Mahabubabad District Latest News
-
జిల్లా అభివృద్ధికి కృషి
● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో నూతనంగా రాజ్యసభకు ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని, స్థానికంగా రైల్వే పీఓహెచ్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. రానున్న రెండున్నర ఏళ్లలో మిగిలిన హామీలను కూడా అమలుచేసే విధంగా చూస్తున్నామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు జ్యోతి, సునీత, ప్రగతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సంపేటలో డ్రైవర్ శంకర్ విగ్రహం ఏర్పాటు
హన్మకొండ : ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ విగ్రహాన్ని నర్సంపేట బస్డిపోలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కిరణ్ తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్వైకె పాషా, కార్యదర్శి జితేందర్ రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డిని.. చొల్లేటి కిరణ్ కలిసి శంకర్ విగ్రహం ఏర్పాటుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్గా సహకరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు గడ్డం రవీందర్, ఎండీ గౌస్, మూడ్ రమేశ్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విమానయాన రంగంలో విస్తృత అవకాశాలు కేయూ క్యాంపస్ : విమానయానరంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని గణిత విభాగం సెమినార్హాల్లో పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అనంతరం వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, కాంపీటివ్ కోచింగ్ సెల్ డైరెక్టర్ టి. నాగయ్య మాట్లాడారు. -
టీజీ ఆర్పీడీసీఎల్కు ఆప్షన్ల వెల్లువ..
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు వెళ్లేందుకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఈ మేరకు ఆప్షన్లు ఎంచుకున్నారు. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుందో.. వెళ్లాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఊహించని విధంగా ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఈ నెల 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2వేల మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షనల్ కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు.. వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. ఈ జాబితాను పరిశీలించి ఆప్షన ఇచ్చిన వారి నుంచి సీనియార్టీ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ నెల 13(నేడు)న ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరు ఈ నెల 15న ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో రిలీవ్ అయి, 18న ఆర్పీడీసీఎల్లో రిపోర్టు చేయాలి. వీరికి 19న పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీ లోపు పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. దీంతో మూడో డిస్కం పూర్తి స్వరూపం ఈ నెల 25న రానుంది. 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్ మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్లు 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్లు 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 66, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 10, అకౌంట్స్ ఆఫీసర్లు 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు 15, పర్సనల్ ఆఫీసర్లు 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు 6, ఒకరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఆర్పీడీసీఎల్కు వెళ్తున్న ఉద్యోగులకు ఒక్క సారి మాత్రమే సత్వర పదోన్నతికి మినహాయింపు ఇస్తారు. బదిలీ ద్వారా పదోన్నతి పొందిన ఉద్యోగులు ఐదేళ్ల పాటు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం లేదు. అదే విధంగా కంపెనీ బయటకు డిప్యుటేషన్పై వెళ్లడానికి అర్హులు కారు. ఇప్పటికే ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. కంపెనీకి కావాల్సిన ఉద్యోగులు 2 వేలు ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు.. పరిశీలన పూర్తి నేడు జారీ కానున్న బదిలీ నియామక ఉత్తర్వులు ఆర్పీడీసీఎల్కు బదిలీ అయిన వారు 15న రిలీవ్ ఈ నెల 25 లోపు ఉద్యోగంలో చేరాలి -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్వార్కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణ దేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగా రం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివి ధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకుని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్లో మావో యిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటుకేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
రోడ్డెక్కిన మక్క రైతులు
గూడూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న మక్క రైతులుగూడూరు: కాంటాలు పూర్తయినా మక్కలను తరలించడం లేదని, 20రోజులైనా కాంటాలు పెట్టడంలేదని నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. దీంతో గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరగంటకు పైగా ఆందోళన కొనసాగడంతో విషయం తెలుసుకున్న సీఐ వినయ్కుమార్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. రైతులు రవిసింగ్ రాథోడ్, బోడ చంద్రుతో పాటు పలువురు రైతులు 20రోజుల క్రితం కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలు కాంటా అయినా, లారీలు రావడం లేదని చెప్పారు. దీంతో వెంటనే సీఐ మార్క్ఫెడ్, పీఏసీఎస్ నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడి, వెంటవెంటనే లారీలు వచ్చేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో.. వారు ఈ రోజు లారీలు వస్తున్నాయని తెలి పారు. దీంతో సీఐ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆ తర్వాత పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లిన సీఐ కాంట్రాక్టర్తో మాట్లాడి లారీలు వచ్చేలా చేశారు. -
పైపులైన్ మరమ్మతు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్ఇన్’ కార్యక్రమం ఫలితాలిస్తోంది. ఈమేరకు ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ ఆదేశాల మేరకు మంగళవారం బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో రోడ్డు కింది పగిలిన పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని కాంగ్రెస్ నాయకులు హరినాథ్, మాదా శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ఔట్ పేషెంట్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం నిర్వహణ చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే సీజ్ చేస్తామన్నారు. బోర్డులపై చికిత్సల ధరలు ప్రదర్శించాలన్నారు. ఇరుకు గదుల్లో ఆస్పత్రులు నిర్వహించవద్దన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత కలిగిన రేడియాలజిస్టు, గైనకాలజిస్ట్ మాత్రమే గర్భిణులకు స్కానింగ్ చేయాలన్నారు. తనిఖీలో ప్రోగ్రాం ఆఫీసర్ విరాజిత, వైద్యాధికారి జ్వలిత, హెచ్ఈఓ లోక్యా, మనోహర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ సహకారంతో యూపీఎస్, సీఎస్ఏటీ–2027 ప్రవేశ పరీక్ష శిక్షణకు అర్హులైన మైనార్టీ(క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివా స్రావు మంగళవారం తెలిపారు. మహిళా అభ్యర్థ్ధులకు 33.33 శాతం సీట్లు, రిజర్వ్ కేటగిరీలో దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5లక్షలకు మించొద్దన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆన్లైన్ హెచ్టీటీపీఎస్.సీఈటీ.సీజీజీ.గౌట్.ఇన్.టీమ్రీస్ వెబ్సైట్లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేయాలన్నారు. జూన్ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 91825 40680 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు.. తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బి. ఓంకార్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్.ఐటీఐ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్లో నెల 14నుంచి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలన్నారు. లక్ష్యాలు ఎంచుకుని చదవాలి కేసముద్రం: విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకుని చదవాలని, అప్పుడే భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని కేసముద్రం మున్సి పల్ చైర్పర్సన్ బానోత్ సునీతవెంకన్న, వైస్ చైర్పర్సన్ అల్లం రమనాగేశ్వర్రావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అంత్య పుష్కరాల్లో నిరంతర విద్యుత్
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీనది అంత్య పుష్కరాల్లో నిరంతర విద్యుత్ అందించనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్, బస్టాండ్ ప్రాంతం, పార్కింగ్ ఏరియాలో చేపడుతున్న విద్యుత్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత పనుల్లో ఇప్పటికే అధిక భాగం పూర్తయ్యాయని, మిగతా పనులన్నీ ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. సీఎండీ వెంట సీఈ రాజు చౌహాన్, ములుగు ఎస్ఈ బేతి భిక్షపతి, కాటారం డీఈ (ఆపరేషన్) నాగరాజు, డీఈ (టెక్నికల్) జగదీశ్, డీఈ సదానందం, లైన్ ఇన్స్పెక్టర్లు సదానందం, కిరణ్ కాంత్, సిబ్బంది పాల్గొన్నారు. 15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
శ్రీనగర్లో రోడ్డు ప్రమాదం
● సీతానగరం వాసి మృతి ● మృతుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గూడూరు: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బొమ్మగాని శ్రీనివాస్గౌడ్ మృతి చెందాడు. ఇరవై ఏళ్లుగా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఇటీవల హెడ్కానిస్టేబుల్ (అవాల్ధార్)గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో శ్రీనగర్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్గౌడ్ను సోమవారం రాత్రి బైక్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు తమకు తెలిపాయని మృతుడి కుటుంబీకులు మంగళవారం తెలిపారు. శ్రీనివాస్గౌడ్కు భార్య సౌజన్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్గౌడ్ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, శ్రీనివాస్గౌడ్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు సమాచారం. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం కన్నాయిగూడెం: మావోయిస్టు ఉద్యమంలో ప్రాణా లర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్ దా మోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని బుట్టాయిగూడేకి విచ్చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంతకాలం అడవిలో ఉండి ప్రజల కోసం పనిచేసిన తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తనకు పరిచయం ఉన్న కుటుంబా లు, అమరుల కుటుంబాలను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. -
వైభవంగా హనుమాన్ జయంత్యుత్సవ ర్యాలీ
మహబూబాబాద్ రూరల్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భక్తులు మంగళవారం భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మొదటగా స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అంజన్నకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన వాహనంతో కూడిన వేదికపై శ్రీ అభయాంజనేయ స్వామిని కొలువుదీర్చి తమలపాకులు, గజమాలతో అలంకరించి పూజించారు. అక్కడి నుంచి శ్రీ హనుమాన్ వానర యువసేన ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ర్యాలీ చేపట్టి ప్రధాన పురవీధుల మీదుగా జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరవశించిపోయారు. చివరగా హనుమంతుని గడ్డలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ర్యాలీ ముగించారు. -
మక్కలను గోదాములకు తరలించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : మానుకోట వ్యవసాయ మార్కెట్లోని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేలాది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. దీంతో రైతుల పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ‘లారీలు రావు.. బస్తాలు పోవు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, జిల్లా అధికారులు మంగళవారం స్పందించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహస్వామి మానుకోట మార్కెట్ యార్డును సందర్శించారు. మక్కల బస్తాలు నిల్వ ఉన్న షెడ్లను పరిశీలించి, ఏఎంసీ పరిధిలో ఉన్న నాబార్డు గోదాము, ఇతర గోదాములను సందర్శించి పరిశీలించారు. మక్కలను త్వరగా కొనుగోలు చేసి ప్రభుత్వ గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ సుజన్ బాబు, డైరెక్టర్లు దేశెట్టి మల్లయ్య, జంగాల నరసింహారావు, వేమిశెట్టి యాకాంబ్రం, పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సహజీవనంలో విషాదం..
● పెట్రోలు పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం ● పరిస్థితి విషమం.. జిల్లా ఆస్పత్రికి తరలింపు జనగామ: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. సీఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పసుల అఖిల్ కుటుంబం కొన్నేళ్లుగా జనగామలో నివాసముంటోంది. ఈ క్రమంలో జనగామ మండలం పెద్దపహాడ్ శివారు ఓ తండా(తల్లిగారు), నర్మెట మండలానికి(అత్తగారు)కు చెందిన ఓ వివాహితతో అఖిల్ ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి జీవనం సాగిస్తున్న క్రమంలో అఖిల్ పరిచయమయ్యాడు. రెండు నెలల క్రితం సదరు మహిళ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ సమీపంలో కూల్డ్రింక్ షాప్ ప్రారంభించింది. ఈ క్రమంలో అఖిల్ ఆమైపె అనుమానం పెంచుకుని తరచూ గొడవలు పడేవారు. దీనిపై బాధిత మహిళ ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఖిల్, అతని తల్లికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నాలుగు రోజులకోసారి ఇద్దరు గొడవలు పడడం, మళ్లీ కలిసి ఉండడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో అఖిల్కు అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాటిల్లో పెట్రోలు తీసుకుని కూల్డ్రిండ్ షాప్నకు చేరుకున్నాడు. అక్కడికి రాగానే మహిళతో వాగ్వాదం జరగగా ఆగ్రహంతో తన శరీరంపై పెట్రోలు పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో పడిపోయిన అఖిల్ను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
‘ఓరియంటేషన్’ విజయవంతం చేయాలి
బయ్యారం: విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించే సర్పంచ్ల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పాఠశాలల హెచ్ఎంలు విజయవంతం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. మంగళవారం బయ్యారంలోని జెడ్పీబాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు, నాణ్యమైన విద్యపై గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పాత్రను బలపర్చడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. పాఠశాలల అవసరాలు, మౌలిక వసతులు, హాజరు నమోదు పెంపునకు సర్పంచ్లు కృషి చేయాలన్నారు. విద్యలో నాణ్యత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఏసీజీ శ్రీరాములు, ఎఫ్ఏఓ శంకర్, ఎంఈఓ లక్ష్మణ్రావు, హెచ్ఎం ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
కళతప్పిన గ్రంథాలయాలు
మహబూబాబాద్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టును రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు భర్తీ చేశా రు. అయితే ఆయనకు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా గ్రంథాలయంలో మినహా మిగిలిన 13 గ్రంథాలయాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. స్వీపర్లే వాటి నిర్వహణ చేపడుతున్నారు. ఇన్నాళ్లు చైర్మన్ లేకపోవడంతో మున్సిపాలిటీలు, జీపీల నుంచి వచ్చే కోట్ల రూపాయల పన్ను చెల్లించడంలో అఽధికారులు నిర్లక్ష్యం చేశారు. కాగా, ఆ పన్ను గ్రంథాలయాలకు చెల్లిస్తే అభివృద్ధికి అడుగులు పడుతాయి. రెండు మినహా అన్ని ఖాళీలే.. జిల్లా గ్రంథాలయానికి కార్యదర్శి లేకపోవడంతో వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి ఇన్చార్జ్ ఇచ్చారు. డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, జూని యర్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్, తోటమాలి ఉండాలి. కానీ ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరు లైబ్రేరియన్లు ఉండగా.. వారు వారానికి రెండు మూడు రోజులే వస్తున్నారు. సిబ్బంది లేక సమస్యలు వస్తున్నాయి. 13 శాఖ, గ్రామ గ్రంథాలయాలు.. జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు, కొత్తగూడ, ఇనుగుర్తి, డోర్నకల్, గార్లలో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. కురవి మండల కేంద్రం, అదే మండలంలోని రాజోలులో గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు, పక్కా భవనాలు లేకపోవడంతో పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్వీపర్లే దిక్కు.. గ్రంథాలయాల్లో లైబ్రేరియన్, అటెండర్ ఉండాలి. కానీ 13 గ్రంథాలయాల్లో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో స్వీపర్లే దిక్కు అయ్యారు. దీంతో నిర్వహణ సరిగా లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. పన్ను పెండింగ్లోనే.. గ్రంథాలయాల అభివృద్ధికి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఆస్తి పన్నులో 8 శాతం చెల్లించాలి. ప్రజలు పన్ను చెల్లిస్తున్నారు. ఈ మేరకు 8శాతం పన్ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో జమ చేయాలి. అయితే సుమారు రూ.2.5కోట్ల సెస్ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో గ్రంథాయాల అభివృద్ధి కుంటుపడింది. చైర్మన్ లేక పోవడం, ఇన్చార్జ్ కార్యదర్శి వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు చైర్మన్ నియామకం.. 2023 డిసెంబర్ 5న అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు రాజీనామా చేశారు. కాగా రెండున్నర సంవత్సరాలుగా ఆ పోస్టును కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఎట్టకేలకు ఈనెల 5న రాత్రి ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవ సేన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వెన్నం శ్రీకాంత్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితియే. సమస్యల స్వాగతం.. 14 గ్రంథాలయాల్లో రెండు పోస్టులు మినహా మిగిలిన అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోస్టులు భర్తీ చేస్తేనే గ్రంథాలయాలు గాడిన పడుతాయి. పెండింగ్ పన్ను బకాయిలు వసూళ్లు చేయాల్సి ఉంది. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలు, సొంతభవనాలు లేని గ్రంథాలయాలకు పక్కా భవనాల కోసం నిధులు మంజూరు చేయించాలి. 13 లైబ్రరీలకు స్వీపర్లే దిక్కు పోస్టులన్నీ ఖాళీలు, సౌకర్యాలు నిల్ కోట్ల రూపాయల సెస్ బకాయిలు నేడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం నేడు ప్రమాణ స్వీకారం.. ఈనెల 13న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వెన్నం శ్రీకాంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మానుకోట జిల్లా గ్రంథా లయం ఎదుట సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కా ర్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజ రుకానున్నట్లు చైర్మన్ తెలిపారు. -
నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం..
యోగాసనాలు వేస్తున్న విద్యార్థినులుడ్యాన్స్ నేర్చుకుంటున్న విద్యార్థినులునాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. టీవీలో పాటలు చూస్తూ నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ప్రస్తుతం నృత్యంలో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలతో పాటు శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేసవి సెలవుల్లోనూ సిమ్మింగ్తోపాటు డ్యాన్స్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నా. –కాజీపేటబి.రియాన్షా , 4వ తరగతి, కాజీపేట మహబూబాబాద్ అర్బన్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఆటాపాటలతో సందడి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన శిక్షణ(సమ్మర్ క్యాంపు) తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన క్రీడ, ఆటాపాటలు నేర్చుకుంటూ సరదాగా గడిపారు. పిల్లల్లో మానసికోల్లాసం, ఆటాపాటల్లో నైపుణ్యం పెంచడానికి గత నెల 25వ తేదీ నుంచి మొదలైన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు హుషారుగా వచ్చి తర్ఫీదు పొందారు. డ్యాన్స్, కుట్లు, అల్లికలు, స్పోకెన్ ఇంగ్లిష్, వాలీబాల్, యోగా.. ఇలా 10 రకాల క్రీడాంశాలపై ఇచ్చిన శిక్షణలో సుమారు 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు సమ్మర్ క్యాంపులు ఇలా. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల, కొత్తగూడ సోర్ట్స్ స్కూల్లో వేసవి శిబిరాలు నిర్వహించారు. చిన్నబోయినపల్లి, మహబూబాబాద్లో క్యాంపునకు 100 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ బేసిక్స్, ఆర్ట్, క్రాఫ్ట్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మోహిందీ మేకింగ్, డిజైనింగ్ ఆన్ హ్యాండ్స్, అక్షరాస్యత, వ్యాసచరన, వ క్తృత్వం, కథ, రచన, కథలు చెప్పడం, పద్యాలు పాడడం, తెలుగు, ఇంగ్లిష్ స్పెల్–బీ, నృత్యం, పాటలు, సాంస్కృతి కార్యకలాపాలు, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు. మోడల్ క్రీడా పాఠశాలలో.. కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 60 మంది బాలికలు, 60 మంది బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, జావెలిన్త్రో, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణ నిర్వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు పలు అంశాల్లో మెళకువలు నేర్పించారు.ఆడుతూ.. పాడుతూవేసవి సెలవుల్లో మండలంలోని పలు ప్రాంతాల్లోని చిన్నారులు బొమ్మల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. విజ్ఞానంతోపాటు మానసికోల్లాసానికి సంబంధించిన ఆటలు ఆడుతున్నారు. టెడ్డీ బియర్లు, గురుగులతో ఆడుతూ రోజంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. – ఏటూరునాగారం బొమ్మలతో ఆడుకుంటున్న చిన్నారులు చెట్టు నీడలో ఆటాపాట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కరాటే అకాడమీ నిర్వాహకులు అబ్బు, హుస్సేన్ బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా కరాటే నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని మాస్టర్లు తెలిపారు. ఈ శిక్షణ నెల రోజుల పాటు కొనసాగుతుందని, కరాటేతో బాలికల్లో ఆత్మరక్షణ కలుగుతుందన్నారు. – ఏటూరునాగారంఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు చోట్ల సమ్మర్ క్యాంపులు నిర్వహించాం. ఈ శిబిరాలతో విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. పిల్లలు క్రమ శిక్షణ తో అన్ని అంశాలు నేర్చుకున్నారు. –దేశీరాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు, మానుకోట జిల్లా వేసవి సెలవుల్లో ఆడుతూ పాడు తూ గడపడం సంతోషంగా ఉంది. తెలుగులో లఘులు, గురులు, ఇంగ్లిష్లో గ్రామర్, యోగాలో సూర్య నమస్కారాలు, ఆసనాలు నేర్చుకున్నాం. ఈ శిబిరం నాకు నచ్చింది. – యామిని, బాలికల ఆశ్రమ పాఠశాల ఊరట్టం, మేడారం నేను ఇంగ్లిష్ మాట్లాడానికి ఈ స్పోకెన్ తరగతులు చాలా ఉపయోగపడుతున్నాయి. సహ విద్యార్థుల మధ్య స్పీకింగ్ భయం పోగొట్టడం, ఇంగ్లిష్పై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ సులువుగా ఉంది. – అక్షయ, బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాజెక్ట్ నగర్, ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ హుస్సేన్వేసవి సెలవుల్లో ఇరుగుపొరుగు విద్యార్థులు ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు ఇంట్లో ఉండకుండా చల్లదనం కోసం చెట్ల కిందికి చేరుతున్నారు. అక్కడ తమకు తోచిన ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. – వాజేడు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు శిబిరాలు -
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేయొద్దు
● వీసీలో సీఎం రేవంత్రెడ్డి మహబూబాబాద్: ధాన్యం, మక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, లక్ష్మణ్కుమార్, కృష్ణారావు, శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి రామకృష్ణారావుతో కలసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ధాన్యం, మక్కల కొనుగోలులో వేగం పెంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలన్నారు. అవసమైన లారీలు అందుబాటులో ఉంచాలన్నారు. వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాత్కాలిక నిల్వ కేంద్రాలను వినియోగించాలన్నారు. మొక్కజొన్న పంట అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జాప్యం లేకుండా చూడాలి : కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గన్నీ బ్యాగులు ఇతర అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ఉన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం.. బారులుదీరిన ట్రాక్టర్లు
బయ్యారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో మంగళవారం ఇల్లెందు, కొత్తగూడెం ప్రధాన రహదారిపై కిలోమీటరు మేర ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు దీరాయి. కొనుగోలు ఆలస్యం వల్ల మూడు రోజుల నుంచి రైతులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన మక్కల బస్తాలను బయ్యారంలోని ఏఎంసీ గోడౌన్లో దిగుమతి చేస్తుండడంతో అధికసంఖ్యలో మక్కల ట్రాక్టర్లు రహదారిపై బారులుదీరాయి. గార్లలో నిలిచిన సింగరేణి ఎక్స్ప్రెస్గార్ల: విద్యుత్ సాంకేతిక లోపంతో సిర్పూర్– కాగజ్నగర్ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ఎక్స్ప్రెస్ మంగళవారం గార్ల రైల్వేస్టేషన్ రెండు గంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓహెచ్ఈ పవర్ సప్లై గార్ల నుంచి మహబూబాబాద్ వరకు నిలిచిపోవడంతో పలు స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా, ప్ర యాణికులకు గార్లలోని ఆర్యవైశ్య సంఘం సభ్యు లు వాటర్, అరటిపండ్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు వచ్చి సమస్యను పరిష్కరించడంతో ట్రైన్ ముందుకు సాగింది. అలాగే మానుకోట రైల్వే స్టేషన్లో ఖమ్మం వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ గంటపాటు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
ముగిసిన టీజీఎడ్సెట్– 2026
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన టీజీఎడ్సెట్ –2026 ప్రశాతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంలో ఏడు, వరంగల్జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 2,304మంది హాజరుకావాల్సి ఉండగా 1,886 మంది (81.86శాతం) హాజరయ్యారు. 418మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగగా 2,304 మందికి 1,926 మంది అభ్యర్థులు (83.59శాతం) హాజరయ్యారు. 378 మంది గైర్హాజరయ్యారని టీజీఎడ్సెట్ కన్వీన ర్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. కాగా, హనుమకొండలో పలు కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ కె. ప్రతాప్రెడ్డి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతకుముందు టీజీఎడ్సెట్ ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి.. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డితోకలిసి ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, సెక్రటరీ పొఫెసర్ శ్రీరామ్వెంకటేష్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, టీజీఎడ్సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల డీన్లు రాంనాథ్ కిషన్, బి. సురేశ్లాల్, కె. రాజేందర్,జి. హనుమంతు, విద్యాకళా శాల ప్రిన్సిపాల్ నల్లానిశ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి సెషన్కు 81.86 శాతం, రెండో సెషన్ 83.59 శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వీసీ -
‘నీట్’ రద్దుపై ఆందోళన
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నేషనల్ ఎలిజి బులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– 2026 రద్దు చేశారు. రాజస్థాన్లో పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంత కష్టపడి చదివి రాశామని, ఇప్పుడు రద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,059మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. స్టేషన్ఘన్పూర్: రాజస్థాన్లో పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్ పరీక్ష కోసం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్ లీక్ అయిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. – వంగపండ్ల గౌతమి, జనగామ జిల్లా కాశిబుగ్గ: ఎంతో కష్టపడి నీట్–2026 ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియట్లో అధిక మార్కులు సంపాదించి, నీట్ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివా. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ చేయడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో లాగా రాస్తామో, లేదోనని ఆందోళనతో ఉండాల్సి వస్తుంది. – జోగు రక్షిత, వరంగల్విద్యారణ్యపురి: నేను ఇంటర్ బైపీసీలో 1000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్కు ప్రిపేరై పరీక్ష బాగా రాశా. సీటు వస్తుందనే భావనతో ఉన్నా. అయితే పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేశారని తెలిసి బాధగా ఉంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సింటుంది. మరోసారి నిర్వహించబోయే నీట్ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో. ఇప్పటికై నా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి. – ఎం. రిషిత, పున్నేలు, హనుమకొండ జిల్లా -
దేవుడంటే రేవంత్రెడ్డికి లెక్కలేదు
ఖానాపురం: దేవుడు, బడులంటే సీఎం రేవంత్రెడ్డికి లెక్కలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. వ రంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో కూల్చివేసిన శివాలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఆలయం వద్ద 24 ఫీట్ల లోతు తవ్వి పూడ్చివేయడంలో కారణం ఏంటన్నారు. ఆర్కియాలజీ అధికారులు ఈనెల 7న ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయించడం లేదని ప్రశ్నించారు. గుప్తనిధుల కోస మే సీఎం రేంవత్రెడ్డి తవ్వకాలు జరిపించారని ఆరో పించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అశోక్నగర్కు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్రెడ్డి కూల్చివేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాటతప్పిన వారిలో దేశంలో తొలిముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు మాట్లాడుతూ రేవంత్రెడ్డి అనేక పా పాలు చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ కూల్చివేతపై కలెక్టర్ ఎందుకు నోరు విప్పడం లేదని, కూల్చివేతపై కాంగ్రెస్ పెద్దల్లో భయం పుట్టుకుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, శంకర్నాయక్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, సర్పంచ్ రమేశ్, నాయకులు వి ద్యాసాగర్రెడ్డి, కిషన్రావు, రాజశేఖర్, శ్రీనివాస్, వెంకటనారాయణ, కోటేశ్వర్రావు, వెంకటనర్స య్య, సంపత్, రాజు, దేవేందర్రావు పాల్గొన్నారు. శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ము లుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ ● ప్రజావాణిలో 13 వినతులు స్వీకరణతొర్రూరు: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 13 దరఖాస్తులు అందాయి. దానిలో 10 భూ సంబంధిత, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్, సర్వే శాఖకు సంబంధించినవి ఒక్కో దరఖాస్తు వచ్చాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు ఆర్డీఓకు అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి, ఏఎల్ఓ రవి, సీడీపీఓ కమలాదేవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కె.అనిల్కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇలా.. ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి: పెద్దవంగర వాసులు డివిజన్ పరిధి పెద్దవంగరలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన కొంత భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని, ఆ స్థలంలో ప్రహరీ సైతం నిర్మించాడని గ్రామస్తులు తెలిపారు. భూమిని ఆక్రమించడమే కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల వెనకాల ఉన్న మొక్కలు, నీటి సరఫరా పైపులను ధ్వంసం చేశాడని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన గ్రామ దళితులకు ఆక్రమణదారు కోర్టు నుంచి నోటీసులు పంపించాడన్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. నకిలీ భూ పత్రాలు సృష్టించారు : బాధితుడు ధర్మా నాయక్ తొర్రూరు మండలం కంఠాయపాలెం శివారు సీత్యాతండాకు చెందిన బానోతు ధర్మానాయక్కు తండాలో వారసత్వంగా సంక్రమించిన 2 ఎకరాల భూమి ఉంది. సదరు భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. సదరు భూమిపై కన్నేసిన తండాకు చెందిన ఓ వ్యక్తి నకిలీ భూ పత్రాలు సృష్టించి దాన్ని కాజేసేందుకు రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్నాడు. భూమి సాగు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న సదరు వ్యక్తికి పట్టా చేయకుండా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఆర్డీఓను కోరారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● ప్రజావాణిలో కలెక్టర్ స్నేహశబరీష్ ● దివ్యాంగుల ఇబ్బందులుమహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా వినతులను స్వీకరించి మట్లాడారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేశ్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో 133 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల గోస.. దివ్యాంగులు పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ వారం ఆటో మాట్లాడుకొని ప్రజావాణికి వస్తున్నారు. ఆటో చార్జీలు వృథా అవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
బదిలీల సందడి
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీల సందడి నెలకొంది. దీంతో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 8వ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత స్క్రూట్నీ పూర్తి చేసి ఈనెల చివర వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 40శాతం మందికే అవకాశం.. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీకి అర్హత ఉన్నా.. వారిలో 40శాతం మందికి మాత్రమే స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందుల గ్రేడ్–1 కార్యదర్శులు 14మంది, గ్రేడ్–2 క్యాదర్శులు 27మంది, గ్రేడ్–3 కార్యదర్శులు 28 మంది ఉన్నారు. వీరి బదిలీ ప్రక్రియ జోనల్ స్థాయిలో ఉంటుంది. కాగా, కమిషనర్ పరిధిలో బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఇక మిగిలిన గ్రేడ్–4 కార్యదర్శులు 330 మంది ఉన్నారు.73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భార్యాభర్తల ఒకేచోట పనిచేసే అవకాశం, మెడికల్ గ్రౌండ్ కలిపి మొత్తం 40శాతం అంటే 132 మందికే బదిలీ అయ్యే అవకాశం ఉంది. సర్వీస్ జాబితా సిద్ధం.. పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు అనుగుణంగా జిల్లాలో బదిలీలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిధిలో గ్రేడ్–4 కార్యదర్శుల బదిలీ మాత్రమే జరుగుతుంది. జిల్లాలో మొత్తం 330 మంది గ్రేడ్–4 కార్యదర్శులు ఉండగా.. ఇందులో 132 మందికే అవకాశం ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం ఒకే గ్రామంలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. అదేవిధంగా రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు 185 మంది ఉన్నారు. వీరికి తోడు స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరిలో 40శాతం మాత్రమే బదిలీ చేస్తారు. ఇలా 132 మంది మాత్రమే బదిలీ అవుతారు. అంటే ఇంకా అర్హత ఉన్నవారిలో కూడా 53 మందికి అవకాశం రాదు. ఏజెన్సీ కార్యదర్శుల్లో బిక్కు బిక్కు.. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లాలోని కార్యదర్శులను తాము పనిచేస్తున్న నియోజకవర్గం నుంచి డిప్యుటేషన్పై ఇతర నియోజకవర్గాలకు పంపించారు. కాగా చిన్న పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలు, వయస్సు మీద పడిన వారు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఉన్నారు. మరికొందరు డిప్యుటేషన్పై ఆయా ప్రాంతాలకు వెళ్లలేమని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ సాధారణ బదిలీల సందర్భంగా మీకు స్థానచలనం కల్గుతుందని చెప్పారు. ముందు మీరు విధుల్లో చేరండి.. తర్వాత మీ పరిస్థితి ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు సాధారణ బదిలీలు అవుతున్నా.. సీనియార్టీ జాబితాలో మైదాన ప్రాంతం ఖాళీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే.. ఏజెన్సీల్లోకి డిప్యుటేషన్పై వెళ్లిన కార్యదర్శుల్లో అత్యధిక జీపీలకు కొత్తవారు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికమే అనుకొని డిప్యుటేషన్పై వెళ్లిన వారు అక్కడే పనిచేయాల్సి వస్తుందని కార్యదర్శుల్లో చర్చ జరుగుతోంది. నాలుగేళ్ల సర్వీసు నిండిన వారిలో 40శాతం పంచాయతీ కార్యదర్శులకే స్థానచలనం అవకాశం ఈనెల చివరి వరకు ప్రక్రియ ఇప్పటికే డిప్యుటేషన్పై వెళ్లిన పీఎస్లకు అక్కడే విధులు -
పేకాట రాయుళ్ల అరెస్ట్
● రూ.1,32,090 నగదు స్వాధీనం హసన్పర్తి: భీమారంలోని ఓ పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ బృందం సోమవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో రూ.1,32,090 నగ దు స్వాధీనం చేసుకోవడంతోపాటు 9 ఫోన్లు సీజ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేసింది. భీమారంలోని గణేశ్ నగర్లో కొంతకాలంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్కు సమాచారం అందించింది. దీంతో టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఇందులో పేకాట ఆడుతున్న దేశిని వీరస్వామి, లవన్కుమార్, శరత్కుమార్, దామెర నాగరాజు, సూరం మల్లికార్జున్, సుధాకర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఇన్స్పెక్టర్ బాబులాల్, ఎస్సై సుధాకర్, సిబ్బంది గౌస్ పాషా, శ్యాంకుమార్, కేయూ ఎస్సై కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.ట్రాక్టర్ను ఢీకొన్న బైక్ ● యువకుడి దుర్మరణం నెల్లికుదురు: మక్కజొన్న లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు శివారులో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. బిహార్లోని రాయిగుడాకు చెందిన సంతోష్ కుమార్ కొంతకాలంగా నెల్లికుదురు మండలం నైనాలలో నివాసముంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నెల్లికుదురు శివారులోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి మక్కజొన్న లోడ్తో మహబూబాబాద్ వైపునకు అజాగ్రత్తగా ఎలాంటి ఇండికేషన్ వేయకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ టౌన్ సాయిబాబ గుడి బజార్కు చెందిన ముద్రగణం విశాల్ కుమార్ (38) బైక్పై తొర్రూరు వైపు నుంచి వస్తూ వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య శశాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ బాబు సోమవారం తెలిపారు. -
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే..
రామవరం అనే చిన్న ఊరిలో నవ్య, కావేరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చదువులో ఇద్దరూ తెలివైన వారే. ఆ ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరికి చదువుంటే చాలా ఇష్టం. నవ్యకు డాక్టర్ కా వా లని కోరిక. కాని ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదే ఆలోచించేది. కా వేరి ధైర్యవంతురాలే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా చదువుకుని లాయరై పేదలకు సేవ చేయాలనే కోరిక. ఇద్దరు కలిసి వెళ్తుంటే గ్రామంలో పనిపాటలేని కొందరు మీరు అమ్మాయిలు.. మీకు చదువు ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఊరోళ్లు గొప్ప ఉద్యోగాలు చే యలేరు. మీ నుంచి కాదు అంటూ నిరుత్సాహ పరుస్తారు. నవ్య అదే ఆలోచించుకుంటూ నేను డాక్టర్ను కాలేనేమో అనే అనుమానంతో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడమే మేలేమో అనుకుని నిర్ణయం మార్చుకుంటుంది. సంబంధం రావడంతో పెళ్లి చేసుకుంటుంది. కావేరి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువుకుని లాయర్ అవుతుంది. ఎంతో మందికి సేవ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్య కావేరిని కలిసి తన కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు వివరిస్తూ నేను ధైర్యంగా చదువుకుని ఉంటే ఈ రోజు డాక్టర్ను అయ్యి ఎంతో మందికి సేవ చేసేదాన్ని. నా పిల్లలను కూడా మంచిగా చూసుకునేదానంటూ బాధపడుతుంది. దీనికి కావేరి ధైర్యం చెప్పింది. ఇప్పటికి బాధపడకు. మించిపోయింది ఏమీలేదు. ఏదో ఉద్యోగం సంపాదించు నేను నీకు సాయం చేస్తానంటూ నవ్యకు భరోసా ఇచ్చింది. దీంతో నవ్య ఆగిపోయిన చదువు కొనసాగిస్తుంది. కావేరి సాయంతో నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుంది. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ స్నేహితులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. –లింగాలఘణపురం నీతి: ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. – వై.అక్షయ, పదో తరగతి, లింగాలఘణపురం -
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా రాధాబాయి
గూడూరు: మండలంలోని రాములుతండాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనావత్ రాధాబాయిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించినట్లు సోమవారం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్తో పాటు పలువురికి రాధాబాయి కృతజ్ఞతలు తెలిపారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
రైతుల ఆందోళన తొర్రూరు: మక్కల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా సాకులు చెబుతూ కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదు ట రైతులు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయి ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే, కొనుగోలు చేయడం లేదన్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నెల రోజు లుగా ఎండలో మాడుతున్నామని, అకాల వర్షాలు కురుస్తున్నా పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఎస్సైలు అంజమ్మ, ఖాదర్పాషా ఆందోళన స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలు ఆలస్యంగా రావడం, గన్నీ సంచుల కొరత వల్ల మక్కల కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్నారు. తక్షణమే కొనుగోళ్లు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని హామీనివ్వడంతో రైతులు శాంతించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారంపై మున్సిపల్ సిబ్బంది దృష్టి సారించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్ పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సాధారణ సమావేశంలో 32 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చ జరిపారు. పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. చెత్త సేకరణ వాహనాలకు వెంటనే మరమ్మతులు జరిపి వీధుల్లో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ జరపాలని, డ్రైవర్లతో పాటు సిబ్బందిని వెంటనే నియమించాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ అనుమతిస్తే పారిశుద్ధ్య పనులను ప్రత్యేక ఏజెన్సీకు అప్పగిస్తామని కమిషనర్ బి.నిరంజన్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చైర్పర్సన్ రాజకుమారి తెలిపారు. వైస్ చైర్పర్సన్ లావణ్యాశ్రీనివాస్, మున్సిపల్ ఏఈ శృతి, సీనియర్ అసిస్టెంట్ లోకేష్ పాల్గొన్నారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపుమహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డీఐఈఓ మదార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్లో ఫెయిల్అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామని, ఈ నెల 13నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐడీపీ, ఐఎఫ్పీ డిజిటల్ టీవీలను ప్రారంభించి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ప్రిన్సిపాల్స్ సదానందం, గణేష్, అధ్యాపకులు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: బేగంపేట, రామాంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఒకటో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు జిల్లాలో నిరుపేద గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి దేశీరాంనాయక్ సోమవారం తెలిపారు. దరఖాస్తు ఫారాలు నేరుగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అందిస్తామని, ఈ నెల 18న సాయంత్రం 4గంటల వరకు గిరిజన కార్యాలయంలో తిరిగి సమర్పించాలన్నారు. ఈ నెల 22న కలెక్టరేట్లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు 1–6–2019 నుంచి 31–5–2020 మధ్య జన్మించి ఉండాలన్నారు. -
నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం
● గుండెపోటుతో డీఏఓ మృతి నర్సంపేట రూరల్: నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డీఏఓ (డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న తిప్పరి శ్రీనివాస్ (57) గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన తిప్పరి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో మూడు సంవత్సరాల నుంచి డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్ విధులకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి ● మర్రిపల్లిగూడెంలో ఘటన కమలాపూర్ : ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బీనవేని ఉమ, భిక్షపతి దంపతుల చిన్న కుమారుడు అజయ్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. సోమవారం తన బంధువులు ఇద్దరితో కలిసి గ్రామంలోని పెద్దిరెడ్డి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఈసమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మధు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలే కారణం.. అజయ్ మృతికి అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు ఆ రోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి, మొరం తవ్వకా లు చేపడుతున్నారని, దీంతో చెరువులో ప్రమాదకరంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. ఆ గుంతల్లో పడి గతేడాది ఓ మహిళ, తాజాగా అజయ్ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రా ణాలు పోకముందే అధికారులు స్పందించి వెంటనే చెరువులో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను అరికట్టాలని వారు కోరుతున్నారు. -
విజ్ఞాన గనులు.. గిరిజన గురుకులాలు
న్యూశాయంపేట: పేద విద్యార్థులకు గిరిజన గురుకులాలు వరంగా మారనున్నాయి. వారికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఇప్పుడు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న గిరిజన, గిరిజనేతర విద్యార్థుల కోసం ఈ విద్యాసంస్థలు మరోసారి ద్వారాలు తెరుచుకున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నేరుగా ప్రవేశానికి అవకాశం.. గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పదో తరగతి పూర్తి చేసిన గిరిజన (ఎస్టీ) విద్యార్థులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన గిరిజనేతర కోటా ప్రకారం ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష రాయక పోయినా లేదా మెరిట్ జాబితాలో వెనుకబడిన వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఉచిత భోజన, వసతి, యూని ఫాం, పుస్తకాలతోపాటు నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు (జేఈఈ, నీట్) ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంది. గిరిజన, గిరిజనేతర విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందడానికి వీలుంది. బాలురకు ఒకటి, బాలికలకు నాలుగు కళాశాలలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు బాలికల గురుకుల కళాశాలలు, ఒకటి బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని దేవన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) కళాశాల, జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల, వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీ.. ప్రతీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గూపుల్లో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు(34), ఓసీ/ఈబీసీ (1), బీసీ (1), ఎస్సీ (1), అనాథ (1), స్పోర్ట్స్ కోటా (1), పీహెచ్సీ (1)కి కేటాయింపులు ఉంటాయి. అర్హులైన విద్యార్ధులు తమ టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్ఫొటో, ఆదాయ, ఆధార్, కుల, ఆదాయ (రూరల్ పరిధి 1.50 లక్షలు, పట్టణ పరిధి రూ.2 లక్షలు) ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకుని నేరుగా వరంగల్ యాకత్పురలోని చింతల్బ్రిడ్జి వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు సంప్రదించాలి. విద్యార్థులకు నాణ్యమైన బోధన, నీట్, జేఈఈలో శిక్షణ ఉమ్మడి జిల్లాలోని ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు షురూ దరఖాస్తుకు ఈనెల 16వ తేదీ వరకు గడువుగిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించడానికి మంచి అవకాశం. అర్హులైన వారు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవకాశం కోల్పోకుండా తమ భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. – డీఎస్ వెంకన్న, ఆర్సీఓ వరంగల్, కరీంనగర్ రీజియన్ -
లారీలు రావు.. బస్తాలు పోవు
● మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేలకొద్ది బస్తాల నిల్వ ● పడిగాపులు కాస్తున్న రైతులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వం, మార్క్ఫెడ్ సంస్థ ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో వేలకొద్ది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఇటీవల 20వేల బస్తాలపైగా మక్కలు కొనుగోలు చేయగా.. సకాలంలో లారీలు రాకపోవడంతో బస్తాలు మిల్లులకు తరలించలేదు. దీంతో భారీగా పేరుకుపోయా యి. వీలున్నప్పుడు ఒక లారీ మాత్రమే వస్తుండడంతో అందులో 550 నుంచి 600 బస్తాలు మాత్రమే తరలిస్తున్నారు. మరో 10వేల బస్తాలు.. ఇప్పటి వరకు 20వేల బస్తాలు కొనుగోలు చేసి అక్కడే నిల్వ ఉండగా.. మరో 10వేల బస్తాలు నింపి ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మక్కలు తడిసిపోగా రైతులు వాటిని ఆరబెట్టుకొని బస్తాల్లో నింపి ఉంచారు. వేల కొద్ది బస్తాలు నిల్వ ఉండడంతో మహబూబాబాద్ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు మక్కలను విక్రయించేందుకు వచ్చి నెలల తరబడి వ్యవసాయ మార్కెట్లోనే పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రావడం లేదు.. మానుకోటలోని మక్కల కొనుగోలు కేంద్రానికి 83 బస్తాల మక్కలను 20 రోజుల క్రితం విక్రయించేందుకు తీసుకువచ్చా ను. ఇటీవల పీఏసీఎస్ సిబ్బంది బస్తాలు నింపి కాంటాలు పెట్టారు. లారీలు రావడంలేదని చెబుతున్నారు. ఇన్ని రోజులుగా ఇంటి నుంచి వచ్చి వెళ్తున్న క్రమంలో రూ.2వేల వరకు పెట్రోల్కు ఖర్చు అయ్యింది. వర్షం వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. –పి.యాకయ్య, రైతు, మాధవాపురం -
పనికి వెళ్లడం లేదని తండ్రి మందలింపు..
● మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య ● స్టేషన్ఘన్పూర్లో ఘటన స్టేషన్ఘన్పూర్: పనికి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సంపత్(23) డ్రైవింగ్ చేస్తుంటాడు. ఇటీవల పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులు భార్య కవిత ఈనెల 10న వేములవాడకు వెళ్లగా తండ్రీకుమారులు ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న కుమారుడిని పనికి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు ఉంటున్నావని, ఇలా అయితే ఎలా బతుకుతావంటూ తండ్రి మందలించాడు. దీంతో సంపత్ మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా సంపత్ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు. వివాహిత ఆత్మహత్య.. ● భర్త, ఆర్మీజవాన్ రిమాండ్ గార్ల: వివాహిత మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై బి. సాయికుమార్ సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన యోదుల సతీశ్కుమార్తో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజకు వివాహం జరిగింది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే జరిగింది. ఈ క్రమంలో 2025లో పిండిప్రోలు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కాంపాటి శ్రీరామ్.. శైలజకు తరచూ ఫోన్ చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు తెలియడంతో శైలజను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శైలజ 2025లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు అల్లుడు సతీశ్కుమార్, ఆర్మీ జవాన్ శ్రీరా మ్ను అరెస్ట్ చేసి రిమాండ్ తలించినట్లు ఎస్సై వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ ఉద్యోగి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం దానవాయి పేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కల్లూరి లక్ష్మయ్య (55), దేవయ్య అటవీ శాఖ ఉద్యోగులు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి బైక్పై దానవాయిపేట సమీపంలోని టేకు ప్లాంటేషన్ వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టును తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో సెక్షన్ అధికారి దేవయ్య తీవ్రంగా, లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంకటాపురం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మయ్య మృతి చెందాడు. దేవయ్యను అదే వైద్యశాలకు తరలించారు. లక్ష్మయ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతి రావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నేడు టీజీఎడ్ సెట్
● నిమిషం ఆలస్యమైతే నోఎంట్రీ ● 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● హాజరుకానున్న 4,609 మంది అభ్యర్థులు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2026–2027లో ప్రవేశాలకుగాను ఈనెల 12న (నేడు) ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్)నిర్వహించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా కేంద్రంలో ఏడు, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు ఎక్స్రోడ్లోని (గాయత్రీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ), ఎర్రగట్టుగుట్టలోని ఐయాన్ డిజిటల్, హసన్పర్తి హైవేలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, గోపాల్పూర్లోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హనుమకొండ వడ్డేపల్లిలోని ఐయాన్ డిజిటల్, వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపల్లి సమీపంలోని బాలాజీ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీఎడ్సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి సోమవారం తెలిపారు. టీజీఎడ్సెట్ను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్కు 8: 30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. రెండోసెషన్లో మధ్యాహ్నం 12: 30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుతించబోరు. మొదటి సెషన్లో 2,304 మంది, రెండో సెషన్లో 2,305 మంది మొత్తం 4,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. హాల్టికెట్, బ్లూలేదా బ్లాక్ పాయింట్ పెన్, ఐడీ ప్రూప్ తీసుకుని రావాలని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. -
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ అర్బన్: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను ఈనెల 17వరకు నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, అధికారులు శ్రీరాములు, అప్పారావు, సంతోష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.సమన్వయంతో పని చేయాలి.. మహబూబాబాద్: అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు తదితర విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది
● మాజీ మంత్రి రెడ్యానాయక్ దంతాలపల్లి: ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి రెడ్యానాయక్ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ఖమ్మం, వరంగల్, జాతీయరహదా రిపై కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సమీపంలోని ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్ధత, ముందుచూపు లేకపోవడం వలనే ధాన్యం, మొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెల రోజులు గడుస్తున్నా.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమ న్నారు. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ధాన్యం బస్తాలు ఉన్నాయన్నారు. తహసీల్దార్ సునిల్కుమార్, పీఏసీఎస్ సీఈఓతో మాట్లాడారు. వారం రోజుల్లో ధాన్యం తరలించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు, జెడ్పీ మాజీ వైస్చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, నాయకులు కిషోర్, నూకల గౌతమ్రెడ్డి, సురేష్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యకు పరిష్కారం
● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో ప్రజల ప్రస్తావన ● పరిష్కారానికి కదిలిన యంత్రాంగం డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ యంత్రాంగం కదిలింది. తాగునీటి సమస్యలపై శనివారం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్చైర్పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించడంతో ఇందిరానగర్లో బోరుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. శాంతినగర్లో ట్యాంకర్తో నీటి సరఫరా చేశారు. తమ దృష్టికి వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చైర్పర్సన్ రాజకుమారిహరినాథ్, వైస్చైర్పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్ ఈసందర్భంగా తెలిపారు. -
ప్రజల వద్దకు పోలీస్
సాక్షి, మహబూబాబాద్: ● ఇటీవల కాలంలో హెల్మెట్ వినియోగం, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శబరీష్ కురవి మండంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజాప్రతినిధుల రాకకోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఓ మహిళ ఎస్పీ వద్దకు వచ్చి తన సమస్యను చెప్పుకున్నారు. దీంతో స్పందించిన ఆయన పోలీస్ అధికారులను పిలిచి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ సమస్యను పరిష్కరించారు. అందుకు ఆమె పోలీస్ బాస్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెసేజ్ పంపించింది. ● కేసముద్రం మండలంలో మహిళా సమాఖ్య సమావేశం జరుగుతుంటే జిల్లా షీ–టీమ్ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ మహిళలతో మమేకమై.. వారి బాగోగులు తెలుసుకుంది. ఈ సందర్భంగా ఓ మహిళ తనకు ఓ సమస్య ఉందని ఫోన్ నంబర్ తీసుకుంది. తర్వాత షీ–టీమ్ ఎస్సై సునందకు ఫోన్ చేసి.. తమది పరువుగల కుటుంబం. భర్త ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి తనకు తరచూ ఫోన్ చేసి లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని ఏడుస్తూ వివరించింది. దీంతో వేధింపులకు గురిచేసే వ్యక్తి ఫోన్ నంబర్ తీసుకున్న ఎస్సై సదరు వ్యక్తికి ఫోన్ చేసి స్టేషన్కు పిలిపించింది. తాను చేసిన వెలిక చేష్టల వివరాలు చెప్పింది. మరోసారి ఆమెకు ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించింది. దీంతో ఆ సమస్య సమసిపోయింది. ● కురవి మండలంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన షీ–టీమ్ బృందం మహిళలతో మాట్లాడి ఇబ్బందులుంటే ఫోన్ చేయమని కోరింది. ఫోన్ నంబర్ తీసుకున్న ఓ మహిళ మరుసటి రోజు షీ–టీమ్కు ఫోన్ చేసింది. తన ఇంటిపక్కన యువకుడు తన కూతురును వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎన్ని సార్లుచెప్పినా.. మార్పు రాలేదని, మెస్సేజ్లు పంపిస్తున్నాడని వివరించింది. దీంతో పోలీస్ స్టేషన్కు యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి అమ్మాయి జోలికి వెళ్తే కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో యువకుడు తన ప్రవర్తనన మార్చుకోవడంతో యువతి సమస్య తీరిపోయింది. ఇలా ఒకప్పుడు పోలీసుల పేరు చెబితేనే భయపడే జనం ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా పోలీసులకు చెబితే పరిష్కారం అవుతుందనే విధంగా పరిస్థితి మారింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలకు సైతం పోలీసులపై నమ్మకం పెరిగింది. ఈనేపథ్యంలో జిల్లాలో పోలీసులు ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై కథనం. గ్రామాల్లోకి పోలీస్.. పాత పద్ధతిన కాకుండా వినూత్న రీతిలో పోలీసింగ్ చేయాలని భావించిన ఎస్పీ.. ప్రజల మధ్యకు వెళ్తేనే సమస్యలు తెస్తాయి. వాటి పరిష్కారం సులువు అవుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పండుగలు, క్రీడలు, విగ్రహాల ఆవిష్కరణ, రైతులు, యువజనుల సమావేశాల్లో శాంతి భద్రతల పరిష్కణ చూస్తూనే ప్రజలతో మమేకం కావాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా యూరియా, గ్యాస్ కొరత వంటి సమస్యలు వచ్చినప్పుడు గుంపులను చెదరగొట్టడమే కాకుండా.. వారితో మమేకమై.. అసలు సమస్య ఎక్కడ వస్తుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమస్య పరిష్కారానికి మార్గం దొరికింది. సమస్య సమసి పోయిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అదే విధంగా హోం గార్డు స్థాయినుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు, గ్రామాల్లో పర్యటన, ప్రజా ప్రతినిధులతో మమేకం వంటి ప్రక్రియ మంచి ఫలితాలను ఇచ్చింది. గంజాయి వినియోగం, రవాణా అదుపులోకి తేవడానికి దోహద పడింది. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం మూలంగా సీసీ కెమెరాల కొనుగోళ్లు, హెల్మెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు ముందుకు రావడం ఇందుకు నిదర్శనం. ప్రజల్లో ఒకరిగా.. పోలీసులంటే సమాజంలో ఉన్న అభిప్రాయం పోవాలి. వాళ్లు వేరు కాదు..సమాజంలో వారు ఒకరు అనే అభిప్రాయం రావాలన్నదే పోలీస్శాఖ ఉద్దేశం. అప్పుడే వారి సమస్యలు చెబుతారు.వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈ ఉద్దేశంతోనే ఫ్రెండ్లీ పోలీస్, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. ప్రజలతో మమేకం కావడం. సామాజిక రుగ్మతులను నిర్మూలించడంలో ప్రజల సహకారం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. – శబరీష్, ఎస్పీప్రజలతో మమేకం.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చట్టాలపై అవగాహన, సామాజిక రుగ్మతుల నివారణ వినూత్నరీతిలో జిల్లా పోలీస్శాఖ కార్యక్రమాలు మహిళల గుంపుతో షీ–టీమ్మహిళలకోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి కిందిస్థాయికి చేరడం లేదు. అయితే జిల్లాలోని షీ–టీమ్ మాత్రం మహిళల గుంపు ఎక్కడ ఉంటే అక్కడ వాలి.. చట్టాల గురించి చెప్పడం పరిపాటిగా మారింది. సాధారణంగా స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థిణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కానీ జిల్లాలోని షీ–టీమ్ మాత్రం మహిళలకు ఎక్కడ పనిచేస్తే అక్కడ.. ప్రధానంగా మార్కెట్లో ధాన్యం ఊడ్చేవాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సమావేశాలు.. మొదలైన చోట్లకు వెళ్లడం. మహిళల చట్టాలు. వాటిని వినియోగించుకోవడం, లైంగిక వేదింపులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులతో ఇబ్బందులు పడుతున్న వారికి పోలీస్ ఏవిధంగా సహాయ పడుతుందో చెప్పడం. వారితో మమేకం కావడం పరిపాటిగా మారింది. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్.మదార్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్లతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 3వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పరీక్ష కేంద్రాల పీఎస్, డీఈఓలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రజలకు రక్షణ లేకుండాపోయింది’నెహ్రూసెంటర్: రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువైందని మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాజీ ఎంపీ కవితతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్లో కొత్తగా గన్ కల్చర్, గంజాయి, డ్రగ్ కల్చర్ అలవాటైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. మహిళలు, యువతులపై దారుణాలు జరుగుతున్నా సీఎం రేవంత్రెడ్డి ఎలాంటి సమీక్షలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి పదవి ఆయన వద్దనే ఉన్నా ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసులు పెట్టకుండా తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శించారు. కేసులు పెట్టకుండా బాలిక తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎట్టకేలకు కేసు నమోదు చేశారని అన్నారు. వారోత్సవాలను జయప్రదం చేయాలి నెల్లికుదురు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో జరిగే ప్రత్యేక విద్యా వారోత్సవాలను జయప్రదం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగే అభివృద్ధి పనుల స్థల పరిసరాలను ఆదివారం ఆయన పరిశీలించారు. సోమవారం ఎమ్మెల్యే మురళీనాయక్ ముందుగా కేజీబీవీఓ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత మోడల్ స్కూల్లో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్సీ సంతోష్, జీసీడీఓ విజయకుమారి, ఎస్ఓ సుమలత, సుధాకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి ఎంపిక కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణులపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. -
నేటినుంచి వేసవి శిక్షణ శిబిరాలు
● ఈ నెల 25 వరకు నిర్వహణ ● జిల్లాలో 18 పాఠశాలలు ఎంపికమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని 18 పీఎంశ్రీ పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక శిక్షణ శిబిరంలో 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రూ.9 లక్షలు మంజూరు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఒక పీఎంశ్రీ పాఠశాలకు రూ.50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధులను ఆ పాఠశాల హెచ్ఎంల అకౌంట్లకు జమచేశారు. మెటీరియల్ కలర్స్ స్కేచ్ తదితరాలకు రూ.10వేలు, వంట సహాయకులకు రూ.4వేలు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన నలుగురు కోచ్లకు రూ.3 వేల చొప్పున రూ.12 వేలు చెల్లించాలి. శిక్షణలో నిర్వహించే ఆటలు, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, యోగా, కథ చెప్పటం, వ్యక్తిత్వ వికాసం, చెస్, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు, క్వీజ్లు, మాక్ పార్లమెంట్, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ముగిసిన తర్వాత ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని విద్యాశాఖ అధికారుల సూచించారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు ఎంట్రీ.. ఈ వేసవి శిక్షణ శిబిరం పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు కాకుండా అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పించారు. శిక్షణ శిబిరాలను సెక్టోరల్ ఆఫీసర్లు, ఎంఈఓలు ప్రతీరోజు పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఉపశమం కలిగించి ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ ఇచ్చేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరాలు నిర్వహించే పాఠశాలలు ఇవే.. బయ్యారం మండలం జీకేపేటలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, డోర్నకల్ మండలం చిలుక్కోడు పీఎంశ్రీ మోడల్ స్కూల్, డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్, సిరోలు కాంపల్లి జెడ్పీహెచ్ఎస్, కంబాలపల్లి జెడ్పీహెచ్ఎస్, మానుకోట జెడ్పీహెచ్ఎస్, మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్, గూడూరు మండలంలోని పోనుగోడు జెడ్పీహెచ్ఎస్, కేసముద్రం స్టేషన్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, నెల్లికుదురు మోడల్ స్కూల్, నర్సింహులపేట పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, చిన్నగూడురు మండలంలోని జయ్యారం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, మరిపెడ మండలంలోని సీతారాంపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, దంతాలపల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, తొర్రూరు మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్, తొర్రూరు పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, పెద్దవంగర మండలంలోని అవతాపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, మరిపెడ మోడల్ స్కూల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్.. టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరా త్, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి వరంగల్లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహ క మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లో 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికైన తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభా గాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటె డ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబు తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదా తో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్పై వరంగల్కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, వరంగల్కు గౌరవంగా పేర్కొనవచ్చు. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ -
నేటినుంచి విద్యావారోత్సవాలు
● ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ ● 17వ తేదీ వరకు కార్యక్రమాలుమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతమే ధ్యేయంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యావారోత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ ప్లాన్కు సంబంధించిన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని గురుకులాల విభాగాల్లో అడ్మిషన్ల పెంపు, విద్యా ప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిజిటల్ క్లాస్లను బలోపేతం చేయడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్లో అమలుకు జిల్లా కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. వారోత్సవాలు ఇలా.. ● 11వ తేదీన మొదటి రోజు పునాది దినోత్సవం నిర్వహించాలి. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన.. పీఎంశ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాలను ప్రారంభం. కోడింగ్, ఆర్ట్స్, యోగా, క్రీడల్లో ఇతర కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ నిర్వహించాలి. ● 12వ తేదీన రెండో రోజు పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణతో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు రెమెడియల్ క్యాంప్లు ప్రారంభించాలి. వారి పురోగతి సమీక్ష, మధ్యాహ్న భోజనం అందించాలి. ● 13వ తేదీన గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించాలి. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పించాలి. ● 14వ తేదీన గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను బడిలో చేర్పించాలి. తల్లిదండ్రులు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో సమావేశాలు, సమ్మేళనం నిర్వహించాలి. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహించాలి. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయాలి. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయాలి. ● 15వ తేదీన పాఠశాల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించి. గ్రంథాలయాలు– జ్ఞాన హృదయం నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టాలి. అంబేడ్కర్ లాంటి మహనీయుల పుస్తకాలు ప్రదర్శించాలి. ఉత్తమ పాఠకులకు గుర్తింపు, పుస్తక దానం శిబిరాలు నిర్వహించాలి. ● 16వ తేదీన విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు, కోలాటం, ఒగ్గుకథలు సంప్రదాయ కళల ప్రదర్శనలు, కళా వైభవం ఆర్ట్ అండ్ క్రాప్ట్ దినోత్సవం, పీఎం శ్రీపాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. జానపద కళారూపాల ప్రదర్శనలు, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఉత్తమ చిత్రపటాలు, శిల్పాలను ఎంపిక చేయాలి. ● 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించాలి. జిల్లాస్థాయిలో పదో తరగతి మొదటి ముగ్గురు టాపర్లకు పురస్కారాలు, రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసపత్రాలు అందించాలి. విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా నిర్వహంచాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలి. ఘనంగా నిర్వహిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యయ్యేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తాం. – అలువాల సత్యనారాయణమూర్తి, డీఈఓ -
మిర్చి వ్యాపారి కుచ్చుటోపీ
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓ మిర్చి వ్యాపారి చేతులెత్తేశాడు. అడ్తిదారుల నుంచి మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అమడగాని అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది అడ్తిదారుల నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేశాడు. వారికి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు తెలుస్తోంది. దీంతో అడ్తిదారులు రైతులకు డబ్బులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరు వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని రవీందర్రెడ్డి తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. బాధితుడు, మోక్ష ఎంటర్ప్రైజెస్ యజమాని పోతు వినయ్కుమార్ ఆదివారం ఏనుమాముల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.33.81 లక్షల విలువైన మిర్చి కొనుగోలు చేసి తనకు డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈమేరకు మిర్చి వ్యాపారి అమడగాని అయిలయ్య అలియాస్ అరుణ్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు శోభ, నాగరాజు, మానస, సందీప్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. మార్కెట్లో వరుస ఘటనలు.. మూడేళ్ల క్రితం ఓ వ్యాపారి రూ.6 కోట్లతో పరారయ్యాడు. నెల రోజుల క్రితం వరంగల్ మార్కెట్లో గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ పేరుతో 49 మంది అడ్తిదారుల నుంచి రూ.2 కోట్ల విలువైన మిర్చికొనుగోలు చేసిన వ్యాపారి బోర్డు తిప్పేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరోవ్యాపారి రూ.2.60 కోట్లతో పరారయ్యాడు. -
విద్యుత్ సేవలు మరింత సులభం
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అరచేతిలో సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు సలహాలు, సూచనలు పొందే అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానంతో అధునాతనంగా వాట్సాప్ చాట్బాట్ను తీర్చిదిద్దారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో 70.39 లక్షలు మంది విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యాజమాన్యం ముందుకుపోతోంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందిస్తూ వినియోగదారులకు సులభతరం చేసింది. ఈ క్రమంలో ఈనెల 8 నుంచి ఏఐ వాట్సాప్ చాట్బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సాప్లో వినియోగదారులు సమస్యను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోనూ మెసేజ్ చేసి పోస్టు చేయాలి. ఏఐ పోస్టు (ప్రశ్న)ను అర్థం చేసుకొని, విశ్లేషించుకొని వినియోగదారుడికి అవసరమైన సమాచారం అందిస్తుంది. వినియోగదారులు వాట్సాప్ చాట్బాట్ ద్వారా ఈ కింది సేవలు పొందవచ్చు.. ● బిల్లు విచారణ : ప్రస్తుత బిల్లు మొత్తం చెల్లింపు తేదీ. ● చెల్లింపు స్థితి : వినియోగదారులు చెల్లించిన బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు. ● ఫిర్యాదు నమోదు: తెలుగు, ఇంగ్లిష్లో వివరాలు తీసుకుంటుంది. వినియోగదారుడికి ఫిర్యాదు టికెట్ ఇస్తుంది. ● ిఫర్యాదు టికెట్: టికెట్ నంబర్తో ఏ ఫిర్యాదు స్థితినైనా తెలుసుకోవచ్చు. ● అంతరాయ సమాచారం: వినియోగదారులు సేవా ప్రాంతంలో ప్రస్తుత అంతరాయ స్థితిగతులను తెలుసుకోవచ్బు. ● టీజీఎన్పీడీసీఎల్ హెల్ప్ లైన్: చాట్బాట్కు స మాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు వినియోగదారుడితో ఉద్యోగి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతారు. ● వాట్సాప్ చాట్బాట్ సేవలు వినియోగదారులకు 24/7 అందుబాటులో ఉంటాయి. రైతులకు అర్థమయ్యే విధంగా తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లుల పూర్తి సమాచారం, బిల్లుల విచారణ, చెల్లింపుల స్థితి సెకన్లలో పరిష్కరిస్తారు. కాల్ వెయిటింగ్ టైం, ఏజెంట్ క్యూ ఉండదు. మెనూ నావిగేషన్ మాత్రం ఉంటుంది. ● వినియోగదారుడు తమ మొబైల్లో 8712481489 ద్వారా వాట్సాప్లోకి వెళ్లి కావా ల్సిన సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవలను నేరుగా యాక్సెస్ చేయడానికి హెచ్టీటీపీఎస్://డబ్ల్యూఏ.ఎంఇ/918712481489 ( https://wa.me/918712481489) లింక్పై క్లిక్ చేయాలి. సేవలు పొందే సులభమైన అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కల్పించింది. వినియోగదారులకు ఏఐ అనుసంధానంతో వాట్సాప్ చాట్బాట్ సర్వీస్ టీజీ ఎన్పీడీసీఎల్లో అందుబాటులోకి అధునాతన సాంకేతిక సేవలు -
సొప్ప కాలుస్తూ మంటల్లో పడి రైతు మృతి
శాయంపేట : మొక్కజొ న్న సొప్ప కాలుస్తూ ప్ర మాదవశాత్తు మంటల్లో పడి రైతు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రా మంలో ఆదివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోలి జయపాల్రెడ్డి(74) వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సొప్ప కాలుస్తుండగా గాలి పెరగడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పరుగెడుతుండగా కాలుకు ఉన్న చెప్పులు జారిపోయాయి. ప్రమాదవశాత్తు మంటల్లో పడి శ్వాస రాక అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మమ్మ చెప్పిన కథ
గాడిద–గుర్రంరామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిదమీద పెట్టుకొని తాను గుర్రం ఎక్కి పొరుగూరు వెళ్తున్నాడు. కొంత సేపటికి బరువులు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం అది నాబాధ్యత కాదు బరువులు మోయడానికి నువ్వు..సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేని గాడిద నడుము విరిగి కిందపడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ఎక్కి ప్రయాణం సాగించాడు.ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈగాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది.–ఆత్మకూరు నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది. –కె.వేదశ్రీ,6వ తరగతి, మార్గదర్శి స్కూల్, ఆత్మకూరు -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. అండర్–16,18,20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సుమారు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అథ్లెట్లకు హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్త్రో, డిస్కస్త్రో, హ్యామర్త్రో, షాట్పుట్, ట్రిపుల్ జంప్, 400 మీటర్ల పరుగు ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో అథ్లెటిక్స్ అసోసియేషన్ బా ధ్యులు ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీ డాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. 400 మంది క్రీడాకారులు హాజరు -
నాట్య మయూరాలు..
మహబూబాబాద్ అర్బన్ : భారతీయ సంప్రదాయ ప్రాచీన నృత్యం కూచిపూడి. దేశంలో ఈ నృత్యానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఈ నృత్యంలో రాణించడం అనుకున్నంత సులువేం కాదు. ఎంతో సాధన చేయాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. అప్పుడే ఇందులో ప్రావీణ్యం సాధిస్తారు. ఇలాంటి ఆసక్తే చూపుతూ మంచి నృత్యకారిణులుగా పేరు తెచ్చుకుంటున్నారు మానుకోట జిల్లా కేంద్రలోని చిన్నారులు, యువతులు, మహిళలు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రముఖుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంటున్నారు. తల్లీకూతుళ్ల అసాధారణ ప్రతిభ.. జిల్లా కేంద్రంలోని పాతబజారు హరిజనవాడకు చెందిన బుర్ర రాజశేఖర్, ఉమ దంపతులు. రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ఉమ ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా 2023 నుంచి పెద్ద కూతురు కాత్యాయని విద్మహేకు, 2024 నుంచి చిన్న కూతురు మోక్షదాయిని విద్మహేకు కూచిపూడి నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరితోపాటు తల్లి ఉమ కూడా కూచిపూడి నేర్చుకుంటోంది. ఇటీవల వరల్డ్ రికార్డు బుక్ఆఫ్ ఇండియాలో మొదటిసారి ప్రదర్శనలు చేసి ముగ్గురు అవార్డులు అందుకున్నారు. దీంతో రాజశేఖర్, ఉమ దంపతుల బంధుమిత్రులు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాణిస్తున్న అక్కాచెల్లి.. జిల్లా కేంద్రంలోని బుక్కబజారుకు చెందిన కనమర్లపూడి ఆనంద్, ఆశ్లేష దంపతుల కూతుళ్లు ఖుషి, ఆరుషి 2023 నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఖుషి 7, ఆరుషి 4వ తరగతి చదువుతోంది. వీరు కూచిపుడిలో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి, మహారాష్ట్రలోని షిర్డీ, నెల్లూరు, ఉప్పల్లోని మినీ శిల్పరామంలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంస పత్రాలు, బహుమతులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉప్పల నేహ కూడా.. మానుకోటకు చెందిన ఉప్పల రంగ, శ్రావణి దంపతుల కూతురు నేహ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటుంది. నేహ ప్రస్తుతం 3వ తరగతి చదువుతుంది. ఆయా నాట్యాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ పురస్కారాలు అందుకుంటోంది. కూచిపూడిలో రాణిస్తున్న మానుకోట నృత్యకారిణులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు ప్రదర్శనలు ఎన్నో అవార్డులు, ప్రశంసలు -
ధాన్యం తూర్పార పట్టేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి
పెద్దవంగర: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చింది. కల్లం నుంచి ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి చేర్చారు. అమ్మడానికి ఆ ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి ఓ వృద్ధురాలిని బలితీసుకుంది. గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన ఆదివారం మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టీక్యాతండా జీపీ పరిధి శంకర్ తండాకు చెందిన జాటోత్ భద్రమ్మ (60) రామోజీ దంపతులు వ్యవసాయ కూలీలు. తమకున్న కొద్దిపాటి భూమిలో పడించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వడ్డేకొత్తపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్కు తరలించారు. అలాగే తన బావ కుమారుడు జాటోత్ వెంకన్న కూడా అదే కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వ ఉంచాడు. తూర్పార పట్టేందుకు వెంకన్న అతడి భార్య విజయతోపాటు భద్రమ్మ బైక్పై శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఐకేపీ సెంటర్కు బయలుదేరారు. మార్గమధ్యలో కొరిపల్లి క్రాస్ రోడ్డు వరకు చేరుకుంటున్న క్రమంలో తిర్మలగిరి వైపునకు వెళ్తున్న ఓ గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో భద్రమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వెంకన్న, విజయ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం దంపతులకు తీవ్రగాయాలు -
కేసు నమోదు
ఖిలా వరంగల్: ఓ వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాజీపేటకు చెందిన ఆదిరాల సత్యనారాయణ బైక్పై ఈనెల 9న ఎస్ఆర్ఆర్తోటకు వచ్చి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ఉర్సు గుట్ట జంక్షన్కు చేరుకోగానే హనుమకొండ నుంచి ఉర్సుగుట్ట వైపునకు బైక్పై వస్తున్న మణికంఠ.. ఆయన బైక్ను ఢీకొట్టాడు. దీంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి కుమారుడు సాయి రాహుల్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
యువకుడి బలవన్మరణం
● ఎల్బీజీ నగర్ కాలనీలో ఘటన మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ ఎల్బీజీ నగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై ఉమ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆరుముళ్ల ఉమ, నర్సయ్య దంపతులకు కుమారుడు రాజు (20), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాల క్రితం నర్సయ్య మృతి చెందగా ఒక కుమార్తె వివాహం జరిగాక ఆ కుటుంబం హైదరాబాద్ వెళ్లి కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో రాజు తన బైక్ లైసెన్స్ తీసుకొస్తానని తల్లికి చెప్పి శనివారం మహబూబాబాద్ వచ్చాడు. రాత్రి తన మిత్రులతో కలిసి వారి ఇంటిలోనే నిద్రించాడు. ఉదయం మళ్లీ మిత్రులు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కాగా, రాజుకు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగగా కొంతకాలం క్రితం ఆ అమ్మాయి సంబంధీకులు అతడిని బెదిరించినట్లు తెలిసింది. మళ్లీ అదే విధంగా బెదిరింపులు వస్తే భయపడి ఉరేసుకున్నాడా? లేక ఏ కారణంతో ఉరేసుకున్నాడో తెలియరాలేదు. మృతుడి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దామెర: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. శాయంపేటకు చెందిన పాముకుంట్ల సుధాకర్ (47) స్కూటీపై శనివారం సాయంత్రం హనుమకొండ నుంచి శాయంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో దామెర మండలం ఊరుగొండ నాగమయ్య గుడి ఆర్చ్ వద్ద ఓ బైక్ వెనుక నుంచి స్కూటీని ఢీకొంది. దీంతో సుధాకర్కు తీవ్రగాయాలుకాగా 108లో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య శాంతకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో వృద్ధురాలు.. మంగపేట : వడదెబ్బతో ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన సుతారి లక్ష్మి(60) ఆదివారం మృతి చెందింది. కొంతకాలం క్రితం భర్త, కుమారుడు మృతి చెందడంతో లక్ష్మి వ్యవసాయ కూలీకి వెళ్తూ ఒంటరి జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే శనివారం కూడా కూలీకి వెళ్లి ఇంటికి చేరుకుంది. ఆదివారం ఉదయమైనా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. ఎండలో కూలీకి వెళ్లడంతో వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
షాట్పుట్లో రాష్ట్రస్థాయికి ఎంపిక
పెద్దవంగర: జిల్లా అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జంప్స్, త్రోస్, 400 మీటర్ల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో పెద్దవంగర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి కిన్నెర బాలాజీ షాట్పుట్లో అండర్–16 విభాగంలో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర త్రోస్ (షాట్పుట్) పోటీలకు బాలాజీ అర్హత సాధించడంపై పాఠశాల పీడీ కంచెర్ల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండ జిల్లాలోని జేఎన్ఎస్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి నెహ్రూసెంటర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణన, విద్యా వారోత్సవాలపై హైదరాబాద్ నుంచి శనివారం ఆయన సంబంధిత అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక, విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యా వారోత్సవాలు షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని ఆదేశించారు. జనగణనపై సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు గూగూల్ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదనరాజు, వ్యవసాయ అధికారి సరిత, విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మదర్, ఈఈ అరుణ్కుమార్, ఎంవీఐ సాయిచరణ్, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, సీపీఓ శ్రీనివాసరావు, డీఎస్ఓ రమేష్, సివిల్ సప్లయీస్ డీఎం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏటీడీఓ ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఉపేందర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించుకునేందుకు సమ్మర్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. ఈ సమ్మర్ క్యాంప్లో బాలికలకు కుట్లు అల్లికలు, ఆటలు, యోగా, డ్రాయింగ్లో సంబంధిత ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డి.రాములు, జీసీడీఓ విజయ, పాఠశాల హెచ్ఎం పొడుగు నర్సయ్య, హెచ్డబ్ల్యూఓ పద్మ, పీడీ అనిల్, శిక్షకులు రవీందర్, రవి, శారద పాల్గొన్నారు. భారీ వర్షం.. తడిసిన ధాన్యం గూడూరు: మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మక్కలు, వరి ధాన్యం విక్రయించడానికి పీఏసీఎస్, ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 9 గంటలకు ఈదురు గాలులతో భారీ వర్షం మొదలైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వరి ధాన్యం దడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి పాడైన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
అమ్మ నింపిన ధైర్యమే ఉద్యోగస్తున్ని చేసింది
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్నలు లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. నామీదనే అందరి ఆశలు. అందుకోసమే చిన్నప్పటి నుంచి నేను బాగా చదవాలని అమ్మ చెబుతుండేది. పరీక్షల్లో వచ్చిన మార్కులు కూడా అమ్మే చూసి సంతోషపడేవారు. పోలీస్శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ చూసి అమ్మకు చెప్పాను. ఈ ఉద్యోగం నీకు వస్తుంది.. నీకు ఆ శక్తి ఉందని ధైర్యం నింపింది. ఆమె చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించాను. అప్పుడు ఆమె కళ్లల్లో చూసిన ఆనందం ఇప్పటికి మరవలేను. నన్ను చూసి మా అన్నదమ్ముళ్లు, ఆక్కా చెల్లెళ్లు బాగా చదివారు. మంచి పొజీషన్లో ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతర సమస్యలు వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడితే అంతా పోతుంది. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ మహబూబాబాద్ -
పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్ చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాక్షి ఆధ్వర్యంలో తాగునీటి సమస్యలపై నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో వారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంతో పైపులు పగిలి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈసందర్భంగా పలువురు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. భగీరథ పైపుల ద్వారా తక్కువస్థాయిలో నీరు రావడంతో వార్డులకు అరకొరగా నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రస్తుతం ట్యాంకుల ద్వారా కొన్ని వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని, యుద్దప్రాతిపదికన పైప్లైన్ల మరమ్మతులు చేపడతామన్నారు. తాగునీటి సమస్యలపై మున్సిపల్ సిబ్బందిని నిత్యం అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రశ్న: 13వ వార్డులోని పలు వీధుల్లో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడతారు? – పిల్లి శబరీష్, పోటు జనార్థన్రావు, ఎల్లావుల హరికృష్ణ, నీలం సారమ్మ, పండరినాథ్లడ్డా, మహబూబూబ్ జవాబు: రోడ్డు నిర్మాణం, అమృత్ పనులతో పైపులు పగిలి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతో ంది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నా ం. వార్డుకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తాం. ప్రశ్న: 11వ వార్డులో పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతోంది. రోడ్లు ధ్వంసమై ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. – ఎల్లావుల నర్సింహరావు, జాలా ప్రసాద్, ఎస్కే సాధిక్ జవాబు: అమృత్ పనులు పూర్తి కాగానే తాగునీటి కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. నీటి కొరతను నివారిస్తాం. ప్రశ్న: మూడురోజులకోసారి అరకొరగా నీరు సరఫరా అవుతోంది.. –భాస్కర్, మహ్మద్ అజ్గర్, ఎస్కే నేహాకౌషర్, భవాని, సుభాష్వీధి, బషీర్ అలీ, శాంతినగర్, చాంద్పాషా అంబేడ్కర్నగర్, అక్కిరెడ్డి పద్మ, న్యూ నెహ్రూ స్ట్రీట్ జవాబు: ప్రస్తుతం నీటి కొరతతో భగీరథ ద్వారా సరఫరా తక్కువగా ఉంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: మున్నేరువాగు నీటిని సరఫరాచేయరా..? – దేవర వెంకటేశ్వర్లు, అంబేడ్కర్నగర్ జవాబు: త్వరలో విద్యుత్ మోటార్లను అమర్చి నీటి కొరత ఉన్న సమయాల్లో మున్నేరువాగు నుంచి నీటిని సరఫరా చేస్తాం. ప్రశ్న: కాల్వలు తవ్వి వదిలేశారు.. – రాజేందర్సింగ్, సుభాష్ స్ట్రీట్ జవాబు: పైప్లైన్లు, డ్రెయినేజీల కోసం రోడ్లను తవ్వడంతో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నీటి సరఫరా ఇబ్బందులు పరిష్కరించరా? – గుండ్రాల భాస్కర్, వీరన్న, ఇందిరానగర్ జవాబు: భగీరథ లైన్ ద్వారా తక్కువ నీరురావడం, లీకేజీలతో నల్లాల ద్వారా తక్కువ నీరు వస్తుంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం. సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన నీటి సమస్యపై ప్రజల నుంచి పలు ప్రశ్నలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి, వైస్ చైర్పర్సన్ మాదా లావణ్య -
అనాథలకు అమ్మ
జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
డబ్బులిస్తేనే వేసవి శిబిరం!
సాక్షి, మహబూబాబాద్: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాగా.. అర్బన్ ప్రాంతంలోని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవని స్పోర్ట్స్ అథారిటీ చెబుతుంది. పిల్లల వద్ద డబ్బులు(ఫీజు) వసూలు చేసి.. ఆ డబ్బుతోనే కోచ్లను నియమించుకోవాలని చెప్పడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తమ పిల్లలకు వేసవిలో ఆటల్లో శిక్షణ ఇప్పిద్దామనుకున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. రూరల్ ప్రాంతాల్లో పది శిబిరాలు జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో పది వేసవి క్రీడా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా వాలీబాల్, కరాటే, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్ బాల్, నెట్బాల్, తదితర క్రీడల్లో మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులకు తెలిపారు. ఇందుకోసం ఇనుగుర్తి, జయపురం, గార్ల, నేరడ, తానంచర్ల, కాట్రపల్లి, ఉప్పలపాడు, అమ్మపాలెం, కల్వల గ్రామాలు వేదికకానున్నాయి. డబ్బులిస్తేనే అర్బన్లో.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచిత క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన జిల్లా యువజన క్రీడల శాఖ.. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం డబ్బులు చెల్లించిన వారికే శిబిరాలు ఉంటాయని ప్రకటించింది. ప్రధానంగా మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం మొత్తం 34 క్రీడలకు ఏ క్రీడకు ఎన్ని డబ్బులు చెల్లించాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాస్కెట్ బాల్ రూ.300, బాడ్మెంటెన్ రూ.500, చెస్ రూ.500, జమ్నాస్టిక్స్ రూ.200, లాన్టెన్నిస్ రూ.500, స్విమ్మింగ్ రూ.600, ఇలా ఒక్కొ క్రీడకు ధర నిర్ణయించారు. డబ్బులు ఇచ్చి శిక్షణ ఇప్పించే స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల శిక్షణకు పంపించడంలేదు. అధికారులు స్పందించి రూరల్ ప్రాంతాల మాదిరిగానే అర్బన్లో కూడా పేద పిల్లలకు ఉచిత శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అర్బన్ పరిధిలో క్యాంపులకు కొత్త నిబంధన ఉత్తర్వులు జారీ చేసిన క్రీడలు యువజన విభాగం పిల్లల డబ్బులతోనే కోచ్ల వేతనాలు ముందుకు రాని కోచ్లు ఆటలకు దూరంగా అర్బన్ ఏరియా పిల్లలుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ ప్రాంతంలో క్రీడా శిబిరాలు పెట్టాలంటే విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేయాలి. అలా అయితేనే శిబిరం ఏర్పాటు, కోచ్లకు ప్రోత్పాహకాలు వస్తాయి. జిల్లా ప్రత్యేక పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారి ఆదేశాల మేరకు శిబిరాలు నిర్వహిస్తాం. – ఓటేటి జ్యోతి,జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఉచితంగా శిక్షణ ఇవ్వాలిగిరిజనులు, పేదలకు ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్, క్రీడలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. వేసవిలో పిల్లలకు ఇచ్చే క్రీడా శిక్షణకు డబ్బులు వసూళ్లు చేయడం సరికాదు. ప్రభుత్వమే కోచ్ను నియమించాలి. వేసవిలో విద్యార్థులకు భోజన వసతులు కల్పించి క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలి. – గుగులోత్ కిషన్ నాయక్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు -
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలి
నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని, ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన టీజేఎస్ ఉమ్మడి జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీజేఎస్ ఏర్పాటునుంచి ఉద్యోగ, నిరుద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు పాలన జరగాలని, రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత తగ్గించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ కోదండరామ్ను విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి నియమించాలని కోరారు. ఈ నెల 12న హైదరాబాద్లో పార్టీ పార్టీ 4వ ప్లీనరీ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు, ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, షేక్ జావిద్, నాయకులు రత్నం కిరన్, శివకుమార్, రాజేష్, బోనగాని రవీందర్, చిల్లా శ్రవన్కుమార్, సంధాని, మల్లేశం, రాధా కిషన్, రాజేష్, శివకుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ నెహ్రూసెంటర్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. కళాశాల నిర్మాణ పనులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూర్తికావస్తున్న భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి సిద్ధం చేయాలని తెలిపారు. అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ సరఫరా, పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ వెంకట్ లకావత్ పాల్గొన్నారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి మహబూబాబాద్: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక ప్రత్యేక విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలపై కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యావారో త్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నా రు. కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఫొటోలు డాక్యుమెంటరీ తయారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణ మూర్తి, డీఐఈఓ మదార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆడుదాం.. అష్టాచమ్మా
కాజీపేట : గ్రామాల్లో అష్టాచమ్మా ఆట ట్రేడ్మార్క్ గేమ్గా పేరుగాంచింది. ఈ ఆటను వేసవి సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం కోసం ఆడుతుంటారు.పల్లెలతోపాటు పట్టణాల్లోనూ చింతగింజలతో ఆడుతూ కనిపిస్తారు. అష్టా చమ్మాను కొన్ని ప్రాంతాల్లో చకార్ ఆటగా పిలుస్తారు. అష్టా చమ్మా ఆడే విధానం.. అష్టా చమ్మా ఆటను భూమిపై లేదా బండలపై చతురస్రాకారంలో 5 గడులు 25 వచ్చేలా గీయాలి. ఈ గీతల కోసం గ్రామాల్లో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ 25 గడుల్లో 9 గడులను సేఫ్టీ రూంలుగా (గదులుగా) భావిస్తూ వాటిలో గుణాకారం వచ్చే విధంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆట ఆడేందుకు విరగ్గొట్టిన నాలుగు చింత గింజలను (పాచికలుగా) ఆడేందుకు ఉపయోగిస్తారు. మొత్తం నలుగురు ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరు తమ ఆట వస్తువులుగా ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న, చిన్న రాళ్లు, చాక్లెట్లు, వేపగింజలు తదితరాలను తీసుకోవచ్చు. చింతగింజలు నలుపు రంగులో పడితే 8 గడులను దాటేందుకు అర్హత పొందినట్టు. అదే తెలుపు ఆకారంలో పడితే 4 గడులను దాటొచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ముందుకెళ్తారు. ఆడుతు వెళ్తున్న సమయంలో ఎదుటి వారి వస్తువు ఉన్న చోటా మనం ఆగేందుకు అవకాశం ఉంటే వారి వస్తువును తిరిగి వెనక్కి గడియలోకి పంపవచ్చు. ఆటలో గుణాకారపు ఆకారం గడిలో మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అది సేఫ్టీ జోన్గా భావిస్తారు. కాపాడే సేఫ్టీ జోన్.. అదే బయట ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉన్నట్టు చింత గింజల ద్వారా వేసే పాచికలు ఎక్కువ విలువ పడే విధంగా వేస్తూ త్వరత్వరగా ఆటలోని గడియ మధ్యలో ఉన్న సేఫ్టీజోన్లో చేరితే వారు గెలిచినట్టు లెక్క. ఇలా ఎవరైతే చివరగా సేఫ్టీ జోన్లో చేరుతారో వారు ఓడినట్లు ఇలా నలుగురు కూర్చోని ఆడే అష్టా చమ్మా ఆట టైంపాస్తోపాటు వినోదాన్ని ఇస్తుంది. నలుగురు ఆడే ఆట ఇది.. -
రైతు సంక్షేమమే ధ్యేయం
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ● రైతులకు స్ప్రే యంత్రాల పంపిణీగూడూరు: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. గూడూరులోని ప్రభుత్వ హైస్కూల్లో శుక్రవారం యూనియ న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా అందించిన 400 స్ప్రే పంపులను రైతులకు కలెక్టర్ స్నేహశబరీష్తో కలిసి హుస్సేన్నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల మచ్చర్లలో జన్మించిన తనకు ప్రధాని మోదీ ఢిల్లీలో స్థానం కల్పించి రైతులకు సేవచేసే అవకాశం ఇచ్చారన్నా రు. రైతులకు ఏదైనా సేవలందించాలన్న తపనతో, గుర్తుంచుకునేలా వ్యవసాయరంగానికి ఉపయోగపడే స్ప్రే పంపులను అందించాలని యూనియన్ బ్యాంకు వారిని కోరినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలుచేస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి విధానంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. అంతర పంటలుగా పామాయిల్, కూరగాయలు, వాణిజ్య పంటలు, మిల్టెట్స్ పంటల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై వివరించారు. అధికంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలను, నానో ఎరువుల వాడకంపై అవగాహన పెంచాలని డీఏఓకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలు, యూని యన్ బ్యాంక్ ఆఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, కమలాకర్, రమేష్, విజయ్కుమార్, గూ డూరు యూనియన్ బ్యాంకు మేనేజర్ రవికుమార్, డీఏఓ సరిత, తహసీల్దార్ నాగభవాని, ఏఓ అబ్దుల్మాలిక్, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి ఇనుగుర్తి: మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులకు సూచించారు. ఇనుగుర్తి మండలం చిన్య తండా సమీపంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్నలు, కొనుగోలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఎదురుచూస్తున్న రైతులో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూకాల్లో ఆలస్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకేండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్తో ఫోన్లో మాట్లాడి నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు దుంపల సందీప్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, నవీన్, సుందర్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కురవి: మండలంలోని ఎల్కచెట్టు తండా జీపీ పరిధిలోని మేఘ్యా తండాకు చెందిన రైతు బానోత్ మంగ్యా(70) అప్పులబాధతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ్యాకు సుమారు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల నుంచి పంటలసాగు, ఇంటి కోసం, గతంలో భార్యకు ప్రమాదం జరగడంతో చికిత్స కోసం అప్పు చేశాడు. చేసిన అప్పులు పంటమీద తీర్చే పరిస్థితి కనిపించడంలేదు. భూమి అమ్మినా తీరే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మంగ్యా గురువారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందినట్లు మంగ్యా కుమారుడు హతిరాం శుక్రవా రం తెలిపారు. మంగ్యాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై కురవి ఎస్సై సతీష్ను వివరణ కోరగా అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు హతిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’
హన్మకొండ : ఆకాశవాణి వరంగల్ కార్యక్రమాలు రైతులకు చేరువగా వెళ్లాయని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి కొనియాడారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాక్ థాన్ నిర్వహించారు. అందులో భాగంగా హనుమకొండ కేయూ క్రాస్లోని వరంగల్ ఆకాశవాణి ప్రాంగణం నుంచి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు, తిరిగి ఆకాశవాణి ప్రాంగణం వరకు వాక్ థాన్ సాగింది. డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్థాన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకాశవాణి అనేక కార్యక్రమాలను రైతులకు చేరువ చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఆకాశవాణి సేవలు అద్వితీయమన్నారు. వరంగల్ కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, స్థానికంగా ఉన్న ఎంతోమంది మేధావులు సైతం ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్, స్టేషన్ ఇన్చార్జ్ ఇల్లందుల రవికుమార్ మాట్లాడుతూ.. ఆకాశవాణి వాకథాన్ విజయవంతమైందని అన్నారు. జూన్ 8వ తేదీ వరకు ఇలాంటి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో శ్రోతలకి అందించనున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీఆర్ఓ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆకాశవాణితో తన చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది శ్రీనివాస్, శివ, నరేష్, విజయలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీనివాస చారి, ఉషశ్రీ, రామ్మూర్తి, రామ్మోహన్, అనిల్ ప్రసాద్తో పాటు వ్యాఖ్యాతలు, విశ్రాంత ఉద్యోగులు, శ్రోతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ స్థానం సహపరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి -
సమన్వయంతో పని చేయాలి
● డీసీఓ భారతి హోళీ కేరి మహబూబాబాద్: సెన్సెస్ –2027 నిర్వాహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి అన్నారు. సెన్సెస్పై సంబంధిత అధికారులతో శుక్రవారం హైదరాబాద్ నుంచి భారతి హోళీ కేరి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి హోళీ కేరి మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తలసేమియాపై అవగాహన కల్పించాలి నెహ్రూసెంటర్: తలసేమియా రక్త సంబంధిత వ్యాధి అని ముందస్తు పరీక్షలు, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలో 4,050 మంది గర్భిణులకు తలసేమియా పరీక్షలు నిర్వహించగా 114 మందికి తలసేమియా నిర్ధారణ జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రవణ్కుమార్, లక్ష్మీనారాయణ, విరాజిత, అనిత, డెమో ప్రసాద్, ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పురుషొత్తం అన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఐఈఓ సీహెచ్.మదార్గౌడ్, అధికారులు శ్రీరాములు, ఎస్సై పాల్గొన్నారు. రేపు జిల్లా రైల్వే ప్రాజెక్ట్ల ప్రారంభం కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. -
దాహం తీర్చండి..
మున్సిపాలిటీల్లో అరకొరగా తాగునీటి సరఫరాకాలనీల్లో నీటికి కటకట మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. భగీరథ పైపులైన్ లేని సుమారు 12 కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రెండు రోజులకోసారి అందిస్తున్నారు. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉద్యోగ, విద్యా, వ్యాపార పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది. 15,364 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులకు ప్రతీరోజు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మానుకోటలో సుమారు 12కాలనీలకు భగీరథ పైపు లైన్ నిర్మించకపోవడంతో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన 61 బావులు ఉండగా వాటిలో 28 బావులు వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా పంపిణీ చేసేందుకు ఈదులపూసపల్లి చెరువు నీటిని వినియోగించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం.. మిషన్ భగీరథ నీరు సరిపోను వస్తున్నాయి. సమస్య వచ్చినా ఎదుర్కొనేవిధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. పలు కాలనీల్లో సమస్య ఉంది. ట్యాంకర్లద్వారా సరఫరా చేస్తున్నారు. బోర్లు అన్ని మరమ్మతు చేయించాం. వేసవిలో నీటి సమస్య లేకుండా చూస్తాం. – రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్, మానుకోట దశాబ్దాలుగా నీటి సమస్య కాలనీకి పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం చేయలేదు. దాంతో కాలనీలో కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య తీరడంలేదు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్య పరిష్కరించాలి. – వడ్లకొండ పద్మ, ధర్మన్న కాలనీ నీటి సమస్య ఎక్కువగా ఉంది.. కాలనీల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. సమస్య ఉన్న కాలనీలకు రోజుకు రెండు సార్లు ట్యాంకర్లు పంపించాలి. శాశ్వతంగా నీటి సమస్య లేకుండా పరిష్కరించాలి. – జగంటి మమత, మానుకోట -
ఈత నేర్చుకునేందుకు వెళ్లి యువకుడి..
మహబూబాబాద్ రూరల్ : ఈత నేర్చుకునేందుకు వెళ్లి మున్నేరువాగులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది మహబూబాబాద్ రూరల్, టౌన్ ఇన్చార్జ్ సీఐ ఎన్.అంజలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బజార్ ప్రాంతంలో నివాసం ఉండే టేకురాల సాగర్, అనంత దంపతులకు ఇద్దరు కుమారులు అభిలాష్ (21), అంజి ఉన్నారు. తల్లి ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఈత నేర్చుకునేందుకు మిత్రుడు రంజిత్తో కలిసి మున్నేరువాగు వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న చెక్ డ్యాంపై నుంచి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోగా అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్ ఎస్సైలు రాంచరణ్, షాకీర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అనంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై రాంచరణ్ తెలిపారు. -
సెలవుల్లో యోగాపై ఆసక్తి..
బచ్చన్నపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా యోగా నేర్చుకుంటున్నారు. మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగా గురువు మల్లేశం రోజు విద్యార్థులకు యోగాను నేర్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల లను యోగా తరగతులకు పంపిస్తున్నారు.చిన్నారుల్లో భక్తిభావం..గోవిందరావుపేట : వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతుంటారు. కానీ మండలంలోని చల్వాయి గ్రామంలో చిన్నారులు హనుమాన్ మాలధరించి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, భక్తి, సంస్కారం అలవడితే భవిష్యత్లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి అలవాట్లు చిన్నారుల్లో పెంపొందుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫోన్లకు అలవాటు పడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారులను ఆధ్యాత్మిక వాతావరణంలో వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు మంచి మార్గం చూపిస్తున్నామని, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని, చిన్నప్పటి నుంచే భక్తి భావం అలవడితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
తాటి ముంజలకు ఫుల్ డిమాండ్
● కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న జనం ● డజన్ ముంజలు రూ.50 చొప్పున విక్రయిస్తున్న చిరువ్యాపారులు ● ఆరోగ్యానికి మేలుచేస్తాయని నమ్మకం మహబూబాబాద్: ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉపశమనం కోసం ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తూనే పుచ్చ, కర్భూజ, కీరదోస వంటి పండ్లను ఆరగిస్తున్నారు. ఇందులో భాగంగానే సీజనల్గా వచ్చే మంజులను తీనేందుకు సైతం జనాలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంలో జోరుగా విక్రయిస్తున్న ముంజలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వేసవి ఎండల నుంచి ఉపశమనంతోపాటు ఆరోగ్యానికి చలువ చేస్తుందనే నమ్మకంతో మంజలు కొనుగోలు చేస్తున్నారు. ఈక్రమంలో కురవి మండలం నేరడ గ్రామ శివారు రాయినిపట్నానికి చెందిన రాంబాబు డజన్ ముంజలు రూ.50 చొప్పున జిల్లా కేంద్రంలో రోజూ విక్రయిస్తున్నాడు. -
వడదెబ్బతో రైతు మృతి
స్టేషన్ఘన్పూర్ : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు గాండ్ల రవి (46) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి తనకున్న వ్యవసాయ భూమిలో పండించిన ధాన్యాన్ని ఇటీవల శివునిపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. శుక్రవారం భార్యతో కలిసి ధాన్యం తూర్పార పట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలో పనిచేసిన రైతు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన అతడి భార్య చుట్టుపక్కల వారి సాయంతో బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రవికి భార్య జ్యోతి, కుమార్తె రసజ్ఞ, కుమారుడు రాజేష్ ఉన్నారు. రైతు మృతిపట్ల శివునిపల్లి మున్నూరుకాపు సంఘం నాయకులు, రైతులు తోట వెంకటేశ్వర్లు, తోట భిక్షపతి, పోశాల క్రిష్ణమూర్తి, తోట సోమయ్య, గాండ్ల రాజు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
దేవుళ్లను విమర్శిస్తే భూస్థాపితమే..
● బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి ఖానాపురం : హిందూ దేవుళ్లను విమర్శిస్తే ఎవరైనా భూస్థాపితం కావాల్సిందేనని, హిందూ దేవుళ్లను విమర్శించిన మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, స్టాలిన్, మమతాబెనర్జీలు భూస్థాపితమయ్యారని బీజేపీ శాసనసభ పక్షనేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఖానాపురం మండలంలోని అశోక్నగర్లో కూల్చివేసిన శివాలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన నాటినుంచి 13 దేవాలయాలను కూల్చివేశారని పేర్కొన్నారు. చరిత్రను కాపాడుకోవడానికి ఇతర రాష్ట్రాలు నిధులు కేటాయిస్తే, తెలంగాణలో కూల్చడానికి నిధులు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు భూములపై ఉన్న పిచ్చితో దేవాలయ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. శివాలయం పునఃనిర్మాణం చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో చందాలు వేసుకోని నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మాగ్రహ దీక్షకు మద్దతు తెలిపి రాణాప్రతాప్రెడ్డి, నాయకులతో దీక్షను విరమింపజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, గోగుల రాణాప్రతాప్రెడ్డి, వడ్డేపల్లి నర్సింహారాములు, రాధారపు అశోక్, సందీప్, వినయ్, అంబేడ్కర్, అశోక్, రాజశేఖర్, సహదేవ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మూర్ఖుల పాలన తెలంగాణలో మూర్ఖుల పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అశోక్నగర్లో 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణమన్నారు. ‘ఎక్స్’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
యువత ఉన్నతస్థాయికి ఎదగాలి
హన్మకొండ అర్బన్ : యువత అవకాశాలను వినియోగించుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను శుక్రవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారందరికీ 72 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వరంగల్ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. రక్తదానం, అవయవదానం వంటి సామాజిక అంశాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంపొందించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో సుమారు 4 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కేవలం డిగ్రీలు సరిపోవని, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు అవసరమని యువతకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. 72 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. ఆన్లైన్ ద్వారా 2,600 మంది నమోదు చేసుకోగా, మొత్తం 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, అధికారులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మెగా జాబ్ మేళాలో 4 వేల మందికి ఉద్యోగావకాశాలు -
జిల్లాలో మున్సిపాలిటీల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వం తాగునీటి సరఫరాకు ఏర్పాటు చేసిన భగీరథ పైపులైన్లు చాలాచోట్ల పగిలి నీటిసరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో పలుచోట్ల రెండుమూడురోజులకోసారి ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటి స
తొర్రూరు: తొర్రూరు పట్టణ ప్రజలకు తాగునీరు సరిపడా అందడం లేదు. నాలుగైదు రోజులకోసారి వదలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి సరఫరా ఆందోళనకరంగా మారింది. గత నెల మొదటి వారంలో కనీసం మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేసేవారు. ఆ తర్వాత పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సమస్య, పైప్లైన్ లీకేజీలు, ధ్వంసం అంటూ మూడు నుంచి నాలుగు రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తప్పని నీటి కష్టాలు.. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. స్థానిక జనాభాకు తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు, ఇక్కడే ఉద్యోగం, విద్యాభ్యాసం రీత్యా ఉండేవారితో కలిపి పట్టణ జనాభా 35 వేలకు పైగా ఉంది. జనాభాలో ఒక్కొక్కరికీ సగటున రోజుకు 135 లీటర్ల నీరు అందించాలన్నది లక్ష్యం. ఈ మేరకు రోజుకు 4.72 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ 2 లక్షల లీటర్ల వరకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి అవసరాలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని నాగేశ్వరరావు కాలనీ, రిక్షా కాలనీ, దుబ్బతండా, ఎర్రసోమ్లాతండా తదితర ప్రాంతాల్లో నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ నీరు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బావుల దగ్గర నుండి, చేతిపంపుల ద్వారా నీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకుంటున్నాం మూడు రోజులకోమారు మిషన్ భగీరథ నీరు ఇస్తున్నారు. దీంతో నీరు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నాం. సమీపంలోని బాలవికాస సంస్థ చేతిపంపు నుండి నీరు తెచ్చుకుని వాడుకుంటున్నాం. నీటి కొరతతో పొదుపుగా నీరు వాడుకుంటున్నాం. అధికారులు ప్రతీరోజు నీరు సరఫరా చేస్తే అవసరాలు తీరుతాయి. – ఇరుగు చామంతి, రిక్షా కాలనీ, తొర్రూరు ●తొర్రూరులోని రిక్షా కాలనీలో చేతిపంపు ద్వారా నీటిని తీసుకెళ్తున్న మహిళలు -
‘అమృత్’ విషమవుతోంది!
● పగిలిన పైపులతో కలుషితమవుతున్న తాగునీరు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం చేపట్టిన అమృత్ జల్ పథకం పనులతో ప్రజలకు సక్రమంగా తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపల్ పరిధిలో అమృత్ పనుల కోసం తవ్వకాలు చేపట్టడంతో పలు వార్డుల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న పైపులు పగిలి రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచింది. కొన్ని వార్డుల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండగా కొన్ని వార్డుల్లో వారం రోజులకోసారి సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులు పగలడం, పైపుల్లో మట్టి కూరుకుపోయి సరఫరా నిలవడం, భగీరథ సరఫరా నిలిచిపోవడం, ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు నిత్యం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. 1వ వార్డులోని అంబేడ్కర్నగర్, రెండవ వార్డులోని న్యూ నెహ్రూ స్ట్రీట్, 12వ వార్డులోని యాదవనగర్, 9వ వార్డు పరిధిలోని పాతడోర్నకల్, 13వ వార్డులోని బొక్కలకొట్టు బజార్ తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భగీరథ నీటి సరఫరాతో సంబంధం లేకుండా పెద్ద చెరువులోని నాలుగు బోరుబావులు, కిరీటాపురం బావితోపాటు రెండు అద్దె బావుల ద్వారా ద్వారా రాజుతండా, ఎస్సీబీసీ కాలనీ, చర్చి కాంపౌండ్, బంకట్సింగ్తండా, లచ్చాతండా, రాజుతండా, పంపుబావితండా, సిగ్నల్తండా, సోమ్లాతండా తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మూడు నెలలుగా ఇబ్బందులు.. అంబేడ్కర్నగర్లోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలవడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. చేతిపంపుల ద్వారా నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బంది ఉంటుంది. నీటి ఇబ్బందులపై మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి. – మందా రవి, అంబేడ్కర్ నగర్, డోర్నకల్● -
ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం
హన్మకొండ అర్బన్ : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్యే నాగరాజు, సభ్య కార్యదర్శి పి.కాత్యాయనిదేవి, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు స్వీయ ఆదాయాన్ని పెంచుకుని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య, పచ్చదనం, పన్ను వసూళ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భద్రకాళిని దర్శించుకున్న నోడల్ అధికారి హన్మకొండ కల్చరల్ : వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కాత్యాయనిదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అధికారులు ఆలయాన్ని సందర్శించిన కాత్యాయనిదేవిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం అర్చకులు కాత్యాయనిదేవికి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
ఆపన్నహస్తం అందించరూ!
కాశిబుగ్గ/ఖిలావరంగల్: ఆర్థికంగా చితికిన కుటుంబం. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ సాధారణ జీవనం గడుపుతున్న దంపతులను కాన్సర్ మహమ్మారి పీడిస్తోంది. భార్యకు క్యాన్సర్ ఉందని ఆలస్యంగా తెలుసుకున్న భర్త ఆందోళనకు గురయ్యాడు. దీంతో భార్యను బతికించుకోవడానికి అనేక పాట్లు పడుతున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ ఉర్సు కరీమాబాద్కు చెందిన మధుసూదన్, మౌనిక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పడో ఆవరించిన క్యాన్సర్ మహమ్మారిని వారు గత ఫిబ్రవరిలో వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. దీంతో ఆందోళనకు గురైన దంపతులు వరంగల్, హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదించారు. ఆయా ఆస్పత్రుల్లో మౌనికకు చికిత్స చేయించినా వ్యాధి తీవ్రత చేయి దాటిపోయింది. దీంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్లోని ఓమెగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే మూడో స్టేజీకి చేరుకున్న క్యాన్సర్ను నయం చేయాలంటే లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఇద్దరు పిల్లల పోషణ, భార్య ఆరోగ్య పరిస్థితి మధుసూదన్కు తలకు మించిన ఆర్థిక భారంగా మారింది. వారికి ఎలాంటి ఆర్థిక ఆధారం లేకపోవడంతో దాతల సాయం ఎదురు చూస్తున్నాడు. భార్యను బతికించుకుని, పిల్లాపాపలతో గడపడానికి దాతలు ముందుకురావాలని మధుసూదన్ వేడుకోంటున్నాడు. 9398711733 నంబర్కు ఫోన్ పే గాని గూగుల్ పే గాని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
వడదెబ్బతో రైతు మృతి
మొగుళ్లపల్లి: వడదెబ్బతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు మోడే బాపురావు (64) మృతి చెందాడు. బాపురావు ఈనెల 1న తన మొక్కజొన్న చేనులో పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఎండతీవ్రతకు అస్వస్థకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని పోలీసులపై ఫిర్యాదు మల్హర్(కాటారం) : కాటారం పీఎస్లో దళిత యువకుడు రామిల్ల అంజిపై ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ విచారణ పేరుతో చేసిన విచక్షణారహితంగా దాడి చేశారని జాతీయ ఎస్సీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర డీజీపీకి నేరుగా ఫిర్యాదు చేసినట్ల బాధితుడి సోదరుడు రామిల్ల రాజాబాపు గురువారం తెలిపారు. తన సోదరుడు అంజిని ఈనెల 1 తేదీన రాత్రి ఓ కేసు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి బలవంతంగా కాళ్లు మొక్కించుకొని ఇంటికెళ్లాలని హింసించారని రాజాబాపు ఆరోపించారు. దెబ్బలతో అంజి నడవలేని స్థితిలో ఉండడంతో మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. వైద్యులు అంజి శరీరంపై చాలా చోట్ల లాఠీ దెబ్బలు ఉన్నాయని నిర్ధారించారన్నారు. దీంతో భూపాలపల్లి కలెక్టర్, ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో హెదరాబాద్లోని జాతీయ సంస్థలకు, రాష్ట్ర డీజీపీకి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినట్లు రాజాబాపు చెప్పారు. -
సోలార్ విద్యుత్.. ఆదాయానికి మార్గం
మహబూబాబాద్ రూరల్ : సోలార్ ద్వారా విద్యుత్ వినియోగంపై ప్రతీ ఒక్కరు దృష్టిసారిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మానుకోట రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు అంశంపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాన్స్ ఫార్మర్లు కాలకుండా, మోటార్లు పేలకుండా ఉంటున్నాయంటే రూ.1.35 లక్షల కోట్లు ఖర్చుపెడితేనే ఇంతగా కరెంటు సేవలు ఇవ్వగలుగుతున్నారన్నారు. పీఎం కుసుం ద్వారా రైతులకు సూర్య శక్తితో ఆదాయం సమకూరుతుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సౌర విద్యుత్ పై అపోహలు తొలగించి అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కొంతమంది ఏఈఓ రైతు వేదికల వద్ద రైతులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, ప్రజా పాలన రాష్ట్ర పరిశీలకుడు వెంకన్న, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయేందర్ రెడ్డి, డీఏఓ సరిత, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ, విద్యుత్ శాఖ డీఈలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవం -
పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వతేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి పరిశీలించారు. ముందుగా సరస్వతి ఘాట్లో పార్కింగ్ టైల్స్ పనులు, సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసే పగోడాలు, చలువ పందిళ్ల ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాలు, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు, మద్దులపల్లి, పూసుకుపల్లి, బలిజాపూర్, గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. మ్యూజియం పనులను పరిశీలించి, ఈ నెల 18వ తేదీ నాటికి విగ్రహాల ప్రతిష్ఠాపన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముహూర్తం ఖరారు.. ఈ నెల 21వ తేదీ ఉదయం 5:43 గంటలకు తమిళనాడుకు చెందిన కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించనున్నారు. అదేరోజు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా పుణ్యస్నానం ఆచరించనున్నారని తెలిపారు. గతంలో ఆది పుష్కరాల్లో స్నానం చేయని భక్తులు అంత్య పుష్కరాలకు పెద్దఎత్తున తరలొస్తారని ఆమె పేర్కొన్నారు. ఆలయంలో దర్శనం అనంతరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు.కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, ఈఓ మహేశ్, సర్పంచ్ మోహన్రెడ్డి, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, తదితరులు పాల్గొన్నారు. 21న ఉదయం 5:33 గంటలకు ముహూర్తం ఖరారు కంచి పీఠాధిపతితో పుష్కరాలు ప్రారంభం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ -
బాలల భవితకు రక్షణ
నైతిక విలువల్లో శిక్షణ.. న్యూశాయంపేట : పిల్లలు తమ మూలాలు మరిచి పోకుండా చిన్న వయస్సులోనే సరైన పునాది పడితే వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతా రు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాంత్రీక జీవనంలో నైతిక విలువల ప్రాధాన్యతను గుర్తించిన వరంగల్కు చెందిన ‘అహెలే హదీస్’ అనే స్వచ్ఛంద సంస్థ చిన్నారులకు ఆధునిక విద్యతోపాటు సంప్రదాయ విలువలు మేళవించి వారి ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకం చేయడానికి నడుం బిగించింది. మత సామరస్యం, మానవతా విలువల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చిన్నారులకు ధార్మిక కార్యక్రమాలపై అవగాహన, ఇస్లాం బోధనలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పది రోజుల పాటు వరంగల్ నర్సంపేట రోడ్లోని కార్యాలయంలో సమ్మర్ క్యాంపు నిర్వహించింది. దైనందిన జీవితంలో పాటించాల్సిన క్రమశిక్షణ, తదితర అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించింది. ఈ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. శిక్షణలో ప్రధానం అంశాలు.. చిన్నారులకు ఈ శిక్షణలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా నైతిక విలువలు బోధించారు. పెద్దలను గౌరవించడం, నిజాయితీ, సాటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండడం వంటి మౌలిక సూత్రాలపై శిక్షణ అందించారు. ఇవే కాకుండా ధార్మిక బోధనల్లో ఇస్లాం మూల సూత్రాలు, ఖురాన్ పఠనం, ప్రవక్త జీవన విధానం గురించి చిన్నారులకు అర్థమయ్యేలా వివరించారు. సాంకేతికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్లలకు మానసిక ప్రశాంతత ఇవ్వడమే లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహించారు. చిన్నారులకు ఆధునిక విద్యతోపాటు ధార్మిక కార్యక్రమాలపై అవగాహన ‘అహెలే హదీస్’ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు పిల్లల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకం ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు -
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు
● కలెక్టర్ స్నేహ శబరీష్తొర్రూరు: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని దుబ్బతండా సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్, రహదారులు, డ్రెయినేజీలు తదితర సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పైరవీకారులు, అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు లేదన్నారు. అర్హులకే ఇల్లు దక్కాలన్న ప్రభుత్వ ఆదేశానుసారం పకడ్బందీగా ఎంపిక విధానం చేపడుతామన్నారు. అనంతరం మండలంలోని వెలికట్ట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. కావాల్సిన గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌజింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పురుషోత్తం, సివిల్ సప్లయీస్ అధికారి రమేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకం మహబూబాబాద్: గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. తాగు నీరు, సానిటేషన్, జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు తదితర విషయాలపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంక్లను శుభ్రం చేయించి మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, అన్ని మండలాల ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి..?
కొత్తగూడ: వైద్యారోగ్యశాఖ అధికారుల వ్యవహార శైలి ‘పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట’ రాసినట్లు ఉందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీల్లో పని చేసే డాక్టర్లు సర్వీస్ కోటాలో ఉన్నత చదువులకు వెళ్లి సుమారు రెండు నెలలు కావస్తోంది. వారి స్థానంలో నూతన డాక్టర్లను నియమించాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ తతంగంపై ‘పీహెచ్సీలకు ఇన్చార్జిలే దిక్కు’ శీర్షికన ఇటీవల సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా కలెక్టర్ గంగారం పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేయగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఎంహెచ్ఓ రవి రాథోడ్ గంగారం పీహెచ్సీ తనిఖీ చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు పీహెచ్సీలకు ఒక్కరే డీడీఓ కొత్తగూడ పీహెచ్సీలో పని చేసే ఇద్దరు డాక్టర్లు బదిలీపై వెళ్లారు. డోర్నకల్ పీహెచ్సీలో ముగ్గురు ఉన్నారని వరుణ్తేజ్కు కొత్తగూడ పీహెచ్సీకి డిప్యుటేషన్ వేశారు. ఈయన సరిగా విధులకు హాజరు కాకపోవడం, గంగారం పీహెచ్సీ శ్రీకాంత్ అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో కోమట్లగూడెం పీహెచ్సీ వైద్యుడు సాయినాథ్కు మూడు పీహెచ్సీల బాధ్యతలు అప్పగించారు. తన సొంత పీహెచ్సీలో వైద్యసేవలు అందించలేక, డిప్యుటేషన్ డాక్టర్లతో పని చేయించలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యం అందడం కష్టంగా మారింది. వైద్యుల నియామకానికి నివేదిక పంపిస్తా.. ప్రభుత్వం వైద్యులను నియమించే వరకు తాత్కాలిక పద్ధతిన కొత్త డాక్టర్లను నియమించేందుకు కలెక్టర్ అనుమతి కోసం నివేదిక పంపిస్తా. అనుమతులు రాగానే ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీలకు డాక్టర్లను నియమించే విధంగా చర్యలు తీసుకుంటా. అప్పటి వరకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటా. – రవి రాథోడ్, డీఎంహెచ్ఓనిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు గంగారం: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. గంగారం పీహెచ్సీలో గురువారం ఆయన తనఖీచేసి నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో సమయపాలన పాటించాలని, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత పరిశుభ్రత వంటి అంశాల్లో అలసత్వం వహించొద్దని తెలిపారు. వైద్యులను నియమించకుండా షోకాజ్ నోటీసులు -
రామప్పలో హైకోర్టు జడ్జి పూజలు
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఖిలా వరంగల్: మక్కల కొనుగోళ్లల్లో ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న యార్డును నాయకులు గురువారం ఉదయం సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేతలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ మక్కలు అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ మాత్రం గడప కూడా దాటడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈనెల 11న ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలకు పార్టీ పిలుపునిచ్చిందని, రైతులు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, ఈసంపల్లి బాబు, కుమారస్వామి, మున్యాల సాయిలు, బోళ్ల సాంబయ్య, అరూరి కుమార్, రత్నమాల, బషీర్, దుర్గయ్య, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల మిగిలిన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియలో అన్ని సంఘాలకు ప్రాతినిథ్యం వహించాలని, విలీనం చేసే క్రమంలో 2025 పే స్కేల్ ప్రకటించాలని, కరువు భత్యాన్ని తగ్గించొద్దని, తార్నాక ఆస్పత్రిని కొనసాగించాలని, మరింత మెరుగైన వైద్యం కోరారు. ప్రజాతంత్ర హక్కు అయిన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్మికులే నిర్వహించుకుంటున్న కో–ఆపరేటివ్ సొసైటీని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్పామ్ సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
డీఎంను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
తొర్రూరు: తొర్రూరు ఆర్టీసీ డీఎంను దూషించిన ఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించా రు. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన సంతోష్ గురువారం వ్యక్తిగత పనిపై తొర్రూరు బస్టాండ్కు వచ్చి వరంగల్ వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడని తొర్రూరు డిపో మేనేజర్ పద్మావతికి ఫోన్ చేసి దుర్భాషలాడాడు. మహిళ అని చూడకుండా ఇష్టానురీతిన దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎం గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సై ఉపేందర్.. ప్రయాణికుడు సంతోష్కు ఫోన్ చేసి నీపై కేసు నమోదైందని తెలపగా అతడు ఎస్సైపై చిర్రుబుర్రులాడాడు. తనపైనే కేసు పెడతారా.. అంటూ ఊగిపోయిన సదరు వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్సై.. డీఎం దగ్గర రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైనట్లు సమాచారం. ఏసీబీకి పట్టుబడ్డాడంటూ ఎస్సైపై సోషల్ మీడియాలో వైరల్ డీఎంను దూషించిన వ్యక్తే నిందితుడిగా పోలీసుల గుర్తింపు -
నిమ్మకాయ @ రూ.10
మహబూబాబాద్: నిమ్మకాయల ధరలు విపరీతంగా పెగుతున్నాయి. జిల్లాలో నిమ్మతోటల సాగు లేకపోవడం, ప్రస్తుతం వేసవి తాపానికి, పెళ్లలో ఎక్కువగా నిమ్మకాయలను వినియోగించడంతో డిమాండ్ పెరిగింది. హోటళ్ల యాజమానులకు సైతం కాయల కొనుగోలు భారంగా మారింది. ఒక నిమ్మకాయకు సుమారు రూ.10వరకు ధర పలుకుతుంది. 200మంది నిమ్మకాయల వ్యాపారులు జిల్లాలో 18 మండలాల్లో సుమారు 200మంది నిమ్మకాయలు విక్రయిస్తున్నారు. చిన్నవి కేజీ రూ.220, పెద్దవి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. డోర్నకల్ మండలంలోని గోర్లచర్ల, అమ్మాపురం, బంజర, కురవి మండలంలోని సూదనపల్లితోపాటు పలు గ్రామాల్లో, మానుకోట మండలంలోని మల్యాల కేవీకేలో నిమ్మతోటలు ఉన్నా వాటి కాయలు అన్ సీజన్లో వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఏలూరు, సమీప జిల్లా అయిన ఖమ్మం నుంచి జిల్లాకు నిమ్మకాయలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన డిమాండ్..పెళ్లిల సీజన్ కావడం, బిర్యానీ వంటి ఆహారంలో నిమ్మకాయ, క్యారెట్, ఉల్లిగడ్డలు, కీర ఇతరత్రా వాటి ఏర్పాటు చేస్తారు. సోడా తయారీ, నిమ్మకాయ రసం, పలు జ్యూస్లో వాడకం వలన కూడా ధరలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు ఎక్కువగా నిమ్మరసంపై ఆసక్తి చూపుతుండడం కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇదిలా ఉండగా.. హోటళ్ల నిర్వాహకులు గ్యాస్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కింటుండగా.. నిమ్మకాయల ధరలు అదనపు భారంగా మారాయి. హోటళ్లకు భోజనం చేసేందుకు వచ్చే కస్టమర్లు నిమ్మకాయ ఉందా.. అని అడిగిన తర్వాతనే టోకెన్ తీసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి ఎండలతో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్ కేజీ రూ.240 జిల్లాలో లేని నిమ్మతోటల సాగు -
రైతు సంగ్రామ సభ విజయవంతం
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్: వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు విజయవంతమైందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. సభకు పోటీగా ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళా చేపట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా రైతులు హాజరు కాక మేళా వెల వెలబోయిందన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేశారన్నారు. రాజకీయాలు పక్కకు పెట్టి మేడిగడ్డ మరమ్మతు చేసి సాగు నీరు అందించాలన్నారు. భూ గర్భజలాలు అడుగంటాయని ఇదే పరిస్థితి నెలకొంటే తాగు నీటి సమస్య ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. నేటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. సభ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్తో సహ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే కల్లాల దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నారు. పదజాలం మార్చు కోకుంటే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. నాయకులు వెంకన్న, వెంకన్న, రఘు, అజయ్, అంజరీష్ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026
ఈ ఫొటోలోని రైతు తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి చెందిన దొనక ఉప్పలయ్య. తన పొలంలో పండిన 200 బస్తాల ధాన్యం 25రోజుల క్రితం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. పదిరోజుల తర్వాత కాంటాలు పెట్టారు. కాంటాలు పెట్టి 15రోజులు గడిచినా.. ధాన్యం తీసుకెళ్లడం లేదు. మిల్లర్లు దించుకోకపోవడంతో లారీలు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాంటాలు పెట్టిన ఐదారు రోజులకు మళ్లీ తూకం తగ్గుతుందని, తిరిగి కాంటాలు పెడితేనే ధాన్యం తీసుకెళ్తామని అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితిలో రోజూ గాలీ వానకు భయపడి బస్తాలు, టార్పాలిన్లు కప్పడం, కాపలా ఉండటంతో ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్. ఇతనికి ఐదు ఎకరాల్లో పండిన 20 పుట్ల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కొంతకాలం తేమశాతం ఎక్కువగా ఉందని ఆపారు. తేమశాతం వచ్చిన తర్వాత దొడ్డురకం మిల్లర్లు వద్దంటున్నారని లారీలు రావడం లేదని, ఇప్పటి వరకు ధాన్యం కాంటాలు పెట్టడం లేదు. ఇప్పటికే రెండుసార్లు వర్షానికి ధాన్యం తడిసింది. తొందరగా ధాన్యం కొనుగోలు చేస్తే బాధలు తీరుతాయని వాపోతున్నాడు. -
మాకొద్దు!
యాసంగి ధాన్యంధాన్యం దిగుమతికి మిల్లర్ల వెనకడుగుసాక్షి, మహబూబాబాద్ : వానాకాలం సీజన్లో పోటీ పడి ధాన్యం తీసుకున్న మిల్లర్లు యాసంగి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మొండికేస్తున్నారు. యాసంగిలో మొత్తం 2.60లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇందులో 1.70లక్షల మేరకు దొడ్డు రకాలే వచ్చే అవకావం ఉందని మిల్లర్లు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 26,569 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఇందులో 17వేల మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లర్లు తిగుమతి చేసుకున్నారు. మిగిలిన 9వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టి కల్లాల్లోనే ఉండిపోయింది. జిల్లాలో 55 రా రైస్ మిల్లులు, ఐదు పారా బాయిల్డ్ మిల్లులు ఉండగా.. ఇప్పటి వరకు 31 మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందులో మూడు పారాబాయిల్డ్, ఒక రారైస్ మిల్లు మినహా మిగిలిన మిల్లులు నామమాత్రంగా ధాన్యం దించుకున్నారు. మరో 28 రైస్ మిల్లు యజమానులు ఒక్క గింజ ధాన్యం కూడా దించుకోలేదు. మిల్లర్లకు అధికారుల హెచ్చరిక కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం వెనువెంటనే దిగుమతి చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న రైస్ మిల్లర్లతో జిల్లా అధికారులు సమీక్షలు నిర్వహించారు. జీఓ నంబర్ 25 ప్రకారం మిల్లు సామర్థ్యంలో 50శాతం ధాన్యం దించుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తప్పవని, మరోసారి ధాన్యం ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించినట్లు తెలిసింది. కాంటాలు పెట్టినా.. కల్లాల్లోనే ధాన్యం దిగుమతి కాకపోవడంతో వారాల తరబడి లారీలు అక్కడే.. కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్న రైతులుదిగుమతి వేగవంతంచేస్తాం..జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెబుతున్నాం. ధాన్యం దిగుమతి చేసుకోకుండా మొండికేసిన రైస్ మిల్లు యజమానులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకోవాలని చెప్పారు. దీంతో కొనుగోళ్లు, దిగుమతి ప్రక్రియ వేగవంతం అవుతుంది. – నర్సింహారావు, డీఎం, సివిల్ సప్లయీస్ -
అన్నింటికీ యంత్రాలే..
● వరంగల్ జిల్లాలో తగ్గుతున్న వ్యవసాయ కూలీలు ● ఉపాధి హామీ పథకమూ కారణమే.. ● ఖర్చు తగ్గుతుండడంతో రైతుల ఆసక్తి ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలతో పాటు అన్నింటికీ రైతులు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. కూలీలతో పోలిస్తే యంత్రాలకే ఖర్చు తగ్గుతుండడంతో రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు రోజురోజుకూ వ్యవసాయం చేసే వారితో పాటు రైతు కూలీలు కూడా తగ్గిపోతున్నారు. కౌలు వ్యవసాయం పెరగడంతో కూలీలే కౌలు రైతులుగా మారుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. వరంగల్ జిల్లాలో అన్ని పంటలు మిర్చి, పత్తి, ఇతర ఉద్యాన పంటలు కలిపి 2.88లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానమైన వరి 1.05 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. క్రమంగా అన్ని పంటల సాగుకు యంత్రాలు వచ్చి చేరుతున్నాయి. పెరిగిన కూలీల ఖర్చులకు తోడు.. ఉపాధి హామీ పనులతో జిల్లాలో కూలీలు దొరకటం కూడా కష్టమైపోయింది. కూలీల కొరతతో రైతులు యంత్రాల వైపునకు ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 6.50లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వరి నాట్ల దగ్గర నుంచి వరికోత, నూర్పిడి వరకు కూలీలతో చేయిస్తే ఎకరాకు రూ.17 వేల వరకు ఖర్చవుతుంది. అదే యంత్రాలతో చేస్తే రూ.12వేలలోపే పూర్తవుతుంది. పైగా పంట చేలల్లో కుప్పులుగా ఉంచి వాతావరణ పరిస్థితులపై బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పని కూడా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 860కి పైగా వరికోత యంత్రాలున్నాయి. జిల్లాలో అవసరాలకు తగినన్ని లేకపోవటంతో రైతులు బయటి నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా యంత్రాలను వాడుకుంటున్నారు. వేటిని వాడుతున్నారంటే.. వరినాట్లు, కోత యంత్రాలు, మొక్కజొన్న, జొన్న కోత యంత్రాలు, భూమిని సిద్ధం చేసే యంత్రాలను జిల్లా రైతాంగం ప్రస్తుతం వాడుతోంది. వ్యవసాయానికి అత్యంత అనుబంధం ఉన్న ట్రాక్టర్, తైవాన్ స్ప్రేయర్, ఇతర పనిముట్ల వంటి వాటికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండడంతో యాంత్రీకరణ కూడా అతి తక్కువ కాలంలోనే జరిగిపోతోంది. వరి కోత, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలయితే స్థానిక రైతులు కొనుగోలు చేసినవి చాలని పరిస్థితుల్లో.. ఇతర రాష్ట్రాల నుంచి అద్దెకు తెచ్చి కోతలు పూర్తి చేయించే వారూ పెరిగిపోయారు. పురుగు మందుల పిచికారీ వంటి వాటికి సంబంధించి తైవాన్ స్ప్రేయర్లను వాడుతున్నారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు
● 9 మందికి గాయాలు ● కొండపర్తి సమీపంలో ఘటనఎస్ఎస్తాడ్వాయి: ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు గురువారం తెల్లవారుజామున కొండపర్తి సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. కాగా, బస్సు ముందు భాగంలో అద్దాలు పగిలిపోయాయి. ఈఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తాడ్వాయి ఎస్సై జగదీశ్ తెలిపారు.సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్యతొర్రూరు రూరల్: కొత్త సెల్ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమటం సాయికుమార్(21) మద్యానికి బానిసై ఇటీవల తన సెల్ఫోన్ను కిందపడేసి పగులగొట్టుకున్నాడు. తనకు కొత్త సెల్ఫోన్ కొనివ్వాలని తల్లిండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 6న బుధవారం సాయంత్రం కూడా మద్యం సేవించి వచ్చి మరోసారి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తల్లి సాయమ్మ అన్నం పెడుదామని గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే తన పెద్ద కుమారుడి సాయంతో కిందికి దించి తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సోలార్ పథకాలను వినియోగించుకోవాలి
స్టేషన్ఘన్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆర్థిక భరోసా కోసం అందిస్తున్న సోలార్ విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ జి.అనిత అన్నారు. గురువారం విద్యుత్శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు సోలార్ విద్యుత్ వినియోగం, ప్రయోజనాలపై అవగాహన కల్పించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ వినియోగంతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమం కింద నిర్దేశించిన గ్రామాల్లోని ప్రతీ వ్యవసాయ పంపుసెట్కు 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేస్తారన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి రూఫ్పై సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుని నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ పొందొచ్చన్నారు. అనంతరం ఎన్పీపీడీసీఎల్ స్టేషన్ఘన్పూర్ డీఈ సారయ్య మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు రైతులు భద్రతాసూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవికాంత్, ట్రాన్స్కో ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈ శివకుమార్, సర్పంచ్లు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, పోలెపల్లి సంపత్రెడ్డి, మంతెన హరితాఇంద్రారెడ్డి, సోమేశ్వర్, యాదగిరి, లక్ష్మణ్, ఎంపీడీఓ విజయశ్రీ, ఏఓ చంద్రన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర డీడీ అనిత -
ప్లాస్టిక్పై యుద్ధం
నర్సంపేట: మంచి లక్ష్యంతో మన పూర్వీకులు చెప్పే మాటలు, సినిమాల్లో మనస్సుకు హత్తుకుపోయే మాటలు జీవితాంతం గుర్తుంటాయి. ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అంటూ అంకురం తెలుగు సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట లాగానే నర్సంపేట పట్టణంలో పర్యావరణ హితమే లక్ష్యంగా ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ముందుకు సాగుతోంది. 8 సంవత్సరాల క్రితం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రారంభించిన ప్రయత్నం ప్రస్తుతం వరంగల్, ములుగు జిల్లా వ్యాప్తంగా చైతన్యంలా ముందుకు సాగుతోంది. ప్లాస్టిక్ వద్దు.. పేపర్ ముద్దు అనే నినాదంతో చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సత్ఫలితాలనిస్తోంది. పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రజలు మూకుమ్మడిగా కదులుతున్నారు. ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎర్రబోయిన రాజశేఖర్, మరికొంత మంది ఇందులో పాల్గొంటున్నారు. శుభకార్యాల్లో స్టేజీపైనే అవగాహన.. నర్సంపేటలో ప్రారంభించిన ప్లాస్టిక్ రహిత ప్రచారంతో శుభకార్యాల్లో ప్లాస్టిక్కు బదులు స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగిస్తున్నారు. శుభకార్యాల్లో స్టేజీపై ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ బాధ్యులు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. జనవరిలో జరిగిన మేడారం జాతరలో కూడా ప్లాస్టిక్ వాడొద్దంటూ చేసిన ప్రచారం ఆకట్టుకుంది. అతి పలుచని కవర్లలో వేడి ఆహారం, టీలు, సాంబర్లు తీసుకుంటే వ్యాధులబారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. విస్తారాకు ప్లేట్లు, మాస్క్లు, చేతి సంచులు వాడాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను తెలుసుకుంటున్నారు. అందరూ సహకరించాలి.. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి. సింగిల్ యూజ్జ్ ప్లాస్టిక్తో ఆరోగ్య సమస్యలు వస్తాయి. 8 ఏళ్లుగా నాతో పాటు పలువురి సహకారంతో ప్లాస్టిక్పై యుద్ధం చేస్తున్నాం. అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిస్తాం. ఇందుకోసం ప్రజలు చేయూతనందించాలి. – ఎర్రబోయిన రాజశేఖర్, ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ -
ట్రాక్టర్ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి
చిట్యాల: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం .. మండలంలోని జడల్పేటకు చెందిన జినుకల శ్రీనివాస్ (55) అదే గ్రామానికి చెందిన మిన్నాపురం రమేశ్ పల్లిచేను పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం పక్క చేను వద్ద ఉన్న నైన్పాకకు చెందిన రైతు బికునూరి మొగిలితో మాట్లాడుతున్నాడు. అక్కడే ఓ బాలుడు ట్రాక్టర్తో పత్తి చెట్లు తొలగిస్తున్న క్రమంలో ఇద్దరిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మొగిలికి స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇందిరా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ట్రాక్టర్ అదుపు తప్పడంతో డ్రైవర్.. నర్సంపేట రూరల్ : ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వ లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం నర్సంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోతు వెంకటేశ్వర్లు (35) మక్కల లోడ్ తీసుకుని నర్సంపేట మండలం భానోజీపేట వద్ద అన్లోడ్ చేసి తిరిగి రాగంపేటకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి పట్టణంలోని నర్సంపేట –మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై ఉన్న పస్పూనూర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వెంకటేశ్వర్లు ఎగిరి పడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై గూడ అరుణ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నర్సక్కపల్లి శివారులో కారు అదుపు తప్పి యువకుడు.. నడికూడ : కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి శివారులో చోటుచేసుకుంది. పరకాల ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. దామెర మండలం పసరగొండకు చెందిన రాగుల రాజేశ్(23) హైదరాబాద్లో హెచ్ఎండీఏలో సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. కమలాపూర్లో బంధువుల పెళ్లి ఉండగా మంగళవారం స్వగ్రామం వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన సంకేళ్ల ప్రశాంత్ కారులో బుధవారం తన స్నేహితులు సంకేళ్ల చరణ్, చెక్క లక్ష్మణ్, మంద గణేశ్, తోట కార్తీక్తో కలిసి కమలాపూర్లో బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగొస్తున్న క్రమంలో నర్సక్కపల్లి శివారులో పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఎడమ వైపు ఉన్న కల్వర్టు పైనుంచి ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో గణేశ్ తన కుటుంబీకులు, 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వెంటనే ఘటానాస్థలికి చేరుకుని ఎంజీఎం తరలించారు. ఇందులో రాగుల రాజేశ్ మృతి చెందగా మిగతా వారు చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరొకరికి స్వల్ప గాయాలు నైన్పాక శివారులో ఘటన -
ప్రయాణికురాలికి హ్యాండ్ బ్యాగు అప్పగింత
ఖిలా వరంగల్: బీదర్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఏపీ గుడివాడకు చెందిన గెల్లి శ్రీదేవి హ్యాండ్ బ్యాగు గురువారం తెల్లవారుజామున వరంగల్ రైల్వేస్టేషన్ చింతలపల్లి స్టేషన్ల మధ్య కిందపడిపోయింది. ఈ క్రమంలో వరంగల్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేందర్ ఆదేశాల ప్రకారం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, కానిస్టేబుల్ నయీంపాషా, ఎస్కే పాషా రంగంలోకి దిగారు. రైలు పట్టాలపై పడిఉన్న రూ.30 వేల విలువైన సెల్ఫోను, రూ.10వేల నగదు గల హ్యాండ్ బ్యాగ్ను గుర్తించారు. అనంతరం బాధితురాలు శ్రీదేవికి జీఆర్పీ పోలీసులు గురువారం అందజేశారు. -
వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి
స్టేషన్ఘన్పూర్: భారీ వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లులో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్టేషన్ఘన్పూర్ ఎఫ్ఆర్ఓ చంద్రకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు అందించిన సమాచారంతో ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఒక మగ ఎలుగుబంటి మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. భారీ వాహనం ఢీకొనడంతో ఎలుగుబంటి పైదవడ, కింది దవడ, ముక్కు భాగానికి తీవ్రగాయంతో రక్తస్రావమై మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించినట్లు చెప్పారు. అనంతరం పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి సమీపంలోని తాటికొండ రిజర్వ్ ఫారెస్టుకు తరలించి పూడ్చిపెట్టినట్లు ఎఫ్ఆర్ఓ వెల్లడించారు. -
అక్షరమే ఆయుధంగా..
ప్రతీ వేసవిలో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్లతో సమాజమార్పునకు కృషి చేస్తున్న లీడ్ ఫౌండేషన్నర్సంపేట: పేదరికం అనే సమస్యను అధిగమించేందుకు శక్తివంతమైన సాధనం చదువు మాత్ర మేనని నమ్మి ‘పేదరికంపై యుద్ధానికి చదువే ఆ యుధం’ అనే నినాదంతో సమాజంలో మార్పు తీ సుకురావడానికి లీడ్ ఫౌండేషన్ ద్వారా రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.. ప్రభుత్వ ఉపాధ్యాయు డు కాసుల రవికుమార్, శోభారాణి దంపతులు. వేసవి సెలవుల్లో కలల నిర్మాణం వేసవి సెలవులంటే పిల్లలకు విశ్రాంతి సమయంగా భావిస్తారు. కానీ లీడ్ ఫౌండేషన్ దృష్టిలో ఇది వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్యాల అభివృద్ధికి అత్యంత విలువైన సమయం. అందుకే ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల్లో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తూ పిల్లల జీవితాలకు కొత్త దిశను చూపిస్తోంది ఈ ఫౌండేషన్. ఈ తరగతుల్లో కేవలం ఆంగ్ల అంశాల బోధనే కాకుండా, స్టోరీ టెల్లింగ్, చెస్, హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తున్నారు. గ్రామీణ గ్రంథాలయాలు దశాబ్ద కాలంగా లీడ్ ఫౌండేషన్ చేపట్టిన మరో కార్యక్రమం గ్రామీణ గ్రంథాలయాల ఏర్పాటు. పాఠశాలలు, గ్రామాల్లో గ్రంథాలయాలను స్థాపించి పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిచడమే లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై భయం పోగొట్టేందుకు లీడ్ ఫౌండేషన్ ప్రత్యేకంగా శిక్షణా విధానం రూపొందించింది. ఈ శిక్షణతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్నారు. పేద పిల్లలకు వరం.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఈ తరగతులు నిజంగా ఒక వరం. వారు కేవలం చదువుకోవడమే కాకుండా తమ జీవితాన్ని మార్చుకునే ందుకు ఈ ఫౌండేషన్ సహకరిస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా ‘కలలు కనే వారు మా త్రమే కాదు. ఆ కలలను సాధించడానికి కృషి చేసే వారే విజేతలు.’ ఈ భావాన్ని కార్యరూపంలో చూపిస్తూ లీడ్ ఫౌండేషన్ విద్యార్థులకు కలలు కనడం, వాటిని సాధించడం రెండింటినీ నేర్పిస్తుంది. రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు గ్రంథాలయాల ఏర్పాటుతో పఠనాసక్తి పెంపు -
గడ్డికట్టల మిషన్లో పడి రైతు మృతి
భీమదేవరపల్లి : వ్యవసాయ పనుల్లో అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరిగడ్డి కట్టలు కట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్లో చేయి ఇరుక్కుపోవడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రచ్చ సంపత్ (50) గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద బుధవారం ట్రాక్టర్ సాయంతో వరి గడ్డి కట్టలు కట్టే మిషన్ను సరిచేసేందుకు ప్రయత్నించాడు. గడ్డి కట్టే మిషన్లో అతని చేయి చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో భుజం వరకు చేయి తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమై సంపత్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రమ, పిల్లలు ఉన్నారు. సంపత్ భార్య రచ్చ రమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు(70) చేనేత వృత్తి చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో సదాశివుడు బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికీ ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సదాశివుని మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిరుపేద అయిన సదాశివుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్ను చూసే ందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతుబంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం. – ఎండీ, మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● కలెక్టర్ స్నేహశబరీష్మహబూబాబాద్ రూరల్ : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ మండలం అమనగల్, పర్వతగిరి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అకాల వర్షాలు పడే సూచన ఉన్నందున వ్యవసాయశాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని, గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తాగునీరు, టెంట్, కుర్చీలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ధాన్యం విషయంలో సమస్యలు ఉంటే వెంటనే 79950 50789 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. డీఆర్డీఓ మధుసూదన్రాజు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ రమేష్, సివిల్ సప్లయీస్ డీఎం నరసింహారావు, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సంబంధిత సిబ్బంది ఉన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి.. గంగారం: వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, మందుల స్టాక్, సిబ్బంది హాజరు, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ రమేష్, డీఎం సివిల్ సప్లయీస్ నర్సింహారావు, తహసీల్దార్ బాలకిషన్, ఎంపీడీఓ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ వదిలి పియానో వాయిస్తూ..
స్టేషన్ఘన్పూర్: ప్రస్తుతం పిల్లలకు వేసవికాలం సెలవులు రావడంతో ఇళ్లలో వారు చేసే అల్లరి అంతాఇంతా కాదు. రోజంతా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నారులకు సెల్ఫోన్లు, టీవీ లకు అతుక్కుపోతున్నారు. అయితే అందుకు భిన్నంగా హైదరా బాద్ నుంచి ఘన్పూర్లోని అమ్మమ్మ ఇంటి కి వచ్చిన చిన్నారి సింగం సరయు మాత్రం సెల్ఫోన్, టీవీకి దూరంగా పియానో నేర్చుకుంటూ వేసవిసెలవులను ఆస్వాదిస్తోంది. ఇప్పటికే పియానోలో బేసిక్స్ నేర్చుకున్న ఈ చిన్నారి అమ్మమ్మ గారి ఇంటిపక్కన స్నేహితులకు కూడా నేర్పిస్తూ సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. -
తెలుగు అకాడమీ చైర్మన్గా వెంకటనారాయణ
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్గా కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకటనారాయణను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. దీంతో కేయూ సైకాలజీ విభాగంలో వెంకటనారాయణను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, పూలే ఆశయ సాధనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ సన్మానించారు. శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య భిక్షాలు, విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ శాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిమెట్టుగా సమగ్ర పంటల మార్పిడి
కేయూ క్యాంపస్: రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెనుమార్పులు, సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. తొలిమెట్టుగా సమగ్ర పంటల మార్పిడి తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల మైదానంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా రెండోరోజు బుధవారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కమిషన్గా తాము కేరళ, మహారాష్ట్ర, మన రాష్ట్రంలోని పలు జిల్లాలు తిరిగి సమగ్రమైన పంటల మార్పిడి విధానాన్ని రూపొందించి ఆ నివేదికను ఈనెల 5న సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రికి ఇచ్చామని వెల్ల డించారు. అందులో తాము పరిశీలించిన అనేక అంశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఆకుకూరలు, పూలు పండించే రైతాంగానికి అనేక ఇబ్బందులున్నాయని, కోతుల బెడద వల్ల చాలోచోట్ల రైతులు భూములను బీడు పెట్టారన్నారు. దీనిపై కమిషన్ చాలామందిని సంప్రదించాక చిన్న, సన్నకారురైతులకు ఫెన్సింగ్ సబ్సిడి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టామని తెలిపారు. దీనివల్ల ఉద్యావన పంటల విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దళారుల దోపిడీ నుంచి బయటపడాలంటే రైతులు సంఘటితంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయిల్ ఫెయిడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయపద్ధతులను రైతులకు పరిచయం చేయడానికి మెగా రైతుమేళా వేదికగా నిలిచిందన్నారు. రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, ఇబ్బందులను అధిగమించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ మెగా రైతుమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా, గురువారం ఈ మేళా ముగియనుంది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
స్థాయికి మించి వైద్యంచేస్తే కఠిన చర్యలు
దంతాలపల్లి: గ్రామాల్లో ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. ఇటీవల వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన నేపథ్యంలో మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వెంకటేశ్వర మెడికల్ హాల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పరిమితి మేరకే వైద్యం చేయాలన్నారు. ఇష్టం వచ్చినట్లు వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. బాలుడి మృతిపై కమిటీ వేసి పూర్తి నివేదికను అందజేయాలని మండల వైద్యాధికారి కవితను ఆదేశించారు. సూపర్వైజర్ కవిత తదితరులు పాల్గొన్నారు. విద్యుత్శాఖ రైతు వారోత్సవాలునెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ విజేందర్రెడ్డి బుధవారం తెలిపారు. అందులో భాగంగా నేడు వ్యవసాయ కేంద్రాలు–సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుము) అంశంపై రైతు వేదికల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. రైతులకు సౌర విద్యుత్ అధారిత సాగు విధానాలు, విద్యుత్ భద్రతలపై అవగాహన కల్పిండచం ముఖ్య ఉద్దేశమన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు పాల్గొని రైతులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు. డీజీపీని కలిసిన ఎంపీమహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ.ఆనంద్ను మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి బొకే అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలినర్సింహులపేట: పోలీస్స్టేషన్లో ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పరికరాలు, రికార్డులను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. కేసుల నమోదు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై బానోతు వెంకన్న ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఐదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పదో తరగతి పాసైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త రత్నకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జిల్లాలోని విద్యార్థులకు సమీపంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయాలని, కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, జాగ్రఫి కోర్సు ల గ్రూపులు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని ఆర్సీఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
సరస్వతీ నది పుష్కరాల్లో తెప్పోత్సవం
● పన్నెండు రోజులు నిర్వహణకు ఏర్పాట్లు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతీనది అంత్య పుష్కరాల్లో 12 రోజులపాటు తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కార్తీకపౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం గోదావరిలో తెప్పోత్సవాన్ని కనులపండువగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో పుష్కరాల సమయంలో త్రివేణి సంగమంలో తెప్పోత్సవంలో ఉత్సవమూర్తులను ఆసీనులు చేసి విశేష పూజలతో ప్రతీ రోజు విహరించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిసింది. అదే సమయంలో కాశీపండితులతో 12 రోజులపాటు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రెండు కార్యక్రమాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా దేవాదాయ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్, పోలీసుశాఖలు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతకు ముందుగా ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, వేదపండితులు కేటీఆర్ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్కు వేదపండితులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం కేటీఆర్ నేరుగా వరంగల్ హంటర్ రోడ్డులోని రైతు సభకు వెళ్లారు. ఆయన వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వొడితల సతీష్, మాజీ ఎంపీ మాలోతు కవిత ఉన్నారు. -
అమ్మమ్మ చెప్పిన కథ
చిలుక –జింక స్నేహం ఒక అడవిలో స్నేహితులైన చిలుక, జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు. ఆహారం కోసం వెళ్తున్న జింక ఆ వలలో చిక్కుకుంది. జింకను భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయల్దేరాడు. ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది. వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బతగిలి ఎగరలేకపోతున్న దానిలా చిలుక నటించింది. చిలుకను చూసిన వేటగాడు భుజాన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్లాడు. అప్పటికే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్క ఉదటున పారిపోయింది. వేటగాడు పట్టుకొనే లోపు చిలుక సైతం రివ్వున ఎగిరిపోయింది. దీంతో నిరాశతో ఆ వేటగాడు ఇంటిబాటపట్టాడు. – ఆత్మకూరు నీతి: నిజమైన స్నేహితులు ఆపద సమయంలో ఒకరికొకరు అండగా ఉండాలి – ఫౌజియా 8వ తరగతి ,స్పెక్ట్రా హైస్కూల్, ఆత్మకూరుఫౌజియా -
బంగారు పతకాల ‘అర్షియా తబస్సుం’
హన్మకొండ కల్చరల్: క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది అర్షియా తబస్సుం. చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ మెడిసిన్లో సీటు వచ్చే అవకాశం లభించినా వదులుకుని వ్యవసాయ రంగంపై మక్కువతో వరంగల్లోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో పట్టాపొందారు. విశ్వవిద్యాలయం పరిధిలో మొదటిర్యాంకు సాధించి ఇప్పటి వరకు ఆరు బంగారు పతకాలను అందుకున్న అర్షియా తబస్సుం యువతకు స్ఫూర్తిదాయకం. వ్యవసాయశాఖలో కొలువు.. హనుమకొండకు చెందిన అర్షియా తబస్సుం తల్లి రెహనా బాను సీనియర్ అసిస్టెంట్గా పంచాయితీరాజ్శాఖ హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగి. తండ్రి అసద్ అలీఖాన్ వ్యాపారి, సోదరుడు అమేర్ అలీఖాన్ గ్రూప్–4 నుంచి జూనియర్ అసిస్టెంట్గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో విధులు నిర్వహిస్తున్నారు. అర్షియా చిన్ననాటి నుంచి పండ్లు, కూరగాయలు, ధాన్యాలపై ఆసక్తిగా కుటుంబసభ్యులతో చర్చించేది. ఆ విధంగా పంటలు, రైతుల గురించి తెలుసుకున్న అర్షియా వ్యవసాయ విద్యను అభ్యసించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ విద్య పూర్తిచేసి 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే వ్యవసాయశాఖ క్రిమిసంహారక విభాగంలో వ్యవసాయాధికారిగా ఉద్యోగం సాధించారు. ఆరు బంగారు పతకాలు ఆమె సొంతం పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్ బైపీసీలో 977 మార్కులు, 2018 ఎంసెట్లో 405వ ర్యాంకు సాధించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో చేరి విశ్వవిద్యాలయ పరిధిలో మొదటి ర్యాంకు ( 9.3 సీజీపీఏ) సాధించారు. మొత్తంగా ఆరు బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ప్లాంట్ పాథాలజీలో అత్యధిక గ్రేడ్ పొందినందుకు శ్రీరాజారామ్ వెంగల్ దాస్ స్మారక బంగారు పతకం, జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో అత్యధిక జీపీఏ పొందినందుకు పల్లి వాణి అండ్ చంద్రశేఖర్రావు గోల్డ్ మెడల్, రాజేంద్రనగర్ అగ్రి–హార్టీ బ్యాచ్లో బంగారు పతకం, రాజేంద్రగనర్ అగ్రికస్ బ్యాచ్ నుంచి వ్యవసాయశాస్త్రంలో గోల్ట్మెడల్, గత సంవత్సరం 2025 అగష్టు 2న హైదారాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 55వ స్నాతకోత్సవంలో అప్పటి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నాలుగు బంగారు పతకాలు అందుకున్నారు. వరంగల్ అగ్రికల్చర్ కళాశాలలో అత్యధిక జీపీఏ సాధించినందుకు అవినాష్ వనం గోల్ట్ మెడల్, గ్రోమోర్ గోల్డ్ మెడల్లను 2026 ఫిబ్రవరిలో జరిగిన కళాశాల పదో వార్షికోత్సవంలో డీఏఏ అనురాధ, కళాశాల డీన్ రవీంద్రనాయక్ చేతుల మీదుగా అందుకున్నారు. బీఎస్సీ డిగ్రీ అనంతరం హైదారాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(నిఫ్మ్)లో శిక్షణ పొందారు. టీజీపీఎస్సీ అగ్రికల్చర్ ఎగ్జామ్లో 21వ ర్యాంకు సాధించి 2024లో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండల వ్యవసాయ అధికారిగా చేరారు. ప్రస్తుతం వరంగల్లోని క్రిమిసంహారక ప్రయోగశాలలో ఏఓగా పనిచేస్తున్నారు. రసాయన క్రిమిసంహారకాల వినియోగంలో పర్యావరణానికి కలిగే నష్టాలు, మనుషులకు వచ్చే అనారోగ్యాల గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో తయారయ్యే క్రిమిసంహారకాల తయారీ, వినియోగం గురించి రైతన్నలను చైతన్యపరుస్తున్నారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం సంతృప్తిగానే ఉన్నా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో పట్టుదలతో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నట్లు చెబుతున్నారు.. అర్షియా తబస్సుం. తొలి ప్రయత్నంలోనే వ్యవసాయ శాఖలో ఉద్యోగం ఆరు బంగారు పతకాలు ఆమె సొంతం -
భలే ఐడియా..
సోరకాయతో పక్షి గూడు పరకాల: ఎండలతోపాటు గాలిదుమారాలతో పక్షుల గూళ్లు కిందపడి పక్షులు అయోమయానికి గురవుతున్నాయి. ఇది చూసి చలించిపోయిన పరకాల పట్టణానికి చెందిన 2వ తరగతి విద్యార్థిని అభిజ్ఞ తమ ఇంటిఆవరణలో కాసిన గుండ్రటి సోరకాయలతో పక్షి గూడులను తయారు చేసింది. సోరకాయలోని గుజ్జు, గింజలను తొలగించి లోపల ఖాళీ చేసింది. కాయ బయట పచ్చని రంగులు వేసి ప్రకృతిలో ఆ కాయను మమేకం చేసింది. ఆ సోరకాయ పక్షిగూడును ఇంటి సమీపంలోని చెట్టుపై కట్టింది. అదిచూసిన పక్షులు ఆ గూడులో సేదదీరుతుంటే చిన్నారి మురిసిపోతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన పెద్దనాన్న శ్రీనివాస్ సూచనలతో ఖాళీ కూల్డ్రింక్ బాటిళ్లతో పక్షుల కోసం నీటి తొట్టెలు తయారుచేసి అందరిచేత ఔరా అనిపించుకుంటుంది. -
ఉత్తమ సేవలతో ఆదరాభిమానాలు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవలతో ప్రజల ఆదరాభిమానాలు పొందుతారని జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి క్రాంతికుమార్ సూర్యాపేట జిల్లా కోర్టుకు బదిలీఅయ్యారు. ఈ సందర్భంగా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేయగా జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ మాట్లాడారు. జిల్లా కోర్టులో మూడున్నర సంవత్సరాలపాటు ఏఓ క్రాంతికుమార్ విధినిర్వహణలో అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ అందరికి సహకారం అందించారని కొనియాడారు. సీనియర్ సివిల్ జడ్జి శాలినిశాకెల్లి, జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ జడ్జి కృష్ణతేజ్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనిత, ఉపాధ్యక్షుడు స్వరూపరాణి, అసోసియేట్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీశ్రీనివాస్, కోశాధికారి వీరునాయక్ పాల్గొన్నారు. -
డీడబ్ల్యూఓ శాఖలో కొనసాగిన ఏసీబీ తనిఖీలు
కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లా సంక్షేమ శాఖలో బుధవారం రెండో రోజూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. డీడబ్ల్యూఓ రాజమణి ఇంటికెళ్లి తనిఖీ చేశారు. మధ్యాహ్నం వరకు తనిఖీలు చేసి రాజమణితోపాటు సీనియర్ అసిస్టెంట్ కుమార్ను ఏసీబీ కార్యాలయానికి పిలుపించుకొని కావాల్సిన ఫైళ్లకు సంబంధించిన జిరాక్స్ కాపీలను తీసుకున్నట్లు సమాచారం. వివిధ పథకాల అమలుకు సంబంధించి అధికారుల పనితీరుపై ఆరా తీసినట్లు తెలిసింది. 2023 నుంచి సుమారు రూ.కోటి 16 లక్షల నిధులను ఖర్చు చేయడంలో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు సమాచారం. బేటీ బచావో –బేటీ పడావో స్కీమ్ అమలు కోసం 2023–24 సంవత్సరానికి రూ.30 లక్షలు, 2024– 25 సంవత్సరానికి రూ.30 లక్షల నిధులు మంజూరు కాగా నిధులను నామమాత్రంగా ఖర్చుపెట్టినట్లు రికార్డులను గుర్తించారని తెలిసింది. ఈఆర్ఎస్ స్కీమ్(వికలాంగులు, ట్రాన్జెండర్స్ రుణాల మంజూరీ) విషయంలో దరఖాస్తులకే పరిమితం చేసి లబ్ధిదారుల ఎంపిక, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయకపోవడంతో నిధులు నిల్వ ఉన్నట్లు తెలిసింది. డ్రక్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా రూ.లక్ష 50వేలు పెండింగ్లోనే ఉంచినట్లు సమాచారం. 2016 సంవత్సరం నుంచి దాల్ టెండర్ల ఈఎండీల (కాంట్రాక్టర్ డిపాజిట్) చెల్లింపు జరగలేదని, డే కేర్ సెంటర్ నిర్వహణకు నిధులు కేటాయిస్తే ఇప్పటి వరకు డే కేర్ సెంటర్ ప్రారంభించలేదని తేలింది. ఉద్యోగ నియామకాలు, ఔట్ స్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికలో కూడా ఏకపక్షంగా డీడబ్ల్యూఓ నిర్ణయం తీసుకొని అప్పగించారని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ పనుల విషయంలో థర్ట్పార్టీ కాంట్రాక్టర్కు కట్టబెట్టగా ఒక్క వర్కునే మూడు దిక్కుల చేసినట్లు ఒక్క ఫొటోనే పెట్టి బిల్లుల తీసుకునే ప్రయత్నం చేసినట్లు తేలింది. ఈ విషయంలో డీడబ్ల్యూఓ సంబంధిత కాంట్రాక్టర్తో ఆర్థిక పరమైన బేరాలు, సంబంధిత కాంట్రాక్టర్లతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుకున్నట్లు తెలిసింది. రూ.కోటి 16 లక్షల నిల్వ నిధుల గుర్తింపు -
‘గాలి’కొదిలారు..
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేసిన ప్లాంట్ ఆ తర్వాత వినియోగం లేకపోవడంతో మూలనపడింది. పీఎం కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు.. పీఎం కేర్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్ను వినియోగించకపోవడంతో మిషన్లు తుప్పు పడుతున్నాయి. 330 పడకలుగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతీరోజు సుమారు వెయ్యికిపైగా రోగులు వస్తుంటారు. దీంతో ఎమర్జెన్సీ సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అవసరమవుతున్నాయి. కాగా, ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు. కొనుగోలు చేసి.. ఆక్సిజన్ ప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి రోగుల చికిత్స నిమిత్తం వినియోగిస్తున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి యంత్రాలు అమర్చారు. ప్లాంట్ వినియోగించకపోవడంతో యంత్రాలు, పరికరాలు పాడవుతాయి. కాగా, ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వినియోగంలో లేకపోవడంతో.. జిల్లా ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారడంతో ఆవరణలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరుగుతోంది. కాగా, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు వస్తారా లేక ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్ కరోనా తర్వాత నిర్వహణ బంద్ బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు గడ్డి, పిచ్చిమొక్కలతో ప్లాంట్ ఆవరణ -
స్వీయ గణనకు స్పందన
మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వీయగణనతో సమయం ఆదా అవుతోంది. జిల్లాలో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో స్వీయ గణనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే స్వీయ గణన చేసి మ్యాపింగ్కు వచ్చే సరికి వేరే జిల్లాగా నమోదు కావడంతో.. జిల్లా ఆ సంఖ్యను కోల్పోవాల్సి వస్తోంది. అధికారుల శ్రమ వృథా అవుతోంది. 7,74,549 మంది జనాభా జిల్లాలో 2011లెక్కల ప్రకారం 7,74,549 మంది జనాభా, 1,95,889 గృహాలు ఉన్నాయి. వాస్తవానికి 2021లో జనగణన చేయాలి. కానీ కోవిడ్, పలు ఇతర కారణాల వల్ల గణన ఆలస్యమైంది. 2026 గణన ప్రక్రియ చేపట్టారు. ఈమేరకు జిల్లాలో 26 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణాంకాలు కీలకం. అందుకు జన గణనకు కసరత్తు చేపట్టింది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ పూర్తి.. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు మొత్తం 1,673 మంది ఉండగా.. అదనంగా పదిశాతంతో కలిపితే 1,702 మంది ఉన్నారు. వారంతా ఉపాధ్యాయులే. కాగా 26మంది మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇచ్చారు. గత నెల 18నుంచి ఈనెల 5వ తేదీ వరకు శిక్షణ పూర్తి చేశారు. ముందుగా స్వీయ గణనతో ప్రారంభమైంది. కలెక్టర్ స్నేహ శబరీష్ శ్రద్ధ పెట్టి స్వీయగణనపై విలేకరుల సమావేశం నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత నెల 26 నుంచి.. గత నెల 26 నుంచి స్వీయ గణన కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, అన్నిశాఖల ప్రభుత్వ అధి కారులు, ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉపాధ్యాయ, ఇతర యూనియన్లకు అవగాహన కల్పించారు. ప్రముఖల ఇంటికి వెళ్లి వారితోనే సీపీఓ అధికారులు స్వీయ గణన చేయిస్తున్నారు. ఈనెల 10తో స్వీయ గణన పూర్తి అవుతుంది. మంచి స్పందన.. స్వీయ గణనను మొబైల్ ఫోన్లో ప్రత్యేక యాప్లో 33 కాలమ్లలో వివరాలు నమోదు చేయాలి. కేవలం ప్రాథమిక సమాచారం కోసం స్వీయ గణన చేపట్టారు. కాగా, ఈనెల 4వ తేదీ వరకు 3,238 కుటుంబాలు స్వీయగణన చేసుకున్నాయి. టెక్నికల్ సమస్యతో.. వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి ఎక్కువ మంది అధికారులు మానుకోట జిల్లాలో పనిచేస్తున్నారు. కాగా జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో సీపీఓ అధికారులు స్వీయగణన చేయించినప్పటికీ టెక్నికల్ సమస్యతో వివరాలు వేరే జిల్లాల్లో నమోదు అయ్యాయి. మ్యాపింగ్ వచ్చే సరికి వేరే జిల్లాలో నమోదు అయ్యాయి. దీంతో అధికారుల శ్రమ వృథా అవుతోంది. 2027లో జనగణన.. స్వీయగణన ఇంటింటి సర్వే పూర్తి అయిన తర్వాత 2027 ఫిబ్రవరి, మార్చిలో జనగణన చేపడుతారు. ఆ ఏడాది మే నెలలో జనాభా లెక్క తెలుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుంది. దీనిపైనే పథకాల అమలు, ఇతర అన్ని ఆధారపడి ఉంటాయి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేయనున్నారు. స్వీయ గణనకు సహకరించాలి స్వీయ గణనకు ప్రజలు సహకరించాలి. దీంతో సమయం ఆదా అవుతుంది. ఎన్యుమరేటర్లకు సులువుగా ఉంటుంది. వివరాలు అన్ని సక్రమంగా తెలియజేయాలి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేస్తారు. ప్రభుత్వ పథకాల అమలుకు గణన కీలకం కానుంది. – వల్లూరి శ్రీనివాసరావు, సీపీఓ కార్యక్రమంపై విస్తృత ప్రచారం స్వీయగణనతో సమయం ఆదా ఈనెల 10తో ముగియనున్న ప్రక్రియ నేటి వరకు 3,238 కుటుంబాలు పూర్తి ఈనెల 11 నుంచి ఇంటింటి సర్వే.. ఎన్యుమరేటర్లు ఈనెల 11నుంచి జూన్ 9వరకు ఇంటింటి సర్వే చేస్తారు. ఈనెల 11,12,13 తేదీల్లో ఇంటి నంబర్లు వేసుకుంటారు. ఈ సర్వేలో కేవలం కుటుంబ యాజమాని పేరు, ఇల్లు, మరుగుదొడ్డి ఇతర వివరాలతో 33 కాలమ్లు ఉంటాయి. ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. ఇళ్ల సర్వే మాత్రమే పూర్తి చేయనున్నారు. -
మోదీ సభను విజయవంతం చేయాలి
● ఎంపీ రఘునందన్రావు మహబూబాబాద్ అర్బన్: హైదరాబాద్లో ఈ నెల 10న జరగనున్న ప్రధాని మోదీ మహాసభను విజయవంతం చేయాలని ఎంపీ రఘునందన్రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానుకోట రాళ్ల సాక్షిగా కాకతీయుల సామ్రాజ్యంపై రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. దేశం, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది బీజేపీ ప్రభుత్వమైతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుపై ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని, పైసల మంత్రి కమీషన్ మంత్రిగా మారుతున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షు డు కల్యాణ్నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గడ్డం అశోక్, చీకటి మహేష్, మదన్లాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్సందర్ శర్మ, వద్దిరాజు రామచందర్రావు, కొమురయ్య, సుధీర్రెడ్డి, హిందు భారతి, నర్సింహరెడ్డి, శ్రీదేవిబాలు, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో స దస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ బంక్కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్ మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
టీచర్ గురునాథరావు మాకు స్ఫూర్తి
కరాటేతో ఆత్మరక్షణ.. మహబూబాబాద్ రూరల్ : మా పాఠశాల ఉపాధ్యాయుడు వి.గురునాథరావు మాకు స్ఫూర్తి. ఆయన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా మా ఆలోచనలను వెలికితీసే మార్గదర్శి కూడా. ప్రతీ విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి కొత్త ఆలో చనలు కలిగేలా చేస్తారు. సార్ బోధించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రయోగాలు, ప్రాజెక్టులు, చర్చలు ద్వారా ఆ శాస్త్రంపై మాకు ఆసక్తి పెంచుతారు. ఆయన మార్గదర్శకంలో మేము ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, బయోడైవర్సిటీ కార్యక్రమాలు, యంగ్ ఇండియా ఇన్నోవేటర్స్ వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సార్ ఎప్పుడూ మీరు రేపటి శాస్త్రవేత్తలు అని చెబుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు. దీని వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. –సాయిలేఖ్య, అంజలి కంబాలపల్లి, జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు కాజీపేట: కరాటేతో ఆత్మరక్షణతోపాటు మానసికోల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుంది. ఈ నేపథ్యంలో మడికొండ గ్రామానికి చెందిన మాస్టర్ కొలిపాక కుమారస్వామి.. పాత శివరామకృష్ణ పాఠశాల ఆవరణలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ క్రీడలో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటే, కుంగ్ ఫూ మాస్టర్ల పర్యవేక్షణలో వారంలో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.జఫర్గఢ్: మండలంలోని తిమ్మంపేటకు చెందిన విద్యార్థిని ఇల్లందుల సమ్మిళిత పలు రకాల బొమ్మలు అద్భుతంగా గీస్తూ తన ప్రతిభను చాటుతోంది. హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సమ్మిళితకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. ఇటీవల పాఠశాలలకు సెలవులు రావడంతో ఇంటి వద్దే ఉంటున్న సమ్మిళిత ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తోంది. జాతీయ నాయకులతోపాటు ప్రకృతి, దేశ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించి పలు చిత్రాలు గీస్తోంది. వేసవి సెలవులను వృథా చేయకుండా ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సమ్మిళిత గీసిన బొమ్మలు అమ్మమ్మ చెప్పినకథ నక్క–డేగ● జె.సహస్ర, 7వ తరగతి, ఫాతిమా హైస్కూల్, కడిపికొండ హయ్. నా పేరు సహస్ర. నేను కడిపికొండలోని ఫాతి మా హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నా. సమ్మర్ హాలీడేస్కు మా అమ్మమ్మ ఊరికి వెళ్లా. అక్కడ మా అమ్మమ్మ మంచి కథలు చెప్పింది. ఇందులో అపాయంలో ఉపాయంతో బయటపడాలనే నీతి కథ నాకు బాగా నచ్చింది. అడవిలో ఓ నక్క ఓ చెట్టు కింద తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. అదే అడవిలో ఆ చెట్టుపై డేగ గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు పిల్లలు పుట్టిన తర్వాత వాటి ఆహారం కోసం వెదకసాగింది. ఇంతలో డేగకు నక్క పిల్లలు కనిపించాయి. తన పిల్లలకు ఆహారంగా నక్క పిల్లలను తీసుకెళ్లి తన గూడులో పెట్టింది. నక్క వచ్చి తన పిల్లలను తనకు ఇవ్వాలని డేగను అడగగా నేను ఇవ్వనని, నీ పిల్లలు నా పిల్లలకు ఆహారంగా మారుతారని అని చెప్పింది. దీంతో నక్కకు ఒక ఆలోచన వచ్చింది. సమయ స్ఫూర్తితో అపాయంలో ఉపాయం ఆలోచించింది. ఒక కొరివితో డేగను నా పిల్లలను నువ్వు ఇవ్వకపోతే నీ పిల్లలను కొరివికి ఆహుతి చేస్తానని బెదిరించింది. దీంతో గత్యంతరం లేక డేగ.. నక్క పిల్లలను ఇచ్చేసింది.– కాజీపేట అర్బన్కరాటేతో ఽధైర్యం వచ్చింది.. కరాటే మెళకువలతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఏర్పడింది. మానసికోల్లాసం కలుగుతోంది. ఈ క్రీడ ఆడపిల్ల లకు అవసరం. మాస్టర్లు నేర్పిన అంశాలను ప్రాక్టీస్ చేస్తున్నాం. –దివ్య, కాజీపేట ఉత్సాహం చూపుతున్నారు.. కరాటే నేర్చుకోవడానికి బాలబాలికలు ఉత్సాహం చూపుతున్నారు. వ్యాయామంతోపాటు కరాటేలోని టెక్నిక్ నేర్చుకుంటున్నారు. వారిపై దాడులు జరిగే క్రమంలో తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశంపై ఎక్కువగా దృష్టి సారించాం. –కొలిపాక కుమారస్వామి, కరాటే మాస్టర్నీతి : ఆపద సమయంలో ఆవేశపడకూడదు. నెమ్మదిగా ఆలోచించి అపాయం నుంచి బయటపడాలికోటగుళ్ల వద్ద కమలాపూర్ పీఎంశ్రీ ఎంజేపీ విద్యార్థులు–స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్మేము చూశాం.. మీరూ చూడండికమలాపూర్: భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఉ న్న కోటగుళ్లను మేము చూశాం.. మీరు చూడండి అంటున్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ పీ ఎంశ్రీ ఎంజేపీ విద్యార్థులు. ఈ మేరకు ఆ విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి గత మార్చిలో కోటగుళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా తమ అనుభూతిని పంచుకున్నారు. ‘కాకతీయుల కాలంలో వివిధ పరిమాణాల్లో నిర్మించిన 22 గుడుల స మూహాన్ని కోటగుళ్లు అంటారు. శిల్పకళా వైభవా నికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ కోటగుళ్లను తప్ప క చూడాల్సిందే’ అని వారు పేర్కొంటున్నారు. వేసవిలో పిల్లలకు ఉచిత శిక్షణ వారంలో మూడురోజుల పాటు నిర్వహణ -
రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు..
● అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ తొర్రూరు: ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు రైతులను మోసగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ స్పష్టం చేశారు. డివిజన్ కేంద్రంలోని విజయలక్ష్మీ రైస్ మిల్లును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. మ్యాచర్ పేరుతో 17 శాతం కంటే ఎక్కువగా 19, 20 శాతం వస్తుందని రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. లారీల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా నిలిపివేయవద్దన్నారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి రమేష్, మేనేజర్ నరసింహరావు, డీఎం వెంకటేశ్వర్లు, డీటీ నర్సయ్య, ఆర్ఐ నజీముద్దీన్, మిల్లు నిర్వాహకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి పెద్దవంగర/దంతాలపల్లి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని, ఇందుకోసం లారీలు, హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం పెద్దవంగర, దంతాలపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు రమేష్, మేనేజర్ నరసింహరావులతో కలిసి అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ మార్పుల కారణంగా టార్పాలిన్లు, గన్నీ సంచులు, క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైన సమస్యలు, అవకతవకలు జరిగితే కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, హెల్ప్లైన్ నంబర్ 79950 507 89కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, ఆర్ఐ లష్కర్, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని, సీఎం రేవంత్కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
‘ఆయిల్ పామ్’తో రైతులకు భరోసా
● ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి బచ్చన్నపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు భరోసా కలుగుతుందని ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో రైతుకు 30 ఏళ్ల భరోసా కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, భవిష్యత్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తే జనగామ జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టుకుందామని, అందుకు గానూ సిద్దెంకిలో దాదాపు 55 ఎకరాల భూమిని కూడా సేకరించామన్నారు. గోదావరి జలాలను తీసుకురావడానికి మన ప్రాంతంలో కాల్వలు తవ్వించి సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. అందుకే మన ప్రాంతంలో వరి పుష్కలంగా సాగువుతోందన్నారు. అనంతరం ఆయిల్పామ్ మొక్కలను పరిశీలించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్లు బనుక శివరాజ్యాదవ్, నల్ల నాగుల శ్వేతవెంకటాచారి, కిసాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, ఆయిల్ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ దయాకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఇజ్జగిరి రాములు, ఎండీ. ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో మహిళలే అధికం!
సాక్షి, మహబూబాబాద్: వలసలను నివారించి ఉన్న ఊరిలోనే పని కల్పించాలనే లక్ష్యంతో చట్టం చేసిన ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు. గిరిజన గూడాలు, లంబాడ తండాలు, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో పురుషులకు దీటుగా మహిళలు పనిచేస్తున్నారనడానికి ఉపాధి పనుల్లో ఆమె చేసిన పనుల సంఖ్య నిదర్శనంగా ఉంది. 1.19 లక్షల మంది మహిళా కూలీలు జిల్లాలో 2.15 లక్షల జాబ్ కార్డులు, 4.55 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు పేరు నమోదు చేసుకున్న కూలీలు ఉన్నారు. ఇందులో 1.42 లక్షల జాబ్కార్డులకు సంబంధించిన 2,23,241 లక్షల మంది కూలీలు పనిచేసేవారు ఉన్నారు. ఇందులో 1,03,678 మంది పురుషులు ఉండగా, 1,19,563 మంది మహిళా కూలీలు ఉన్నారు. మొత్తంగా పురుషులకన్నా 15,885 మంది మహిళలు ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారు. భర్త వ్యవసాయం, భార్య ఉపాధి పని.. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్. ఇందులో గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు ఎక్కువ. అందులో ఎకరం, రెండు ఎకరాల వంటి చిన్న కమతాల్లో వ్యవసాయం చేసుకునే కుటుంబాలే అధిక సంఖ్యలో ఉంటారు. ఏప్రిల్, మే నెలల్లో సీ్త్ర, పురుషులు సమానంగా ఉపాఽధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. ఇక జూన్ నుంచి సగం మంది పురుషులు తమ సొంత వ్యవసాయ పనులు చేసుకుంటారు. వ్యవసాయ కూలీలు కూడా అరక దున్నడం, దుగాలు పెట్టడం, మందు కొట్టడం మొదలైన పనులకు వెళ్తే రోజుకు రూ.1,000 మేరకు వస్తాయి. ఇదే ఉపాధి పనికి పోతే నాలుగు గంటలే పని చేయాల్సి వస్తుంది. ఎక్కువలో ఎక్కువ రోజుకు రూ.300 మాత్రమే కూలి వస్తుంది. దీంతో పనులు దొరకక పోతే కానీ పురుషులు ఉపాధి పనికి వెళ్లరు. అందరితో కలిసి 4 గంటలు.. వేరే పనులకు వెళ్తే పొద్దస్తమానం పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఉపాధి పనులకు వెళ్తే 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వేసవిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనిచేస్తే ఆరోజు కూలి పడుతుంది. దీంతో ఉదయం పూట పనిచేసుకొని వస్తే ఇంటి వద్దనే ఉండవచ్చనే ఆలోచనతో స్త్రీ, పురుషులు తేడా లేకుండా ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. వందరోజులు పని పూర్తి చేసిన కూలీల జాబితాలో 80శాతం మంది మహిళా కూలీలే ఉండటం గమనార్హం. ●ఎండాకాలంలో ఉపాధి పనికి వెళ్తాంఉపాధి పనులు ఎప్పుడు పెట్టినా కూలీకి వెళ్తా. మాకున్న కొద్దిపాటి భూమిలో అన్నిరోజులు అక్కడ పని దొరకదు. అందుకోసమే ఎండాకాలం అంతా ఉపాధి పనికి వెళ్తాం. మిగిలిన రోజుల్లో మా సొంత వ్యవసాయ పనులు చేసుకుంటాం. ఏడాదికి రూ. 20 వేలకుపైగా కూలి డబ్బులు వస్తాయి. – భూక్య బుజ్జి, అయోధ్య కుటుంబానికి ఆసరాగా ఉంటుందికూలీ చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. ప్రతీ నెల ఇంట్లో ఖర్చులు, మహిళా సంఘం చీటీ డబ్బులు కట్టాలి. ప్రతీరోజు వ్యవసాయ పనులు దొరకవు. దుగాలు పెట్టడం, దుక్కి దున్నే పనులకు మగవారినే పిలుస్తారు. వ్యవసాయ పనులు దొరకనప్పుడు ఉపాధి పనికి వెళ్తాం. ఈ డబ్బులు కుటుంబ ఖర్చులకు ఆసరాగా అవుతున్నాయి. – ఆవుల రాజేశ్వరీ, బయ్యారంపురుషులకన్నా ఎక్కువ పనిరోజులు వారివే! వ్యవసాయ సీజన్లో మహిళా కూలీలే అధికం సంవత్సరానికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం -
స్వీయగణన బాధ్యతగా భావించాలి
మహబూబాబాద్: స్వీయగణన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్, అదనపు జనాభా గణన అధికారి కె.అనిల్కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖల అధికారులు, సిబ్బంది స్వీయగణనలో మంగళవారం వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది స్వీయగణన పూర్తి చేశారన్నారు. ప్రజలు కూడా స్వీయగణన, జనభాగణన విషయంలో పూర్తిగా సహకరించాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి మహబూబాబాద్ రూరల్ : బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాపుల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జ్యూయలరీ షాప్ దోపిడీని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ పట్టణంలోని బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాప్ యజమానులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్చార్జ్ సీఐ ఎన్. అంజలీ మాట్లాడుతూ బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాపుల యజమానులు వ్యాపార సముదాయల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలన్నారు. ముఖ్యంగా అన్ని గోల్డ్ లోన్ ఫైనాన్స్ ఆఫీసుల్లో, స్ట్రాంగ్ రూముల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సెక్యూరిటీ అలారాలు, మోషన్ సెన్సార్లు, సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బంగారం తాకట్టు పెట్టే ముందు కస్టమర్ వివరాలను, వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బంగారు కొనుగోలు బిల్లులను తనిఖీ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారాన్ని సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్సైలు రాంచరణ్, షాకీర్, బ్యాంకు, ఫైనాన్స్ మేనేజర్లు, జ్యూయలరీ షాప్ యజమానులు పాల్గొన్నారు. డీఆర్ఓగా జుబేదున్సీసా బేగంమహబూబాబాద్: జిల్లా రెవెన్యూ అఽధికారి (డీఆర్ఓ)గా జుబేదున్సీసా బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది అదనపు కలెక్టర్లను, డీఆర్ఓలను, ఆర్డీలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మైనార్టీశాఖలో విధులు నిర్వహిస్తున్న జుబేదున్సీసా బేగంను మానుకోట జిల్లా డీఆర్ఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు మేళాకు తరలిన రైతులుమహబూబాబాద్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణ జరిగే రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా 2026 కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుంచి రైతులు మంగళవారం తరలివెళ్లారు. ప్రత్యేక బస్సుల ద్వారా వ్యవసాయ అధికారులు రైతు మేళాకు తీసుకెళ్లారు. పీఏసీఎస్లకు పర్సనల్ ఇన్చార్జ్లుహసన్పర్తి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు పర్సనల్ ఇన్చార్జ్లను నియమిస్తూ రాష్ట్ర సహకారశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది కొనసాగిన మేనేజింగ్ కమిటీలను పర్సనల్ ఇన్చార్జీలుగా కొనసాగించాలని హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. తుదిపరి ఆదేశాలు వచ్చేవరకు పర్సనల్ ఇన్చార్జ్లు కొనసాగుతారని పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 94 సొసైటీలకు గతేడాది వరకు చైర్మన్లుగా వ్యవహరించిన వారే పర్సనల్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం కొన్ని సంఘాలకు బాధ్యతలు చేపట్టారు. అన్ని విధులు నిర్వహించడానికి, సంఘాల ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలూ ఈ కమిటీలు తీసుకోవచ్చని సహకారశాఖ పేర్కొంది. -
ఘనంగా సంకటహర చతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. సాయంత్రం సంకటచతుర్ధిని పురస్కరించుకుని ఆలయంలోని కాకతీయుల కాలం నాటి ఉత్తిష్ట గణపతికి ఓం గం గణపతియేనమః అంటూ గణపతి సూక్త మూలమంత్ర పఠనంతో పంచసూక్తులతో జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. జిల్లేడు పూల దండలతో అలంకరించి గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచారపూజలు నిర్వహించారు. మహాహారతి మంత్రపుష్పం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
సీడ్ ప్లాంటర్, మేజ్ కలెక్టర్..
హన్మకొండ: రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించడానికి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రభుత్వం మూడురోజుల పాటు రాష్ట్ర మెగా రైతు మేళా నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక శాఖ, సాంకేతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో యంత్రాలతోపాటు, నూతన వంగడాలు, డ్రో న్ల ద్వారా మందుల పిచికారీ, పశు సంపద పెంపు, సూక్ష సేద్యంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులు, నానో ఎరువుల వినియోగం వంటి స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు ఇందులోకి వెళ్లి తమకు కావాల్సిన వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకుని అవగాహన పెంచుకున్నారు. సీడ్ ప్లాంటర్.. మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసే సీడ్ ప్లాంటర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఆయా పంటల విత్తనాలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. దీని విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని కంపెనీ బాధ్యులు తెలిపారు. దీని వల్ల శ్రమ, కూలీల కొరత తగ్గుతుంది. విత్తనాలు క్రమ పద్ధతిలో వేసుకోవచ్చు, ఎంత దూరం.. ఎంత లోతులో విత్తుకునే విధంగా అమర్చుకునే వెసులుబాటు ఉంది. మేజ్ కలెక్టర్.. మొక్కజొన్న పంట కోసేందుకు యంత్రం అందుబాటులోకి వచ్చింది. ట్రాక్టర్ సాయంతో ఇది పని చేస్తుంది. 40 నిమిషాల్లో ఎకరం పంట కోయొచ్చు. ఈ మేజ్ కలెక్టర్ విలువ రూ.9 లక్షలు. దీనిని ట్రాక్టర్ అమర్చుకోవడం ద్వారా పని చేస్తుంది. ఏ ట్రాక్టర్కై నా దీనిని అమర్చవచ్చు. కూలీల కొరత బాధ తప్పుతుంది. ఖర్చులు తగ్గుతాయి. సోలార్ విద్యుత్ మోటారు.. సౌరశక్తి ద్వారా నడిచే విద్యుత్ మోటారు అందుబాటులోకి వచ్చింది. బావుల వద్ద సౌర ఫలకలు అమర్చి ఈ మోటారును నడుపుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం రెడ్కో ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ మోటార్ల కోసం సౌర ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 7.5 కిల వాట్ల సౌర ఫలకలు అమర్చుతారు. దీని కోసం ప్రభుత్వం రూ.4.90 లక్షలు ఖర్చు చేస్తుంది. అవగాహన కోసం మేళాలో సోలార్ మోటారును మేళాలో ఏర్పాటు చేశామని రెడ్కో హనుమకొండ జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తెలిపారు. సోలనైడ్వాల్వ్.. రోజురోజకూ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. నూతన సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోలనైడ్ వాల్వ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు విద్యుత్ మోటార్లు ఆటో స్టాటర్ల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా విద్యుత్ మోటారు ఆన్, ఆఫ్ చేసే విధానం చూశాం. ఇప్పుడు పైపు లైన్లకు బిగించే వాల్వ్లను సెల్ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. పైపులైన్లో బిగించే సోలనైడ్ వాల్వ్ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రత్యేక యాప్ ద్వారా ఆపరేట్ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. ఎటు వైపు నీరు వెళ్లాలని భావిస్తే ఆటు వైపు మళ్లించేలా వాల్వ్ ఆన్, ఆఫ్ చేయొచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ రాయితీ అందుతోంది. త్వరలో తెలంగాణలో అందించేందుకు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్నాయి. ఆకట్టుకుంటున్న పుంగనూరు జాతి పశువులు.. మెగా రైతు మేళాలో ప్రదర్శనకు తీసుకొచ్చి న పుంగనూరు జాతి పశువులు రైతులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం 2 నుంచి 3 అడుగులు ఎత్తు ఉండే అత్యంత పొట్టి, అరుదైన, ప్రసిద్ధిగాంచిన దేశవాళి జాతి ఈ పుంగనూరు పశువులు. వీటిని అలంకార ప్రాయంగా పెంచుకుంటారు. ఇంటి అలంకరణకు, గోపూజకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. తక్కువ మేత అవసరం. వీటి మార్కెట్ విలువ రూ.3 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఆరు నెలల దూడకు రూ.1.50 లక్షల వరకు ఉంటుందని పశు వైద్యులు తెలిపారు. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
డీడబ్ల్యూఓ ఆఫీస్లో ఏసీబీ తనిఖీ
కాళోజీ సెంటర్ : మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ వరంగల్ జిల్లా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు ఆఫీస్లోకి ప్రవేశించి ఫైళ్లు తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గతంలో జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన ఘటనలు ఉన్నాయి. ‘కొత్త మిషన్ శక్తి’ పథకం కింద డిస్ట్రిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల విషయంపై చర్చ జరిగింది. ఈ విషయాలపై ‘అకడమిక్ మార్కులున్నా అంతే, సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో గందరగోళం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురించరితమైంది. ఇవే కాకుండా తాజాగా అంగన్వాడీ కేంద్రాలకు పప్పు సరఫరా చేసే టెండర్ విషయంలో డీడబ్ల్యూఓ ఏకపక్షంగా తనకు నచ్చిన వ్యక్తికి కట్టబెట్టి తర్వాత రద్దు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఏసీబీ అధికారుల తనిఖీతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను వివరణ కోరగా కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు అంశంపై ఫైళ్లు తనిఖీ చేస్తున్నామని చెప్పారు.● అనుమానమున్న ఫైళ్లు తీసుకెళ్లిన అధికారులు -
రైతు డిక్లరేషన్ను తుంగలో తొక్కిన కాంగ్రెస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని, రైతుల విషయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు.. 420 హా మీలను గాలికి వదిలివేసిందని వారు ఆరోపించారు. హ నుమకొండ హంటర్రోడ్డులో రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవారం పార్టీ హనుమకొండ జిల్లా అ ధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు, ప్ర జాప్రతినిధులు మాట్లాడారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగగా మారిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దండగగా మారిందని అన్నారు. రాష్ట్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతోందని, రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళా ఏర్పాటు చేశారని, తమ సదస్సుకు అనేక అవరోధాలు అడ్డంకులు సృష్టించారన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ రైతుల గోసను రైతు సంగ్రామ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు రుణమాఫీకి రూ.36వేల కోట్లు అవసరమైతే రూ.18వేల కోట్లు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. కేసీఆర్ రైతుబంధు వరినాట్ల ముందు ఇచ్చారని, ఇప్పుడు అతీగతీ లేదని, మొక్కజొన్న పంట కొనుగోళ్లు చేపట్టడం లేదని, దమ్ముంటే వరంగల్ మార్కెట్కు రండి అని సవాల్ విసిరారు. దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా సదస్సు పెడుతుంటే పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాడిందని, ప్రజాపాలన పేరిట ప్రజా కంఠక పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు లేవన్న ఆయన రైతుల కోసమే రైతు సంగ్రామ నిర్వహిస్తున్నామని, దీనికి కేటీఆర్ హాజరవుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మా ట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు జరిగి న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అనంతరం రైతు సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రమేశ్, నరేందర్, రాజయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, వాసుదేవ రెడ్డి, హరిరమాదేవి, సాంబారి సమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్మీట్లో బీఆర్ఎస్ నేతలు -
ప్రాణం తీసిన రూ.8వేలు
మరిపెడ: తండ్రీకొడుకుల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవలో కొడుకు తండ్రిపై చే యిచేసుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరిపెడ మున్సిపాలిటీలో మంగళవా రం రాత్రి చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలి పిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీకి చెందిన మౌర్య టీల్సింగ్(85) కుమారు డు నిరంజన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మరిపెడకు వచ్చిన నిరంజన్ తనకు ఇవ్వాల్సిన రూ.8వేలు ఇవ్వాలని తండ్రి టీల్సింగ్ను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తండ్రిపై కొడుకు చేయిచేసుకోవడంతో టీల్సింగ్ కుప్పకూలిపోయాడు. వెంటనే తండ్రిని తన కారులో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కొడుకు చేయిచేసుకోవడంతో మృతి చెందిన తండ్రిటీల్సింగ్ (ఫైల్) -
శంకర్గౌడ్ కుటుంబానికి పరామర్శ
● పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్ నర్సంపేట: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. ముత్తోజిపేటలోని శంకర్గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్.. పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో కార్మికుల సమస్యలను కేబినెట్లో చర్చించి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటకు వచ్చి ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేశారన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని 12 పోలీస్స్టేషన్లకు తిప్పి చివరికి ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లి నిర్బంధించారని పేర్కొన్నారు. శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆయన కుటుంబానికి ఇచ్చిందని ఆరోపించారు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. -
పంట మార్పిడితో లాభాలు
డోర్నకల్: పంట మార్పిడి, సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతో లాభాలు గడించవచ్చని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని చి లుకోడు రైతువేదికలో సోమవారం రైతు వారోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. మందుల పిచికారీ విధానం, ఆధునిక వ్యసాయ పరికరాల పనితీరు, నానో యూరియా వాడకం తదితరాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూసార పరీక్షల ధ్రువీకరణ పత్రాలను రైతులకు పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల్లో మితిమీరిన రసాయన ఎరువులతో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న పంట సాగుతో అధిక దిగుబడులు రావడంతో పంటల నిల్వ కష్టమవుతోందన్నారు. రైతులు ఆయిల్పామ్, పప్పు దినుసుల పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ సరిత, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డి, ఏఓ పవన్కమార్, సర్పంచ్ రాయల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ రమణబోయిన రాజు ఏఈఓ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి ● మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మహబూబాబాద్: అకాల వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ తదితర విషయాలపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్ష సూచన ఉన్నప్పుడు ముందుగానే రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోలును విజయవంతం చేయాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం మంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకీ(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, అనిపెద్ది రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
గన్నీ సంచులు అందించలేని ప్రభుత్వం
నెల్లికుదురు: రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే ప్రభుత్వం కనీసం గన్నీ సంచులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కాచికల్ క్రాస్రోడ్ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై రామన్నగూడెం సొసైటీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరతతో కాంటాలు నిర్వహించడం లేదని, గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈక్రమంలో తొర్రూరు నుంచి మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల్లో సరిపోను హమాలీలు, గన్నీ సంచులు లేక కాంటాలు జరగడం లేదని మండిపడ్డారు. త్వరితగతిన కాంటాలు నిర్వహించి కొనుగోళ్లు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు, రైతులు పులి రామచంద్రు, వెన్నాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజావాణితో సమస్యల పరిష్కారం
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ ● తొలిరోజు 20 అర్జీల స్వీకరణతొర్రూరు: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ సంకల్ప మని తొర్రూరు ఆర్డీఓ జి. గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి కార్యక్రమానికి స్థానికుల నుంచి 20 దరఖాస్తులు అందాయి. దానిలో 15 భూ సంబంధిత, 5 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, న ర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు ఆర్డీఓకు అందించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ...ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు, విద్యుత్ శాఖ డీఈ రవి, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, సీడీపీఓ కమలాదేవి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి: కొరిపెల్లి గ్రామస్తులు పెద్దవంగర మండలం కొరిపెల్లి గ్రామంలో ఉపాధిహామీ పథకంలో ఈ ఏడాది జనవరిలో మట్టి రోడ్డు పనులు చేపట్టారు. సదరు పనుల నిమిత్తం 220 ట్రిప్పుల మట్టి తరలించగా, 700 ట్రిప్పులు తరలించినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఉపాధిహామీ పనిలోనే కూలీలతో చేయించగా కాంట్రాక్టర్ చేసినట్లుగా పేర్కొంటూ రూ.3.26 లక్షల ఖర్చు చూపించి అనివీతికి పాల్పడినట్లు కొరిపెల్లి గ్రామస్తులు ప్రజావాణిలో ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని మండల స్థాయి అధికారులకు ఆర్డీఓ తెలిపారు. పింఛన్ అందడం లేదని.. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృదుడు కొమ్ము వెంకట్రాములు వేలిముద్రలు పడక మూడు మాసాలుగా పింఛన్ అందడం లేదని ఆర్డీఓకు మొరపెట్టుకున్నాడు. పింఛన్ అందక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు వృద్ధుడు తెలిపాడు. తన సమస్యపై గతంలో పంచాయతీ కార్యదర్శికి, గ్రామ పాలకులకు బాధితుడు తెలిపాడు. పరిష్కారం కాకపోవడంతో ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. కాగా పేషియల్ రికగ్నైజేషన్ ప్రక్రియ ద్వారా పింఛన్ అందేలా చూడాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కోసమే.. మహబూబాబాద్: సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయ పరిధిలోని మానుకోట, కేసముద్రం, ఇనుగుర్తి, డోర్నకల్, కురవి, సీరోలు, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల ప్రజలు వినతులు అందజేస్తారు. ఈమేరకు ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. 11 మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతులు ఇవ్వాలన్నారు. అధికారులు వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా పరిష్కారం కావాలని, లేనిచో కారణంతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. కాగా తొలిరోజు 13 వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, మానుకోట మండలం మల్యాల గ్రామశివారు దామ్యాతండాకు చెందిన బానోత్ చందూలాల్ తన భూ సమస్య పరిష్కరించి పట్టా మంజూరు చేయాలని మొదటి వినతి అందజేశాడు.నా స్థలం కబ్జా చేశారు.. గ్రామంలో నా ఇంటి స్థలం కబ్జా చేశారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. తహసీల్దార్కు వినతి ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో విచారణ చేసి న్యాయం చేయాలి. – కె.నారాయణ, రామన్నగూడెం గ్రామం, నర్సింహులపేట పింఛన్ మంజూరు చేయాలి 2023లో ఆరోగ్య సమస్యతో ఎడమ కాలు చచ్చు బడిపోయింది. అదే సంవత్సరం 70శాతం దివ్యాంగుడిగా సదరం సర్టిఫి కెట్ ఇచ్చారు. కానీ దివ్యాంగ పింఛన్ మంజూరు కాలేదు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. –నీరుటి వీరభద్రం, తోడేళ్లగూడెం, డోర్నకల్ -
సర్వేపై స్పష్టతేది?
మహబూబాబాద్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో బాగంగా బాలరక్షాభవన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పిల్లల గురించి సర్వే చేశారు. సుమారు 15 రోజుల పాటు సర్వే చేయగా జిల్లాలో 3,209 మంది ఉన్నట్లు తేలింది. ఇందులో తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలు 195 మందిగా గుర్తించారు. వారిని మిషన్ వాత్సల్య పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే సర్వే పూర్తి చేసిన అధికారులు.. పూర్తి ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వలేదు. ఐదు ప్రాజెక్ట్లు.. డీడబ్ల్యూఓ పరిధిలో ఐదు ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఆశాఖ పరిరిధిలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు, సఖి కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం, బాలరక్షా భవన్, ఇతర కేంద్రాలు నిర్వహిస్తున్నారు. బాలరక్షా భవన్ పరిధిలో కూడా ఏడు విభాగాలు ఉన్నాయి. దానిలో బాలరక్షా భవన్ జిల్లా కోఆర్డినేటర్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్తో పాటు మరో 35మంది సిబ్బంది పని చేస్తున్నారు. బాల రక్షా భవన్ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు సర్వే.. తల్లితండ్రులు లేని పిల్లలు, తల్లి లేక తండ్రి చనిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు ఉండి ఆదరణ లేని పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఇలా నాలుగు విభాగాలుగా ఫార్మట్ తయారు చేసి సర్వే చేపట్టారు. ఈమేరకు సీడీపీఓల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లతో సర్వే చేశారు. కాగా, తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో 787మంది పిల్లలు, మానుకోట పరిధిలో 775మంది, డోర్నకల్ పరిధిలో 851మంది, మరిపెడ పరిధిలో 721మంది, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో 75మంది.. మొత్తంగా 3,209 మందిని గుర్తించారు. వారి చదువు, నివాసం, ఆధార్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా లబ్ధి.. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి మిషన్ వాత్సల్య పథకం అమలు చేస్తుంది. పథకం కోసం నేటి వరకు 1,810 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, గైడ్లైన్స్ ప్రకారం 225 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ప్రతీ నెల వారి ఖాతాలో రూ.4000 జమ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నారు. సర్వే తర్వాత ప్రాసెస్పై లేని స్పష్టత సుమారు 15 రోజుల పాటు సర్వే చేసి 3,209 మందిని గుర్తించారు. వారికి మిషన్ వాత్సల్య పథకంతో పాటు ఇంకా ఏమైనా లబ్ధి చేకుర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం సర్వే చేసిందా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రత్యేకంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్వే చేయాలని ఆదేశాలు రావడంతో ఈనెల 1వ తేదీతో సర్వే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి ప్రక్రియ మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి మిషన్ వాత్సల్య పథకాన్ని అర్హత గల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. గైడ్లైన్స్ ప్రకారం అన్ని పత్రాలు జత చేయాలి. ఆ పిల్లల కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు సర్వే చేశాం. నివేదికను తయారు చేస్తున్నాం. దానిని ప్రభుత్వానికి పంపిస్తాం. ఆదేశాలతో తదుపరి ప్రాసెస్ చేస్తాం. –ఎస్.రాజ్యలక్ష్మి , బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ తల్లిదండ్రులు లేని పిల్లలపై 15రోజుల పాటు సర్వే అంగన్వాడీ టీచర్లతో నిర్వహణ మిషన్ వాత్సల్య పథకంలో స్కాలర్షిప్లు బాల రక్షాభవన్ ఆధ్వర్యంలో భరోసా ఇతర లబ్ధిపై స్పష్టత కరువు -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ● ప్రజావాణిలో 110 అర్జీల స్వీకరణ మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలతో డివిజన్ స్థాయిలో కూడా ప్రజావా ణి నిర్వహిస్తారన్నారు. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 110 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులను పరిశీలిస్తే.. జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ మెస్ యజమాని నాగేంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపపథ్యంలో ఏర్పా టు చేసిన భోజనాలు, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాల బిల్లులు ఇప్పించాలని వినతిలో పేర్కొన్నాడు. కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన కందయ్య తన ముగ్గురు కుమారులు పట్టించుకోవడం లేదని, తన ఆరోగ్యం సహకరించడం లేదని, తనకు న్యాయం చేయాలని వినతి అందజేశాడు. -
రైతులకు మెరుగైన బ్యాంకు సేవలందించాలి
కురవి: రైతులకు వేగవంతమైన, మెరుగైన బ్యాంకు సేవలందించాలని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వరంగల్ జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ను కలెక్టర్ స్నేహ శబరీష్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులు రైతులకు సేవలందించి మన్ననలు పొందాలని సూచించారు. కురవిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షంతో నష్టపోయిన రైతుల ధాన్యం వివరాలను అధికారులు ఉన్నతాధికారులకు అందించాలన్నారు. రవాణా సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు, బ్యాంక్ సీఈఓ నజీర్ సుల్తాన్, సర్పంచ్ బాదావత్ లక్ష్మి, ఉప సర్పంచ్ ఎర్రనాగేశ్వర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, డీవైగిరి, నారాయణ రాజేందర్కుమార్, ఇతర బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభం ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలి కలెక్టర్ స్నేహశబరీష్ -
ఉరుకులు.. పరుగులు
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సాక్షి మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. అయితే ఉరుములు, మెరుపులు, గాలిదుమారం, అకాల వర్షాలతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు కొనుగోళ్లలో జాప్యం శాపంగా మారింది. వారాల తరబడి క కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్నలు పోసి ఎప్పుడు కాంటాలు పెడుతారా అని ఎదుచూస్తున్నారు. మందకొడిగా మక్కల కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న పంట సాగు పెరిగింది. దీంతో దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. అయితే ప్రభుత్వం మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కోరడంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. యాసంగి సీజన్లో 1,05,238 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. ఇందుకు గాను 4లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్నల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 25శాతం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ లెక్కన లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి. కానీ, ఇప్పటి వరకు 25 కొనుగోలు కేంద్రాల ద్వారా 42వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రెండు నెలలు గడిచినా సగం మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయలేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమశాతంతో పాటు శుభ్రంగా ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు ఎగుమతి చేయాలని జిల్లా అధికారులు చెబుతున్నా.. జిల్లాలో మాత్రం నత్తనడకన కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యాసంగిలో రైతులు 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా మొత్తం 213 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 136 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 17,175 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఇందులో కేవలం 8,900 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించారు. ఇంకా 8,275 మెట్రిక్ టన్నుల ధాన్య ం కేంద్రాల్లోనే నిల్వ ఉంది. అన్నదాతల ఆందోళన.. పొద్దస్తమానం తీవ్రమైన ఎండతో ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే మబ్బులు చేస్తుంది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, పిడుగులతో గాలిదుమారం వస్తుంది. దీంతో ఽకొనుగోలు కేంద్రాల్లో పోసిన రైతులు పంటలు తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంటను రాసిగా పోయడం, టార్పాలిన్లు కప్పడం, వర్షం నీరు రాకుండా కట్టలు కట్టడం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇందుకోసం వర్షానికి తడవడం, పిడుగులు ఎప్పుడు మీద పడుతాయో అని భయం భయంగా ఉంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తేమశాతం సక్రమంగా ఉన్న ధాన్యం వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కల్లాల్లో ధాన్యం, మొక్కజొన్న నిల్వలు కొనుగోళ్లలో జాప్యంతో రైతుల నిరీక్షణ సరుకులు తడుస్తాయని ఆందోళన -
బైక్ను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరు యువకుల దుర్మరణం మామునూరు: బైక్ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి వరంగల్ నక్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన కనిగిరి వెంకటరత్నం తన కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా పెగడపల్లికి వలస వచ్చాడు. కుమారులు విష్ణువర్ధన్ (22), శేషయ్య (21)తో కలిసి ఆయన మేసీ్త్ర పనిచేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఉన్న పెద్దనాన్న కుమారుడిని చూసేందుకు ఆదివారం సాయంత్రం విష్ణువర్ధన్, శేషయ్య బైక్పై పెగడపల్లి నుంచి బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్కు అర్ధరాత్రి చేరుకున్నారు. అన్న మరో అరగంటలో నెక్కొండకు చేరుతాం.. టీతాగుతూ సంతోషంగా ఫోన్లో మాట్లాడారు. నెక్కొండ రోడ్డు నక్కలపల్లి గ్రామ శివారుకు చేరుకున్నారు. అంతలోనే నెక్కొండ వైపు నుంచి వరంగల్కు వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ ముక్కలైంది. విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శేషయ్యను పోలీసులు క్షణాల్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరి మృతితో పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఘటన స్థలానికి మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి కనిగిరి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో పశువులు మృత్యువాత
కురవి: విద్యుదాఘాతంతో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి సీరోలు మండలం బీల్యా నాయక్ తండా పరిధిలోని పలుగుబోడు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ముగ్గురు రైతుల పశువులు మేత కోసం బయటకు వెళ్లాయి. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్తీగలు తెగి కిందపడ్డాయి. మేత కోసం వెళ్లిన రెండు ఎడ్లు, ఒక ఆవు కాళ్లకు విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. తేజావత్ సేవ్యాకు చెందిన ఒక ఆవు, వాకుండోత్ మోహన్, బానోత్ నెహ్రూకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి. సోమవారం వాటిని తండా శివారులో గుర్తించారు. విద్యుత్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పశువులకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్క కనుకయ్య (45) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం హమాలీ పని కోసం బైక్పై గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ముల్కనూరులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి.. భీమదేవరపల్లి: గుర్తు తెలియని వాహ నం ఢీకొని మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంప రమేశ్(55) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అయితే ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య వసంత, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ ఢీకొని రాజుపల్లిలో ఉపాధి హామీ కూలీ.. శాయంపేట : బైక్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతనిప్పుల రాధమ్మ (45) రోజు మాదిరిగానే ఉపాధి హామీ పనులకు వెళ్లింది. అనంతరం అదే గ్రామానికి చెందిన చింతం బుచ్చయ్య బైక్పై ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పంచనేని దేవేందర్ రావు ట్రాక్టర్పై వస్తున్నాడు. ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీకొనడంతో రాధమ్మ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరకాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చదరంగంలో చిచ్చరపిడుగులు
వరంగల్ స్పోర్ట్స్: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం. అలాంటి చదరంగంలో పదేళ్లు కూడా నిండని చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగుతున్నారు. జాతీయస్థాయి పతకాలు, అంతర్జాతీయ స్థాయి రేటింగ్తో దూసుకెళ్తున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చెస్ అంటే.. చెస్ అంటే తెలియని వారుండరు. కానీ, ఆడడమే కొంత కష్టం. 64 బాక్సుల్లో రెండు రుక్స్ (ఏనుగు), రెండు నైట్స్ (గుర్రం), రెండు బిషప్ (ఒంటె), ఒక కింగ్ (రాజు), ఒక క్వీన్ (రాణి) చొప్పున ఇరు పక్షాలకు ఉంటారు. వీటితో ఇరువురు తలపడడమే చదరంగం. చదరంగంలో విభాగాలు.. ● చదరంగంలో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో క్లాసిక్ గంటన్నర సమయంపాటు ఆడే సుదీర్ఘమైన ఆట. అంతర్జాతీయ వేదికలపై ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారు. ● ఐదు నిమిషాల్లోనే ఆట ముగించేది బ్రిడ్జి కాగా.. కేవలం మూడు నిమిషాలపాటు ఆడేది ర్యాపిడ్, ఈ ఆటలో రెండు సెకన్లు ఇంక్రిమెంట్గా ఇస్తారు. ● కేవలం నిమిషంలో ముగించే అత్యంత సాహోసోపేతమైనది బుల్లెట్ విభాగం. ఇంటర్నేషనల్ రేటింగ్.. వయస్సుతో సంబంధం లేకుండా నాలుగు విభాగాల్లోనూ క్రీడాకారుడి ఆట తీరును లెక్కించేది రేటింగ్. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్ రేటింగ్ కోసం టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. అందులో సాధించిన పాయింట్ల వారీగా ర్యాంకింగ్ కేటాయిస్తారు.హనుమకొండలోని ఇన్స్టిట్యూట్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న కోచ్ రాంప్రసాద్ చిన్న వయస్సులోనే పతకాల సాధన అంతర్జాతీయ రేటింగ్తో అద్భుతాలు -
ప్రధాని సభను కేసీఆర్, రేవంత్ చూడాలి
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హన్మకొండ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం ఎ.రేవంత్రెడ్డి వచ్చి చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అ ర్వింద్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 లక్షల మందితో నిర్వహించే బహిరంగ స భకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ పంగనామాలు పెడితే.. రేవంత్రెడ్డి కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ఆర్ఐలను మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో ఏజెంట్ల మో సాలు పెరిగాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన బాజాప్తా పొలిటికల్ ట్రిప్ అన్నారు. పశ్చిమబెంగాల్లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, తమిళనాడులో ఎన్డీఏ మద్దతుతో ప్రభుత్వం రానుందన్నారు. ఇ క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు. కనకదుర్గ అమ్మవారిమీద ఒ ట్టేసిన వ్యక్తి రాజకీయంగా, వ్యక్తిగతంగా నాశనమైపోతాడని సీఎం రేవంత్ను ఉద్దేశించి అన్నారు. కొందరికి పార్టీలు పెట్టడం బిజినెస్ అయిపోయిందని కల్వకుంట్ల కవిత పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించా రు. ఇక నుంచి కేసీఆర్కు ఎటువంటి సంబరా లుండవన్నారు. వయోభారంతో ఉన్న కేసీఆర్ను టీవీ చూడనివ్వొద్దని, చూస్తే తట్టుకోలేడన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, కాళీప్రసాద్, దేవేందర్రెడ్డి, నాయకులు కీర్తిరెడ్డి పెసరు విజయ్చందర్ రెడ్డి, రావుల కిషన్, చాడ స్వాతి, సండ్ర మధు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. కూత ఘనం
ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్లోని ఓ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది. అందులో ఐదింటిలో మొదటి స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. 10 నెలలుగా రాంనగర్లో కోచ్ పవన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హయాతి పిట్ట కొంచె కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. ప్రతి రోజు మూడు గంటలు చెస్ సాధన చేస్తోందని తల్లిదండ్రులు రవితేజ, సృజన చెబుతున్నారు. -
చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం
● కాపాడిన వాకర్స్ సభ్యులు ● పోలీసులకు అప్పగింత కాజీపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల వయసున్న కూతురుతో కలిసి వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా వాకర్స్ సభ్యులు చూసి కాపాడారు. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. కాజీపేట 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (30) సోమవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో తన కూతురును తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దిగుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ అటుగా వచ్చిన కురుమని మహేందర్ రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న సహచర వాకర్ల సహకారంతో బాధితురాలిని బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించగా వారు కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వాకర్స్ సభ్యులను సీఐ సుధాకర్ రెడ్డి అభినందించారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో ఈతకెళ్లి గల్లంతైన చీర కరుణాకర్(30) మృతదేహం లభ్యమైంది. ఆదివారం గ్రామంలోని తుమ్మలబావిలో ఈత కొట్టడానికి వెళ్లిన కరుణాకర్ అదే బావిలో మునిగిపోయిన విషయం విధితమే. సాయంత్రం సమయంలో గజ ఈతగాళ్లతో వెతికినా ఫలితం లేదు. దీంతో ఎస్సై శ్రీకాంత్ ఆ బావికి మోటార్లు బిగించి నీటిని తోడగా సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది.కాగా, ఆరు నెలల క్రితం మృతుడి భార్య చనిపోగా ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవించే కరుణాకర్ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కుంటలో పడి వృద్ధురాలి మృతి కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రానికి చెందిన అనంతోజు గోవిందమ్మ(70) మాలకుంటలో పడి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోవిందమ్మ బహిర్భుమికి వెళ్లి రాకపోవడంతో కుటుంబీకులు రాత్రంతా వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం మాలకుంట వైపు వెళ్లిన స్థానికులు మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో వారు వెళ్లి చూసి నీటిలో పడి మృతి చెందింది గోవిందమ్మేనని గుర్తించారు. మృతురాలి కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. -
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ఆర్థిక సాయం
నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువనాయకుడు పడిదల నవీన్రావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్ వీణావిజేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లుగౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జి రాజు, మధు, రాజు, యూత్ కాంగ్రెస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నాయకులు రాము, శ్రీనివాస్, గిరిగాని రమేశ్, కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కె.రంగయ్య, మోహన్,తదితరులు పాల్గొన్నారు. నకిలీ నోట్ల ముఠా అరెస్ట్● రూ.28 లక్షల విలువైన ల్యాప్టాప్, ప్రింటర్స్, నకిలీ నోట్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ వరంగల్ క్రైం: నకిలీ నోట్లను తయారుచేసి చలామణి చేస్తున్న 8 మందిని వరంగల్ టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలి పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, రూ.1,48,000 నగదు, రూ.28 లక్షల విలువగల ల్యాప్టాప్లు, ప్రింటర్స్, 13 సెల్ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్కుమార్ వివరాలు వెల్లాడించారు. నిందితులు నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి, ములుగు గణపురానికి చెందిన పోరిక రాజ్కుమార్ అలియాస్ రాజు, ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి తాతానగర్కు చెందిన ముదురుకోల యాకంబరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రారకగూడేనికి చెందిన చేను సాయికిరణ్ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కలర్ ప్రింట్ తీసి.. చలామణి చేసి నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసలు రూ.100 నోట్లను ల్యాప్టాప్, ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి చలామణి చేస్తున్నారని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితులను విచారించగా తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు (1:3 నిష్పత్తి) తయారుచేసి ఇస్తామని చెప్పి రూ.500 నోట్ల పరిమాణంలో ఉన్న కాగితాలు హైపో ద్రావణంలో ముంచి నల్లగా మారిన తర్వాత ప్రజలకు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పారు. నల్లకాగితాలు అసలు నోట్లుగా మారుతాయని నమ్మించి ప్రజల నుంచి అసలు నోట్లు తీసుకొని పరారైనట్లు ఆయన తెలిపారు. నిందితులు ములుగు గణపురం, సికింద్రాబాద్ మోండా మార్కెట్, వేంసూర్, కొత్తగూడెం, నర్సంపేట, సుబేదారి తదితర ప్రాంతాల్లో మో సం చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్పాషా, టాస్క్ఫోర్స్, నర్సంపేట సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు చేపట్టి చూడాలని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని, హామీలు విస్మరించిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పడం ఖాయమని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ద యాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా దిగుబడి తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరో పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. థంబ్ ఇంప్రెషన్ కోసం రైతుల వద్ద లంచం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 6లోపు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టక పోతే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కా ర్యాలయాలను రైతులు ముట్టడించడం ఖాయమన్నారు. 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రాకేశ్రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, టి.రమేశ్బాబు, హరిరమాదేవి, లలితాయాదవ్, రాజశేఖర్, మల్లయ్య పాల్గొన్నారు. రైతులు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయం మాజీ మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శన -
ఈతకు వెళ్లి మరో యువకుడి గల్లంతు
బచ్చన్నపేట : ఈతకు వెళ్లిన ఓ దివ్యాంగ యువకుడు గల్లంతయ్యాడు. ఈఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర పద్మ, భిక్షపతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు కరుణాకర్ (30) దివ్యాంగుడు. ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి ఊరు పక్కన ఉన్న తుమ్మలబావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దూకి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో గమనించిన స్నేహితులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఎ. శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించినా మృతదేహం కనిపించలేదు. ఈ నేపథ్యంలో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడిస్తూ సోమవారం మృతదేహం కోసం ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు.. మండల కేంద్రంలోని రాజన్న బావిలో మండల కేంద్రానికి చెందిన ఎనుగుల కరుణాకర్ ఇదే తరహాలో ఈత కొట్టడానికి వెళ్లి శనివారం గల్లంతు కాగా మృత దేహం లభించలేదు. ఆదివారం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో కరుణాకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అది మరవక ముందే మూడు గంటల వ్యవధిలో రామచంద్రాపురంలో మరో ఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈత వచ్చిన వ్యక్తులే ఇలా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలు కోసిన తర్వాత మోటార్లు బంద్ చేయడంతో వ్యవసాయ బావుల్లో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరు చాలా రోజులు నిల్వ ఉండడంతో ఆకులు పడి మురుగడంతో ఏమైనా విషపదార్థాలు తయారవుతున్నాయా అని అర్థం కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బచ్చన్నపేట ఘటన మరువకముందే రామచంద్రాపురంలో మరోటి.. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● బోర్నపల్లిలో ఘటన టేకుమట్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామానికి చెందిన అప్పని లింగయ్య (50) ఆదివారం ఉదయం బైక్పై పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామం రామకృష్ణాపూర్ (వి)కు వస్తుండగా బోర్నపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు. బయ్యారం: తవేరా, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సంతులాల్పోడు తండాకు చెందిన గుగులోత్ సందీప్(18) గంధంపల్లిలోని సెల్షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్కూటీపై రాత్రి ఇంటికి వస్తున్నాడు. గంధపల్లిలో తవేరా, స్కూటీ ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ప్రశాంత్బాబు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు. అనుమానాస్పదస్థితిలో మరొకరు .. కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్కు చెందిన శనిగరం శ్రీకాంత్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంత్ ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు 2న మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎలికేశ్వరం శివారులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. దీనిని పోలీసులు శనిగరం శ్రీకాంత్ మృతదేహంగా గుర్తించారు. శ్రీకాంత్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని, తండ్రి సాంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.పవన్కుమార్ తెలిపారు. -
ఎరువు.. బరువు!
గీసుకొండ: యాసంగి సీజన్ ముగింపు దశలో ఉంది. వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంపెనీలు ఇదే అదునుగా భావించి ఎరువుల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డీలర్లకు ఆయా కంపెనీల వారు పెంచుతున్న ఎరువుల ధరల గురించి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులపై మోయలేని విధంగా ఆర్థిక భారం పడనుంది. గ్రామాల్లో ఒకవైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మేలైన రకాలను సాగుచేసి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మరో వైపు రైతు నెత్తిన మరింత పెట్టుబడి భారాన్ని మోపుతూ కంపెనీలు ఎరువుల ధరలను పెంచుతున్నాయి. రకాన్ని బట్టి కొన్ని రసాయన ఎరువులపై రూ.75 నుంచి రూ.350 వరకు ఒక్కో బస్తాకు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగాయని అంటున్నారు. సరుకును రవాణా చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం, ఇతర పన్నులు ఎక్కువ కావడంతో సహజంగానే ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. యాప్తో రైతులకు ఇబ్బందులు.. ప్రస్తుతం ముగుస్తున్న యాసంగి సీజన్ ప్రారంభంలో సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులు అధికంగా వాడుతున్నారని ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకురావడంతో ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ.1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని డీలర్లు విక్రయించడానికి ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ.265 ఉండగా మొన్నటి వరకు రూ.300 వరకు విక్రయించారు. పశుసంపద తగ్గిపోవడంతో.. గ్రామాల్లో పశు సంపద తగ్గిపోయింది. దీంతో పేడ, గొర్రె ఎరువు, పెంట తదితర కంపోస్టు ఎరువులతోపాటు సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉంటోంది. రైతులు తమ పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వానాకాలంలో వరి, పత్తి, కందులు, జొన్నలు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరలతో రైతులపై మరింత భారం పడుతుంది.ఎరువుల పాత, కొత్త ధరల వివరాలు.. ఎరువు రకం పాత ధర కొత్త ధర (50 కిలోలు) (రూపాయల్లో) (రూపాయల్లో) 20–20–013 1,500 1,800 16–20–013 1,400 1,750 14–35–14 2,150 2,350 15–15–15–09 1,650 1,950 10–23–26 1,950 2,025 సింగిల్ సూపర్ పాస్ఫేట్ 615 775 పొటాష్ 1,850 1,975 16–16–16 1,675 2,050 24–24–0 2,000 2,300 వానాకాలం సాగు వేళ పెరిగిన ధరలు రైతులపై మరింత పెట్టుబడి భారం పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావమే కారణం -
ఖరీఫ్కు సన్నద్ధం
ఖిలా వరంగల్ : అన్నదాతకు భరోసా కల్పించేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే రైతు ముగింట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా వరంగల్ జిల్లాలోని ఊరూరా చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 9 వర కు రైతు వారోత్సవాలు నిర్వహించనుంది. వానా కాలం సాగుకు అన్నదాతలను జాగృతం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రకటించింది. అవగాహన సదస్సులు ఇలా.. 4న నేలఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి ర కాల సాగు, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్పా మ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంట ల సాగు, 6న బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట పంట రుణాలు, 7న వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్స్, 8న పశుసంవర్థక శా ఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణ, మత్స్యశాఖ–చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, 9న నీటిపారుదల శాఖ–చెరువుల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు జరగనున్నాయి. మట్టి నమూనా ఫలితాలు.. జిల్లాలో మొదటి విడతగా భూసార పరీక్షలు చేశా రు. గత మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు నెల రోజుల పాటు జిల్లాలోని ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి పది మట్టి నమూనాలను సేకరించారు. వీటి ని వరంగల్ ములుగు రోడ్డులోనిభూసార పరీక్ష కేంద్రం కార్యాలయానికి పంపించారు. నిర్వహించిన మట్టి శాంపిల్ ఫలితాలను వ్యవసాయాధికారి చేతికి రానున్నాయి. రైతు వారోత్సవాల్లో మట్టి పరీక్ష ఫలితాలు సంబంధిత రైతులకు వెల్లడించనున్నారు. 5 నుంచి 7వతేదీ వరకు మెగా రైతు మేళా.. హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 5,6,7 తేదీల్లో ఉమ్మడి జిల్లా మెగా రైతు మేళా జరగనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో అధి కారులు నిమగ్నమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు 5వేల మంది రైతులు హాజరుకానున్నారు. భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఈరైతు మే ళాకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జి ల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 5,6,7వ తేదీల్లో మెగా రైతుమేళా ఉమ్మడి జిల్లా నుంచి ప్రతీ రోజు 5వేల మంది రైతుల రాక ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం -
మహిళ ఆత్మహత్య
రేగొండ: ఆర్థిక కారణాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జోగయ్యపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర సరోజన (55) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు
కమలాపూర్: పంగిడిపల్లి, కన్నూరు గ్రామాల్లోని పంట పొలాల్లో ఆదివారం భా రీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైతులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పంగిడిపల్లిలో సుమారు40 ఎకరాల మొక్కజొన్న చేలల్లో మంటలు వ్యాపించాయి. కొంతమంది రైతులకు చెందిన మగ మొక్కజొన్న కంకులతో పాటు పైపులు, కరెంట్ మోటార్ల వైర్లు, మొక్కజొన్న చొప్ప దగ్ధమై సుమారు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. కన్నూరులో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగైదు ఎకరాల్లో కోసి కుప్పలుగా పోసిన మగ ధాన్యంతో పాటు పశుగ్రాసం దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. స్థానిక గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసినట్లు రైతులు తెలిపారు. హుస్సేన్పల్లిలో.. శాయంపేట: హుస్సేన్పల్లి గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేనుకు నిప్పంటుకుంది. మంటలు గాలికి వేగంగా వ్యాపించి పదెకరాల్లో పంట చేలను ఆవరించాయి. స్థానిక రైతులు, గ్రామస్తులు చెట్టుకొమ్మలు, గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో సిబ్బంది, రైతులు చెట్ల కొమ్మలు, నీటితో మంటలను ఆర్పివేశారు. -
ప్రశాంతంగా టీజీఆర్జేసీ సెట్
● 78 శాతం మంది అభ్యర్థుల హాజరు విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ ఎక్సలెన్స్) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గాను టీజీఆర్జేసీ సెట్ –2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో 35 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్జిల్లాలో 8,357మంది అభ్యర్థులకు గాను 6,415 మంది పరీక్షకు హాజరుకాగా 1,842మంది గైర్హాజరయ్యారని టీజీఆర్జేిసీ సెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ కె. ఇంధుమతి తెలిపారు. హనుమకొండ జల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వర్, కోఆర్డినేటర్ ఇంధుమతి, డీఆర్ఓ పలు కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరు పరిశీలించారు. పిడుగుపాటుకు కాడెడ్లు మృత్యువాత కేసముద్రం: పిడుగుపాటుతో మూడు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బి.సమయ్య తన మూడు కాడెడ్లు, ఓ గేదెను వ్యవసాయ భూమి వద్ద చెట్టు కింద కట్టేశాడు. ఈ క్రమంలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆ పశువులు ఉన్నచోట పిడుగు పడడంతో మూడు కాడెడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. వైద్యం వికటించి బాలుడి మృతి!దంతాలపల్లి: ఆర్ఎంపీ వైద్యం వికటించి బా లుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏడెల్లి అశోక్–ఊర్మిల దంపతులకు సుశాంత్త్, మల్లికార్జున్ కుమారులు ఉన్నారు. అశోక్ బైకు మెకానిక్గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమారుడు సుశాంత్ (15) మండల కేంద్రంలోని ఎ ంజేపీ పాఠశాలలో 9 వతరగతి పూర్తిచేశాడు. ఆదివారం కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర చూపించారు. వైద్యం అనంతరం బాలుడు మరింత అస్వస్థత కు గురికావడంతో తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమించిందని చెప్పడంతో వరంగల్ ఎంజీఎం తరలి స్తుండగా చని పోయాడు. ఆ ర్ఎంపీ వైద్యంతోనే తమ కు మారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు.


