breaking news
Mahabubabad District Latest News
-
విద్యార్థుల ఆందోళన
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఉన్న ఏకలవ్య గురుకుల బాలుర పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు స్కూల్ గేట్ ముందు బైఠాయించి బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్య మ నాయకుల సంఘం జిల్లా నాయకుడు మా లోతు శాంతికుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో పౌష్టికాహారం పెట్టడం లేదని, ఉపాధ్యాయులు, అటెండర్ విద్యార్థులను బూ తులు తిడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేవని, పాఠశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్సీఓ రత్నకుమారి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి ఉద్యమ సంఘం నాయకులు శ్రీకాంత్, సాయిరాం, బన్ని, సంతోష్, రామ్కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలకు 3,317మంది విద్యార్థులకు 3,237 మంది హాజరై 80 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,042 మందికిగాను 955 మంది హాజరై, 87మంది గైర్హాజరయ్యారు. వారికి నోఎంట్రీ.. మానుకోట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి (ఎంపీహెచ్) ఉదయం 09: 10గంటలకు రావడంతో.. ఆలస్యమైందని అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వ బాలికల కళాశాల పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చి వెనుదిరగాల్సి వచ్చింది. అధికారుల తనిఖీ.. మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. మానుకోట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురు, బాలికల కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఐఈఓ మదార్గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పరీక్ష రాసిన తీరును, వారి ప్రశ్న, జవాబు పత్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరీక్షల నియంత్రణ అధికారులు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తనిఖీ చేశారు. బయ్యారం, గార్ల, డోర్నకల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి లోపాలు రావొద్దని సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లకు సూచించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించొద్దని సూచించారు. విద్యార్థులకు అన్నిసౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. వైద్యశిబిరాలు.. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి అస్వస్థతకు గురైనా వెంటనే స్పందించేందుకు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు సిద్ధంగా ఉంచారు. జిల్లా వైద్యశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. సెంటర్లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, డీఐఈఓ 4,359 మంది విద్యార్థులకు 4,192 మంది హాజరు 167మంది గైర్హాజర్ -
నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అకడమిక్ కోఆర్డినేటర్లతో గురువారం యూనివర్సిటీలోని హ్యూమనిటీస్ బిల్డింగ్లోని సెమినార్హాల్లో సమావేశం నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. అకడిమిక్ రీఫామ్స్, స్కిల్డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయిబులిటీ, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఐ అండ్ ఐపీఆర్, ఇండస్ట్రీలింకేజ్ అండ్ ఎంట్రీప్రెన్యూర్షిప్ తదితర అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొంటారని, ప్రిన్సిపాళ్లు, అకడమిక్ కోఆర్డి నేటర్లు విధిగా హాజరుకావాలన్నారు. మిర్చి షెడ్లలోనే నిల్వ చేయాలి ●46 షెడ్లలో 80 వేల బస్తాలకు అవకాశం ● 10వేల బస్తాలకు సరిపడా టార్పాలిన్లు ● డీఎంఓ సురేఖ వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు విక్రయించేందుకు తీసుకొచ్చే మిర్చి అకాల వర్షాలకు తడవకుండా యార్డుల్లోని షెడ్డుల్లోనే నిల్వ చేయాలని జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏనుమాముల మార్కెట్ యార్డుల్లోని 46 షెడ్లలో సుమారు 50–80వేల బస్తాల వరకు నిల్వ చేసేందుకు అవకాశం ఉందన్నారు. అదే విధంగా సుమారు 10వేల బస్తాల వరకు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ సరుకులు విక్రయించుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే రాత్రి వేళలో సూపర్వైజర్ జి.గంగాధర్ 99083 41270, ఉదయం వేళలో సూపర్వైజర్ టి.సాగర్ 93939 93590 నంబర్లలో రైతులు సంప్రదించాలని సురేఖ పేర్కొన్నారు. శక్తి డెయిరీలో పేలుడు ● ఇద్దరికి తీవ్రగాయాలు రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారులోని శక్తి డెయిరీలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. డెయిరీలోని కూలింగ్ చాంబర్ నుంచి బాదం మిల్క్ బాటిళ్లు చల్లారక ముందే డోర్ తీస్తున్న క్రమంలో కంప్రెషర్ పేలింది. ఈ ఘటనలో గోవర్ధనగిరికి చెందిన బాల్నె వివేక్, జమ్మికుంటకు చెందిన ఆపరేటర్ రాంగోపాల్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సీసపు గాజు ముక్కలు ఇరువురి శరీరంలోకి గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్, హైదరాబాద్ తరలించారు. కూలింగ్ చాంబర్లోని కంప్రెషర్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. హన్మకొండ: మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి డయల్ యువర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్కు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, సమస్యలు తెలపాలని ఆమె కోరారు. శక్తి డెయిరీ -
పరీక్షల వేళ.. ప్రవేశాల టార్గెట్
న్యూశాయంపేట : సాధారణంగా విద్యాసంవత్సరం ఆఖరు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు విద్యారంగానికి అత్యంత కీలకం. ఒక వైపు పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు జరుగుతుంటాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తుంటాయి. అయితే ఈ రెండింటికి మధ్య సమన్వయం లోపించడంతో క్షేత్రస్థాయి యంత్రాంగం(ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉపాధ్యాయులు, సిబ్బంది) తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు (టెమ్రిస్)లో వింత పరిస్థితి నెలకొంది. సాధారణంగా మే, జూన్ నెలల నుంచి చేపట్టే అడ్మిషన్ల డ్రైవ్ ఇప్పటి నుంచే నిర్వహించాలని.. రోజూ ఎన్ని అడ్మిషన్లు అయ్యాయో నివేదిక పంపాలని ఆదేశించడం గందరగోళానికి దారి తీస్తోంది. అడ్మిషన్ల టార్గెట్లతో.. ఉన్నతస్థాయి అధికారులు కేవలం అంకెలు మాత్రమే చూస్తున్నారు.. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా అడ్మిషన్ల టార్గెట్లు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ హోరులో ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో అడ్మిషన్లు తీసుకురావడం ఉద్యోగులకు సవాల్గా మారింది. నిర్ణీత సమయంలోగా అడ్మిషన్లు పెరగక పోతే మెమోలు జారీ చేస్తామని, ఇంక్రిమెంట్లు ఆపుతామని హెచ్చరించడంతో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం ప్రచారం చేయాల్సి వస్తోంది. ఫలితంగా బోధన నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబాలకు సమయం కేటాయించకపోవడంతో వ్యక్తిగత సమస్యలు తలెత్తున్నాయని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పరీక్షల స మయంలో అడ్మిషన్ల ఒత్తిడి తగ్గించి పది, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాల కోసం పని చేసే వాతావరణం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అడ్మిషన్ల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలి ప్రభుత్వ ఒత్తిడిని ఉన్నతాధికారులు కేత్రస్థాయికి మళ్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఫలితాలు కావాలంటున్నారు. దీంతో ప్రవేశాల కోసం ఇంటింటికీ తిరిగి బతిమిలాడే పరిస్థితి వచ్చిందని క్షేత్రస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. పరీక్షల వేళ ఈ ఒత్తిడి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు ముగిసే వరకు అడ్మిషన్ల కోసం సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. టార్గెట్ల పేరుతో ఉద్యోగులు, సిబ్బందిని భయభ్రాతులకు గురిచేసే మెమోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యావ్యవస్థలో మార్పు రావాలంటే అడ్మిషన్ల ప్రక్రియను పరీక్షలు పూర్తయ్యాక పకడ్బందీగా చేపట్టాలని పేర్కొంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి తప్ప పరీక్షల విధులకు ఆటంకం కలిగించొద్దని కోరుతున్నాయి.ఇప్పటి నుంచే అడ్మిషన్ల డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల్లో వింత పరిస్థితి ఫలితంగా ఒత్తిడిలో క్షేత్రస్థాయి యంత్రాంగం ప్రెజర్ తగ్గించాలని కోరుతున్న ఉద్యోగులు -
వేసవిలో తోటలకు జాగ్రత్తలు తీసుకోవాలి
● మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న మహబూబాబాద్ రూరల్ : వేసవి కాలంలో పండ్లు , కూరగాయల తోటలకు నష్టం వాటిళ్లకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈమేరకు బుధవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పంటలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, సీతాఫల్, పనస, నేరేడు, అవకాడో పండ్ల తోటల్లో మల్చింగ్, బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వాలన్నారు. లేత తోటల చుట్టూ జీలుగ, జనుము, అవిసె విత్తుకోవడం, కాయలకు ఫ్రూట్ బ్యాగింగ్ చేయడం, అంతర పంటల సాగు, వర్మి కంపోస్ట్ వాడకం, లేత చెట్లను విడివిడిగా షేడ్ నెట్తో కప్పాలన్నారు. అలాగే, డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, కూరగాయలు, పుచ్చ, మల్బరీ తోటల్లో ఈ విధానాలే పాటించాలన్నారు. -
ప్రపంచ వ్యవస్థ వ్యాపార రంగంతో అనుసంధానం
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : ప్రపంచ వ్యవస్థ మొత్తం వ్యాపార రంగంతో అనుసంధానమైందని, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు.బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాలలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెండురోజులు నిర్వహించే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ‘కాంటెంపరరీ ఇష్యూస్ ఇన్ గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రపంచీకరణ వేగంగా విస్తరిస్తున్న 21వ శతాబ్దంలో గ్లోబల్ వ్యాపార నిర్వహణ విధానాలు గణనీయ మార్పులకు లోనవుతున్నాయన్నారు. గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్లో అనేక సమకాలీన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అనంతరం హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కామర్స్ విభాగం ప్రొఫెసర్ ఆనంద్ పవార్ మాట్లాడుతూ మార్కెట్ విస్తరణలో కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలు సంస్థల విజయానికి దారితీస్తాయని వివరించారు. ఈ సదస్సుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అధ్యక్షతవహించారు. ఈ సదస్సు డైరెక్టర్ ప్రసాద్, కామర్స్ విభాగం డీన్ కె. రాజేందర్, కామర్స్అండ్బిజినెస్మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చీఫ్ ఇంజనీర్ అక్రమాలు?
హన్మకొండ: ఓ చీఫ్ ఇంజనీర్ అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం టీజీ ఎన్పీడీసీఎల్లో కలకలం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించింది. ఆ తర్వాత సీనియర్ చీఫ్ జనరల్ మేనేజర్లు (చీఫ్ ఇంజనీర్లు)ను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించింది. ఈ క్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఉన్నత స్థాయి హోదాలో ఉండి అక్రమాలు, అవకతవకలకు పాల్పడడం విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో దుమారం లేపుతోంది. ఈ అధికారి పూర్వ చరిత్ర కూడా అక్రమాలు, అవకతవకలతో కూడుకుందని ప్రచారం జరుగుతోంది. రూ.22 వేలు ఫైనల్? ఇన్చార్జ్ డైరెక్టర్గా ‘సదర్’ అధికారి కొనసాగుతున్న కాలంలో 2024, సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి సొమ్ము కాజేశారని ఆరోపణలున్నాయి. రూ.1.30 లక్షలకు బిల్లులు కంపెనీకి సమర్పించగా స్క్రూట్నీ అనంతరం రూ.22 వేలు ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు ఇదే సమయంలో మరో ఆస్పత్రిలో కంటి చికిత్స చేసుకున్నట్లు మెడికల్ బిల్లు సమర్పించినట్లు తెలిసింది. అయితే కంటి ఆస్పత్రి బిల్లుపై పెద్దగా సందేహాలు వ్యక్తం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని ఓ ఆస్పత్రిలో ఈ అధికారి కుమారుడు వైద్యుడిగా పని చేయడంతో అక్కడే చికిత్స పొందినట్లు సులువుగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రూ.వేల కోసం కక్కుర్తి.. వచ్చే నెల ఉద్యోగ విరమణ చేయనున్న ఈ చీఫ్ ఇంజనీర్ నెలకు రూ.6 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్నట్లు తెలిసింది. రూ. లక్షల్లో జీతం తీసుకుంటు న్న ఈ అధికారి రూ.వేల కోసం కక్కుర్తికి పాల్పడడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అధికారి ఆస్పపత్రిలో చేరి చికిత్స పొందినట్లు నకిలీ బిల్లులు పొందిన సమయంలో విధుల్లో ఉండి అద్దె వాహనం వాడుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిసింది. ఇన్చార్జ్ డైరెక్టర్గా ఉన్న వారు సెలవులో ఉంటే కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో అధికారికంగా సెలవుల్లో వెళ్లారా లేదా అనే అంశంపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం అధికారులు పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నారు. మరో వైపు ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం కూడా విచారణ సాగిస్తోంది. ఈ అధికారి గత చరిత్ర కూడా ఘనంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ ఆర్డర్ పూర్తి చేయకుండానే బిల్లులు కాజేత.. సత్తుపల్లి అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా, కామారెడ్డి డీఈగా పని చేసిన కాలంలో వర్క్ ఆర్డర్ పూర్తి చేయకుండా బిల్లులు కాజేశారనే ఆరోపణలున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలతో పాటు ప్రస్తుతం వచ్చిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికై నా ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ను వివరణ కోరగా జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు చెప్పారు. నకిలీ మెడికల్ బిల్లులతో రీయింబర్స్మెంట్ 2024 సెప్టెంబర్లో ఆస్పత్రిలో చేరకుండానే రూ.1.30 లక్షలకు బిల్లులు రూ.22 వేలు చెల్లింపులు..? టీజీ ఎన్పీడీసీఎల్లో కలకలం -
‘ఈ–నామ్’లో సాంకేతిక సమస్య..
కేసముద్రం/మహబూబాబాద్ రూరల్ : ఈ–నామ్ విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల రైతులు పడిగాపులు పడిన ఘటన జిల్లాలోని కేసముద్రం, మానుకోట మార్కెట్ యార్డుల్లో బుధవారం జరిగింది. రెండు మార్కెట్లకు రైతులు తమ ధాన్యం, కందులు, పత్తి, మిర్చి తదితర వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేందుకు తీసుకువచ్చారు. అయితే ఎప్పటిలాగే ఈ–నామ్ విధానంలో లాట్ ఐడీలు ఇవ్వాల్సి ఉండగా.. కొత్తగా 2.0 వెర్షన్ సాఫ్ట్వేర్ అమలు చేయాలని ఆదేశాలు రావడంతో రైతుల సెల్ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్, చిరునామా వంటి వివరాలు నమోదు చేస్తుండగా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో లాట్ ఐడీలు జారీ కాలేదు. రైతులంతా గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది. కేసముద్రంలో.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు 200మంది రైతులు తమ పంట ఉత్పత్తులు తీసుకొచ్చారు. ఈ–నామ్ విధానంలో సమస్యతో సాయంత్రం 4గంటలకు మార్కెట్ అధికారులు, వ్యాపారులతో వేలం పాటలు నిర్వహించి, మాన్యువల్గా ధరలు నమోదు చేశారు. రాత్రి వరకు కాంటాలు నిర్వహించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. మానుకోటలో.. మానుకోట వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో సాయంత్రం 5గంటల వరకు 339మంది రైతులకు లాట్ ఐడీలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మిర్చి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు వ్యాపారులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి గురువారం మిర్చి కొనుగోళ్లు జరపాలని కోరారు. నేడు మార్కెట్ బంద్.. ఈ–నామ్ సమస్య కారణంగా గురువారం వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. బుధవారం క్రయవిక్రయాలు పూర్తికాకపోవడం వల్ల మార్కెట్ బంద్ ప్రకటించామని, రైతులు మళ్లీ ప్రకటించే వరకు సరుకులను మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని కోరారు. 2.0వెర్షన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా రైతుల పడిగాపులు మానుకోట మార్కెట్లో నిలిచిన మిర్చి కొనుగోళ్లు -
‘అక్షర’ బాధితులకు న్యాయం చేయండి
జనగామ/వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల డిపాజిట్లను అనధికారికంగా సేకరించి, మోసానికి పాల్పడిన అక్షర చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జనగామ జిల్లాకు చెందిన బాధితులు వజ్రాల అరుణ, కొండారెడ్డి, అరుణ, తులసి, మధుసూదన్ తదితరులు బుధవారం డీజీపీ శివధర్రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్షర గ్రూప్ సంస్థలు తెలంగాణలో 60కి పైగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి చిట్ఫండ్ పేరుతోపాటు భూమిలో అవిభక్త వాటా కొనుగోలు అడ్వాన్స్ పేరుతో కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశాయి. ఆ సంస్థలు అన్ని విధాలా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో తమను మోసం చేశాయని, పరారీలో ఉన్న నిందితుల వెంటనే అరెస్ట్ చేసి వందలాది మంది బాధితులకు న్యాయం చేయాలన్నారు. బ్రాంచ్, రీజనల్ మేనేజర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయండి డీజీపీకి జనగామ జిల్లా బాధితుల ఫిర్యాదు -
సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
తొర్రూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఆరోగ్య ఉప కేంద్రాలను బుధవారం డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాల అమలు తీరుపై చర్చించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్లో సీ–సెక్షన్ ప్రసవాలను కట్టడి చేయాలని, సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. జ్వర పీడితులకు తక్షణ వైద్య సాయం అందించాలన్నారు. బీపీ, షుగర్, రక్తహీనతతో బాధపడేవారిని పరీక్షించి మందులు అందజేయాలన్నారు. వైద్యం కోసం వచ్చే పేదలతో మర్యాదగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పించాలన్నారు. వైద్యాధికారి బి. నందనాదేవి, వైద్యులు కె.మానస, శంకర్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గాలివానకు నేలవాలిన మొక్కజొన్న
గూడూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఈదురుగాలులతో కూడి న అకాల వర్షం కురిసింది. దీంతో చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు నేలవాలాయి. అధికంగా వెంగంపేట, దస్రుతండా, సీతానగరం గ్రా మాల్లో మొక్కొజొన్న పంటలు నేలవాలాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాలి వాన బీభత్సం.. కొత్తగూడ: మండలంలో బుధవార గాలివాన బీభత్సం సృష్టించింది. ఓటాయి గ్రామంలో కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. ఆసమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన ట్రాన్స్కో సిబ్బంది కొత్త స్తంభాలు వేసి విద్యుత్ పునరుద్ధరించారు. కొత్తపల్లి, కొత్తగూడ, రౌతుగూడెం, వేలుబెల్లి, పెగడపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల్లో మక్కజొన్న పంటలు నేలవాలాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. దెబ్బతిన్న మొక్కజొన్న కేసముద్రం: గాలిదుమారంతో మొక్కజొన్న పంట నేలవాలిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి, వెంకటగిరి గ్రామాల్లో బుధవారం సాయంత్రం జరిగింది. గాలిదుమారంతో పాటు కాసేపు అకాల వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. -
గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్ గ్రంథాలయ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు వసూలు చేసిన గ్రంథాలయ పన్ను ఎప్పటికప్పడు చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. నిరుద్యోగులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యం దూరం
కొత్తగూడ ప్రాంతంలో ఎక్కువ ఏజెన్సీ గూడేలు ఉంటాయి. గర్భిణులకు పురుడు పోసేందుకు పీహెచ్సీని 24 గంటల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. ఇద్దరు డాక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు ఒక్క డాక్టరే వస్తున్నారు. సాయంత్రం తర్వాత వెళ్తారు. రాత్రి పురుడు పోయాలంటే నర్సులే దిక్కు.. ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఆగబోయిన రవి, కొత్తగూడ పేరుకే 24 గంటల వైద్య సేవలుప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం వేళ మాత్రమే వైద్యులు ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి సమయంలో ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే వైద్యులు, సిబ్బంది ఉండడం లేదు. – తాళ్ల వెంకటేశ్వర్లు, కంటాయపాలెం, తొర్రూరు రాత్రి పూట మానుకోటకు పోవాలిగతంలో కంబాలపల్లి పీహెచ్సీలో జిల్లాలోనే మెరుగైన వైద్యసేవలు అందించేవారు. కానీ, ప్రస్తుతం వైద్యం అందని పరిస్థితి నెలకొంది. రాత్రింబవళ్లు పనిచేసే ఆస్పత్రిగా స్థాయి పెంచాం అంటున్నారు.. కానీ, సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎవరూ ఉండడం లేదు. చిన్న సమస్య వచ్చినా మహబూబాబాద్ వెళ్లాల్సి వస్తోంది. – గంధసిరి సురేశ్, కంబాలపల్లి ● -
దొంగల హల్చల్..
మానుకోట బస్టాండ్లో భారీ చోరీ.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో దంపతుల వద్ద నుంచి దుండగులు రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లడానికి మరిపెడ బంగ్లాలో బస్సు ఎక్కి మహబూబాబాద్ బస్టాండ్లో దిగారు. కొంత సమయం తర్వాత నర్సంపేట వెళ్లడానికి మరో రెండు బస్సుల్లో ఎక్కగా అందులో ప్రయాణికుల రద్దీ ఉండడంతో దిగారు. కొంత సమయానికి హనుమకొండ వెళ్లే బస్సు ఎక్కిన అనంతరం శోభన్ తన జేబులో ఉన్న 2 తులాల బంగారు నెక్లెస్, 1.05 తు లాల చైన్, 4 తులాల వెండి ఆభరణాలను చూడగా కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ శోభన్, మంజుల దంపతులు బస్సు దిగి పోలీసులకు తెలుపగా టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తమ మనమరాలు మొదటి పుట్టిన రోజు వేడుకలు నర్సంపేటలో ఉండగా ఆ చిన్నారి కోసం 2 తులాల నెక్లెస్, 1.05 తులాల చైన్, 4 తులాల వెండి ఆభరణాలు తీసుకుని వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితులు రోదిస్తూ తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్టెవాడలో.. రామన్నపేట : వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని ఎస్ఎస్కే సేవా సమాజ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితురాలు దాసు విజయ కథనం ప్రకారం.. విజయ వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారం, సెల్ఫోన్, రూ.2,500 నగదు అపహరించారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగారంలో హుండీ .. పాలకుర్తి: మండలంలోని తీగారం గ్రామ దుర్గమ్మ ఆలయంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు హుండీని అపహరించారు. ఈ ఘటనలో సుమారు రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వహణను చూసుకునే ముదిరాజ్ కులస్తులు పేర్కొన్నారు. రామన్నపేట : వరంగల్ పాపయ్యపేట చమన్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి రూ. 2.10 లక్షలపైగా విలువైన ఆభరణాలు అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చమన్కు చెందిన స్వర్ణకారుడు తంగళ్లపల్లి రవీందర్రావు తన కోడలి ప్రసవం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం తిరిగి ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మొత్తం రూ.2 లక్షలకుపైగా విలువైన బంగారం, వెండి, రూ. 10 వేల నగదు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగించి గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. బుధవారం పలుచోట్ల తాళం వేసి ఉన్న ఇళ్లతోపాటు రద్దీ ప్రదేశాల్లో చోరీలకు పాల్పడ్డారు. లక్షలాది రూపాయలు విలువైన బంగారం, వెండి, నగదు అపహరించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అడిషనల్ కలెక్టర్ తనిఖీ
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నత పాఠశాలను అడిషనల్ కలెక్టర్ లెనిల్ వత్సల్ టొప్పో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పఠనం చేయించి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఫ్రీ ఫైనల్ పరీక్షల మూల్యాంకనం చేసిన పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు చేశారు. ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం బయగాని రామ్మోహన్, ఎంపీఓ సోమ్లానాయక్, ఆర్ఐ శరత్చంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీకురవి: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేయనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈఓ వి.రాజేశ్వర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్స్, తదితర సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాల కాంపౌండ్ వెలుపల క్లాక్ రూంను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం భోజనం వండడాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎండీ వాహిద్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, కురవి, సీరోలు ఎంఈఓలు వి.బాలాజీ, లచ్చిరాంనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏడీ రాజేశ్వర్ బదిలీమహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ, డీఈఓగా విధులు నిర్వహిస్తున్న వి.రాజేశ్వర్ ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఏడీగా బుధవారం బదిలీయ్యారు. అయితే, ఆయన మహబూబాబాద్ డీఈఓగా కొనసాగుతూనే.. ఖమ్మంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తారని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొర్రూరు పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్తొర్రూరు: తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆర్థిక అవతవకలు జరిగిన నేపథ్యంలో సీఈఓ మురళిని సస్పెండ్ చేస్తూ డీసీఓ వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. దాదాపు రూ.89లక్షల బకాయిలు రికవరీ చేయకపోవడం, నాబార్డు మార్గదర్శకాలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ ఖర్చులు అధిక వ్యయం చేయడం, 2021–22 నుంచి 2024 వరకు ఆడిట్ రిపోర్టుల్లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడం, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ మధ్యంతర ఆడిట్లో మాజీ డైరెక్టర్లు చేసిన ఆరోపణలు నిజమని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఈఓను బాధ్యుడిగా పేర్కొంటూ వేటు వేసినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–09–2017 నుంచి 31–08–2018 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోని ఎంపికలో పాల్గొనాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఎంపికలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. -
దాచిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని..
హసన్పర్తి: దాచిపెట్టమని ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని ఓ మరదలు.. తన బావను కత్తితో దాడి చేసి చంపింది. హసన్పర్తి మండలం సిద్ధాపురంలో హత్యకు గురైన బాల్నె మొగిలి(78) కేసులో నిందితురాలైన మరదలు ఇందిరను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మొగిలిని హత్య చేసినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. ఆమె నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాపురానికి చెందిన వంగ ఇందిరకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆమె భర్తనుంచి విడాకులు పొందింది. ఆ సమయంలో వచ్చిన రూ.60వేలను ఇందిర తన బావ బాల్నె మొగిలికి దాచిపెట్టమని ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలని అడిగితే మొగిలి రేపు ఇస్తా.. మాపు ఇస్తానని చెబుతూ విషయాన్ని దాటవేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఇందిర అక్క అయిన మొగిలి భార్య సరోజన మృతిచెందింది. నగరంలో ఉపాధి కోసం వెళ్లిన మొగిలి తిరిగి సిద్ధాపురానికి వచ్చాడు. ఈక్రమంలో డబ్బుల విషయమై ప్రస్తావన వచ్చినప్పనటికీ మొగిలి తిడుతూ బయటికి వెళ్లిపోవాలని ఇందిరను బెదిరించాడు. ఇక లాభం లేదని భావించిన ఇందిర.. బావ మొగిలిని హత్య చేయడానికి పథకం రచించింది. మంగళవారం తెల్లవారుజామున మొగిలి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి ఆవరణలోకి వెళ్లగా అప్పటికే కాపుకాసిన ఆమె ఒకేసారి అతనిపై దూకి కత్తితో దాడి చేసింది. ఘటనలో మొగిలి అక్కడక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈక్రమంలో బుధవారం వంగపహాడ్లోని ఓఆర్ఆర్ వద్ద ఇందిర ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. అనంతరం రిమాండ్కు పంపినట్లు తెలిపారు. బావను చంపిన మరదలు కాలకృత్యాలు తీర్చడానికి వెళ్లగా కత్తితో దాడి నిందితురాలు అరెస్ట్..కత్తి స్వాధీనం వివరాలు వెల్లడించిన హసన్పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు -
పేరుకే అప్గ్రేడ్ ..
పీహెచ్సీల్లో అందని 24గంటల వైద్యసేవలు సాక్షి, మహబూబాబాద్: పేదలకు సరైన ప్రభుత్వ వైద్యం అందించాలి.. ప్రసవాలకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుచేసుకునే పేదలకు ఊరట కలిగించాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచితే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారని రాష్ట్ర సర్కారు ఆలోచన చేసింది. దీనిలో భాగంగా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈమేరకు మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి 24గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని భావించింది. కానీ, జిల్లాలో అది కాగితాలకే పరిమితమైంది. కొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక.. మరికొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు డిప్యుటేషన్పై వెళ్లడంతో కనీసం నాలుగు గంటలు కూడా వైద్య సేవలు అందడం లేదని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సర్దుబాటు.. ఒక వైపు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం చెబుతుంటే.. జిల్లాలో మాత్రం ఉన్న డాక్టర్లను ఇస్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో పలు విభా గాలకు ప్రోగ్రాం ఆఫీసర్లు ఉన్నారు. అయితే వారు సక్రమంగా పనిచేయడం లేదనే సాకుతో ఏజెన్సీ, మారుమూల తండాలు ఎక్కువగా ఉన్న పీహెచ్సీల్లోని డాక్టర్లను ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో కొందరు పెద్దసారుకు అనుకూలంగా ఉండి అన్ని పనులు చక్కబెడుతున్నారని, అందుకోసమే అంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణ. కోరి తెచ్చుకున్న వారికి ప్రాధాన్యత గల ప్రోగ్రా మ్స్ అప్పగించడం, సీనియర్లను ప్రాధాన్యత లేని విభాగాలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కొందరు డాక్టర్లు పీజీ చదివేందుకు వెళ్తున్నారని తెలిసి కూడా ఆయా ప్రాంతాల్లోని డాక్టర్లు, ఎంఎల్హెచ్పీలను డిప్యుటేషన్లు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే జిల్లాలో పలు పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇక్కడ పనిచేసే వారిని ఇతర జిల్లాలకు డిప్యుటేషన్పై పంపించడంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందో.. తెలియక జరుగుతుందో మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని ఆస్పత్రులు, పోస్టులు, వారు పనిచేస్తున్న చోటు, ప్రజ లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని, అన్నింటిని సరిచేసి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. మెరుగైన వైద్యం కోసం.. జిల్లాలో 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గూడూరు, గార్లలో సీహెచ్సీలు, మహబూబా బాద్లో జిల్లా ఆస్పత్రి ఉంది. కాగా, తొర్రూరు, బయ్యారం, డోర్నకల్, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, కంబాలపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం పీహెచ్సీలను 24 గంటల ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేశారు. అయితే ఇందులో సరిపడా డాక్టర్లు పనిచేయడం లేదు. ఇక్కడ కేటాయించిన డాక్టర్లలో కొందరు డిప్యుటేషన్పై వెళ్లారు. మరికొందరు ఉన్నత చదువులకోసం వెళ్లారు. దీంతో సగం మంది డాక్టర్లే పనిచేస్తున్నారు. ఉన్నవారిలో కూడా ఎక్కువ మంది మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఉండని వైద్యులు రాత్రివేళ రోగులకు తప్పని ఇబ్బందులు పర్యవేక్షణ కొరవడి ప్రజలకుఅందని ప్రభుత్వ వైద్యం జిల్లాలో ఇష్టారాజ్యంగా డాక్టర్ల డిప్యుటేషన్లు -
అగ్రి యూనివర్సిటీ క్రీడల్లో వరంగల్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ/వరంగల్: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో వరంగల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. చెస్, డిస్కస్ త్రో, క్యారం, బాస్కెట్ బాల్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం 400 మీటర్లలో ప్రథమ, ద్వితీ య స్థానంలో పతకాలు సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్ తెలిపారు. అగ్రి యూత్ ఫెస్ట్లో భాగంగా నిర్వహించి న యూత్ పార్లమెంట్, జానపద నృత్యం, గ్రేయిన్ ఆర్ట్, లైవ్ పెయింటింగ్, కార్టూనింగ్, యంగ్ కార్టూనింగ్, యంగ్ బడ్డీస్ ప్యానెల్ డిస్కషన్, స్పెల్బీ, అగ్రి టెక్ క్విజ్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సా ధించారని వివరించారు. బహుమతులు సాధించిన విద్యార్థులను కళా శాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్, ప్రొఫెసర్ విద్యాదర్, ప్రొఫెసర్ మాలతి, శివకృష్ణ, రాంబాబు, ప్రజ్ఞ, గోపిక అభినందించారు. జాతీయస్థాయి పారా వాలీబాల్ పోటీలకు రాష్ట్ర జట్లు వరంగల్ స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న 14వ జాతీయస్థాయి పారా వాలీబాల్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు బుధవారం తెలంగాణ రాష్ట్ర పురుషుల, మహిళాజట్లు బయలుదేరి వెళ్లాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 32 మంది క్రీడాకారులతో కూడిన టీం కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి మీరట్కు బయలుదేరింది. ఇందులో 14 మంది పురుషులు, 14 మంది మహిళలు, నలుగురు అధికారులు ఉన్నారు. పురుషుల జట్టుకు కెప్టెన్గా గాడిపల్లి ప్రశాంత్, మహిళల జట్టుకు కెప్టెన్గా దయ్యాల భాగ్య, ఇరు జట్లకు ప్రధాన కోచ్గా సింగారపు బాబు వ్యవహరిస్తున్నారు. జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలనే లక్ష్యంతో పోటీల్లో పాల్గొంటున్నట్లు కోచ్ సింగారపు బాబు తెలిపారు. -
రాత్రివేళ అందని వైద్యసేవలు
డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలు అందడం లేదు. రాత్రి వేళ ఆస్పత్రిలో వైద్యులు ఉండడం లేదు. స్టాఫ్నర్సు మాత్రమే రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వారికి ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. దీంతో చాలామంది రాత్రివేళ పీహెచ్సీకి వెళ్లకుండా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. డోర్నకల్లో ప్రైవేట్ ఆస్పత్రి లేకపోవడంతో రాత్రి వేళ ఖమ్మం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – గాజుల వేణుగోపాల్, నెహ్రూ స్ట్రీట్, డోర్నకల్ రోగులకు ఇబ్బంది అవుతుందిగతంలో గంగారం ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా వైద్యం అందించేవారు. కానీ ఇప్పుడు ఒక్క డాక్టరే వస్తున్నారు. అదీ కూడా మధ్యాహ్నం తర్వాత ఉండడం లేదు. నర్సులు మాత్రమే ఉంటున్నారు. డాక్టర్లను నియమించి నిరంతరం వైద్య సేవలు అందేలా చూడాలి. – బెజ్జరి, వెంకటయ్య, గంగారం -
మొబిలైజేషన్ ఆఫీసర్లను నియమించాలి
మైనార్టీ గురుకులాల్లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్లను నియమించాలి. వారితో నిరంతర కార్యక్రమాలు నిర్వహించాలి. ముందస్తు అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం కోసం సెక్రటరీ ఆలోచన సరైనదే. కానీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలి. మైనార్టీల్లో భాషా సమస్య తెలెత్తడం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకే వారందరిని సామాన్య జనంలో కలపడానికి అదే కమ్యూనిటీ సంబంధించిన వారిని మొబిలైజర్లుగా నియమిస్తూ నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి. డాక్టర్ రాజ్మహ్మద్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత -
సేవాలాల్ మార్గం అనుసరణీయం
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ● ఘనంగా సేవాలాల్ జయంతి మహబూబాబాద్ రూరల్ : సమాజాన్ని జాగృతం చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు పయనించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు.సేవాలాల్ 287వ జయంతిని మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి అనంతాద్రి సేవాగఢ్ ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టి సేవాలాల్ సన్నిధిలో భోగ్ బండారో సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడు తూ.. మేడారం గిరిజన సమ్మక్క–సారక్క జాతర తరహాలో సేవాల్ జయంతిని కూడా నిర్వహిస్తామన్నారు. హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు సేవాలాల్ అని కొనియాడారు. హింస పాపమని, మత్తు, ధూమపానం శాపమని హితవుపలికి బంజారా జాతికేకాదు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారని కొనియాడారు. అనంతారంలో సేవాలాల్ గుడి నిర్మాణానికి కృషి చేసి, గిరిజనులకు అంకితం చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గుగులోతు జ్యోతి–రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, డీటీడీఓ దేశీరాంనాయక్, సేవాలాల్ జయంతి ఉత్సవాల ప్రత్యేక అధికారి జి.మరియన్న, డాక్టర్ బానోత్ నెహ్రూరాథోడ్, అజ్మీరా సురేష్ నాయక్, ఘనపురపు అంజయ్య, గుగులోత్ కిషన్ నాయక్, ధరావత్ వెంకన్ననాయక్, గుగులోత్ హరినాయక్, కున్సోత్ హట్యానాయక్, డాక్టర్ రాజుకుమార్ జాదవ్, ధారా వత్ భాస్కర్ నాయక్, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐల సేవాభావం గొప్పది
హన్మకొండ చౌరస్తా : మాతృభూమిపై ప్రేమతో తాను చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు సేవ చేయాలని తలచిన ఎన్ఆర్ఐల సేవాభావం గొప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఎన్ఆర్ఐల బృందంలో ఒకరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్రెడ్డిని మంగళవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ఆర్ఐల బృందం హనుమకొండలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు 20 కంప్యూటర్లు అందించిందన్నారు. చదువుకున్న బడి, కాలేజీలకు సేవచేయాలని ప్రతీ పూర్వ విద్యార్థి సంకల్పించాలని కోరారు. కేఎంసీ భవనంతోపాటు ప్రహరీ నిర్మాణం కోసం మార్చిలో సీఎం రేవంత్రెడ్డిని కలిసి రూ.5 కోట్ల నిధులు కోరనున్నట్లు తెలిపారు. ఎన్ఆర్ఐ సుజిత్రెడ్డి మాట్లాడుతూ 1960 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో స్థిరపడిన వైద్యులు దాదాపు 200 మంది ఉన్నారన్నారు. వారందరి సహకారంతోనే రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా ఎన్ఆర్ఐల బృందం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం, లైబ్రరీ ఏర్పాటు లాంటి అనేక కార్యక్రమాలు నిర్విరామంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ కేఎంసీ నూతన భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్రెడ్డి బృందం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల చైర్మన్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కేఎంసీ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు -
సగర్వంగా స్వాగతం పలుకుతాం
చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు సంతోషం కలిగించింది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లిమావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి ● వివిధ కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులు ● గతంలో వివిధ ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి ● గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ● 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చిన నేత – ఎస్ఎస్తాడ్వాయి -
పది శాతం పనులు కూడా చేయలె..
ఎంజీఎం : రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పదిశాతం కూడా పూర్తి చేయలేదని, కేసీఆర్పై కక్షతో సీఎం రేవంత్రెడ్డి.. పనులు ఆలస్యం చేస్తూ పేదల ప్రాణాలను బలిగొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. ఏ పనులు ఎంత వరకు వచ్చాయో కలియతిరిగి చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 24 అంతస్తుల స్లాబ్ పూర్తయిందని, ఇప్పుడు ఏ పనీ జరగకపోవడంతో ఆస్పత్రిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. 2024 దసరాకే ఆస్పత్రి ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. రేవంత్రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద చూపెడుతున్న శ్రద్ధలో కేసీఆర్ పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన హెల్త్ సిటీపై పదిశాతం శ్రద్ధ చూపితే ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించిందన్నారు. అదేవిధంగా రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వర్క్ వంటివి చాలా తగ్గించేశారని ఆరోపించారు. జూన్ 2వ తేదీన ఆస్పత్రి ప్రారంభిస్తామని చెబుతున్నారని, 2వేల పడకల ఆస్పత్రికి 2వేల మంది నర్సులు, 1,500 మంది వైద్యులు, వెయ్యిమంది పారామెడికల్ సిబ్బంది అవసరమనే విషయాన్ని కనీసం గుర్తించలేదన్నారు. ఆస్పత్రి సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైందా..? అంటూ మండిపడ్డారు. పేపర్లలో చేస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తామని అని పేర్కొంటున్నారని, ఇది సూపర్స్పెషాలిటీ ఆస్పత్రా..? బస్తీ దవాఖానా..? అని మండిపడ్డారు. ఓపీ చూడడానికి ఈ ఆస్పత్రి ఎందుకు..? బీఆర్ఎస్ హయాంలో వరంగల్లో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామని, కానీ ఇప్పుడు ఆస్పత్రిలో ఏసీలో నీళ్లు కారుతున్నాయనే సాంకేతిక లోపంతో థియేటర్లు మూసివేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ఎంజీఎంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అవి పనిచేయని దుస్థితిలో కొనసాగుతున్నాయంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. గతంలోని ధర్మశాల, ఎలివేషన్ వర్క్స్ తొలగించారు రేవంత్రెడ్డిది ఫ్యూచర్ సిటీ ఆలోచన.. కేసీఆర్ది హెల్త్సిటీ ఆలోచన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలనజర్నలిస్టులపై పగ పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్రావు అన్నారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇన్సూరెన్సుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు ఒక్క శాతం కాంట్రిబ్యూషన్తో, జర్నలిస్టులకు ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని గుర్తు చేశారు .కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
● సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు ● 5 నిమిషాలు సడలింపు ● టోల్ ఫ్రీ నంబర్ 1800 5999 333 ● హాజరుకానున్న 8,287మంది విద్యార్థులు మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధిస్తున్నారు. ఎ ండ తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో టెంట్లు, తాత్కాలిక షెడ్స్, చల్లని తాగునీరు, ఏఎన్ఎంలు అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తారు. కాగా, పరీక్షల నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమై నా విద్యార్థులను హాల్లోకి అనుమతి ఇస్తారు. నిషేధిత పరికరాలు ఇవే.. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, సెల్ఫోన్లు నిషేధించారు. సంబంధిత ఇన్విజిలేటర్లు, అధికారులు కూడా ఫోన్ వాడకూడదు. ఫిబ్రవరి 25నుంచి, మార్చి 16వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ పరీక్షలు కొనసాగుతాయి. మొదటి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు తెలుగు, సంస్కృతం ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలలోపే విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలి. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మదార్గౌడ్ వెల్లడించారు. హాజరుకానున్న 8,287మంది విద్యార్థులు.. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 8,287మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,156మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,113మంది, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,002 మంది, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,016 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 18 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 18మంది, ఇన్విజిలేటర్లు 200మంది పరీక్షల విధులు నిర్వర్తిస్తారు. పరిశీలనకు ప్రత్యేక అధికారులు.. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక బృందాలు, అధికారులను ఏర్పాటు చేశారు. పరీక్షల కమిటీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్పర్సన్గా, డీఐఈఓ, కళాశాలల సీనియర్ ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉండి పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు కలెక్టర్కు సమాచారం అందిస్తారు. 4 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే సెక్షన్ 50, సెక్షన్ 114 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. వెబ్సైట్లో హాల్టికెట్లు యాజమాన్యాలు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే విద్యార్థులు https://tgbieht.cgg.gov.in అనే వెబ్సైట్లో పుట్టిన తేదీ, పదో తరగతి హాల్టికెట్ నంబర్ నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోచ్చు. హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని, చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశించారు. హాల్టికెట్లో ఏవైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాళ్ల ద్వారా డీఐఈఓను సంప్రందించి తక్షణమే సవరించుకోవాలి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్ధులకు పరీక్షల భయం దూరం చేసేందుకు 1800 5999 333 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థులు 8,287 ఫస్టియర్ విద్యార్థులు 4,158 పరీక్ష కేంద్రాలు 18అధికారులు 36 ఇన్విజిలేటర్లు 2004 సిట్టింగ్ స్క్వాడ్స్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సెకండియర్ విద్యార్థులు 4,129 -
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
గార్ల: ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించేందుకు ఇక్కడి సీసీ కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసినట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మలిశెట్టి కుమార్ తెలిపారు. మంగళవారం గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష హాళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో మాస్ కాపీయింగ్ను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ఈనెల 25నుంచి మార్చి 16వతేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని, ఆతర్వాత అనుమతి లేదన్నారు. గార్ల కళాశాల సీఎస్ ప్రసాదరావు, డీఓ నవీన్కుమార్, అధ్యాపకులు వేముల రవీందర్, జోగ్యానాయక్, నాగేశ్వరరావు ఉన్నారు. -
పాలకులకు మాలలపై కక్ష తగదు
హన్మకొండ: పాలకులకు మాలలపై కక్ష తగదని జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని మాల భవన్లో జాతీయ మాలమహానాడు హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగలను వర్గీకరణ పేరుతో విడగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో నష్టపోతున్నామని మాలలు గొంతెత్తడంతో రోస్టర్ విధానాన్ని జీఓ 99 ద్వారా తీసుకువచ్చి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు మాలలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్ర అన్యాయానికి ప్రభుత్వం గురి చేసిందన్నారు. మాలల గొంతుకగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అసెంబ్లీలో మాట్లాడడం హర్షణీయమన్నారు. నాగర్కర్నూలు జిల్లాలో అగ్రవర్ణ వర్గాల కుల అహంకారానికి బలైన చిన్నారికి నివాళులర్పించారు. సమావేశంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నాయకులు నీరకి రాము, బన్ను సాంబయ్య, బొల్లం రాంకుమార్, పనికల శ్రీనివాస్, సంపతి రఘు, పాడుగుల నర్సయ్య, గొర్రె రమేష్, మల్లం రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ -
అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం
హన్మకొండ చౌరస్తా: కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి హనుమకొండ యాదవనగర్లోని 4వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్యాదవ్ ఇంటికి వెళ్లారు. యువకుడిపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న బొంగు అశోక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్ భార్య అనిత, కుమారుడు అఖిల్.. హరీశ్రావు ఎదుట బోరున విలపించారు. స్థానిక యువకులు రఘు, లక్ష్మణ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అశోక్యాదవ్ ప్రశ్నించారని, ఆ విషయం మనసులో ఉంచుకుని టార్గెట్ చేశారని వెల్లడించారు. నాన్న పై దాడి చేస్తే తాము పిటిషన్ ఇవ్వగా పోలీసులు తీసుకోలేదని అఖిల్ తెలిపారు. దీనిపై హరీశ్రావు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెడుతోందని, బాల్క సుమన్, బొంగు అశోక్ది అక్రమ అరెస్ట్ అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్కుమార్, స్థానిక నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు -
సబ్స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ: స్టేషన్ ఘన్పూర్లో చేపడుతున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డి అధ్యక్షతన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చేపడుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుతో రిజ ర్వాయర్లలోకి నీరు రావడంతో పంటల దిగుబడి పెరిగిందన్నారు. సాగరం, కొండాపూర్, కుర్చపల్లి సబ్ స్టేషన్లు మార్చి నెలాఖరు వరకు చార్జీ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వినూ త్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా ప్రమాదకరంగా ఉన్న లొకేషన్లు గుర్తించి వాటిని మార్చుతున్నామని చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ఈలు రాజు చౌహాన్, సురేందర్, ట్రాన్సో కో వరంగల్ జోన్ సి.ఈ శ్రీరామ్ కుమార్, జనగా మ, హనుమకొండ ఎస్ఈలు సంపత్ రెడ్డి, పి.మధు సూదన్ రావు, డి.ఈలు లక్ష్మీనారాయణ రెడ్డి, సార య్య, విజేందర్ రెడ్డి, మల్లికార్జున్, విజయ కుమార్, అనిల్ కుమార్, సంపత్ రావు, ఏడీఈ రణధీర్ రెడ్డి, సుధాకర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
సిద్ధాపురంలో వృద్ధుడి హత్య
● మరదలిపై అనుమానం ● పోలీసులకు ఫిర్యాదుహసన్పర్తి: ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హసన్పర్తి మండలం సిద్ధాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె మొగిలి(70)కి కుమారుడు రాజ్కుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొగిలి, రాజ్కుమార్ నగరంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. దీంతో మొగిలి మరదలు ఇందిర(ఒంటరి మహిళ) సిద్ధాపురంలోని అతడి ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భార్య సరోజన మృతి చెందడంతో మొగిలి తిరిగి స్వగ్రామం వచ్చాడు. అప్పటి నుంచి నుంచి ఇందిర అతడితో నిత్యం గొడవ పడుతోంది. ఈవిషయమై ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాజ్కుమార్ ఇంటికొచ్చాడు. ఇదిలా ఉండగా, మంగళవారం మొగిలి ఇంటి ఆవరణలో శవమై కనిపించాడు. ఈవిషయాన్ని గమనించిన బంధువులు కుమారుడు రాజ్కుమార్కు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై రవి, దేవేందర్ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానికంగా విచారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందిరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. -
మావోయిస్టుల కంచుకోట కాల్వపల్లి
పలు కారణాలతో ఉద్యమబాట పట్టిన పలువురు గ్రామస్తులుఎస్ఎస్తాడ్వాయి : కాల్వపల్లి.. మావోయిస్టుల కంచుకోట. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఓ కుగ్రామం. ఇక్కడి నుంచి పలు కారణాలతో పలువురు గ్రామస్తులు మావోయిస్టు ఉద్యమ బాట పట్టారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చివరి వ్యక్తి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో ఉద్యమ బాటలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. దామోదర్.. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో 1996లో పీపుల్స్వార్ పార్టీలో చేరి దళ సభ్యుడిగా మొదలు.. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టెది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుతోపాటు ప్రస్తుత పరిణామాల కారణంగా దామోదర్ 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వీడి పో లీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అజ్ఙాతం వీడి న దామోదర్ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారంలో ముందుడాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎన్కౌంటర్లో ఏడుగురి మృతి ఉద్యమానికి ఉపిరిగా నిలిచిన కాల్వపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఎన్కౌంటర్లో మృతి చెందారు. బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకర్, బడే మురళి, సిద్ధబోయిన సారక్క, కొప్పుల పాపారావు, రొక్కలి అశోక్, సిద్ధబోయిన అశోక్, గౌరబోయిన ఉర్మిళ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న దామోదర్ ప్రస్తుతం లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమంలో కాల్వపల్లి ప్రస్థానం ముగిసింది. కాల్వపల్లి గ్రామం గతంలో వివిధ ఎన్కౌంటర్లలో ఏడుగురి మృతి గ్రామంలో చివరి వ్యక్తి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30ఏళ్ల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి.. ఆయన లొంగుబాటుతో గ్రామంలో హర్షాతిరేకాలు -
తడిసిన మిర్చి.. నేలవాలిన మొక్కజొన్న
కురవి: అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. సోమవారం రాత్రి 11.30గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో కురవి, సీరోలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన రైతుల మిర్చి తడిసిపోగా.. మొక్కజొన్న పంట నేలవాలింది. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలను పరిశీలించి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. డోర్నకల్లో.. డోర్నకల్: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసింది. కాగా మంగళవారం రైతులు కల్లాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడవడం వల్ల మిర్చి నల్లబారి ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లికుదురులో.. నెల్లికుదురు: మండలంలోని ఆలేరు గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేల వాలింది. మంగళవారం గ్రామ రైతులు మాట్లాడుతూ.. చేతికందొచ్చిన మొక్కజొన్న పంట నేలవాలి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు. -
డెస్క్ జర్నలిస్టులందరికీ
అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలిహనుమకొండ అర్బన్: డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీయూడబ్ల్యూజే–143, జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. 252 జీఓను సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ గతంలో జారీ చేసినట్లుగానే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎడిషన్ కేంద్రంలో నాలుగు మాత్రమే కార్డులు ఇస్తామని జీఓలో పేర్కొనడంతో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, ఐజేయూ రాష్ట్ర నాయకులు గాడిపల్లి మధు, గడ్డం కేశవమూర్తి, హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కోశాధికారి బొల్ల అమర్, బాధ్యులు బొడిగె శ్రీను, అల్లం రాజేశ్వర్మ డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన మద్దతు తెలిపిన జర్నలిస్టు యూనియన్లు -
డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలకు పదోన్నతి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు పదోన్నతి లభించింది. నలుగురు డిప్యూటీ సీఈఓలు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా, ఐదుగురు ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్ పొందారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జెడ్పీ డిప్యూటీ సీఈఓ బి.రవి, జనగామ డీఆర్డీఓ ఎన్.వసంత, జనగామ జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సరిత, హనుమకొండ జిల్లా హసన్ పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్ కౌసల్యదేవికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పదోన్నతి లభించింది. అదే విధంగా హనుమకొండ జిల్లా పరకాల ఎంపీడీఓ బి.రవీందర్, వేలేరు ఎంపీడీఓ ఆర్.లక్ష్మి ప్రసన్న, జనగామ జిల్లా కొడకండ్ల ఎంపీడీఓ పి.నాగశేషాద్రి, జనగామ డీఆర్డీఏ ఏపీడీ జి.చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ డి.శ్రీనివాస రావుకు డిప్యూటీ సీఈఓగా పదోన్నతి లభించింది. బాలికల ధర్నా ఘటనపై విచారణ పాలకుర్తి టౌన్ : మండలంలోని గూడూరు బా లికల గురుకుల పాఠశాల, కళాశాలలో నాణ్య మైన భోజనం అందించడం లేదని ఈనెల 23న బాలికలు ధర్నా చేపట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డీఎస్ వెంకన్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాత, కొత్త బియ్యం తేడాతో భోజనం తయారీలో జాప్యం జరిగిందని విచారణలో తేలిందన్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగలేదన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్ తన చాంబర్లో వేడుకలు నిర్వహించిందని తెలిపారు. క్షుద్ర పూజల పేరుతో వస్తున్న అపోహలను బాలికలు నమ్మొద్దన్నారు. విచారణ నివేదికను గురుకుల సెక్రటరీతోపాటు కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపా రు. వారి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జనంబాట!
బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అడవి వదిలి సాక్షి ప్రతినిధి, వరంగల్ : సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉద్యమ ప్రస్థానం ముగిసింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) నుంచి విప్లవోద్యమం వైపు అడుగులేసి మూడు దశాబ్దాల పాటు పనిచేసిన మావోయిస్టు కీలక నేత దామోదర్ మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశారు. దళసభ్యుడినుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వరకు ఎదిగిన ఆయన.. ఆపరేషన్ కగార్, పెరిగిన నిర్బంధాల కారణంగా లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్లతోపాటు దామోదర్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. సుమారు మూడు దశాబ్దాలపాటు ప్రజల కోసం అజ్ఞాతవాసం గడిపిన ఆయన ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, కాల్వపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఆర్ఎస్యూ నేత నుంచి అడవి వైపు... ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బయ్యారం గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. రాయనిగూడెం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి, గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1996లో 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్యూ కార్యకలాపాల్లో రాటుదేలిన ఆయన 1998 డిసెంబర్లో తన బంధువు అయిన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ ప్రేరణతో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు... ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరి 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ● ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. ● 2006లో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకేడబ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు పొంది, 2007లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ● 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం)గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ● మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్, యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ● అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పేరు: బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ) ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం, గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు. దళ సభ్యుడినుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వరకు.. మూడు దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన మావోయిస్టు అగ్రనేత డీజీపీ సమక్షంలో లొంగుబాటు ఆయన రాకతో కుటుంబ సభ్యులు, బంధువుల సంబురాలుజనజీవన స్రవంతిలోకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ -
వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ అర్బన్ : వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.శివకుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా 108 ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని సన్స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వేగంగా స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. కాగా, శివకుమార్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ఉద్యోగులు ఆయనకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం మేనేజర్లు శ్రీనివాస్, భరత్, రాజ్కుమార్, రాజు నాయక్, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి దేవేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ -
అచల చిట్ఫండ్ బాధిత సభ్యులకు చెక్కుల పంపిణీ
వరంగల్ లీగల్ : అచల చిట్ ఫండ్ బాధిత సభ్యులకు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ చేతుల మీదుగా సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 79 మంది లబ్ధిదారులకు రూ.3,67,27,224ల విలువైన చెక్కులు అందజేశారు. చిట్ఫండ్ యాజమాన్యం, బాధితుల పట్ల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.సాయికుమార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ న్యాయవాది తీగల జీవన్ గౌడ్ పారదర్శకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి లబ్ధిదారులకు చిట్ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును తిరిగి చెల్లించేలా న్యాయసేవాధికార సంస్థ కృషి అభినందనీయమన్నారు. చిట్ ఫండ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యకలాపాలు చేయాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని మరోసారి నిరూపించుకుందని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సాయికుమార్, బాధితుల తరఫున న్యాయవాది వై. విశ్వేశ్వరరావు, అచల చిట్ఫండ్ తరపున సీనియర్ న్యాయవాది చొల్లేటి రామకృష్ణ, వరంగల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరావు, అచల చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ పి.సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ!
● సుమారు 30 తులాల బంగారం, రూ.రెండు లక్షల నగదు అపహరణ ● మహదేవపూర్లో ఘటన..లబోదిబోమంటున్న బాధితులు ● ఘటనాస్థలిని పరిశీలించిన డాగ్స్క్వాడ్, పోలీసులు బృందాలుకాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో సోమవారం భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు.. సుమారు 30 తులాల బంగారం, రూ.రెండులక్షల నగదు అపహరించారు. దీంతో బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దుబ్బగూడెంలో నివాసముంటున్న పోత సమ్మయ్య, వినోద దంపతులు ఇంటికి తాళం వేసి తమ మిరప చేనుకు వద్దకు వెళ్లారు. సమ్మయ్య సెల్ఫోన్ మర్చిపోయానని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉన్నాయి. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉండడం గమనించాడు. బీరువా తాళం తీసి అందులో భద్రపరిచిన సుమారు 30 తులాల బంగారం, రూ. రెండు లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గమనించాడు. వెంటనే భార్య వినోదకు సమాచారం అందించగా ఆమె ఇంటికి చేరుకుని గుండెవిసేలా రోదించింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల మద్యలో చోరీ జరిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తమ కుమారుడు ఇసుక క్వారీలో పనికి వెళ్లినట్లు చెప్పారు. తమ కుమార్తె వివాహం కోసం 20 ఏళ్లుగా బంగారం ఏటా కొంచెం కొనుగోలు చేస్తున్నామని, దొంగలు తమ బంగారం, నగదు దోచుకెళ్లారని గుండెలు బాధుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. చోరీ చేసి బీరువా తాళం వేసి.. బీరువాలోని బంగారం, నగదును అపహరించిన అనంతరం దొంగలు తాళం వేసి చెవిని తమ వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్కుమార్, సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలు, సెల్టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, బాధితుడు ఇంకా ఫిర్యాదు చేయలేదని సీఐ పేర్కొన్నారు. బంగారం భద్రపరిచిన కవర్ ఇదే..రోదిస్తున్న బాధితురాలు వినోద -
రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి..
● బైక్ను ఢీకొన్న టిప్పర్.. అన్నదమ్ములకు తీవ్ర గాయాలు ● చికిత్స పొందుతూ తమ్ముడి మృతి..నక్కలపల్లిలో ఘటన మామునూరు : అప్పటి వరకు తల్లితోపాటు కుటుంబీకులతో ఆనందంగా గడిపిన కుమారులు కొద్దిసేపటికే తీరని విషాదం మిగిల్చారు. అన్నను రైలు ఎక్కించేందుకు తమ్ముడు బైక్ తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరు కలిసి సంతోషంగా బయలుదేరారు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. మార్గమధ్యలో టిప్పర్.. బైక్ను ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తమ్ముడు మృతి చెందాడు. దీంతో చేతికొచ్చిన కుమారుడు కనిపించనిలోకాలకు తరలడంతో తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల కథనం ప్రకారం.. మామునూరు పీఎస్ పరిధి గుంటూరుపల్లికి చెందిన కొల్లం సుగుణకు ఇద్దరు కుమారులు రామకృష్ణ, వెంకటేష్(28) ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నను వరంగల్ స్టేషన్లో రైలు ఎక్కించేందుకు తమ్ముడు వెంకటేష్ తన బైక్పై ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్–నెక్కొండ ప్రధాన రహదారిపై ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి శివారులో బైక్ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పైనుంచి పడడంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షణాల్లో 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా వెంకటేష్ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 9.30 గంటలకు మృతి చెందాడు. రామకృష్ణ చికిత్స పొందుతున్నాడు. అప్పటి వరకు తల్లితో గడిపిన కుమారులు రోడ్డు ప్రమాదంలో గాయపడడం.. చిన్న కుమారుడు వెంకటేష్ మృతి చెందడంతో కుటుంబీకులు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గుంటూరుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కష్టాలు తీరాయనుకునే సమాయాన కొడుకు మృతి చెందడంతో తల్లి సుగుణ గుండెలవిసేలా రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందు హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల నియామకం, రిజర్వేషన్ రోస్టర్ అమలు తీరు పోస్టుల వారీగా వివరించారు. 2025లో సెప్టెంబర్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ వివరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాల నాయకులు, ఉద్యోగులు తమ సమస్యలు, ఇబ్బందులు కమిషన్కు వివరించారు. రాష్ట విభజన నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్కు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సుప్రీం కోర్టు తీర్పు మేరకు తిరిగి ఏపీకి వెళ్లారని, అయితే వారు ఇక్కడ పని చేసిన కాలంలో పదోన్నతి కల్పించడంతో స్థానికులకు నష్టం, అన్యాయం జరిగిందన్నారు. ఏపీ వారు ఇక్కడి వచ్చి సీనియర్లు కావడంతో అప్పటి వరకు ఉన్నత పదవుల్లో ఉన్న వారిని రివర్షన్ చేసి పదోన్నతి కల్పించారని, వారు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో ఖాళీ అయిన పోస్టుల్లో తిరిగి స్థానిక ఎస్సీ అధికారులకు పదోన్నతి కల్పించకపోవడంతో అ న్యాయం జరిగిందన్నారు. యాజమాన్యానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరారు. స్పందించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇతర సమస్యలు వివరించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరించాలని కోరగా, ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెప్పాలని కమిషన్ ఆదేశించగా రెండు నెలల సమయం కావాలని చెప్పారు. దీంతో అన్ని సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ, వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, మాధవ రావు, రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఎ.ఆనందం, కుమారస్వామి, బక్క దానయ్య, ఉపేందర్, దయానంద్, మాతంగి శ్రీనివాస్, సుదర్శన్, అజ్మీరా శ్రీరాం నాయక్, జాటోత్ హర్జీ పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
వడగండ్ల వాన బీభత్సం..
మిరి ్చపంటపై కప్పిన కవర్పై నిలిచిన వర్షపు నీరుగాలికి రోడ్డుపై ఎగిరిపడిన టేల డబ్బాకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సుమారు 20నిమి షాల పాటు భారీ ఈదురుగాలితోకూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కాళేశ్వరం, పూస్కుపల్లి, మజీద్పల్లిలో అక్కడక్కడ చేనుల్లో ఆరబోసిన మిరపపంట తడిసింది. పంటపై కప్పిన కవర్లలో నీరు భారీగా నిలిచింది. మజీద్పల్లిలోని వీఐపీ ఘాట్ వద్ద చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిళ్లడంతో అన్నదాతల లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా, పూర్తిస్థాయిలో రైతులు కవర్లు వేసి ఉండడంతో మిరప పంటకు నష్టం ఎక్కువ జరగలేదు. విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్ల కొమ్మలు .. గాలి వాన బీభత్సానికి బస్టాండ్ సమీ పంలోని ఓ టేల డ బ్బా ఎగిరి రోడ్డుపై పడింది. అందులో ఎలాంటి సామగ్రి లేకపోవడం, రోడ్డుపై ప్రజల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పలు కాలనీల్లో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు వి రిగిపడ్డాయి. ఇప్పలబోరులో ఇంటిపై రేకులు లేచాయి. కాళేశ్వరాలయంలో మెట్లమార్గం వద్ద రేకులు ఏర్పాటు చేయగా అవి గాలికి ఎగిరి కిందపడ్డా యి. పిడుగుపాటుకు కుంట్లం గ్రామంలో ఓ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పలిమెలలో ఈదురుగాలుల బీభత్సం .. పలిమెల: మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డ 33 కేవీ ప్రధాన విద్యుత్ లైన్ పై చెట్టుకొమ్మలు విరిగిపడడంంతో లెంకలగడ్డ మినహా మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిది. విద్యుత్ సిబ్బంది చెట్టును తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు. సుమారు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. తడిసిన పంటను చూపుతున్న రైతు మల్లయ్య ఆరబోసిన మిరప పంట నీటి పాలు.. నేలకొరిగిన మొక్కజొన్న ఆందోళనలో రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
ఆర్ట్స్ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లోని మొదటి సెమి స్టర్ పరీక్షల ఫలితాలను ఆ కళాశాల ప్రిన్సిపా ల్ ఎస్.జ్యోతి సోమవారం విడుదల చేశారు. మొత్తం 1,445 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందులో 482 మంది (33.35శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తులు చేసుకోవచ్చునని, మార్చి 9వతేదీవరకు గడువు ఉందన్నారు. ఫలితాలు సంబంధిత నోటీస్బోర్డుతో పాటు కళాశాల వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ప్రిన్సిపాల్ రెహమాన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ సోమవారం రాత్రి ప్రకటించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ నాన్ప్రొఫెషనల్కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలు కూడా వాయిదావేసినట్లు తెలిపారు. పలు విభాగాల్లో సిలబస్ పూర్తికాని నేపథ్యంలో వాయిదావేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని రాజేందర్ చెప్పారు. ఘర్షణ పడిన విద్యార్థుల హాస్టల్ అడ్మిషన్ రద్దు యోచన?కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో న్యూపీజీ బాయ్స్ హాస్టల్లో ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్ విభాగాల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న ఘటనను వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సీరియస్గా పరిగణిస్తున్నారు. చికెన్ కోసం జరిగిన ఈ ఘర్షణలో 20మందిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ రెండు విభాగాల పలువురు విద్యార్థులు ఆ మెస్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. గొడవ జరిగినప్పుడు తీసిన వీడియోలను పరిశీలించనున్నట్లు కేయూసీ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ విద్యార్థి సంఘాలతో వీసీ, రిజిస్ట్రార్, సీఐ సమావేశమై చర్చించారు. కాగా, కేసులు నమోదైన విద్యార్థులను న్యూపీజీబాయ్స్ హాస్టల్నుంచి అడ్మిషన్ రద్దుచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికా రులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించాక పోలీస్ కేసులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం సోమవారం రాత్రి వెల్లడించారు. అవసరమైతే అకడమిక్ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదన్నారు. హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బ కాయిలు చెల్లించాలని ఎస్జీపీఏటీ రాష్ట్ర అసో సియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ప్రధాన కార్యదర్శి వి.రామమనోహర్ డిమాండ్ చేశా రు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్–తెలంగాణ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. మార్చి 2024 నుంచి ఇ ప్పటి వరకు రి టైర్డ్ ఉద్యోగుల బకాయిలు చె ల్లించాలని డి మాండ్ చేశారు. -
మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : మరింత శ్రమిస్తే భవిష్యత్లో జాతీయ స్థాయిలో కూ డా పతకాలు సాధిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈసారి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలు కై వసం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. క్రీడల్లో రాణించే వారికి తమ సహకారం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఆర్ఎస్సై శరత్, మణికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. లోకోపైలెట్కు అస్వస్థత కాజీపేట రూరల్ : రైలులో ఓ లోకోపైలెట్ సోమవారం అస్వస్థతకు గురి కాగా కాజీపేట జంక్షన్లో దింపి చికిత్స నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తలించారు. యశ్వంత్పూర్–నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్కు చెందిన లోకోపైలెట్ ప్రసాద్ మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సికింద్రాబాద్ రైల్వే అధికారులకు స మాచారం అందించి కాజీపేట జంక్షన్లో దింపారు. అనంతరం కాజీ పేట రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. -
స్పోర్ట్స్ హబ్గా హనుమకొండ
వరంగల్ స్పోర్ట్స్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నిలయమైన హనుమకొండ జిల్లాను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఫలితాలను స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు పాల్గొనగా, 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకోగా, మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాంపియన్గా నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్ రెడ్డి, గట్టు మహేశ్బాబు, మహ్మద్ కరీం, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ ఖమ్మం ముగిసిన సీఎం కప్ పోటీలు -
సమగ్రాభివృద్ధే ధ్యేయంగా..
జాతీయ స్థాయిలో ఐదు జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టణ, పల్లెల జనగామ : దేశంలో పట్టణ, పల్లెల మధ్య అంతరం తగ్గించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో జాతీయ స్థాయిలో ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. ఇందులో దక్షిణ భారత దేశం నుంచి జనగామ ఎంపికై ంది. జనగామ జిల్లా సమగ్రాభివృద్ధికి మార్గ సూచిగా నిలిచే డిస్ట్రిక్ట్ డయాగ్నస్టిక్ విజిట్ ప్లాన్ అమలులోకి రానుండగా, గ్రామీణ జీవనోపాధుల స్థిరీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, పథకాల సమన్వయం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘ అధ్యయనం చేపట్టనున్నారు. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక పర్యటనలో జిల్లా సామాజిక, ఆర్థిక నిర్మాణం, అవకాశాలు, అడ్డంకులు, భవిష్యత్ వృద్ధి మార్గాలపై క్షుణ్ణంగా సమీక్ష చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా ‘గ్రామీణ శ్రేయస్సు–స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని జిల్లాకు అనుగుణంగా మలిచే అవకాశాలు పరిశీలించనున్నారు. ఈ ఎంపిక ముఖ్య ఉద్దేశం.. పట్టణ, గ్రామీణ స్థాయిలో ఆర్థిక శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడం, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పరచడం, జిల్లాకు ప్రత్యేకంగా ఉన్న రంగాలను గుర్తించి వాటిపై ఫోకస్ చేయడం ప్రధాన లక్ష్యం. ప్రైవేట్ రంగం, బ్యాంకులు, రైతు సమూహాలు నుంచి ప్రభుత్వ శాఖల వరకు ప్రతీ వర్గంతో నేరుగా చర్చించి, వారి అవసరాలు, సమస్యలు, ఆలోచనలను సేకరించడం ద్వారా జిల్లాకు అనుకూలమైన అభివృద్ధి రోడ్మ్యాప్ రూపొందించడం ఈ విజిట్ ప్రధాన సంకల్పం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వ్యవసాయ ఆధునికీకరణ ద్వారా వలసలు తగ్గించి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గ్రామీణ శ్రేయస్సు–స్థితిస్థాపకత కార్యక్రమంలో భాగంగా ఏషి యన్ డెవలప్మెంట్ బ్యాంకు, బోస్టన్ కన్సల్టెన్సీకి చెందిన కేంద్ర ప్రతినిధులు సోమవారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వారికి స్వాగతం ప లికారు. అనంతరం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్ల్యూమ్, పరిశ్రమలు తదితర శాఖల అధి కారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, కేంద్ర ప్రతినిధులు సునయ్కీమ్, అపర్ణ, హర్షద్, ఆనంద్, అంకిత్ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై అధ్యయనం ఏషియన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటన జిల్లాకు చేరుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు -
కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి
మహబూబాబాద్: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ఆ తర్వాత రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే మురళీనాయక్, కమిషనర్ రాజేశ్వర్ సన్మానించారు. అనంతరం చైర్పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్యను కౌన్సిలర్లు సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. ఇటీవల మానుకోటలో రూ.59.62 కోట్ల అబ్ధివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. మున్నేరువాగు వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న బతుకమ్మ ఘాట్కు శంకుస్థాపన చేశామని, ఆ నిర్మాణానికి మరో మూడుకోట్ల రూపాయలు విడుదల చేయిస్తామన్నారు. బంధం చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేసేందుకు రూ.7 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేడ్ స్కూల్, హైస్కూల్ అండ్ జూనియర్ కళాశాల బాలుర, బాలికల కళాశాల భవనాలకు మార్చిలో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపనలు చేస్తారన్నారు. బాధ్యతల స్వీకరణ మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ సీహెచ్ ఉపేందర్, కౌన్సిలర్లు అజయ్సారథిరెడ్డి, ముత్యం వెంకన్న, రాజశేఖర్, దిలీప్, రవికుమార్, నవీన్, బోల్లు రాజు, ధనలక్ష్మి, శివకుమార్, నాగేశ్వర్ రావు, సుధామోహన్, డీఈ సీహెచ్ ఉపేందర్, ఏఈ కుమార్ టీపీఓ సాయిరాం, నాయకులు ఘనపురపు అంజయ్య, ప్రవీణ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ మానుకోట మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం -
టెన్త్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని చెప్పారు. జిల్లాలో 8,157 మంది విద్యార్థులు రాయనుండగా.. 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర సేవలకు వైద్యకేంద్రాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఈఓ రాజేశ్వర్, డీఎస్సీ తిరుపతి రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యం
● డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్: లారీలు, ఆటోలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు ముఖ్యమని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా లారీ, ఆటో డ్రైవర్లకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు సోమవారం కంటి పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ వాహన డ్రైవర్లు ఆరోగ్యంతో ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ ద్వారా ప్రతీఒక్కరికి మేలు కలగాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై చీర్ల అరుణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వృత్తి విద్యాకోర్సులతో ఉద్యోగాలు మహబూబాబాద్ అర్బన్: వృత్తి విద్యా కోర్సులతో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించవచ్చని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఓకేషనల్ కళాశాలలో సోమవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకుని చదివితే భవిష్యత్లో ఆనందంగా ఉండొచ్చని వివరించారు. అనంతరం డీఐఈఓ మదార్గౌడ్ మాట్లాడుతూ.. వృత్తి విద్యాకోర్సులతో విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. డీఎస్పీని, డీఐఈఓను కళాశాల అధ్యాపక బృందం సన్మానించారు. సమావేశంలో కళాశాల చైర్మన్ చల్లగాలి మోసెస్, ప్రిన్సిపాల్ పుల్లారావు, ఆత్మకమిటీ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డి, అధ్యాపకులు వసంత, పాపారావు, సుధాకర్, శ్రీనివాస్రెడ్డి, తిరుమలేష్, ప్రసాద్, రాజు, కళావతి, రమ్య విద్యార్థులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించని అధికారులు
గార్ల: గార్ల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ఈజీఎస్ ఓపెన్ ఫోరం సమావేశానికి జిల్లా అధికారులు సమయపాలన పాటించకుండా 4 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రజాప్రతినిధులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశాన్ని నేటికి వాయిదా వేస్తున్నట్లు జిల్లా పీడీ మధుసూదనరాజు ప్రకటించారు. ఉదయం 10 గంటల కు ప్రారంభం కావాల్సిన సమావేశానికి సంబంధిత జిల్లా అధికారులు మధ్యాహ్నం రావడంతో ఉద యం నుంచి వేచిఉన్న సర్పంచ్లు, వివిధ పార్టీల నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వాయిదా వేయాలని సర్పంచ్లు కోరడంతో గత్యంతరం లేని పరిస్థితిలో అధికారులు నేటికి వాయిదా వేశారు. నేడు రైతువేదిక భవనంలో ఉదయం 11.30 గంటలకు ఓపెన్ఫోరం సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్లు గంగావత్ రాంసింగ్, బానోత్ మోతీలాల్, వివిధ పార్టీల నాయకులు జడ సత్యనారాయణ, కట్టెబోయిన శ్రీనివాస్, పెద్దవెంకటేశ్వర్లు, యాకూబ్పాషా, గౌని భద్రయ్య, రాగం రమేష్, మల్లేష్, ఇర్రి రవి, తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఈజీఎస్ ఓపెన్ ఫోరం నేటికి వాయిదా -
వినతులను సత్వరమే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోపే వినతులను పరిష్కరించాలని లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా పరిష్కరించాలన్నారు. డ్రెయినేజీలు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వచ్చిన వినతుల విషయంలో తక్షణమే స్పందించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 131 వినతులు వచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సీపీఓ శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలిఏపూర్ గ్రామంలో నాకు ఎకరం రెండు గుంటల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నా.. తహసీల్దార్ పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఆర్డీఓను కలిసినా పని కాలేదు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్ను పలు మార్లు కలిసినా ఫలితం లేదు. అందుకే పాస్పుస్తకం మంజూరు చేయాలని ప్రజావాణిలో వినతి ఇచ్చాను. – వాంకుడోత్ లక్పతి, ఏపూర్ గ్రామం, పెద్దగూడూరు మండలం కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ప్రజావాణిలో 131 దరఖాస్తుల స్వీకరణ -
ఆసక్తికరంగా శతావధానం ● కేయూ సెనెట్ హాల్లో నిర్వహణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనెట్హాల్లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేసి ఆకట్టుకున్నారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకుడు డాక్టర్ కర్రె సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదవర్గాల అభివృద్ధే లక్ష్యం
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కేటీఆర్ కాలనీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాజ్యోతిరావుపూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దళిత, గిరిజన, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అంబేడ్కర్ ఆలోచన విధానంతో ప్రతీ ఒక్కరు ఆర్థిక, సామాజిక, విద్య రంగాల్లో పురోగతి సాధించాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీలపై పెట్టిన కేసులపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాకు చేరుకున్న చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు శ్రీనివాసరావు, దేశీరాంనాయక్ స్వాగతం పలికారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు యాళ్ల మురళీధర్రెడ్డి, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, దుడ్డెల రాంమూర్తి, అశోద భాస్కర్, శ్రీరాములు, మైస శ్రీనివాసులు, పులి శ్రీను, రాధ, సుధ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతిపత్రాలు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం
కురవి: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పోత్సవం(పవళింపు సేవ) కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఉత్సవమూర్తులను అధీష్టింపజేసి గణపతి పూజ, గౌరీపూజ, పుణ్యహవచనము నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అందంగా పూలతో అలంకరించిన ఊయల వద్దకు మేళ తాళాలనడుమ ఉత్సవమూర్తులను తోడ్కొని వెళ్లి పవళింపుసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి దంపతులు, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్ దంపతులు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య దంపతులు, ఆలయ ధర్మకర్తలు చిన్నం గణేష్, భిక్షపతి, జనార్ధన్రెడ్డి, అర్చకులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్కుమార్, దూసకంటి విజయ్, పుణ్యమూర్తి, విజయ్, అభిలాష్, తేజ, బాలకృష్ణ, రమేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెయిట్లిఫ్టింగ్లో బంగారు పతకం డోర్నకల్: హైదరాబాద్లో జరుగుతున్న సీఎం కప్ వెయిట్లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు బంగారు పతకం లభించింది. బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన ఎం.స్వాతి సోమవారం జరిగిన పోటీల్లో 58 కేజీల విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం కై వసం చేసుకుంది. బంగారు పతకం సాధించిన స్వాతిని జిల్లా వెయిట్లిప్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలోజు సుధాకర్, సెక్రెటరీ కొత్త రాంబాబు తదితరులు అభినందించారు. గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ములుగు: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోదావరి నది తీరం ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తుతో పాటు ఇతర పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెంలో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతీ పుష్కర ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: మారుమూల మానుకోట జిల్లాలోని నాయకులు అవకాశమున్న ప్రతీసారి ఇటు శాసన మండలి, అటు రాజ్యసభ సీటుకోసం ప్రయత్నాలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీటుకోసం జిల్లా నుంచి ఇద్దరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేతలు వేర్వేరు సామాజిక వర్గాల నుంచి ప్రయత్నం చేస్తుండడంతో ఇద్దరూ పెద్దల సభకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేరైన తర్వాత మహబూబాబాద్ జిల్లాకు చెందిన నాయకులు శాసనన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో రాథోడ్ సత్యవతి ఎమ్మెల్సీగా ఎన్నికై కేసీఆర్ మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా పనిచేశారు. అదే విధంగా జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరిద్దరితోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పింగిలి శ్రీపాల్రెడ్డి కూడా మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర రెండో సారి రాజ్యసభకు నియమితులయ్యారు. పాదయాత్రతో చేరువై.. జిల్లా నుంచి లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన గూడూరు ప్రాంతానికి చెందిన తేజావత్ బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు. గిరిజన సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో కీలకంగా పనిచేసి గాంధీ కుటుంబానికి దగ్గరయ్యారు. రాజ్యసభ సీటుకోసం ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉండి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో ఎస్టీ కోటాలో బెల్లయ్యనాయక్కు రాజ్యసభ సీటు వచ్చే అవకాశాలు లేకపోలేదని స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ. ముఖ్యమంత్రి మిత్రుడిగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రయత్నించిన కీలక నాయకుల్లో ఒకరిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం సలహాదారులుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సమీప మిత్రుడిగా ఈయనకు పేరుంది. గతంలో నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమైనా.. రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ప్రత్యక్ష ఎన్ని కల్లో పోటీకి దిగలేదు. అయితే శాసనమండలి సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి నియామకం దాదాపుగా పూర్తయిందనే వార్తలు వచ్చిన తర్వాత చివరి నిమి షంలో చేజారిపోయింది. కాగా, ముఖ్యమంత్రి మిత్రుడిగా ఉంటూనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు విధేయుడిగా నరేందర్రెడ్డి పేరు సంపాదించుకున్నారు. కావున.. ఇప్పుడు రాజ్యసభ సీటు ఇప్పించేందుకు సీఎం, ఇతర కీలక మంత్రులు కూడా వేం నరేందర్ రెడ్డి పేరు సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లా నుంచి ఇద్దరు నాయకుల పోటీ అనుకూలించే అవకాశం ఉందని చర్చ ఎస్టీ కోటాలో బెల్లయ్యనాయక్, జనరల్ కోటాలో వేం నరేందర్ రెడ్డిఇద్దరికా.. ఒకరికా..? రాజ్యసభకు పోటీ పడుతున్నవారిలో ఇద్దరు నాయకులు జిల్లాకు చెందిన వారే కావడంతో వారు రాజ్యసభకు ఎంపికై తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు సైతం రాజ్యసభ సీటు కోసం తీవ్రప్రయత్నాలు చేసుకుంటున్న నేపథ్యంలో మానుకోట జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం ఇస్తారా.. ఒకరికి ఇస్తారా.. అనేది వేచి చూడాలి. -
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య రాక
హన్మకొండ: తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు జన్ను ప్రవీణ్, కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ సోమవారం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయానికి రానున్నారు. సీఎండీ, డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో సమావేశం కానున్నారని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రమేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, ఇబ్బందులపై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారించనుందని తెలిపారు. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి భీమదేవరపల్లి : విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మల్లారంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరామోజు వెంకటేశ్వర్లు (66) పిండిగిర్ని నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే ఆదివారం ఉదయం పిండిగిర్ని ఆన్ చేయడానికి స్విచ్ వేశాడు. ఈ సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాల్వలో పడి వ్యక్తి.. ములుగు రూరల్ : కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండంలోని బండారు పల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన మీతాలాల్ టండి (55) కూలీ కోసం రెండు నెల క్రితం బండారు పల్లికి వచ్చి ఇక్కడ ఉన్న ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు వచ్చి తిరిగి ఇటుక బట్టీ వద్దకు వెళ్లలేదు. దీంతో సహచర కూలీలు మీతాలాల్ టండి కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బండారుపల్లి శివారులోని కాల్వలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కాల్వ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు స్నానం కోసం కాల్వలో దిగగా నీట మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు.మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ● రూ. 35వేల విలువైన మందులు స్వాధీనం ● ఆర్ఎంపీపై కేసు నమోదు శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని క్లినిక్, మెడికల్ షాపులపై ఆదివారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ క్లినిక్లో అనుమతి లేని రూ. 35వేల విలువైన 30 రకాల మందులు లభ్యం కాగా స్వాధీనం చేసుకుని ఆర్ఎంపీ రాచర్ల ప్రభాకర్పై కేసు నమోదు చేసినట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేసి పంపించాలన్నారు. బెడ్లు ఏర్పాటు చేయొద్దని, అనుమతి లేకుండా మందులు నిల్వ చేయొద్దన్నారు. డ్ర గ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జె. కిరణ్ కుమార్, వరంగల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రా వణ్ కుమార్ ఉన్నారు. -
రక్తమోడిన రహదారులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. ఆదివారం పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో ఇద్దరు, జనగామ జిల్లా కొడకండ్ల శివారు వెలిశాల వద్ద ఒకరు, మహబూబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో మరొకరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఎస్ఎస్తాడ్వాయి : మేడారానికి వస్తూ ఒకరు.. మహాజాతరకు వచ్చి వెళ్తూ మరొకరు.. ఇలా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఇచ్చగూడేనికి చెందిన గుజ్జ కమలాకర్(45) బంధువులు మేడారానికి వెళ్లగా ఆయన బైక్పై మహాజాతరకు వస్తున్నాడు. ఈ క్రమంలో పస్రా– తాడ్వాయి కొండపర్తి ములుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కమలాకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి చెందిన గార్లపల్లి నవీన్(32) బైక్పై మేడారం వెళ్లాడు. తిరిగి సాయంత్రం సమయంలో వెళ్తున్న క్రమంలో తాడ్వాయి దాటిన తర్వాత పెద్దమోరి వద్ద వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్పై నుంచి పడి వ్యక్తి.. కొడకండ్ల : బైక్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కొడకండ్ల శివారు వెలిశాల హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద చోటుచేసుకుంది. ఎస్సై చింత రాజు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ(38) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇందులో భాగంగా పనినిమిత్తం శనివారం బైక్పై వెలిశాలకు వెళ్లాడు. రాత్రి స్వగ్రామం బయలుదేరాడు. ఈ క్రమంలో అదే తండా(కోక్యనాయక్)కు చెందిన గుగులోత్ శంకర్ బైక్పై వెలిశాల వద్ద అడ్డు వచ్చాడు. దీంతో నెహ్రూ కిందపడగా తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీకొని గంట్లకుంటలో యువకుడు.. పెద్దవంగర: బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని గంట్లకుంటకు చెందిన గుర్రం సంతోష్ (28) బైక్పై శనివారం రాత్రి అవుతాపురం నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. ఇదే సమయంలో స్టేషన్ ఘన్పూర్కు చెందిన దేవసాని దామోదర్ కారులో గంట్లకుంట నుంచి పోచంపల్లి వైపునకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా బైక్ను ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి రామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతిభను గుర్తించేందుకే సీఎం కప్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసి మరింత ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం కొనసాగాయి. మూడో రోజు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన డీటీఓ శ్రీనివాస్ విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామీణం నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగేలా సీఎం కప్ పోటీల రూపకల్పన చేశారన్నారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ మూడో రోజు లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 4 ్ఠ100 రిలే విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్రెడ్డి, రెజ్లింగ్ సంఘం బాధ్యులు దయాకర్రెడ్డి, మహ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు. డీటీఓ శ్రీనివాస్ మూడో రోజు కొనసాగిన రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు -
శతావధానం సాహసోపేతమైన ప్రక్రియ
కేయూ క్యాంపస్: శతావధానం చేయడం సాహసో పేతమైనదేనని, గణిత ఉపాధ్యాయుడు చేపూరి శ్రీ రాం శతావధానంలో విజయసాధిస్తారని ఉపాధ్యా య ఎమ్మెల్సి పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. కాకతీ య యూనివర్సిటీ స్వర్ణోత్సవాల వేళ తెలుగు విభా గం, కాకతీయ పద్యకవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కేయూ సెనేట్హాల్లో ఆదివారం చేపూరి శ్రీరాం శతావధానం కార్యక్రమం చేపట్టారు. ము ఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తెలుగు భాషలోని 56 అక్షరాలను తగ్గించడానికి చేస్తున్న ప్ర యత్నాలను వ్యతిరేకించాలని కోరారు. తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ మాధ్యమంలో చదివినా తెలుగు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. గతంలో చేపూరి శ్రీరాం, తాను ఒకేచోట ఉపాధ్యాయులుగా పనిచేశామని గుర్తుచేశారు. తెలుగు పద్యకవిత్వం, సాహిత్యంలో మక్కువను పెంచుకొని శ్రీరాం శతావధా నం చేయడం అభినందనీయమన్నారు. ఏకాగ్రతతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. పద్యకవిత్వంపై పట్టు అవధానానికి మూలాధారం : రిజిస్ట్రార్ పద్యకవిత్వంపై పట్టు అవధానానికి మూలాధారమని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలో తొలిసారి తెలుగు విభాగం ఆధ్వర్యంలో శతావధానం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇందులో వంద మంది పండితులు వంద ప్రశ్నలకు పద్యరూపంలో సమాధానాలు చెప్పడం గొప్పవిషయం అన్నారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి తెలుగు భాష వర్ణమాల వైభవం ఎంతో గొప్పదని అభివర్ణించారు. అవధాన విద్యావికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ ఓరుగల్లు బిడ్డ చేపూరి శ్రీ రాం శతావధానం చేయడం అభినందనీయమన్నా రు. ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త గట్టు మహేశ్బాబు మాట్లాడుతూ కాకతీయల కాలం నాటి శతావధానం సంప్రదాయాన్ని పరిరక్షించాలని కో రారు. కాకతీయ పద్యకవితా వేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య, హైకోర్టు న్యాయవాది అనంతశర్మ, ఈ సభకు తెలుగు విభాగం అధిపతి మామిడి లింగ య్య అధ్యక్షత వహించారు. కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, సహృదయ సాహిత్యసాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు జి.గిరిజామనోహరబాబు, అధ్యాపకుడు డాక్టర్ సదాశివ్, కాకతీయ పద్యవేదిక బాధ్యులు సోంబాబుశర్మ మాట్లాడారు. ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి తన గురువు కంది శంకరయ్యను సన్మానించారు. చేపూరి శ్రీరాం మొదటి రోజు శతావధానానికి ఉపక్రమించారు. ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి సమస్య అనే అంశంపై శంకర, కంకర, వంకర, టింకర అనే పదాలతో విద్యావిధానంపై అవధానం చేయాలని కోరారు. శ్రీరాం అవధానంలో పూరణ చేశారు. ఆతర్వాత పృచ్చకులు (ప్రాశ్నికులు) అవధానంలో భాగంగా సమస్యపై 25 మంది, దత్తపదిపై 25 మంది ప్రశ్నలు సంధించారు. సమస్యలకు శ్రీరాం మొదటి పాదంగా సమాధానాలు పూరించారు. ఈనెల 23న వర్ణన, అశువుపై శతావధానం జరగనుంది. ఈనెల 24న ముగియనుంది. తెలుగు భాషను పరిరక్షించుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కేయూలో చేపూరిశ్రీరాం ‘శతావధానం’ షురూ -
పోలీస్ వలయంలో సీఎం పర్యటన
కన్నాయిగూడెం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుపాలకుల గూడెం పర్యటన పోలీస్ వలయంలో కొనసాగింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో ఉన్న జె. చొక్కారావు ఎత్తిపోతలను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులతో కలిసి సందర్శించారు. ఆదివారం మహబుబాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.07 గంటలకు తుపాకులగూడెంలో గోదావరిపై ఏర్పాటు చేసిన సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో దేవాదులకు బయలుదేరారు. మార్గమధ్యలో సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ప్రవేశించి వెంటనే తన వాహనాన్ని దేవాదుల ఎత్తిపోతలకు మళ్లించారు. దీంతో అధికారులు, పోలీసులు కొంత తడబాటుకు గురయ్యారు. దేవాదుల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులు, మంత్రులతో కలిసి ఇంటెక్వెల్ను పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం 5.49 నిమిషాలకు ప్రత్యేక వాహనంలో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్కు తిరిగి 6.05కు హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. కాగా, సమీక్ష జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. కాగా, సీఎం సమీక్ష పూర్తయిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలు రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తుపాకులగూడెంజీపీ నుంచి లక్ష్మీపురం జంక్షన్ వరకు వాహనాలు బారులుదీరాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దేవాదులకు ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రాక మంత్రులు, కలెక్టర్, పీఓ, ఎస్పీ ఘన స్వాగతం -
మైనార్టీలకు స్వయం ఉపాధి పథకాలు
న్యూశాయంపేట: ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ యువత (ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్సీ)కు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కారొరేషన్ ద్వారా వివిధ పథకాలు అందిస్తోంది. మైనారిటీ వర్గాలు తరతరాలుగా చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆధునికీకరణతో వీరి వృత్తులు దెబ్బతిన్నాయి. వారిని తిరిగి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది. కేవలం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు తోడ్పాటునందిస్తోంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హుల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ ఇస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీతో కూడిన ఈ స్కూటర్లు, వందశాతం సబ్సిడీతో ఉచితంగా పనిముట్ల కిట్లు, జనరేటర్లను పంపిణీ చేయడానికి సంకల్పించింది. రాళ్లు కొట్టే తురక, కాశ ముస్లిం వర్గాలకు.. రాళ్లు కొట్టే వృత్తిలో (పత్తర్ ఫోడ్) నిమగ్నమైన పేద తురక, కాశ ముస్లిం వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఉపాధి మెరుగుదల కోసం టూల్ కిట్లు, జనరేటర్లు పంపిణీ చేయనుంది. ప్రతి లబ్ధిదారుడికి రూ.60 వేలు వంద శాతం సబ్సిడీతో ఇవ్వనుంది. ఇందులో టూల్కిట్ కోసం రూ.10వేలు, రూ.50 వేల విలువైన జనరేటర్ను అందిస్తారు. దరఖాస్తుదారుడు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలి. గత ఐదు సంవత్సరాల్లో టీజీఎంఎఫ్సీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందకుండా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులో తురక, కాశ ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఆహారభద్రత కార్డు తప్పనిసరిగా పొందుపరచాలి. నిరుద్యోగ యువతకు ఈ–స్కూటర్లు మైనారిటీ నిరుద్యోగ యువత (21 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు పురుషులు) ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా ఈ– స్కూటర్లు పంపిణీ చేయనున్నారు. ఈపథకంలో యూనిట్ వ్యయం సుమారు 1.50 లక్షలు కాగా.. అందులో 80 శాతం సబ్సిడీ కింద రూ.1.20 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 20 శాతం (రూ.30 వేలు) లబ్ధిదారుడు వాటా చెల్లించాలి. ఎంపికై న లబ్ధిదారులను ఊబర్, రాపిడో, ఓలా లాంటి సేవాసంస్థలతో అనుసంధానం చేసి స్వయం ఉపాధికి తోడ్పాటునందిస్తుంది. పథకం కోసం లబ్ధిదారుడు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(జీరో కేసులు), పాన్కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఆహారభద్రత కార్డు, పాన్కార్డు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా పొందుపరచాలి. ఐదేళ్ల కాలంలో టీజీఎంఎఫ్సీ ద్వారా ఎలాంటి ఆర్థిక సాయం పొందకుండా ఉండాలి. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి ఒకటో తేదీ వరకు గడువు ఉంది. టీఎస్ఓబీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబసైట్లో దరఖాస్తులు సమర్పించాలి. మండల పరిధి ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపాలిటీల్లో దరఖాస్తులకు సంబంధించిన రెండు జతల కాపీలు అందజేయాలి. వివరాల కోసం సంబంధిత జిల్లా మైనార్టీ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలి. 40 ఏళ్లలోపు నిరుద్యోగులకు ఈ–స్కూటర్లు తురక, కాశ వర్గాలకు టూల్కిట్లు, జనరేటర్లు ఆన్లైన్లో దరఖాస్తులకు గడువు మార్చి ఒకటి వరకు జిల్లాల వారీగా మంజూరైన యూనిట్ల వివరాలు.. జిల్లా (ఈ–స్కూటర్స్) (టూల్కిట్లు, జనరేటర్స్) జనగామ 12 102 మహబూబాబాద్ 17 76 హనుమకొండ 70 62 వరంగల్ 65 58 ములుగు –– –– జేఎస్ భూపాలపల్లి –– –– -
చరిత్ర నుంచే విలువలను గ్రహించాలి
కేయూ క్యాంపస్: చరిత్ర నుంచే విలువలను గ్రహించాలని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి సూచించారు. రెండు రోజులుగా కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హ్యూమనిటీస్ భవనం సెమినార్హాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ వార్షిక సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సమాజం చరిత్రపై ఆధారపడి ఉందని, మరుగునపడిన చరిత్రను వెలికి తీసి నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మానవ పరిణామ క్రమంలో సంభవించే మార్పులను చరిత్ర ద్వారానే సరిగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి మాట్లాడుతూ వాస్తవికమైన చరిత్రను వెలికితీయాలని, చరిత్రను వక్రీకరించకూడదని కోరారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంకం జయప్రకాశ్ మాట్లాడుతూ ఈ సమావేశాల్లో 105 పరిశోధనా పత్రాలు సమర్పించారని తెలిపారు. మూడు స్మారకోపన్యాసాలు, ఐదు సాంకేతిక సమావేశాలు నిర్వహించామని వివరించారు. న్యూఢిల్లీ, పుణె, సిక్కిం, కోల్కతా, పాండిచ్చేరి, కుప్పం, ఏపీ తదితర ప్రాంతాల నుంచి చరిత్రకారులు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించారని తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ అధ్యక్షత వహించారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి చిలువేరు రాజ్కుమార్ మాట్లాడారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్దాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకట్రాజం, ఆచార్య కె.విజయ్బాబు, ఆచార్య వరలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గాజుల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి ముగిసిన తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం -
టిప్పర్ను ఢీకొన్న బైక్..
● సెంట్రింగ్ మేసీ్త్ర దుర్మరణం ● చింతగట్టు క్యాంపు వద్ద ఘటన హసన్పర్తి: రోడ్డు ప్రమాదంలో సెంట్రింగ్ మేసీ్త్ర మృతి చెందాడు. చింతగట్టు క్యాంపులోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని కోమటిపల్లి తండాకు చెందిన బానోత్ హరిసింగ్(47)కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఆర్వోఆర్ మీదుగా బైక్పై చింతగట్టు క్యాంపునకు బయల్దేరాడు. అయితే, ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్ కనిపించలేదు. దీంతో చీకటిలో వెనుక వైపు నుంచి టిప్పర్ను ఢీకొన్నాడు. ఈప్రమాదంలో హరిసింగ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు కుటుంబ సభ్యుల రాస్తారోకో.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, తండావాసులు ఆందోళనకు దిగారు. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు క్యాంపు వద్ద రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. -
ప్రేమకు నిలువెత్తు రూపమై..
దేవరుప్పుల: భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూస్తుంటాం. భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త.. ఆమె పక్కనే నేనుండాలి అంటూ తన విగ్రహం పెట్టుకున్నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్. ఆయనకు దస్లీతో వివాహమై అరవై ఏళ్లు అయ్యింది. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసింది. భార్య భౌతికంగా లేకపోయినా.. జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని పెట్టాడు నానూ నాయక్. ఏనాటికై నా ఆమె ధరిచేరతానని.. బతుకులోనూ, మరణంలోనూ, చివరికి విగ్రాహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలని భావించాడు. బతికుండగానే తన విగ్రహాన్ని తయారు చేయించి దస్లీ విగ్రహం పక్కన ముసుగేసి ఉంచాడు. తన మరణానంతరం విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంతానాన్ని కోరాడు. కోరాడు. -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వం ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఎన్హెచ్ఎం జేఏసీ వ్యవస్థాపకుడు పుట్ట మహేందర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, నూతన జేఏసీ నాయకుల ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తమ ప్రధాన ఎజెండా అని, ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎన్హెచ్ఎం జేఏసీ అధ్యక్షుడిగా డాక్టర్ కుమార్ డుంగ్రోత్, ప్రధాన కార్యదర్శిగా పొన్నం కవిత, కోశాధికారిగా పగిడిపల్లి ఉమాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ కందుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పి.శ్రీకాంత్తో పాటు 48 మంది కోర్ కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. చిలువేరు సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మిగౌడ్ జేఏసీ క్యాలెండర్, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కోర్కమిటీ సభ్యులు రుక్ముద్దీన్, డాక్టర్ నవీన్కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జ్ మొగిలి నరేష్, రాజ్కుమార్, నవీన్, జ్యోతి, అశ్విని, ఎన్హెచ్ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నామమాత్రంగా వైద్య సేవలు
డోర్నకల్: జిల్లాలోని డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు నామమాత్రంగా అందుతుండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర వసతులు, వైద్యులు, సిబ్బందితో రోగులకు సేవలు అందడం లేదు. పీహెచ్సీలో న లుగురు వైద్యులు ఉండాలి. కానీ, ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్ ఉస్మాన్ గంధంపల్లి, డాక్టర్ వరుణ్ కంబాలపల్లి పీహెచ్సీకి డిప్యుటేషన్పై వెళ్లారు. ఇటీవల పీహెచ్సీకి మరో వైద్యుడిని నియమించారు. దంత వైద్యుడితో పాటు సీహెచ్ఓ, హెడ్ నర్సు, పీహెచ్ఎన్ పోస్టులు చాలాకాలంగా ఖాళీగా ఉన్నా యి. ఒక్కో వైద్యురాలు 24గంటల చొప్పున విధులు నిర్వర్తిస్తున్నా.. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఆదివారం మరీ దారుణం.. ఆదివారం వైద్యులతో పాటు సిబ్బంది సెలవులో ఉండడంతో రోగులకు సేవలు అందలేదు. స్టాఫ్ నర్సు మాత్రమే విధుల్లో ఉండడంతో రోగులు ప్రైవే ట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా చేయలేదని రోగులు చెప్పారు. పీహెచ్సీ స్థాయి కావడంతో ఈసీజీ, మానిటర్లు ఇతర పరికరాలు లేక అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. రాత్రి వేళల్లో పీహెచ్సీలో స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని రోగులు చెబుతున్నారు. కాగా, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్న తమకు రక్షణపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సిబ్బంది వా పోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పీహెచ్సీలో వైద్యులు, సిబ్బందిని నియమించి రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ పీహెచ్సీలో అరకొరగా సేవలు -
సౌకర్యాలు నిల్
బోనాల సందడిగార్ల రైల్వేస్టేషన్లో తాగునీరు కరువు ఆలయానికి బోనాలతో వెళ్తున్న భక్తులుకురవి: మండల కేంద్రంలోని భద్రకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలు సమర్పించారు. ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఆలయంలో సందడి నెలకొంది.రైల్వేస్టేషన్లో తాగునీటి సౌకర్యం లేదు. మ రుగుదొడ్లకు లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రయాణికులు ఇబ్బందులు ప డుతున్నారు. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంలో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. లైటింగ్, నీటిసౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలి. – ఏదునూరి కుమారస్వామి, గార్ల రైల్వేస్టేషన్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం, వర్షాకాలంలో ప్లాట్ఫాంలపై వేసిన రేకుల షెడ్లు కురుస్తుండడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు స్పందించి స్టేషన్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. – కందునూరి శ్రీనివాసరావు, గార్ల ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం శిథిలమై వర్షాకాలంలో కురుస్తుంది. మంచి ఆదాయం వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదాయం లేని గుండ్రాతిమడుగు, ఇంటికన్నె, చింతలపల్లి, తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించారు. కానీ, ఏజెన్సీ మండలమైన గార్ల రైల్వేస్టేషన్కు నేటికీ పక్కా భవనం నిర్మించడం లేదు. – సూత్రపు రాజుయాదవ్, గార్ల గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రైల్వే అధి కారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం శిథిలమై కురుస్తున్నా.. నేటికీ కొత్త భవనం నిర్మించలేదు. దీంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. రూ.కోటికిపైగా ఆదాయం.. గార్ల రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రైలు టికెట్ల ద్వారా రూ.కోటిపైగా ఆదాయం వస్తోంది. అయితే స్టేషన్ ఉన్నతీకరణపై రైల్వే ఉన్నతాధికారులు మా త్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చింతలపల్లి, ఎల్గూరు, ఇంటికన్నె గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లకు ఆదాయం లేకున్నా రైల్వే ఉన్నతాధికారులు ఆయా స్టేషన్లకు పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు కల్పించారని మండల ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లలో నీటి వసతి కరువు.. గార్ల రైల్వేస్టేషన్ అభివృద్ధిపై రైల్వే ఉన్నతాధికారులు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. రైల్వేస్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి వసతి, లైటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్ ఎదుటిభాగం నేమ్బోర్డు వద్ద రేకులు లేచిపోయి గోడకూలి చూడడానికి అందవికారంగా కనిపిస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రయాణికులకు ప్లాట్ఫాంలపై నీడ కోసం సరిపడా రేకుల షెడ్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న రేకుల షెడ్లు వర్షం వస్తే కురుస్తున్నాయి. రెండో ప్లాట్ఫాంపై టైల్స్ పగిలి ఎత్తుపల్లాలు ఉండడంతో రాత్రి సమయంలో రైలు దిగే ప్రయాణికులు కిందపడిపోతున్నారు. రైల్వే అధికారులు సత్వరమే ప్లాట్ఫాం మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం వర్షం వస్తే కురుస్తోంది. ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్కు కొత్త భవనం నిర్మించి, కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరుగుదొడ్లకు నిలిచిన నీటి సరఫరా రెండో ప్లాట్ఫాంపై పగిలిన టైల్స్ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని రైల్వే అధికారులు -
విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరిశీలనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బీఈడీ కళాశాల విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్పై రెండు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు 53మంది బీఈడీ విద్యార్థులు రెండో తరగతి విద్యార్థుల ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ పరి శీలన, నైపుణ్యాలు, అభ్యసన సామర్థ్యాలను పరిశీలిస్తారన్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఎఫ్ ఎల్ఎన్ శాంపిల్ స్టడీ నిర్వహించబడుతుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుపర్చి విద్యార్థుల చదువులకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ అప్పారావు, ఆర్పీలు ప్రవీణ్, యాదగిరి, రాష్ట్ర పరిశీలకుడు సురేందర్ పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషిమహబూబాబాద్ రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దేశీరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గుగులోత్ దేశీరాంనాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, వారితో కలిసి డీటీడీఓ దేశీరాంనాయక్, డీపీఆర్ఓ రాజేందర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా డీటీడీఓ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికతో జిల్లాలోని 19గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఆరు వసతి గృహాలు, 9 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 104 గిరిజన ప్రైమరీ స్కూళ్లలోని విద్యార్థులు వ్యక్తిగతంగా, మానసికంగా దృఢంగా ఉండే విధంగా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయుల ద్వారా అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ బానోతు శుక్రునాయక్, స్టడీ అవర్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. మేడారంలో భక్తుల రద్దీ ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చ్ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ విద్య పరిరక్షణకు పోరాటం
పెద్దవంగర: ప్రభుత్వ విద్య పరిరక్షణకు టీపీటీఎఫ్ పోరాటం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత, పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి అధ్యయన తరగతులు నిర్వహించారు. టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, కార్యదర్శి వల్లాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రెండేళ్లుగా పీఆర్సీ ప్రకటించకపోవడం దురదృష్టకరమని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డు అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవపరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బలాష్టి రమేశ్, విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సోమారపు ఐలయ్య, నాయకులు సాంబయ్య, ప్రభాకర్ గౌడ్, జనార్దన్, ఉపేందర్, రవీందర్ రెడ్డి, సబియా బాను, దేవేందర్ నాయక్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల భూ సర్వే అడ్డగింత
కాళేశ్వరం: వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని వీఐపీ ఘాట్ నుంచి సాధారణ ఘాట్ వరకు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు చేపట్టిన భూ సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన భూ సర్వే కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖ, క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ల బృందం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. గోదావరి దిగువన కోతకు గురైన పట్టా భూమితో సహా 20 మీటర్ల మేర భూమిని తీసుకుంటామని గతంలో చెప్పి ఇప్పుడు 50 మీటర్ల (160 ఫీట్ల) మేర అత్యవసరమని చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 – 25 మీటర్ల లోపు భూమిని తీసుకుంటేనే ఇస్తామని తేల్చిచెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను రైతులు నగునూరి రమేష్, లక్ష్మీనారాయణ, అరుణ్, కిరణ్, రాజన్న, శ్రీనివాస్ వేడుకున్నారు. రైతుల వినతులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్ రామారావు తెలిపారు. సర్వేలో పీఆర్ డీఈ సాయిలు, ఇరిగేషన్ ఏఈ రవికుమార్, రిటైర్డు ఎండోమెంట్ ఏఈ అశోక్, క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ ఆంజనేయులు, ఆర్ఐ రఘు, సర్వేయర్ రమేష్, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ కృషి స్ఫూర్తిదాయకం ● రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సురేఖ కాశిబుగ్గ: పీడిత వర్గాల సమానత్వం కోసం సేవాలాల్ మహరాజ్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాశిబు గ్గలో సేవాలాల్ జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటం వద్ద ఆమె పూజలు చేసి బంజారాలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం డీటీడీఓ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బంజారాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. వారి కోసం స్థలాలను ఎంపిక చేసి రెండు దేవాలయాలు, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల రంగశాయిపేటలో బంజారాల విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ మంత్రి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. దాంతో ఆమె స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏసీపీని ఆదేశించారు. నగర మేయర్ గుండు సుధారాణి, ఆర్డీఓ సుమ, ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ మనీషా, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ భూక్య లాల్నాయక్, కార్పొరేటర్లు ఓని స్వర్ణలత, పోశాల పద్మ, వస్కుల బాబు, బాల్నె సురేష్, బస్వరాజు కుమారస్వామి, సునీల్, నాయకులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
మరిపెడ రూరల్: మరిపెడ మహా త్మగాంధీ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని రాసమల్ల శృతి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అనిత, పీడీ శ్రీలత శనివారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంతర్ జిల్లా సబ్జూనియర్ వాలీబాల్ చాంపియన్ షిప్లో వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చి జాయతీస్థాయి వాలీబాల్ చాంపియన్ షిప్కు తెలంగాణ జట్టులో స్థానం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్లో జరిగే పోటీల్లో శృతి పాల్గొంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మున్సిపాలిటీల ఆదాయ వనరులివే..
తొర్రూరు: పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు రకాల నిధులు సమకూరుతాయి. ఆ నిధులతో నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలు మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకునే వీలుంటుంది. ఆస్తి పన్ను ఇది మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలపై అధికారులు ఆస్తి పన్ను విధిస్తారు. ప్రకటనలు విద్య, తదితర సంస్థల హోర్డింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. వాటి నుంచి ప్రకటన పన్నులు వసూలు చేస్తారు. నీటి పన్ను పట్టణంలోని గృహాలకు తాగునీటి సరఫరా తో పాటు నల్లా కనెక్షన్కు సంబంధించినది. లైసెన్స్ ఫీజులు దుకాణాల లైసెన్స్లు, హోటళ్లు, సినిమా థియేటర్ల అనుమతులకు యజమానుల నుంచి కొంత రుసుం వసూలు చేస్తారు. భవన నిర్మాణ అనుమతులు కొత్తగా ఇళ్లు నిర్మించడం లేదా భవనాల ప్లాన్ల ఆమోదానికి వేసే పన్ను. మార్కెట్ అద్దె మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని ఉన్న దుకాణ సముదాయాలు, సంతలు, మాంసపు దుకాణాల ద్వారా అద్దెల రూపంలో ఆదాయం అందుతుంది. జరిమానాలు నిబంధనల ఉల్లంఘన, స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వారికి జరిమానాలు వేస్తారు. వినోదపు పన్ను సినిమా టికెట్లు, ఇతర వినోద కార్యక్రమాల ద్వారా సమకూరే పన్నులోనూ మున్సిపాలిటీకి వాటా ఉంటుంది. స్టేట్ ఫైనాన్స్ నిధులు జనాభా సంఖ్యను బట్టి పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా స్టేట్ ఫైనాన్స్ నిధులను విడుదల చేస్తుంది. టీఎస్పీ (తెలంగాణ స్టేట్ ఫైనాన్స్) పేరిట డబ్బులు విడుదల చేస్తుంది. వాటిని పారిశుద్ధ్యానికి, వివిధ రకాల పరికరాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసిన తర్వాత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏఎస్పీ (అడిషనల్ స్టేట్ ఫైనాన్స్) పేరుతో వచ్చే డబ్బులతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు విడతలుగా జనాభా సంఖ్యను బట్టి మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి ఏప్రిల్ మొదటి వారంలో, డిసెంబర్ చివరలో నేరుగా మున్సిపాలిటీల ఖాతాలో జమవుతాయి. వాటితో వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు అవకాశం ఉంటుంది. ప్లానింగ్, నాన్ ప్లానింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్, మన పట్టణం, ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసి ఆయా వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి వీటిని వినియోగిస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మున్సిపాలిటీల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాల వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మంజూరు చేస్తుంది. వాటిని ఆ వర్గానికి చెందిన వార్డుల్లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక నిధులతో పురపాలికల అభివృద్ధి నూతన పాలక మండళ్లకు సదావకాశం -
హాట్టాపిక్గా ‘దేవాదుల’
సాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ఈ ప్రాజెక్టులో పంపుహౌజ్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటిన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా ఆ వెంటనే మోటార్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటినీ ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్లో అధికారులు శని వారం మోటార్ను ఆన్చేశారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేందుకు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. గోదావరి ఇంటెక్ వెల్కు నేడు సీఎం రేవంత్ దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండడంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయల్దేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో తిరుగు పయనమై హైదరాబాద్ చేరుకుంటారు. దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
విద్యతోనే సమాజంలో గౌరవం
మహబూబాబాద్ రూరల్: విద్య మనల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుందని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కొత్త రెడ్యాల మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ రాజేశ్వర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమావేశాన్ని పరిశీలించి, విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ప్రతీరోజు క్రమశిక్షణ తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలుచిన్నగూడూరు/మరిపెడ: ప్రణాళికతో చదివితే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమని ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా అ సిస్టెంట్ కమిషనర్ మందుల శ్రీరాములు అ న్నారు. చిన్నగూడూరు మండలంలోని జయ్యా రం జెడ్పీహెచ్ఎస్, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను ఆయన శనివారం సందర్శించి టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నమూనా, ఓఎంఆర్ షీట్ వినియోగం, సమయపాలన వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ‘బూస్ట్ అప్’ మోటివేషనల్ సెషన్ నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉపేందర్, స్వామినాథ్, రమాదేవి, అనంతరావు, రామ్మోహన్, జనార్ధనాచారి, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, తదితరులు ఉన్నారు. కేఎంసీకి మరో మైలురాయి ఎంజీఎం: ఎంజీఎం అనుబంధ కాకతీయ మెడికల్ కళాశాల మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 100కు పైగా వైద్య సీట్లతో పాటు ఏటా సూపర్స్పెషాలిటీ సాధించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేఎంసీ కళాశాలకు 10 సూపర్స్పెషాలిటీ సీట్లను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్ పేర్కొన్నారు. 20 రోజుల క్రితం సూపర్స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్టర్లు ఎంజీఎంతోపాటు కేఎంసీలో తనిఖీలు నిర్వహించి నివేదిక కౌన్సిల్కు అప్పగించారు. నివేదిక ప్రకారం.. ఆస్పత్రితోపాటు కళాశాలలో సౌకర్యాలను గమనించి కార్డియాలజీ, కార్డి యోథెరాసిక్, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో రెండు సీట్ల చొప్పున 10 సూపర్ స్పెషాలిటీ సీట్లను మంజూరు చేసింది. 15కు చేరిన సూపర్స్పెషాలిటీ పీజీ సీట్లు కళాశాల నెఫ్రాలజీ విభాగంలో 2023 సంవత్సరం నుంచి ఐదు సూపర్స్పెషాలిటీ సీట్లు కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన పది సీట్లతో కేఎంసీలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఎం వంటి ఆస్పత్రిలో పీజీ సీట్ల మంజూరు వల్ల పేదలకు లక్షలాది రూపాయలు విలువ చేస్తే సూపర్స్పెషాలిటీ సేవలు మెరుగుపడనున్నాయి. రెండు, మూడు నెలలో 2,000 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సూపర్స్పెషాలిటీ మంజూరు కావడంతో వైద్యవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీట్లు మంజూరుపై కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్, ఎంజీఎం సూపరిండెండెంట్ హరీశ్చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
● న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులుదామెర: విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని సింగరాజుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన వడ్డెపల్లి మొగిలి (62) పశువులకు మేత కోసం పచ్చిగడ్డి తీసుకురావడానికి రోజూ ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం బయటకు వెళ్లిన మొగిలి.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రం సమీపంలో విద్యుదాఘాతానికి మొగిలి గురై విగతజీవిగా కనిపించాడు. దాంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. దామెర పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
– హన్మకొండ కల్చరల్
సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..‘ఉపాధి’ లక్ష్యాలు పూర్తి చేయాలి● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. లక్ష్యాల్లో వెనుకబడిన మండలాలు వారం రోజులలోపు ఉపాధి హామీ కూలీల హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ కూలీల సమీకరణ ప్రతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యత అని అన్నారు. ఉపాధి పనుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఉపాధి హామీ పథకంలో మంజూరుచేసిన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న పనులన్నీ వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీపీఓ హరిప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ‘పారువేట’లో వీరభద్రుడు● గుడి చుట్టూ తిరిగిన ఎడ్లబండి కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం వీరభద్రస్వామి(కల్యాణ వీరభద్రుడు) పారువేట(మృగవేట) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెనుగొండ అనిల్కుమార్, తేజశర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంలో స్వామి వారి ఉత్సవమూర్తిని అధిష్టింపజేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం శావపై అర్చకుడు తేజశర్మ నిలుచుని ఉండగా వాహనకారులు శావను మోస్తూ పరుగులు తీశారు. బాదె నాగయ్య బజార్ వద్దకు చేరుకున్నాక శావకు గ్రామస్తులు భక్తులు, మహిళలు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి బిందెలతో నీటిని ఆరబోశారు. బజార్ పెద్ద బాదె నాగయ్య సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, వార్డు సభ్యుడు ఆమెడమల్లికార్జున్, పూజారి అనిల్ను, బజార్ పెద్దలను సత్కరించారు. కార్యక్రమంలో మామిడి కృష్ణ, తొడుసు ఉమేష్, రేషబోయిన వీరన్న, తొడుసు చంటి, చెవుల భరత్కుమార్, రేషబోయిన నరేష్, నిలుగొండ నాగేశ్వర్రావు, అనబత్తుల వీరభద్రం, బాదె సోమయ్య, దూదికట్ల నాగేశ్వర్రావు, దోర్నం వెంకన్న, కొత్తయాకరాజు, రేషబోయిన రాజు, తొడుసు సోమయ్య, పాశం రాములు, తేనే రమేష్, తేనె విక్కి, రచ్చ ఉప్పలయ్య, అప్పాల వెంకన్న, ఆమెడ సత్యం, దోర్నం బిక్షం పాల్గొన్నారు. నేరడ ఎడ్ల బండికి స్వాగతం.. వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రాళ్లు మోసిన కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన రుద్రారపు వంశీయుల మూడు జతల ఎడ్ల బండికి ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. ఎడ్ల బండికి పూలదండలు వేసిన అనంతరం ఆలయం చుట్టూ ఎడ్లబండి ప్రదక్షిణలు చేయడంతో బండ్లు తిరిగే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రుద్రారపు వంశీయులు పాల్గొన్నారు.వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది. – ఇటీవల హనుమకొండలో జరిగిన సంగీతోత్సవంలో కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వయోలిన్ ప్రదర్శన ఇచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు. వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్, సితార్, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్ యన్.సుధీర్కుమార్.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం. సంగీతం శ్యాసకు వ్యాయామం నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతున్నా. సంగీతం శ్వాసకు వ్యాయామం వంటిది. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం సంగీతం క్లాస్కు వెళ్తాను. సంగీతం మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. పనిఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కుటుంబ బంధాలు మెరుగుపడుతాయి. విశ్వాసం, శాంతి పెరుగుతుంది. – డాక్టర్ జ్యోతి హరికీర్తి, మెడికల్ ఆఫీసర్ అనంతలక్ష్మి వైద్య కళాశాల, వరంగల్ అలసటను పారదోలే మార్గం.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అలసట నివారణకు సంగీతం సహాయపడుతుంది. ప్రశాంత సంగీతం కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్మాత్మికత, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. కచేరీలు, ప్రదర్శనల ద్వారా సమాజం పరిచయమవుతుంది. – గాట్ల భార్గవి, మెడికో, కాకతీయ వైద్య కళాశాల యువతకు, పెద్దవారికి సంగీతం, నృత్య కళలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు చేస్తూ.. సాయంత్రం వేళలో హాజరవుతున్నారు. కళల్లో రాణించాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. మా నాన్న నౌడ్గడ హనుమంతరావు ఇక్కడ అధ్యాపకులుగా బోధించారు. నేను ఇక్కడే వయోలిన్ వాయిద్యం కోర్సులో శిక్షణ పొందాను. ప్రస్తుతం నేను కళాశాలకు 11వ ప్రిన్సిపాల్ని కావడం సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాల్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరికొందరు గురుకులాల్లో ఉద్యోగాలు పొందారు. – నౌడ్గడ సుధీర్కుమార్, విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కల నెరవేరింది.. పాఠశాలలో స్పోర్ట్స్ టీచర్గా పనిచేస్తున్నా. 12 ఏళ్ల వయస్సులో పేరిణి నృత్యం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేది. 30 ఏళ్ల వయస్సులో నేర్చుకునే అవకాశం వచ్చింది. నృత్యం నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కళలు సాంస్కృతిక గుర్తింపు, సంగీత సంప్రదాయాలు వారసత్వం కలిగి ఉంటాయి. – చెన్నూరు జీవన్, స్పోర్ట్స్ టీచర్ ●సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల -
విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు
హన్మకొండ: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించని సీఎం రేవంత్రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించే అర్హత లేదని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. హనునుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని, చుక్క నీరు ఇవ్వలేదని తూర్పారబట్టారు. దేవాదుల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి జిల్లా రైతులను కాంగ్రెస్ మోసం చేసి గెలిచిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రుల వైఫల్యం దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒక్క పంపుహౌస్ కూడా సరిగా నడపలేకపోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిపడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు పర్యటనతో ప్రభుత్వం నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. గోదావరి నదిలో సరిపడా నీళ్లు ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంతో గోదావరి నీళ్లు రైతులకు అందించడం లేదని విమర్శించారు. 90 శాతం ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేస్తే రెండున్నరేళ్లుగా ఒక్క శాతం పని కూడా రేవంత్ రెడ్డి సర్కారు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్పై విమర్శలు చేయడానికే ముఖ్యమంత్రికి, మంత్రులకు రెండేళ్లు సరిపోయిందని ఎద్దేవాచేశారు. ఇప్పుడేమో విహార యాత్రకు వస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ వెంట నాయకులు పులి రజనీకాంత్, జోరిక రమేష్, రామ్మూర్తి, రఘు, తదితరులు ఉన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయీ కేటాయించని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి -
కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
● మరియన్న మహబూబాబాద్ రూరల్ : కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా ఉద్యా న, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మహబూబాబాద్ మండలం పరిధిలోని ఆయిల్ పామ్, మిరప, కూరగాయల పంటలను మల్యాల కేవీకే ఉద్యానశాస్త్రవేత్త సుహాసిని, ఉద్యాన విస్తరణ అధికారి రమేష్, బిందు సేద్యం ప్రతినిధి ఆగస్టీన్తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంతర పంటలుగా, డాబాల మీద, పెరటిలో, ఇంటిముందు, పొలం గట్ల మీద కూరగాయ ల పండించుకోవచ్చని తెలిపారు. వేసవిలో వంగ, దోస, సొర, గోరు చిక్కుడు, బెండ, ఆకు కూరలు, మునగ, షేడ్ నెట్ల కింద టమాట, కీర మొదలైన పంటల సాగు ద్వారా ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. జిల్లాలో 5 వేల ఎకరాలకు పైగా కూరగాయల సాగు చేస్తున్నారని తెలి పారు. కూరగాయల సాగుకు పందిళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీతోపాటుగా ఎకరానికి రూ.10 వే ల విలువైన కూరగాయల నారు అందిస్తున్నారు. సర్పంచ్ ఈశ్వరీశంకర్, మాధవాపురం మాజీ సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న, రైతులు పాల్గొన్నారు. -
దేవన్నపేట వద్ద నీళ్లు ఎత్తిపోస్తున్నారు
హసన్పర్తి: దేవాదుల నుంచి ధర్మసాగర్ చెరువులోకి నీళ్లు ఎత్తిపోస్తున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా దేవన్నపేట వద్ద పంపుహౌజ్ను నిర్మించారు. గంగారం నుంచి టన్నల్ ద్వారా దేవన్నపేటలోని పంపుహౌజ్లోకి నీరుచేరిన తర్వాత సుమారు 150మీటర్ల లోతు నుంచి మోటార్ల ద్వారా నీటిని ధర్మసాగర్లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు దేవన్నపేట వద్ద నిర్మించిన పంపుహౌజ్ వద్ద మూడు మోటార్లు బిగించారు. ఒక్కో మోటారు సుమారు రోజుకు 530 క్యూసెక్కుల నీటిని తోడుతుంది. వారం రోజులు పాటు నిరంతరంగా ఒక మోటారును రన్ చేస్తే చెరువు మట్టం గరిష్టస్థాయికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యతో నిలిచిన పంపింగ్ ఇటీవల మోటార్లలో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల చెరువులోకి నీటి పంపింగ్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ముంబాయిలోని సాంకేతిక నిపుణులకు కబురు పంపారు. అలాగే, దేవన్నపేట పంప్హౌజ్ను మాజీ మంత్రి హరీష్రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. సమస్య పరిష్కారం అనంతరం శనివారం ఉదయం మోటార్లు ఆన్చేసి ధర్మసాగర్ చెరువులోకి నీటి పంపింగ్ను అధికారులు ప్రారంభించారు.సాంకేతిక కారణాలతో పంపింగ్ నిలిచిపోయిందిసాంకేతిక కారణాల వల్ల పంపింగ్ నిలిచిపోయింది. ముంబాయి నుంచి సాంకేతిక నిపుణులు శుక్రవారం రాత్రి వచ్చి సమస్యను పరిష్కరించారు. అనంతరం నీటిని చేరువులోకి విడుదల చేశాం. ప్రస్తుతం ఒక మోటారు నడుస్తోంది. – మంగీలాల్, ఈఈ, నీటిపారుదల శాఖ -
చరిత్ర.. భవిష్యత్కు దృఢమైన పునాది
కేయూ క్యాంపస్: చరిత్ర అనేది గతాన్ని నమోదు చేసే ప్రక్రియ మాత్రమే కాదని, వాస్తవ ఆధారాలపై నిలిచే పరిశోధన ద్వారానే భవిష్యత్కు దృఢమైన పునాది వేయవచ్చని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న 9వ వార్షిక తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం.. కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో శనివారం ప్రారంభమైంది. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రామచంద్రం మాట్లాడుతూ వరంగల్ నగరం తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. కాకతీయుల కళాసంపద నుంచి ఆధునిక సామాజిక ఉద్యమాల వరకు ఈ నేల చరిత్రకు సాక్ష్యమని వివరించారు. సోషల్సైన్స్ డీన్ ప్రొఫెసర్ సురేష్లాల్ మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన సమాజాల చరిత్రలను వెలికితీయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకట్రాజం, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంకం జయప్రకాశ్ మాట్లాడుతూ 2007వ సంవత్సరం నుంచి సంస్థ విస్తృత వ్యాప్తికి కృషి చేస్తున్నామని, ఈ సంస్థలో 400 మందికి పైగా శాశ్వత సభ్యులున్నారని తెలిపారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ, కేయూ హిస్టరీ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ దయాకర్, ప్రొఫెసర్ పాండ్య భూక్య, సిక్కిం యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్, ప్రొఫెసర్ దయాకర్రావు, ప్రొఫెసర్ రాజశేఖర బాబు, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ వన్నం, ప్రొఫెసర్ బండి శ్రీనివాస్, ప్రొఫెసర్ మనోహర్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వార్షిక సమావేశాల నివేదికను అతిథులు ఆవిష్కరించారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ప్రారంభం -
పెరిగిన మొక్కజొన్న.. తగ్గిన మిరప
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగుజోరు కొనసాగుతోంది. గత యాసంగి సాగుతో పోలిస్తే ఈ ఏడాది 40 వేల ఎకరాలు అదనంగా సాగవుతోంది. వానాకాలం పంట ల పనులు పూర్తి చేసిన రైతులు ప్రస్తుతం యాసంగి సాగు పనులు ప్రారంభించారు. జిల్లాలోని రైతులు యాసంగి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, వరి, పచ్చజొన్న, పెసర, బొబ్బెర, ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. సాధారణంగా యాసంగి సీజన్ వేసవి ప్రారంభంలోనే మొదలవుతుంది. దీంతో కొన్నిసా ర్లు సాగునీటికి ఇబ్బంది ఉంటుంది. ఈనేపథ్యంలో రైతులు ఎస్సారెస్పీ జలాల విడుదల, వ్యవసాయ బావులు, బోర్లలో నీటి లభ్యతకు అనుకూలంగా పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మిరపకు కుళ్లుతెగులు.. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే మిరపకు తెగుళ్లు సోకడంకూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గతేడాది మిరప పంటకు నల్లి, పలు రకాల తెగుళ్లు సోకడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాదిలో 48,036 ఎకరాల్లో మిరప సాగు జరుగగా ఈ ఏడాది 39,859 ఎకరాల్లో మాత్రమే మిరప సాగులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మిరప సాగు చేసిన రైతులు ఆ స్థానంలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అయితే పలువురు రైతులు తక్కువ రోజుల పంటకాలం కలిగిన మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. పెరిగిన మొక్కజొన్న సాగు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 వేల ఎకరాలకుపైగా మొక్కజొన్న సాగు పెరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది 61,060 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగగా మిరపతోపాటుగా ఇతర పంటల సాగు స్థానాల్లో ఈ ఏడాది యాసంగిలో రైతులు 1,03,774 ఎకరాల మేరకు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది 42,214 ఎకరాల మేరకు మొక్కజొన్న సాగు పెరిగింది. ఇక వరి విషయానికొస్తే గత ఏడాదిలో 1,50,640 ఎకరాల్లో యాసంగి వరి సాగు జరుగగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,36,526 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వరి సాగు మరికొద్ది రోజుల్లో 1.60 లక్షల వరకు పెరగనుందని అధికారుల అంచనా. వరి, మొక్కజొన్నతోపాటు జిల్లాలో పచ్చజొన్నలు 411 ఎకరాల్లో, మినుములు 466 ఎకరాల్లో, బొబ్బెర్లు 1,167 ఎకరాల్లో, పెసర 1,635 ఎకరాల్లో, కందులు 15 ఎకరాల్లో, వేరుశనగ 727 ఎకరాల్లో సాగవుతున్నాయి. యాసంగిలో రైతులు మొక్కజొన్న, ఇతర పంటలతో పాటుగా ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్ల పంటలను సైతం సాగు చేస్తున్నారు. జిల్లాలో జోరుగా యాసంగి పంటల సాగు ఆరుతడి పంటలపై రైతుల ఆసక్తి మరింత పెరగనున్న వరి సాగు విస్తీర్ణం -
కమనీయం.. ప్రతిష్ఠాపనోత్సవం
భూపాలపల్లి / రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. శనివారం తెల్ల వారుజామున 4 గంటలకు ఆలయం ముందు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం 9గంటలకు ఆరాధన సేవాకాలం, ద్వారతోరణం పూజ, చతుఃస్థానార్చన, హోమం, మహా పూర్ణాహుతి, 9.41 గంటలకు ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 60 మంది వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీనరసింహాస్వామి, మహాలక్ష్మి, ఆండాళ్ ఆళ్వార్ల ప్రతిష్ట, నాగేంద్ర సంవలిత, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం, మహా కుంభాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.12.15 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సహకారంతో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ ఈఓ మహేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన చినజీయర్ స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు -
నిరంతర సాధనతో విజయావకాశాలు
వరంగల్ స్పోర్ట్స్: అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు తోడు సరైన శిక్షణ, నిరంతర సాధనతో క్రీడాకారులు విజయ తీరాలకు చేరుకుంటారని ఎన్ఐటీ వ్యాయామ విద్య ప్రొఫెసర్ రవికుమార్ అన్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో రెండు రోజులుగా కొనసాగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా శనివారం హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఆహార నియమావళి పాటిస్తూ వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అథ్లెటిక్స్లో ఘనమైన చరిత్ర ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్ రెడ్డి, కిషన్, మహేష్బాబు, సీఏ రాజు, ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాధికారి కిస్టు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లాక్రీడాకారుల ప్రతిభఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ అండర్–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో వరంగల్ క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. రికర్వ్ బాలుర విభాగంలో ఏ.వెంకటేష్ వెండి పతకం గెలుచుకున్నారు. రికర్వ్ బాలికల విభాగంలో బి.కృపారాణి ప్రతిభ చాటారు. నిట్ ప్రొఫెసర్ రవికుమార్ -
అరుదైన శతావధాన ప్రక్రియ ఇది
అవధానం అనేది కేవలం ఒక విద్యే మాత్రమే కాదు.. బహువిద్యల సమాహారం. అది ఒక మహావిద్య. ఏకకాలంలో అనేక అంశాలపై మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఉండడమే అవధాన విద్య. సాహిత్యంలో అరుదైన శతావధానం ప్రక్రియ ఇది. ఐదేళ్ల క్రితం అవధాన రంగంలోకి ప్రవేశించా. శతావధానం కోసం గత కొంతకాలంగా సాధన చేస్తున్నా. సఫలీకృతుడనవుతానని గట్టి నమ్మకం ఉంది. – చేపూరి శ్రీరాం, అవధాని, ఉపాధ్యాయుడువేలేరు గురుకుల టీచర్కు అరుదైన అవకాశంవేలేరు: వేలేరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్ కుమ్మరి ఓదెలుకు అరుదైన అవకాశం లభించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 22, 23, 24వ తేదీల్లో జరగనున్న శతావధాన మహోత్సవంలో ఆయన పాల్గొని తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలు, సాహిత్య ప్రకియల్లో భాగమైన పద్యాలపై ఏకాగ్రత, ధారణ, జ్ఞాపకశక్తి, సాహిత్య పాండిత్యాలకు ప్రతీకగా నిలిచే అవధాన ప్రక్రియల్లో ఒకటైన ఆశువు అనే అంశంపై పృచ్ఛకుడిగా పాల్గొననున్నారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని, నాణ్యమైన డైట్ మెనూ పాటి ంచాలన్నారు. ప్రత్యేక అధికారులు మండలాల వా రీగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు తనిఖీ చేసి ఉత్త మ ఫలితాలు సాధించడం కోసం వార్డెన్లు, ప్రిన్సిపాల్స్కు తగిన సూచనలు చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలే ముఖ్యం.. కురవి: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిని పరిశీలించారు. కంప్యూటర్ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థినులను పరిశీలించారు. స్టడీ అవర్స్ను పెంచాలని సూచించారు. నాణ్యమైన మెనూ పాటించాలని, పిల్లలకు షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయి ంచాలని తెలిపారు. తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పిల ్లలకు డిజిటల్ తరగతులను అర్థమయ్యే రీతిలో బోధించాలని తెలిపారు. హెచ్డబ్ల్యూఓ సునీత, హెచ్ఎం బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నైపుణ్యంతో పరీక్షలు నిర్వహించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: ల్యాబ్ టెక్నీషియన్లు వ్యాఽధి నిర్ధారణలో నైపుణ్యం పెంపొందించుకుని సమయానికి పరీక్షలు నిర్వహించడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు అనుమానిత క్షయ రోగుల శ్లేష్మం సేకరణ, పరీక్షల నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. క్షయవ్యాధి నిర్మూలనలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమన్నారు. స్మియర్ మైక్రోస్కోపి, సీబీ నాట్ పరీక్షలు, బయోసేఫ్టీ నియమాలు, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణకు సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజ య్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, నీలిమాశ్వేత, అశోక్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. టెన్త్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో మార్చి 14నుంచి ఏప్రిల్ 16వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలపై సీఎస్, డీఓఎస్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామని, తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్నపత్రాల రవాణా, సీలింగ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పరీక్ష కేంద్ర వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. సీఎస్, డీఓఎస్, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యే విధంగా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, పరీక్షల టైం టేబుల్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగ అధికారి మందలు శ్రీరాములు, డీఎస్ఓ అప్పారావు, సీఎస్ఓ, డీఓఎస్లు తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతరపై పుస్తకం విడుదల ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. మార్చి 5న జాబ్మేళా ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో మార్చి 5న హనుమకొండలోని గిరిజన భవన్లో జాబ్మేళాను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు. గిరిజన నిరుద్యోగులు మార్చి 5న ఉదయం 10గంటలకు హనుమకొండ గిరిజన భవన్కు బయోడెటా, సర్టిఫికెట్స్ను నేరుగా తీసుకొని హాజరు కావాలని కోరారు. -
ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
● డీఐఈఓ మదార్గౌడ్ మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 25నుంచి ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈఓ మదార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్, డీఎస్ఓలు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ హాజరై మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరంలో 4,158మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 4,129 మంది మొత్తం 8,287మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తుతో పాటు 144సెక్షన్ అమలులో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘా మధ్య పరీక్షలు జరుగుతయన్నారు. విద్యార్థులు కళాశాల లాగిన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రంలోని సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావొద్దని, ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలన్నారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, సీఎస్, డీఎస్ఓ, డీఓలు పొక్కుల సదానందం, శ్రీనివాస్రావు, కుమార్, గణేష్, నయీమ్పాషా తదితరులు పాల్గొన్నారు. -
భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు
● రూ.5వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు భూపాలపల్లి అర్బన్: ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయస్థానంలో లంచావతారులు ర్యాజ మేలుతున్నారు. వివిధ కేసులతో కోర్టుకు వస్తున్న వారిని కొంతమంది అధికారులు, సిబ్బంది లంచా ల కోసం వేధిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బాధితుడి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటున్న ఇన్చార్జ్ ఏఓ, స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయిచరణ్, ఆఫీస్ సబార్డి నేట్లు పున్నం రజిత, కొమ్ము సునీతను ఏసీబీ అధి కారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ రైతుకు కర్కపల్లి శివారులో 14.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని పక్కనే ఉన్న రైతు 1984 వ సంవత్సరంలో భూ రికార్డులోకి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 1985 సంవత్సరం నుంచి బాధిత రైతు కోర్టు చుట్టు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 2025 అక్టోబర్ 25న వాదనలు విన్న భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధిత రైతుకు భూమి వర్తించేలా తీర్పు వెల్లడించారు. ఈ క్రమంలో సర్టిఫై కాపీ కోసం కోర్టులో సంబంధిత విభాగం అధికారి సాయిచరణ్ వద్దకు వచ్చి వెళ్తున్నాడు. రూ.20 వేలు ఇస్తేనే సర్టిఫై కాపీ ఇస్తామని ఈనెల 10న ఆయన తేల్చిచెప్పాడు. బాధిడుతు ఏసీబీ అధి కారులను ఆశ్రయించి వారి సూచన మేరకు శుక్రవా రం రైతు డబ్బులు ఇచ్చేందుకు సాయిచరణ్ వద్దకు వెళ్లి సర్టిఫై కాపీ అడిగాడు. దీంతో అటెండర్లకు డబ్బులు ఇచ్చిన కాపీ తీసుకెళ్లమని సూచించాడు. అటెండర్లు రజిత, సునీతకు డబ్బులు అందజేస్తుండగా.. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం వీరిని శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు, పి.ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
కారు ఢీకొని యువకుడి దుర్మరణం మహబూబాబాద్ రూరల్ : కారు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామ శివారు ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దీపిక శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామ శివారు పుట్లంపాడు తండాకు చెందిన మాలోతు నరేష్ (28) జిల్లా కేంద్రంలో వివిధ కూలీ పనులు చేస్తూ కుటుంబంతో నివాసముంటున్నాడు. ఈక్రమంలో అవసరం నిమిత్తం స్వగ్రామమైన పుట్లంపాడు తండా గురువారం వెళ్లి తిరిగి బైక్ పైనే మానుకోటకు వస్తున్నాడు. ఈక్రమంలో జమాండ్లపల్లి గ్రామ శివారు ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు నరేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అతడిని వారి తండాకు చెందిన అజ్మీరా భరత్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతిచెందాడు. నరేష్ భార్య కల్పన ఫిర్యాదు మేరకు రూరల్ హెడ్ కానిస్టేబుల్ తుంగ పిచ్చయ్య కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారని ఎస్సై తెలిపారు. వనపర్తి శివారులో.. లింగాలఘణపురం: మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డు వనపర్తి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బోయిని కొంరయ్య (62) అక్కడికక్కడే మృతిచెందగా.. కొడకండ్ల మండలం నీలిబండతండాకు చెందిన అంగోతు రమేష్కు గాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంరయ్య, రమేష్ ద్విచక్ర వాహనంపై జనగామ నుంచి కొడకండ్లకు వెళ్తుండగా కొడకండ్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న వి.శ్రీనివాసురెడ్డి కారు బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కొంరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ర మేష్ గాయపడగా.. 108 అంబులెన్స్లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ద్విచక్రవాహనంపై నుంచి పడి.. చెన్నారావుపేట: శుభకార్యానికి ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లింగగిరి గ్రామానికి చెందిన ఓరుగంటి నర్సింగరాములు (65) కందిగడ్డతండాకు ఓ శుభకార్యానికి హాజరుకావడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో నెక్కొండ– గూడూరు ప్రధాన రహదారిపై వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్రెడ్డి తెలిపారు.బావిలో పడి వృద్ధురాలు.. సంగెం: లేగదూడకు గడ్డి తేవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రా ధమ్మ(75) గురువారం లేగదూడకు గడ్డి తేవడానికి ఇంటి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. వ్యవసాయ పనులకు వెళ్లిన కుమారుడు, కోడలు వచ్చేసరికి రాధమ్మ కనిపించకపోవడంతో వెతకడం ప్రా రంభించారు. బావి పరిశీలించగా.. శవమై కన్పించింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బైక్ను లారీ ఢీకొని వ్యక్తి.. ఖిలా వరంగల్: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈఘటన శుక్రవారం ఉదయం మామునూరు పోలీస్ స్టేషన్ పరిధి ఐనవోలు కామన్ వైన్ షాపు ఎదుట చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన చిదురాల కొమురయ్య (52) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు వారీగా బైక్పై శుక్రవారం ఉదయం గర్మిళ్లపల్లి గ్రామం నుంచి వరంగల్కు బయల్దేరాడు. ఈక్రమంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఐనవోలు కామన్ వైన్ షాపు ఎదురు చేరుకోగానే వర్ధన్నపేట వైపు నుంచి వరంగల్ వైపు వచ్చే రాజస్థాన్ రాష్ట్రం జావుర జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ లాల్పదం అతివేగంగా వెళ్తూ అదపు లారీతో బైక్ను ఢీకొట్టడంతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య చిదురాల దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మానుకోట, లింగాలఘణపురంలో కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. బావిలోపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. బైక్పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వైభవోపేతంగా రథోత్సవం
● రథంపై ఊరేగిన వీరభద్రుడు ● తరలివచ్చిన భక్తజనంకురవి: మండల కేంద్రంలో భద్రకాళీ సమేత వీరభద్రుడు శుక్రవారం రాత్రి రథంపై ఊరేగారు. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై కల్యాణ వీరభద్రుడు.. భద్రకాళీ అమ్మవారి సమేతంగా పూజలు అందుకుని నెలవంక సాక్షిగా రాత్రి 8.30 గంటలకు రథంపై గ్రామ సేవకు కదలివెళ్లారు. ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు అభిలాష్, విజయ్, తేజ వేద మంత్రోచ్ఛరణలను పఠిస్తూ 7గంటలకు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఆలయ పూజారులు విజయ్, విజయ్కుమార్, తేజ, అభిలాష్, పుణ్యమూర్తి ఛండీశ్వరుడిని తీసుకొచ్చి అగ్నిహోమం, వాస్తు పూజలు చేశారు. చొప్పను మంటలో వెలిగించి రథం చుట్టూ తిప్పి ఊరు చివరన వదిలేశారు. పూజారి అనిల్కుమార్ శావపై నిలబడి రథం వద్దకు మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ స్వామివారిని తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసిన అనంతరం రథంపై అధిష్టింపజేశారు. విజయ్కుమార్ దిష్టికుంభం పూజ చేశారు. ఈఓ సత్యనారాయణ, చైర్మన్ రవీందర్రెడ్డి అర్చకుడు విజయ్కుమార్ గుమ్మడికాయలు కొట్టారు. భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివారి రఽథాన్ని ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, మరిపెడ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాలం సునీతారవీందర్రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, ఉప్పలయ్య, శక్రునాయక్, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్రావు, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్, ఏఎస్సై వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్కుమార్, నాయకులు అవిరె మోహన్రావు, దైదభద్రయ్య, బాదె శ్రీనివాస్, బుడమ సురేష్, తాళ్లూరి లక్ష్మీనారాయణ, శ్యామల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సంగెం భరత్, దుడ్డెల వినోద్, దడిగల రవి లాగారు. హైదరాబాద్కు చెందిన భక్తులు రథానికి పూలతో అలంకరణ చేశారు. రథాన్ని గ్రామ పంచాయతీ వరకు తీసుకొచ్చారు. గ్రామస్తుల పూజల అనంతరం రథాన్ని తిరిగి ఆలయం వరకు తీసుకొచ్చారు. -
మోంథా పరిహారమేది..?
బయ్యారం: జిల్లాలో గత అక్టోబర్లో కురిసిన మోంథా తుపాను ప్రభావంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. 3,570.85 హెక్టార్లలో పంట నష్టం జరగగా.. సర్వే చేసిన వ్యవసాయశాఖ అధి కారులు 11,611 మంది రైతులకు రూ.8.82కోట్ల చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. అయితే నాలుగు నెలలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు బాధిత రైతులకు పరిహారం చెల్లించలేదు. అసలు డబ్బులు ఇస్తారా లేదా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. వాగుల ప్రవాహంతో.. గత ఏడాది అక్టోబర్ 28,29వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆకేరు, పాకాల వాగులతో పా టు పలు వాగుల వెంట ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల కోతకు వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులకు అపార నష్టం సంభవించింది. దెబ్బతిన్న పంటలను పరి శీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టం వివరాలు నమోదు చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నీటమునిగిన పంట మధ్యలో కౌలు రైతు విజయ్(ఫైల్) తుపానుతో 3,570.85 హెక్టార్లలో పంటనష్టం అంచనా జిల్లాలో 11,611మంది రైతులకు అందని పరిహారం ‘పై ఫొటోలోని రైతు దోమకొండ విజయ్. బయ్యారం సమీపంలోని పాకాల ఏటి ప్రాంతంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు. తుపాను, వరదతో పంట మొత్తం నీటమునిగి పోయింది. దీంతో ఎకరానికి 8 బస్తాల ధాన్యం కూడా దిగుబడి రాలేదు. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.’ -
కదలరు.. మెదలరు
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పోలీస్శాఖలో సుదీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ● పట్టణ పరిసర ప్రాంతంలోనే తిష్ట ● పరిచయాలతో నేరాల ఛేదనలో నిర్లక్ష్యం ● బదిలీల ప్రచారంతో అనుకూల ప్రాంతాలకు ప్రయత్నాలుసాక్షి, మహబూబాబాద్: పోలీస్శాఖలో కొందరు అధికారులు ఒకే ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ.. కదలకుండా.. మెదలకుండా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఎక్కువ కాలంలో ఒకే ప్రాంతంలో పనిచేసిన పరిచయాలు పెరిగి.. నేరాలను ఛేదించడంలో వెనకబడి ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత బదిలీల ప్రక్రియ ఉంటుందనే వార్తలు రావడంతో తమకు అనుకూలమైన ప్రాంతాలకు ట్రాన్స్పర్ చేయించుకునేందుకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద పైరవీలు మొదలు పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘకాలంగా తిష్ట.. చట్టం దృష్టిలో అందరూ సమానమే.. అందుకోస మే స్నేహం, బంధుప్రీతి ఉండవద్దనే ఆలోచనతో ఎస్సైలను రెండేళ్లు లేదా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉంది. అయితే జిల్లాలో మాత్రం కొందరు అధికారులు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉ న్నాయి. జిల్లాలోని రెండు సబ్ డివిజన్లు, ఎనిమిది సర్కిల్ ఆఫీసులు, 19 పోలీస్ స్టేషన్లు, డీసీఆర్బీ, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్పీ, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ మొదలైన విభాగాలకు కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు. అయితే ఇందులో ఎస్సై పోస్టుల వరకు స్థానిక ఎస్పీ పరిధికి లోబడే బదిలీలు ఉండడంతో.. అధికారుల అనుకూలత అధారంగా పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంది. దీనిని అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు జిల్లాలోని పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలోని స్టేషన్లకే బదిలీ చేయించుకోవడం.. కొంతకాలం తర్వాత మళ్లీ అదే పోస్టుకు రావడం పరిపాటిగా మారిందనే ప్రచారం. పరిచయాలు పెరగడంతో.. జిల్లాలోని కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సుదర్ఘీకాలంగా పలువురు అధికారులు, సిబ్బంది పనిచేయడంతో అక్కడ పరిచయాలు పెరిగి.. పోలీసింగ్లో ఇబ్బందులు అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి రాజ కీయ నాయకులు, వారి అనుచరులు, బెల్లం, బి య్యం, మట్టి, ఇసు క, కల ప, గంజాయి మొదలైన వ్యాపారులతో పరిచయాలు పెరిగి.. నేరాలు జరిగినప్పుడు కూ డా పట్టించుకోకపోవడ ం.. మామూళ్లు తీసుకొని మౌన ంగా ఉండడం, తప్పని పరిస్థితి అయితేనే కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే సమీపంలోని పాత, కొత్త పోస్టుల్లో పనిచేయడంతో.. పరిధి దాటి పనిచేయడం, పరిధి విషయంలో పలు స్టేషన్ల ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరగడం, అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన ఘటనలు ఉన్నట్లు ప్రచారం. బదిలీల వార్తతో పైరవీలు.. ఇటీవల గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారుల బదిలీలు అనివార్యం అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సమీప స్టేషన్లోనే పోస్టింగ్ తెచ్చుకునేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే జిల్లా ఉన్నతాధికారి మాత్రం ఈ విషయంపై అధికారులందరి సర్వీస్ వివరాలు సేకరించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. ఈ పరిస్థితిలో బదిలీలు ఉంటాయో.. ఉంటే ఏ విధంగా జరుగుతాయో.. కొత్త సార్ మార్కు ఎలా ఉంటుందో అనేది పోలీస్ శాఖతోపాటు, జిల్లా ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. -
రద్దీ.. కాలుష్యం
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య ఖిలా వరంగల్: వరంగల్ మహా నగర ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరిగి వాయుకాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా 2020 మార్చి నుంచి 2026 జనవరి 31 వరకు వాహనాల సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు సమాచారం. కారు, బైక్ నిత్యావసర వస్తువులుగా మారడమే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇళ్ల నుంచి బయల్దేరేవారిలో ఎక్కువమంది సొంతవాహనాలపైన వస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ట్రైసిటీలోనే 3 లక్షల వాహనాల సంచారం వరంగల్ ట్రైసిటీలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. ఇతర జిల్లాలతోపాటు నగర పరిధిలోని వాహనాలు మొత్తం 3లక్షలకు పైగా నగర రహదారులపై తిరుగుతున్నాయి. ప్రధానంగా వరంగల్ హెడ్ఫోస్టాఫీస్, వెంకట్రామ, ఖిలావరంగల్ పెట్రోల్ బంక్, గవిచర్ల, ఎంజీఎం, పోచమ్మమైదానం, ములుగు రోడ్డు, పోలీస్ హెడ్క్వాటర్, కేయూ, అదాలత్ జంక్షన్, కలెక్టరెట్, వడ్డెపెల్లి క్రాస్, కాజీపేట జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు వాహనాలు నిలిచినప్పుడు ఎక్కువగా వాయు కాలుష్యం జరగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15ఏళ్లు దాటిన సుమారు 50వేల వాహనాలు రహదారులపై సంచరిస్తున్నట్లు అంచనా.. 15ఏళ్లు దాటిన వాహనాల వల్ల అధికంగా కాలుష్యం జరగుతుంది. కావున వీటిని గుర్తించి సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అమలు శూన్యం కాలుష్య ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అనేక వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతున్నాయి. ఫలితంగా ప్రజలు కాలుష్యం పెరుగుతోంది. కొన్ని వాహనాల నుంచి నల్లని దట్టమైన పొగ వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఉమ్మడిజిల్లాలో పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. డీజిల్తో నడిచే వాహనాలు పెట్రోల్ వాహనాల కంటే ఏడు శాతం అదనంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ప్రధానంగా ద్విచక్రవాహనాలు 36శాతం, ఆటో రిక్షాలు 30శాతం, బస్సులు, లారీలు, టాటాఏస్, ట్రక్కులు తదితర 34 శాతం కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యంతో జనాల ఉక్కిరిబిక్కిరి నిత్యావసర వస్తువులుగా కారు, బైక్ ట్రై సిటీలో పెరిగిన వాహనాల రద్దీ శ్వాసకోశ వ్యాధులబారిన ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు ఉమ్మడి జిల్లాలో వాహనాల సంఖ్య జిల్లా వాహనాలు వరంగల్ 2,60 656 హనుమకొండ 3,12,747 జనగామ 89,575 జే.ఎస్ భూపాలపల్లి 1,26,939, ములుగు 18,200 మహబూబాబాద్ 1,42,199 -
హోలీ పండుగకు ప్రత్యేక రైలు సర్వీసులు
కాజీపేట రూరల్: హోలీ పండుగ నేపథ్యంలో కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి–దానాపూర్, యశ్వంత్పూర్–హజరత్ నిజాముద్దీన్ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. చర్లపల్లి–దానాపూర్ మధ్య 12 రైళ్లు ఈ నెల 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో చర్లపల్లి– దానాపూర్ (07091)ఎక్స్ప్రెస్, ఈ నెల 25, మార్చి 1, 5, 9న దానాపూర్–చర్లపల్లి (07092) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈ నెల 28న చర్లపల్లి–దానాపూర్ (07093) వెళ్లే ఎక్స్ప్రెస్, మార్చి 3న దానాపూర్–చర్లపల్లి(07094) వెళ్లే ఎక్స్ప్రెస్, మార్చి 1న చర్లపల్లి–దానాపూర్ (07095) వెళ్లే ఎక్స్ప్రెస్, మార్చి 3న దానాపూర్–చర్లపల్లి (07096) వెళ్లే ఎక్స్ప్రెస్లకు కాజీపేట జంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చాందాఫోర్ట్, గోండియా, బాల్ఘట్, నాన్పూర్, జబల్పూర్, సంత, మానిఖ్పూర్, ప్రయాగ్రాజ్, చౌకి, పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, అరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. యశ్వంత్పూర్– హజరత్నిజాముద్దీన్ మధ్య ఈ నెల 25వ తేదీన యశ్వంత్పూర్– హజరత్నిజాముద్దిన్ (06569) వెళ్లే ఎక్స్ప్రెస్, మార్చి 1న హజరత్నిజాముద్దిన్– యశ్వంత్పూర్ (06570) వెళ్లే ఎక్స్ప్రెస్లకు ఝెలహంక, ధర్మవరం, అనంతపూర్, దోన్, కర్నూల్సిటీ, కాచిగుడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, బోపాల్, బీనా, విరాన్గణ, లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మాథుర జంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. -
పరిజ్ఞానాన్ని రైతులకు వివరించాలి
● డీఏఓ బి.సరిత మహబూబాబాద్ రూరల్: ఇన్పుట్ డీలర్లు శిక్షణలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని డీఏఓ బి.సరిత అన్నారు. దేశీ ఇన్పుట్ డీలర్ల 2025–26 కోర్సు శిక్షణను మహబూబాబాద్ రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. డీఏఓ బి.సరిత శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి ఎంపికై న 40మంది అగ్రి ఇన్పుట్ డీలర్లకు 48 ారాల పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. వారంలో ఒకరోజు చొప్పున 40వారాలు తరగతి శిక్షణ, ఎనిమిది క్షేత్ర సందర్శనలు చేపట్టి, పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి డిప్లొమా సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. కేవీకే మల్యాల ప్రధాన శాస్త్రవేత్త బి.దిలీప్ కుమార్, వ్యవసాయ సహాయక సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఓ టెక్నికల్ రాంజీ, కురవి ఏఓ నరసింహారావు, దేశీ ప్రోగ్రాం బ్యాచ్ ఫెసిలిటేటర్ రామచంద్రరావు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇన్ పుట్ డీలర్లు పాల్గొన్నారు. -
కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి
ప్రతీ వాహనానికి కాలుష్య ధ్రువీకకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం ఈ–చలానా ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. వాహన కండిషన్ పరీక్షించుకోవాలి. తనిఖీల్లో పట్టుపడితే భారీ జరిమానాలతో చర్యలు చేపట్టాలని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లకు సూచిస్తున్నాం. –సురేశ్రెడ్డి డీటీసీ, వరంగల్, హనుమకొండ వాయుకాలుష్యంతో ఇబ్బందే..ప్రస్తుతం వాహన కాలుష్యం విపరీతంగా పెరిగింది. కాలుష్య గాలిని పిల్చడం ద్వారా ఊపిరితిత్తులు, గుండె, రక్తనాలాలు అనారోగ్యానికి గురవుతాయి. ప్రధానంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ కూరపాటి మధు, ఎండీ, డీఎన్బీ, వరంగల్ -
అతి చేస్తున్న పోలీసులను వదలిపెట్టం
తొర్రూరు: ప్రస్తుతం అతిచేస్తున్న పోలీసులను వది లిపెట్టే ప్రసక్తే లేదని తమ ప్రభుత్వం వచ్చిన త ర్వాత అలాంటివారికి గుణపాఠం తప్పదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జనగామ జి ల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలను వదిలిపెట్టి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు, కమీ షన్ల కోసం కొట్లాడుతున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, అభివృద్ధి పనులు ఏమి చేపట్టాల ని ఆలోచనతో పాలన సాగించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాంగా న్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అతి చేస్తున్న పోలీసులను గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే ఉన్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు, వైస్ చైర్మన్లను చేసుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని, త్వరలో ఆయా ము న్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండాలు ఎగిరేయడం ఖాయమన్నారు. అనంతరం తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు -
అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారులకు కావాల్సిన వసతులను సమకూరుస్తూ, వారిని అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అతిథులుగా హాజరై క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతు ప్రతిభ ఉండి ప్రోత్సాహం కరువైన క్రీడాకారుల కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో అతిథి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. భవిష్యత్లో క్రీడాభివృద్ధికి మరింత కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, గట్టు మహేశ్బాబు, డాక్టర్ పింగిళి రమేశ్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జేఎన్ఎస్లో సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు షురూ -
అమ్ముకోలేక.. పారబోయలేక
కొత్తగూడ: ఆరుగాలం కష్టించి పండించిన టమాటను మార్కెట్లో అమ్ముకోలేక.. పారబోయలేక రైతులు అంగడిలో ఉచితంగా పంచి పెట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని అంగడిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన నలుగురు రైతులు టమాట సాగు చేశారు. పండించిన టమాటను కూలీలతో తెంపించి వంద బాక్సులు తీసుకుని తెల్లవారుజామున నర్సంపేట కూరగాయల మార్కెట్లో విక్రయించేందుకు వెళ్లారు. 25 కిలోల బాక్సు రూ.50కి విక్రయించేందుకు సిద్ధపడినా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో కొత్తగూడలో జరిగే అంగడిలోనైనా అమ్ముకుంటే కనీసం ఆటో కిరాయిలైనా వస్తాయేమోనని అనుకున్నారు. మధ్నాహ్నం వరకు అంగడిలో వేచి చూశారు. టమాట బాక్సు కొనే నాథుడు కరువయ్యాడు. దీంతో ఉచితంగా పంచితే వారైనా తిని తలుచుకుంటారని భావించారు. ఒక్కసారిగా టమాట ఫ్రీ.. ఫ్రీ అంటూ వచ్చినవారికందరికీ పంచిపెట్టి కంటనీరు దిగమింగుతూ వెళ్లిపోయారు. కొత్తగూడ అంగడిలో ఉచితంగా టమాట పంపిణీ కిలో రూ.2 కూడా పలకని పరిస్థితి -
ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీ
● పట్టించుకోని పోలీసులుమహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడ్డి మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి కి సంబంధించిన ఐదు క్వింటాళ్ల మిర్చి గురువారం అర్ధరాత్రి చోరీకి గురైంది. మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు 5 ఎకరాల వ్యవసాయంలో మిర్చి సాగు చేయగా రెండు ఎకరాల మేరకు పంట నష్టపోయారు. మిగిలిన మూడు ఎకరాల్లో వచ్చిన దిగుబడిని విక్రయించడం కోసం గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో అరబోశారు. కొద్దిరోజుల్లో ఎండిన మిర్చిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని అపహరించారు. దీంతో సుమారు రూ.90 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. జమాండ్లపల్లి గ్రామానికి చెందిన మోడెం రాములు, కొమ్ము రవి, కాలసాని శ్రీనివాస్ రెడ్డి, పుల్యాల వెంకటరెడ్డితోపాటు మరి కొంతమంది రైతులకు చెందిన మిర్చిసైతం ఈమధ్యకాలంలో చోరీకి గురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. బైక్ చోరీల ముఠా అరెస్ట్ ఎల్కతుర్తి: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పట్టుబడి నిందితుల్లో వరంగల్ ఉర్సు కరీంబాద్కు చెందిన షేక్ సల్మాన్, మహబూబాద్ జిల్లాకు చెందిన బూక్య చందులాల్తోపాటు మరో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హనుమకొండలోని కాపువాడ, అలంకార్, రాయపుర ప్రాంతాల్లో నివసిస్తూ పరస్పర స్నేహం ఏర్పరుచుకున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని వరంగల్ కమిషనరేట్ పరిధితోపాటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో మొత్తం 14 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు వెల్లడించారు. కాగా ఎల్కతుర్తిలో నమోదైన రెండు కేసులపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మండల కేంద్రం సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలను అంగీకరించినట్లు తెలిపారు. హనుమకొండ, రాయపుర ప్రాంతాల్లో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబర్చిన ఎస్సై ప్రవీణ్కుమార్, ఏఎస్సై శంకర్, ఉబేదుల్లా, సిబ్బంది బక్కయ్య, అఖిల్, సుమన్, గణేష్, వికిల్, రంజిత్, స్వరూపను అభినందించారు. వ్యక్తిపై పోక్సోకేసు నమోదు బయ్యారం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన వ్యక్తిపై బయ్యారం పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్య హుస్సేన్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు యువతి పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో హుస్సేన్పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు. -
లింక్ కెనాల్ పనులు నిలిపేయాలి
గార్ల: గార్ల సమీపం నుంచి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే లింక్ కెనాల్ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీని వాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి గార్లలోని 5వ వార్డులో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్నేరు ఏటిపై లింక్ కెనాల్ నిర్మాణం చెపడితే గార్ల మండల రైతుల భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. లింక్ కెనాల్ జీఓ 98ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గార్ల మండలం సస్యశ్యామలం అయ్యే విధంగా, ముల్కనూరు పంచాయతీలో రెండు ఏర్లు (మున్నేరు, అలిగేరు) క లిసేచోట మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించవచ్చన్నారు. రాష్ట్ర మంత్రి పాలేరు నియోజకవర్గానికి నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్నాయక్, కోకన్వీనర్లు జడ సత్యనారాయణ, రాధాకృష్ణ, సక్రు, శీలంశెట్టి రమేశ్, గిన్నారపు మురళి, జంపాల విశ్వ, కత్తి సత్యం, మొగిలి వెంకన్న, విమల్జైన్, ఇర్రి రవి, బాధిత రైతులు ఆగాల రామారావు, వీరభద్రం, గోపి, శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
రఘునాథపల్లి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కుర్చపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నీరటి వెంకటయ్య తన కూతురు లత (34)ను మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు యాదగిరికి ఇచ్చి 2012 సంవత్సరంలో పెళ్లి చేశాడు. రూ.3 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు వర్షిత్, హాసిని ఉన్నారు. కొన్నాళ్లుగా యాదగిరి భార్య లతను తల్లి ఇంటినుంచి బంగారం తీసుకురావాలని, భూమి రాసి ఇవ్వాలని వేధించేవాడు. పెద్ద మనుషులు సర్ధిచెప్పినా వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన లత ఈ నెల 19(గురువారం) వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తన కూతురు వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిందని అల్లుడు యాదగిరి, అత్త, మామలు వెంకటయ్య, ఎల్లమ్మ, మరిది అశోక్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లత తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
సంగీతమంటే ఇష్టం
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ కల్చరల్: సంగీతమంటే తనకు ఇష్టమని, సివిల్స్కు సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయొలిన్ నేర్చుకున్నానని, మళ్లీ సాధన చేస్తున్నానని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం వరంగల్లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సద్గురు త్యాగరాజస్వామి 179వ ఆరాధనోత్సవాలు, పండిట్ విష్ణు నారాయణ్ భాత్ఖండే, పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నౌడ్గడ సుధీర్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్నేహశబరీష్ ముఖ్యఅతిథిగా హాజరై సంగీతోత్సవాన్ని ప్రారంభించారు. వయొలిన్ అధ్యాపకుడు టి. చిన్నకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి బ్రహ్మమురారి.., అయిగిరి నందిని.. వంటి భక్తిపాటలను వయొలిన్పై వాయించి ప్రేక్షకులను అబ్బురపర్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్లో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ఉండడం, ఎంతోమంది విద్యార్థులు ఈ కళల్లో శిక్షణ పొందడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కర్ణాటక గాత్ర విద్వాంసుడు వాస గోపినాఽథ్, అధ్యాపకులు యోష, సత్యనారాయణ, ఏడిద భీమ్శంకర్, వాజీద్హుస్సేన్, విశ్రాంతాచార్యుడు గుమ్మడి జనార్ధన్, సిబ్బంది శంకర్ పాల్గొన్నారు. -
అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా
● మరిపెడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా ● మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిమరిపెడ: ‘ప్రజలు నన్ను రెండుసార్లు కౌన్సిలర్గా గెలిపించారు. మొదటిసారి నా వంతుగా వార్డు అభివృద్ధికి పాటుపడిన. ఈసారి 8వ వార్డు నుంచి గెలుపొంది చైర్పర్సన్గా ఎన్నికయ్యా. ముందుగా వార్డు ప్రజలకు రుణపడి ఉంటా. అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా’ అని మరిపెడ చైర్పర్సన్ వీసారపు ప్రగతి ‘సాక్షి’తో ప్రత్యేకంగా తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే.. అందరిని కలుపుకుని వెళ్తా.. మున్సిపాలిటీలోని 15వార్డులను అభివృద్ధి చేసి చూపిస్తా. అన్నీ వీధులు తిరిగి సమస్యలు గుర్తించి ఒక్కొక్కటిగా విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. 30ఏళ్లుగా పాఠశాల నడుపుతూ అందరికీ విద్యాబుద్ధులు నేర్పించిన కుటుంబం మాది. స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సహకారంతో మరిపెడను మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతా. అన్ని పార్టీల నాయకుల మద్దతు తీసుకుంటూ అందరి సలహాలతో మరిపెడ పట్టణాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలబెడుతా. సుందరీకరణ కోసం పాటుపడుతా.. మున్సిపాలిటీలోని అన్ని వీధుల్లో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థతో పాటు సుందరీకరణ పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసి పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తా. పర్యావరణాన్ని కాపాడేందుకు పచ్చదనం పెంపునకు కృషి చేస్తా. పట్టణ కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తా. తాగునీటి విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా పర్యవేక్షణ చేపడుతా. అభివృద్ధికి అందరూ సహకరించాలి.. మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని వర్గాల సహకారం ఎంతో అవసరం. కార్యవర్గ సమావేశంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆమె కోరారు. చైర్పర్సన్ ప్రొఫైల్ పేరు: వీసారపు ప్రగతి వృత్తి: గృహిణి భర్త: శ్రీపాల్రెడ్డి విద్య: ఇంటర్మీడియట్ పిల్లలు: ఒక కూతురు, కుమారుడు పుట్టిన ఊరు: పెద్దనాగారం -
సీహెచ్సీని సందర్శించిన కాయకల్ప వైద్యబృందం
గార్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సకల సౌకర్యాలు ఉన్నాయని, సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించలేకపోతున్నారని కాయకల్ప వైద్య బృందం తని ఖీలో గుర్తించింది. గురువారం మహదేవపూర్ సీహెచ్సీ నుంచి కాయకల్ప వైద్యబృందం స్థానిక సీహెచ్సీని సందర్శించి ఆస్పత్రిలోని సమస్యలను గుర్తించింది. ఆస్పత్రిలో కిందిస్థాయి వైద్యసిబ్బంది సరిపడా ఉన్నారని, స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉందన్నారు. బృందం సభ్యులు ఆస్పత్రిలో వార్డులు తిరిగి వైద్యసేవలు ఎలా ఉన్నాయని రోగులను అడి గి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లకు అందించే భోజనంలో నాణ్యతను పరిశీలించారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు, మందుల నిల్వ గదిని పరి శీలించారు. తుది నివేదికను కేంద్ర వైద్య బృందానికి సమర్పిస్తామని వైద్యబృదం మెడికల్ సూపర్వైజర్ విద్యావతి, హెడ్నర్సు బాలామణి, స్టాఫ్ నర్స్ గీత, సూపర్వైజర్ ఉదయ్కుమార్ పేర్కొన్నారు. వారివెంట సీహెచ్సీ సూపరింటెండెంట్ శ్రీధర్గౌడ్, డాక్టర్ సతీష్, హెడ్ స్టాఫ్నర్స్ స్వాతి, స్టాఫ్నర్సులు రాణి, మెర్సీ, ఆశాలత, వినీల, సరిత, రజిని, పుష్పలత, ఎంఎన్ఓ శ్రీని వాస్, ఫార్మసిస్ట్ జ్యోతి, దేవరాజ్ ఉన్నారు. -
రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
● డీఏఓ బి.సరిత కురవి: రైతులు ఈనెల 28వ తేదీ వరకు సంబంధిత ఏఈఓ, మీసేవ కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ బి.సరిత అన్నారు. గురువారం మండలంలోని మోద్గులగూడెం శివారు బేగావత్ తండా గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆమె పర్యవేక్షించారు. అనంతరం మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటల యాజమాన్యంలో ఎక్కువ ఎరువులు వాడుతున్నారని, దానివల్ల నేలసారం దెబ్బతినడమే కాకుండా భవిష్యత్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. వయ్యారిభామ కలుపు మొక్క వివిధ తెగుళ్లకు కారణమవుతుందని, దానిని తొలగించాలని సూచించారు. దాని ద్వారా రైతులకు ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ గుంటక నరసింహరావు, ఏఈఓ రమ్య, సర్పంచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందుబాటులో ఉండాలి మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలని డీఏఓ బి.సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని ఏఓలు, ఏఈఓలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతుల వద్దకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, పీఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలపై మండలాల వారీగా సమీక్షించారు. సమీక్షలో ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు, ఏడీఏ టెక్నికల్ మురళీ, టెక్నికల్ ఏఓలు జావేద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
యామిని.. స్ఫూర్తి దాయకం
నల్లబెల్లి: ఆ వయస్సులో పిల్లలు సీతాకోక చిలుకల్లా గాలిలో తేలుతూ పరుగులు తీయాలి. కానీ ఆ చిన్నారికి అడుగుతీసి అడుగు వేయడమే యుద్ధంగా మారింది. దీనికి కారణం స్థూలకాయంగా ఉండమే. అయితే ఆ చిన్నారి ఈ సమస్యకు ఏమాత్రం చింతించలేదు. శరీరం సహకరించకున్నా.. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గుండెనిండా ఆత్మవిశ్వాసం నింపుకుంది. పుట్టుకతోనే ఉబకాయం శాపంగా మారినా ఆ అడ్డంకిని దాటి పారా క్యారం పోటీల్లో సత్తా చాటేందుకు ముందుకుసాగుతోంది. ఆ చిన్నారే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లూనావత్ యామిని. నడక భారమైనా.. లక్ష్యం వైపు అడుగులు బుచ్చిరెడ్డిపల్లికి చెందిన లూనావత్ దేవిసింగ్,తారా దంపతుల కుమార్తె యామిని ప్రస్తుతం నల్లబెల్లిలోని శ్రీవిద్యానికేతన్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. పుట్టుకతోనే బరువు పెరుగుదల సమస్యతో బాధపడుతోంది. ఈ చిన్నారి ప్రస్తుతం 90 కిలోల బరువు ఉంది. తోటి పిల్లలు మైదానంలో ఆడుతుంటే చూసి మురిసిపోయే యామిని.. తన శరీర ఇబ్బందులను చూసి కుంగిపోలేదు. నడకే భారంగా మారిన తరుణంలో క్రీడల పట్ల యామినికి ఉన్న ఆసక్తిని గుర్తించిన పాఠశాల యాజమాన్యంతోపాటు పీఈటీ దేవేందర్ తనలోని ప్రతిభను వెలికి తీసేందుకు పారా క్యారం గేమ్లో కొంతకాలంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో తన సత్తా చాటేందుకు ముందుకొచ్చింది. అలా వచ్చి మండల, జిల్లా స్థాయి పారా క్యారం పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. అడ్డంకులను అధిగమించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. త్వరలోనే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. శారీరక సమస్యలున్న పారా క్రీడాకారిణులు దీప్తి జీవాంజి, శీతల్ దేవిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతోంది. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు. తమ కూతురి శారీరక బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని యామిని తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. నిరుపేద కుటుంబ కావడంతో కార్పొటేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించే స్థోమత తమకు లేదన్నారు. అయినా తమ కూతురు ధైర్యం కోల్పోకుండా రాష్ట్ర స్థాయి పారా క్యారం పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. ప్రశంసల జల్లు.. యామినిని పాఠశాల యాజమాన్యం, మండల పరిషత్ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం వేర్వేరుగా సన్మానించారు. ఎంపీఓ పసరగొండ రవి, శ్రీ ఆదర్శ వాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ అంగవైకల్యం, శారీరక సమస్యలు క్రీడలకు అడ్డుకావని యామిని నిరూపించిందని కొనియాడారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని చాటుతున్న ఈ చిన్నారి సాహసాన్ని ప్రతీ ఒక్కరు అభినందిస్తూ అండగా ఉండాలని కోరారు. స్థూలకాయాన్ని జయించి.. పారా క్యారం పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం నడక భారమైనా.. లక్ష్యం వైపు అడుగులు -
భ్రూణ హత్యలు నివారించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: మాతా,శిశువు మరణాలను తగ్గించాలని, భ్రూణ హత్యలను నివారించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం సీ్త్ర శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో మాతా శిశువు మరణాలు, భ్రూణ హత్యల నివారణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్దాయిలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలియజేయాలన్నారు. సంబంధిత అధికా రులు సమన్వయంతో కలిసి పని చేస్తేనే మాతా, శిశువు మరణాలు తగ్గడంతో పాటు భ్రూణ హత్యలు నివారించవచ్చన్నారు. చట్టంపై కూడా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, మెనూ పాటించేలా చూడాలని, కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీడబ్ల్యూఓ సబిత, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లలో 61 జిల్లాల నుంచి ఐదు జిల్లాలకు... మార్చిలోగా నెరవేరనున్న లక్ష్యం
పార్లమెంట్లో తాజా నివేదికలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్: 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న లక్ష్యం వైపు అడుగులు వడివడిగా సాగినట్లు కేంద్రం పేర్కొంది. రెండేళ్లుగా సీరియస్గా అమలవుతున్న ‘నక్సల్స్ రహిత దేశం’మిషన్ సక్సెస్కు సమీపంలో ఉన్నట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్ తదితర 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాలు 245 పోలీసుస్టేషన్ల పరిధిలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష తీవ్రవాదంపై సీరియస్గా దృష్టి సారించిన కేంద్రం దండకారణ్యంలో బేస్క్యాంపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2020లో కర్ణాటకలో జీరోకు తేవడంతోపాటు 53 జిల్లాలు, 226 పోలీసుస్టేషన్ల పరిధికి తగ్గించి మిగతా చోట్ల కట్టడి చేశారు. 2025 జనవరి 15 నాటికి ఛత్తీస్గఢ్లో 3 జిల్లాలు, జార్ఖండ్లో 2 జిల్లాల్లోని 11 పోలీసుస్టేషన్లో పరిధిలో స్వల్పంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ ఉంటుందని రెండు రోజుల క్రితం ప్లారమెంట్లో సమర్పించిన తాజా నివేదికలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2019 నుంచే స్కెచ్.. బేస్క్యాంపులతో ముందుకు.. తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని ఏజెన్సీలు మావోయిస్టుల కీలకప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఉద్యమం అణచివేత లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్ఏబీ) క్యాంపులకు 2019లో శ్రీకారం చుట్టింది. మొదటి సంవత్సరంలో 24 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసిన కేంద్ర బలగాలు (సీఆర్పిఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీటీ).. 2020లో 40, 2021లో 51, 2022లో 66.. ఇలా ఆరేళ్లలో 379లకు పెంచాయి. అంటే అడవిలో ప్రతీ 5–15 కిలోమీటర్లకో అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, ప్రత్యేక శిక్షణ పొందిన 200 – 400 మంది భద్రతా బలగాలకు సౌకర్యంగా ఉండే విధంగా శిబిరాలను నెలకొల్పారు. బేస్క్యాంపుల ఆధారంగా కేంద్ర బలగాలు చేసిన దాడుల్లో 145 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందగా, 1,276 మంది పోలీసులకు చిక్కారు. 440 మంది స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో పేర్కొంది. ఇలా ఆరేళ్లలో మొత్తం 1,158 మంది ఎన్కౌంటర్లలో మృతి చెందగా, 7,530 మందిని అరెస్టు చేశారు. 5,881 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాల కట్టడికి బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. గిరిజన, మారుమూల ప్రాంతాలలో అభివృద్ధిపై దృష్టి సారించడం నక్సలిజం అంతానికి పరిష్కారంగా ప్రకటించి.. మెరుగైన శాంతిభద్రతలు, భద్రతా పరిస్థితి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహదారులను నిర్మాణం, విద్య, వైద్యం, మంచినీటి పథకాలకు రూ.కోట్లు వెచ్చించింది. భద్రతా బలగాల శిక్షణా అవసరాలు, లొంగిపోయిన వామపక్ష తీవ్రవాద కార్యకర్తల పునరావాసం, హింసలో మరణించిన పౌరుల కుటుంబాలకు, భద్రతా బలగాల సిబ్బందికి ఎక్స్గ్రేషియా మొదలైన వాటి కోసం మొత్తంగా రూ.3523.48 కోట్లు ఖర్చు చేశారు. ప్రత్యేక బలగాలు, రాష్ట్ర గూఢచార విభాగాలు (ఎస్ఐబీ), ఆయా జిల్లాల పోలీసులు, పటిష్టమైన పోలీస్ స్టేషన్ల (ఎఫ్పీఎస్) నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు రూ. 1757 కోట్ల పనులు మంజూరు చేశారు.సమాంతర ప్రభుత్వం నుంచి అంతిమ ఘడియల వరకు.. సుమారు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీకి అంతిమ ఘడియలు సమీపించినట్టు కేంద్ర ప్రభుత్వం నివేదికలో ప్రకటించింది. ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగిసిన మావోయిస్టు పార్టీ.. కేంద్ర కమిటీ, దండకారణ్యానికి చెందిన కీలక నేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో అతలాకుతలమవుతోంది. దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం, కర్రెగుట్టల్లో ఇక ఉద్యమ నినాదాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదే సమయంలో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపుగా చివరి దశకు చేరినట్లుగా కూడా కేంద్ర హోంశాఖ నివేదికలో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టుల కట్టడికి కీలకంగా బేస్క్యాంపులు 2019 నుంచే దండకారణ్యంలో అణచివేతకు శ్రీకారం.. ఆరేళ్లలో రూ.5,280 కోట్లు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు 1,158 మంది ఎన్కౌంటర్.. 7,530 మంది అరెస్టు, 5,881 మంది సరెండర్ తెలంగాణలో ఉనికే లేదు.. గోదావరి పరీవాహక ప్రాంతంపై నిఘా -
శివాజీ మహరాజ్ స్ఫూర్తితోనే సర్జికల్ స్ట్రైక్
రామన్నపేట: ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధపోరాట స్ఫూర్తి తోనే ప్రధాని మోదీ మన శత్రుదేశమైనా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేశారని, మన దేశం గర్వించే విధంగా మోదీ పాలన సాగుతోందని హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం హిందు వాహినీ ఆధ్వర్యంలో నగరంలో వాహన ర్యాలీలు నిర్వహించిన అనంతరం కొత్తవాడలోని తోటమైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై హిందు వాహిని కార్యకర్తలను ఉద్దేశించి ఉద్విగ్నభరితంగా ప్రసంగించారు. ప్రతీ వ్యక్తి పుట్టిన 9 నెలల పాటు తల్లి పాలు తాగిన అనంతరం గోవు పాలు తాగుతారని, అలాంటి గోవులను పార్లమెంట్లో రాజ్యమాతగా ప్రకటించేలా ప్రతీ హిందువు పోరాటాని సన్నద్ధం కావాలన్నారు. ఛత్రపతి శివాజీ 12 ఏళ్ల వయస్సులోనే గోవును సంహరించడానికి వచ్చిన ముస్లింను అంతమొందించి తన వీరత్వం చాటారన్ని గుర్తు చేశారు. గోమాతను రక్షించే పోలీసులు సైతం తమను దుర్బాషలాడారని, పోలీసు కేసులకు సైతం భయపడేది లేదని పేర్కొన్నారు. హిందు వాహిని కార్యకర్తల పన్నులతోనే మీకు వేతనాలు వస్తున్నాయని విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ప్రసంగం ముగిసిన అనంతరం వెళ్లే క్రమంలో త్రిశక్తి పీఠం కూల్చివేత నిర్ణయం తీసుకున్న క్రమంలో దేవాలయ పరిరక్షణ హిందు వాహిని పూర్తి స్థాయి మద్దతు ఉందంటూ ఆ దేవాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో హిందు వాహిని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కట్టెల పొయ్యి కష్టాలు
● వంట గ్యాస్ కనెక్షన్లు లేక తంటాలు ● నామమాత్రంగా కిచెన్ షెడ్లు ● పొగతో నిర్వాహకులు, విద్యార్థుల ఇబ్బందులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంట చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు ఉండగా, చాలాచోట్ల వరండాలు, ఆరుబయట వంటలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రకటించాయి. అయితే అమలు కాకపోడంతో కట్టెల పొయ్యిల మీదే వంట చేస్తున్నారు. వంట చేసేవారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి మంట సరిగ్గా రాక తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమకు గ్యాస్ కనెన్షన్లు మంజూరు చేస్తే కష్టాలు తప్పుతాయని నిర్వాహకులు కోరుతున్నారు. 44,380 మంది విద్యార్థులు.. జిల్లాలో 100 ఉన్నత, 120 ప్రాథమికోన్నత, 615 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 44,380 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. జిల్లాలో 466 పాఠశాలల్లో కిచెన్షెడ్లు అందుబాటులో ఉన్నాయి. 15చోట్ల మరమ్మతుల్లో ఉన్నాయి. 358 పాఠశాలలకు కిచెన్ షెడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ మండలంలోని 10పాఠశాలల్లో మాత్రమే గ్యాస్పొయ్యిలపై మధ్యాహ్న భోజనం వండుతున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్వాహకులు సొంతంగా గ్యాస్ సిలిండర్లు తెచ్చుకొని వంటలు చేస్తున్నారు. చెట్లకిందే వంట.. వానొస్తే కష్టాలు పలు ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్షెడ్లు లేకపోవడంతో ఆరు బయటే వంటావార్పు చేస్తున్నారు. చెట్లకింద దుమ్ముధూళిలో వంట చేస్తూ మహిళలు పడే ఇబ్బందులు వర్ణణాతీతం. ఇక వానొస్తే వరండాలు, తరగతి గదులే దిక్కుగా మారాయి. బడుల్లో గ్యాస్సిలిండర్లు అందుబాటులో లేక ఆరుబయట కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. దీంతో తరగతి గదుల్లోకి పొగ వెళ్లి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు కిచెన్షెడ్లు మంజూరు చేసింది. కానీ.. అధికారుల అలసత్వంతో చాలా వరకు నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో వంట చేసేందుకు నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి కిచెన్షెడ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోరుతున్నారు. కట్టెల పొయ్యి మీద వండలేకపోతున్నాం.. కిచెన్షెడ్ ఇరుకుగా ఉంది. వర్షానికి కట్టెలు తడుస్తాయని.. ఉన్నదానిలోనే వాటిని పెట్టాల్సి వస్తుంది. కట్టెల ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే కట్టెల పొయ్యి బాధ తప్పుతుంది. మా మండలంలో చాలా పాఠశాలల్లో కిచెన్షెడ్లు లేక మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. –సుజాత, వంట కార్మికురాలు, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, మానుకోట -
క్రీడా పండుగకు వేళాయె..
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడా పండుగకు వేళ అయ్యింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. 32 ఈవెంట్లలో నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఫలితంగా క్రీడాకారులతో స్టేడియం సందడిగా మారింది. కాగా, రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలకు జేఎన్ స్టేడియం సిద్ధంగా ఉందని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ పోటీల వివరాలు వివరించారు. సబ్జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ కేటగిరీల్లో పోటీలు.. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు, 66 మంది కోచ్లు, 27 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారు. ఒక్కో జిల్లా నుంచి 21 మంది బాలురు , 21 మంది బాలికలు పోటీల్లో పాల్గొంటుండగా, సబ్జూనియర్స్, జూనియర్స్, సీ నియర్స్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. నాలుగు రోజులు కొనసాగే అథ్లెటిక్స్ పోటీల్లో 32 ఈవెంట్లలో క్రీడాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. నేటినుంచి జేఎన్ఎస్లో సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు నాలుగు రోజులు.. 32 ఈవెంట్లు 33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు హాజరు -
చిట్టీ పేరుతో మోసం..
● డబ్బు ఇవ్వకుండా బెదిరింపులు ● నిర్వాహకుడిపై కేసు నమోదు శాయంపేట : చిట్టీ పేరుతో మోసం చేసిన ఘటనలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రంజిత్ రావు తెలిపారు. కిశోర్ రెడ్డి దాదాపు 15 సంవత్సరాల నుంచి చిట్ ఫండ్తోపాటు చిట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలకడంతో మండంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన కిరణ్ రెడ్డి రూ. 2లక్షలు, మండల కేంద్రానికి చెందిన కొత్త ఇంద్రసేనా రెడ్డి రూ. 37వేలు, ప్రత్యుష రూ. 82 వేల 500, మురహరి స్వరూప రూ. 27వేల 500, అఖిల్, రూ. 55వేల 500, బాసాని పవన్ రూ. 80 వేలు, పత్తిపాకకు చెందిన కండ్రాతి రాజు రూ. 47వేల 500 మొత్తం 5. 29 లక్షలు చెల్లించారు. అయితే సంవత్సరం క్రితం చిట్టీ కాలం పూర్తయింది. దీంతో డబ్బులు ఇవ్వమని కిశోర్ రెడ్డిని అడగగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ ఘటనపై చిట్టీ సభ్యులు కిరణ్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ప్రత్యుష, రాజు, పవన్, స్వరూప, అఖిల్ ఫిర్యాదు మేరకు కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ రావు గురువారం తెలిపారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సీఐ పేర్కొన్నారు. బైక్ను ఢీకొన్న లారీ.. ● వ్యక్తి మృతి..ఒగ్లాపూర్లో ఘటన దామెర: లారీ.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లో చోటుచేసుకుంది. శాయంపేట సీఐ రంజిత్ రావు కథనం ప్రకారం.. ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన సిలువేరు మల్లయ్య (50) బైక్పై దమ్మన్నపేట వైపు నుంచి ఒగ్లాపూ ర్ బస్టాండ్ వైపునకు 163 జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వెళ్తు లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ మాడిశెట్టి శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్ అదుపు తప్పిన ఘటనలో పోచన్నపేటలో యువకుడు.. బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మండలంలోని పోచన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలంలో వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి సారయ్య (37) పెయింటింగ్ పని చేసుకుంటూ యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో భార్యాపిల్లలతో స్థిరపడ్డాడు. రెండు రోజుల క్రితం తన పొలంలో ఎరువు చల్లించడానికి వెంకిర్యాల వచ్చాడు. ఈ క్రమంలో పోచన్నపేట సమీపంలో ఓ యువకుడు మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు, కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని సారయ్యగా గుర్తించారు. బైక్ అదుపు తప్పి మృతి చెందాడని ని ర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఇంటర్ విద్యార్థులకు హాల్టికెట్లు విద్యారణ్యపురి: ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నారు. గురువారం నుంచి సంబంధిత ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, గురుకులాల జూనియర్ కళాశాలలకు లాగిన్ అయి విద్యార్థుల హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో వివిధ కళాశాలలు విద్యార్థుల హాల్టికెట్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోగా ఫొటోలు లేకుండా వచ్చాయి. సాంకేతికపర లోపంతో అలా రాగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనతో కొంత సమయం తర్వాత మరోసారి డౌన్లోడ్ చేయగా సరిగా వచ్చాయి. దీంతో విద్యార్థులకు హాల్టికెట్లు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజుల పేరుతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు ఆపొద్దని డీఐఈఓ గోపాల్ అన్నారు. కాగా, విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకునేలా వారి ఫోన్లకు ఒకటిరెండు రోజుల్లో లింక్ పంపనున్నట్లు తెలుస్తోంది. -
విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి
● విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ జనగామ రూరల్ : రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే ఈ ప్రభుత్వానిది ప్రజాపాలన అవుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో స్కాలర్స్ పాఠశాల గ్రౌండ్లో సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హెకోర్టు న్యాయవాది సాధిక్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థి గర్జన సభలో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. కొఠారి కమిషన్ మొత్తం బడ్జెట్లో విద్య రంగానికి 30 శాతం కేటాయించాలని చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 ఏళ్లుగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తూ వచ్చాయన్నారు. ఇప్పుడు పౌర సమాజం ప్రశ్నిస్తే ఏదో 2 నుంచి 3 శాతం కేటాయిస్తూ తాము విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పడం సబబు కాదన్నారు. విద్యా పరిరక్షణ రాష్ట్ర నాయకుడు నర్సింహా రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగానికి బడ్జెట్లో అతి తక్కువ కేటాయించడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యే సి.హెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను నేటి పాలకులు గుర్తించడంలో విఫలమయ్యారన్నారు. సాధిక్ అలీ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్య, వైద్య రంగాలకు అత్యధిక నిధులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మొండి చేయి చూపడం సరికాదన్నారు. సభలో జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళం పల్లి రాజు, డాక్టర్ రాజమౌళి, జరసం బాధ్యులు జి. కృష్ణ , ఏకశిల ప్రిన్సిపాల్ నళిని, తదితరులు పాల్గొన్నారు. -
నేడు రథోత్సవం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు(శుక్రవారం) రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి అభిషేక పూజలు, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల తర్వాత రథోత్సవ పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి గ్రామసేవకు తీసుకెళ్తారు. రథోత్సవానికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి బయ్యారం: రాష్ట్రప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం బడు గు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. అనంతరం బయ్యారంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, సర్పంచ్ ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతరాయం లేకుండా చర్యలుతొర్రూరు: వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్, చీఫ్ జనరల్ మేనేజర్ రాజు చౌహాన్ అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మరమ్మతుల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్లు, వైర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నామన్నారు. రంజాన్ మాసంలో సైతం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈ, ఏఈలు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో నిరంతర విద్యుత్నెహ్రూసెంటర్: రంజాన్ మాసం సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ పి.విజేందర్రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని మసీదులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగకుండా చూడాలన్నారు. రాష్ట్రస్థాయి సెమినార్కు కల్వల హెచ్ఎంకేసముద్రం: స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థా యి గణిత సెమినార్లో మండలంలోని కల్వల గ్రామ జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం బండారు నరేందర్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగించే గణిత సూత్రాలను అన్వయిస్తూ విద్యార్థులకు గణితాన్ని నిత్య జీవితా నికి అనుసంధానం చేసి, విశ్లేషణాత్మక దృష్టిని పెంపొందించే వినూత్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎం బండారు నరేందర్ను ఉపాధ్యాయులు అభినందించారు. -
లబ్ధిదారులకే అనుమతులు ఇవ్వండి
నర్సింహులపేట: ప్రభుత్వ పనులు, ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక అనుమతులు ఇవ్వాలని, దూర ప్రాంతాలకు ఇవ్వకూడదని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం మండలంలోని లోక్యాతండా శివారు మూడావత్తండాలో రేషన్ పాయింట్ను ప్రారంభించారు. నర్సింహులపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న గౌని యాదగిరిని పరామర్శించారు. అనంతరం కౌసల్యదేవిపల్లి ఆకేరు వాగు నుంచి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను నిలిపి కూపన్లు పరిశీలించారు. గ్రామాల్లో జీపీఓ, ఏఈలను తెలుసుకొని ఇసుక అనుమతులు ఇవ్వాలన్నారు. ఇష్టానుసారంగా ఇవ్వకూడదని తహసీల్దార్ను హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలకుండా చెక్ పాయింట్ పెట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక పోయాలన్నారు. అనంతరం ఎస్సై మాలోతు సురేష్ ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కూపన్లు పరిశీలించారు. -
క్రీడాకారులకు అన్ని వసతులు
కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశాల మేరకు పోటీల్లో పాల్గొనే బాలురకు డీఎస్ఏ ఇండోర్ స్టేడియం, లష్కర్బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్ , యూత్ హాస్టల్ భవనం, బాలికలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలసముద్రంలోని ఎస్టీ, ఎస్సీ వసతి గృహం, స్విమ్మింగ్ పూల్కు సంబంధించిన భవనంలో వసతి కల్పించాం. జేఎన్ స్టేడియంలోని నెట్బాల్ మైదానం వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాం. గుగులోత్ అశోక్ కుమార్, యువజన, క్రీడల అధికారి, హనుమకొండ -
ఖోఖో ఇండియన్ క్యాంపునకు మనోళ్లు
● ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక వరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మార్చి 9వ తేదీ వరకు గుజరాత్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరికి చెందిన గుగులోత్ దినేశ్, ములుగు జిల్లా మల్లంపల్లి మండలం గుర్తూరుతండాకు చెందిన గుగులోత్ అఖిల ఇండియన్ క్యాంపునకు ఎంపికై నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్ప్రసాద్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది క్రీడాకారులు పాల్గొనే ఇండియన్ క్యాంపునకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపికవడం హర్షణీయమన్నారు. సుమారు పదిహేను రోజుల శిక్షణలో ప్రతిభ కనబరిస్తే మార్చి 9 నుంచి 14 వరకు ఘనా దేశంలో జరగనున్న కామన్వెల్త్ ఖోఖో ప్రపంచ కప్ పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. అందులో 24 దేశాల నుంచి ఖోఖో జట్లు పాల్గొంటాయని, ప్రపంచకప్ పోటీలకు మన ఓరుగల్లు క్రీడాకారులు ఎంపికవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సమర్థవంత ఔషధ అభివృద్ధి జరగాలి
విద్యారణ్యపురి: అంతకణ సంకేత అణువులు ఔషధ లక్ష్యాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఔషధ అభివృద్ధి సమర్థవంతంగా జరగాలని అమెరికాలోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస్మూర్తి అన్నారు. గురువారం హనుమకొండలోని కేడీసీలో ‘మాలిక్యూలర్ బేసిస్ ఆఫ్ మెడిసిన్’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శరీరంలోని మెటబాలిజం, అపోస్టోసిస్ వంటి ప్రధాన శారీరక ప్రక్రియలు సెల్ సిగ్నలింగ్ మార్గాల ద్వారా నియంత్రణలోకి వస్తాయన్నారు. ఈ మార్గాల్లో ఏర్పడే లోపాలు క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులకు కారణమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో అంతకణ సంకేత అణువులు ఔషధ లక్ష్యాలుగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అందుకే సమర్థవంతమైన చికిత్స ఔషధాల అభివృద్ధి జరగాలన్నారు. అంటువ్యాధులు తీవ్ర ఆరోగ్య సవాళ్లుగా మారాయని, వీటి నివారణకు ఔషధ అభివృద్ధి జరగాలని కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి అన్నారు. చైన్నెలోని ఐఐటీ ప్రొఫెసర్ సురేశ్.. క్యాన్సర్ కారకాలు, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను తెలిపారు. ఆయుర్వేద వైద్యుడు శ్రీధర్ మాట్లాడుతూ వ్యాధుల నివారణలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యం కలిగి ఉందన్నారు. ఈ సదస్సుకు కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సు కన్వీనర్ రోహిణి, జువా లజీ విభాగం సదస్సు కోఆర్డినేటర్లు దినేశ్, గౌరి, స్వామి, రాజయ్య వైస్ప్రిన్సిపాల్ రజనీలత, ఐక్యూఏసీకోఆర్డినేటర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సు మరో రెండు రోజులపాటు కొనసాగనుంది. యూఎస్ఏ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ శ్రీనివాస్మూర్తి -
సమయం లేదు మిత్రమా..
● పదో తరగతి పరీక్షలకు 20రోజులు మాత్రమే.. ● వరుస ఎన్నికలతో అంతా అస్తవ్యస్తం ● ముందుకు సాగని ప్రణాళికలుసాక్షి, మహబూబాబాద్: పాఠశాలల పనితీరుకు పదో తరగతి ఫలితాలు కొలమానంగా భావిస్తారు. ఈమేరకు గత ఏడాది రాష్ట్రంలోనే మానుకోట జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించి మన్ననలు పొందింది. అయితే ఈ ఏడాది సరైన ప్రణాళిక లేదని, ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి. వార్షిక పరీక్షలకు మరో ఇరువై రోజులే సమయం ఉండడంతో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారుల నుంచి ఉపాధ్యాయుల వరకు బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వారందరిలోనూ టెన్షన్ మొదలైంది. గత ఏడాది రాష్ట్రంలో టాప్.. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆతర్వాత సంవత్సరం కాస్త మెరుగు పడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపుతో గత విద్యా సంవత్సరం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏఏఈఈఆర్టీ రూపొందించిన కరదీపికలతో పాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్తోపాటు, పలు పాఠశాలల్లో చదువులో వెనకబడిన విద్యార్థులకు వరంగల్, హనుమకొండ నుంచి సిలబస్లో ప్రావీణ్యత గలిగిన అధ్యాపకులను పిలిపించి ప్రత్యేక తరగతులు చెప్పించారు. ఈమేరకు జిల్లా విద్యార్థులు 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మక బాసర త్రిపుల్ఐటీలో జిల్లాకు చెందిన 175మంది విద్యార్థులు సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. మొదలైన టెన్షన్.. మార్చి 14నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అటు విద్యార్థులకే కాకుండా ఇటు విద్యాశాఖ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. గత ఏడాది వంద రోజులకు ముందుగా స్లిప్ టెస్ట్లు పెట్టారు. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందుకోసం దాతల సహకారం తీసుకొని విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. డిసెంబర్లో సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా బోధన వేగవంతం చేశారు. కానీ ఈ ఏడాది ఆ టెంపో కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో వచ్చిన దక్షిణామూర్తి జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. జిల్లానుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందారు. ఈక్రమంలో జిల్లాకు వచ్చేందుకు ఎవరూ సాహసం చేయలేఏదు. దీంతో ఏడీ రాజేశ్వర్కు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన చార్జ్ తీసుకోగానే పంచాయతీ ఎన్నికలు, ము న్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు ఉండడంతో బోధనలో ఆటంకం కలిగిందని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి తోడు పలు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదని, నిర్వహించినా.. మొక్కుబడిగానే ముందుకు సాగుతున్నాయని ఆరోపణలు ఉన్నా యి. ఇన్ని ఆరోపణల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తారో.. ఫలితాలు ఎలా ఉంటాయో అనేది చర్చగా మారింది. ఎక్కడా ఆటంకం కలగడంలేదు పదో తరగతిలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ఎన్నికల నేపథ్యంలో కొంత ఇబ్బందులు కలిగిన విషయం వాస్తవమే అయినా అన్నింటిని సరిచేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నాం. – రాజేశ్వర్, డీఈఓమూడేళ్లుగా పదో తరగతి ఫలితాల వివరాలు.. విద్యా సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో రాసిన వారు స్థానం2022–23 8,461 7,227 85.54 22 2023–24 8,178 7,738 94.62 12 2024–25 8,184 8,126 99.29 01 2025–26 8,832 – – – -
మొక్కజొన్న జోరు..
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట జోరుగా సాగవుతోంది. గతంతో చూసుకుంటే ఈ యాసంగిలో విస్తీర్ణం పెరిగింది. వర్షాలు బాగా కురవడంతో సాగుకు నీరు సమృద్ధిగా ఉంది. దీంతోపాటు ఈ ఏడాది భారీ వర్షాలకు పత్తిలో దిగుబడి తగ్గింది. మరో వైపు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉండడంతో ఈ సారి పత్తి పంటను ముందే తొలగించారు. డిసెంబర్ వరకు పత్తిని కొనసాగించే రైతులు.. ఈసారి అక్టోబర్ చివరి నుంచి తొలగించారు. ఆ పంటలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మొక్కజొన్న సాగు వైపు దృష్టి మళ్లించారు. వరికి ముందే మొక్కజొన్న సాగు చేయడంతో వరికి నీటి సమస్య ఉండదని, వరికి అధిక సాగు నీరు అవసరమయ్యే నాటికి మొక్కజొన్న పంట చేతికి వస్తుందని, ఇది కూడా ఆ పంట విస్తీర్ణం పెరగడానికి కారణమని వ్యవసాయ అధికారులు తెలిపారు. గతం కంటే పెరిగిన సాగు.. మొక్కజొన్న సాగు గతం కంటే పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 8,99,861 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 9,55,387 ఎకరాల్లో సాగైంది. గతేడాది 8,20,945 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2,23,259 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3,37,394 ఎకరాల్లో సాగైంది. గతేడాది యాసంగిలో 2,32,145 ఎకరాల్లో సాగైంది. గతేడాదితో చూసుకున్న...సాధారణ విస్తీర్ణంతో చూసినా ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ విస్తీర్ణంతో చూసుకుంటే అదనంగా 1,14,135 ఎకరాలు, గతేడాదితో చూసుకుంటే 1,14,135 ఎకరాలు సాగైంది. వరి ఉమ్మడి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 6,48,804 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 6,10,215 ఎ కరాల్లో సాగైంది. గతేడాది 5,77,628 ఎకరాల్లో సాగైంది. కాగా, యాసంగి సాగు ఇంకా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యాసంగిలో పెరిగిన పంట విస్తీర్ణం ఇప్పటి వరకు 3,37,394 ఎకరాల్లో సాగు.. గతేడాది 2,37,145 ఎకరాల్లోనే.. వరి ఇప్పటి వరకు 6,10,215 ఎకరాల్లో సాగు..గతేడాది 5,77,628 ఎకరాల్లో.. అన్ని పంటలు కలిపి ఇప్పటి వరకు 9,55,387 ఎకరాల్లో సాగు గతేడాది మొత్తం సాగైంది 8,20,945 ఎకరాలు..జిల్లాల వారీగా పంటల సాగు వివరాలు (ఎకరాల్లో) జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు వరంగల్ 1,90,766 1,91,564 1,98,036 హనుమకొండ 1,79,574 1,63,982 1,71,174 మహబూబాబాద్ 1,89,010 2,13,665 1,59,737 ములుగు 55,240 61,745 36,669 జేఎస్ భూపాలపల్లి 96,919 1,17,078 79,499 జనగామ 1,88,352 2,07,353 1,75,830 మొక్క జొన్న సాగు వివరాలు (ఎకరాల్లో) జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు వరంగల్ 90,559 1,01,162 1,02,321 హనుమకొండ 56,062 65,262 57,498 మహబూబాబాద్ 41,588 1,02,974 42,045 ములుగు 6,068 13,329 4,326 జేఎస్ భూపాలపల్లి 18,369 28,017 13,625 జనగామ 10,613 26,650 12,330 వరి సాగు వివరాలు (ఎకరాల్లో) జిల్లా సాధారణ సాగైంది గతేడాది సాగు వరంగల్ 96,414 90,012 94,104 హనుమకొండ 1,21,165 98,065 1,13,070 మహబాబాద్ 1,34,564 1,07,617 1,13,934 ములుగు 46,182 46,420 31,320 జేఎస్ భూపాలపల్లి 77,439 89,000 65,750 జనగామ 1,73,040 1,79,010 1,59,450 -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన తీరుతెన్నులను స్వయంగా పరిశీలించారు. నూతన టెక్నాలజీ, ఏఐ, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన చేయాలని సూచించారు. పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన మెనూ అమలు చేయాలని, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రీషియన్పై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీ చేయాలన్నారు. -
జేఈఈ మెయిన్స్లో ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ సత్తా
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న 28 మంది విద్యార్థుల్లో 15 మంది జేఈఈ మెయి న్స్లో సత్తా చాటారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్కు సంబంధించి ఎస్టీఈఎ–60 పేరుతో రూపొందించిన స్టడీ మెటీరియల్ను బుధవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్టీ బాలబాలికలకు(బ్యాచ్) జేఈఈ, నీట్ పరీక్షల కోసం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నుంచి కోచింగ్ ప్రారంభిస్తామన్నారు. పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర జేఈఈ కోచింగ్ సెంటర్ల కన్నా ఈ సెంటర్లో అత్యధిక ఫలితాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో శ్రీరాములు, సారయ్య దొర పాల్గొన్నారు. -
టెన్షన్..టెన్షన్!
భూపాలపల్లి/కాళేశ్వరం: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దుల్లో సాయుధ బలగాలు భారీగా మో హరించాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు దళాల కదలికలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతూ కూంబింగ్ చేపట్టారు. అనువణువునా తనిఖీలు, సోదాలతో మారుమూల గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో అనుమానితులు, కొత్త వ్యక్తులపై ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అడవుల్లో అలజడి.. పలిమెల, మహాముత్తారం, భూపాలపల్లి సరిహద్దు మండలా ల్లోని సర్వాయిపేట నుంచి ఇతర ప్రాంతాల్లోని అటవీగ్రామాల్లో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థా యి నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగడంతో ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. అడవిలో మావోయిస్టుల కోసం అనువణువునా గాలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనా యకులు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇతర మావోయిస్టులు ఈ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారం పోలీసులకు అందడంతో అడవులను అష్టదిగ్భందం చేశారని తెలిసింది. చెక్పోస్టుల ఏర్పాటు.. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్, అడిషనల్ ఎస్పీ నరేశ్కుమార్ల నేతృత్వంలో జిల్లాలోని రాంపూర్, పెగడపల్లి, కమలా పూర్ క్రాస్రోడ్డు వద్ద మూడు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశా రు. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం తదితర గ్రామాలు, అడవుల్లో క్షుణ్ణంగా సోదాలు జరుగుతున్నాయి. ప్రధాన ర హదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ములు గు జిల్లాకు వచ్చిపోయే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరిస్తూ అడవి లోపలికి వెళ్లే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో.. ఎలాంటి వార్తలు వినిపిస్తాయోనని ఆయా గ్రామాల్లో చర్చ జరుగుతోంది. నిఘా తీవ్రం! పోలీసులు అటవీ పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ మావోయిస్టులపై నజర్ వేస్తున్నారు. పోలీసు బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎ దురుకాల్పులు జరిగే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లితోపాటు ములుగులోని కొన్ని ప్రాంతాలు, గోదావరి, ఇంద్రావతి నదులు దాటి ఛత్తీస్ గఢ్ గుండా మావోయిస్టులు ప్రవేశించారని, రేషన్ సరుకుల కోసం మావోల కొరియర్లు తరలివచ్చి పోలీసులకు చిక్కారనే సమాచారం దావనంలాగా వ్యాపించింది. పోలీసులు ఓ పెద్ద తలను అదుపులోకి తీసుకొని లొంగుబాటుకు ప్రయత్నాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఎన్కౌంటర్? ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దు అడవిలో ఎన్కౌంటర్ జరిగిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ స్పష్టమైన సమాచారం లేదు. ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నామని, మావోయిస్టులు ఎవరూ అదుపులో లేరని, ఎలాంటి ఎన్కౌంటర్లు జరగలేదని భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. అడవిలో భారీగా పోలీసు బలగాల మోహరింపు మూడు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇతర మావోల కోసం ముమ్మర గాలింపు అడవిలో ఏమి జరుగుతుందోనని ఆందోళన -
హత్య కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష
బాలికపై లైంగికదాడి, ● తీర్పు వెలువరించిన ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఎం.డి అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : లైంగికదాడి ఘటనలో ఓ బాలిక మృతి(హత్య) చెందింది. ఈ కేసులో లైంగికదాడికి పాల్పడినందుకు ఓ యువకుడికి పదేళ్లు, అలాగే, హత్య చేసినందుకు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి చేనుమోలు శ్రీనివాస్ కథనం ప్రకారం.. జిల్లాలోని మరిపెడ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక 2021, మే 5వ తేదీన తమ దుకాణం వద్ద ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అదే మండలంలోని తండా ధర్మారానికి చెందిన ధరంసొత్ రాజేశ్.. ఆమె వద్దకు వెళ్లి చెప్పాడు. అనంతరం ఆ బాలికపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడగా మృతిచెందింది. అదే రోజున ఆ బాలిక తండ్రి మరిపెడ పీఎస్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై శ్రీనివాసరెడ్డి పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ సాగర్ విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ పర్యవేక్షణలో ప్రస్తుత మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరభద్రరావు, కోర్టు లైజన్ అధికారి జీనత్ ఆధ్వర్యంలో సీడీఓ శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో రాజేశ్కు లైంగికదాడి కేసులో పదేళ్లు జైలు శిక్ష, హత్యచేసిన కేసులో యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెలువరించారు. పోలీసు బృందం నిరంతర కృషి ఫలితంగా కోర్టు నేరస్తుడికి కఠిన శిక్ష విధించిందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ఏర్పాటయ్యాక నేరస్తుడికి యావ జ్జీవ కారాగారశిక్ష పడడం ఇదే ప్రథమం. -
ప్రార్థన.. పఠనం
న్యూశాయంపేట: క్రమశిక్షణ, దాతృత్వం ప్రార్థనల కలయికగా సాగే పవిత్ర మాసం రంజాన్. ఈ నెలలో ఖురాన్ పఠనం.. మసీదుల్లో తరావీ ప్రార్థనలతో వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆకాశంలో సన్నని రేఖలా మెరిసిన నెలవంక కోట్లాది మంది ముస్లింల హృదయాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నింపింది. గురువారం నుంచి నెల రోజుల పాటు సాగే కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి నెలవంక దర్శనం పచ్చజెండా ఊపింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇస్లామిక్ కేలండర్లో అత్యంత పవిత్ర మైనదిగా భావించే రంజాన్ మాసం కేవలం ఆహార, పానీయాలను త్యజించడమే కాకుండా ఆత్మను ప్రక్షాళన చేసుకునే ఒక గొప్ప అవకాశం అందించింది. సూర్యోదయానికి ముందే సహర్తో మొదలై, సూర్యాస్తమయం ఇఫ్తార్ వరకు చుక్కనీరు కూడా తీసుకోకుండా సాగే ఉపవాసదీక్షలు మానవుడిలో సహనం, నిగ్రహాన్ని పరీక్షిస్తాయి. ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో నిలబడి ప్రార్థనలు చేయడం, తమ సంపాదనలో కొంత భాగం అభాగ్యులకు పంచి ఇవ్వడం(జకాత్) ఈ మాసం విశిష్టత. హలీం, హరీస్తో పాటు సూప్(గంజి) ప్రత్యేకం ఉపవాస దీక్ష విరమించిన తర్వాత కడుపుకు హాయినిచ్చేలా తక్షణ శక్తిని అందించే బియ్యం, పెసర పప్పుతో చేసే ప్రత్యేక సూప్(గంజి) అందిస్తారు. అంతేకాకుండా రవ్వ, నెయ్యి, జీడిపప్పు, గరం మసాలాతో సుమారు 8 నుంచి 10 గంటల పాటు ఉడికించిన చికెన్, మేక మాంసంతో తయారు చేసిన హలీం, హరీస్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. శాఖాహారులకు వెజ్ హలీం కూడా లభిస్తుంది. ఇఫ్తార్ విందులు ప్రత్యేకం.. రంజాన్ మాసంలో సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఐక్యత వాతావరణం కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా, గ్రేటర్ వరంగల్ త్రినగరిలో సామూహిక ఇఫ్తార్లతో మసీద్లు, హోటళ్లు కళకళలాడుతుంటాయి. వందలాది మంది ఒకే చోట కూర్చోని ఇఫ్తార్లు చేస్తారు. ఖర్జూరాలు, రకరకాల పండ్లు, మజ్జిగ, గంజి తదితర వాటితో ఇఫ్తార్లు అందజేస్తారు. హిందూ, ముస్లిం సోదరభావానికి గంగా జమునా తహెజీబ్ ప్రతీకగా రాజకీయ నాయకులు, వ్యాపారులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్ని కుల, మతాల వారు కలిసి పాల్గొంటారు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని ఖర్జూర పండు లేదా నీటితో విరమించడాన్ని ఇఫ్తార్ అని పిలుస్తారు. దీక్షలు ప్రారంభించాక మంచినీళ్లు కూడా తాగకుండా దైవ చింతనతో కఠిన నియమాలు పాటిస్తారు. ఐదుపూటల నమాజ్తో పాటు రాత్రి వేళల్లో తరావీహీ అనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉపవాసం అంటే కేవలం కడుపును ఖాళీగా ఉంచడం కాకుండా అది కళ్లు, చెవులు, నాలుక, మనసును చెడుకు దూరంగా ఉంచడం.ఉపవాసం..ఆరోగ్య ప్రయోజనాలుఉపవాసం కేవలం ఆధ్యాత్మికమే కాదు. శారీరక శుద్ధికి ఎంతో మేలు చేస్తుంది. రోజంతా ఏమి తినకపోవడం వల్ల శరీరంలోని విష తుల్యాలు (డిటాక్సీఫికేషన్) తొలగిపోయి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మెదడులో చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కొలెస్ట్రాలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. సరైన పద్ధతిలో ఉపవాసం చేయడంతో శరీరంలోని కొవ్వులు కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ఆకాశంలో కనిపించిన నెలవంక నేటి నుంచి నెలరోజులపాటు ముస్లింల కఠిన ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైన మసీదులు -
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు తండ్రీకూతురు
● సాఫ్ట్బాల్ క్రీడలో వేర్వేరు విభాగాల్లో సత్తా! పాలకుర్తి: తండ్రీకూతురు ఒకే ఆటలో సత్తాచాటారు.. సీఎం కప్ చాంపియన్షిప్లో వేర్వేరు విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన బాలబోయిన సందీప్, ఆయన కూతురు బాలబోయిన స్మైలిక ఈనెల 14న జనగామలో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పురుషుల విభాగంలో సందీప్, బాలికల విభాగంలో స్మైలిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. వీరు ఈనెల 20నుంచి 23 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. సందీప్ ఒకసారి జాతీయ స్థాయి, ఏడుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అలాగే స్మైలిక జాతీయ స్థాయిలో రెండుసార్లు, రాష్ట్రస్థాయిలో ఐదుసార్లు పాల్గొని ప్రతిభచాటింది. సాఫ్ట్బాల్ పోటీల్లో గ్రామానికి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పేరుతెస్తున్న తండ్రీకూతుళ్లకు ఈసందర్భంగా గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కాగా, బాలబోయిన సందీప్ ఐనవోలు ఎంజేపీలో పీఈటీగా పనిచేస్తుండగా, స్మైలిక ఉర్సుగుట్ట మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో 9వ తరగతి చదువుతోంది. -
బీసీసీఐ వన్డే టోర్నీలో కృష్ణవేణి ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: ఆదివాసీ మహిళా క్రికెటర్ ప్రతిభకు బీసీసీఐ ఫిదా అయ్యింది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామానికి చెందిన తాటి కృష్ణవేణి జాతీయ స్థాయిలో తన గ్రామ ఖ్యాతిని చాటుతోంది. ఇటీవల వరంగల్ కేంద్రంగా హైదరాబా ద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జిల్లాల మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. వ రంగల్ జట్టు నుంచి ప్రాతి ని థ్యం వహించిన కృష్ణవేణి స్పిన్బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో ప్రతిభ కనబరిచి హెచ్సీఏ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి బీసీసీఐ వన్డే టోర్నమెంట్కు ఎంపికై ంది. జార్ఖండ్లోని రాంచీలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు బీసీసీఐ నిర్వహిస్తున్న వన్డే టోర్నమెంట్లో ప్రతిభ కనబరుస్తూ బెస్ట్ –11 తుది జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. బెస్ట్ –11 తుది జట్టులో స్థానం జాతీయ స్థాయిలో గ్రామఖ్యాతి చాటుతున్న ఆదివాసీ యువతి -
21నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్
● వరంగల్ మార్కెట్ కార్యదర్శి మల్లేశం వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో ఈనెల 21వ తేదీ(శనివారం) నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్లు మార్కెట్ ఉన్న త శ్రేణి కార్యదర్శి మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం పత్తి కొనుగోళ్లను 20వ తేదీ వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. 21వ తేదీ నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తున్నామని సీసీఐ తెలిపిందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. కళాశాల మైదానంలో విద్యార్థుల ఘర్షణనెల్లికుదురు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల మైదానంలో బుధవారం విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ప్రత్యక్షుల వివరాల ప్రకారం.. కళా శాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి అదే కళాశాలలోని ఓ విద్యార్థి తరచూ మెసెజ్లు పంపుతూ ఇబ్బంది పెడుతున్నాడనే అనుమానంతో ఆ విద్యార్థిని అన్నతోపాటు కొంతమంది కళాశాలకు వచ్చారు. మెసెజ్లు పంపుతున్న విద్యార్థి తరఫున కొంతమంది బయటి విద్యార్థులు కూడా చేరుకున్నారు. ఈ సమయంలో మాటామా టా పెరిగి ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెండు వర్గాలను పోలీస్స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కళాశాల యంత్రాంగం చోద్యం చూసిందని ప్రత్యక్షులు విమర్శించారు. కళాశాలలో వీడ్కోలు సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
కుమారుడి కడసారి చూపునకు నోచుకోని తండ్రి
మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు మృతిచెందగా పెద్ద కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని చూసేందుకు వెళ్తూ తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. తండ్రి, పెద్దకొ డుకు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మృతుడికి పినతండ్రి(బాబాయ్) తలకొరవి పెట్టా డు. కన్న కుమారుడిని కడసారి చూసుకునేందుకు వీలులేకుండా తండ్రి ఆస్పత్రి పాలైన సంఘటన మ హబూబాబాద్ మండలంలోని మోట్లతండా గ్రామ పరిధిలోని దుబ్బతండాలో బుధవారం జరిగింది. స్థా నికుల కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన భూ క్య బాలు–తారమ్మ దంపతులకు యువరాజ్, దేవరాజ్(22) ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరూ ద్విచక్ర వాహనంపై బయ్యారం మండలంలోని ఉప్పలపాడు తండాలోని అమ్మమ్మ ఇంటికి మంగళవారం రాత్రి వెళ్తుండగా.. తండా సమీపంలోని ప్ర భుత్వ పాఠశాల ఎదురుగా రహదారి పక్క న ఉన్న మట్టిదిబ్బను వారి ద్విచక్రవాహనం ఢీకొనడంతో దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. యువరాజుకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న తండ్రి భూక్య బాలు సమీప బంధువు సురేశ్ ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ వెళ్తున్న క్రమంలో నడివాడ జీపీ పరిధిలోని రంగశాయపేట దగ్గర అదుపు తప్పి కిందపడంతో తీవ్ర గా యాలయ్యాయి. బాలును మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలపడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో దేవరా జ్ అంత్యక్రియలను ఆయన పినతండ్రి (బాబా య్) భూక్య లాలు నిర్వహించారు. కొడుకును చివరిసారిగా తండ్రి చూసుకోలేకపోవడంతో తండావా సులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో చిన్నకుమారుడి దుర్మరణం..పెద్దకుమారుడికి తీవ్రగాయాలు వారిని చూసేందుకు వెళ్తూ తీవ్రంగా గాయపడిన తండ్రి -
సమస్యలతో సతమతం!
మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారంమహబూబాబాద్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సమస్యలు తిష్టవేశాయి. ఏడాదిపైగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. నూ తనంగా కొలువుదీరిన పాలకవర్గాలకు సమస్యలు సవాల్గా మారాయి. వారు ఇచ్చిన హామీలతో పా టు పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, వీధి దీపాలు, తాగునీరు, పందులు, కోతులు, కుక్కల సమస్యలను పరి ష్కరించాల్సి ఉంది. పుర ప్రజలు కూడా తమ కాలనీల్లోని సమస్యలు తీరుతాయని నూతన పాలకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. మానుకోట.. సమస్యల కోట మానుకోట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సరిపడా కార్మికులు లేకపోవడతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. చెత్త సేకరణ కోసం వినియోగించే 45వాహనాల్లో సగానికి పైగా మరమ్మతులకు గురికావడంతో వీధుల్లోనే చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. కాగా నూతన పాలకవర్గం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే తాగునీరు, అంతర్గత రోడ్లు, కోతులు, పందులు, కుక్కల సమస్యను పరిష్కరించాలి. నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు దోమలు, పందులకు ఆవాసాలుగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిరుపయోగంగా మోడల్ మార్కెట్.. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని 2023లోనే ప్రారంభించారు. ఇటీవల మళ్లీ ఎమ్మెల్యే మురళీనాయక్ పునఃప్రారంభించినా వ్యాపారులు అక్కడ వ్యాపారాలు నిర్వహించడానికి సుముఖంగా లేరు. అలాగే మున్సిపల్ భవన నిర్మాణానికి 2018లో రూ.5 కోట్లు కేటాయించారు. 2018 ఏప్రిల్ 4న శంకుస్థాపన చేశారు. నేటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన పనులపై పాలకవర్గం దృష్టిపెట్టాల్సి ఉంది. డంపింగ్ యార్డునే పెద్ద సమస్య.. మున్సిపాలిటీలోని 4వ వార్డు నుంచి గెలిచిన గుగులోత్ జ్యోతి మానుకోట చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె వార్డు పరిధి గాంధీపురంలోని డంపింగ్ యార్డును తరలించాలని కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. చైర్పర్సన్ డంపింగ్ యార్డును తొలగించి సమస్య తీరుస్తారని వార్డు ప్రజలు భావిస్తున్నారు. అలాగే విలీన గ్రామాల్లో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. ఆయా గ్రామాలపై పాలకవర్గాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మానుకోటలోని 19వ వార్డులో రోడ్డుపై పందుల స్వైరవిహారం 143 మంది పారిశుద్ధ్య కార్మికులు65,712 మంది ఓటర్లు 36 వార్డులు25,000లకు పైగా గృహాలు45 చెత్త సేకరణ వాహనాలులక్షకుపైగా జనాభా● అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు, రోడ్లు పందులు, కోతులు, కుక్కలతో పుర ప్రజల ఇబ్బందులు విలీన గ్రామాల పరిస్థితి మరీ దారుణం నూతన పాలకవర్గాలపైనే ఆశలు -
పాలకవర్గంపైనే భారం..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో 18వేలకు పైగా జనాభా ఉంది. చాలా రోజులుగా వీధులకు చెత్త సేకరణ వాహనాలు రావడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్లలో రోడ్లపైకి దుకాణాలు చేరడం, సైడ్ కాల్వలు ఆక్రమించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సైడ్ కాల్వల ఆక్రమణతో వ్యర్థాలు, మురుగును తొలగించే అవకాశం లేక తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలగడం, పలు వీధుల్లో తాగునీటి పైప్లైన్ పగలడంతో స్థానికులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూరగాయల మార్కెట్, గాంధీ సెంటర్, జెడ్పీ స్కూల్ ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ డంపింగ్ యార్డు లేకపోవడంతో బందంకుంట ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి నెహ్రూస్ట్రీట్కు తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్ సక్రమంగా లేకపోవడంతో నిత్యం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాం. మా తాగునీటి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యపై నూతన పాలకవర్గం దృష్టి సారించాలి. – వై.శ్రీనివాసరావు, నెహ్రూస్ట్రీట్, డోర్నకల్ -
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆదేశాల మేరకు విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ.. గుడుంబా, బెల్లం, గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతా యన్నారు. చెడు అలవాట్లకు విద్యార్థులు దూ రంగా ఉండాలని, చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఎవరైనా మత్తు ప దార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డోలి సత్యనా రాయణ, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, వైస్ ప్రిన్సి పాల్ శంకర్, అధ్యాపకులు ప్రసాద్, ముత్త య్య, రమేష్, శేఖర్, రవికుమార్ పాల్గొన్నారు. రసాయన రహిత వ్యవసాయం మేలు మహబూబాబాద్ రూరల్: రసాయన రహిత, పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్పై మహిళా రైతులకు మహబూబాబాద్ మండలంలోని సీత్లా తండా గ్రామంలో బుధవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. పంటల సాగు సమయంలో బయట నుంచి కొనుగోలు చేసే ఎరువులు, పురుగు మందుల వల్ల అదనంగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుందన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు జీవవైవిధ్య ఎరువులు, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపర్చడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, ఏఈఓ పున్నమి, సర్పంచ్ హలావత్ కమ్లీ, పంచాయతీ కార్యదర్శి హరి, రైతులు పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని వెలికితీయాలిపెద్దవంగర: ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని వెలికితీయాలని, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యమని డీఈఓ రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వడ్డేకొత్తపల్లి, చిట్యాల, బొమ్మకల్లు జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వార్షిక పరీక్షల దృష్ట్యా పాఠ్యాంశాల పునఃశ్చరణ, సమయపాలన, మెరుగైన ఫలి తాల సాధనకు అనుసరించాల్సిన విధానాలపై వి ద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశాల్లో బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాలు, పా ఠశాల నిర్వహణ అంశాలపై చర్చించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పరిశీలించి పునాది స్థాయి చదువు–లెక్కలు కార్యక్రమం అమలు స్థితిని సమీక్షించారు. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. జిల్లా సైన్స్ అధి కారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారీగా మిర్చి రాకమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా మిర్చి అమ్మకానికి వచ్చింది. 2,903 బస్తాల మిర్చి విక్రయం జరిగినట్లు మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కార్యదర్శి సుజన్ బాబు తెలిపారు. తేజ రకం మిర్చి 2,646 బస్తాలు విక్రయం జరుగగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.17,976, కనిష్ట ధర రూ.10,711 పలికిందన్నారు. తాలురకం మిర్చి 257 బస్తాలు కొనుగోలు జరుగగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.11,611, కనిష్ట ధర రూ.10,002 పలికిందని తెలిపారు. -
పెళ్లి పండుగ మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్న, చిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. ఈసారి పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలు గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభముహూర్తాలు రెండు నెలల్లో ముహూర్తాలు లిమిటెడ్ -
అన్నీ మనమే గెలిచాం.. బాగా కష్టపడ్డారు
సాక్షి, మహబూబాబాద్: ‘జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం.. పోతది అనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది.. అందరూ బాగా కష్టపడ్డారు.. సీఎం అందరిని అభినందించారు.. ఇలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలి.. తప్పకుండా అందరం కష్టపడుతాం.. విజయం సాధిస్తాం’ ఇలా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య సంభాషణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణించడంతో బుధవారం వేం నరేందర్రెడ్డి పరామర్శకు రెడ్యాల గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో మానుకోట శివారు జమాండ్లపల్లి సమీపంలో వరంగల్ నుంచి తమ బంధువుల ఇంటికి వస్తున్న కడియం శ్రీహరి, ఆయన కుమార్తె ఎంపీ కావ్య ఎదురుపడ్డారు. ఒకరిని ఒకరు చూసి వాహనాలు ఆపి కాసేపు మాట్లాడారు. మున్సిపాలిటీల్లో విజయం సాధించినందుకు మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్ను వేం నరేందర్ రెడ్డి అభినందించారు. అనంతరం పక్కనే ఉన్న వరంగల్ ఎంపీ కావ్యతో మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీ దక్కించుకునేందుకు మీరు బాగా కష్టపడ్డారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నిర్వర్తించారు. మీకు మంచి భవిష్యత్ ఉంటుందని అభినందలు తెలిపారు. అదే విధంగా జిల్లాలోని పరిస్థితులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఇరువురు క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఉన్న డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ సోమయ్య, కాంగ్రెస్, సీసీఎం వార్డు సభ్యులకు వేం నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. కడియం కావ్య, మురళీనాయక్, రాంచంద్రునాయక్ను అభినందించిన వేం నరేందర్ రెడ్డి -
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ: గర్భిణులపట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానిన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశా రు. మహిళలు గర్భందాల్చిన 12వారాల లోపే తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. మొదటి, రెండు పరీక్షలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆ తర్వాత పరీక్షలు ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించాలని సూచించారు. 30ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆన్లైన్ పోర్టల్లో డేటా అప్డేట్ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి గుగులోతు రవి, డాక్టర్ పూజిత, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, స్టాఫ్ నర్సు మమత పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి.. దంతాలపల్లి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రజావైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యురాలు కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడారు. సిబ్బందితో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం రికార్డులు, ఆస్పత్రిలో పనిచేయని ఇన్వర్టర్లను పరిశీలించి సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కవిత, వెంకటేశ్వరరాజు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
పేరుకుపోయిన సమస్యలు..
కేసముద్రం: ఇటీవల ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో పేరుకుపోయిన పలు సమస్యలపై నూతనపాలక వర్గం దృష్టిసారించాల్సి న అవసరం ఉంది. వర్షాకాలంలో రైల్వేస్టేషన్లో సమీపంలోని అండర్ డ్రెయినేజీ వద్ద వరదనీరు తీవ్రత ఎక్కువ కావడంతో సంతోష్నగర్ కాలనీతోపాటు, అంబేడ్కర్ సెంటర్, అమరవీరుల స్తూపం వద్ద ఉన్న దుకాణాలు, ఇళ్లలోకి వరదనీరు చేరడంతో తీవ్రంగా ఆస్తినష్టం వాటిల్లింది. డ్రెయినేజీ మార్గం పక్కన అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదనీరు వచ్చిన ప్రతీసారి ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రైల్వేస్టేషన్కు ఇరువైపులా నుంచి బాటసారులు, ప్రజలు అండర్ డ్రెయినేజీలో నుంచి రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కాగా, అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు స్థల పరిశీలన చేసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. త్వరితగతిన అండర్బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. మున్సిపాలిటీ పరిధిలోని ధన్నసరి, అమీనాపురం, కేసముద్రంవిలేజ్, కేసముద్రంస్టేషన్, సబ్స్టేషన్తండాలో సైడ్కాల్వల్లో మురుగు నిలిచిపోవడంతో దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. అలాగే పలు చోట్ల తాగునీటి సమస్య ఉంది.రైల్వే అండర్ డ్రైయినేజీ నుంచి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
వైభవోపేతంగా తెప్పోత్సవం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కురవి పెద్ద చెరువులో తెప్పోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉత్సవమూర్తులను ఆలయం నుంచి చెరువు వద్దకు శావలో తీసుకొచ్చారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. పూజలో ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ డబ్బాలతో తయారు చేసిన హంసవాహనం (తెప్ప)కు విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఉత్సవమూర్తులను పడవ(తెప్ప)లో అధిష్టింపజేశారు. ముఖ్య అర్చకుడు పెనుగొండ అనిల్కుమార్ జలాలకు పూజ చేయగా విప్ రాంచంద్రునాయక్ హారతి ఇచ్చారు. అనంతరం స్వామిఅమ్మవార్లు హంసవాహనంలో విహరించారు. రాజమండ్రి నుంచి వచ్చిన కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తిరుమలాపురం గ్రామానికి చెందిన మహిళలు కోలాటం ఆడారు. హైదరాబాద్ పార్శిగుట్టకు చెందిన వీరభద్రీయ కుల సంఘం ఆధ్వర్యంలో ప్రభలతో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, భిక్షపతి, శక్రునాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, ఉప సర్పంచ్ ఎర్రనాగేశ్వర్రావు, కాంగ్రెస్ నాయకులు కొర్ని అనిల్, లక్ష్మీనారాయణ, బెడద వీరన్న, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యయుతంగానే చైర్మన్ ఎన్నిక
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిపాలకుర్తి టౌన్: బీఆర్ఎస్ పార్టీ అనే క ఎత్తులు జిత్తులు చేసినా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రజా స్వామ్య యుతంగానే జరిగిందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. తొర్రూరు మున్సిపాటీ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తులు, జిత్తులు చేసిందని, కాంగ్రెస్ ఆ కుట్రలను తిప్పికొట్టిందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం నూతన చైర్మన్గా ఎన్నికై న తూణం శ్రావన్, కౌన్సిలర్లకు ఎమ్మెల్యే, ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో అత్మీయ నన్మానం చేశారు. లక్కిడ్రాలో కాంగ్రెస్పార్టీ గెలుపొండంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెర్డి పార్టీ కార్యకర్తలతో డ్యాన్స్ చేసి సందడి చేశారు. -
ఎమ్మెల్యే.. సభ్యులను కొనాలని చూశారు
● ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి జనగామ: కాంగ్రెస్ సభ్యులతోపాటు స్వతంత్రంగా గెలిచి తమకు మద్దతు ఇచ్చిన వారిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూశారని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆవరణలో ఎంపీ మాట్లాడారు. డబ్బుతో అన్నీ సాధ్యం కావని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. చేర్యాల పురపాలికలో తమ పార్టీకి చెందిన ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పల్లా కొనుగోలు చేశారని, తాము ఆ దారిలో వెళ్లడం లేదన్నారు. ఇలాంటి డబ్బుల రాజకీయాన్ని పక్కన బెట్టి పట్టణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. 28వ వార్డు సభ్యురాలు హఫీజ్ ఫాతిమాకు సంబంధించి కేసు ఇచ్చారని, అందుకే రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికను వాయిదా వేయాలని చెప్పామే తప్ప, ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసినా, ధర్మం తమవైపు ఉందన్నారు. అందుకే లాటరీలో గెలిచామన్నారు. ధర్మం గెలిచింది.. మున్సిపల్ ఎన్నికల్లో లాటరీ ప్రక్రియలో ధర్మం గెలిచిందని, తద్వారా చైర్ పర్సన్ తమవైపు వచ్చిందని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు భగవంతుడు సైతం సహకరించారన్నారు. ఇక నుంచి జనగామ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి కాబోతుందని, సొంతింటి కలను సాకారం చేసేది కాంగ్రెస్ సర్కారే అన్నారు. 90 మున్సిపాలిటీలను దక్కించుకున్నాం.. రాష్ట్రంలో 116 స్థానాల్లో కాంగ్రెస్ 90 మున్సిపాలిటీలను దక్కించుకుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జనగామ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి సీఎంకుబహుమతి ఇచ్చామన్నారు. డబ్బు ప్రభా వాన్ని పక్కన బెట్టి న్యాయం వైపు దైవం నిలిచిందన్నారు. ఎంపీ చామల, ఇన్చార్జ్ కె.ప్రతాప్ రెడ్డి, ప్రతీ ఒక్కరి సమిష్టి కృషి జనగామ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేలా చేసిందన్నారు. -
స్పేస్ ఎడ్యుకేషన్ హబ్గా వరంగల్
నయీంనగర్: విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై మక్కువ పెంచడం, వరంగల్ను స్పేస్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు నిట్ వరంగల్, ‘కుడా’ ఆధ్వర్యంలో ఎక్స్ప్లోరా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు ‘కుడా’చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సైన్స్ డే సందర్భంగా ఈనెల 28న ఇస్రో స్పేస్ ట్యూటర్, ఏటీడీఆర్ఎల్ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్, రిజిస్టర్డ్ ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి ఆధ్వర్యంలో రుద్రమ v.01గా నామకరణం చేసిన మోడల్ రాకెట్ను హనుమకొండ బాలసముద్రంలోని ‘కుడా’ గ్రౌండ్లో ప్రయోగించనున్నట్లు వివరించారు. ఈనెల 18 నుంచి 27 వరకు (సాయంత్రం 6 నుంచి రాత్రి 11గంటలు) భద్రకాళి ట్యాంకుబండ్పై టెలిస్కోప్తో నక్షత్ర వీక్షణం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మేయర్ గుండు సుధారాణి, ఇస్రో నోడల్ సెంటర్ హెచ్ఓడీ–నిట్ ప్రొఫెసర్ ఎల్.ఆంజనేయులు మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కుడా పనిచేస్తోందని తెలిపారు. సమావేశంలో ‘కుడా’సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఖగోళాన్ని వీక్షించే అవకాశం విద్యారణ్యపురి: భద్రకాళి బండ్పై ఈనెల 18 నుంచి 27 వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉచితంగా ఖగోళాన్ని వీక్షించవచ్చని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ గుర్తింపు కార్డు చూపిస్తే వారితోపాటు తల్లిదండ్రులకు కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తారని తెలిపారు. ఈనెల 18న హనుమకొండ, 19న కాజీపేట, 20 హసన్పర్తి, 21న ఆత్మకూరు, దామెర, వేలేరు, 22న భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, 23న ఐనవోలు, కమలాపూర్, 24న నడికూడ, పరకాల, శాయంపేట మండలాల విద్యార్థులు టెలిస్కోప్తో ఖగోళ దృశ్యాలను వీక్షించే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రతిభ
నిత్యాంత రెడ్డిసి.హెచ్ సాత్విక్వి. మణికంఠధీరజ్కంచాఅభినవ్కీతాజి.యువనచంద్రవిద్యారణ్యపురి: దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి మంగళవారం తెలిపారు. జి. యువన చంద్ర 99.93 శాతం పర్సంటైల్తో జాతీయ స్థాయిలో ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ట నిలిపారన్నారు. అభినవ్కీతా 99.91 శాతం పర్సంటైల్, నిత్యాంత రెడ్డి 99.84 శాతం, మణికంఠ వెలగా 99.77శాతం పర్సంటైల్తో ప్రతిభ చాటా రన్నారు.ధీరజ్కంచ99.70శాతం, సి.హెచ్ సాత్విక్ 99.68శాతం, గారెపెల్లి వసుధా 99.64శాతం, చిన్నమెటి సందీప్ 99.55 శాతం, చాట్ల అర్నవ్ 99.48 శాతం, మారికంటి గ్రీష్మంత్ తేజ్ 99.34 శాతం పర్సంటైల్తో విజయకేతనం ఎగురువేశారని తెలి పారు. అలాగే వందమందికిపైగా విద్యార్థులు 99 శాతం పర్సంటైల్ సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్ సెషన్–1 ప్రవేశ పరీక్షలో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎస్ఆర్ కీర్తిపతాకాన్ని ఎగురవేశారన్నారు. భవిష్యత్లో మరింత అత్యత్తుమ మా ర్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. -
కాంగ్రెస్ది దుర్మార్గపు పాలన
హన్మకొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధుసూదనాచారి ముఖ్య అతిథి గా హాజరై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తే కుర్చీ వస్తుందోననే ఒకే ఆలోచన విధానం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. తెలంగాణ మరోసారి ఆగమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంతోపాటు, ప్రజ లకు మేలు చేసే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి రావడం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దుర్మార్గాన్ని చీల్చి చెండాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం చేపట్టి సాధించే వరకు విశ్రమించని గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుర్చీపై ఎలా కూర్చోవాలన్నదే రేవంత్ విధానం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి -
జేఈఈలో ‘షైన్’ ప్రభంజనం
హన్మకొండ: జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ కళాశాల విద్యార్థులు 95.23, 95.22 పర్సంటైల్ సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమాన ఫలితాలు సాధించారని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను చైర్మన్ మూగల కుమార్, డైరెక్టర్లు మూగుల రమ, అరూరి కవిత, మూగుల రమేశ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్–2026లో తమ కళాశాల జాతీయ స్థాయి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళికల ద్వారా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడం ద్వారా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎం.ప్రశాంతి 95.23 పర్సంటైల్, ఎం.దీక్షిత 95.22, రూప శ్రీలక్ష్మి 94.51, ఆర్.సౌరభ్ వర్మ 94.23, కె.అభిలాశ్ 92.38, వి.మాధురి 92.11, జి.సిద్దు 92.09 పర్సంటైల్ సాధించారని వివరించారు. వీరితో పాటు 28 మంది విద్యార్థులు 85కు పైగా పర్సంటైల్ సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అత్యుత్తమ బోధన, నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్తో మామూలు విద్యార్థులను కూడా మెరికల్లా తీర్చిదిద్ది నట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ విజయాలు సాధించారన్నారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్, ఐఐటీ కో–ఆర్డినేటర్ మూగుల రమేశ్ యాదవ్, కళాశాలల ప్రిన్సిపల్స్ మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆర్.సౌరబ్ వర్మరూప శ్రీలక్ష్మిఎం.దీక్షితఎం.ప్రశాంతి -
జేఈఈ ఫలితాల్లో రెజోనెన్స్ విజయభేరి
హన్మకొండ: జేఈఈ–2026 మెయిన్స్లో రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్స్ సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్కు చెందిన 13 మంది విద్యార్థులు 99కి పైగా పర్సంటైల్, 69 మంది విద్యార్థులు 96 పర్సంటైల్, 161 మంది విద్యార్థులు 90కి పైగా పర్సంటైల్ సాధించి ఎప్పటిలాగే సత్తా చాటారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బి.సాకేత్ రెడ్డి 99.93 పర్సంటైల్, ఎన్.నాగచైతన్య 99.78, పి.కార్తీకేయ 99.76, ఎ.రితిక 99.73, ఎం.సాయి కౌశిక్ 99.70, జె.హర్షిత్ 99.68, వై.సాత్విక 99.65, ఎం.అషార్ ఇక్బాల్ 99.36, ఆర్.జయంత్ 99.34, సి.హెచ్.సాయి వర్షిత్ 99.21, జి.వర్థిని 99.18, ఎస్.అకర్ష్ 99.15, ఎం.సాత్విక్ రెడ్డి 99.02 పర్సంటైల్ సాధించారని వివరించారు. వీరితో పాటు తమ కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అర్హత పొందడానికి అవసరమైన పర్సంటైల్తో పాటు ప్రతిష్టాత్మక ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ విజయం వెనుక విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, తమ ఫ్యాకల్టీ అత్యుత్తమ బోధన ఉందన్నారు. కార్యక్రంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి, అకడమిక్ డీన్ బి.ఎన్.గోపాల్రావు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.నాగచైతన్యఅర్రం రితికపెర్న కార్తీకేయ -
ఓటెయ్యకుండా అడ్డుకున్నారు..
జనగామ: జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓటువేయకుండా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, దళిత కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, మంజుల అన్నారు. మంగళవారం చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికక సంబంధించి చేతులెత్తే సమయంలో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన 8వ వార్డు దళిత కౌన్సిలర్ మంజుల చెయ్యిని లాగి, దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత కౌన్సిలర్ చెయ్యి ఎత్తే క్రమంలో పాండు చేతిని కిందకు కొడుతూ, కరుణాకర్రెడ్డి దాడి చేస్తూ.. ‘మాదిగవు, నీకు ఓటు అవసరమా’.. అంటూ దుర్భాషలాడడం క్షమించరాని నేరమన్నారు. ఎన్నికల అధికారి సమక్షంలో జరిగిన ఈ ఘోరాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్కు చేయెత్తే క్రమంలో కరుణాకర్రెడ్డి, పాండు తన చెయ్యిని బలవంతంగా కిందకు దింపి దాడి చేశారని మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీల్లా వ్యవహరించిన పాండు, కరుణాకర్రెడ్డిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేసి, చైర్మన్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనగామ దళిత జాతి ఆందోళనకు దిగుతుందని, ఇద్దరి ఇళ్లను ముట్టడిస్తుందన్నారు. అలాగే, జనగామ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. దళిత కౌన్సిలర్పై ఓటింగ్ హాల్లో ఇద్దరు రౌడీల్లా వ్యహరిస్తే పోలీసులు చోద్యం చూశారన్నారు. ఈ ఘటనపై ఆర్డీఓతోపాటు డీసీపీ రాజమహేంద్రనాయక్, సీఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.ఆ ఇద్దరిపై అట్రాసిటికేసు నమోదు చేయాలి 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకోకుంటే ఇళ్లను ముట్టడిస్తాం జనగామ బంద్కు పిలుపునిస్తాం ఎమ్మెల్యే పల్లా, దళిత కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, మంజులఇద్దరు కౌన్సిలర్లపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపు కేసు జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లాటరీ ఎంపిక సమయంలో 8వ వార్డు కౌ న్సిలర్ సందుపట్ల మంజుల చెయ్యి ఎత్తే క్ర మంలో అడ్డుకున్న కాంగ్రెస్ 27వ వార్డు కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి, 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండుపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి మంగళవారం తెలిపారు. మహిళా సభ్యురాలు మంజుల ఫిర్యాదుపై ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపీరామ్ ఆదేశాల మేరకు ఇద్దరు కౌన్సిలర్లపై ఎస్సీ ఎస్టీ, చే యి లాగడం, బెదిరింపులకు పాల్పడిన ఘట నలపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
సంక్షేమాన్ని సమగ్రంగా చూడాలి
● రిజిస్ట్రార్ రామచంద్రం ● కేయూలో ముగిసిన జాతీయ సదస్సు కేయూ క్యాంపస్ : సంక్షేమాన్ని కేవలం రాజకీయ కోణంలోనేకాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల్లో సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉందని, సంక్షేమం రాజ్యాంగ హక్కుల్లో అంతర్భాగంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘పాపులిస్టు పాలిసీస్ ఇన్ పోస్టులిబరలైజేషన్ ఇండియా’ అనే అంశంపై రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు మంగళవారం సాయంతం ముగిసింది. ఈ ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశం ఒక వెల్ఫేర్ స్టేట్ అని పేర్కొన్నారు. సంక్షేమం దీర్ఘకాలిక అభివృద్ధిలో వ్యూహంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్. సుకుమార్ అన్నారు. కార్పొరేట్ వర్గాలకు బ్యాంకు, ఇతరత్రా రుణాలు మాఫీచేసిన ప్రభుత్వాలు.. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మితిమీరిన జనాకర్షక పథకాలు సముచితం కాదని వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్అన్నారు. పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్ మల్లికార్జున్రెడ్డి, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ టి. మనోహర్, బోర్డు ఆఫ్స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధచోట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. జాతీయ సదస్సుకు సంబంధించి పరిశోధనాపత్రాలతోకూడిన బుక్లెట్ను రిజిస్ట్రార్, ఇతర అతిథులు ఆవిష్కరించారు. -
నాడు ఎంపీటీసీ.. నేడు చైర్పర్సన్
అప్పుడు భాస్కర్రెడ్డి.. ఇప్పుడు బాలమణి● నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ‘డ్రా’ ద్వారా చైర్మన్ జనగామ: జనగామ మున్సిపాలిటీ చరిత్రలో అరుదైన రాజకీయ వాతావరణం మరోసారి వెలుగు చూసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వీరారెడ్డి భాస్కర్రెడ్డి, రొండ్ల లక్ష్మారెడ్డికి సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానంలో డ్రా తీసి భాస్కర్రెడ్డిని చైర్మన్గా ఎన్నుకున్నారు. అదే ఘటన ఇప్పుడూ పునరావృతమైంది. ప్రస్తుత(2026) ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతినే అనుసరించాల్సి వచ్చింది. నియమ నిబంధనల ప్రకారం ఎన్నికాధికారులు లాటరీ విధానాన్ని అమలు చేయగా, చరిత్ర మరోసారి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. తొమ్మిది మంది మహిళలే.. డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పాలకవర్గంలో తొమ్మిది మంది మహిళలు ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. 2వ వార్డు, 4, 5, 6, 10, 11, 14వ వార్డు మహిళలకు రిజర్వ్ కాగా, 1, 13వ వార్డులు జనరల్ స్థానాల్లో మాదా లావణ్య, ఎల్లావుల సువర్ణ పోటీ చేసి విజయం సాధించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కూడా మహిళలనే వరించగా పార్టీల పరంగా కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డోర్నకల్: తాజా మున్సిపల్ ఎన్నికల్లో డోర్నకల్ చైర్పర్సన్గా ఎన్నికైన కొండేటి రాజకుమారి గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పని చేశారు. 2006 నుంచి 2011 ఎంపీటీసీగా పని చేసిన రాజకుమారి.. 15 సంవత్సరాల తర్వాత రాజకీయ పునరాగమనం చేశారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు సభ్యురాలిగా గెలుపొంది చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. నాటి సర్పంచ్ నేటి వైస్ చైర్పర్సన్.. మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎంపికై న మాదా లావణ్య 2014 నుంచి 2019 వరకు డోర్నకల్ సర్పంచ్గా పని చేశారు. గతంలోనూ లావణ్య వార్డు సభ్యురాలిగా పని చేశారు. -
తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అప్రజాస్వామికం
దేవరుప్పుల : ప్రజాక్షేత్రంలో ఓటర్లు బీఆర్ఎస్కు మెజార్టీ తీర్పు ఇచ్చినా ప్రభుత్వ యంత్రాంగం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ దుర్మార్గ ఆలోచనలతో చేజిక్కించుకుందన్నారు. రాష్ట్రంలో ఓటమిని అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో అక్రమంగా ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ఆఫీషియా ఓటు హక్కు కల్పించి రహ స్య పద్ధతిలో లక్కీ డ్రా తీశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో అత్తాకోడళ్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి అధికార దుర్వినియోగం, గుండాయిజం ప్రదర్శించి అభాసుపాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ కావ్య ఓటు హక్కుపై నిజనిర్ధారణ చేసే ప్రతులను ప్రదర్శించారు. నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మన్ ధారావత్ గాంధీ నాయక్, పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి పాల్గొన్నారు. రాజ్యసభ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
సాక్షి, మహబూబాబాద్/డోర్నకల్/తొర్రూరు: జిల్లాలోని డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సాఫీగా జరుగగా.. తొర్రూరు మున్సిప ల్ చైర్మన్ ఎన్నిక మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. లాటరీ పద్ధతిన చైర్మన్, వైస్ చైర్ప ర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. లాట రీలో కాంగ్రెస్ వార్డు సభ్యులను అదృష్టం వరి ంచి పదవులు దక్కాయి. భారీగా పోలీసుల మోహరింపు.. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వివా దం చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ శాఖ దాదాపు వెయ్యి మందికి పైగా తొర్రూరు తరలించి బందోబస్తు నిర్వహించారు. పట్టణానికి నలుదిశల్లో చెక్ పోస్టులు పెట్టి అనుమానాస్పద వ్యక్తులను అడ్డుకున్నారు. అదే విధంగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేసి నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్ నర్సింహులపేటకు వెళ్లి దయాకర్రావుకు మద్దతు తెలిపారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత మధ్య లాటరీ ప్రక్రియ జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. సోమవారం తొర్రూరు, డోర్నకల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం ఆర్డీఓ గణేశ్ ఇరు పార్టీల సభ్యులకు ఎన్నిక ప్రక్రియ గురించి వివరించారు. మళ్లీ ఇరు పార్టీల చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించడం.. బలపర్చడం వంటి ప్రక్రియ తర్వాత చైర్మన్ ఎంపిక కోసం చేతులెత్తే ప్రక్రియను నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి తొమ్మిది మంది వార్డు సభ్యులు చేతులు ఎత్తారు. అదే విధంగా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి ఏడుగురు వార్డు సభ్యులతోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ కూడా చేతులు ఎత్తడంతో సమాన ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో లాటరీ పద్ధతిన ఎన్నిక నిర్వహిస్తాం.. సహకరించాలని అధికారులు ఇరు పార్టీల సభ్యులను కోరారు. అయితే ఎంపీ కడియం కావ్య ఓటు వేయడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వరంగల్ మున్సిపాలిటీలో ఓటు వేసేందుకు సిద్ధమైన ఆమె తొర్రూరులో వేసేందుకు అనర్హురాలని ప్రశ్నించారు. ఇందుకు కావాల్సిన ఆధారాలు చూపించాలని పట్టుబట్టారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అడిగిన సమాచారం ఇస్తామని ఆర్డీఓతో తెలిపి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లలో ఒక్కొక్కరి పేరు ఐదు చీటీల మీదరాసి మొత్తం పది చీటీలు ఒక డబ్బాలో వేశారు. చీటీలకు కలియ తిప్పి.. అందరికి చూపిస్తూ ఆర్డీఓ అందులో నుంచి ఒక చీటీనీ తీశారు. అలా లాటరీలో వచ్చిన పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజిని వైస్ చైర్పర్సన్గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో ఒకే ఒక ప్రతిపాదన సభ్యులు ఆలస్యంగా వచ్చారని వాయిదా పడిన డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి ముగ్గురు వార్డు సభ్యులు చైర్మన్ పదవికోసం పోటీ పడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో కానీ సభ్యులు మాత్రం సమయానికి రాలేదు. దీంతో మంగళవారానికి వాయిదా పడింది. అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియలో ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్ కోసం ప్రతిపాదనలు తెలపాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరిని ప్రతిపాదించక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకుమారిని చైర్పర్సన్గా, లావణ్యను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్త వాతావరణం ముందస్తు జాగ్రత్తగా పట్టణాన్ని దిగ్బంధించిన పోలీసులు లాటరీ ద్వారా చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎంపిక ఎంపీ కావ్య ఓటు చెల్లదని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ ఏకగ్రీవ ఎన్నిక


