breaking news
Mahabubabad District Latest News
-
వనదేవతల ఘనకీర్తి!
ప్రపంచ స్థాయికి సాక్షి ప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి : భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే సమ్మక్క–సారలమ్మలు, వనదేవతల ఘన కీర్తి ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలా ఈసారి మహాజాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. గిరిజన ఆదివాసీ సంప్రదాయాలు, చరిత్ర ఆధారాలు, పూజారుల అంగీకారంతో చేపట్టిన పునరుద్ధరణ పనులతో మేడారం ఆలయం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తోందన్నారు. శుక్రవారం ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆదివాసులు మూల పురుషులుగా ఉన్నారని, ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు, ఆచారాలు ప్రతిబింబించేలా ఉంటాయన్నారు. రూ.251 కోట్లతో అభివృద్ధి పనులు.. తెలంగాణ ప్రభుత్వం రూ.251కోట్ల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రూ.101 కోట్లతో శాశ్వత నిర్మాణాలు, రూ.150 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్, జాతర నిర్వహణ పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో గిరిజనుల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో వనదేవతలు గద్దెలపైకి రావడంతో భక్తజనం పులకరిస్తారని పేర్కొన్నారు. ఈ మహాద్భుత ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్పపువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేయించినట్లు సీతక్క వివరించారు.ఈ సమావేశంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా మహాజాతర మేడారం మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. సుమారుగా 21 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఒకే బృందంగా పనులు చేపట్టారు. 90 శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. సంక్రాంతి నుంచి అధికార యంత్రాంగం జాతర మోడ్లో ఉంటుంది.జాతర సమయంలో 30వేల మంది సిబ్బంది, జాతర అనంతరం 6వేల మంది విధులు నిర్వహించేలా ప్లాన్ చేశాం. జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్లో 8 మంది, ప్రతి సెక్టార్లో 30–40 మంది అధికారులు ఉండేలా డ్యూటీలు వేశాం. – దివాకరటీఎస్, కలెక్టర్, ములుగు బందోబస్తుకు 11వేల మంది పోలీసులుజాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి–మేడారం, పస్రా–మేడారం రోడ్లవెంట ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్ట్ను ఏర్పాటు చేస్తున్నాం. జాతర నిర్వహణకు సుమారు 20మంది ఐపీఎస్లు, ఇతర అధికారులు, పోలీసులు కలిపి 11వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నాం. భక్తులకు సేవలు అందించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారు. జాతర పరిసరాలను 450 సీసీ టీవీ, 20 ప్రత్యేక డ్రోన్స్ నిఘాతో పర్యవేక్షణ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తారు. – రాంనాథ్ కేకన్, ఎస్పీ, ములుగుచరిత్రలో ప్రత్యేక మైలురాయిగా మేడారం రూ.251కోట్లతో ఏర్పాట్లు.. అవసరమైతే మరిన్ని నిధులు మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి వనదేవతల మహాజాతరకు అన్ని ఏర్పాట్లు.. మీడియాతో రాష్ట్ర మంత్రి సీతక్క మేడారం సమీపంలోని కన్నెపల్లిలో గల సారలమ్మ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆలయం వద్ద భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం జంపన్నవాగులో జరుగుతున్న పనులను పరిఽశీలించి త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. -
యూరియా పంపిణీ పరిశీలన
కురవి: మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామాల వారీగా యూరియా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు యూరియా రాలేదని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతీరోజు సొసైటీల ద్వారా, ఏఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ సరిత, ఏఓ గుంటక నరసింహరావు, ఎంపీడీఓ వీరబాబు, సొసైటీ బాధ్యుడు జితేందర్, ఏఈఓలు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ హాజరై ర్యాలీని ప్రారంభించి, అధికారులు, సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మ మైదానంలోని ఎస్ఆర్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గతేడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మృత్యువాత పడ్డారని, అలాగే 9 లక్షల మంది వాహనదారులకు హెల్మెట్ ధరించని కారణంగా జరిమానాలు విధించామన్నారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సురేష్ కుమార్, ఏిసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, నాగయ్య, జాన్ నర్సింహులతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, నగరానికి చెందిన ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, ఎస్సెలు, పోలీసులు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. -
కార్మికుల భద్రతపై పట్టింపేది..?
బయ్యారం: పొట్టకూటి కోసం పిల్లాపాపలతో పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇటుకబట్టీల్లో మగ్గుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బతుకీడుస్తున్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యాలు తాత్కాలిక షెడ్లు వేసి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వసతిపై దృష్టి సారించాల్సిన కార్మికశాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రతీ ఏడా ది వలస కార్మికులు దుర్భర జీవితం గడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు, యజమానులు ఆ తర్వాత కార్మికులను వదిలేస్తున్నారు. ఇటుకబట్టీల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ కార్మికులు.. ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు స్థానికంగా కార్మికుల కొరతతో యజమానులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తుంటారు. గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు గ్రామాల పరిధిలో సుమారు 50 ఇటుకబట్టీలు కొనసాగుతుండగా వీటిలో దాదాపు 2 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరందరూ తాము పనిచేసే బట్టీల వద్ద యజమానులు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల వద్దే కుటుంబాలతో జీవిస్తూ పనుల్లో నిమగ్నమవుతారు. అన్నీ ఆరుబయటనే.. ఇటుకబట్టీల వద్ద కార్మికులు, వారి పిల్లలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. వీటితో పాటు మహిళా కార్మికులు స్నానాలు చేసేందుకు సైతం గదులు ఏర్పాటు చేయకపోవడంతో వారు బట్టీల సమీపంలో ఉన్న బోర్లు, ఏటి ప్రాంతంలో ఆరుబయటనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నా.. ఇటుకబట్టీల వద్ద ఏర్పాటు చేసిన నివాసాలు విషపురుగులకు నిలయంగా మారాయి. వీటితో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఒక బట్టీ వద్ద రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కార్మికుడి కుమార్తెకు విషపురుగు కుట్టడంతో మరణించింది. రెండు సంవత్సరాల క్రితం ఒక బట్టీలో విద్యుత్ కనెక్షన్లు సరిగా లేక ఒక కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలా వెలుగులోకి రాకుండా మరణించిన కార్మికుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా వారి స్వస్థలాలకు పంపించిన ఘటనలు గతంలో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. మామూలుగానే వదిలేస్తున్న అధికారులు.. కార్మికులకు యజమానులు కనీస వసతులు కల్పించడంతో పాటు వారికి చట్టపరమైన వేతనాలు, సెలవులు తదితర సౌకర్యాలను కల్పించేవిధంగా కార్మికశాఖాధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖాధికారులు కేవలం యజమానులతో సమావేశాలు పెట్టి చేతులు దుపులుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్మికులకు కనీస వసతులను కల్పించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇరుకుగదుల్లో విషపురుగుల నడుమ నివాసం ఆరుబయటనే కాలకృత్యాలు దుర్భర జీవనం గడుపుతున్న ఇటుకబట్టీ కార్మికులు -
హెల్మెట్ ధరిస్తే అభినందన
మహబూబాబాద్ రూరల్ : హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందించారు.. ధరించని వారికి పువ్వు ఇచ్చి పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి ప్రత్యేక శిబిరం నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా పువ్వు ఇప్పిస్తూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం మార్కెట్ సెంటర్లో వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. దూర ప్రాంతాలైతేనే హెల్మెట్ ధరిస్తామని, దగ్గర ప్రాంతాలకు అవసరం లేదనే భ్రమను వాహనదారులు తొలగించుకోవాలన్నారు. వాహనం నడుపుతున్న అన్నివేళల్లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సాయిచరణ్, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కృష్ణ, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోకుంటే అభ్యర్థన వినూత్న కార్యక్రమం చేపట్టిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ -
బీసీ ఉద్యోగుల జోలికి వస్తే తోలుతీస్తా
హన్మకొండ : బీసీ విద్యుత్ ఉద్యోగుల జోలికి వస్తే తోలు తీస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం వరంగల్ ఉర్సులోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చేపట్టిన బంద్ విజయవంతం కావడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లో బీసీ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసుకుని ఏకం కావాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సంస్థఽల్లోని కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసి ఏప్రిల్ 1నుంచి నూతన వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ మహాసభలో సంఘం 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. నాయకులు నీలారపు రాజేందర్, నాగెళ్లి సదానందం, జి.బ్రహ్మేంద్ర రావు, ఎం.విజయ్కుమార్, ప్రేమ్ కుమార్, పి.యాదగిరి,బొబ్బిలి మురళి, ఎం.అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, నాగవెల్లి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య -
కార్డుతో కట్టడి..
యూరియా అధిక నిల్వలకు అవకాశం లేకుండా చర్యలుపంటల నమోదు, ఎరువుల యాజమాన్యం కార్డు సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వానాకాలం సీజన్ నుంచి యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఊరట కలగనుంది. అవసరానికి మించి కొనుగోలు చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులతో రైతులు సాగుచేసిన పంటల ఆధారంగా.. వ్యవసాయశాఖ సూచన మేరకు యాసంగిలో యూరియా బస్తాలు అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రైతులకు కార్డుల పంపిణీ.. పంటల సాగుకు అనుగుణంగా యూరియా పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులు పంపిణీ చేస్తున్నారు. పంటల నమోదు, ఎరువుల యాజమాన్యం పేరుతో ముద్రించిన 2.24లక్షల కార్డులను జిల్లా వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. స్థానికంగా ఏఈఓలు నమోదు చేసిన పంటల వివరాలతో పాటు.. విత్తనాలు కొనుగోలు చేసిన కూపన్ ఆధారంగా ఎరువులు ఇస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎకరానికి వరికి మూడు బస్తాలు, మిర్చికి ఆరు బస్తాలు, మొక్కజొన్నకు ఐదు బస్తాల చొప్పున అందజేస్తున్నారు. అయితే ఈ బస్తాలు మూడు విడతలుగా రైతులకు అందిస్తారు. యూరియా తీసుకునే సమయంలో కార్డును చూపించి.. ఏ పంటలు ఎన్ని ఎకరాలు వేశారు. ఎన్ని బస్తాలు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడెన్ని ఇస్తున్నాం.. ఇంకా ఈ సీజన్లో ఎన్ని బస్తాలు ఇవ్వాలి అనే వివరాలు పొందుపరుస్తున్నారు. పంటల నమోదు, ఎరువుల యాజమాన్యం కార్డుల పంపిణీ విత్తనాల కొనుగోలు బిల్లు ఆధారంగా కేటాయింపు వరికి మూడు, మక్కకు ఐదు, మిర్చికి ఆరు బస్తాలు మూడు విడతలుగా రైతులకు పంపిణీకౌలు రైతులకు ఇబ్బంది..పంటల సాగు వివరాల ప్రకారం యూరియా అందజేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని పలువురు కౌలు రైతులు చెబుతున్నారు. అయితే పంటల నమోదు, ఓటీపీలు భూమి యజమానికి వెళ్తున్నాయని, దీంతో తమ పంటలు సక్రమంగా నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీలో ఏఈఓల రికార్డులు కూడా ప్రమాణికంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పంటల నమోదు చేయాలని, అప్పుడు అక్కడ ఉన్న కౌలు రైతులను గుర్తించి వారికి యూరియా అందజేయాలని కోరుతున్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
బయ్యారం: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ ఫయాజ్, నిర్వాహకులు గణేశ్, జనార్దన్ రెడ్డి ఉన్నారు. 12న జాబ్ మేళామహబూబాబాద్: జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మానుకోట, కేసముద్రం, గూడూరు, మరిపెడ, సీరోలు, కుర వి, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు మండలాల్లో పనిచేయడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి 20నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులన్నారు. ఈనెల 12న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయంలో జాబ్మేళా ఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలన్నారు. డోర్నకల్ ఎఫ్ఆర్వోగా విజయలక్ష్మిడోర్నకల్: డోర్నకల్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్వోగా విజయలక్ష్మి శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన ఎఫ్ఆర్వో రేణుక సండ్ర కర్ర అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల సస్పె ండ్ అయ్యారు. ఆమె స్థానంలో తొర్రూరు ఎఫ్ ఆర్వో విజయలక్ష్మి నియమితులయ్యారు. ట్రెస్సా జిల్లా అధ్యక్షుడిగా సునీల్మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్, అసోసియేట్ అధ్యక్షుడిగా రాజేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, బాలకిషన్, కోశాధికారిగా కృష్ణ ప్రసాద్తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అంగన్వాడీ సెంటర్లనుపరిశుభ్రంగా ఉంచాలిడోర్నకల్: అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల భద్రతపై శ్రద్ధ వహించాలని డీడబ్ల్యూఓ సబిత కోరారు. మండలంలోని అమ్మపాలెం రైతువేదిక భవనంలో శుక్రవారం నిర్వహించిన డోర్నకల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలని, టీచర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ప్రీ స్కూల్ కార్యక్రమాలు, పోషణ సేవలు నిర్వహించాలని, బీఎల్ఓలుగా నియమితులైన వారు తహసీల్దార్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. సీడీపీఓ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
వారసత్వ సంపద దేశానికి గర్వకారణం
● హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ హన్మకొండ క ల్చరల్ : వారసత్వ స ంపదలు దేశానికి గర్వకారణ మని, ప్రతి భారతీయుడు దేశ సంస్కృతి, చరిత్రను తెలుసుకుని కాపాడుకోవాలని హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంత్రి రోహిత్ ఠాకూర్ దంపతులు సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆలయ స్తంభాల్లో చెక్కిన శిల్పకళను, సూదిపట్టే రంధ్రాలను, తలకిందుల చాప, మనిషి, కల్యాణ మండపం పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఐఏఎస్లతో కలిసి ఇక్కడికి వచ్చానని తెలిపారు. దేవాలయాన్ని సందర్శించిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను వారి చదువు, బోధనా పద్ధతులు, ఫలితాలు తదితర ఆంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫొటో తీయించుకున్నారు. ఈఓ అనిల్కుమార్, సిబ్బంది మధుకర్, అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ పాల్గొన్నారు. -
డిజిటల్ లైబ్రరీతో సులభంగా సమాచారం
● ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.మధుసూదన్ విద్యారణ్యపురి : డిజిటల్ లైబ్రరీతో సమాచార సేకరణ సులభతరమైందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.మధుసూదన్ పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకడమిక్ లైబ్రరరీస్ నావిగేటింగ్ చాలెంజెస్ లెవరేజింగ్ అపార్చునిటీస్’ అనే అంశంపై రెండ్రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సభలో మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించాలన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన గ్రంథాలయాలు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని వివరించారు. ఈ సభలో ద్రవిడ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య, పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ బి.యుగేందర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నేడు గార్లకు రానున్న భావన, మేఘన మృతదేహాలు● ముల్కనూరులో ఒకేచోట అంత్యక్రియలు గార్ల : అమెరికాలో డిసెంబర్ 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గార్ల మండలానికి చెందిన భావన, మేఘనరాణి మృతిచెందారు. కాగా శనివారం వారి మృతదేహాలు స్వగ్రామానికి రానున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న శుక్రవారం తెలిపారు. ఎల్కేజీ నుంచి టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ ఒకేచోట చదివారు. ఉన్నత చదువుల కోసం ఇద్దరు అమెరికాలో ఒకే రూమ్లో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. అమెరికాలో క్రిస్మస్ సెలవులు రావడంతో కారులో విహారయాత్రకు వెళ్లి వారు మృతిచెందారు. వీరిద్దరి మృతదేహాలను ఒకేచోట ముల్కనూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 14రోజులుగా వీరి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టిస్తుంది. తక్కువ ధరకే మొబైల్ అంటూ.. ● ఖాతా నుంచి రూ.86 వేలు మాయం ● పెద్దవంగరలో సైబర్ మోసంపెద్దవంగర : యూట్యూబ్ షార్ట్స్ వీడియోను నమ్మిన ఓ యువకుడు సైబర్ మోసానికి బలయ్యాడు. ఖరీదైన మొబైల్ ను తక్కువ ధరకే ఇస్తామన్న ఆకర్షణీయమైన ఆఫర్ చూసి సెల్ఫోన్ వస్తుందని నమ్మిన అతడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన శ్రీరాం సాయివెంకట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. డిసెంబర్ 31న మొబైల్లో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు చూస్తుండగా ఖరీదైన ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోందన్న ప్రకటన కనిపించింది. అది నిజమని నమ్మిన సాయివెంకట్ అందులోని నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చాడు. వెంటనే అవతలి నుంచి నిందితులు వాట్సాప్లో చాటింగ్ ప్రారంభించారు. మార్కెట్లో రూ.95 వేల విలువ చేసే సెల్ఫోన్ను కేవలం రూ.9,500కే ఇస్తామని సాయివెంకట్ను నమ్మించారు. ముందుగా రూ.899లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరడంతో బాధితుడు ఈ నెల 7న వారు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే చేశాడు. ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాడో అప్పటి నుంచి అతడి మొబైల్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడి ప్రమేయం లేకుండానే అతడి బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలుగా రూ.86,700 డెబిట్ అయ్యాయి. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనుబంధ రంగాలపై దృష్టి సారించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా బలోపేతం కావాలని వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతిక సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమారెడ్డి హాజరై మాట్లాడారు. వానాకాలం వరి సాగు అనంతరం రెండో పంటగా పెసర, మినుము, బొబ్బెర, జనుమును సాగుచేసుకోవాలని సూచించారు. మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ దిలీప్ కుమార్ కేవీకేలో జరుగుతున్న విస్తరణ, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, విత్తనోత్పత్తి, నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై సమావేశంలో తెలియజేశారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ.. యూరియాను మోతాదుకు మించకుండా వాడాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగుతో రైతులు లాభం పొందాలని సూచించారు. కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి తర్వాత పొద్దుతిరుగుడు, పెసర, మినుము, జనుము సాగు చేయాలని వివరించారు. మరో శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగులో భాగంగా బంతిపూలు, కూరగాయల పంటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి తీగజాతి కూరగాయల సాగును తెలియజేశారు. ఈ సమావేశంలో డీఈ నాముని, శివకృష్ణ, అభ్యుదయ రైతులు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి -
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎత్తు బంగారం మొక్కుగా చెల్లించి, జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. జాతర సమీపిస్తున్న తరుణంలో ఇంకా అభివృద్ధి పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికి 50శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని, రెండో పంట సాగు చేయకుండా నష్టపోతున్న రైతులు పరిహారం అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును స్థానిక నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతంరావు, జిల్లా ఇన్చార్జ్ నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బలరాం, కార్యదర్శి భర్త పురం నరేష్, సమ్మక్క పూజారి సిద్దబోయిన సురేందర్, వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి సంతోష్కుమార్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
వెంటాడిన మృత్యువు..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు ఏటూరునాగారం : సంక్రాంతి పండుగకు ఇంటి వచ్చిన కుమార్తెలతో కలిసి కొద్ద్ది నిమిషాల్లో థియేటర్లో సంతోషంగా సినిమా చూడాల్సిన తండ్రి, కూతుర్లను మృత్యువు వెంటాడి విడదీసింది. శుక్రవారం మండలంలోని రోహిర్ పంచాయతీ పరిధి 163 జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కారును టోషన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజేడు మండలానికి చెందిన కాకర్లపుడి వీరభద్రరాజు (వినోద్) (49) అక్కడికక్కడే మృతిచెందా డు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన తన కుమార్తెలు మేఘన, మధురిమ, తమ్ముడు మనోజ్, మరో బంధువు వత్సవాయి బుచ్చి గోపాలరాజు వర్మతో కలిసి వీరభద్రరాజు టీఎస్ ఎఫ్ 2799 నంబరు గల కారులో ఏటూరునాగారం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం వైపు నుంచి వస్తున్న ఏపీ 12 ఎల్ 2715 నంబరుగల టోషన్ వాహన డ్రై వర్ జాకీర్ హుస్సేన్ మద్యం మత్తులో అజాగ్రతగా నడిపి రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న వీరభద్రరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మే ఘన, మధురిమతోపాటు మనోజ్, బుచ్చి గోపాలవర్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మృతుడి తమ్ముడు మనోజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ట్లు సమాచారం. అప్పటి వరకు ఎంతో ప్రేమగా మాట్లాడిన తమ తండ్రి కళ్లముందే ప్రాణం కోల్పో యి విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి కుమార్తెలు రోదించిన తీరు చూపరులను కలిచి వేసింది. వి షయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించి మృతుడి తమ్ముడు వెంకట సత్యనరసింహరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఏటూరునాగారం : క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపుకోసం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు పీఓ చిత్రమిశ్రా షీల్డులు అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. వాలీబాల్ అండర్–14 విభాగంలో.. ● బాలుర విభాగంలో ఉట్నూర్–1 జట్టు మొదటి స్థానం సాధించింది. భద్రాచలం రెండో స్థానంలో ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 మూడో స్థానం కై వసం చేసుకున్నారు. వాలీబాల్ అండర్–17.. ● బాలుర విభాగంలో భద్రాచలం జట్టు మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ప్లేన్ ఏరియా ఐ మూడోస్థానంలో విజయం సాధించింది. బాలికల విభాగంలో.. ● ఉట్నూర్ జట్టు ప్రథమం, భద్రాచలం జట్టు ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో నిలిచింది. ఖోఖో అండర్–17 బాలుర విభాగంలో.. ● ఉట్నూర్–1జట్టు ప్రథమ స్థానం, ఏటూరునాగారం ద్వితీయ స్థానం, భద్రాచలం మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. బాలికల విభాగంలో.. ● ఉట్నూర్ జట్టు–2 ప్రథమ స్థానం, భద్రాచలం ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో విజయం సాధించారు. కబడ్డీ అండర్–17 బాలుర.. ● భద్రాచలం జట్టు మొదటి స్థానం, ప్లేన్ ఏరియా జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ప్లేన్ ఏరియా జట్టు–2 ద్వితీయ, ఏటూరునాగారం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. కబడ్డీ అండర్–14 బాలుర.. ● ప్లేన్ ఏరియా జట్టు మొదటి స్థానం, ఉట్నూర్ జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో విజయం సాధించింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 తృతీయ స్థానంలో విజయం సాధించింది. ● అథ్లెటిక్స్లో షాట్పుట్, వంద మీటర్ల పరుగు పందెం, అండర్ –17 బాలికల విభాగంలో చెస్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్, దేశిరాం , ఏటీడీఓ, ఏసీఎంఓ, స్పోర్ట్స్ అధికారులు, భీమ్లా, పార్ధసారధి, రమేష్, కిష్టు, కొమ్మాలు, ఆదినారాయణ, శ్యామలత, వివిధ పాఠశాలల పీజీహెచ్ఎంలు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా ముగిసిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాపోటీలు -
ల్యాబ్ల నిర్వహణకు నిధులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్ల నిర్వహణకు ఇంటర్ బోర్డు నిధులు విడుదల చేసింది. త్వరలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున.. జిల్లాలోని పది కాలేజీలకు రూ.5లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ల్యాబ్ల్లో అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, కెమికల్స్, ఇతర వస్తువుల కొనుగోలు కోసం నిధులను వినియోగించుకోనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 8257 విద్యార్థులు.. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. గత విద్యా సంవత్సరం సీసీ కెమెరాలు అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించగా.. ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జనరల్ గ్రూప్ ఇంటర్ ఫస్టియర్లో 3,148 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 3,100 మంది, ఒకేషనల్ ఫస్టియర్లో 998 మంది విద్యార్థులు, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 1,011 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2నుంచి 21వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25నుంచి మార్చి15వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. డిపార్ట్మెంటల్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆయా కళాశాలల విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు విడుదల చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తారో లేదో వేచి చూడాలి. సీసీ కెమెరాల మధ్య ప్రాక్టికల్ పరీక్షలు ప్రాక్టికల్ సామగ్రి, రసాయనాల కొనుగోలుకు ఇంటర్ బోర్డు జిల్లాలోని 10కళాశాలలకు రూ.5లక్షలు విడుదల చేసింది. కలెక్టర్ అ నుమతితో వారం రోజుల్లో ప్రాక్టికల్ సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు ఉపయోగించాలి. గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాలు మధ్య ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. – సీహెచ్. మదార్గౌడ్, డీఐఈఓ ఇంటర్ ప్రాక్టికల్స్కు రూ.ఐదు లక్షలు మంజూరు ఒక్కో ప్రభుత్వ కళాశాలకు రూ.50వేల చొప్పున విడుదల జిల్లాలో 8,257మంది విద్యార్థులు -
వనదేవతల ఆర్చ్లకు ఐరన్ గేట్లు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మల సాలహారం చుట్టూ ఆర్చ్ ద్వారాలకు ఐరన్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్చ్ స్తంభాలపై పీటీ బీమ్లను ఏర్పాటు చేసిన అనంతరం గేట్లు బిగిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే నేపథ్యంలో భక్తుల రద్దీ నియంత్రణ, దర్శనాలు సాఫీగా జరిగేలా ఐరన్ గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో క్యూలైన్.. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం స్టీల్ క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం దారిలోని క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలో రానున్నారు. క్యూలోకి ప్రవేశించే ముందు ఎంట్రెన్స్లో కొబ్బరి కాయలు కొట్టేందుకు స్టాండ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలో వచ్చిన భక్తులు గద్దెల లోపలకి వెళ్లి అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకోనున్నారు. -
యూరియా కొరత లేదు
జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు సాగుచేసిన పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఈ సీజన్లో 59వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 112 ప్రభుత్వ ఆగ్రోస్, రైతు సేవా సమితి, పీఏసీఎస్ మొదలైన వాటితోపాటు 439 ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు యూరియా సరఫరా చేశాం. రైతుకు నచ్చిన చోటుకు వెళ్లి యూరియా తీసుకునే అవకాశం కల్పించాం. కౌలు రైతుల విషయంలో కూడా ఏఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పంటల సాగును పరిశీలించి యూరియా అందించేలా చర్యలు తీసుకుంటారు. – బి. సరిత, డీఏఓ -
‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి
బయ్యారం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని జగ్గుతండాలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహం నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థ్ధులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని అంచనా వేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్ఓ నీలిమ పాల్గొన్నారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి గంగారం: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలం కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయు ల హాజరుశాతం, వసతి గృహాల నిర్వహణ, ఆరో గ్యం, శుభ్రత, సదుపాయాలు, భోజనశాల, వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ కొత్తగూడ: మండలంలోని పోలారం కస్తూర్బాగాంధీ పాఠశాలను డీఈఓ రాజేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. సోలార్ వాటర్ హీటర్ పని చేయకపోవడం వల్ల చన్నీటిస్నానం చేయలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ బిగించి ప్రారంభించలేదని, తదితర సమస్యలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలి పారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో సోలార్ వాటర్ హీటర్లు పని చేయడం లేదని వాటి స్థానంలో కొత్తవి బిగించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఓ సౌమ్య ఉన్నారు. -
లబ్ధిదారులను ఇబ్బందిపెడితే చర్యలు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడి చిరకాల కోరిక సొంతింటి కల అని, రేవంత్ రెడ్డి సర్కారు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం వెనువెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయం జరగాలని, ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షణ పెంచాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో చేరాలంటే అధికారులు బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ, డీఈ, ఏఈలు, నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. -
ఆదివాసీ సంప్రదాయాలకు అద్దం పట్టాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సీఎంఓ ప్రిన్సిపా ల్ సెక్రటరీ శ్రీనివాసరాజు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునఃప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఆయన అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షి నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని, సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ దివాకర్ వివరించారు. రహదారులు, పార్కింగ్ సెల్ఫోన్ నెట్వర్క్, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాల్లో అమ్మవార్ల పూజ కార్యక్రమాల ను వివరించారు. జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించామని, ప్రతి జోన్లో 8 మంది అధికారులు ఉంటారని, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదేశించారు. పార్కింగ్కు సంబంధించిన సమాచారం భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎంఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాసరాజు మేడారం జాతర నిర్వహణపై సమీక్ష -
సమగ్ర రిపోర్ట్ వచ్చాకే బిల్లుల చెల్లింపు
వరంగల్ అర్బన్: సమగ్ర రిపోర్ట్ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. గురువారం బల్దియా పరిధి 44వ డివిజన్లో శానిటేషన్ ఇంజనీరింగ్ పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 44వ డివిజన్ భట్టుపల్లిలో నిర్మాణం పూర్తి చేసిన సీసీ రోడ్ల బిల్లుల చెల్లింపు కోసం కమిషనర్ కొలతలు వేసి పరిశీలించారు. మొత్తం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తనిఖీలు చేపట్టాలని, సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాతే బిల్లు తీసుకురావాలని కమిషనర్ అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారిపేటలో చిన్న మేడారం జాతర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. గద్దెల ప్రాంతంలో లైటింగ్ తదితర ఏర్పాట్లను బల్దియా తరఫున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎస్టీపీ ప్రాంతంలో 150 కేఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్లాంట్ను ప్రత్యక్షంగా పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శాయంపేటలోని ఆర్–1 రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, డీఈ రవికిరణ్, ఏఈ రామన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
విద్యారణ్యపురి: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు కీలకోపాన్యాసం చేస్తూ అత్యాధునికమైన డిజిటలైజేషన్ను పాఠకులకు మరింత చేరువచేయాలన్నారు. ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ సుదర్శన్రావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మధుసూదన్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ శ్రీనివాస్రావు మాట్లాడారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి అధ్యక్షత వహించగా, సదస్సులో 75 పరిశోధన పత్రాలతో కూడిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యకమంలో లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి యుగేందర్, అధ్యాపకులు సురేష్బాబు, అరుణ, సుజాత, మధు, శ్రీనివాస్, లక్ష్మీకాంతం, జ్యోతిర్మయి, లకన్సింగ్, సువర్ణ, రాజేశ్వరి తదతరులు పాల్గొన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్కిశోర్ -
రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 58వ సీనియర్ జాతీయ ఖోఖో చాంపియన్షిప్–2026 పురుషులు, మహిళల టోర్నమెంట్కు సంబంధించిన ఏర్పాట్లను గురువారం తెలంగాణ ఆయిల్ ఫెయిడ్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించారు. రైల్వే స్టేడియంలో నిర్వహించే ఖోఖో పోటీలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్, తెలంగాణ రెఫరీ బోర్డు చైర్మన్ కె.సదానందం, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇన్స్టాలో వేధింపులు.. టెక్నాలజీతో అరెస్ట్ కాజీపేట అర్బన్: మడికొండ పోలీస్స్టేషన్ పరిధిలో ని భట్టుపల్లి గ్రామానికి చెందిన యువతిని ఇన్స్టా గ్రామ్లో వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసుల అడ్వాన్స్ టెక్నాలజీతో దొరికిపోయాడు. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ గురువారం తెలిపిన వివరా ల ప్రకారం.. డిసెంబర్ 16వ తేదీన భట్టుపల్లి గ్రా మానికి చెందిన యువతి తనకు కాబోయే భర్తతోపా టు అతని స్నేహితులకు తన గురించి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అడ్వాన్స్ టెక్నాలజీతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భట్టుపల్లి గ్రామానికి చెందిన జక్కుల వంశీని నిందితుడిగా గుర్తించారు. కాగా వంశీ గతంలో యువతిని ప్రేమి స్తున్నానని వెంటపడడంతో నిరాకరించింది. దీంతో యువతికి కుదిరిన పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నా డు. నిందితుడు ముందస్తు జాగ్రత్తగా తన వైఫై నుంచి కాకుండా ఇతరుల వైఫై నుంచి మెసేజ్ చేసే వాడు. కానీ, పోలీసులు సాంకేతికతతో పట్టుకున్నా రు. కార్యక్రమంలో ఎస్సై రాజ్కుమార్, ఐటీ కోర్ ఎ స్సై సతీష్, ఏఏఓ సల్మాన్పాషా, సీసీపీఎస్ కానిస్టేబుల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం ● డీసీపీ కవిత హన్మకొండ: మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం అవుతుందని వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. అనంతసాగర్లోని సుమతిరెడ్డి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపా ల్ రాజశ్రీ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ‘మాదక ద్రవ్యాలు వినాశం చేస్తాయి.. సంస్కృతి చైతన్యాన్ని కలిగిస్తుంది..’ అనే నినాదంతో డ్రగ్స్కు వ్యతిరేకంగా హనుమకొండలో కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని సమాజాన్ని నిశ్శబ్దంగా కుంగదీసే సమస్య అని అన్నారు. మత్తు పదార్ధాలు యువత భవిష్యత్ను ఆరోగ్యాన్ని, కు టుంబ జీవనాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమతి రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో విలువలు పెంపొందించాలని, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవర్చుకునేల తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, కళాశాల ఏఓ వేణుగోపాల స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడుపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 650 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ మధ్య ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దీంతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి నుంచి కూడా ఉప్పల్కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా బస్సులు సమకూర్చి ట్రాఫిక్ను క్లియర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గమ్యస్థానాలకు చేరవేసేందుకు అధికారులు, సూపర్ వైజర్లు 24 గంటలపాటు బస్ స్టేషన్లలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ బస్ పాయింట్ వద్ద ప్రయాణికుల కోసం తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. తాగు నీటి సౌకర్యం, ప బ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్ర యాణం కోసం ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రత్యే క బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లోను మహాలక్షి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. 650 సర్వీసులు నడిపేలా ప్రణాళిక -
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీం మినీస్టేడియంలో కొనసాగుతోన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ 6వ రాష్ట్రస్థాయి క్రీడలకు గురువారం డీడీ జనార్ధన్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అండర్ –14, అండర్–17 విభాగాలకు చెందిన బాలిబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్ తదితర క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు ఐటీడీఏలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 1,500 మంది గిరిజన బాలబాలికలు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నేడు ఫైనల్స్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పీడీలు ఆదినారాయణ, శ్యామలత, కిట్టు, ఉపాధ్యాయుడు మైపతి సంతోష్, నల్లబో యిన కోటయ్య, బానోతు శ్రీనివాస్, పీఈటీలు పాల్గొన్నారు. విజేతల గెలుపు ఇలా.. ● వాలీబాల్ అండర్ –14 బాలుర భద్రాచలం జట్టుపై ఏటూరునాగారం జట్టు విజయం సాధించింది. ● వాలీబాల్ అండర్ –17 బాలుర విభాగంలో ఉట్నూరు 2 జట్టుపై ఉట్నూరు 1 జట్టు విజయం పొందింది. ● ఖోఖో అండన్ –17 విభాగంలో బాలుర ప్లేన్ ఏరియా 2పై భద్రాచలం జట్టు విజయం సాధించగా బాలికలు ప్లేన్ ఏరియా 1 పై ఉట్నూరు 1 గెలిచింది. ● అథ్లెటిక్స్లో షాట్ఫుట్లో మొదటి బహుమతి ఉట్నూరు జోన్ 1 నుంచి ఇంద్రాబాబు, రెండో బహుమతి ఉమేష్ భద్రాచలం గెలుపొందారు. పరుగు పందెం ● వంద మీటర్ల పరుగు పందెంలో అండర్ –17 విభాగంలో ఉట్నూర్ 1కు చెందిన ఇంద్రాబాబు మొదటి బహుమతి దక్కించుకున్నాడు. రెండో బహుమతి లోకేష్ (భద్రాచలం), మూడో బహుమతి మనోజ్ (ఉట్నూరు) గెలుపొందారు. ● వంద మీటర్లు అండర్ –17 బాలికల విభాగంలో బి.నవ్యశ్రీ(ఏటూరునాగారంజోన్), శైలజ (ఉట్నూరు) రెండో స్థానం, మూడో స్థానం శృతి హాసన్ (భద్రాచలం జోన్) గెలుపొందారు. ● చెస్లో అండర్ –14 బాలికల విభాగంలో లహరిక (ఏటూరునాగారంజోన్), నందిని (ఊట్నూరు 1), విమల (ఉట్నూరు 1) గెలుపొందారు. డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ కొనసాగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలు -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● ఇద్దరి పరార్, మూడు బైక్ల స్వాధీనం జనగామ: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరార్ అయ్యారు. శుక్రవారం సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన నిందితుడు చర్లపల్లి కార్తీక్, అతని బంధువులు హుజూరాబాద్కు చెందిన దండుగుల వెంకటేష్, నల్లబెల్లికి చెందిన(ప్రస్తుత నివాసం మూసాపేట్) హేమంత్లతో కలిసి ఇటీవల హైదరాబాద్లో కూలిపని చేస్తూ బతుకుతున్నారు. కూలి పనితో వచ్చిన డబ్బులను జల్సాలు, చెడు వ్యసనాల కోసం ఖర్చు చేస్తూ మేడారం జాతర సమయంలో మోటార్ సైకిళ్లు సులభంగా దొంగిలించవచ్చని ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ నుంచి మేడారం వైపు వెళ్తున్న ముగ్గురు బీబీనగర్ టోల్ప్లాజా, జనగామ మండలం పెంబర్తి గ్రామం సమీపంలో మరో మోటార్ సైకిల్ను దొంగిలించారు. హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న బైక్ను అక్కడే వదిలి వెళ్లారు. రఘునాథపల్లిలో ఓ ఇంటి బయట పార్కింగ్ చేసిన స్కూటీ దొంగిలించి, మూడు ద్విచక్రవాహనాలపై మేడారం జాతరకు వెళ్లి, తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణెడ్డి పర్యవేక్షణలో పెంబర్తి వై జంక్షన్ వద్ద ఎస్సై నర్సయ్య తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి కార్తీక్ను పట్టుకోగా, హేమంత్, వెంకటేష్ ఇద్దరూ తమ వద్ద ఉన్న రెండు బైక్లను వదిలేసి పరారయ్యారు. విచారణలో కార్తీక్ చేసిన నేరాలను ఒప్పుకోగా, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై నర్సయ్య, కానిస్టేబుళ్లు సాగర్, కృష్ణ, అనిల్, రమేశ్ను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ అభినందించారు. -
నాణ్యమైన భోజనం అందించండి..
కేయూ క్యాంపస్: తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ మెస్ విద్యార్థినులు గురువారం ఆందోళనకు దిగారు. పరిపాలనాభవనాన్ని ముట్టడించారు. అన్నంలో పురుగులు, మేకులు, సీస పెంకులు కూడా వస్తున్నాయని, భోజనం నాణ్యతగా ఉండటంలేదని, అన్నం కూడా సరిపడా పెట్టడంలేదని ఆరోపించారు. మెస్లోనికి కుక్కలు కూడా వస్తున్నాయని తెలిపారు. తమకు పెట్టాల్సిన భోజనం వేరే మెస్కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య రాజేందర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ ఆచార్యులు మామిడాల ఇస్తారి తదితరులు తమకు సమస్యలు వివరించాలని కోరగా.. తమ సమస్యల పరిష్కారానికి వీసీ వచ్చి హామీఇవ్వాలని నిరసన కొనసాగించారు. అనంతరం పరిపాలనాభవనంలోనికి చొచ్చుకొని వెళ్లి వీసీ చాంబర్లో నిరసన తెలిపారు. స్పందించిన వీసీ.. హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్, జాయింట్ డైరెక్టర్లు, కేర్టేకర్లను పిలిపించి అకాడమిక్ కమిటీహాల్లో సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థినులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు.. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వీసీకి అందజేశారు. ఏబీవీపీ కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, బాధ్యులు మాధవరెడ్డి, మెరుగు సాయికుమార్, విజయ్, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు. కేయూ మహిళా హాస్టల్ విద్యార్థినుల ఆందోళన పరిపాలనాభవనం ముట్టడి -
వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలి
ఎంజీఎం: వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కాలే జీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థులు డాక్టర్ సుజిత్, డాక్టర్ వేణు, డాక్ట ర్ అనుపమల నేతృత్వంలో నిర్వహిస్తున్న క్రితి 3.0 ఈవెంట్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడు తూ.. వైద్య విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చా రు. అనంతరం వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, బోధన సిబ్బంది, నిర్వాహకులు కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన మెడ్ ఎక్స్పోను సందర్శించారు. ఈవెంట్ మొదటి రోజు పేపర్ ప్రెజెంటేషన్లు, సర్జికల్ స్కిల్స్ వర్క్షాప్, జియోపార్డీ, మెడ్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. నేడు (శుక్రవారం) సింపోజియం, పోస్టర్ ప్రెజెంటేషన్లు, సీఎంఈ ప్రసంగాలు, సర్జికల్ స్కిల్స్ వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డి -
కక్షిదారు వద్దకే జడ్జి..
● మానవత్వం చాటిన న్యాయమూర్తి ధీరజ్కుమార్ తొర్రూరు: ఓ సివిల్ కేసులో కోర్టుకు వచ్చిన బాధితురాలు నడవలేనిస్థితిలో ఉండడంతో న్యాయమూర్తి ఆమె దగ్గరికే వచ్చారు. ఈ ఘటన తొర్రూరులో గురువారం జరిగింది. ఓ సివిల్ కేసులో కక్షిదారురాలిగా ఉన్న పద్మ అనే మహిళ తొర్రూరు సివిల్ కోర్టుకు వచ్చింది. ఆమె తన కాళ్లు పనిచేయక అనారోగ్యంతో ఉండి కోర్టు భవనంపైకి వెళ్లే పరిస్థితి లేదు. సమాచారం తెలుసుకున్న జడ్జి ధీరజ్కుమార్ ఆమె వద్దకే వచ్చి కేసు వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే కేసును పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి
మహబూబాబాద్: మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సతీష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఽశ్రీధర్ అన్నారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్లు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలన్నారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉన్నత పాఠఽశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్, లింగన్న, వెంకట్రెడ్డి, కరుణాకర్, హల్యా, నాగరాజు పాల్గొన్నారు. యూరియా కోసం ఆందోళన వద్దు మహబూబాబాద్ రూరల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబా బాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో యూరియా పంపిణీపై స్థానిక రైతు వేదికలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి సరిపడా యూరియా సరఫరా చేస్తున్నారని తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ రైతులకు యూరియాను సకాలంలో అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఏఓ బి.సరిత, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్ఈమహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం గ్రామంలో విద్యుత్శాఖ అధికారులు గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యల గురించి తెలుసుకోవడానికి విద్యుత్ అధికారులు ప్రజా బాట కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా బాటలో భాగంగా విద్యుత్ సమస్యల గురించి తెలుసుకుని తుప్పు పట్టిన స్తంభాలను మార్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంపటి రమేష్, ఉప సర్పంచ్ మద్ది వెంకటరెడ్డి, విద్యుత్ రూరల్ ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఏఈ పీక వెంకటేష్, సిబ్బంది వీరాచారి, కుదురుపాక వివేక్, వీరభద్రం, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ నిమిత్తం అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీయూపీఎస్ స్కూల్స్–9, హైస్కూల్స్– 92, మొత్తం 101 పాఠశాలల బాలికలను సెల్ఫ్ డిఫెన్స్కు ఎంపిక చేశామని, దరఖాస్తులు ఈ నెల 9నుంచి 12వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పిచాలన్నారు. శిక్షకులకు నెలకు రూ.5వేల చొప్పున 3 నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. శిక్షణ కోసం మహిళా శిక్షకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, మహిళలు లేకపోతే పురుష శిక్షకులను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.పగడాల కాళీ ప్రసాద్, గుండె గణేష్, ఒంటేరు జైపాల్, ఎడ్ల అశోక్ రెడ్డి, దిలీప్ నాయక్, చాడ స్వాతి, గుజ్జల వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
గంజాయి సాగు చేస్తే జైలుకే..
● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్ : గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఎఎస్, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిధిలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములు, అటవీ, కొండ ప్రాంతాలు, దూర గ్రామ ప్రాంతాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. పాత గంజాయి నేరస్తులు, గంజాయి విక్రయించే వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలు, గంజాయి నిల్వ చేసే ప్రాంతాలు, విక్ర య కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికై నా తెలిస్తే, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను పూర్తి గా గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, ప్రజల సహకారంతోనే గంజాయి రహిత జిల్లా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని నర్సింహులపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. -
ముచ్చటగా మూడోసారి!
మహబూబాబాద్: మానుకోట.. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. త్వరలో మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో నాయకులు సవాల్గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరుగగా.. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్గా.. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కాగా.. మూడోసారి ఆ పీఠంపై రెండు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాగా, ఈనెల 10ను తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. దానిని ఈనెల 12వ తేదీకి ఎన్నికల సంఘం అధికారులు మార్చారు. 2014లో మొదటిసారి ఎన్నికలు.. మానుకోట మేజర్ గ్రామపంచాయతీ 2011 అక్టోబర్ 3న మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2011 అక్టోబర్ 3వ తేదీ నుంచి 2014వరకు ఇన్చార్జ్ పాలన సాగింది. 2014 మే నెలలో ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్–సీపీఐ పొత్తు పెట్టుకోగా.. కాంగ్రెస్ ఒంటరిగా.. సీపీఎం–టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాగా, కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు 7, సీపీఎం 5, సీపీఐ 3, టీడీపీ 3, స్వతంత్రులు 3 వార్డుల్లో గెలుపొందారు. చైర్పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్య ఉమా మురళీనాయక్, వైస్ చైర్మన్గా సీపీఎం అభ్యర్థి సూర్నపు సోమయ్య బాధ్యతలు స్వీకరించారు. 2019 జూలై 3న పాలక మండలి గడువు ముగిసింది. 2020లో ఎన్నికలు.. రెండోసారి 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరుగగా.. అదే నెల 25న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. ఈమేరకు బీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, స్వతంత్రులు 3వార్డుల్లో గెలుపొందారు. చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కావడంతో అదే నెల 27న చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి పాల్వాయి రామ్మోహన్రెడ్డి, అదే పార్టీకి చెందిన వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరీద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత మధ్యలో వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టగా.. ఆ పార్టీకే చెందిన మార్నేని వెంకన్న వైస్ చైర్మన్ అయ్యారు.12న ఓటరు తుది జాబితా.. త్వరలో మానుకోట మున్సిపాలిటీ ఎన్నికలు గత ఎన్నికల్లో పెరిగిన వార్డులు.. ప్రస్తుతం పెరిగిన ఓటర్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ చైర్మన్ రిజర్వేషన్పై ఉత్కంఠ ఈనెల 12న తుది ఓటరు జాబితాత్వరలో మూడోసారి.. జిల్లాలోనే అతిపెద్దదైన మానుకోట మున్సిపాలిటీపై అందరూ దృష్టి పెట్టారు. ప్రస్తుత్తం 36 వార్డులు ఉండగా.. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 65,851 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 57,828 మంది ఓటర్లు ఉండగా 8,023 మంది పెరిగారు. కాగా, ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం కావడంతో ఆ పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, చైర్మన్ రిజర్వేషన్పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల12న ఓటరు తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఎన్నికల కోలాహలం మొదలవ్వనుంది. ఇప్పటికే పార్టీల వారీగా ముఖ్య నా యకులతో సమావేశాలు నిర్వహించి, వార్డుల వా రీగా ఆశావహుల వివరాలు తీసుకుంటున్నారు.ఓటరు జాబితా హెడ్యూల్ ప్రకారం ఈనెల 10న ఓటరు తుది జాబితా తయారు చేసి ప్రదర్శించాలి. కాగా బుధవారం మళ్లీ విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఈనెల 12న ఓటరు తుది జాబితా ప్రదర్శించనున్నట్లు అధికారులు చెప్పారు. మున్సిపల్ చట్టం–2019లో సవరించిన సెక్షన్–195ఏ ప్రకారం వార్డుల వారీగా ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తా రు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా, 16న పీఎస్ వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేశ్వర్ రావు నర్సింహులపేట: పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదవి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని హైస్కూల్, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వి ద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా ఎక్కువ మార్కులు వచ్చేలా బోధించడంతో పాటు పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. హైస్కూల్, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కేజీబీవీలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రామ్మోహన్రావు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మందుల శ్రీరాములు, ప్రిన్స్పాల్ స్వప్న, సీఆర్పీ జక్కి రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా వ్యవహరించాలి
● జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు, రెవెన్యూ అధికారులతో జిల్లా కోర్టులో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు నిఘా విభాగానికి అన్ని రకాల సమాచారాలు వస్తుంటాయని, బాల్యవివాహాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వివాహం జరిగిన తర్వాత సమాచారం వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలు లేదా పోక్సో చట్టానికి సంబంధించి బాధిత బాలికలు పాఠశాలల్లో వివక్షకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పోలీసు అధికారులు న్యాయ సేవా సంస్థ సహాయం తీసుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని మాట్లాడుతూ.. నామాలపాడు, కొత్తగూడ ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో తల్లిదండ్రులతో నివసిస్తున్న పిల్లల చదువులు, పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని కోరారు. న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్, ఎం.ధీరజ్ కుమార్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్, డీఈఓ రాజేశ్వర్ రావు, జిల్లాలోని పోలీసు స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని కాపాడండి
● ఝాన్సీరెడ్డిపై అసమ్మతి నేతల ఫిర్యాదు తొర్రూరు రూరల్: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను అసమ్మతి నేతలు కోరారు. తొర్రూరు మండలానికి చెందిన అసమ్మతి నాయకులు గురువారం కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై హైదరాబాద్లో ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్రావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పార్టీ నాయకురాలు ఝాన్సీరెడ్డి విస్మరిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆమె పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు ఆరోపించారు. ఝాన్సీరెడ్డి తప్పుడు విధానాల వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను సైతం కాంగ్రెస్ పార్టీ గెలువ లేదన్నారు. ఇప్పటికై నా పాత, కొత్త తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, లేకుంటే ఒక్క స్థానం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు రామసహాయం కిశోర్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ హనుమాండ్ల నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంచు సంతోష్, సర్పంచ్లు ధర్మారపు మహేందర్, కొమురవెల్లి లింగమూర్తి, నలుగురి రామలింగం, నాయకులు మేర్గు మల్లేశంగౌడ్, హనుమాండ్ల నరేందర్రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, తమడపల్లి సంపత్, బిజ్జాల వరప్రసాద్, సహదేవ్, మహేశ్, రాకేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
● సీఎం కప్ టార్చ్ ర్యాలీలో ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జ్యోతి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించండి
మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో గురువారం ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహన డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించాలని, వాహనా లను ఓవర్టేక్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ వహించాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. పాఠశాలల బస్సులు క్రమం తప్పకుండా ఫిట్నెస్ ఉండే విధంగా నిత్యం తనిఖీలు చేసుకోవాలన్నారు. వాహనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిం చాలన్నారు. ఫైర్ అధికారి టి.మోహన్రావు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సాయిచరణ్, వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్కుమార్, డీపీఆర్ఓ రాజేందర్ప్రసాద్, వైద్యాధికారులు మౌనిక, నర్మద ఉన్నారు. -
మెనూ పాటించడం లేదు
● ఎల్లంపేట హైస్కూల్ విద్యార్థుల నిరసనమరిపెడ రూరల్: పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ పాటించకుండా నీళ్లచారు, ఉడికి ఉడకని అన్న ం వడ్డిస్తున్నారని మండలంలోని ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కూల్ ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన స్నేహశీలి మహిళా సంఘం వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారని, అయితే మెనూ పాటించడం లేదని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పుతున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలలో 150మంది విద్యార్థులకు 50నుంచి 60మంది మాత్రమే భోజనం చేస్తున్నారని, మిగిలిన విద్యార్థులు బాక్స్ తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఎంఈఓ అనితాదేవి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీఓ సోమ్లనాయక్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులను సముదాయించారు. మెనూ పాటించడంతో పాటు నాణ్యమైన భోజనం, గుడ్డు అందించేలా వంట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు గ్రామస్తులతో కలిసి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కాగా వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంఈఓ, తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం వడ్డించాలని, లేని క్రమంలో కొత్త ఏజెన్సీని నియమించేలా వంట నిర్వాహకుల నుంచి రాత పూర్వకంగా ఒప్పంద పత్రం తీసుకున్నారు. -
బస్సుల కండీషన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
హన్మకొండ: మేడారం జాతరలో బస్సుల వైఫల్యం లేకుండా కండీషన్పై మెయింటెనెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ సూచించారు. బుధవారం వరంగల్ ములుగు రోడ్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో బస్సులు ఫెయిల్ కాకుండా మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బ్రేక్డౌన్ కాకుండా బస్సులను సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్ రవి చంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు భూ తగాదా.. అన్నను చంపిన తమ్ముడు వర్ధన్నపేట: భూ తగాదా నేపథ్యంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. బుధవారం వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రా మానికి చెందిన కొండ వీరస్వామి(62)కు తన తమ్ముడు వెంకన్నతో 30 ఏళ్లుగా భూ తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 5న వీరస్వామి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ తన మరో తమ్ముడు లక్ష్మయ్య పొలంలో ఉన్నాడు. స మీపంలోని మడుగులో చేపలు పడదామని లక్ష్మ య్యకు చెప్పి వీరస్వామి ముందు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో వీరస్వామి చిన్న త మ్ముడు, నిందితుడు వెంకన్న తన అన్న ఒంటరిగా ఉండడం గమనించి ఇదే అదనుగా భావించాడు. అక్కడే ఉన్న పారతో వీరస్వామిని దారుణంగా కొట్టి చంపి పరారయ్యాడు. మరో సోదరుడు లక్ష్మ య్య కుండ పట్టుకుని మడుగు వద్దకు వచ్చి చూడగా వీరస్వామి కనిపించలేదు. దీంతో అక్కడే వెతుకుతున్న క్రమంలో మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన వెంకన్నను బుధవారం రాయపర్తి బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.కాగా, 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి ఎస్సై రాజేందర్ను సిబ్బందిని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నర్సయ్య అభినందించారు. ● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ నిందితుడి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఏసీపీ నర్సయ్య -
తెగులు.. దిగులు
కాళోజీ సెంటర్ : మిర్చి.. రైతు ఇంటా సిరులు కురిపించే పంట. ఎర్రబంగారంగా పిలిచే ఈ పంట రైతుకు అధిక ఆదాయం అర్జించి పెడుతుంది. అందుకే అన్నదాతలు ఈ పంట సాగుకు మొక్కు చూపుతారు. అయితే ప్రస్తుతం మిర్చి రైతుకు తెగులు దిగులు పుట్టిస్తోంది. నల్ల తామర, తెల్ల దోమ పురుగు మిరప పంటను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టపరుస్తోంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట నష్టపోకుండా అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా ఉద్యన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు అన్నదాతలకు పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి రైతులకు ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సూచనలు -
మరమ్మతు కేంద్రాల మూసివేత
నేటినుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లహన్మకొండ: ప్రైవేట్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాల యజమానుల సంక్షేమ సంఘం మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి(గురువారం)నుంచి మరమ్మతు కేంద్రాలను మూసి వేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి కాలిన ట్రాన్స్ఫార్మర్లు స్వీకరించడం, మరమ్మతు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ఇవ్వడం పూర్తిగా నిలిచిపోనుంది. నాలుగు నెలల క్రితం మెరుపు సమ్మెకు దిగగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమించారు. నాలుగు నెలలవుతున్నా యాజమాన్యం ముందుంచిన 20 డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కరించ లేదు. దీనిపై పలుమార్లు చర్చలు జరిపినా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 జిల్లాల్లోని 176 ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు మూసివేయనున్నారు. పెరిగిన మెటీరియల్ రేట్ ప్రకారం ధర పెంచాలని, కూలీలకు కనీస వేతనాలు కల్పించాలని తాము కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఎన్పీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జుల నర్సింహారెడ్డి తెలిపారు. మెరుపు సమ్మెకు దిగిన మరమ్మతు కేంద్రాల యజమానులు -
ప్రజాఉద్యమాలతోనే సామాజిక మార్పు
కేయూ క్యాంపస్: ప్రజా ఉద్యమాలతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం, తెలుగు విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ చరిత్రలో ప్రజా ఉద్యమాలు 1969–2025’ అనే అంశంపై బుధవారం కేయూ సెనేట్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రజా ఉద్యమాలు చైతన్య ప్రక్రియలన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సమాజ హిత ఉద్యమాలను స్వాగతించాలన్నారు. ప్రజల అవసరాల నుంచి పుట్టినవే ఉద్యమాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతి మామిడి లింగయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, స్టూడెంట్స్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు సి.హెచ్ రాధిక, నిరంజన్, తెలుగు విభాగం అధ్యాపకులు సదాశివ్, బానోతు స్వామి పాల్గొన్నారు. కాగా, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు -
పెరటి కోళ్ల పెంపకం..
చక్కటి ఆదాయ మార్గం.. ఖిలా వరంగల్ : దళిత మహిళారైతుల ఆదాయ మార్గం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకం ద్వారా గ్రామీణ, నగర శివారు ప్రాంతాల్లో పెరటి కోడి పిల్లలు పంపిణీ చేస్తోంది. ఫలితంగా దళిత మహిళా రైతులు, ఇతర కుటుంబాలు నెలకు రూ.10 వేలు కంటే అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరటికోళ్లలో రకాలు, పెంపకంతో వచ్చే ఆదాయంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాగా, ఈ పథకంపై మామునూరు పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా ఆదాయం.. నాటుకోడి ఏడాదికి మూడుసార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి మూడు వారాల పాటు గుడ్డు పెడుతుంది. ఏడాదికి 40–45 కోడిగుడ్లు పె డుతుంది. పొదిగిన సమయంలో 12–15 గుడ్లు పె డుతుంది. ఇందులో 10–12 పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కోడి పొదుగు ప్రారంభించిన తర్వాత మూడు వారాల్లో గుడ్లు పిల్లలుగా రూపుదిద్దుకుంటాయి. ఒక కోడి ఏడాదికి 40 గుడ్లు పెడితే 36 పిల్లలుగా రూపాంతరం చెందుతాయని పశుసంవర్థశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. 36 పిల్లలు కోళ్లుగా ఎదగడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఒక్కొ నాటు కోడిని రూ.400 నుంచి 500 వరకు అ మ్ముతున్నారు. 14 పిల్లల్లో 50 శాతం ఆడ(పెట్ట లు ), 50 శాతం మగ (పుంజులు) ఉంటాయి. పెంప కం దారులు పుంజులు అమ్మి పెట్టలను పెంచుకుంటే దినదినాభివృద్ధి చెంది కోళ్లతోపాటు గుడ్లు సంఖ్య పెరిగి దశల వారీగా ఆదాయం పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కోళ్ల పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడికి రక్షణగా చిన్న గంప లేదా ఇనుప కుందెన ఏర్పాటు చేసుకుంటే కుక్కలు, పిల్లుల బెడద ఉండదు. మహిళలు, వృద్ధులు ఈ పెంపకంపై దృష్టి సారిస్తే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటి ఆవరణ, ఖాళీ స్థలం చుట్టూ పెన్సింగ్ వేసి రక్షణ కల్పిస్తే వందల సంఖ్యలో కోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లోని వ్యర్థ పదార్థాలను కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటే వ్యాధులు బారిన పడకుండా కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్ల గుడ్లు బరువు 50 నుంచి 60 గ్రాములు.. కోళ్లలో రెండు రకాలు ఉన్నాయి. నాటుకోళ్లు, అభివద్ధి చెందిన నాటుకోళ్లు. నాటు కోళ్ల ఏడాదికి మూడు సార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి గుడ్లు పెడుతాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్లల్లో రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ వంటి రకాలు ఉన్నాయి. ఈ రకం కోళ్లు ఏడాదికి 180–240 గుడ్లు పెడుతాయి. ఈ రకం కోళ్లలో పొదిగే స్వభావం తక్కువ ఉంటుంది. రెండు నెలలు కోడిగుడ్లు పెడుతాయి. ఒక్కొక్క గుడ్డు బరువు 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది. యంత్రాల ద్వారా కోడి పిల్లల తయారీ.. అభివృద్ధి చెందిన కోళ్ల రకాలను మెరుగుపర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రకం కోళ్లు ఏడాదికి 180 నుంచి 240 గుడ్లు పెడుతాయి. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అందుకే కృత్రిమ కోడి పిల్లల తయారీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. ఇంక్యుబేటర్ (పొదిగే యంత్రం)లో గుడ్లు పెడితే 21 రోజుల తర్వాత పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. 21 రోజుల తర్వాత పిల్లలను బయటకు తీసి పెంచుకోవాలి. ఇంక్యుబేటర్ రూ.10వేలు నుంచి రూ.40 వేల వరకు ఉంది. చిన్న ఇంక్యుబేటర్లో 4 డజన్లు (48) పిల్లలు తయారయ్యే అవకాశం ఉంది. దళిత మహిళారైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత వందశాతం సబ్సిడీతో కోడిపిల్లలు పంపిణీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన -
మేడారానికి ఆర్టీసీ సర్వీసులు
నెహ్రూసెంటర్: మేడారం మహాజాతరకు మహబూబాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 9నుంచి మేడారం జాతరకు డిపో నుంచి బస్సులు నడపనున్నారు. ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి బస్సులు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. మేడా రం జాతర, సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీ ఇటు భక్తులు, అటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు, బస్సుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా మేడారం జాతరకు 130 ప్రత్యే బస్సులను రద్దీకి అనుగుణంగా నడిపించనున్నారు. సంక్రాంతి వేళ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ‘మహాలక్ష్మి’ ద్వారా ఉచిత ప్రయాణం.. మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేలా ఆర్టీసీ అనుమతినిచ్చింది. వనదేవతల జాతరకు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా జాతరకు వెళ్లి తిరిగి రావా లని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా వనదేవతల గద్దెల వద్దకు చేరుకోనున్నాయి. కాగా, మానుకోట నుంచి జాతరకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160గా టికెట్ ధరలను ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతికి సన్నద్ధం.. మేడారం జాతరతో పాటు ఈ నెలలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీకి మరింత ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ప్రస్తుతం ప్రతీ రోజు డిపో నుంచి 35 వేల మంది ప్రయాణికులను చేరవేస్తుండగా.. ఈ సంఖ్య ఈ నెలలో మరింత పెరగనుంది. డిపోలో 74 బస్సులు ఉండగా ప్రయాణికుల తాకిడి పెరిగితే ఇతర డిపోల నుంచి బస్సులను తరలించనున్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈ నెల 10నుంచి నడిపించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహబూబాబాద్ డిపో నుంచి బస్సులను మేడారం జాతరకు ఏర్పాటు చేశాం. అదే విధంగా రానున్న సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నాం. భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –వి.కల్యాణి, డిపో మేనేజర్, మానుకోట రేపటి నుంచి జాతరకు బస్సులు ప్రారంభం సంస్థకు కలిసొచ్చిన జాతర, సంక్రాంతి సీజన్ రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటుకు కసరత్తు -
ఉపాధి కోల్పోయాం..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో ఉపాధి కోల్పోయామని సిగ్నల్తండా, రాజుతండాకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిగ్నల్తండా, రాజుతండాకు చెందిన మహిళలు గాంధీ సెంటర్లో ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో తాము ఉపాధి కోల్పోయామని, వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు కూడా దొరకడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహిళలు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సీఐ చంద్రమౌళి, ఎస్సై వంశీధర్తో పాటు మున్సి పల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, హైదరాబాద్ దక్కన్– విజయవాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్ నగర్ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (07469) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07470) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగా మ, ఘన్పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. హైదరాబాద్–విజయవాడ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్ దక్కన్–విజయవాడ (07471) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో విజయవాడ–హైదరాబాద్ దక్కన్ (07472) ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, ఘన్పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుచనూరు, చర్లపల్లి–తిరుచనూరు మధ్య రెండు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. జనవరి 22వ తేదీన చర్లపల్లి–తిరుచనూరు (07140) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 25వ తేదీన తిరుచనూరు–చర్లపల్లి (07141) వీక్లి ఎక్స్ప్రెస్ వరంగల్కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నాలుగు ట్రైన్లు హైదరాబాద్ దక్కన్–విజయవాడ మధ్య నాలుగు.. -
సీసీ కెమెరాల నిఘా
● వ్యవసాయ మార్కెట్లో 28 ఏర్పాటు మహబూబాబాద్ రూరల్ : రైతుల వ్యవసాయ పంట ఉత్పత్తుల రక్షణ నిమిత్తం మానుకోట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో నూతనంగా సీసీ కెమెరాల (నిఘా నేత్రాలు) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా 28 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించే పని మొదలుపెట్టారు. యార్డు పరిధిలో రైతులకు అందిస్తున్న సేవల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. నారాయణపురం భూముల రీ సర్వేకు గెజిట్ విడుదలకేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామానికి సంబంధించిన భూములను లెక్కించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు గెజిట్ విడుదల చేసింది. 2017లో నెల్లికుదురు మండల పరిధిలోని చిన్నముప్పా రం రెవెన్యూ గ్రామం నుంచి నారాయణపురం విడిపోయి కేసముద్రం మండలంలో కలిసింది. ఈ క్రమంలో పలువురు రైతుల పట్టాభూములు ధరణి పోర్టల్ రికార్డుల్లో అడవి భూములుగా నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని పలుమార్లు రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించారు. కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు అందించినప్పటికీ మరికొంత మందికి రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు, రుణాలకు దూరమై తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నారాయణపురం గ్రామ భూముల రీ సర్వే నిర్వహించాలని బుధవారం ప్రత్యేకంగా గెజిట్ను విడుదల చేసింది. గ్రామ సరిహద్దులు నిర్ణయించి అధికారులు సర్వే నిర్వహించనున్నారు. -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా మా మునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరి యా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రి య, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజు ల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్య మంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలి క సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో రెండు పడకల గదులకు లబ్ధిదా రుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, భూక్య మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
పొత్తు పొడిచేనా?
సాక్షి, మహబూబాబాద్: ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట మానుకోట. సాయుధ పోరాటం మొదలుకొని.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషి ంచారు. పేదలకు ఇళ్లు, కార్మికులు, కర్షకుల హక్కు ల కోసం అనునిత్యం పోరాటాలు చేసిన ఘనత ఈ ప్రాంత కమ్యూనిస్టులకు దక్కింది. అందుకోసమే దొరలు, భూస్వామ్యులను ఎదిరించి ప్రజల అండతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక పదవులు అలంకరించిన చరిత్ర ఉంది. అయితే క్రమంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీల ప్రతిష్టను కాపాడాలంటే ఇతర పార్టీలతో పొత్తులు అనివార్యమని కామ్రేడ్స్ అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతూనే.. పొత్తుల విషయంపై కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్తో సీపీఐ దోస్తీ.. సార్వత్రిక ఎన్నికల నుంచే సీపీఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తోంది. దీనికి ఫలితంగానే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ రెడ్డికి మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈమేరకు మున్సిపల్ ఎన్నికల్లోనూ సముచిత స్థానం ఉంటుందని సీపీఐ నాయకులు చెబుతున్నారు. పార్టీ బలం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్లో గత మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డుల్లో పోటీ చేసి రెండు గెలిచామని, మిగిలిన చోట్ల కూడా స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యామని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ సారి మహబూబాబాద్లో 18 వార్డులతో పాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో రెండేసి స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ పోటీ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. పొత్తు ఉంటే ఉండవచ్చు.. కానీ వారు అడిగినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి ఉండబోదని ఆ పార్టీలోని కొందరు కీలక నాయకులు చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు విషయంపై స్పష్టత రానుంది. సీపీఎం దారెటు..? ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వక పొత్తు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం.. సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసిన సీపీఎం మున్సిపల్ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే విషయంపై కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం పొత్తు పెట్టుకుంటే ఆశించినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి కనిపిండం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన సీపీఎం రెండు స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో కొన్నింటిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు కూడా మానుకోటలో 10 వార్డులతోపాటు, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు తగ్గకుండా పోటీలో ఉండేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే సీపీఎంతో పొత్తుకు జిల్లాలోని ఇరు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో జతకంటే అవకాశం ఉందనే ఊహగానాల నేపథ్యంలో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల బీఆర్ఎస్తో కలిసి పోటీచేసే అవకాశం లేదు. అదే విధంగా కాంగ్రెస్లోని ఓ పెద్దనాయకుడు ఇటీవల వామపక్ష పార్టీలతో పొత్తుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మాటలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టులు గెలిచే స్థానాలు తక్కువగా ఉన్నా.. వారి ఓట్లతో ఇతర పార్టీలను ఓడించడం, గెలిపించే సత్తా ఉన్నట్లు కామ్రేడ్స్ అంటున్నారు. చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కమ్యూనిస్టులతో పొత్తు కీలకంగా ఉంటుందని ఉభయ కమ్యూనిస్టుల వాదన. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మున్సిపల్ ఎన్నికలపై కామ్రేడ్స్ కసరత్తు పొత్తులు అనివార్యంగా కమ్యూనిస్టుల ఎత్తుగడలు కాంగ్రెస్తో దోస్తీకి సీపీఐ సిద్ధం సీపీఎం పొత్తుపై సందిగ్ధం -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఏటూరునాగారం: కొమురం భీంను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం అండర్ –14, 17 విభాగాల్లో 6వ రాష్ట్రస్థాయి (భద్రాద్రి కొత్తగూడెం, ఊట్నూరు, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏలు, 10 ప్లేన్ ఏరియాలు) గిరిజన క్రీడలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయులు, ఐటీడీఏ పాలన అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ఈ పోటీల్లో రాణించి పేరు తీసుకురావాలన్నారు. కాగా, అండర్– 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో జోన్ –2(ఏటూరునాగారం)కు చెందిన చరణ్ మొదటి స్థానం, జోన్ –1(భద్రాచలం)కు చెందిన సోను రెండో, ధీరజ్ మూడో స్థానం సాధించి బహుమతులు అందుకున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్తోపాటు ఇతర క్రీడలూ ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్, డీటీడీఓలు, ఏటీడీఓలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏటూరునాగారంలో 6వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు ప్రారంభం -
ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
వరంగల్: ప్రగతిశీల ప్రజాస్వా మ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) 23వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రచురించిన ‘మళ్లీ డి టెన్షన్ గుది బండే’, ‘సంక్షోభంలో విద్యారంగం’ అనే రెండు పుస్తకాలను పీడీఎస్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడపంగి నాగరాజు గత మహాసభ నుంచి నేటి వరకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల నివేదికలను హాజరైన సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావుతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రేపు బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న వరంగల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (16 జిల్లాల పరిధి) కా ర్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని 2006లో స్థాపించినట్లు చెప్పారు. సంఘం స్థాపించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్లో శుక్రవారం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటా రని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వి ద్యుత్ ఉద్యోగులు తరలొచ్చి ఈ మహాసభను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పెరుమాండ్ల సత్యనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు నాగిళ్ల సదానందం, నాయకులు చంద్రమౌళి, సత్యనారాయణ, సర్వేశ్వర్, ప్రసాద్, కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ కార్యదర్శి రాజేందర్ -
వందశాతం సబ్సిడీపై పంపిణీ
దళిత మహిళా రైతుల ఆదాయాన్ని పెంచడానికే కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పెరటి కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నాం. పెంపకంపై అవగాహన కల్పించి మహిళలకు ఆదాయ మార్గాలు చూపుతున్నాం. అభివృద్ధి చెందిన కోళ్ల జాతిలోని రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ పిల్లలను 100శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. దీంతో షెడ్యూల్ కులాల మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు. – డాక్టర్ బిందు మాధురి, కోఆర్డినేటర్, కేవీకే, వరంగల్ -
విద్యుత్ పనులు 10లోపు పూర్తి చేయాలి
హన్మకొండ : మేడారం జాతర విద్యుత్ సరఫరా పనులను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ములు గు ఎస్ఈ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జాతరను దృష్టిలో ఉంచుకుని నార్లాపూర్లో కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి ఈ నెల 16న చార్జ్ చేయాలన్నారు. అలాగే, గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడారంలోని పార్కింగ్ స్థలా ల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు వివిధ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 170 వరకు ఏర్పాటు చేశామన్నారు. అవసరం మేరకు బిగించాల్సిన ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్టస్) వి.మోహన్ రావు, డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజు చౌహాన్, ములుగు ఎస్ఈ ఎ.ఆనందం, డి.ఈ.లు పి.నాగేశ్వర రావు, రాజు, సదానందం, ఈఈ (సివిల్) వెంకట్ రామ్, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు. 16న నార్లాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ చార్జ్ చేయాలి పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఫిర్యాదులకు లోకల్ కోర్టు మంచివేదిక
పెద్దవంగర: విద్యుత్ వినియోగదారులు నేరుగా తమ ఫిర్యాదులు తెలియజేసేందుకు లోకల్ కోర్టు మంచి వేదిక అని టీజీ ఎన్సీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ ఎన్వీ వేణుగోపాల చారి అన్నారు. మండలంలోని చిన్నవంగర విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం విద్యుత్ వినియోగదారుల కోసం లోకల్ కోర్టును నిర్వహించారు. పలు సమస్యలపై రైతుల నుంచి 12 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వేణుగోపాల చారి మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు లోకల్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఇది మంచి వేదికని, అందిన ప్రతీ దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని విద్యుత్ అధికారులను అదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రమేష్, ఫైనాన్స్ మెంబర్ దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, డీఈ రవి, ఏడీఈ చలపతిరావు, ఏఈ మహేష్, పెద్దవంగర ఏఈ రమేష్ బాబు, సబ్ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 20న జరగనున్న తల్లిదండ్రుల సమావేశం విజయవంతం చేయాలని డీఐఈఓ మదార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం తల్లిదండ్రులు–అధ్యాపకుల ఆహ్వాన పోస్టర్ను డీఐఈఓ మదార్, ప్రిన్సిపాళ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లల భవిష్యత్, ఒత్తిడి తగ్గించడానికి సలహాలు, సూచనలు తె లుసుకోవడానికి మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి తల్లిద ండ్రులు తప్పక హాజరకు కావాలని కోరా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల జిల్లా అధ్యక్షుడు పొక్కుల సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్, ప్రిన్సిపాల్ డీపీ గణేష్, అధ్యాపకులు నాగిరెడ్డి, షాహిద్, శివకుమార్, ప్రేమ్శేఖర్, సారయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. డోర్నకల్ ఎఫ్ఆర్ఓ రేణుక సస్పెన్షన్ డోర్నకల్: అటవీశాఖ డోర్నకల్ రేంజ్ అధికారి పి.రేణుక సస్పెండ్ అయ్యారు. కొద్ది నెలల క్రితం రేంజ్ పరిధిలో సండ్ర కర్ర అక్రమ తరలింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్ఆర్వో రేణుకను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డోర్నకల్, కురవి మండలాల నుంచి సండ్ర కర్రను సేకరించి తరలిస్తుండగా ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు విచారణ జరిపి గత అక్టోబర్లో డోర్నకల్, కురవి సెక్షన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఆర్ఓ రేణుకను కూడా బాధ్యురాలిని చేస్తూ ఆమెను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. పర్మిట్ ట్యాంపరింగ్పై విచారణ.. జిల్లాలో కర్ర తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు ట్యాంపరింగ్ జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ జరి పినట్లు సమాచారం. మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో కర్ర కొనుగోలు చేసి మహబూబా బాద్లో కొన్నట్లు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన అధికారులు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడిని విచారించినట్లు సమాచారం. హాస్టల్లో ప్రవేశాలు రద్దు చేసుకోవాలి కేయూ క్యాంపస్: కేయూలో రెండో పీజీ చేస్తున్న విద్యార్థులు హాస్టల్లో ప్రవేశాలను రద్దు చేసుకోవాలని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ రాజ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరా రు. డబుల్ పీజీ చదివే విద్యార్థులకు వర్సిటీ నిబంధనల ప్రకారం హాస్టల్ వసతి, మెస్ సదుపాయం ఇవ్వకూడదని గతంలోనే స్పష్టమై న ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘంచి హాస్టళ్లలో ప్రవేశాలు పొందిన ట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తమ హాస్టళ్లలో ప్రవేశాన్ని ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రద్దు చేసుకోకపోతే తామే రద్దు చేస్తామని తెలిపారు. హాస్టల్ డిపాజిట్ కూ డా తిరిగి ఇవ్వమని, కళాశాల ప్రవేశం సైతం ర ద్దుకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ కృష్ణ కిశోర్ పెద్దవంగర: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని చిన్నవంగర కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ కిశోర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ మోసాలతో పాటు డిజిటల్ అరెస్టు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయడం ముఖ్యమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 వినియోగంపై వివరించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ అంశాల గురించి చెప్పారు. అనంతరం రోడ్డు భద్రతలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది సుధాకర్, హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మరోసారి ఎగిరేది గులాబీ జెండే..
జనగామ : రాష్ట్రంలో బీఆర్ఎస్(గులాబీ) జెండా మరోసారి ఎగరబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి తో కలిసి మాట్లాడారు. ఉద్యమంలో పాత్రలేని నేతలు పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బిడ్డకు ఎంపీ అనేక పదవులు అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తట్టా, పార పారేసి సీఎం రేవంత్రెడ్డి పంచన చేరారని పేరు ప్రస్తావించకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా, కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. సర్పంచ్ల విజయం పార్టీ కార్యకర్తల శ్రమతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రభుత్వం పోలీసులను పంపించి వేధిస్తోందన్నారు. రేవంత్రెడ్డి రూ.ఆరువేల కోట్ల ఒప్పందాల్లో రాహుల్కు మూటలు సర్దే పనికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో 48 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యాప్లో మాత్రమే యూరియా కనిపిస్తోంది.. షాపులో ఉండడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తొండలు వదిలే సమయం దగ్గరలోనే ఉందన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్ను సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ● ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిచ్చి కూతలు మానుకోవాలని ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కడియానికి షాక్ ఇచ్చేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల్లో గులాబీ పార్టీ గెలువబోతోందన్నారు. ● పార్టీలు మార్చే కడియం శ్రీహరి చరిత్రను త్వరలోనే బట్టబయలు చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వంద పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో ఆవిర్భవించిందన్నారు. ఇవి రాకుండా అడ్డుపడిన మొదటి వ్యక్తి కడియం అన్నారు. రేవంత్రెడ్డి సీఎంగా ఏడాది ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ● కాంగ్రెస్ నాయకుల్లారా.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను విమర్శిస్తారా అని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తె లంగాణ లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు సమైక్య వాదుల చెప్పులు మోసే పరిస్థితి వచ్చేదన్నారు. జనగామ గులాబీ మయం.. కేటీఆర్ రాకతో జనగామ గులాబీ మయంగా మారింది. పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్కు స్వాగతం పలుకగా, వేలాది మందితో భారీ ర్యాలీగా జనగామ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్కు చేరుకున్నారు. కడియం శ్రీహరి ద్రోహం చేశారు కాంగ్రెస్ అంటే గుండా రాజ్యం యూరియా యాప్లో ఉంది.. షాపులో లేదు సీఎంకు తొండలు వదులుదాం సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ -
బతికొస్తావా..
నువ్వే ఆధారం కొడుకా..ఖిలా వరంగల్: కుటుంబంలో కుమారుడు ఉన్నాడంటే కొండంత అండ ఉన్నట్లేనని తల్లిదండ్రులు భావిస్తారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడని మురిసిపోతారు. అయితే కొందరు యువకులు అమ్మనాన్నల కలలు, ఆశయాలను కాల రాస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడిపై ఆధారపడిన తల్లిదండ్రులు.. అతను బయటకు వెళ్తే తిరిరి వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అలాంటి అందివచ్చిన కుమారుడు ఇక లేడు .. కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ హృదయాలు బరువెక్కి పోయాయి. ప్రేమ విఫలమై తనవు చాలించిన తమ కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. నువ్వే ఆధారం కొడుకా..బతికొస్తావా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన మోదం రాజయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వంశీ (21) ఉన్నాడు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో వంశీ బొల్లికుంటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మామునూరులో స్నేహితులతో కలిసి అద్దెకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటికి వెళ్లిన వంశీ.. తన తల్లిదండ్రులకు ఫొటో చూపించి ‘నా స్నేహితురాలు అమెరికా వెళ్తోంది.. బీటెక్ పూర్తికాగానే నన్ను కూడా అమెరికాకు పంపించాలి‘ అని తల్లిదండ్రులను కోరాడు. అయితే కష్టపడి ఇద్దరు అక్కల వివాహాలు చేసిన.. నిన్ను కూడా చిదివిస్తున్న.. చేతిలో చిల్లి గవ్వలేదు అమెరికాకు పంపించలేనని తండ్రి స్పష్టం చేశాడు. దీంతో వంశీ.. ప్రేమికురాలితో కలిసి తాను అమెరికాకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపంతోనే శనివారం ఉదయం ఇంటి నుంచి వరంగల్ మామునూరులోని రూమ్కు చేరుకున్నాడు. సోమవారం కాలేజీ వెళ్లాల్సి ఉండగా.. గదిలోనే మనస్తాపంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ప్రేమ విఫలమై తనువు చాలించిన యువకుడి తల్లిదండ్రుల రోదన.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం -
వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి
● డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆ బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంబంధిత అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు నిర్వహణ తీరును సమీక్షించి డిపా జిట్లు, రుణాల రికవరీ అంశాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరుచుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఖాతాదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ, జనగామ, జేఎస్ భూపాలపల్లి, వరంగల్ డీసీఓలు సంజీవ రెడ్డి, కోదండరాం, వాలునాయక్, నీరజ, డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్, డీజీఎం అశోక్, తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ హసన్పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు, తెల్లరేషన్కార్డులు కలిగి ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్లతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వివరాలకు 9704056522 నంబర్లో సంప్రదించాలని రవి సూచించారు -
శాసీ్త్రయ దృక్పథం కోసం పోరాడాలి
వరంగల్: శాసీ్త్రయ దృక్పథం కోసం విద్యార్థులు పోరాడాలని జేఎన్యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా వరంగల్ పోచమ్మమైదాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రతినిధుల సభ నిర్వ హించారు. సభ ప్రారంభానికి ముందు పీడీఎస్యూ జెండాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ ఆవిష్కరించగా ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ప్రారంభో పాన్యాసం చేశారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అమరవీర సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలకు ఆద్యం పొసిన విప్లవ విద్యార్థి సంఘం పీడీఎస్యూ అని కొనియాడారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర నాయకురా లు దీపాలక్ష్మి అధ్యక్షతన ‘నూతన జాతీయ వి ద్యా విధానం–కర్తవ్యం’ అనే అంశంపై హెచ్సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్షలా మార్చడానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. పీడీఎస్యూ జాతీయ నాయకుడు పి.మహేశ్, జేఎన్యూ నాయకుడు సౌరవ్, ఢిల్లీ నాయకుడు రోహిత్, తమిళనాడు ఆర్ఎస్వైఎఫ్ బా లరాజు, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ నేత ధీరజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె . భాస్కర్.ఎం.వినోద్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, జన్నారాపు రాజేశ్వర, డి.శ్రీకాంత్, ఎం.నవీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. జేఎన్యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ -
విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలి
గూడూరు: విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని డీఐఈఓ మధర్గౌడ్, సర్పంచ్ రేగ సు జాత అన్నారు. మట్టెవాడలో గూడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల కార్యక్రమంలో విద్యార్థులు గ్రామీణ ప్రాంత జీవన విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరుశురాములు, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సారంగపాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిట్టిబాబు, శ్రీధర్సింగ్, రమేష్, సతీష్, రవికుమార్, సుధీర్ పాల్గొన్నారు. -
‘బంగారం’ వచ్చేస్తోంది!
గీసుకొండ : మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే ‘బంగారం’( బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వరంగల్ పాతబీట్ బజారు ప్రాంతంలో సుమారు 10 బెల్లం విక్రయించే హోల్ సేల్ షాపులు ఉండగా కొత్తగా మరి కొన్ని వెలుస్తున్నాయి. అలాగే, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాలోని వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం రెడీ చేస్తున్నారు. పావు కిలో నుంచి 10 కిలోల వరకు.. మార్కెట్లో బెల్లం పావు , అర కిలో, కిలో, ఐదు, పది కిలోల చొ ప్పన లభిస్తున్నాయి. పది కిలో లకు మించి బెల్లం బుట్టలు ఉండవని వ్యాపారులు చెబుతున్నారు. కిలో బెల్లం ధర రూ. 40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందంటున్నారు. కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ. 66 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతోందని తెలిపారు. సమ్మక్క పున్నంతో ఇంటింటా పూజలు ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార(చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ. 40 ఉంది. గతంలో రూ. రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో ..అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నులు బెలాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు.దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర మహారాష్ట్ర నాందేడ్ రకం రూ. 40 మహారాష్ట్ర పుణె రకం రూ. 42 కర్ణాటక కోలాపూర్ రకం రూ. 48 కర్ణాటక కస్తూరి రకం రూ. 66 మేడారం మహాజాతరకు దిగుమతి అవుతున్న బెల్లం పలు రాష్ట్రాల నుంచి వేల టన్నుల సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు -
ఎన్నికల నిబంధనలపై అవగాహన అవసరం
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: ఎన్నికల సంఘం నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్లో ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్ఓలతో మ్యాపింగ్ పక్కా జరిపించాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, డీపీఓ హరిప్రసాద్, కమిషనర్ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్, వివిధ పార్టీల నాయకులు మార్నెని వెంకన్న, సురేష్ నాయుడు, అజయ్సారథిరెడ్డి, సూర్నపు సోమయ్య, శ్యాంసుందర్శర్మ, బొమ్మ వెంకటేశ్వర్లు, ఫరీద్, రాజమౌళి పాల్గొన్నారు. టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలి పదో తరగతి పరీక్షల్లో మెరుౖగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికా రులతో పదో తరగతి పరీక్షలపై నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ పరీక్షలకు సుమారు 60 రోజుల సమయం మాత్రమే ఉందని ఆ సమయానికి తగ్గట్టుగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతీరోజు విద్యార్థులతో అ న్ని సబ్జెక్ట్లను చదివించి సాధన చేయించాలని తెలి పారు. విద్యార్థుల చేతి రాతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల వ్యక్తిగత మానసిక స్థితిగతులను నిత్యం పరిశీలించాలన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించి మెలకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, ఏసీజీ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు పాల్గొన్నారు. -
జాతరకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
వేగంగా గద్దెల పునరుద్ధరణ పనులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గద్దెల చుట్టూ ఉన్న పాత గ్రిల్స్ తొలగించారు. అనంతరం గద్దెలపై సీసీ ఫ్లోర్లింగ్ చేపట్టారు. ఈ పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. కాగా, గద్దెల పునరుద్ధరణ పనుల సందర్భంగా భక్తులను తల్లుల దర్శనాలకు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. బయటి నుంచే దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క.. ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. మంగళవారం ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి దామోదర రాజనర్సింహ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్రెడ్డితోపాటు రాజకీయ పార్టీల నేతలను జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.మంత్రి దామోదర రాజనర్సింహకు జాతర ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి సీతక్క -
వికారాబాద్–కాకినాడ టౌన్ ట్రైన్ రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా వికారాబాద్–కాకినాడ టౌన్ (07287) మధ్య ప్రయాణించే వీక్లి ఎక్స్ప్రెస్ను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఆపరేషనల్ రీజన్స్తో జనవరి 19వ తేదీన ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. బాలుడి కిడ్నాప్ కేసు ఛేదనలో ముందడుగు.. ● నిందితులు కారు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తింపు కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఇటీవల కిడ్నాప్నకు గురైన బాలుడి కేసు ఛేదనలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులకు క్లూ లభించినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన లావుడ్య కన్నా నాయక్ దంపతులు గత 27వ తేదీన రాత్రి జంక్షన్ ఆవరణలో తమ ఐదు నెలల బాలుడితో కలిసి నిద్రించారు. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి దుండుగులు బాలుడిని అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, క్రైం, టాస్క్ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల వడబోతలో లభించిన క్లూ.. పోలీసుల పది రోజులు ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు సమాచారం. బాలుడి కిడ్నాప్నకు నిందితులు కారు ను ఉపయోగించినట్లు పోలీసు బృందాలు నిర్ధారణ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమ యం నుంచే అనుమానిత కారు నాలుగైదు రౌండ్లు కాజీపేట రైల్వే జంక్షన్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ కారులోనే బాలుడిని దాదాపు రాత్రి 2.30 గంటల సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు. నిందితులతో పాటు కారును గుర్తించడానికి పోలీసు బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బచ్చన్నపేట : అయ్యప్ప మాల విరమణ అనంతరం దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా కారు టైరు పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన సమ్మెట మహేశ్ (32) బైక్ మెకానిక్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేశ్, కొడకండ్లకు చెందిన అందె యాకయ్య అయ్యప్ప మాల ధరించారు. డిసెంబర్ 30న ఇద్దరూ శబరికి వెళ్లి మాల విరమణ చేసి మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పుణ్య క్షేత్రం వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీంతో మృతుడు మహేశ్తోపాటు భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు, అతడి స్నేహితుడు అందె యాకయ్య, భార్య మంజుల, కూతురు, అతడి చెల్లి.. కారులో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్య క్షేత్రానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యాకయ్య కారు నడుపుతుండగా మహేశ్ పక్కన కూర్చున్నాడు. ఈ క్రమంలో అలీంపూర్ గ్రామం దాటగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పక్కన కూర్చున్న మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా వారికి గాయాలుకాగా 108లో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మహేశ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారు బోల్తాపడి యువకుడి దుర్మరణం అయ్యప్ప మాల విరమణ రోజే మృతి.. -
వెనువెంటనే మరమ్మతులు
జాతరలో బస్సుల వైఫల్యాలకు తావు లేదు హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఆర్టీసీ బస్సుల వైఫల్యాలకు తావు లేకుండా టీ జీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు అన్ని చ ర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రో జులపాటు జరిగే వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈ నెల 21 నుంచి టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక ఖరారు చేసింది. 2022లో జరి గిన జాతరలో 2,800 బస్సులు నడిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన క్రమంలో ఈసారి మ హిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో 2024 జాతరలో 3,840 బస్సులు నడిపారు. ఈ జాతరలో భక్తులను వెనువెంటనే చేరవేయడానికి 4,860 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి బస్సులు సేకరిస్తున్నారు. ఈ నెల 21 నాటికి వరంగల్ రీజియన్కు బస్సులు చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలు.. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు మార్గమధ్యలో ఫెయిలైనా, ఇతర మరమ్మతులు వచ్చినా భక్తులు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, బస్సులు నిలిచిపోకుండా ఉండేందుకు వెంటనే మరమ్మతులు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు మొబైల్ టీంలు ఏర్పాటు చేయడంతో పాటు మార్గమధ్యలో ప్రత్యేకంగా మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో సులువుగా చేరుకునేందుకు ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర రూట్లో మొత్తం 16 చేజింగ్, రిలీఫ్ మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక అధికారి, ఇద్దరు మెకానిక్లు ఉంటారు. అదేవిధంగా 11 రిలీఫ్ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మెకానిక్లతోపాటు టైర్లు, విడిభాగాలు అందుబాటులో ఉంటాయి. బస్సు మార్గమధ్యలో ఫెయిలైతే ఈ వ్యాన్కు సమాచారం అందించిన వెంటనే చేరుకుని మరమ్మతు చేసి పంపుతారు. వీటితో పాటు 12 డీజీటీలను అందుబాటులో ఉండేల కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మెకానిక్లు, ఒక ఎలక్ట్రీ షియన్ ఉంటారు. ఆగిపోతే తక్షణమే రిపేర్ చేసేలా ఏర్పాట్లు అందుబాటులో 16 ఛేజింగ్, రిలీఫ్ టీంలు, 11 వ్యాన్లు, నాలుగు మెయింటెనెన్స్ క్యాంపులు ఈనెల 21 నుంచి మేడారానికి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం, అధికారుల కసరత్తు -
తప్పులనొప్పుకోం..
మున్సిపల్ ఓటరు జాబితాపై రాజకీయ పక్షాల నిరసనసాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు రూపొందించిన ఓటరు జాబితాపై జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రకటించారు. అయితే ఇందులో తప్పులు ఉన్నాయని జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. జాబితా సవరిస్తేనే ఎన్నికలకు సహకరిస్తామని నాయకులు తేల్చి చెప్పారు. జాబితాలోని తప్పులు ఇలా.. ● మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఇక్కడ నివాసం ఉండేవారి పేర్లు కాకుండా నర్సింహులపేట మండలం పెద్దనాగారం, కేసముద్రం మండలంలోని పలుగ్రామాలు, వేమునూరు, కంబాలపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల పే ఓటరు జాబితాలో ఉన్నాయి. ● మహబూబాబాద్ పట్టణంలోని 22వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 500 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి ● మహబూబాబాద్లోని 23వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 400 ఓట్లు కలిశాయి. ● మహబూబాబాద్ పట్టణంలోని 34వ వార్డులో గతంలో ఉన్న ఓట్లకు 280 ఓట్లు కోత పెట్టి వాటిని ఇతర వార్డుల్లో కలిపారు. ● మహబూబాబాద్ పట్టణంలోని 36 వార్డుల్లో అన్ని వార్డులకు చెందిన ఓటర్లు కలిశాయని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ● కొన్ని వార్డుల్లో ఒకే ఇంటి నంబర్పై 50 నుంచి 150 ఓట్లు నమోదు కావడం గమనార్హం. ● గుమ్ముడూరు ప్రాంతం 29వ వార్డుల్లో 2020 నాటి ఓట్లు కాకుండా ఇప్పుడు పట్టణానికి మరోవైపు ఉండే 24వ వార్డు ప్రాంతానికి చెందిన సుమారు 400 ఓట్లు చేరాయి. దీంతో ఇరు ప్రాంతాల్లో ఒకే కౌన్సిలర్ ఎలా అభివృద్ధి చేస్తారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని రాజకీయ నాయకులు ప్రశ్నించారు. రాజకీయ పార్టీల సూచనలు ఇలా.. ● 2020లో మహబూబాబాద్ పట్టణంతోపాటు విలీన పంచాయతీలు శనిగపురం, జమాండ్లపల్లి, ఈదులపూసపల్లి, బేతోలు, గాంధీపురం, అనంతారం, రజాల్పేట, ముత్యాలమ్మగూడెం మొదలైన గ్రామాల ఓటర్లను బౌగోళిక స్థితి ఆధారంగా వార్డులుగా విభజించారు. ఇందుకు అనుగుణంగా ఓటరు జాబితాను తయారు చేశారు. ఇప్పుడు అదే విధంగా జాబితా తయారు చేయాలి. ● చాలా ఇంటి నంబర్లలో బై నంబర్లు తప్పులుగా వేసి ఓటరు జాబితాను తయారు చేశారు. ఇలా కాకుండా అనుభవం ఉన్న ఉద్యోగుల పర్యవేక్షణలో పునర్ పరిశీలన చేసిన తర్వాతనే కొత్త జాబితాను రూపొందించాలి ● పాత జాబితాలో స్పష్టతవచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్లు, చేర్పుల మార్పులకు అవకాశం ఇవ్వాలి. ● ఈ ప్రక్రియ అంతా 8వ తేదీ వరకు పూర్తి చేసి 9వ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు కాఫీ ఇవ్వాలి. అందరూ అంగీకరించిన తర్వాతనే 10వ తేదీ తుది జాబితాను ప్రకటించాలి. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన సూచనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి తుది జాబితాను తయారు చేసి ఇస్తామని ప్రకటించినట్లు ఆయా పార్టీల నాయకులు ‘సాక్షి’తో తెలిపారు. వార్డులతో పొంతన లేకుండా జాబితా సవరణ చేస్తేనే సహకరిస్తామన్న రాజకీయ పార్టీల నాయకులు తుది జాబితాకు ముందు సమావేశం నిర్వహించాలని డిమాండ్ రాజకీయ పార్టీల అభిప్రాయాలపై కలెక్టర్ సానుకూల స్పందనఓటర్లు వార్డు పరిధిలో ఉండేలా చూడాలి మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని వివిధ పార్టీల నాయకులు అజయ్సారఽథిరెడ్డి, సురేష్నాయుడు, సూర్నపు సోమయ్య, వెంకన్న, శ్యాంసుందర్శర్మ, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక వార్డు ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నాయని.. సరిచేయాలని కోరారు. నాయకులు ఖలీల్, కుమార్, ఫరీద్, రాజమౌళి, రామారావు, సందీప్, వెంకన్న, సీతారాం నాయక్, యాకయ్య పాల్గొన్నారు. -
నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరికేసముద్రం: ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా రవాణా అధికారి జయపాల్రెడ్డి అన్నారు. మంగళవారం కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రతా వారో త్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా అంశాలపై క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఆర్టీఏ డైరెక్టర్ రావుల మురళీ పాల్గొన్నారు. ముద్ర లోన్ పేరిట సైబర్ మోసం డోర్నకల్: మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బు కోల్పోయాడు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన చెవిటి రాముకు గుర్తు తెలియని వ్యక్తులు ముద్ర లోన్ ఇప్పిస్తామంటూ గత నవంబర్ నుంచి విడతలవారీగా రూ.96,000 తమ అకౌంట్కు బదిలీ చేయించుకున్నారు. కానీ, రుణం ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన రాము మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లోని రూ.16,000 నగదును హోల్డ్లో పెట్టారు. రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి మహబూబాబాద్ అర్బన్: పదో విద్యార్థులు తత్కాల్ స్కీమ్ కింద ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.వేయితో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈఓ రాజేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఏసీజీఈ మందుల శ్రీరాములును 98497 61012 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలను నియంత్రించాలి మహబూబాబాద్ అర్బన్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘బాల్య వివాహరహిత భారతదేశం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చేయాలని న్యాయ సేవా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజుకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగఽవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజుకృష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలికలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు పూర్తయితేనే వివాహం జరిపించాలని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098 కు కాల్ చేసిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇతర న్యాయ సలహాలు సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ఫోక్స్ తదితరలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శంచారు. కార్యక్రమంలో హెచ్ఎం పొడుగు నర్సయ్య, హాస్టల్ వార్డెన్ పద్మ, ఉపాధ్యాయులు చిట్టిబాబు, హరికృష్ణ పాల్గొన్నారు. -
ఎగిరేది గులాబీ జెండే..
జనగామలో నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్, గులాబీ శ్రేణులు ● కడియం ద్రోహం చేశారు.. కాంగ్రెస్ అంటే గూండా రాజ్యం ● బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్జనగామ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ -
బ్యాంకుల సహకారంతో నేరాల నియంత్రణ
మహబూబాబాద్ రూరల్ : ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్ మోసాలు, ఆన్లైన్ లోన్, తక్షణ రుణాలపేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్ సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఏటీఎం భద్రత, బ్యాంకు సెక్యూరిటీ, కస్టమర్లకు అవగాహన అంశాలపై మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ సమావేశ మందిరంలో బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ ప్రొఫైల్స్ తయారీ, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా, బ్యాంకులు, పోలీసు శాఖ మధ్య సమన్వయంతో సమాచారం పంచుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులపై నిఘా, సున్నితమైన లావాదేవీల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏటీఎం సెంటర్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏటీఎం వద్ద సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే డోర్ లాకింగ్ సిస్టమ్, ఫైళ్ల భద్రత, బ్యాంకు లోపలి సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. బ్యాంకు సెక్యూరిటీ గార్డులు, సిబ్బందికి భద్రతా విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా సెక్యూరిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో అడ్మిన్ డీఎస్పీ గండ్రతి మోహన్, మానుకోట డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేందర్, రూరల్, బయ్యారం సీఐలు సరవయ్య, రవికుమార్ పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ -
ధాన్యం రాశులు
సాక్షి, మహబూబాబాద్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సివిల్ సప్లయీస్లోని పలువురు అ ధికారులు, కొన్ని రైస్ మిల్లుల యజమానుల మధ్య సమస్వయంతో రైతులను మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సకాలంలో కాంటాలు పెట్టకపోవడం, కాంటాలు పెట్టిన ధాన్యం రవాణా చేయకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉంచడం, కాంటాల్లో మోసం.. తరుగు పేరుతో డబ్బుల్లో కోత పెట్టిన విషయంపై రైతులు ఆందోళన చేయడం, కొనుగో లు కేంద్రాల్లో జాప్యం మూలంగా మరిపెడ మండలంలో రైతులు మృతి చెందిన సందర్భాలు ఉన్నా యి. వీటిని అధిగమించేందుకు కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సివిల్ సప్లయీస్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ట్రాన్స్ఫోర్ట్ వాహనాలు సక్రమంగా పెట్టకుంటే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా వారితో అగ్రిమెంట్స్ రాయించుకున్నారు. ట్రాన్స్ఫోర్ట్ అధికారుల ను భాగస్వామ్యులను చేసి కాంటా పెట్టిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించేలా చూశారు. 2.12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోళ్లు గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంలో సగం ధాన్యం కూడా రాని సందర్భాలున్నాయి. కానీ, ఈ వానాకాలంలో ఇప్పటి వరకే 2.12 లక్షలకు మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. వానాకాలం 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతుల నిల్వ, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావించారు. అయితే ఇప్పటి వరకు 2.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 30 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కాంటాలు పెట్టిన వెంటనే మిల్లులకు తరలింపు -
మున్సిపాలిటీ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు
● గాంధీ సెంటర్లో మహిళల ధర్నా ● మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఆందోళనడోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక గాంధీ సెంటర్లో మహిళలు ధర్నా నిర్వహించారు. బంకట్సింగ్ తండా, ఎర్రమట్టి తండా, సిగ్నల్ తండాకు చెందిన గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో గాంధీ సెంటర్కు చేరుకుని రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. డోర్నకల్ మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తాము ఉపాధి హామీ పనులకు దూరమయ్యామని, ఇంటి పన్నులు, పారిశుద్ధ్య సమస్యలు పెరిగాయని, అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ మారిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డోర్నకల్ను గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. తమ డిమాండ్ అమలు కాకపోతే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఎస్సై గడ్డం ఉమ, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మన్యుపాట్ని తదితరులు మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగిన తర్వాత కమిషనర్ నిరంజన్తోపాటు కాంగ్రెస్ నాయకుల అభ్యర్థన మేరకు కమిషనర్కు వినతిపత్రం అందించి ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలనే డిమాండ్ రావడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. -
కంపెనీ బ్రాండ్లు మార్చేది మార్వాడీ వ్యాపారులే!
● స్థానిక వ్యాపార సంస్థలపై ఆరోపణలు సరికాదు ● వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయవరంగల్ చౌరస్తా : వరంగల్లోని మార్వాడీ వ్యాపారులు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారని వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయ తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్ బట్టల బజారు వర్తక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట స్థానిక మార్వాడీ వ్యాపారులు దుస్తులపై నకిలీ స్టిక్కర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 60 సంవత్సరాల నుంచి వరంగల్ వర్తక, వ్యాపారులం నిజాయితీతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వాలకు అన్నీ రకాల పన్నులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ స్టిక్లర్లు వేసి బ్రాండ్ల పేరుతో అమ్మకాలు చేస్తున్న మార్వాడీ వస్త్ర వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్యదర్శి కోమాండ్ల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి అల్లాడి వీర ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
భక్తుల రాకపోకలకు అంతరాయం ఉండొద్దు
ములుగు రూరల్: ‘ఇప్పుడే ఇలా ... మహా జాతరకెలా’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్ మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ చేతన్, సీఐ సురేశ్కుమార్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్ -
జాతర విధుల్లో పాల్గొనే సిబ్బందిపై పర్యవేక్షణ
హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లకు ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. జాతరలో భక్తుల రద్దీ దృష్ట్యా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సెఫ్టీ వార్డెన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. జాతరలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ణ ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణ తో వ్యవహరించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలనిన్నారు. మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా, నిర్లక్ష్యపు డ్రైవింగ్పై అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య,డిపో మేనేజర్లు పి.అర్పిత, రవిచంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు పాల్గొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ -
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట
కాజీపేట రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో మొదటిసారి 58వ జాతీయస్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లతో 2 వేల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, అధికారులు పాల్గొంటున్నట్లు వివరించారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పోటీలు డే అండ్ నైట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడగా మారిన గ్రామీణ ఖోఖో పోటీలను మ్యాట్లపై నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి 7 రోజుల పాటు ఉచిత భోజనం, వసతి, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాస్యాదవ్, పోటీల నిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షుడు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం.రమణ, రాజారపు రమేశ్, శ్రీనివాస్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫ్రిజ్ బోర్డు కన్వీనర్ వి.సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఽఘవరెడ్డి -
ఊరేగింపుగా వచ్చి.. సంధల్ సమర్పించి..
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో సోమవారం రాత్రి అన్నారం దర్గా యాకూబ్షావలి ఉర్సు ప్రారంభమమైంది. బోలేషావలి ఇంటి వద్ద మత పెద్దల ఆధ్వర్యంలో గంధం, సెంటు, రోజ్వాటర్, గులాబీ పూలను కలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధం (సంధల్) తీసుకుని మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. అనంతరం గంధం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో యాకూబ్బాబాకు మత పెద్దలు, ముజావర్లు సలాం పాట నిర్వహించారు. ఉత్సవాల నేపథ్యంలో అన్నారం దర్గా పరిసర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. కాగా, అంతకుముందు మధ్యాహ్నం ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్.. మామునూరు ఏసీపీ వెంకటేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా యాకూబ్షావలిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. గంధం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్, సూపరింటెండెంట్ ఎండి.ఫయాజ్, ఇన్స్పెక్టర్ రియాజ్, ముజావర్లు గౌస్పాషా, యాకూబ్పాషా, ఖాజాపాషా, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, గొడుగు భిక్షపతి, మోటపోతుల సారంగపాణి, గొడుగు వినయ్, గొడుగు రమేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ఉర్సులో విడిది చేస్తున్న భక్తులు, ఉత్సవాల్లో భాగంగా ఖవ్వాలీలో పాల్గొన్న భక్తులు ప్రారంభమైన అన్నారం దర్గా ఉర్సు భక్తిశ్రద్ధలతో బాబాకు మొక్కులు.. ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు దర్గా పరిసరాల్లో భక్తుల కోలాహలం -
విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
కేయూ క్యాంపస్ : విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జాతీయ కార్యదర్శి, ప్రగతి శీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి. ప్రసాద్ అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యూ ఐదు దశాబ్దాలుగా దేశంలో సమాన విద్య విధానం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేర విద్యాకాషాయీకరణకు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందని విమర్శించారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభ దశలో ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేర హతమారుస్తున్నారని ఆరోపించారు. డాలర్ సంపాదనకు భారతదేశం నుంచి అమెరికా సామ్రాజ్యావాదదేశానికి కొంతమంది విద్యార్థులు, మేధావులు వలసపోతున్నారన్నారు.అలాకాకుండా ఈదేశ అభివృద్ధిని కాంక్షించే పౌరులుగా ఇక్కడే పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి. సంధ్య మాట్లాడుతూ అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ పీడీఎస్యూ విద్యార్థుల హక్కులకోసం పనిచేస్తుందన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, నాయకులు సౌరాన్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ధీరధ్, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్, ఎం. వినోద్ మాట్లాడారు. ఈసభలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, రాజేశ్వర్, డి. శ్రీకాంత్, మంద నవీన్, సంతోష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్. గౌతమ్, కుమార్ పాల్గొన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో పీడీఎస్యూ రాష్ట్ర ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్ ఆర్ట్స్ అండ్ ౖ సెన్స్ కళాశాలలో పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్యూ రాష్ట్ర మహసభలను పురస్కరించుకుని విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని ఏకశిల పార్కు నుంచి యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు. -
మూడు షిఫ్ట్లు.. 24 గంటలు పహారా
హన్మకొండ అర్బన్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జాతర నిర్వహణకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర భారీస్థాయిలో అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొత్తం 660 మంది అధికారులను విధుల్లోకి దించుతున్నారు. జోనల్, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు విధులు కేటాయించారు. జోనల్, నోడల్ అధికారులు: జాతర ప్రాంగణాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి, వాటి పర్యవేక్షణ కోసం 95 మంది ఉన్నతస్థాయి అధికారులను నియమించారు. సిబ్బంది విభజన: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని శాఖల అధికారులకు విధులు కేటాయించారు.. పోలీస్ పహారా: ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భారీగా పోలీస్ బందోబస్తు ఉండనుంది. వీరు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత పర్యవేక్షిస్తారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల సేవలు కోట్లాదిగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులను మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. మొదటి షిఫ్ట్: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు. రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10 వరకు. మూడవ షిఫ్ట్: రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 7 వరకు. విధులకు ఎంపికై న 660 మంది అధికారులకు, సిబ్బందికి మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు మేడారంలోని హరిత హోటల్లో ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. జాతరను విజయవంతం చేసి, భక్తులకు అమ్మవార్ల దర్శనం సులువుగా కలిగేలా చూడటమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. వీరుకాక పోలీస్ శాఖ, ఎన్ఎస్స్, ఎన్సీసీ, ఇతర స్వచ్ఛంద, యువజన సంఘాల సేవలు అదనంగా వాడుకోనున్నారు. మేడారం జాతర విధులకు ఉమ్మడి జిల్లానుంచి 660 మంది అధికారులు మహా జాతరపై ములుగు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు జోనల్, నోడల్ అధికారులుగా 95 మంది నియామకం నేటినుంచి మూడు రోజులపాటు శిక్షణ 26న రిపోర్ట్ చేయాలని ఆదేశంఈసారి మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జాతర తేదీలకు రెండు రోజుల ముందే, అంటే జనవరి 26 నాటికే అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
మంత్రి శ్రీహరిని కలిసిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి సోమవారం పశు సంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏషియన్ చాంపియన్ షిప్లో పాల్గొంటున్న సందర్భంగా ప్రాక్టీస్ గురించి మంత్రి, ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చినట్లు దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో దీప్తి తల్లిదండ్రులు ధనమ్మ, యాదగిరి పాల్గొన్నారు. వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి ● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడాపాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించి పనులు ప్రారంభించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చారిత్రక వరంగల్ జిల్లాను విద్యనేకాకుండా క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలం కోరగా సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడాపాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి ఆరునెలలు గడిచాయని, వెంటనే స్పందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. వీధికుక్క అడ్డు రావడంతో.. ● బైక్ అదుపు తప్పి ఆర్టీసీ డ్రైవర్ మృతి గీసుకొండ: వీధికుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్(40) హనుమకొండ ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పని నిమిత్తం బైక్పై నగరానికి వచ్చిన సంతోష్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం రంగనాయకుల కుంట వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. -
అండగా ‘అమ్మ ఒడి’
● జిల్లాలో ఏడు అమ్మ ఒడి అంబులెన్స్ల సేవలు ● గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణానెహ్రూసెంటర్: గర్భిణులు సకాలంలో మెరుగైన వైద్యసేవలతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తేనే కాన్పు ప్రశాంతంగా జరుగుతుంది. అయితే గ్రా మీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చేందుకు రవాణాపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం.. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేర్చడం, బాలింతలను ఇంటికి తీసుకెళ్లేందుకు 102–అమ్మ ఒడి అంబులెన్స్లు ఉపయుక్తంగా మారాయి. ప్రైవేట్ వాహనాల ద్వారా వ్యయప్రయాసాలు పడకుండా అంబులెన్స్ల ద్వారా సురక్షిత ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా, జిల్లాలో ఏడు అమ్మ ఒడి వాహనాలు గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్నాయి. నెలనెలా.. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు, ప్రసవించిన తర్వాత బాలింతలను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి వైద్య పరీక్షలు పూర్తయ్యాక 102 అంబులెన్స్ ద్వారా సిబ్బంది చేరవేస్తున్నారు. నెలనెలా ఆస్పత్రికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు అన్ని వేళల్లో 102 అంబులెన్స్లు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లాలో ఏడు అంబులెన్స్లు.. జిల్లాలో ప్రస్తుతం ఏడు 102అమ్మ ఒడి అంబులెన్స్లు గర్బిణులు, బాలింతలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, తండాలు, గూడేలు అధికంగా ఉండడంతో మరికొన్ని అంబులెన్స్లను సమకూర్చడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయని ప్రజలు కోరుతున్నారు. ఇప్ప టి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, పల్లెలకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఉచితంగా రవాణా సౌకర్యం గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ప్రసవం కోసం వెళ్లేందుకు అమ్మ ఒడి అంబులెన్స్ ద్వారా రవాణా సౌకర్యం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం, మెరుగైన వైద్యం అందుతుంది. ప్రతీ నెల ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా 102 సిబ్బంది చేరవేస్తారు. – షేక్ నజీరుద్దీన్, ప్రోగ్రాం మేనేజర్ నెల గర్భిణులు, బాలింతలు జూన్ (2025) 2,137 జూలై 2,120 ఆగస్టు 2,195 సెప్టెంబర్ 1,941 అక్టోబర్ 2,215 నవంబర్ 2,152 డిసెంబర్ 2,134 -
అభ్యంతరాలు పరిష్కరిస్తాం
● మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మహబూబాబాద్: ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. ఒక వార్డు ఓటర్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నారని, పోటీ చేసే అభ్యర్థి పట్టణమంతా ఓటర్ల కోసం తిరిగే విధంగా ఉందని, సవరణ చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈసీఐ నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాలు అన్ని విధాలా పరిశీలించి ఎవరికి అన్యాయం జరగకుండా.. తుది జాబితా తయారు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అన్ని విధాలా సహకరించాలన్నారు. ప్రతీ పార్టీ నుంచి ఇద్దరు నాయకులకు మాత్రమే అవకాశం కల్పించారు. సమావేశంలోటీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనపురం అంజయ్య, సురేష్, బీఆర్ఎస్ నుంచి మార్నేని వెంకన్న, సీపీఐ నుంచి అజయ్సారథిరెడ్డి, పెరుగు కుమార్, సీపీఎం నుంచి సూర్నపు సోమయ్య, బీజేపీ నుంచి శ్యాసుందర్ శర్మ, టీడీపీ నుంచి బొమ్మ వెంకటేశ్వర్లు, రాము పాల్గొన్నారు. -
సత్వరమే దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ● ప్రజావాణిలో 72 వినతులు అందజేతమహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూ డా వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం సాధ్యం కానివి నివేదిక రూపంలో అందజేయాలన్నారు. 72 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సుమలత తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వినతి ఇచ్చారు. అలాగే మానుకోట పట్టణంలోని జగ్జీవన్రావు నగర్ కాలనీకి చెందిన కల్యాణి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతిలో కోరారు. ● సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో తనను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పట్టాలు ఇప్పించాలని వినతి అందజేశాడు. ● గూడూరు మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు స్రవంతి తనకు దివ్యాంగ పింఛన్ రావడం లేదని, మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. -
పంచాయతీల్లో కో–ఆప్షన్ సందడి
● అవకాశం కోసం పలువురి యత్నాలు ● పల్లెల్లో మొదలైన చర్చలు ● గ్రామాల అభివృద్ధికి పాటుపడే వారికి అవకాశంతొర్రూరు: పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల్లో తిరిగి రాజకీయ సందడి ఊపందుకుంది. ప్రతీ గ్రామ పంచాయతీ పాలకవర్గంలో అదనంగా మరో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నియమించాలి. సాధారణంగా మున్సిపాలిటీలు, మండల పరిషత్ల్లో మైనార్టీలకు ఈ పదవులు దక్కుతాయి. గ్రామ పంచాయతీల్లో నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. పంచాయతీల అభివృద్ధికి మార్గదర్శకంగా సూచనలు, సలహాలు ఇచ్చే వారిని నియమించాల్సి ఉంది. వారి పాత్ర ఇలా.. కో–ఆప్షన్ సభ్యులకు గ్రామ సభల్లోనూ, పంచాయతీ సమావేశాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా ప్రొటోకాల్ ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించి వీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఏదైనా అంశంపై తీర్మానం చేసేటప్పుడు ఓటు వేసే అధికారం ఉండదు. కేవలం పంచాయతీలకు సలహాదారులుగా వ్యవహరిస్తారు. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో వీరి పాత్ర కీలకం కానుంది. ఎంపిక.. గ్రామ పంచాయతీల పాలకవర్గంతో పాటు సమాన హోదా ఉండే కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. సభ్యుల్లో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, జీఓలు, పాలనాపరమైన అంశాలపై పట్టు ఉన్న ఒక విశ్రాంత ఉద్యోగిని సభ్యుడిగా ఎంపిక చేయాలి. మరొకరు పంచాయతీ అభివృద్ధికి పాటుపడిన వారు, భారీగా విరాళాలిచ్చిన దాతలు లేదా గ్రామాభివృద్ధికి తోడ్పడే ఎన్నారైలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరి ఎంపికలో సర్పంచ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం కీలకం కావడంతో పదవిని ఆశించే కొంత మంది ఆశావహులు అప్పుడే గ్రామాల్లో ముమ్మరంగా మంతనాలు ప్రారంభించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు సైతం తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆదేశాలు రాగానే ఎంపిక చేస్తాం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పూర్తి చేస్తాం. పంచాయతీ చట్టంలో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పొందుపర్చారు. – హరిప్రసాద్, డీపీఓజిల్లా సమాచారం మండలాలు– 18 పంచాయతీలు–482 కో ఆప్షన్ సభ్యుల సంఖ్య–1,446 -
ఎస్పీని కలిసిన ఎస్సైలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్ను పదోన్నతి పొందిన ఎస్సైలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్సైలు షేక్.ఇమామ్, ఎల్.రవీందర్ సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వారిని కేటాయించగా.. ఈమేరకు ఎస్పీ శబరీష్ అభినందించారు. రైతులకు సరిపడా యూరియా ఉంది డీఏఓ సరిత కురవి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అఽధైర్యపడొద్దని డీఏఓ సరిత అన్నారు. సోమవారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవసరానికి అనుగుణంగా సకాలంలోయూరియా సరఫరా చేస్తామని తెలిపారు. అనవసరంగా యూరియాను నిల్వ చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సీరోలు ఏఓ చాయారాజ్ పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాలలో వసతులు కల్పించాలి నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు భవనం, వసతులు కల్పించాలని నర్సింగ్ విద్యార్థులు అన్నారు. ప్రభుత్వ కళాశాల ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. బిల్డింగ్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, నూతన బిల్డింగ్, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 240మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో సరిపడా తరగతి గదులు, ఇతర సౌకర్యాలు క ల్పించలేదన్నారు. అధికారులు, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రేష్ట ప్రవేశ పరీక్షలో ఆల్ఇండియా ర్యాంక్ మహబూబాబాద్ అర్బన్: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన పట్ల స్రవంతి ఆల్ ఇండియా 46వ ర్యాంక్ సాధించింది. పట్ల కృష్ణవేణి–రవి దంపతు కుమారై స్రవంతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఆమె డిసెంబర్ 21న నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష రాయగా.. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. స్రవంతిని ఆమె తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, బంధుమిత్రులు అభింనదించారు. టీసీసీ పరీక్షల హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి మహబూబాబాద్ అర్బన్: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ (టీసీసీ) పరీక్షల హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10నుంచి 13వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో డ్రాయింగ్ లోయర్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్, ఫాతిమా హైస్కూల్లో టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఆన్లైన్లో www.bse.telangana.gov.in అనే వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
‘పది’లో లక్ష్యం చేరేనా?
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గత ఏడాది జిల్లా రాష్ట్రంలో నంబర్వన్గా నిలిచింది. ఈ ఏడాది కూడా మొదటి స్థానం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఉత్తమ ఫలి తాలే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ, కార్యాచరణతో ముందుకు సాగాల్సిన సమయంలో డీఈఓ నిర్లక్ష్యం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల సందర్శన, ప్రత్యేక తనిఖీలు లేవని చెప్పకనే చెబుతున్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో ఇలా.. పదో తరగతిలో ఫలితాల్లో 2022–23 విద్యాసంవత్సరంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 2023–24లో 12వ స్థానం లభించింది. 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి స్థానం నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా ఎన్నో స్థానంలో ఉంటుందో అని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. కాగా, జనవరి మాసం రావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్ మొదలైంది. వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కఠిన పరీక్షలు ఎదుర్కొవాల్సిన పరి స్థితి నెలకొంది. 4,501 మంది విద్యార్థులు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,501 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు సాయత్రం విద్యార్థులకు సబ్జెక్ట్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అల్పాహారం అమలు చేయడం లేదు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వంతో పాటు అటు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కడుపునిండా ఆహారం, కంటినిండా నిద్రలేకపోతే పది ఫలితాల్లో ప్రథమ స్థానం ఎలా సాధ్యమవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లా నంబర్వన్ ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్ మార్చి 14నుంచి ఎగ్జామ్స్ విద్యార్థులకు అల్పాహారం అందించడంలో నిర్లక్ష్యంప్రణాళిక ఉంటేనే సాధ్యం గతంలో డీఈఓ, కోఆర్డినేటర్లు, ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ ఐక్యంగా కష్టపడి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది. ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువులో వెనుకబడిని విద్యార్థులను దత్తత తీసుకొని ప్రత్యేక కార్యాచరణతో ముందుగు సాగినం. పరీక్షలకు చాలా సమయం ఉంది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తే వారిలో మార్పు వస్తుంది. మళ్లీ మొదటిస్థానం సాధ్యమవుతుంది. –సంకా బద్రినారాయణ, రేవా జిల్లా అధ్యక్షుడుఉత్తీర్ణతశాతం పెంపునకు కృషివిద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం కన్నా ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం. –వి.రాజేశ్వర్, డీఈఓ -
నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
● అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● సమస్యల గుర్తింపు, అప్పటికప్పుడు పరిష్కారం ● ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులుహన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. ఆయా సెక్షన్ పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదవుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ రాములునాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఏసీఎంఓ రాములు నాయక్ పదో తరగతి పరీక్షలు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకొని, 60రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను సబ్జెక్ట్ల ఉపాధ్యాయులు దత్తత తీసుకొని మెరుగుపర్చాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పొగమంచు అనుకుంటే పొరపాటే..
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో కంకర తేలి, రోడ్డు గుంతలమయంగా మారి వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము లేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వెంట ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు దుమ్ముతో ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. కాగా, రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి దుమ్ము సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
11 నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15 వరకు 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖోపోటీలు జరగనున్నాయి. ఈమేరకు కాజీపేట రైల్వే స్టేడియంలో ఏర్పాట్లను ఆదివారం తెలంగాణ స్టేట్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించి మాట్లాడారు. ఖోఖో పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది వరకు క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ, రైల్వే స్టేడియం ఇన్చార్జ్ దేవులపల్లి రాఘవేందర్, నిర్వాహకులు పాల్గొన్నారు. కేయూ క్రికెట్ విజేత వరంగల్ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్నా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్మన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్మన్ నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.రవికుమార్, డాక్టర్ బి.వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తుల విక్రయాలు ● మూడు దుకాణాల్లో రూ. 15 లక్షలకు పైగా వస్త్రాల సీజ్రామన్నపేట: నగరంలోని బట్టలబజారులో బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తులు విక్రయిస్తున్న మూడు షాపుల్లో ఢిల్లీ, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షలకు పైగా విలువైన నకిలీ వస్త్రాలను సీజ్ చేశారు. ఢిల్లీకి చెందిన లెగ్గిన్ తయారుచేసే ఓ ప్రముఖ కంపెనీ వస్త్రాలను ఆ కంపెనీకి చెందిన ఒక అక్షరాన్ని కాపీ చేసి నకిలీ వస్త్రాలను విక్రయిస్తుండడంతో కంపెనీ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్న షాపులపై దాడులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్లో కూడా ఇలాంటి విక్రయాలు జరుగుతున్న విషయం గుర్తించి పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సహకారంతో మట్టెవాడ పోలీసులతో కలిసి శనివారం రాత్రి బట్టలబజారులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజ్యలక్ష్మి, మహాభగవాన్, మంగళ్దీప్ ట్రేడర్స్ల్లో సుమారు రూ. 15 లక్షలకుపైగా విలువైన నకిలీ లెగ్గిన్ విక్రయాలు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతో వచ్చిన అడ్వకేట్ల బృంద సభ్యులు ఆ షాపుల్లో నకిలీ వస్త్రాలను సీజ్ చేయడంతోపాటు ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. -
చనిపోయి ఐదుగురికి పునర్జన్మ
కాజీపేట: తాను మరణిస్తూ.. ఐదుగురికి అవయవ దానం చేసి పునర్జన్మనిచ్చాడు మర్రి రమేశ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన మర్రి రమేశ్ (43) అనే రైల్వే ఉద్యోగి గత నెల 22న విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యుల సూచన మేరకు భార్య రత్నకుమారితోపాటు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవదానం చేశారు. మృతుడి గుండె, రెండు కిడ్నీలు, రెండు నేత్రాలను దానం చేయడంతో ఐదుగురికి పునర్జన్మనిచ్చినట్లయ్యింది. ఆదివారం ప్రశాంత్నగర్ కాలనీలో మర్రి రమేశ్ సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ నేత్ర అవయవదాన శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్రెడ్డి, డాక్టర్ సంజయ్కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సైకిళ్లపై వెంకన్న దర్శనానికి..
చిల్పూరు: హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు సైకిళ్లపై వచ్చి ఆదివారం చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వారితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అధికారులు జానకీరాం, కిశోర్, శ్రీనివాస్రెడ్డి, హరి, దీపక్, మణికంఠ, అశోక్, సురేశ్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరిపెడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్పురం గ్రామ శివారు సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండం బచ్చోడు గ్రామ శివారు బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవీందర్ (30) పని నిమిత్తం తన బైక్పై మరిపెడ మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బుర్హాన్పురం గ్రామ శివారు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నేటినుంచి పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలువిద్యారణ్యపురి: పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్విహించనున్నారు. ఈనెల 5న ఉదయం 11 గంటలకు ఏకశిల పార్కు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, పీడీఎస్యూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వర్రావు, ఎం శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య, పీడీఎస్యూ జాతీయ నాయకులు పి.మహేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్ ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్ అబ్నూస్ ఫంక్షన్ హాల్లో విద్యార్థి ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ● బుర్హాన్పురం శివారు హైవేపై ఘటన ● మృతుడు ఖమ్మం జిల్లా వాసి -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్..
బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట వద్ద జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన బోదాసు శ్రీకాంత్ (30) వ్యక్తి గత పనుల నిమిత్తం బైక్పై సిద్దిపేట జిల్లా చేర్యాలకు వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తున్న క్రమంలో చుంచనకోట సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్ ఎగిరి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు. బావి పక్కనే బైక్ ఉండడంతో గమనించిన చుట్టు పక్కల వారి సమాచారం మేరకు పోలీసులకు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చేర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో పడమటికేశ్వాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎగిరి పక్కనే ఉన్న బావిలో పడి యువకుడి మృతి పడమటికేశ్వాపూర్లో విషాదం -
భార్య కాపురానికి రావడం లేదని..
మరిపెడ రూరల్: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన కలంచర్ల నవీన్(25)కు సూర్యాపేట జిల్లా పాలర్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కొంత కాలంగా కుటుంబంలో తగదాలు చోటు చేసుకోడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లిన నవీన్.. భార్యను కాపురానికి పంపించాలని వేడుకోగా ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్.. ఇంటికొచ్చి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త.. చికిత్స పొందుతూ మృతి తాళ్లఊకల్ గ్రామంలో ఘటన -
పుస్తకంలోనే అమూల్యమైన అంశాలు
హన్మకొండ కల్చరల్: పుస్తకం చదవడం వల్ల అమూల్యమైన అంశాలను తెలుసుకోవచ్చని, పుస్తకం భక్తి కావ్యాలు, నైతిక విలువలు నేర్పుతుందని కేయూ విశ్రాంతాచార్యుడు కొక్కొండ విజయబాబ అన్నారు. కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ భద్రకాళిరోడ్లోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మ య్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకం’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. కొక్కొండ విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం కమిటీ సలహాదారు కొక్కొండ శంకరయ్య పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీడికంటి శ్రీనివాసమూర్తి పుస్తకసమీక్ష చేయగా అక్కెర కరుణాసాగర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మారెడోజు సదానందాచారి, ఎర్రోజు లక్ష్మణాచారి, డా క్ట ర్ పల్లేరు వీరస్వామి, చేపూరి శ్రీరాం, వేదిక సభ్యులు వెలుగు ప్రభాకర్, పాము భాస్కర్, సిద్దెంకి బాబు, బొల్లోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కేయూ విశ్రాంతాచార్యుడు విజయబాబు -
సంక్రాంతిలోగా పనులు కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగలోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో జాతర అభివృద్ధి పనుల పురోగతిపై ఆదివారం మేడారంలో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల ఆలస్యంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాకారం పీటీ బీం ఏర్పాటు, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్లను త్వరగా ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు, క్యూలైన్ షెడ్ల నిర్మాణ పనులు జనవరి 12వ తేదీ వరకు పూర్తి చేయాలని, రహదారులకు ఇరువైపులా సైడ్బర్మ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 31 వరకు విద్యుత్ కాంతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జాతర పరిసరాల్లో జోన్లు, సెక్టార్ల వారీగా సిబ్బందిని నియమించుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట వేసి, కనీవిని ఎరుగుని రీతిలో జాతర నిర్వహించాలని సూచించారు. పనులను పరిశీలిస్తూ ఆదేశాలు.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క.. అధికారులతో కలిసి మేడారంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాండ్ స్కిప్పింగ్, ప్రధాన ఆర్చ్, హరిత హోటల్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జంపన్నవాగులో లెవలింగ్ పనులను పరిశీలించి నీటినిల్వ లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలో ఆదివాసీ మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంబు చికెన్ క్యాంటీన్ ప్రారంభించారు. చికెన్ రుచి చూసి మహిళలను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీలు శబరీష్, సిరిశెట్టి సంకీర్త్, ఏఎస్పీ మానన్ భట్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్జీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, మార్కెట్ చైర్ పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.కనీవిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహణ ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, అధికారులు -
గొర్రెల కాపరులపై హైనా దాడి?
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్ గ్రా మంలో హైనా దాడిలో పలువురు గొ ర్రెల కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బింగి అయిలయ్య, చిమ్మ సాయిలు, ఒగ్గు కొండయ్య, పైస బాల మల్లయ్య.. రోజూ మాదిరిగానే జీవాలను ఉదయం మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కిట్టమ్మ కుంట ఏనె దగ్గర హైనాను పోలిన జంతువు ఒకే సారి దాడి చేసింది. వరుసగా వస్తున్న నలుగురుపై గంట వ్యవధిలో దాడి చేయగా వారికి పలు చోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులను బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. కాగా, ఆ జంతువు.. జీవాలపై కూడా దాడి చేసిందని గొర్రెల కాపరులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకర జంతువుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రామచంద్రాపూర్లో ఘటన భయాందోళనలో గ్రామస్తులు -
కొడుకు పుట్టాడని..!
గీసుకొండ: కొడుకు పుట్టాడని ఓ కుటుంబం కాషాయ జెండాలను పట్టుకుని కాలినడకన వెళ్తోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వరంగల్–నర్సంపేట రోడ్డులో నర్సంపేట వైపు వెళ్తున్న మహారాష్ట్రవాసులు ఆదివారం మధ్యాహ్నం ‘సాక్షి’కి తారసపడ్డారు. వారిని చూసి పలకరించగా తమ కుటుంబంలో సంతానం లేక దిగులు చెంది భద్రాద్రి రాముడికి మొక్కుకున్నామని, ఆ దేవుడు కరుణించడంతో కుమారుడు జన్మించారని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కుమారుడితో రాముల వారిని దర్శించి కృతజ్ఞత తెలుపడానికి కాలినడకన వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలాదూరం నడిచి వచ్చామని, మరో 150 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందని తెలిపారు. మార్గమధ్యలో పలువురు తోచిన రీతిలో ప్రయాణ ఖర్చులకు నగదు సాయం చేశారు. మహారాష్ట్ర నుంచి భద్రాద్రి రాముడి సన్నిధికి కాలినడకన వెళ్తున్న కుటుంబం -
ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా?
మేడారం తల్లుల దర్శనం కోసం వస్తున్న భక్తులుములుగు రూరల్/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్తుల తిరుగు ప్రయాణంలో మల్లంపల్లి జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. జాతర సమయానికి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. కాగా, ఇప్పుడే ట్రాఫిక్ ఇలా స్తంభించిపోతే.. మహా జాతరనాటికి పరిస్థితి ఎలా ఉంటుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసులు మేడారం పరిసరాల్లో వాహనాలను దారి మళ్లించడంతో కొత్తగా మేడారానికి వచ్చిన భక్తులు దారి తెలియక ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రం నుంచి మంత్రుల కవరేజ్ కోసం వచ్చిన మీడియా బృందాన్ని కూడా పోలీసులు నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి అనుమతించకుండా కాల్వపల్లి మీదుగా మేడారానికి పంపించారు. దర్శనానికి ఒకే వరుసలో క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ఓ భక్తుడు అక్కడే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని యత్నించగా అతడిని పోలీసులు లాక్కెళ్లారు. -
లూయిస్ బ్రెయిలీ జయంతి
మహబూబాబాద్: మహిళా శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. కొంత మంది అంధులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, జూనియర్ అసిస్టెంట్ హరీశ్, అంధులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శిగా భాస్కర్ గార్ల: గార్లకు చెందిన పాలడుగు భాస్కర్ సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూని యన్ (సీఐటీయూ) జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల్లో ప్రస్తుతం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న భాస్కర్ను ఆదివారం జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మికుల వేతనాల పెంపుకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరాటాల్లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యంనర్సింహులపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున జిల్లాలోని నర్సింహులపేట మండల పరిధి జయపురం గ్రామానికి చెందిన క్రిడాకారిణి చందు లావణ్య ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె రాష్ట్ర జట్టు కెప్టెన్గా వ్యవహరించడంపై గ్రామస్తులు, వంగాల చారిటబుల్ ట్రస్ట్, క్రీడాకారులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసిన సీఎండీ వరుణ్రెడ్డి హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభా కాంక్షలు తెలిపారు. -
రుచికరమైన భోజనాలు వండాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనాలు వండాలని డీఈఓ వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మధ్యాహ్నం వంటలు వండే చోట పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలతో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఎక్కడైన లోపాల ఉంటే ఆ పాఠశాల కార్మికులపై చర్యలు తీసుకుంటా మన్నారు. వంటల పోటీల్లో కురవి మండలంలోని నేరడ మోడల్స్కూల్ ప్రథమ బహుమతి, కేసముద్రం జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం, మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాల తృతీయస్థానం సాధించిందన్నారు. వారికి బహుమతులు అందజేశారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం సిరినాయక్, మధ్యాహ్న భోజన జిల్లా ఇన్చార్జ్ గణేష్, న్యూట్రిషన్ నిపుణులు శ్రీనివాస్, దీప్తీ, రవీందర్ నాయక్ పాల్గొన్నారు. -
నర్సింగ్ విద్యార్థుల గోస..
నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్కళాశాల విద్యార్థులు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. 2022లో ప్రారంభమైన నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్లకు చెందిన 240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, సొంత భవనం లేకపోవడంతో ల్యాబ్, పరీక్షలు, చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ బిల్డింగ్ సరిపడకపోవడంతో బయట కిరాయి బిల్డింగ్లో ఉంటూ కిరాయి విద్యార్థులే చెల్లిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బిల్డింగ్, సౌకర్యాల విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 240 మంది విద్యార్థులు.. రెండు గదులు కళాశాలలో 240 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు లేవని తెలుస్తోంది. రెండు గదులతో కళాశాలను నడపాల్సి వస్తుంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో బిల్డింగ్ కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేటా యించలేదని విద్యార్థులు తెలుపుతున్నారు. కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల ఆందోళన.. తాము చదువుకునేందుకు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని కళాశాల విద్యార్థులు శనివారం కళాశాల ఆవరణ, కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్, అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని.. పరీక్షలు దగ్గరపడుతున్నా ల్యాబ్ సౌకర్యం వంటివి లేవని, పరీక్షలు ఎలా రాయాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. నర్సింగ్ కళాశాలకు కేటాయించిన బిల్డింగ్ను మెడిసిన్ విద్యార్థులకు అప్పగించారని, తమకు కూడా బిల్డింగ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరమయ్యేంత వరకు నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. సరిపోని భవనం, గదులు హాస్టల్ బిల్డింగ్ లేక కిరాయికి ఉంటున్న విద్యార్థులు ల్యాబ్, పరీక్షలకు తప్పని ఇబ్బందులు భవనం కేటాయించాలని ఆందోళన -
గ్రామాల్లోనే యూరియా పంపిణీ
మరిపెడ రూరల్: ఇక నుంచి గ్రామాల్లోనే కౌంటర్ల ఏర్పాటు చేసిన దశల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు డీఏఓ బి. సరిత అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలో పలు సెంటర్లలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఏఓ వీరసింగ్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ రైతులకు సరిపడా యూరియా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పంపిణీ చేస్తున్న యూరి యాను రైతులు దశల వారీగా ఉపయోంచుకోవా లని ఆమె సూచించారు. అదేవిధంగా నానో యూ రియా వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పి ంచారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఆందోళన అవసరం లేదు.. నర్సింహులపేట: యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ రైతుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ బి.సరిత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రైతులకు యూరియా కూపన్ల పంపిణీ, యూరియా పంపిణీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. యాసంగి సీజన్లో ప్రతీ రైతుకు సరిపడా యూరియా ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాలు లేవు..
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సౌకర్యాలు లేక చదువుకోలేపోతున్నాం. విద్యార్థులకు అవసరమైన బిల్డింగ్, ల్యాబ్, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం, అధికారులు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – జ్ఞానత్రిష, నర్సింగ్ విద్యార్థి అధికారుల దృష్టికి తీసుకెళ్లా..నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్లకు చెందిన 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సౌకర్యాలు, బిల్డింగ్, ల్యాబ్, తరగతి గదులకు సంబంధించిన విషయాలను అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా. అధికారులు చెప్పిన బిల్డింగ్ ఖాళీ చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. – లీలా, కళాశాల ప్రిన్సిపాల్ -
బిల్డింగ్ సరిపోవడం లేదు..
నర్సింగ్ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్ సరిపోవడం లేదు. ల్యాబ్, తరగతులకు ఇబ్బంది అవుతుంది. రెండు గదులు మాత్రమే ఉన్నాయి. నాల్గో బ్యాచ్ కూడా కళాశాలలో చేరడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ బిల్డింగ్, ఇతర సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె.డింపుల్, నర్సింగ్ విద్యార్థి బయట హాస్టల్లో ఉంటున్నాం..మాకు సరిపడా తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్ లేదు. బయట హాస్టల్లో ఉంటున్నాం. కిరాయి డబ్బులు మేమే చెల్లించుకుంటున్నాం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. సౌకర్యాలు లేకపోతే ఎలా చదువుకోవాలి. అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సౌకర్యాలు కల్పించాలి. – శ్రీవల్లి, నర్సింగ్ విద్యార్థి -
చకచకా ఏర్పాట్లు
‘పుర‘ పోరుకు అధికార యంత్రాంగం కసరత్తుమున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు.నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే?సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటరు జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. వసతులున్న చోటే పోలింగ్ కేంద్రాలు.. మౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటరు ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు ముసాయిదా జాబితాఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్ఘన్పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన మేడారంభక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
హుండీల ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు శనివారం 60 హుండీలు ఏర్పాటు చేశారు. ఈఓ వీరస్వామి సమక్షంలో సమ్మక్క, సారలమ్మ ఒక్కొ గద్దైపె 25, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒక్కొ గద్దైపె 5 హుండీలు ఏర్పాటు చేశారు. పూజారుల సమక్షంలో హుండీల తాళాలకు సీల్ వేశారు. భక్తులు కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేశామని ఈఓ వీరస్వామి తెలిపారు. తహసీల్దార్ సురేశ్బాబు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, పూజారులు పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే
హన్మకొండ: గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ముందుగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బాలికల విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారన్నారు. సమాజం కోసం జీవించి, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి మాత్రమే అసలైన సంఘ సంస్కర్త అని, ఆ ప్రమాణానికి పూర్తిగా సరిపోయిన తొలి వ్యక్తి సావిత్రిబాయి అన్నారు. ఆమె ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకంగా మారాయన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎం రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్ , శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్, వాసుదేవ్, నాగ ప్రసాద్, వెంకట కృష్ణ, జయ రాజ్, కళాధర్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఏజెన్సీ భూములపై అసెంబ్లీలో చర్చ
● ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ● అటవీ శాఖ పనులను అడ్డుకున్న గ్రామస్తులుకొత్తగూడ: రెవెన్యూ భూములను అటవీ శాఖకు అక్రమంగా బదిలీ చేసిన విషయంపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్సీ రవీందర్రావు చర్చించడంతో మండలంలో మళ్లీ చర్చమొదలైంది. మండలంలోని పొగుళ్లపల్లి గ్రామాన్ని ఆనుకుని గ్రామ కంఠం(రెవె న్యూ) భూమి 70 ఎకరాలు ఉంది. ఈభూమి గ్రామ అవసరాల కోసం ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. మండలానికి ఏకలవ్య గురుకుల నిర్మించడానికి ఎక్కడా ప్రభుత్వ భూమి లేకపోవడంతో గ్రామస్తులు 10 ఎకరాలను దానం చేస్తూ గ్రామసభ తీర్మానం ఇచ్చారు. దీంతో ఇక్కడ పాఠశాల నిర్మించారు. కాగా 2024 సెప్టెంబర్లో మిగతా 60 ఎకరా ల భూమి తమదంటూ అటవీ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి హద్దులు నాటుకున్నారు. వివరాలు పరిశీలించగా.. హైదరాబాద్ చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుకు తీసుకునే అటవీ భూమికి బదులుగా ఈభూమిని కేటాయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహనికి గురై న గ్రామస్తులు హద్దులను తొలగించారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులకు కాకుండా ఎక్కడో జరిగే పనులకు ఇక్కడి భూమి గ్రామసభ తీర్మానం లేకుండా, గ్రామస్తులకు తెలియకుండా ఎలా ఇస్తార ని ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా రెండు రోజుల క్రితం అ టవీ శాఖ అధికారులు భూమి చుట్టూ రోడ్డు నిర్మించేందుకు యంత్రాలను దింపారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్సీ రవీందర్రావు అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతుంది. ఇది లా ఉంటే ఏజెన్సీ చట్టాల కు విరుద్దంగా జరిగిన భూ బదలాయింపు నిలిపి వే యాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూ బదలాయింపు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ రహస్యంగా జరిగిన భూ బదలాయింపు విషయాన్ని 2024 సెప్టెంబర్లోనే సాక్షి కథనం ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనంతో అన్ని వర్గాల ప్రజలు భూ బదలాయింపును నిలిపి వేసి భూమిని ఏజెన్సీ ప్రజల అభ్యున్నతి కోసం ఉపయోగపడేలా చూడాలని ఆందోళనలు చేశారు. దీంతో ఇన్ని రోజులు అధికారులు ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడంతో చర్చనీయాంశంగా మారింది. -
చెక్ పవర్ వచ్చేదెన్నడో..?
● ఎదురుచూస్తున్న కొత్త సర్పంచ్లు ● చెక్ పవర్తోనే నిధులు డ్రా చేసే అవకాశం ● నేటికీ ఆదేశాలివ్వని ప్రభుత్వంతొర్రూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో జిల్లాలో గత నెల 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని 18 మండలాలకు చెందిన 482 గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. అయితే వారికి చెక్ పవర్ రావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సుమారు రెండేళ్ల నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో డిసెంబర్ 22 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గత పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి పేరిట జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. ఆ అధికారాన్ని ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ పేరిట బదిలీ చేయాల్సి ఉంది. పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను అభివృద్ధి పనులు, ఇతరత్రా ఖర్చులకు డ్రా చేయాలంటే వారి సంతకాలు, ఆధార్, పాన్ కార్డు, ఫోన్ నంబర్, వేలి ముద్రల వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇలా.. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వాటిని డ్రా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) అమల్లో ఉంది. నిధులు డ్రా చేసేందుకు డిజిటల్ కీ అవసరం లేకపోయినా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెక్కు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను ట్రెజరీ అధికారులకు పంపాల్సి ఉంటుంది. డిజిటల్ సంతకాలు సక్రమంగా ఉంటే బిల్లు పాసవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి.. గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను విడుదల చేస్తోంది. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ఆ నిధులు అందుతాయి. పంచాయతీలకు కేటాయించే నిధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్) అనే ఆన్లైన్ పోర్టల్ను రూపొందించింది. సర్పంచ్, ఉప సర్పంచ్ వేలిముద్రల ఆధారంగా డిజిటల్ ‘కీ’ ని తయారు చేస్తారు. ఆ కీని ఉపయోగించి పనులు చేసిన వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా చెల్లించే సదుపాయం ఉంది. గతంలో డిజిటల్ కీ తయారీ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం కీ బాధ్యతను ఏజెన్సీకి అప్పగిస్తారా.. లేక డీపీఎం, ఈ– పంచాయతీ ఆపరేటర్ల ద్వారా అమలు చేస్తారా.. అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే చెక్ పవర్ బదిలీ చేస్తాం దాదాపు అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారికి ఉన్న చెక్ పవర్.. సర్పంచ్, ఉప సర్పంచులకు బదిలీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పీఎఫ్ఎంఎస్, ఐఎఫ్ఎంఎస్కు సంబంధించిన డిజిటల్ కీ తయారీకి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ బదిలీ జరుగుతుంది. – వెంకటేశ్వర్లు, తొర్రూరు ఎంపీడీఓ -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగంపెంచాలి గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
మహిళపై బీఆర్ఎస్ కార్యకర్త దాడి..
కురవి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కోపం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నృత్యం చేసిందనే కారణంతో ఓ బీఆర్ఎస్ కార్యకర్త.. మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన సదరు మహిళ బానోత్ బుల్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండా(బీ) గ్రామంలో వార్డు సభ్యుడి స్థానానికి మాలోత్ మోహన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే అదే వార్డులో ఉండే బుల్లి.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించగా ఆ పార్టీ వారితో కలిసి నృత్యం చేసిందనే కోపంతో మోహన్.. ఆమైపె దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై బుల్లి గ్రామ పెద్దలకు చెప్పడంతో మోహన్ను పంచాయితీకి పిలిచినా రావడంలేదు. మళ్లీ బుల్లి పొలంలో పనిచేస్తున్న సమయంలో మోహన్ మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై శుక్రవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బుల్లి ఫిర్యాదు మేరకు మోహన్పై కేసు నమోదు చేశామని ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. కాగా, బుల్లిని కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్ స్వరూప భర్త హరిలాల్ పరామర్శించారు. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం ఒకరిపై కేసు నమోదు -
మహిళా విద్యతోనే సాఽధికారత
కేయూ క్యాంపస్: నాటి పరిస్థితుల్లో మహిళా విద్యతోనే సాధికారత సాధ్యమని సావిత్రిబాయి పూలే గుర్తించారని, సమాజ నిర్మాణంలో మహిళల కృషి అభినందనీయమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కేయూలోని సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ బి. దీపాజ్యోతి అధ్యక్షతన సెనేట్ హాల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ మహిళా ఉద్యోగులు తమ సంపూర్ణ శక్తి, సామర్థ్యాలను విశ్వవిద్యాలయం అభివృద్ధికి వినియోగిస్తున్నారని కొనియాడారు. సావిత్రిబాయిపూలే గొప్ప సామాజిక సంస్కర్త అన్నారు. అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు మానసికంగా, భావోద్వేగపరంగా బలమైనవారన్నారు. నేటి తరం పురుషులు మహిళలకు సహకరిస్తుండడం అభినందనీయమన్నారు. మైత్రీ, గార్లి వంటి మహనీయ మహిళలను అందించిన దేశం భారతదేశమన్నారు. అదే కోవకు చెందిన మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వివక్ష, అణిచివేత ఉన్నకాలంలో మహిళా విద్యతో చైతన్య నింపిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయిపూలే అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బీసీ సెల్ డైరెక్టర్ బొడిగ సతీష్, కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ, బి.సుకుమారి మాట్లాడారు. వర్సిటీ అభివృద్ధిలో మహిళాఉద్యోగులు కీలకం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడి యంలో వెటరన్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దయాకర్ స్మారక రాష్ట్ర స్థాయి సీనియర్స్ బాల్బ్యాడ్మింటన్ పోటీలు శని వారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీలను వీనస్ జువెల్లరీ అధి నేత రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో నిత్య సాధనతో ఆరోగ్యంగా ఉంటారనడానికి సీనియర్ క్రీడాకారులే నిదర్శనమన్నారు. వెటరన్ క్రీడాకారులను యువత ఆద ర్శంగా తీసుకోవాలన్నారు. వెటరన్ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్, వెటరన్ సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉమ్మడి వరంగల్ బాల్బ్యాడ్మింట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి. వీరన్న, కార్పొరేటర్ గుండేటి నరేందర్ పాల్గొన్నారు. -
ఒకే ఇంటి నంబర్పై 79 ఓట్లు
మహబూబాబాద్: ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు ఈనెల 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శించారు. కాగా 17వ వార్డులో ఇంటి నంబర్ 4–45పై 79 ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పొందుపరిచారని ఆ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు సప్పిడి రంజిత్, యాకుబ్, శ్రీను తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఆ జాబితాలో ఇచ్చిన ఇంటినంబర్ ఆ వార్డు పరిధిలోనే లేదని అన్నారు. ఆ ఇంటి నంబర్పై ఇచ్చిన ఓటర్లలో కేవలం పది మంది మాత్రమే ఆ వార్డులో ఉన్నారని, మిగితా వారు లేరని తెలిపారు. జాబితాను సవరించాలని కోరారు. -
సులువుగా.. వేగంగా
హన్మకొండ : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు నడపనున్న ఆర్టీసీ బస్లకు డీజిల్ కోసం ప్రైవేట్ బంకులను గుర్తించారు. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో జరగనున్న మహా జాతరకు టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 3,860 బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బస్సులన్నింటికీ ఆర్టీసీ డిపోల్లో డీజిల్ నింపుకోవడం ఇబ్బందికరం. డిపోల్లో డీజిల్ నింపుకునేందుకు వరుస కట్ట డం ద్వారా బస్సులు ఆలస్యమై భక్తుల చేరవేతకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో భక్తులను వెనువెంటనే చేరవేసేందుకు బస్సులు అందుబాటులో ఉండాల్సిన అవసరముంది. ఈ క్రమంలో బస్సుల్లో సులువుగా డీజిల్ నింపుకునేందుకు ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించారు. రూట్ల వారీగా ఏడు ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిలో డీజిల్ నింపుకునేలా ఆయా స్టేషన్ల యజమానులతో అవగాహనకు వచ్చారు. తద్వారా డిపోలలో ఉండే డీజిల్ బంకులపై భారం పడదు. బస్సులు వెనువెంటనే బయలుదేరే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే మేడారం రూట్లోని ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లలో ఆర్టీసీ బస్సులు డీజిల్ పోసుకునేలా కార్యాచరణ రూపొందించారు. ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లు ఇవే.. చెల్పూరులోని సునీత ఫిల్లింగ్ స్టేషన్, మల్లంపల్లిలోని హరికృష్ణ ఫిల్లింగ్ స్టేషన్, సూర్యచంద్ర ఫిల్లింగ్ స్టేషన్, భూపాలపల్లిలోని మణికంఠ ఫిల్లింగ్ స్టేషన్, జవహర్ నగర్లోని శ్రీ శ్రీనివాస సాయి ఫిల్లింగ్ స్టేషన్, చిన్నబోయినపల్లిలోని శ్రీ పాండు నిర్మల ఫిల్లింగ్ స్టేషన్, గోవిందరావు పేటలోని శారద ఫిల్లింగ్ స్టేషన్ యజమానులతో ఆర్టీసీ అధికారులు అవగాహన కుదుర్చుకున్నారు. జాతరలో ఆర్టీసీ బస్లకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ఆయా యజమానులతో అధికారుల ఒప్పందం ఈ అవగాహనతో భక్తులను వెంటనే చేరవేయడానికి అవకాశం రూట్ల వారీగా ఏడు ఫిల్లింగ్ స్టేషన్ల గుర్తింపు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే జాతరకు నడిచే బస్సులకు ఇంధనం కోసం ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించాం. ఆర్టీసీ డిపోల్లో అన్ని బస్సులకు ఇంధనం నింపడం సాధ్యం కాదు. ఈ క్రమంలో బస్సులు నిలిచిపోకుండా ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లలో డీజిల్ పోసుకునేలా ఏర్పాట్లు చేశాం. –దర్శనం విజయ భాను , ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ -
పూజల పేరిట రూ. 55 లక్షలు దోపిడీ
ధర్మసాగర్: పూజల పేరిట ఓ పూజారి రూ.55 లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన ఇటీవల హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని ఓ ఫామ్ హౌస్లో చోటు చేసుకో గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని తనకు తెలిసి న ఓ వ్యక్తి చెప్పగా సదరు ఫామ్ హౌస్ యజమాని నమ్మాడు. దీంతో డిసెంబర్ 30న తన ఫామ్ హౌస్లో పూజలు చేయించాడు. ఈ క్రమంలో పూ జారి పూజలు చేస్తూ యజమానిని నమ్మించాడు. రూ.55 లక్షల నగదుకు కూడా పూజ చేస్తానని చెప్పి ఆ యజమానిని ఓ గదిలోకి పంపించి బెడం పెట్టా డు. ఈ క్రమంలో అర్ధగంట దాటినా బెడం తీయలేదు. పూజారి మాటలు కూడా వినపడ లేదు. కిటికీ నుంచి బయటకు వచ్చి చూడగా ఆ పూజారి కనిపించలేదు. దీంతో సదరు పూజారి డబ్బుతో ఉడాయించినట్లు తెలుసుకున్నారు. తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. బంధువుగా పరిచయం చేసుకున్నాడు.. జనగామ: జనగామ మండలం యశ్వంతపూర్కు చెందిన మారబోయిన రాములు డబ్బులు డ్రా చేసుకునేందుకు శనివారం పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపం ఎస్బీఐకి వెళ్లాడు. ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసుకున్న అనంతరం బయటకొచ్చాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి, తన బంధువునని పరిచయం చేసుకున్నాడు. అనంతరం టిఫిన్ చేద్దామని సమీపంలోని ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ చేతులు కడుక్కోవాలని చెప్పడంతో రాములు హ్యాండ్వాష్ వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన పై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం వరంగల్: గుర్తుతెలియని లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం కొత్తపేట క్రాస్ రోడ్ ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి ఎదుట జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన గౌని అనిల్గౌడ్(50), తన మిత్రుడు సతీశ్.. బైక్పై కొత్తపేట నుంచి ఆరెపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి ఎదుట ములుగు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని లారీ.. వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా లారీ అనిల్ తలపై నుంచి వెళ్లడంతో ముఖం చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే ఎదుట ఉన్న ఎన్ఎస్ఆర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరెపల్లి గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్తోనే ఈప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పలుమార్లు ఎన్హెచ్ అధికారులకు చెప్పినా రెండు ఆస్పత్రుల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్సై రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం లారీని గుర్తించేందుకు ఆస్పత్రికి చెందిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ● ఉనికిచర్లలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన జనగామలో ఘటన మరొకరికి తీవ్ర గాయాలు కొత్తపేట క్రాస్రోడ్లో ఘటన -
ఈస్ట్జోన్ క్రికెట్ గోల్డ్ కప్ విన్నర్గా హనుమకొండ
కేయూ క్యాంపస్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. విన్నర్గా హనుమకొండ, రన్నరప్గా ఖమ్మం జట్లు నిలిచాయి. ఫైనల్లో హనుమకొండ, ఖమ్మం జట్లు తలపడగా నిర్ణీత 20 ఓవర్లలో హనుమకొండ మూడువికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఖమ్మం 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో హనుమకొండ గెలు పొంది చాంపియన్గా నిలిచింది. విన్నర్, రన్నరప్ జట్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యుడు, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జనరల్సెక్రటరీ గురువారెడ్డి, కేయూ మాజీ పీడీ ఎన్ఏ జయచందర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పెసరు విజయచందర్రెడ్డి, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపల్లి జయపాల్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీముద్దీన్ బహుమతులు ప్రదానం చేశారు. కాగా, ఉత్తమ బ్యాట్స్మెన్గా, మ్యాన్ ఆఫ్ది సిరీస్గా హనుమకొండకు చెందిన విష్ణుదాస్ శశాంక్, ఉత్తమ బౌలర్గా పెద్దపల్లికి చెందిన రాహుల్ ఎంపికయ్యారు. రన్నరప్గా ఖమ్మం జట్టు విజేతలకు ట్రోఫీల ప్రదానం -
ఉత్సవం.. ఉత్సాహం
రేపటి నుంచి అన్నారం దర్గా ఉర్సు ● మూడు రోజులపాటు నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం ● తరలిరానున్న వేలాది మంది భక్తులుపర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో యాకుబ్షావళి దర్గా ఉర్సు ఈనెల 5వ తేదీ నుంచి జరగనుంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలొచ్చి యాకుబ్షావళి దర్గా దర్శించుకోనున్నారు. మొదటి రోజు (సోమవారం) రాత్రి ఖవ్వాలి గేయాలాపన, గంధం ఊరేగింపు, రెండో రోజు (మంగళవారం) దీపారాధన, భక్తుల కు మహా అన్నదానం, మూడో రోజు (బుధవారం) ఖత్మల్ ఖురానాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ముస్లింలతో పాటు హిందువులు మొక్కులు చెల్లించుకుంటారు. కోళ్లు, యాటలతో కందూర్లు చేస్తారు. అన్నారం షరీఫ్ గంధం ఊరేగింపు కోసం భారీ పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాం. మామునూరు ఏసీపీతోపాటు ఐదుగురు ఎస్సైలు, వంద మంది సిబ్బంది పాల్గొంటారు. ఉర్సు విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాజగోపాల్, సీఐ, పర్వతగిరి -
ప్రమాదాల నివారణకు కీలక అడుగు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా విద్యుత్ శాఖ అధికారుల కీలక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మేడారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అటవీశాఖ బీట్ కార్యాలయం నుంచి తాడ్వాయి వెళ్లే దారిలో గట్టమ్మ వరకు మూడు కిలోమీటర్ల మేర 33/11 కేవీ విద్యుత్ లైన్కు ఏర్పాటు చేస్తున్న కవర్ కండక్టర్ల పనులు కొనసాగుతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉండే ఈ ప్రాంతంలో సాధారణ కండక్టర్లకు బదులు కవర్ కండక్టర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కవర్ కండక్టర్ల ఏర్పాటు వల్ల చెట్లు విరిగిపడినా, కొమ్మలు తాగినా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ట్రిప్పింగ్ లాంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ప్రత్యేకంగా మేడారం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే దృష్ట్యా ఈ ఏర్పాట్లు ఎంతో అవసరమన్నారు. వర్షాకాలంలోనూ విద్యుత్ అంతరాయం లేకుండా కవర్ కండక్టర్ ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు. 33/11 కేవీ విద్యుత్ లైన్కు కవర్ కండక్టర్ల ఏర్పాటు -
ఆకట్టుకున్న కథానాటిక పోటీలు
హన్మకొండ అర్బన్ : వరంగల్లో అజో విభో కందాళం, సహృదయ సాహిత్య–సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న 33వ సాహితీ–సాంస్కృతిక సదస్సు, కథానాటిక పోటీలు శని వారం మూడో రోజూ కొనసాగాయి. కార్యక్రమాల్లో భాగంగా సాహితీవేత్త విహారి అధ్యక్షతన హనుమ కొండలోని శ్రీహర్ష కన్వెన్షన్లో ఉదయం రామాచంద్రమౌళి కృషి సమాలోచన సదస్సు, సాయంత్రం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నాటిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా రామాచంద్రమౌళి కథల్లోని విభిన్నత, కవిత్వం, తదితర అంశాలపై జగన్నాథ శర్మ, శివరామప్రసాద్, విజయకుమార్, లకీష్మ్కాంతారావు, రమాదేవి, సంతోష్కుమార్, అనిల్ ప్రసాద్ తదితర వక్తలు విశ్లేషించారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కథానాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముందుగా శార్వాణి గిరిజన సాంస్కృతిక కళాక్షేత్రం శ్రీకాకుళం బృందం ప్రదర్శించిన ‘మాయాజాలం’ నాటిక తుపానుతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ అనుమాండ్ల భూమయ్య, ఆత్మీయ అతిథి అత్తలూరి సత్యనారాయణ, అంపశయ్య నవీన్ మాట్లాడుతూ సాహిత్యం, నాటకాలను సమన్వయం చేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజో విభో, సహృదయ సంస్థల సేవలను ప్రశంసించారు. కాగా, స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, ఉదయ్ భాగవతుల దర్శకత్వంలో ప్రదర్శించిన ‘శ్రీ మాత్రే నమః’ నాటిక కుటుంబ నిర్వహణలో మహిళ కష్టాలను ఆవిష్కరించింది. చివరిగా శ్రీ రమణ కళానిలయం గుంటూరు నాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మాతృత్వం’ నాటిక తల్లి ఆవేదనను అద్భుతంగా చూపించారు. సాహిత్య సంస్కృతి భావి తరాలకు తెలియాలి.. హన్మకొండ కల్చరల్: సాహిత్య సంస్కృతి భావితరాలకు తెలియాలని అజో విభో కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. అజో విభో కందాళం ఫౌండేషన్, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక సదస్సులో భాగంగా శనివారం వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన అప్పాజ్యోసుల సత్యనారాయణ విరచిత పంచవటి పద్యకృతి పుస్తకావిష్కరణ, వరంగల్కు చెందిన కవి రామా చంద్రమౌళి కృషి సమాలోచన అంశంపై సదస్సు జరగగా సత్యనారాయణ మాట్లాడారు. -
అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ కల్చరల్: అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు శనివారం హనుమకొండ హరిత హోటల్కు చేరిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎస్. హరీశ్, ఆగమ సలహాదారు గోవింద హరిని గంగు ఉపేంద్రశర్మ కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జీఓ 121 రద్దుతో సుమారు వెయ్యి మంది తాత్కాలిక దినసరి అర్చక ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు పొందుతున్న అర్చకులకు మూడు నెలల జీతాలు రాలేదని తెలుపగా.. డైరెక్టర్ హరీశ్ స్పందించి వేతనాలు వెంటనే అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హామీ ఇచ్చినట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీ శర్మ, ఇతర అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
మహాజాతరలో మెరుగైన వైద్యసేవలు
ఎంజీఎం : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లతో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు అందించాల్సిన వైద్యసేవలపై హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సమన్వయ కర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లాకు దగ్గరగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలు, అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులను జాతరలో వైద్యసేవల కోసం డిప్యూటేషన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కమిటీలో చర్చించినట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ డీఎంహెచ్ఓలు సాంబశివరావు, అప్పయ్య, గోపాల్ రావు, మధుసూదన్, రవిరాథోడ్, మల్లికార్జున్, జనగామ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ : మహాజాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు, వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,860 ప్రత్యేక బస్సులు నడపాలని వీటి ద్వారా 20లక్షలకు పైగా భక్తులు ప్రయాణిస్తారనే అంచనా వేశారు. అందుకు అవసమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో ఆరుగురు డాక్టర్లు, సిబ్బందిచే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నాలుగు అంబులెన్స్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇక్కడి వైద్య శిబిరంలో చికిత్స అందించనున్నారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి -
మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
● ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల ● ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన ● ఈనెల 10న ఓటరు తుది జాబితా వెల్లడి ● సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగంమహబూబాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేశారు. ఈసీఐ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు తొలుత ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, ఇతర జాబితా తయారు చేసే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 10న ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తారు. కాగా, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మానుకోటలో 36 వార్డులు.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల జాబితా ప్రకారం 57,828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితా ఆధారంగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఈసీఐ ఆదేశించింది. 01–10–2025 నాటి డేటా ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారు చేయాలని గైడ్ లైన్స్లో పొందుపర్చారు. వార్డుల వారీగా ఓటరు జాబితా.. డిసెంబర్ 29న విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. 30,31 తేదీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పీఎస్ల వారీగా వార్డుల జాబితా తయారు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఆర్ఐ, మేనేజర్ టౌన్ ప్లానింగ్ అధికారులంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. పనులను కమిషనర్ టి.రాజేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. ● ఈనెల 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఆరోజు నుంచే అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు తెలి పారు. కాగా, ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ● ఈనెల 5న మున్సిపాలిటీల పరిధిలోని రాజకీయ నాయకులతో ఓటరు జాబితా, పీఎస్లపై సమావేశం, 6న కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ● ఈనెల 10న తుది ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తదుపరి రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మానుకోట మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఎస్టీకి కేటా యించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పెరిగిన ఓటర్లు.. గత ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీలో 57,828 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం 65,851మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు గతంలో కంటే 8,023 మంది ఓటర్లు పెరిగారు. దీంతో వార్డులు పెరగడం, పరిధి కూడా మారే పరిస్థితి ఉంది. దీంతో రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కాగా చైర్మన్ రిజర్వేషన్ బీసీకి కేటాయించాలని చాలామంది రాజకీయ నాయకులు ఆశిస్తున్నాయి. అయితే ఎస్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేసి, తల్లుల గద్దెల వద్ద పూజలు చేసి మొక్కులు సమర్పించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝా, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేశ్ గీతే బాబాసాహెబ్లతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో మల్టీజోన్ ఐజీని గద్దెలపై స్వాగతం పలికారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీలు, ఎస్పీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్ అమ్మవార్ల కండువాలతో సన్మానించి బెల్లం, ప్రసాదం అందజేశారు. -
ఆటోను ఢీకొన్న లారీ
● ఒకరి మృతి చిల్పూరు : మండలంలోని నష్కల్ గ్రామ బస్ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద గురువారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట బాపూజీ నగర్కు చెందిన గబ్బెట ఎల్లేష్ (45), ఎర్ర రాజు ఆటోలో కరుణాపురం చర్చికి వచ్చారు. తిరిగి అదే ఆటోలో అర్ధరాత్రి నష్కల్ స్టేజీ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వస్తున్న లారీ, ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎల్లేష్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని యువకుడు.. కమలాపూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరి రాజు (30) హుజూరాబాద్ వైపు నుంచి కమలాపూర్ వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కమలాపూర్ బస్టాండ్ వద్ద అదే వైపు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ రాజు బైక్ను ఢీకొట్టింది. దీంతో అతడు లారీ కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో రాజును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందాడని ధ్రువీకరించారు. బావిలో పడి యువతి.. గూడూరు : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని తేజావత్ రాంసింగ్ తండా శివారు దొడ్డితండాలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డితండాకు చెందిన గుగులోత్ అఖిల (18) పదోతరగతి వరకు చదివి ఇంటి వద్ద తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తుంది. ఈ క్రమంలో మేకలను మేపడానికి వెళ్లిన అఖిల, వ్యవసాయబావి వద్ద మేస్తున్న మేకలను పక్కకు కొట్టబోయి, ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. తండ్రి గుగులోత్ సూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
కొత్తూరు హైస్కూల్ తరలింపునకు యత్నం
● అడ్డుకున్న సమ్మయ్యనగర్ కాలనీవాసులువిద్యారణ్యపురి: హనుమకొండలోని గోపాల్పురం ప్రాంతంలో అద్దెభవనంలో ఉన్న కొత్తూరు ప్రభు త్వ హైస్కూల్ను సమీపంలోని సమ్మయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించాల ని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కొత్తూరు ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం లచ్చిరాం నాయక్, ఉపాధ్యాయులు కలిసి ఆ పాఠశాలలోని విద్యార్థులను శుక్రవా రం తీసుకొని సమ్మయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. దీంతో ఆ కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సమ్మయ్యనగర్లోని ఈ భూమిని ప్రాథమిక పాఠశాల కోసం ఇచ్చామని, ఇప్పుడు ఇక్కడ హైస్కూల్ ఏర్పాటుచేయడం సరికాదని అన్నారు. హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ మహేష్ అక్కడి వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను తీసుకొని హెచ్ఎం, ఉపాధ్యాయులు వెనుదిరిగారు. -
హామీల అమలేది..?
● బయ్యారం పెద్దచెరువును పట్టించుకోని ప్రజాప్రతినిధులు ● పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ● ప్రస్తుతం ఊసెత్తని పాలకులు బయ్యారం: కాకతీయరాణి బయ్యామాంబ నిర్మించిన బయ్యారం పెద్ద చెరువును అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండుగుట్టల అందాల నడుమ ఉన్న బయ్యారం పెద్దచెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని గత ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా కొనసాగిన సత్యవతిరాథోడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. చెరువు అభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుగుట్టలే చెరువుకట్ట.. కాకతీయరాణి బయ్యామాంబ పాలనలో రెండుగుట్టల నడుమ బయ్యారం పెద్ద చెరువును నిర్మించారు. 16.2 అడుగుల నీటిసామర్థ్యం గల పెద్దచెరువు బయ్యారం, గార్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులకు సాగునీటిని అందిస్తోంది. ఎక్కడ కరువు వచ్చినా.. చెరువు కింద మాత్రం పంటలు పండుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. కట్టపై శిలాశాసనం.. కాకతీయరాజుల వంశచరిత్ర ఆధారంగా అప్పటి కాకతీయరాణి బయ్యామాంబ బయ్యారం పెద్దచెరువు కట్టపై శిలాశాసనం ఏర్పాటు చేయించారు. ఈ శాసనంపై ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశచరిత్రను వివరించారు. కాకతీయుల వంశచర్రితను తెలిపే శాసనం బయ్యారం చెరువుకట్టపైనే ఉందని చరిత్ర తెలుపుతోంది. అలుగుల కనువిందు.. ప్రతీ వర్షాకాలంలో చెరువు నిండి అలుగుల నుంచి వచ్చే నీటి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలను బట్టి చెరువులో పూర్తిస్థాయి నీరు చేరుతుంది. అలుగుల ద్వారా వచ్చే నీటి అందాలను చూసేందుకు మండలంలోని పలు గ్రామాల వాసులతో పాటు మహబూబాబాద్, కురవి, గూడూరు, గార్ల, డోర్నకల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికై నా బయ్యారం పెద్దచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి కోటగడ్డ పంచాయతీ పరిధిలో పచ్చనిచెట్లు, కనుచూపు మేర నీటితో కనపడే బయ్యారం పెద్దచెరువు వద్దకు ప్రతీ సీజన్లో పర్యాటకులు వస్తుంటారు. చెరువులో నీటిని నిల్వ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చెరువు కట్ట నుంచి అలుగుల వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. –కె.వరలక్ష్మి, సర్పంచ్, కోటగడ్డ -
కమ్మేసిన మంచు.. కనిపించని రోడ్డు
● ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు ఖిలా వరంగల్ : వరంగల్ నగర రహదారులను శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 10గంటల వరకు రహదారులపై దట్టంగా మంచు పడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుడికి వెళ్లొస్తామని బయల్దేరి.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దంపతులు గుడికి వెళ్లొస్తామని ఇంటినుంచి బయల్దేరారు. ఇంతలో రోడ్డును కమ్మేసిన పొగ మంచు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగశాయిపేటకు చెందిన గడ్డం రఘుమోహన్, రాజేశ్వరి బైక్పై భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించే పరిస్థితి లేదు. ఫోర్ట్ రోడ్డులోని వాల్మార్ట్ సమీపానికి చేరుగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాని వెనుకలే వెళ్తున్న వీరు ట్రాక్టర్ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘనటలో ఇద్దరి తలతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించినట్లు సమాచారం. -
హాస్టల్లో దాడి ఘటనపై విచారణ
కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ప్రభాకర్పై బయటి వ్యక్తి వచ్చి దాడి చేసిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఎస్సీడీఓ విక్రం, ఏటీడీఓ హసీనా హాస్టల్కు వచ్చి బాధిత విద్యార్థితో పాటు సహచర విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. దాడి ఘటన జరిగిన తీరుపై వివరాలు తెలుసుకుని విద్యార్థులు, సిబ్బంది వాంగ్మూలం తీసుకున్నారు. నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. కాగా హాస్టల్లో విద్యార్థిపై దాడి చేసిన రోజు వార్డెన్ రాత్రి 9గంటల వరకు ఉన్నాడని, అదే సమయంలో వాచ్మెన్ బయటి వ్య క్తిని అడ్డుకొని బయటకు పంపాడని ఇద్దరి తప్పు లే దని చెప్పారు. విలేకరులు ఏదో రాశారని విద్యార్థులతో హాస్టల్ సిబ్బంది వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన వ్యక్తిపై కేసు హాస్టల్లో విద్యార్థి ప్రభాకర్పై దాడి చేసిన పాకాల గ్రామానికి చెందిన నవీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
టికెట్ల జారీలో ఆగని అవినీతి!
● భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్.. ● ఎక్కడా అవినీతి జరగలేదు: అసిస్టెంట్ కమిషనర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 31నుంచి జనవరి 2వ తేదీ వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘా లోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దేవాలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి ఎక్కడా జరగలేదని, సోషల్మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో కేవలం ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. -
మున్నేరు టు పాలేరు
సాక్షి, మహబూబాబాద్: మానుకోట జిల్లా మీదుగా ప్రవహించే మున్నేరు వాగుపై గార్ల మండలం దుబ్బగూడెంలో అడ్డుకట్ట వేసి నీటిని దారి మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డోర్నకల్ మండలం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరుకు నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు నిధుల మంజూరు, కాల్వల భూసేకరణ పనిలో ఉన్నారు. అయితే వాగు దారి మళ్లిస్తే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని, భూమి ఇచ్చే ప్రసక్తే లేదని గార్ల రైతులు మొండికేస్తున్నారు. ప్రతీ ఏటా వృథాగా సముద్రంలో కలిసే నీటినే పాలేరుకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతుండగా.. రైతులు మాత్రం వినకుండా ఆందోళన బాట పట్టారు. పాలేరుకు ఇలా.. ఎగువన ఉన్న ములుగు, వరంగల్ జిల్లాల మీదుగా మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ప్రవహిస్తూ ఖమ్మం జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే గార్ల మండలంలోని దుబ్గగూడెం వద్ద చెక్ డ్యాం నిర్మించి సుమారు 10 కిలోమీటర్ల మేరకు కాల్వలు తవ్వి డోర్నకల్ పట్టణం సమీపం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు కాల్వలో కలుపుతారు. ఇందుకోసం రూ.145 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కాల్వలు తవ్వడానికి 350 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. కాగా పనులు పూర్తయితే మున్నేరు వాగు ద్వారా 10 నుంచి 12 టీఎంసీల నీటిని పాలేరులోకి తరలించవచ్చు. భూములు ఇవ్వమంటున్న రైతులు.. మున్నేరు నీటిని పాలేరుకు తరలించే కాల్వల కోసం 350 ఎకరాల భూమి అవసరం. అయితే ఈ భూమి ఇవ్వం.. కాల్వ తవ్వవద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. మున్నేరు దారి మళ్లించడం ద్వారా గార్ల, డోర్నకల్ మండలాల్లోని రాంపురం, పాత దుబ్బతండా, కొత్త దుబ్బతండా, సత్యతండా, గుర్రాలకుంట తండా, అమ్మపాలెం, తహసీల్దార్ బంజర, సీతారాంపురంలోని ఎనిమిది చెక్ డ్యాంలతోపాటు, ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం సరిహద్దుల్లో ఉన్న రెండు చెక్ డ్యాంలు, డోర్నకల్ పట్టణ శివారులోని ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ చెక్డ్యాంల నీటినే ఆధారంగా చేసుకొని సాగుచేసే సుమారు 5వేల ఎకరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ భూములు తప్పని సరిగా ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం ఎకరానికి రూ. 12లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదని ప్రచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి రూ. 20లక్షల నుంచి రూ. 40లక్షల మేరకు ధర పలుకుతోంది. ఇన్ని కారణాలతో అసలు భూమి ఇవ్వం, కాల్వల నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భూ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకొని సర్వే చేయకుండానే వెనక్కి పంపించారు. వాగు దారి మళ్లించి పాలేరుకు నీటి తరలింపు గార్ల మండలం దుబ్బగూడెంలో చెక్డ్యాం నిర్మాణం మిగులు జలాలే తరలిస్తున్నామంటున్న అధికారులు కాల్వల నిర్మాణ భూసేకరణకు రైతుల ససేమిరా మా నీళ్లు మళ్లించొద్దని రైతులు, రైతు సంఘాల ఆందోళన -
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్ /హన్మకొండ కల్చరల్ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా అజో విభో కందాళం, సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న సాహితీ–సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కంటే ముందు సామాన్యులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించి, నేటి సమాజంలోని స్థితిగతులను విశ్లేషించి కళాత్మకంగా అందజేస్తున్నది రంగస్థల నాటకమేనని అజో విభొ కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం కోట్ల హనుమంతరావు కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. బీహెచ్. పద్మప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నటుడు, దర్శకుడు, అధ్యాపకుడిగా కోట్ల హనుమంతరావు ప్రస్థానంపై విశ్లేషణ జరిగింది. అనంతరం అలనాటి నాటక ప్రస్థానం–మేటి నటులు శ్రవ్య, దృశ్య కళారూప ప్రదర్శనను కందిమల్ల సాంబశివరావు ప్రదర్శించారు. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన నాటికల ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘సమయం’ నాటిక సమయ విలువను కుటుంబ నేపథ్యంతో ప్రభావవంతంగా ఆవిష్కరించింది. సభా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తడకమళ్ల రామచంద్రరావు నాటకం ఒక జీవ కళ అని, సమాజానికి దర్పణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట రంగస్థలం పురస్కారాన్ని కోట్ల హనుమంతరావుకి అందజేశారు. అనంతరం హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటిక తల్లి–కుమారుడి భావోద్వేగాలను హృద్యంగా చూపించింది. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థంగా పేరడి గురుస్వామి మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. చివరిగా మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక కుటుంబ వ్యవస్థలోని సంఘర్షణలను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో సహృదయ కార్యవర్గ సభ్యులు జి. గిరిజామనోహరబాబు, ఎన్వీఎన్ చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, మల్యాల మనోహరబాబు, న్యాలకొండ భాస్కర్రావు, లక్ష్మణమూర్తి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపదటిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, కవి రామాచంద్రమౌళి, రంగస్థల సంస్థల నిర్వహకులు ఆకుల సదానందం, రమేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
పొగమంచుతో జాగ్రత్త
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఉదయం వేళల్లో పొగమంచు పడు తుందని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్పీ శబరీష్ శుక్రవారం తెలిపారు. పొగమంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా ప్రయాణించడంతో పాటు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి వాహనం నడపాలని, హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాల మధ్య తగిన దూరం పాటించాలని, అనవసరంగా ఓవర్టేక్ చేయవద్దని, మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గంగారం : మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంగారం ఫారెస్టు అధికారులు మంగీలాల్, కర్ణనాయక్, సతీష్ సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి, కామారం, దుబ్బగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. వ్యవసాయ పనులు చేసుకునే వారు, పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు అటవీ ప్రాంతానికి వెళ్లొదని హెచ్చరించారు. గ్రామాల్లో ఏమైనా ఆనవాళ్లకు సంబంధించి గుర్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఏఓ సరిత
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో డీఏఓగా సరిత శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఎం.విజయనిర్మల పదోన్నతిపై వరంగల్ ఆత్మ జాయింట్ డైరెక్టర్గా విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఆమె నూతన డీఏఓకు బాధ్యతలు అప్పగించారు. అధికారి సరిత మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. పంటల సాగు ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులకు యూరియా అందజేస్తామని చెప్పారు. సకాలంలో యూరియా పంపిణీ చేయాలి మహబూబాబాద్ రూరల్: రైతులకు యూరియా పంపిణీలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మ మరిపెడ డివిజన్ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి బి.సరితను కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ యంత్ర పరికరాలను త్వరితగతిన అందించాలని, యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, సీపీఐ నాయకులు పోలెపాక వెంకన్న, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, టెక్నికల్ ఏఓ జావీద్, సీరోలు ఏఓ ఛాయారాజ్ పాల్గొన్నారు, దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: గిరిజన, సాంఘిన సంక్షేమ, ఎంజేపీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి పూర్తిస్థాయిలో, 6నుంచి 9వ తరగతుల్లో ఖాళీసీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. నాగేంద్రమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మీసేవ కేంద్రాల్లో మాత్రమే రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ఉయదం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 83338 00221, 040–23391598 నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులుమహబూబాబాద్ రూరల్: ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా నుంచి 20మంది కవులు, రచయితలు శుక్రవారం గుంటూరుకు తరలివెళ్లారు. ఈ నెల 3,4,5 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ తెలి పారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గజల్ శ్రీని వాస్ నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆరు వేదికల్లో అనే క సాహిత్య, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, పుస్తక, కార్టూన్లు, ఆధ్యాత్మిక ప్రదర్శనలతో పాటు రాజకీ య, సినీ ప్రముఖులు పాల్గొంటుండగా దేశ, విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జి ల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ సమన్వయంలో కోటగిరి వెంకట నర్సయ్య, కస్తూరి పులేందర్, నాళ్లం శ్రీనివాస్, బొమ్మిడి వినోద్ రెడ్డి, బొడ్డుపల్లి వీరస్వామి, రేణిగుంట్ల లక్ష్మీకాంతారావు, బా ణాల వీరయ్య, తొట్ల వెంకటలక్ష్మి, రేణిగుంట్ల శ్రీదేవి, ఉషారాణి, కొంగ మమతాదేవి వెళ్లారు. ‘పింగిళి’లో కథా సర్టిఫికెట్ కోర్సు షురూ విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవి తాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభా గాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్కుమార్ ఉన్నారు. -
పెరుగుతున్న మంత్రుల ఆస్తులు
● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హన్మకొండ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ హంటర్రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దోచుకోవడం..దాచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టులని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్లో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో సలహాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు ఆర్.పి.జయంత్లాల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, సండ్ర మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, కురిమిండ్ల సదానందం, అరణ్య రెడ్డి, మల్లికార్జున్, అభిషేక్ పాల్గొన్నారు. -
ఐటీశాఖ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నా..
● జిల్లా అధికారులకు బెదిరింపు ఫోన్లు ● నిందితుడిపై కేసు నమోదు.. కోర్టులో హాజరుపర్చిన పోలీసులు భూపాలపల్లి అర్బన్ : ‘తెలంగాణ సెక్రటేరియట్కు చెందిన ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నా’ అంటూ వివిధ జిల్లాల అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాలడుతున్న వ్యక్తిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. హైదరాబాద్కు చెందిన రాజేంద్రప్రసాద్ తాను రాష్ట్ర సచివాలయంలో జేసీని అని ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి వారి వివరాలు అడగడం, ఆదేశాలు ఇవ్వడం, సరిగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, డీపీఆర్ఓ శ్రీనివాస్ ఇటీవల ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి రాజేంద్రప్రసాద్ను గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. కిలోన్నర గంజాయి స్వాధీనం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై వి.దీపిక శుక్రవారం తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో వాహనాల తనిఖీ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ముత్యాలమ్మగూడెం శివారులో ఓ యువకుడు బైక్పై వెళ్తుండగా అతడిని ఆపి పరిశీలించామని చెప్పారు. కాగా అతడి వద్ద కిలోన్నర ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గంజాయి విలువ రూ.75 వేలు ఉంటుందని, గంజాయి తరలిస్తున్న వ్యక్తి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన షేక్ జానీగా గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే బైక్, సెల్ఫోన్ను సీజ్ చేశామని, అతడిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుట్కా పట్టివేత వరంగల్ క్రైం : నగరంలోని టైలర్ స్ట్రీట్లో గల బాలాజీ కిరాణా షాపు గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వాహకుడు పవన్ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై సతీష్, క్రైం పార్టీ రావుఫ్, అశోక్ పాల్గొన్నారు. రేపు ‘బ్రహ్మం గారి పద్యశతకం’ పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మయ్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకము’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని వేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. -
భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారాన్ని సందర్శించిన ఆయన మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారులతో జాతరలో ట్రాఫిక్, భక్తుల భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం సాఫీగా జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్లలో, సెక్టార్లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు అవసరమైనంతమంది సిబ్బందిని జాతర విధులకు నియమించుకోవాలని చెప్పారు. జాతరలో భక్తుల భద్రత ఏర్పాటు విషయంపై బందోబస్తుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాన్నారు. సమావేశంలో రామగుండం, వరంగల్, కరీంనగర్ సీపీలు అంబర్ కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్, గౌస్ ఆలం, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేష్ గీతే బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, నార్లాపూర్, తాడ్వాయి ఎస్సైలు కమలాకర్, జగదీశ్ పాల్గొన్నారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి సమష్టిగా జాతరను జయప్రదం చేయాలి మేడారంలో బందోబస్తుపై సమీక్ష -
ఒకే శాఖ.. ఒకే వేతనం అమలు చేయాలి
కాజీపేట అర్బన్ : అర్చకులకు ఒకే శాఖ..ఒకే వేతన విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక, ఉద్యోగుల సదస్సును పాతర్లపాడు నరేష్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథిగా జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ హాజరై మాట్లాడారు. జీఓ 577 ప్రకారం 686 దేవాలయాల్లోని 2,223 మంది అర్చకులకు దేవాదాయ శాఖ అధికారులు అన్యాయంగా విస్మరించారని జేఏసీ రాష్ట చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. జీఓ 121ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అర్చకులకు కనీస వేతం రూ.1,500లు కూడా అందడం లేదని అందులో నుంచి 12శాతం ఈఏఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు మాత్రం ట్రెజరీ వేతనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు పొందుతున్నారని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గ ట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారచారి, బ్రాహ్మణసేవా సంఘం కన్వీనర్ వల్లూరి పవన్కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి ఆనంద్శర్మ, టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు. అర్చక జేఏసీ నాయకులు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
పుట్టిన రోజే మృత్యుఒడికి.. లింగాలఘణపురం: పుట్టిన రోజే ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో కొత్త సంవత్సరం రోజు కుటుంబంతోపాటు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని గుమ్మడవెల్లి కాలనీకి చెందిన దడిగ రమణకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రవికుమార్(20) ఉన్నాడు. ప్రస్తుతం రవికుమార్ జనగామలో ఓ షాపులో పని చేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. కాగా, నవాబుపేటకు చెందిన ఓ యువకుడు గ్రామంలో తనతో కొందరు గొడవ పడుతున్నారని, మీ స్నేహితులను తీసుకుని రావాలని జీడికల్కు చెందిన మిత్రుడు నరేశ్కు ఫోన్ చేశాడు. దీంతో అతను జీడికల్ నుంచి తన ట్రాలీలో కొంత మంది స్నేహితులను తీసుకుని గుమ్మడవెల్లి కాలనీకి వచ్చాడు. ఇక్కడ రవికుమార్తో పాటు మరికొందరిని తీసుకుని నవాబుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత గుమ్మడవెల్లి బస్టాండ్ వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రవికుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్కుమార్ వివరించారు. కాగా, చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన కుమారుడు ప్రస్తుతం కుటుంబానికి ఆసరా అవుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తూ బాలుడు.. రఘునాథపల్లి: న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో చోటుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన పరికిబండ రమ్య కుమారులు రంజిత్కుమార్, రాజ్కుమార్ (14) బుధవారం రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కొనుగోలు చేసేందుకు కాలినడకన నిడిగొండ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రఘునాథపల్లికి వెళ్లేందుకు వాహనాలను లిఫ్ట్ అడుగుతుండగా ఓ ద్విచక్రవాహనం వేగంగా వచ్చి రాజ్కుమార్ను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. న్యూఇయర్ వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో యువకుడు.. బచ్చన్నపేట : బైక్.. చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సాల్వాపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్ల వెంకటేష్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు పాలు పితకడానికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ చెట్టును ఢీకొని గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు.న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. -
మరిన్ని విజయాలు సాధించాలి
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో టీజీ ఎన్పీడీసీఎల్ 2026లో మరిన్ని విజయాలు సాధించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని కంపెనీ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, సంఘాలు, అసోసియేషన్లు నాయకులు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వరదల సమయంలో సిబ్బంది తెగింపు అనిర్వచనీయమన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, కె.మాధవరావు, ఎన్. శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
నిరంతర విద్యుత్కు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ దోహదం
భవిష్యత్లో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. ఒక సబ్ స్టేషన్లో ఏదైనా లోపం తలెత్తినా, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా మెయింటెనెన్స్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేస్తాం. తద్వారా వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. కర్నాటి వరుణ్ రెడ్డి , సీఎండీ , టీజీ ఎన్పీడీసీఎల్ -
క్యాథ్లాబ్లో సాంకేతిక లోపం
ఎంజీఎం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, న్యూరోఫిజీషియన్ విభాగాలు ఉన్న ఈ ఆస్పత్రిలో కనీసం రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక లోపంతో క్యాథ్లాబ్ సేవలు కూడా రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కార్డియాక్ ఓపీ ఉండే రోజులు కాకుండా.. మిగతా రోజుల్లో అవసరమున్న హృద్రోగులకు క్యాథ్లాబ్లో అంజియోగ్రామ్, స్టంట్ చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందిని గురువారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో నిమ్స్కు తరలించారు. రూ.45 లక్షల మరమ్మతు నిధుల పెండింగ్.. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథ్లాబ్ పరికరాన్ని మరమ్మతులు చేయించేందుకు ఏఏంసీ (సంవత్సర కాలం నిర్వహణ)ని ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు క్యాథ్లాబ్ సర్వీస్ చేసే సదరు కంపెనీకి 6 నెలలకోమారు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలుగా కంపెనీకి రూ.45 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరికరాన్ని మరమ్మతు చేయకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాథ్లాబ్ పరికరాన్ని త్వరగా మరమ్మతు చేయాలని రోగులు కోరుతున్నారు. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో నిలిచిన అంజియోగ్రామ్ పరీక్షలు ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన రోగులను నిమ్స్కు తరలింపు 18 నెలలుగా ఏఎంసీ నిధులు చెల్లించని ప్రభుత్వం -
ఇక.. ఇక్కట్లకు చెక్
హన్మకొండ : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల అనుసంధానం చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంటర్ లింకింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థ బలోపేతం కానుంది. ఇందులో భాగంగా ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్ మధ్య విద్యుత్ లైన్లు అనుసంధానం చేస్తున్నారు. అదే విధంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్ల మధ్య అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రధాన లైన్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు.. టీజీ ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 164 పనులు పూర్తయ్యాయి. మిగతా 105 పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 57 ఇంటర్ లింకింగ్ పనుల లక్ష్యం విధించుకోగా ఇప్పటి వరకు 27 పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు జరుగుతున్నాయి. హనుమకొండ సర్కిల్లో మొత్తం 6 ఇంటర్ లింకింగ్ పనులకు ఒకటి మాత్రమే పూర్తి కాగా 5 పురోగతిలో ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో మొత్తం 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 9 పూర్తికాగా 6 పనులు కొనసాగుతున్నాయి. జనగామలో 13 ఇంటర్ లింకింగ్ పనులకు 10 పూర్తయ్యాయి. మూడు పనులు సాగుతున్నాయి. భూపాలపల్లి సర్కిల్లో 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 3 పూర్తి కాగా మరో 12 పనులు పురోగతిలో ఉన్నాయి. మహబూబాబాద్ సర్కిల్లో 8 ఇంటర్ లింకింగ్ పనులకు 4 పూర్తికాగా, మరో 4 పనులు పురోగతిలో ఉన్నాయి.ఇంటర్ లింకింగ్తో విద్యుత్ అంతరాయాలకు బ్రేక్.. ప్రకృతి వైపరీత్యాలు, నిర్వహణ సమయంలోనూ నిరంతర సరఫరా ఒక సబ్ స్టేషన్లో సరఫరా నిలిచిపోతే మరో సబ్స్టేషన్ నుంచి విద్యుత్.. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో వేగంగా కొనసాగుతున్న పనులు -
అడవికి కొత్త అందాలు..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా అడవికి సరికొత్త అందాలు తీర్చిదిద్దారు. తాడ్వాయి – ఏటూరునాగారం అటవీ మార్గంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ ఆర్చ్తోపాటు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి కర్రలతో అలంకరించారు. అదే విధంగా తాడ్వాయి – పస్రా మార్గంలో దుర్గం గుట్టను పర్యాటకులు సందర్శించి ఆహ్లాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, గుట్టపై నుంచి అడవులను తిలకించేందుకు మంచెలు నిర్మించారు. వీటితోపాటు తాడ్వాయి హట్స్లో అచ్చం అడవి జంతువుల మాదిరి బొమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులు ఈ అటవీ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. మేడారం జంక్షన్లకు నూతన కళ.. ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో పలు జంక్షన్లను బొమ్మలు, శిల్పాలతో అలంకరిస్తున్నారు. ఊర ట్టం స్తూపం వద్ద, హరిత హోటల్ క్రాస్, ఐలాండ్ ప్రదేశం, బస్టాండ్ ప్రదేశాల్లో జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఇవి భక్తులకు ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక శిల్పాలు, జంతువుల బొమ్మలతో పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే బొ మ్మలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా జంక్షన్లు నిర్మిస్తున్నా రు. ఆదివాసీ సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా బొమ్మల రూపకల్పనతోపా టు లైటింగ్, మొక్కలతో జంక్షన్లు తీర్చిదిద్దితున్నారు. కాగా,జంక్షన్ల అలంకరణతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ జంతువుల బొమ్మల ఏర్పాటు -
పులి పయనం ఎటు వైపు?
కొత్తగూడ: పులి అడుగులు రోజు ఓ చోట కనిస్తుండడంతో ఆ జంతువు పయనం ఎటు వైపునకు సాగిందని అధికారులు అంచనాకు రాలేక పోతున్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి బీట్ పరిధిలోని రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా పులి పయనాన్ని అంచనా వేయడం కోసం ఎఫ్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రేంజ్ అధికారులు అడవుల్లో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో పూనుగొండ్ల సెక్షన్ పరిధిలో కర్నె గండి అటవీ ప్రాంతంలో గురువారం పాదముద్రలు గుర్తించారు. దీంతో కర్నెగండి నుంచి రేణ్యతండా వైపుకు వెళ్లిందా..? లేక రేణ్యతండా నుంచి కర్నెగండి వైపునకు వచ్చిందా? అనే అంశం నిర్ధారించలేకపోతున్నారు. ఆరు నెలలుగా ఇక్కడే ఉందా? ఆరు నెలలుగా ఓటాయి, పూనుగొండ్ల సెక్షన్ పరిధి అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఈ అడవిలో సంబంధిత అధికారులు జూపార్కుల్లో ఉన్న వన్య ప్రాణులను వదిలారు. ఈ వన్య ప్రాణులను వేటాడడం పులికి సులభమవుతుందని, సరిపోను ఆహారం లభించడంతో ఇక్కడే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.ఆందోళన వద్దు.. జాగ్రత్తగా ఉండాలి అటవీ గ్రామాల ప్రజలు పులి సంచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి. అడవిలోకి సాదు జంతువులను మేతకు తీసుకెళ్లొద్దు. అలాగే, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దు. పులి సంచారం గమనించినా.. జంతువులను వేటాడినట్లు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలి. –చంద్రశేఖర్, ఎఫ్డీఓ అంతుచిక్కని టైగర్ సంచారం.. అడవులను జల్లెడ పడుతున్న అధికారులు పూనుగొండ్ల బీట్ పరిధిలో పులి అడుగులు గుర్తింపు


