేతితో పలుగు పట్టి తవ్వడం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారికి కనువిప్పు కలిగేలా.. ఎలాంటి శారీరక వైకల్యం లేకున్నా పని చేయకుండా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ మల్హల్రావు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చెయ్యి కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా ఇతరులతో సమానంగా అన్ని పనులను చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో ఎరువు బస్తాలను సులువుగా బైక్పై తీసుకెళ్తుంటే ఔరా అనాల్సిందే. పంట పొలాలకు సైతం కూలీలను ఇద్దరు చొప్పున బైక్పై తీసుకెళ్తూ రెండు చేతులు ఉన్న వారి కంటే తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ వైకల్యాన్ని జయిస్తున్నాడు మల్హల్రావు . ఒంటి చేతితో పలుగు పట్టి.. బైక్ నడిపి చెయ్యి కోల్పోయినా జీవితంపై చెదరని ఆత్మవిశ్వాసం సొంతంగా పనులు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న మల్హల్రావు -
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గొత్తికోయగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యుగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ, గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడేలకు సోలార్ విద్యుత్ అందనుంది. సిద్ధమైన డీపీఆర్లు.. త్వరలో టెండర్లు, పనులు.. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడేల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీగూడెంలో సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ నిల్వ కోసం బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా విద్యుత్ అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాల వినియోగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం రూ.17.03 కోట్లు విడుదల.. ‘టీజీరెడ్కో’ సౌజన్యంతో ఏర్పాట్లు సర్వే, డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు... టెండర్ల దశలో ‘సోలార్’ పనులు దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలురూ.17.03 కోట్లతో అమలు..ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్లో గిరిజన, గొత్తికోయగూడేలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గొత్తికోయగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.03కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీనం.5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. -
స్కూటీ డిక్కీ నుంచి రూ.2 లక్షలు మాయం
● మానుకోటలో ఘటన మహబూబాబాద్ రూరల్ : స్కూటీ డిక్కీ నుంచి రూ.2 లక్షల నగదు మాయమైంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో నివాసముండే గుగులోత్ రవి స్థానికంగా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన మిత్రుడు ఈసంపల్లి సాగర్కు గురువారం రూ.2 లక్షల నగదు బదలు ఇచ్చాడు. తిరిగి ఆ డబ్బు తీసుకోవడానికి శుక్రవారం కెనరా బ్యాంకు వద్దకు వెళ్లాడు. సాగర్ రూ.2 లక్షలు ఇవ్వగా ఆ డబ్బులను తన స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. అనంతరం మహబూబాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లి మరో స్నేహితుడిని తీసుకొచ్చి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తాను పనిచేస్తున్న సంస్థ కార్యాలయం ఉండే భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకు వద్దకు వచ్చి అక్కడ తన వాహనం పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత స్కూటీ వద్దకు వెళ్లి డిక్కీ తెరిచి చూడగా అందులో భద్రపరిచిన రూ.2 లక్షలు కనిపించలేదు. దీంతో ఆందోళన గురైన బాధితుడు రవి వెంటనే మహబూబా బాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పాలకుర్తి టౌన్ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్ తండా(తూర్పు) గ్రామంలో పిడుగుపడి రెండు ఆవులు మృత్యవాత పడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటినట్లు బాధిత రైతు తెలిపాడు. స్థానికుల కథనం ప్రకారం.. బాధి త రైతు లకావత్ లచ్చిరాం రోజు మాదిరిగానే ఆవులను పాకలో కట్టేశాడు. ఈక్రమంలో గురువారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న మండల పశువైధ్యాఽధికారి స్వర్ణ శిల్ప, జీపీఓ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి ఘటనాస్థలిని పరి శీలించి పిడుగుపాటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధిత రైతుకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. పిడుగుపాటుకు తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు పాలకుర్తి టౌన్ : పిడుగుపాటుకు తాటి చెట్టుపైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం మండలంలోని విస్నూరు జరిగింది. గీత కార్మికుడు కన్న భిక్షం తాటి చెట్టు కల్లు ఎక్కి గీస్తున్నాడు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడడంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. భిక్షం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు సభ్యులు తెలిపారు. -
బాలికల భద్రతే షీ టీం లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: బాలికల భద్రతే లక్ష్యంగా షీ టీం పనిచేస్తోందని ఎస్సై సునంద అన్నారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రత, షీ టీమ్స్ సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియాలో తీసుకోవాల్సి న జాగ్రత్తలపై ఎస్సై సునంద వివరించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, బాల్య వివాహాలు జరిగితే షీ టీం నంబర్ 87126 56935లో ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్ మోసాలపై 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం షీ టీం అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, షీ టీం సిబ్బంది రమేశ్, పార్వతి, హైమావతి, ప్రియాంక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే ఆయుధం!
నెహ్రూసెంటర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. జిల్లాలోని గ్రామాలు, గూడేలు, తండాల్లో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు 500 డెంగీ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, వేడిచేసి చల్లారిన నీటిని మాత్రమే తాగాలని, రోగాలపై అవగాహన పెంచుకుని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. 500పైగా కేసుల నమోదు.. జిల్లాలో ఏటా సుమారు 500లకు పైగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం, గూడూ రు, కురవి, డోర్నకల్, గార్లతో పాట ఇతర మండలాల పరిధిలోని ప్రజలు డెంగీతో పాటు విష జ్వ రాల బారిన పడుతుండడం గమనార్హం. అత్యధిక డెంగీ కేసులు పట్టణ పరిధిలోనే నమోదుకావడం అందోళన కలిగించే అంశం. పారిశుద్ధ్యమే ప్రధాన సమస్య.. డెంగీ, మలేరియా, విష జ్వరాలకు పారిశుద్ధ్యమే కారణమని తెలుస్తోంది. వర్షపు నీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య లోపం, చెత్తా చెదారం కారణంగా దోమలు నివాసం ఏర్పాటు చేసుకుని వాటి వల్ల వ్యాధులు సంభవిస్తున్నాయి. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. వైద్యారోగ్యశాఖ యాక్షన్ప్లాన్.. సీజనల్ వ్యాఽధులను నివారించేందుకు వైద్యారోగ్యశాఖ యాక్షన్ప్లాన్ సిద్ధం చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి వైద్య అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్సీ, జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి వైద్య సేవలను పెంచేలా, కేసుల పెరుగుదలను నివారించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా డెంగీ, మలేరియా కేసులు 500 మార్కును దాటడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న యాక్షన్ప్లాన్ అమలు ద్వారా కట్టడి చేస్తారా లేదా అనేది వేచిచూడాలి. వానాకాలం ప్రారంభంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం పరిసరాల పరిశుభ్రత, అవగాహన తప్పనిసరి జిల్లాలో డెంగీ, మలేరియా అత్యధిక కేసులు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 01పీహెచ్సీలు 20అర్బన్ హెల్త్ సెంటర్ 01బస్తీ దవాఖానా 01 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 05 -
ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్
హన్మకొండ : టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయడమే ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన డిమాండ్ అని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్–1, హనుమకొండ డిపో స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా డిపోలకు చెందిన టీఎంయూ, ఎస్డబ్ల్యూఎఫ్ నుంచి పలువురు కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్లో చేరారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీన అంశాన్ని వదలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు ఎన్నికలు కోరుకుంటుందని చేస్తున్న దుష్ప్రచా రంలో వాస్తవం లేదన్నారు. సమ్మె నోటీసు ఇవ్వని సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని కార్మికులు పట్టించుకోవద్దన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వి.కె.స్వామి, నాయకులు టి.శ్రీనివాస్, మురళి, శ్రీధర్, సుధాకర్, ఎల్లయ్య, ఎం.రాజు, మ హేందర్, బాలరాజు, పి.కె.స్వామి, ఎం.రవీందర్, రాజయ్య, పి.రవీందర్, సంధ్య, అర్చన, విజయ, రజిత, ఉమ, జమున, అమరావతి పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న -
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపడుతున్నాం. సీజనల్ యాక్షన్ప్లాన్ సిద్ధం చేసి వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రత్యేక ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నాం. వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా, ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగై వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. –డాక్టర్ రవిరాథోడ్, డీఎంహెచ్ఓ -
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
మహబూబాబాద్: భూదార్ సర్వే, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో భూదార్ సర్వే, భూభారతి, సాదాబైనామా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా లోకేష్కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ భూ యజమానికి సంబంధించి కచ్చితమైన భూవివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నక్ష డిజిటల్ భూమ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రికార్డుల ఆధునికీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు టు గుండెపూడి
మరిపెడ రూరల్: ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం జిల్లాల్లో ఈ ఏడాది కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. గుంటూరు ప్రాంతం నుంచి రహస్యంగా తెప్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండంలోని గుండెపూడి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు స్థానికులు సిండికేట్గా ఏర్పడి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఒకరి చూసి మరొకరు నిషేధిత పత్తి గింజల వ్యాపారాన్ని ఎంచుకుని కేసుల పాలు అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఇదే గ్రామానికి చెందిన పలువురు బీటీ–3 విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడడంతో పలు ధఫాలుగా ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. మళ్లీ ఈ ఏడాది గుండెపూడికి చెందిన ఓ వ్యక్తి బంధువులను మధ్యవర్తులుగా చేసుకుని తొర్రూరు ప్రాంతంలో బీటీ–3 విత్తనాలు విక్రయిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి సూర్యాపేట జిల్లా నూతనకల్ ప్రాంతంలో విక్రయిస్తూ అక్కడి పోలీసులకు గురువారం పట్టుబడినట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒకే గ్రామంలో 5 కేసులు నమోదయ్యాయి. ఈ వరుస ఘటనలు బయటపడుతున్నా గుండెపూడి కేంద్రంగా కొత్త వారు కూడా ఈ వ్యాపారంలోకి దిగుతూ ఆయా జిల్లాల్లో దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సాగుకు గ్లైకోసెట్ గడ్డి మందులు పిచికారీ చేయడం కారణంగా భూసారం దెబ్బతినడంతోపాటు కేన్సర్, వివిధ రుగ్మతులను ఎదుర్కోవాల్సిన అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోతే పెట్టుబడి మొత్తం వృథా కావడంతో పాటు భవిష్యతులో పత్తి సాగుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నా పోలీస్, వ్యవసాయ శాఖల నిఘా సరైన స్థాయిలో లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుండెపూడి కేంద్రంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖలు సమన్వయంతో ప్రత్యేక దాడులు నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పట్టుబడిన ప్రభుత్వ నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు కొనసాగుతున్న నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల అక్రమ దందా! ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తరించిన విక్రయాలు ఇటీవల వెలుగు చూసిన తొర్రూరు, నూతనకల్ అరెస్ట్ ఘటనలు అధికార యంత్రాంగం నిఘా లోపంతో రెచ్చిపోతున్న సిండికేట్లుఈజీమని కోసం గుండెపూడి గ్రామంలోని కొందరు అక్రమ పత్తి గింజల వ్యాపారంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారం ఒక్కసారిగా ప్రారంభమైనది కాదని, మూడేళ్లుగా కోట్ల రూపాయల టర్నోవర్తో కొనసాగుతోందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతి లేని ఈ విత్తనాల ప్యాకెట్ను సాధారణం కంటే ఎక్కువ రూ.1,500 నుంచి రూ.1,800 ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక దిగుబడి వస్తుంది.. పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది వంటి ప్రచారాలతో రైతులను ఆకర్షిస్తున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతం నుంచి బీటీ–3 పత్తి విత్తనాలను చిన్న లాట్లుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలలోనే దిగుమతి చేసుకున్న ఈ విత్తనాలను అదే నెలలో మరిపెడతో పాటు చుట్టుపక్కల మండలాల రైతులకు విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. -
విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృతి
● విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే అని అన్నదాతల ఆగ్రహం ● తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై ధర్నా ● ప్రాథమిక దర్యాప్తులో జేఎల్ఎంను సస్పెండ్ చేసిన అధికారులువర్ధన్నపేట: విద్యుదాఘాతంతో ఓ గిరిజన రైతు మృతి చెందాడు. ఈ ఘటన వర్ధన్నపేట పట్టణ ప రిధిలోని బావనికుంట తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన నూనావత్ గణేశ్(31) తన వ్యవసాయ క్షేత్రంలో దుక్కి దున్నుకుని మండె కట్టాడు. వరి మొలకలు అలకడానికి శుక్రవారం అన్ని సమకూర్చుకోగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక జూనియర్ లైన్మెన్ లకావత్ శేఖర్కు ఫోన్లో సమాచారం అందించగా ఆయన ఎల్సీ ఇచ్చారు. విద్యుత్ తీగలు కలుపుకోమని గణేశ్కు ఫోన్లో తెలిపాడు. దీంతో గణేశ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు సరి చేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ గణేశ్ను కాపాడాలని యత్నించినా చనిపోయాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ కుటుంబీకులతోపాటు తండావాసులు శుక్రవారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై సాయిబాబు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. జేఎల్ఎం సస్పెన్షన్.. జేఎల్ఎం విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ రూరల్ డీఈ దానయ్య.. జేఎల్ఎం లకావత్ శేఖర్ను సస్పెండ్ చేశారు. రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ● అక్కడికక్కడే మృతి.. మరొకరి పరిస్థితి విషమం వర్ధన్నపేట: రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఢీకొన్న వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లికి చెందిన పొన్నం రాములు(42) బైక్పై శుక్రవారం రాత్రి ల్యాబర్తి గ్రామానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామం వస్తుండగా బైక్లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ల్యాబర్తి నుంచి వస్తున్న ఓ బైక్పై అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాములును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాములును ఢీ కొన్న వ్యక్తి కూడా అపస్మారక స్థితికి చేరగా అతడి వరంగల్ ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు భార్యలు రజిత, కవిత, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. -
ఒకరి ఆనందం మరొకరికి శాపం కావొద్దు
సాక్షి, మహబూబాబాద్: ‘ఒకరి ఆనందం మరొకరికి శాపం కావొద్దు.. పరాయి పిల్లలు పాడవుతున్నారని చూస్తూ ఊరుకుంటే.. మన పిల్లలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మైనర్లకు సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలు అమ్మడం నేరం’ అని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని ఐఎంఏ హాల్లో జిల్లాలోని పాన్, కిరాణాషాపుల యజమానులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిగరెట్ తాగడం వల్ల జరిగే అనర్థాలను వీడియో ద్వారా చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం వల్ల పక్కనే ఉన్న పిల్లలు, వృద్ధులపై ప్రభావం పడుతుందని, వారు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ప్రతీ పాన్షాపు వద్ద ‘మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించబడవు’ అనే బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు ఉపయోగకరమైన సమాచారానికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. 87126 56999 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు, ఎస్సైలు, పాన్, కిరాణాషాపుల యజమానులు పాల్గొన్నారు. మైనర్లకు సిగరెట్లు విక్రయించడం నేరం మీ పిల్లలు తాగితే సహిస్తారా.. పాన్షాపు యజమానుల సమావేశంలో ఎస్పీ శబరీష్ -
ప్రాణం తీస్తున్న రక్తబంధం!
మళ్లీ పాత రోజులు రావాలి..హైటెక్ యుగంలో రోజుకో ఆవిష్కరణలు వస్తున్నాయి. అయితే ఈ మార్పు పనులు సులువుగా కావడం కోసం, విజ్ఞానాన్ని పెంపొందించడానికి వినియోగించాల్సింది పోయి వినాశనానికి వినియోగిస్తున్నారు. కుటుంబ బంధాలు, బంధుత్వాలు, విలువలు తగ్గుతున్నాయి. ఆస్తుల కోసం కొట్లాటలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు పెద్దపీట. కానీ, ఇప్పుడు ఇది ప్రమాదంలో పడింది. మళ్లీ పాత రోజులు రావాలి. – పాల్వాయి రామ్మాహన్ రెడ్డి, ప్రముఖ వైద్యుడు హత్యలతో సమస్యలు పరిష్కారం కావుజిల్లాలో కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడం వంటి సంఘటనలు తరచూ జరగడం విచారకరం. ఆస్తులు, భూ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చట్టాలు ఉన్నాయి. క్షణికావేశంలో హత్యలు చేయడం సరికాదు. నేర ప్రవృత్తిలో మార్పు, సామాజిక విలువలు, మానవ సంబంధాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం తగ్గితే హత్యా నేరాల సంఖ్య కూడా తగ్గుతుంది. – శబరీష్, ఎస్పీ సాక్షి, మహబూబాబాద్: ప్రస్తుత సమాజంలో బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండాపోయింది. రక్తసంబంధీకులే దాడులకు పాల్పడడం, హత్యలు చేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. చిన్నచిన్న వివాదాల వల్ల తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి, అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, అల్లుడిని మామ, భార్యను భర్త, భర్తను భార్య ఇలా కర్కషంగా హతమార్చుతున్నారు. జిల్లాలో ఏడాదికాలంలో 10 సంఘటనల్లో 13 మంది హత్యకు గురయ్యారు. కాగా, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవ్వడమే ఇందుకు కారణమని పెద్దలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు.. జిల్లాలో అయిన వారే కుటుంబ సభ్యులను చంపిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో 10 సంఘటనల్లో 13 మంది హత్య, ఆత్మహత్య కు పాల్పడ్డారు. గార్ల మండలంలో పిల్లను ఇచ్చిన అత్తను అల్లుడు హతమార్చిన ఘటనపై ఇప్పటికీ చర్చ సాగుతోంది. అదే మండలంలో సోదరి, కన్నతండ్రి కలిసి కుమారుడిని హత్య చేసిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కురవి మండలంలో అన్నదమ్ముల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. పోలీస్స్టేషన్ సమీపంలోనే జరిగిన దాడిలో అన్న చేతిలో తమ్ముడు మృతి చెందాడు. మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమికురాలిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే భయంతో ఆమె అతడిని హత్తుకుంది. ఈఘటనలో ఇద్దరు మృతిచెందారు. కొడుకు తల్లిని చంపిన ఘటనపై తొర్రూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇరువైపులా పెద్దలు కలిసి పెళ్లి కుదిర్చారు. పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి భాజా మోగాల్సిన ఇంట్లో.. చావు డప్పు మోగింది. వధువును వరుడు బావిలో తోసేసి చంపేసిన ఘటనపై మరిపెడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నతండ్రి ఇద్దరు కుమారులను చాక్లెట్ కొనిస్తానని చెప్పి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకొని మరణించిన సంఘటన తొర్రూరు మండలం అమ్మాపురంలో జరిగింది. భర్తను భార్య చంపిన ఘటన గూడూరు మండలంలో జరిగిందిఅయినవారే ఆయువు తీస్తున్న ఘటనలు జిల్లాలో ఏడాదిలో 13 మంది హత్య కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవ్వడమే కారణమంటున్న పెద్దలు -
హత్య కేసులో మహిళ అరెస్ట్
గూడూరు: భర్తను ఇసుర్రాయితో తలపై మోది చంపిన కేసులో భార్య బోడ విజయను గురువారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వి. వినయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గూడూరు సర్కిల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలతో మండలంలోని తేజావత్రాంసింగ్తండా శివారు సోమ్లాతండాలో గురువారం తెల్లవారుజామున భర్త బోడ లాలును అతని భార్య ఇసుర్రాయి బండతో మోది చంపిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసులో విజయను విచారించిన అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామన్నారు. కార్యక్రమంలో ఎస్సై గిరిధర్రెడ్డి, సిబ్బంది కోటేశ్వర్రావు పాల్గొన్నారు. -
23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్
నయీంనగర్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి నిరసనగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ మాఫియాకు అంబాసిడర్లా వ్యవహరిస్తూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడన్నారు. విద్యా హక్కు చట్టం అటకెక్కిందని, రేషనలైజేషన్ పేరుతో 2,3000 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకుంటున్నాడని, ఈ నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రైవేట్లో ఫీజుల దోపిడీని అరికట్టి నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూపల్లి దీపిక, రాజ్కుమార్, సుజిత్, అభిలాశ్, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఏబీబీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు -
నెరవేరనున్న కల
మహబూబాబాద్ : కొన్నేళ్లుగా మానుకోటలో ఔటర్ రింగురోడ్డు గురించి కసరత్తు జరుగుతోంది. ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ప్రత్యేక చొరవతో రింగురోడ్డు మంజూరై టెండర్ దశలో ఉంది. పనులు పూర్తయితే మానుకోట పట్టణ ప్రజల కల నెరవేరనుంది. పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. కాగా, వలిగొండ–భద్రాచలం ఎన్హెచ్ను పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేయనున్నారు. పాత మ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్పై నిర్ణయం తీసుకోనున్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉండగా.. విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇక్కడ నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. అధికారికంగా 23,200 ఇళ్లు ఉన్నాయి. 2024 జూన్, జూలైలో ఔటర్ రింగు రోడ్డు కోసం తాత్కాలిక ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పుడే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. సర్వే, డీపీఆర్కు రూ.23.50 లక్షలు అవసరమని అంచనా వేశారు. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో ఔటర్ గురించి ఆలోచన చేయలేదు. ఎట్టకేలకు రింగురోడ్డు మంజూరై టెండర్ దశలో ఉంది. ఈఎస్సీ, ఇతర ప్రాసెస్ పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. కాగా, 15 కిలో మీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. అందుకు ఎమ్మెల్యే మురళీనాయక్ చొరవతో రూ.200 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా మీదుగా ఇప్పటికే ఒక జాతీయ రహదారి వెళ్తుండగా.. మరో ఎన్హెచ్ మంజూరైంది. వలిగొండ నుంచి భద్రాచలం వరకు 69.8 కిలో మీటర్లు నిర్మాణం జరుగుతుందని ఎన్హెచ్ డీఈ అమీర్ పాషా తెలిపారు. కాగా, జిల్లాలోని తొర్రూరు–నెల్లికుదురు–మానుకోట–బయ్యారం–ఇల్లెందు– కొత్తగూడెం జంక్షన్ నుంచి ఎన్హెచ్–30 వరకు నిర్మాణం చేయనున్నారు. జిల్లాలో టెండర్ ప్రక్రియ పూర్తయి తొర్రూరులో ఎన్హెచ్ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగానే ఔటర్ నిర్మాణం ఉండనుంది. మానుకోట మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్తండా సమీపం నుంచి ఎన్హెచ్ వెళ్తుంది. మెడికల్ కాలేజీ సమీపం నుంచి రజాలీపేట, సాలార్తండా, కలెక్టరేట్ సమీపం నుంచి అనంతారం రోడ్డులో నూతన మున్సిపాలిటీ భవనం పక్క నుంచి ఇల్లెందు రోడ్డులో సబ్ స్టేషన్ సమీపం వరకు ఎన్హెచ్ నిర్మాణం చేసే విధంగా మార్కింగ్ చేశారు. వలిగొండ నుంచి భద్రాచలం ఎన్హెచ్ను పరిగణనలోకి తీసుకుని ఔటర్ రింగురోడ్డు ప్రాసెస్ ఉంటుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుని 6నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయనున్నారు. డిజైన్ విషయంలో కూడా సర్వే చేసి సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఔటర్ రింగు రోడ్డు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పెద్ద వాహనాలన్నీ ఆ రోడ్డుమీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. ఔటర్ పూర్తయితే మానుకోట పట్టణ రూపురేఖలు మారుతాయి. త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. డిజైన్ విషయంలో సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. వలిగొండ–భద్రాచలం ఎన్హెచ్ను పరి గణనలోకి తీసుకుని నిర్మాణం చేస్తాం. అందరూ సహకరించాలి. –రాజు పాండ్యా, ఈఈ, ఆర్అండ్బీ త్వరలో మానుకోటలో 15 కిలో మీటర్ల మేర పనులు వలిగొండ– భద్రాచలం ఎన్హెచ్ పరిగణనలోకి.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ.. రూ.200 కోట్లు కేటాయింపు -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
● శాలపల్లిలో ఘటన వేలేరు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై అజ్మీరా సురేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదరి కొమురయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని సుమారు రూ. 10 లక్షల అప్పు చేసి కొనుగోలు చేశాడు. అయితే అప్పు ఎలా తీర్చాలని మనస్తాపం చెందుతున్నాడు. కాగా, కొద్ది రోజులుగా మద్యం సేవిస్తూ కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. దీంతో భార్య, కుమారులు.. తాగి ఎందుకు గొడవ చేస్తున్నావని మందలించడంతో మనస్తాపం చెందిన కొమురయ్య శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు
జాతీయ రహదారులపై అధికార యంత్రాంగం ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తసుకుంటున్నా అతివేగం, అజాగ్రత్త, నిరంతరం విశ్రాంతి లేకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లింగాలఘణపురం మండల పరిధిలోని జనగామ– సూర్యాపేట, హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారుల్లో వారం రోజుల్లో రెండు ఘోర ప్రమాదాలు జరిగి ఆరుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 11న జనగామ –సూర్యాపేట హైవేలో నవాబుపేట మలుపు వద్ద అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో కాజీపేటకు చెందిన ఇమ్రాన్, సుభానీ, మాజీద్ ముగ్గురు మృతి చెందారు. అదేవిధంగా గురువారం తెల్లవారుజామున హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్డి సమీపంలో ఆగిఉన్న టాటాలేలాండ్ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొనడంతో దేవరుప్పులకు చెందిన రోహిత్, గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన ననబాల మహేశ్ అలియాస్ మధు, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడేనికి చెందిన రాజేందర్ దుర్మరణం చెందారు. దీనికి కారణం అతివేగం, నిద్రమత్తు, అర్ధరాత్రి ప్రయాణం చేయడమే కారణమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరుగురి యువకుల దుర్మరణం తల్లడిల్లుతున్న కుటుంబాలు -
పాపం.. పసికందు
కాశిబుగ్గ : పాపం.. పసికందు. నెలలుగా తల్లిగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ శిశువు జన్మించిన కొంత సమయానికి కన్నుమూశాడు. కోటి ఆశలతో బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన కొద్ది క్షణాల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషాదకర ఘటన వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాగా, పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి సకాలంలో డెలివరీ చేయకపోవడంతో పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే బిడ్డ కన్నుమూసిన విషయం తల్లికి తెలియనీయలేదు. బిడ్డ లేదనే తెలిస్తే ఆమె ఆ‘వేదన’ భరించలేమంటూ దాచి పెట్టాల్సి వచ్చింది. చికిత్స కోసం బిడ్డను పెద్దాసుపత్రికి పంపించామంటూ చెప్పుతూ వస్తున్నారు. ఈ చేదు విషయాన్ని బాలింతైన తల్లికి ఎలా చెప్పాలో తెలియక ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డకు కడుపుకోత మిగిలిందని ఆరోపిస్తూ బోరున విలపించారు. అలాగే, సీకేఎం, ఎంజీఎం దవాఖానల్లో వెంటిలెటర్లు సకాలంలో అందక చిన్ని గుండె శ్వాస ఆడిపోయిందంటూ విలపించడం పలువురు హృదయాలను కలచివేసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన పెండ్లి కస్తూరి ఈ నెల 15న ఉదయం 8 గంటలకు డెలివరీ కోసం సీకేఎం ఆస్పత్రికి వస్తే ఉమ్మనీరు ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చారు. ఇదేమిటని వైద్యులను అడిగితే మీ బిడ్డ కన్నా ఇంకా ఎమర్జెన్సీ పేషెంట్లు ఉన్నారంటూ దాట వేశారు. మా బిడ్డ కూడా ఎమర్జెన్సీ కదా అంటే మీ బిడ్డకు ఏమి కాదూ, ఏమన్నా అయితే బేబీకి అవుతుందని చెప్పారు. పుట్టబోయే బిడ్డకు సమస్య ఉందని చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. అయినా నాలుగైదు గంటలు వేచి చూసి అడిగితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మళ్లీ అడిగితే ‘ఓపిక ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి, మీరు వెళ్తే మాకు ఏమి ఫరక్ పడదు. ఇంతకుముందే సంతకాలు తీసుకున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. చివరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో లేబర్ రూమ్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేసిన తర్వాత 10.30 గంటల ప్రాంతంలో మగశిశువు జన్మించాడు. అయితే ఊపిరితిత్తుల సమస్య ఉందని, వెంటనే వెంటిలెటర్ మీద ఉంచాలంటూ చెప్పారు. సీకేఎంలో వెంటిలెటర్ లేదు.. ఎంజీఎం వెళ్లిండి అంటూ చెప్పడంతో అక్కడికి వెళ్లారు. ఎంజీఎం వైద్యులు చికిత్స చేస్తూ పుట్టిన బాబుకు నోటి నుంచి సరిగా పైపు వేయలేదంటూ సరిచేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం వెంటిలెటర్లు లేవంటూ చల్లగా వార్త చెప్పారు. దీంతో వారు పసిగుడ్డును తీసుకుని హుటాహుటినా అర్ధరాత్రి సమయంలో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించి చికిత్స చేయించారు. సీకేఎం, ఎంజీఎం సిబ్బంది సరిగా పైపు వేయలేదు, డెలివరీ సరిగా చేయలేదంటూ రోజు మొత్తం వెంటిలెటర్ మీద ఉంచాలంటూ చికిత్స అందించారు. ఇక్కడ చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినా బుధవారం పుట్టిన బిడ్డ దక్కకుండా పోయాడు.ఒకవైపు పుట్టిన పసిగుడ్డు దక్కకుండా పోయిందని దిగులతో ఉన్న కుటుంబ సభ్యులకు ‘మీ బిడ్డకు గర్భసంచి సమస్య ఉంది.. మళ్లీ ప్రెగ్నెన్సీకి అవకాశం లేదు’ అంటూ పిడుగు పడ్డట్లు మరో చేదు వార్త చెప్పారు. అలాగే, ఫ్యామిటీ ప్లానింగ్కు కుడా అవకాశం లేదని, ఆమె భర్తను చేయించుకోవాలంటూ సమాధానం ఇచ్చారు. తాము జాయిన్ చేసినప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పి, ఇప్పుడు ఇలా చెబుతున్నారంటూ కుటుంబీకులు ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేష్షీట్లో రాస్తామంటూ బదులిచ్చారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్షంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆర్ఎంఓకు ఫిర్యాదు చేయడంతో పాటు కంప్లైంట్ బాక్స్లో కూడా వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పురిటిలోనే కన్నుమూసిన బాలుడు.. తల్లికి తెలియని విషయం బాలింత ఓ చోట.. బిడ్డ మరోచోట కూతురికి ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు సీకేఎంలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణఉమ్మనీరు తక్కువగా ఉండడం.. సీకేఎంలో డెలివరీ కోసం అడ్మిట్ అయిన కస్తూరి పేషెంట్కు ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. అలాగే, ఆమెకు పూర్తిగా నెలలు నిండలేదు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదు. సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతాం. – నవీన్, ఆర్ఎంఓ, సీకేఎం ఆస్పత్రి -
నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హన్మకొండ: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు పోరాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాకేశ్ రెడ్డి ఇ–క్లాసెస్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాకేశ్ రెడ్డి ఇ–క్లాసెస్ యాప్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని దివాళకోరు ప్రభుత్వం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేని వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఇ–క్లాసెస్ యాప్ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విఽభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కేయూ అర్థశాస్త్ర అధ్యాపకుడు తిరునహరి శేషు, ప్రముఖ న్యూరో వైద్యుడు నవీన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, చక్రవర్తి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి -
విద్యుత్శాఖ ‘హైపర్ యాక్షన్ ప్లాన్’
● ఏఐ సాంకేతికతతో సమస్యల గుర్తింపు ● ఎస్ఈ విజేందర్రెడ్డి నెహ్రూసెంటర్: వానాకాలం భారీ వర్షాలు, ఈదురుగాలుల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ వాతావరణ శాఖ ద్వారా సేకరిస్తూ మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు ఎస్ఈ పి.విజేందర్రెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాలో జరిగే అంతరాయాన్ని అధిగమించేందుకు ‘హైపర్’ అనే ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని, వర్షాకాలం, ఈదురుగాలుల వల్ల విద్యుత్శాఖ ఎక్కువ ప్రభావితం అవుతుందని, వినియోగదారులకు తక్కువ సమయంలోనే విద్యుత్ పునరుద్ధరణ సేవలు అందించేందుకు ఈ హైపర్ ప్లాన్ దోహదం చేస్తుందన్నారు. హైపర్ కార్యాచరణ.. ● హెడ్ క్వార్టర్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండడం ● అవసరమైన సిబ్బంది, సామగ్రిని ముందస్తు సమీకరించుకోవడం ● విద్యుత్ అంతరాయాలపై కచ్చితమైన సమాచార సేకరణ, వేగంగా చేరవేయడం ● నిర్ధిష్ట కార్యాచరణను వేగంగా అమలు చేయడం ● విద్యుత్ సరఫరాను నిర్దేశిత సమయంలో పునరుద్ధరించడం ● క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యూహం అమలు చేయడం జీపీఆర్ఎస్ ఆధారిత ఎమర్జెన్సీ వాహనాలు.. భారీ వర్షాల వల్ల ఏర్పడే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రతీ సర్కిల్లోనూ ‘ఎమర్జెన్సీ రిస్టోర్ టీం’ వాహనాలను అందుబాటులో ఉంచామని ఎస్ఈ విజేందర్రెడ్డి వెల్లడించారు. ఈ వాహనాల్లో వరమ్మతులకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయని, జీపీఆర్ఎస్ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా లోకేషన్ను వేగంగా గుర్తించి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంతో విద్యుత్శాఖ ముందు వరుసలో ఉందని, ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేశామని తెలిపారు. లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎస్ఈ వెల్లడించారు. -
తెరవ‘బడి’
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026762ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు40,703సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో విద్యార్థుల నమోదు లేదనే కారణంతో 162 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. దీనికి కారణం ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించడం లేదని.. అందుకోసమే తమ పిల్లలను పంపడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్ర భుత్వ పాఠశాలలు మూతపడటం మంచిది కాదని, వాటిని తెరిపించాలని ఉన్నతాధికారులు పదే పదే చెప్పారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విద్యార్థులు లేక మూతపడిన 12 పాఠశాలలను తెరిచారు. ప్రస్తుతం ఆ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. 162 పాఠశాలలు మూత.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని జిల్లాలోని 162 పాఠశాలలు మూసివేశారు. గత ఏడాది 152 పాఠశాలలు మూసి ఉండగా అందులో కొన్ని బడులు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, తండాపెద్దలు, ఇతర వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసే వారి చొరవతో తెరిచారు. కానీ, ఈ ఏడాది మళ్లీ మొదటికి వచ్చింది. విద్యార్థులు లేని పాఠశాలలు 162 ఉన్నాయని అందుకోసమే వాటిని మూసివేశామని అధికారులు చెబుతున్నారు. కాగా, అదివాసీ, గిరిజన పిల్లలు అధికంగా ఉన్న మరిపెడ, కేసముద్రం, చిన్నగూడూరు, గూడూరు మండలాల్లో ఎక్కువగా పాఠశాలలు మూతపడ్డాయి. గిరిజన, ఆదివాసీ విద్యార్థులు అడవి, పొలం గట్లు దాటుకుంటూ.. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. తెలుచుకుంటున్న బడులు.. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించాలని అధికారులకు పదే పదే చెబుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కలెక్టర స్నేహ శబరీష్ ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జిల్లాలోని విద్యార్థులు లేక మూతబడిన 162 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చిన్నగూడూరు మండలం చేపూరుతండా, డొర్నకల్ మండలం చాంప్లాతండా, నర్సింహులపేట మండలం అమీర్యాతండా, పెద్దవంగర మండలం సోమ్లాతండా, సీరోలు మండలం అందనాలపాడు, మరిపెడ మండలం మాలోత్ తండా, మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం తండా, పీఎస్బీఎన్తండా, కురవి మండలం రాజతండా, హరిదాస్ తండా, భద్రుతండా, కొత్తగూడ మండలం ఆదిలక్ష్మీపురంలోని పాఠశా లలు తెరుచుకున్నాయి.జిల్లాలో ఈ విద్యాసంవత్సరం తెరుచుకున్న12 ప్రభుత్వ పాఠశాలలు గతంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉందని 162 బడుల మూత విద్యార్థులను చేర్పించి తెరవాలని అధికారుల ఆదేశం బడిబాటలో విద్యార్థుల వేట -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
నూతనకల్ : నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బోడపట్ల యాకస్వామి నకిలీ పత్తి విత్తనాలను బస్తాలో వేసుకుని మోటారు సైకిల్పై తీసుకెళ్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నూతనకల్ మండల పరిధిలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద 45 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయి. విత్తనాలతో పాటు సెల్ఫోన్, మోటారు సైకిల్, టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా యాకస్వామితో పాటు అతడికి సహకరించిన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నేడు హనుమకొండలో ప్రాంతీయ కార్యక్రమం
హన్మకొండ అర్బన్ : దేశవ్యాప్తంగా 200 ప్రధాన కేంద్రాల్లో ఒకేసారి ప్రాంతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం హనుమకొండ దర్గా రోడ్డు లోని ఈపీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం వరంగల్ రీజినల్ కార్యాలయ పరిధిలో హనుమకొండ నక్కలగుట్ట అదాలత్ సర్కిల్ సమీపంలోని ఏకాశిల బ్యాంక్వెట్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్య శారద హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 50 మంది యజమానులు, 200 మంది ఉద్యోగులతో కలిపి మొత్తం 250 మంది లబ్ధిదారులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఉద్యోగ భవిష్యనిధి శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. వరంగల్ రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వై.డి శ్రీనివాస్ -
జాడలేని చినుకు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భా రీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపురం(ఎం), కన్నాయుగూడెంలో సాధారణ వర్షపాతం న మోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వా యి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 జయశంకర్ భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
మొక్కలు నాటి సంరక్షించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ప్రభుత్వ శాఖలకు కేటాయించిన మొక్కల పెంపకం లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులోని అటవీశాఖ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్, డీఎఫ్ఓ విశాల్ బత్తుల, డీఆర్డీఓ మధుసూదన్రాజు గురువారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, జిల్లాలోని ప్రభుత్వశాఖలకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కల పెంపకం, సంరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ట్రీగార్డ్, రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. సమయానికి నీరు అందించాలని, అవెన్యూ ప్లాంటేషన్, మంకీ ఫుడ్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. ప్రతీ గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధిలో డిమాండ్కు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టి వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా హార్టికల్చర్ అధికారి జినుగు మరియన్న, ఫారెస్ట్ రేంజ్ అధికారి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కురవి రజిత, అంబాల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిథిలావస్థ భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. డీఐఈఓ మదార్ గౌడ్, కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డీపీ గణేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరుణ్ కుమార్, అధ్యాపకులు నయీమ్ పాషా, సురేందర్, షాహిద్, నాగిరెడ్డి, అప్పారావు, సుశీల, శివ, అయేషా, సారయ్య, బాలరాజు, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్న బైక్
కురవి/నెహ్రుసెంటర్: ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సీరోలు మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండా సమీపంలో చోటు చేసుకుంది. సీరోలు ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం గాంధీపురం గ్రామానికి చెందిన నర్సింగ రవి(45) బైక్పై బుధవారం రాత్రి మరిపెడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నాడు. సీరోలు మండలం కొత్తూరు(సీ) శివారు గుజిలి తండా సమీపంలో 365 జాతీయ రహదారి పక్కన జామాయిల్ కర్రల లోడ్తో ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ట్రాక్టర్ను రోడ్డుపై నిలిపారు. ఈ క్రమంలో రవి ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్కు ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్లో మహబూబాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురువారం పేర్కొన్నారు. అండర్ బ్రిడ్జి వద్ద ధర్నా.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్ద అంబులెన్స్ను ఆపి ధర్నా చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. పోలీసుల హామీతో నిరసన విరమించారు. వ్యక్తి దుర్మరణం గుజిలి తండా సమీపంలో ఘటన -
ఎల్నినోతో తగ్గనున్న వర్షపాతం
హన్మకొండ : ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఎం.మధు అన్నారు. ఈ క్రమంలో ఆపత్కాలిక పంటలైన అపరాల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం–కంది, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కంది సాగు ప్రథమ శ్రేణి ప్రదర్శనల్లో భాగంగా కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం వరంగల్ పైడిపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహ పరిశోధన సంచాలకుడు ఎం.శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కంది విత్తనాలు అందించారు. ఆయన మాట్లాడుతూ అపరాల సాగులో భాగంగా కంది పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్టు కె.రుక్మిణి మాట్లాడుతూ కంది, పెసర, మినుము పంటల విస్తీర్ణం పెంచాలన్నారు. ఎఫ్ఎల్డీ ఇన్చార్జ్ ఎం.మధు కంది పంట యాజమాన్య పద్ధతులు వివరించారు. అపరాల విభాగం అధిపతి జి.శేషు మాట్లాడుతూ ఆర్.ఎ.ఆర్.ఎస్. నుంచి నూతనంగా కంది రకాలు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి.వీరన్న, జి.పద్మజ, ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పాల్గొన్నారు.● ఆపత్కాలిక పంటలపై దృష్టి సారించాలి ● ఆర్ఎఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకుడు మధు -
‘డ్రగ్స్’పై ఉక్కుపాదం!
వరంగల్ క్రైం : తెలంగాణలో విద్య కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్లో 2024 జూలైలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీమ్ మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి అమ్మకాలు, పెంపకం, రవాణా, వినియోగం.. ఇలా ఏది కనిపించినా నిందితుల భరతం పడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గంజాయి వినియోగించే వారిలో 90 శాతం మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను కాపాడడానికి డ్రగ్స్ కంట్రోల్ బృందాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సన్ప్రీత్ సింగ్.. డ్రగ్స్ టీమ్తో కలిసి వివరాలు వెల్లడించారు. కేసులు 192.. నిందితులు 403 మంది డ్రగ్స్ కంట్రోల్ టీమ్ కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గంజాయితోపాటు ఇతర మత్తు పదా ర్థాలు పట్టుకుంది. ఇప్పటి వరకు 192 కేసులు నమోదు చేసింది. ఇందులో అమ్మకాలతోపాటు వినియోగించిన వారు 403 మంది ఉన్నారు. వీరిపై ఆయా సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 1,241 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 7 గంజాయి మొక్కలు, 1.530 కిలోల ఓపీయం, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్, 251 గంజాయి చాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 8,57,90,978 ఉంటుంది. నిందితుల నుంచి రూ.2,15, 500 నగదు, 601 ఫోన్లు, 63 బైక్లు, 6 ఆటోలు, 8 కార్లు స్వాధీనం చేసుకుని నేరస్తులను జైలుకు పంపారు. విముక్తికి చర్యలు.. యువతకు మత్తు నుంచి విముక్తి కల్పించడానికి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, నర్సంపేట, జనగామ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్యం అందించి కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిగా అలవాట్లు మానిన తర్వాత వారిని బయటకు పంపుతున్నారు. వ్యసనం నుంచి విముక్తి పొందిన యువతపై నమోదైన కేసులను సైతం తొలగిస్తున్నారు. ● కేసులు 192.. నిందితులు 403 మంది ● రూ.8.57 కోట్ల విలువైన సరుకు పట్టివేత ● 63 బైక్లు, 601 ఫోన్లు స్వాధీనండ్రగ్స్ నియంత్రణకు చర్యలు కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మత్తు పదార్థాలపై ఎలాంటి సమాచారం ఉన్నా 87 123685299, 8712584473 నంబర్లకు సమాచారం అందించాలి. డ్రగ్స్ ఫ్రీ కమిషనరేట్కు ప్రజలు సహకరించాలి. –సన్ప్రీత్సింగ్, సీపీ వరంగల్2025 –2026లో కేసులు ఇలా సంవత్సరం కేసులు నిందితులు స్మోకర్స్ స్వాధీనం చేసుకున్న వస్తువులు 2025 101 212 265 ఫోన్లు.. 205 4 కార్లు, 2 ఆటోలు 2026 44 108 55 ఫోన్లు.. 98, బైక్లు13, 2 ఆటోలు, 2 కార్లు -
విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించాలి
కాశిబుగ్గ: మెడికల్ విద్యార్థులు విద్య, వైద్య పరిశోధన రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ బి.వి నాగమోహన్ అన్నారు. బుధవారం రాత్రి కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో బదిలీ అయిన వారికి వీడ్కోలు, బాధ్యతలు స్వీకరించిన వారికి స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెడిసిన్లో ప్రధాన ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పరిశోధన రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ విభాగం నూతన హెచ్ఓడీగా బాధ్యతలు స్వీకరించిన ఖాజా మోయినోద్దీన్, వసంతకుమార్ను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్లు నవీన్, అంబటి శ్రీనివాస్, సదాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు, బదిలీలు, బాధ్యత స్వీకరణలు.. కేఎంసీ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు గాంధీ మెడికల్ కాలేజీకి, అసోసియేట్ ప్రొఫెసర్ జె.సురేందర్ ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేటకు బదిలీ అయ్యారు. అలాగే, కాకతీయ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ ఖాజామొయినుద్దీన్హెచ్ఓడీగా, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ వసంత్కు స్వాగతం పలికారు. గాంధీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ హెచ్ఓడీ నాగమోహన్ -
మూడు కుటుంబాలు చిన్నాభిన్నం
లింగాలఘణపురం : అన్న మాట కాదనలేక అర్ధరాత్రి ఇరవై కిలో మీటర్లు బైక్పై జాకీ తీసుకొచ్చిన తమ్ముడు.. రాత్రి వేళలో ఆపదలో ఉన్నారు.. లారీ ఆపుతున్నారు..ఆపు బావ..వారికి ఏ ఆపద ఉందో చూద్దామని వాహనం ఆపించి జాకీ ఇచ్చిన బావమరిది.. జీవన పోరాటంలో డ్రైవింగ్ చేసుకుంటూ మూడు నెలల క్రితమే మేనమరదలను వివాహం చే సుకుని పాడైన బండికి మరమ్మతు చేస్తున్న ఓ యు వకుడు.. ఇలా ముగ్గురు ఒకే చోట.. ఒకే రోడ్డు ప్ర మాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ముగ్గురిని బ లితీసుకుంది. ముందుగా ఓ యువకుడిని ఢీకొనడంతో అతను (రోహిత్), ఆ తర్వాత మరమ్మతు చే స్తున్న టాటాలేలాండ్ వాహనాన్ని ఢీకొట్టడంతో దా ని కింద ఉన్న మరో యువకుడు (డ్రైవర్ మహేశ్), లారీ ఎక్కేందుకు వెళ్తున్న ఇంకో యువకుడి (రాజేందర్)పై టాటాలేలాండ్ వాహనం పడడంతో అతను.. ఇలా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. సాయం చేద్దామని లారీని ఆపించిన రాజేందర్ డినికిని రాజేందర్(27), తన బావ మొగులగాని హరీశ్ స్వంత లారీలో ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం బయలు దేరారు. రోడ్డుపై చేయి అడ్డుపెట్టి వాహనాన్ని ఆపుతుండగా బావ ఆపు రాత్రి వేళలో వారికి ఏం ఆపద ఉందోనంటూ బలవంతంగా లారీ ఆపి జాకీ ఇచ్చాడు. సాయం చేయడమే అతని పాలిట శాపమైంది. పెద్దలను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో టీవీలు, ఏసీలు మరమ్మతు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీని ఆపమనడమే అతడికి శాపమైంది. మిన్నంటిన మృతుల బంధువుల రోదనలు మృతుల బంధువుల రోదనలు ఆకాశాన్ని అంటా యి. తన తమ్మున్ని తానే చావుకు పిలిచినట్లైందని రోహిత్ అన్న దిలీప్, వద్దన్నా వినకుండా తన చావుకోసమే లారీని ఆపమన్నాడని రాజేందర్ బావ హ రీశ్, తమ కొడుకుకు మూడునెలల క్రితమే పెళ్లి చేశా .. అప్పడే నిండునూరేళ్లు నిండాయి.. మాకు.. న్యా యం చేయాలని మహేశ్ తల్లి పోలీసులను వేడుకుంటున్న తీరు అందరిని కంటతడి పెట్టిచింది. టాటాలేలాండ్ వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన మహేశ్ అలియాస్ మధు(23) హైదరాబాద్కు కిరాయి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో వాహనం మరమ్మతుకు గురికావడంతో దానికింద పడుకొని జాకీ ఎక్కిస్తుండగా ప్రమాదం సంభవించింది. మూడు నెలల క్రితమే మేనమరదలను వివాహం చేసుకున్నాడు. అన్న మాట కాదనలేక అర్ధరాత్రి వచ్చి ఒకరు సాయం చేద్దామని లారీ ఆపించి మరొకరు బతుకు బండిని బాగు చేసే క్రమంలో ఇంకొకరు.. ఇలా.. ఒకే చోట జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం ఆస్పత్రి, పోలీసుస్టేషన్లలో మిన్నంటిన బంధువుల ఆర్తనాదాలుదేవరుప్పులలో కిరాణం షాపు నడుకుంటున్న మార్వాడీ దిలీప్ హైదరాబాద్ నుంచి టాటాలేలాండ్ వాహనంలో సామగ్రి తీసుకొస్తుండగా టైరు పంక్చర్ అయ్యింది. దీంతో జాకీ కోసం తమ్ముడు రోహిత్(22)కు ఫోన్ చేసి పిలిపించాడు. వెంటనే రోహిత్ రెండో ఆలోచన చేయకుండా బైక్పై జాకీ తీసుకొచ్చి వాహన మరమ్మతులో సహకరిస్తూ రోడ్డుపై వచ్చే వాహనాలకు ప్రమాదం ఉందని హెచ్చరిక చేస్తూ ఉండగా ఎదురుగా ఇసుకలారీ వచ్చి ఢీకొనడంతో చనిపోయాడు. -
నారాయణపురం భూ సర్వే వేగవంతం చేయాలి
● సీపీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సర్వే ఎంత వరకు వచ్చిందని, నారాయణపురం గ్రామంలో భూ సర్వే వేగవంతం చేయాలని సీపీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, ల్యాండ్ సర్వే కమిషనర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో వారు సమీక్షించారు. భూభారతి, సాదాబైనామా భూ సమస్యలు పరిష్కరించాలన్నా రు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్నారు. కేసముద్రం మండలంలోని నారాయణపురం తదితర గ్రామాల భూ సమస్యల పరి ష్కారం కోసం ఇప్పటికే ప్రత్యేక విభాగం క్షేత్రస్థాయిలో పనిచేస్తుందన్నారు. అటవీ, రెవెన్యూ, ల్యాండ్ సర్వే శాఖల సర్వేల ద్వారా రైతులకు సమాచారం అందించి త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూభారతి, సాదాబైనామాలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను గ్రామసభలు నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా నక్ష, ల్యాండ్ సర్వేలను పూర్తి సమాచారాన్ని సర్వేయర్ల ద్వారా సేకరించి సకాలంలో ఆన్లైన్లో నమో దు చేయాలన్నారు. నారాయణపురం గ్రామ భూ సమస్య, నక్ష సర్వే, భూభారతి మొదలైన అంశాలపై కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, సర్వే ల్యాండ్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న, డిప్యూటీ డైరెక్టర్ సమీరా బేగం, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, మహబూబాబాద్ ఆర్డీఓ రాజేశ్వరి, కేసముద్రం తహసీల్దార్ వివేక్, మదన్ పాల్గొన్నారు. -
ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం
ములుగు: ములుగు జిల్లాలో తొలిసారి ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో భవిష్యత్కు దారులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవా ల్సిన అవసరం ఉందన్నారు. శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ సంవత్సర కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. ములుగు జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
క్రీడా పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు
వరంగల్ స్పోర్ట్స్ : ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన ‘క్రీడా పాఠశాల.. నిర్వహణ ఎలా?’ అనే కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. హనుమకొండ కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ రవి బుధవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని క్రీడా పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన 80 మంది విద్యార్థులకు తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను ఆదేశించారు. విద్యార్థులకు అదనపు గదుల కోసం ఇప్పటికే స్టేడియంలో క్రీడా సంఘాల ఆధీనంలో ఉన్న గదులను ఖాళీ చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యే విద్యార్థులు శిక్షణతో పాటు విద్యను కూడా ఒకే ప్రాంగణంలో పొందేలా స్టేడియం లోపలే పాఠశాల, హాస్టల్, భోజనశాల తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం స్టేడియంలోని గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత తదితర అంశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి.. స్కూల్ ప్రారంభానికి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ స్పోర్ట్స్ స్కూల్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, విద్య, వసతి ఒకేచోట అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. స్పోర్ట్స్స్కూల్ను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి క్రీడా సంఘాల ఆధీనంలోని గదులు ఖాళీ చేయాలని ఆదేశం -
మట్టి నమూనాల సేకరణలో నాణ్యత పాటించాలి
గూడూరు: మట్టి నమూనాల సేకరణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని హైదరాబాద్కు చెందిన క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ప్రాజెక్టు మేనేజర్ ఎ.ఎస్. హరీశ్, కన్సల్టెంట్ బి.ఆర్. ఎం. రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజ్పల్లి, గోవిందాపురం, చక్రు తండా గ్రామాల్లో బుధవారం నేల, భూ వినియోగ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వేతో నేల రకం, భూరక్షత, భూసారం, లోతు, నేల పరిరక్షణ, నేల కోత తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో ఉపగ్రహ చిత్రాల ద్వారా సాయిల్ ఫీల్డ్ సర్వే జరుగుతోందని, తద్వారా మట్టి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. భూమి సాంద్రత, ఫెర్టిలిటీ సర్వేస్ ఎనాలిసిస్, కెమికల్ ఎనాలిసిస్ హైదరాబాద్ ల్యాబ్లో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత మ్యాప్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ డిజిటల్ సర్వేతో జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి నేలలు ఉన్నాయి? ఏ భూమిలో ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుంది? ఎరువులు ఎంత మోతాదులో వినియోగించుకోవాలో రైతులకు పూర్తి అవగాహన వస్తుందన్నారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి, దేశ వ్యవసాయ రంగానికి, స్థానిక రైతులకు మేలు జరుగుతుందన్నారు. యువకుడిపై దాడి ● ముగ్గురిపై కేసు నల్లబెల్లి : యువకుడిపై దాడికి పాల్పడిన ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోడెం సాయి ప్రసన్న కుమార్ తెలిపారు. మండలంలోని రాంపూర్కు చెందిన గోదుమల శ్రీనివాస్ కుమారుడు రక్షిత్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆటోలో కూర్చున్నాడు. ఈ సమయంలో గ్రామానికి చెందిన దుస్స వెంకన్న, బోయినల అశోక్, జలగం రాజు.. రక్షిత్తో గొడవపడి దుర్బాషలాడారు. గమనించిన శ్రీనివాస్ కుటుంబీకులు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించగా రక్షిత్తో పాటు కుటుంబీకులపై దాడికి పాల్పడి చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం పేర్కొన్నారు. తాటిపైనుంచి పడి గీత కార్మికుడి మృతి చిల్పూరు: తాటిపై నుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తండ వెంకట్రాజం(51) రోజు మాదిరిగానే కల్లుగీయడానికి తాటివనానికి వెళ్లి చెట్టు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో మోకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలి పారు. మృతుడికి ము గ్గురు పిల్లలు ఉన్నారు. -
ఎంజీఎం సూపరింటెండెంట్ ఎవరు?
కాశిబుగ్గ: వరంగల్లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో (ఎంజీఎం) కొత్త సూపరింటెండెంట్గా ఎవరిని నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పది రోజుల దాటినా పోస్టును భర్తీ చేయకపోవడంతో ఆస్పత్రిలో పాలన గతి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దికై ్కన ఈ ఆస్పత్రిపై ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎంజీఎం మరో కొన్ని నెలల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ భవనంలోకి మారనున్న ఈ సమయంలో సూపరింటెండెంట్ పోస్టు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టు కోసం రోజుకో సీనియర్ వైద్యుల పేరు వినపడుతున్నా భర్తీకి నోచుకోవడం లేదు. ఓ ఇద్దరు సీనియర్ వైద్యులు ఎంజీఎంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసినా వారికి ఎందుకో అవకాశం లభించలేదని తెలుస్తోంది. ఎంజీఎంలో నిలిచిన పేమెంట్స్.. ఇంత పెద్ద దవాఖానాకు వివిధ పనుల కోసం ఎన్నో ఖర్చులు ఉంటాయి. అయితే వాటికి సకాలంలో పేమెంట్స్ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చేసిన పనులు, అత్యవసర పనులు, ఇంకా చేయాల్సిన పనుల కోసం ఎంజీఎంలో చెల్లించడానికి ఎవరికీ అధికారం లేదు. ఇలాంటి వాటికి డబ్బులు ఎలా ఇవ్వాలంటూ అధికారులు సతమతమవుతున్నారు. చెక్ పవర్ లేక అధికారులకు ఆర్థిక ఇబ్బందులు.. సాధారణంగా చెక్ పవర్ సూపరింటెండెంట్కు ఉంటుంది. అయితే పది రోజుల నుంచి సూపరింటెండెంట్ లేకపోవడంతో అధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు చెల్లించనిదే పనులు కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఆస్పత్రికి సంబంధించిన చెల్లింపులు ఎలా చేయాలో అర్థం కాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు లేకపోవడంతో చెక్ పవర్ కూడా అందని పరిస్థితి నెలకొంది. పైసలు లేకుండా ఆస్పత్రిని ఎలా నడిపించాలో, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో కొత్త సూపరింటెండెంట్గా ఎవరూ వస్తారో వేచిచూడాల్సిందే. ? ఆస్పత్రికి అవసరమైన వివిధ మందుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏ మందులు కొనాలన్నా సూపరింటెండెంట్ అనుమతి తీసుకోవాలి. అలాగే ల్యాబ్ అవసరమైన కెమికల్స్ కోసం ఉన్నతాధికారి పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఉన్నతాధికారి లేకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ సిబ్బంది వాపోతున్నారు. దీంతో పేషెంట్లకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ స్టోర్లో ఉన్న మందులతోనే సరిచేయడం తప్ప కొత్తవి కొనుగోలు చేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పేషెంట్లకు అరకొర మందులు దిక్కవుతున్నాయి.ఎంజీఎంలో తరచూ ఏదో ఓ పరికరాన్ని మరమ్మతు చేయాల్సి వస్తోంది. దీంతో అధికారుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని దుస్థితి నెలకొంది. ప్రైవేట్గా పరికరాల మరమ్మతు చేసినప్పుడు సదరు వ్యక్తులకు పేమెంట్స్ చేయకపోతే వారు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ రిపేర్ కోసం రమ్మంటే రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఎంజీఎం అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ మరమ్మతు చేయిస్తే, డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు సమాచారం. పది రోజులు దాటినా నియమించని ప్రభుత్వం నిలిచిపోయిన పేమెంట్స్.. ఆగిన మందుల సరఫరా పరికరాల మరమ్మతులకు డబ్బులు కరువు ఎవరికీ చెక్ పవర్ లేక అధికారుల సతమతం కొత్త బిగ్బాస్ కోసం నిత్యం ఎదురుచూపులే -
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
మామునూరు : కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ జీ అన్నారు. బుధవారం వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వ్యవసాయం– రైతు కార్యశాల’ కార్యక్రమం నిర్వహించారు. చంద్రశేఖర్ తివారీ జీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో విశ్వాసం– అభివృద్ధి– ప్రజా సంక్షేమం– వ్యవసాయ రంగంలో స్వర్ణయుగానికి నాంది పలికిందని కొనియాడారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక లాభాలు పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతో దోహద పడుతుందని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. బీజేపీ నేతలు గౌతమ్రావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అజ్మీరా సీతారామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, రాజేశ్వర్రావు, అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, వన్నాల వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు నిషిధర్రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, రాజమౌళి గౌడ్, చాడ శ్రీనివాస్రెడ్డి, జలగం రంజిత్, కుసుమ సతీశ్, భాకం హరిశంకర్, నరేశ్, బన్న ప్రభాకర్, ప్రతాప్, పుల్లారావు, మంజుల రెడ్డి, గందె నవీన్, కన్నయ్య, రమ్య, రైతులు పాల్గొన్నారు రైతు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ జీ -
వరంగల్లో పవన్ సందడి
జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ హనుమాన్నగర్ ప్రాంతానికి చెందిన తన అభిమాని నిరంజన్ ఇంటికి బుధవారం సినీహీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. నిరంజన్ను పరామర్శించారు. ఆత్మీయంగా పలకరించి శాలువాతో సన్మానించారు. పవన్ వస్తున్నాడన్న సమాచారం మేరకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరామర్శ అనంతరం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి చీర, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేపూజలు నిర్వహించుకున్నారు. – నయీంనగర్/హన్మకొండ కల్చరల్ -
బాలాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్దరణ, తొలగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ మహేశ్ ఆధ్వర్యంలో స్వామివారికి పూలు, పండ్లు సమర్పించి విశేష పూజలు చేశారు. శృంగేరి పీఠాధిపతి శ్రీవిధుశేఖరభారతి తీర్థస్వామి ఆశీస్సులతో వచ్చిన వేద పండితులు సందీప్శర్మ, రాధాకృష్ణశర్మ తొమ్మిది మంది బృందంతో క్రతువును వైభవోపేతంగా జరిపించారు. ముందుగా మహాగణపతి పూ జ చేసి, ప్రత్యేకంగా అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పంచబ్రహ్మ హోమం, శాంతి పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, కళాపకర్షణ క్రతువును ఉదయం 10:20 గంటలకు ప్రారంభించారు. తర్వాత విజయ గణపతి, పార్వతి దేవి (శుభానంద మాత), మహా సరస్వతిమాత, శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ పూజలు నిర్వహించి పంచలోహ బింబాల(కలశాలు)లో ప్రాణప్రతిష్ఠ చేపట్టారు. శృంగేరి శారదాపీఠాధిపతి స్వామివారు బాలాలయ పూజల కోసం పంపించిన కాళేశ్వరముక్తీశ్వర స్వామివారి చిన్న లింగాల(నర్మదా రాయి)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లింగాలను దేవస్థానానికి అందజేశారు. బాలాలయంలోకి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేసిన కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అడవిలోని శ్రీఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయ మండపంలో శృంగేరి శిష్యబృందంతో ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. బాలాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్తి కర్రతో చేసిన విగ్రహాలను ఆసీనులు చేశారు. భక్తులు దర్శనాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత.. జీర్ణోద్దరణ, దేవస్థానం తొలగింపు ప్రక్రియ పనులు వేగవంతం కానుండడంతో ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పూజలు నిలిపి వేశారు. ప్రధాన దేవస్థానానికి కిలోమీటరు దూరంలోని శ్రీఆదిముక్తీశ్వరాయం వద్ద బాలాలయంలో భక్తులు దర్శనాలు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆలయాన్ని మూసివేశారు. పూజలో దేవస్థానం అర్చకులు వెల్ది శరత్చంద్ర, రామకృష్ణ, పవన్శర్మ, రాముశర్మ, విజయ్శర్మ, రాజ్కుమార్శర్మ, శ్రావణ్శర్మ, రాధకృష్ణశర్మ పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ధర్మకర్తలు శ్యాం, సత్తయ్య, శ్రీధర్రావు, సీతయ్య, సీతారాం, దుర్గయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు. కాగా, శృంగేరి శిష్యబృందం ఆలయ నిర్వాహకులను సన్మానించి ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద దర్శనాలు కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత -
మానవ భావోద్వేగాలకు ప్రత్యామ్నాయం లేదు
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్ : కృత్రిమ మేధస్సు (ఏఐ)యుగంలోనూ మానవ భావోద్వేగాలకు ప్రత్యామ్నాయం లేదని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ‘న్యూలిటరరీ అండ్ లాంగ్వెజ్ హారిజన్స్ వాయిసెస్ జెనరస్ అండ్ టెక్నాలజీస్’ అనే అంశంపై రెండు రోజులుగా సెనెట్హాల్లో నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 21వ శతాబ్దంలో ఆంగ్ల భాష ప్రపంచీకరణ, డిజిటలీకరణ, కృత్రిమ మేధస్సు యుగానికి ప్రధాన మాధ్యమంగా నిలిచిందన్నారు. అనంతరం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శారదతల్లం మాట్లాడుతూ చాట్జీపీటీ అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఈబుక్స్, ఆడియోబుక్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్తో సాహిత్య అనుభవం రూపాంతరం చెందినా మానవ భావోద్వేగాలు, సృజనాత్మకతకు ఏఐ ప్రత్యామ్నాయం కాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఇంగ్లిష్ విభాగం అధిపతి మేఘనారావు మాట్లాడుతూ ఈజాతీయ సదస్సులో 90 పరిశోధన పత్రాలు సమర్పించారని, 6 సాంకేతిక సెషన్లు, రెండు ప్యానల్ చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు ఎం. నవీన్, దీపాజ్యోతి పాల్గొన్నారు. సాహిత్యం.. ఉన్నత విద్యకు కీలకం కాగా, మొదటి రోజు సదస్సులో కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్యం, భాష, సాంకేతికత సమన్వయం ఉన్నత విద్యకు కీలకమన్నారు. భారతీయ కథన సంప్రదాయంలో పంచతంత్ర కథలు విశిష్ట స్థానం పొందాయని ములుగు సమ్మక్క, సారక్క గిరిజన కేంద్ర యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్ అన్నారు. సాహిత్యం, సాంకేతికత కలయికతో రచయితత్వం పాఠకత్వరూపంలో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని విక్రమ సింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ సీఆర్ విశ్వేశ్వర్రావు అన్నారు. -
నక్ష సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: నక్ష సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి గుమ్ముడూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద మానుకోట మున్సిపాలిటీని ఎంపిక చేశారన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆర్ఓఆర్ పక్కాగా నమోదు చేయాలన్నారు. కేత్రస్థాయిలో పరిశీలన పూర్తి అయిన తర్వాత డ్రాఫ్ట్ తయారు చేసి అర్బన్ ప్రాపర్టీ కార్డ్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.వినోద్ కుమార్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పర్వతారోహకుడు యశ్వంత్కు అభినందనలు
మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్నాయక్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి గుగులోతు రవిని బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ఆయన మెమోంటో అందంచి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలి పర్వతారోహణ యాత్ర విశేషాలు, సాధించిన విజయాలను ఆయనకు వివరించాడు. యశ్వంత్ నాయక్ సాధించిన విజయాన్ని గుగులోత్ రవి అభినందిస్తూ, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తు సాహస క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభంనెహ్రూసెంటర్: మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ముల్కలపల్లి–ఖమ్మం రూట్లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని డిపో మేనేజర్ వి.కల్యాణి బుధవారం తెలిపారు. మహబూబాబాద్–ఖమ్మం రూట్లోని ముల్కలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా ఆర్టీసీ బస్సు సర్వీసులు మహబూబాబాద్–ముల్కలపల్లి–ఖమ్మంకు నడవనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల కోసం హెచ్ఎం ఎదురుచూపుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులు హాజరుకాలేదు. దీంతో హెచ్ఎం బోడ రాంజీ విద్యార్థుల కోసం తరగతి గదిలో నిరీక్షిస్తూ కూర్చున్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు పాఠశాలకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యను అభ్యసించాలని, తల్లి దండ్రులు కూడా పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపేలా సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, పిల్లలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరుకావాలని పాఠశాల హెచ్ఎం పేర్కొన్నారు. డీఏఓను కలిసిన సీఐపీఎంసీ అధికారులుమహబూబాబాద్ రూరల్ : హైదరాబాద్లోని సీఐపీఎంసీ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్రను డీఏఓ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలి శారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమం, మట్టిపరీక్ష, పంటమార్పిడి చేసి రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే అంశాలు, విత్తన శుద్ధి ఉపయోగాలు, పురుగు మందుల పిచికారీ, రైతులు రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే జనుము, జీలుగ సాగుపై చర్చించారు. సీఐపీఎంసీ ఇన్చార్జ్ వెంకటరెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హొన్నప్ప, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయశంకర్, బయ్యారం ఏఓ కె.రాజు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి వేళాయె..
మహబూబాబాద్: వన మహోత్సవానికి సిద్ధం కావాలని కలెక్టర్ స్నేహశబరీష్ పిలుపునిచ్చారు. యాక్షన్ప్లాన్తో ముందుకెళ్లి విజయవంతం చేయాలని ఆదేశించారు. అయితే నర్సరీల్లో మాత్రం మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్లాన్ లేకపోవడంతో సరిపడా మొక్కలు లేవు. నర్సరీల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో మొక్కల సంఖ్య పెంచలేదు. మానుకోట మున్సిపాలిటీలో మూడు నర్సరీలు.. మానుకోట మున్సిపాలిటీ పరిధి కురవి రోడ్డులో ని గ్రీన్ల్యాండ్లో ఒక నర్సరీ, గాంధీపురం శివారులోని రెండెకరాల ప్రభుత్వ భూమిలో ఒక నర్సరీ, రామచంద్రాపురం కాలనీ గ్రీన్ల్యాండ్లో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. అయితే, కురవి రోడ్డులోని నర్సరీలో మాత్రమే మొక్కలు ఉన్నాయి. దానిలో కూడా 6,000 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 10,000 విత్తనాలు నాటారు. అవి ఆగస్టులో మొక్కలు వస్తాయి. మానుకోట, నెల్లికుదురు ఎంపీడీఓ కార్యాలయాల నుంచి పదివేల మొక్కల చొప్పున తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 51 పట్టణ ప్రకృతి వనాలు.. ప్రభుత్వ భూములైన గ్రీన్ ల్యాండ్ల పరిరక్షణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 51 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి సుమారు 2,40,000 మొక్కలు నాటారు. వాటితో పాటు ఏడు పార్క్లు, 9 ఓపె న్ జిమ్లు ఏర్పాటు చేసి వాటి ఆవరణలో కూడా మొక్కలు నాటారు. అయితే నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ప్రధానంగా పట్టణ ప్రకృతి వనాలు మరి దారుణంగా మారాయి. గ్రీన్ బృందం.. నర్సరీలు, పార్కుల్లో మొక్కల సంరక్షణ కోసం గ్రీన్ టీం ఏర్పాటు చేశారు. ఆ టీంలో 21మంది ఉన్నా రు. అందులో ఏడుగురు డ్రైవర్లు ఉండగా.. ఒక్కొక్కరికి నెలకు రూ.12,000 వేతనం గ్రీన్ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు. ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. వాటిని నర్సరీలు, 5కిలోమీటర్ల మేర డివైడర్లలో మొక్కలకు నీళ్లు పోయడానికి ఉపయోగిస్తున్నారు. కలెక్టర్ సమీక్ష సమావేశం.. ఈనెల 15న కలెక్టరేట్ అధికారులతో కలెక్టర్ స్నేహశబరీష్ వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 18నుంచి వన మహోత్సవం ప్రారంభించాలని, యాక్షన్ ప్లాన్తో ముందుకు పోవాలని ఆదేశించారు. అయితే సరిపడా మొక్కలు లేకపోవడం ఆందోళనక కలిగించే అంశం. గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు.. వన మహోత్సవంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో కోతుల సమస్య తీరుతుంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం కోతుల సమస్య. ఫుడ్ కోర్టులో పండ్ల మొక్కలు ప్రధానంగా కోతుల తినే మొక్కలు నాటి, అవి పెరిగిన తర్వాత వాటిలోకి కోతులను వదిలేస్తారు. నేటినుంచి కార్యక్రమం ప్రారంభం యాక్షన్ప్లాన్తో ముందుకెళ్లాలని ఆదేశాలు గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు మానుకోట మున్సిపాలిటీలో అందుబాటులో 6,000 మొక్కలే.. -
ఆదర్శం.. ఆ టీచర్
కేసముద్రం: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన కొట్టం ఆశ్విని ఇదే మండలం గాంధీనగర్జీపీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా(ఎస్జీటీ) పనిచేస్తున్నారు. కాగా, ఉపాధ్యాయురాలు అశ్విని–వెంకటేశ్ దంపతులు తమ కుమారుడు ఇషాంత్(ఫస్ట్క్లాస్), కుమార్తె పూర్వజ(నర్సరీ)లను బుధవారం కల్వల ప్రాథమిక, ప్రీప్రైమరీ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయురాలు -
‘పల్స్పోలియో’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు పల్స్పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పల్స్పోలియో కార్యక్రమం విజయవంతంపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, ఉప కేంద్రాల వద్ద సకాలంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టేలా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్ పంపిణీ, కోల్డ్చైన్ నిర్వహణ, బూత్ల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణపై సమావేశంలో చర్చించారు. 0 నుంచి 5సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, జిల్లాలో సుమారు 55 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో మీడియా అధికారి రాజ్కుమార్, హెచ్ఈ పురుషోత్తం, వి.శ్రీనివాస్, కేఎల్ఎన్ స్వామి, ఎస్.శ్రీనివాస్, పి.లింగారెడ్డి, అనిల్, సత్యనారాయణ, ఫార్మసిస్టు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
వరికి ఎల్నినో..!
సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. వానాకాలం పంటల సాగుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరిలో దీర్ఘకాలిక వంగడాల సాగుకు సమయం అయిపోయింది.. ఈ నెలాఖరులోపు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే స్వల్పకాలిక వరి వంగడాలు విత్తుకోవాలని, లేకుంటే వద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో రైతులు వర్షాలు కురుస్తాయా.. లేక ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలా అనే మీమాంసలో పడ్డారు. ముఖం చాటేసిన వర్షాలు.. మండుటెండ ఉండే రోహిణి కార్తెలో నార్లు పోసుకున్న ఘటనలు ఉన్నాయి. మృగశిర కార్తె కూడా పూ ర్తి కావొస్తుంది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత తగ్గలేదు. గత ఏడా ది ఈ సమయానికి పలుమార్లు వర్షాలు కురిశాయి. ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపి నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పంటల సాగుకు రైతులు వెనుకాడలేదు. కానీ, ఇప్పుడు ఎస్సారెస్పీ జలాలు విడుదల కాలేదు. విడుదల చేసినా మొక్కుబడిగా వదిలారు. కాగా, ఈ నెల 14న జిల్లాలో మొత్తం 102.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే జిల్లా సగటున 6.6 మీ.మీ నమోదైంది. ఈనెల 16న జిల్లాలో 6.4 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 0.4మిల్లీ మీటర్లు.. అంటే ఆకాశం నుంచి భూమిపై పడకముందే వర్షపు నీరు ఆవిరి అయినట్లే. దుక్కులు దున్ని దిక్కులు.. వర్షాకాలం సాగు చేసి చెడాలి.. యాసంగి సాగు చేయకుండా చెడాలి అంటారు పెద్దలు. అందుకోసమే యాసంగి పంటల సాగు పూర్తి కాగానే.. ఉన్న కాస్త పదునుతో భూములను దున్నుకున్నారు. మరికొందరు దున్నిన భూమిలో పత్తి గింజలు కూడా నాటారు. ఇలా జిల్లాలో 20వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలో వేసి వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు మొలకెత్తుతాయని ధీమాతో ఉన్నారు. అయితే మృగశిరకార్తె కూడా పూర్తి కావస్తుండడంతో భూమిలో వేసిన విత్తనాలు వట్టిపోతాయేమో అని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జాడలేని వర్షాలు.. దీర్ఘకాలిక వరి వంగడాలకు అవకాశం లేనట్టే ఈనెల గడిస్తే స్వల్పకాలిక వంగడాలు కూడా వద్దంటున్న శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ అధికారులు ఆరుతడి, పునాస పంటలే దిక్కంటున్న రైతులుపంటలమార్పు కోసం చూపు.. ప్రస్తుత పరిస్థితులు, యూరియా కొరత, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమస్యల నేపథ్యంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు అని శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు అటువైపుగా చూస్తున్నారు. ఇప్పటికే 150రోజుల పంట కాలం ఉండే సిద్ది, బీపీటీ రకాలు వేసినా ప్రయోజనం ఉండదు. 130 రోజుల పంటకాలం ఉన్న 16–38, కునారం వంటి వంగడాల సాగుకు మరికొద్దిరోజులే సమయం ఉంది. 120 రోజుల కాలవ్యవధిలో చేతికొచ్చే పంట రకాలు ఆర్ఎన్ఆర్, తెలంగాణ, వరంగల్ 962 రకాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది కూడా వేయలేకపోతే.. తక్కువ నీటి తడులతో పండే ఆరుతడి పంటలు జొన్న, శనగ, పెసర, బొబ్బెర, కూరగాయల సాగు చేయాలని బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ఆలోచిస్తున్నారు. కాగా, వర్షాధార పంటలు సాగుచేసే కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు, కేసముద్రం ప్రాంతాల రైతులు వలసలు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. -
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు హనుమకొండములుగుమహబూబాబాద్జనగామవరంగల్భూపాలపల్లిభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) -
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
పోటాపోటీ!
మహబూబాబాద్బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 20267ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు డిమాండ్సాక్షి, మహబూబాబాద్: చిన్నదైనా.. పెద్దదైనా.. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటారు. మహిళలకు అయితే స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తల వంటి ఉద్యోగాలు అయితే బాగుంటాయని ఇష్టపడుతారు. ఈ కోవకు చెందిన ఉద్యోగాలే ప్రీ ప్రైమరీ పాఠశాల ఇన్స్ట్రక్టర్, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 76 ప్రీప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయాలకు పోటాపోటీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉద్యోగం చిన్నదైతేనేం.. అని ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాన్వెంట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిపితే పేద పిల్లలను ప్రైవేట్ స్కూల్కు పంపించరు. దీంతో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పైగా ఈ విద్యార్థులకు కాన్వెంట్ స్కూల్స్కు తీసిపోకుండా బోధన జరపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 76 పాఠశాలలకు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో బోధించేందుకు ఇన్స్ట్రక్టర్లు, వారికి సహాయకుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఊహించని విధంగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 దరఖాస్తులు వచ్చాయి. ఉన్నత విద్యావంతులు పోటీ.. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి ఇంటర్, ఆయా ఉద్యోగానికి ఏడో తరగతి ఉత్తీర్ణులయితే చాలు. కానీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి వచ్చిన దరకాస్తుల్లో ఇంటర్ పూర్తి చేసిన వారు 511, డిగ్రీ పూర్తి చేసిన వారు 433, పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు 128, బీటెక్, పాలిటెక్నిక్ చదివిన వారు 14 మంది, స్థానికేతరులు 133 మంది ఉండడం గమనార్హం. 478 433 128 14ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్/పాలిటెక్నిక్ మొత్తం పోస్టులు = 76మండలాల వారీగా వచ్చిన మొత్తం దరఖాస్తులు, విద్యార్హతలు ఇలా.. జిల్లాలో 76 బోధకుల పోస్టులకు 1,188, ఆయాలకు 428 దరఖాస్తులు ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువ.. -
టీజీ టెట్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి: టీజీ టెట్–జూన్ 2026 (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్) హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ సెంటర్లలో మంగళవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షలో 1,455 మంది అభ్యర్థులకుగాను 1,189 మంది (81.71శాతం) అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ ఎల్విగిరిరాజ్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్లో 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించగా.. 1,612 మంది అభ్యర్థులకుగాను 1,277 మంది (79.21 శాతం) హాజరయ్యారు. మొత్తం 14,227 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్విగిరిరాజ్ గౌడ్ తెలిపారు.


