Mahabubabad District Latest News
-
బస్సు సౌకర్యం కల్పించాలి
నెహ్రూసెంటర్: ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, అదనపు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికులు ఫోన్ ద్వారా వినతులను సమర్పించారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి 14 వినతులు వచ్చినట్లు డీఎం ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్–సింగారం–మునిగలవీడు, మహబూబాబాద్–మట్టెవాడ–గూడూరు, మహబూబాబాద్–మరిపెడ–రాంపూర్–హైదరాబాద్, మరిపెడ–చిన్నగూడూరు సర్వీసులను నడిపించాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. మరిపెడ బస్టాండ్ ప్రాంగణంలో సమయపాలన సూచిక ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు డీఎం తెలిపారు. సదరు రూట్లను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని డీఎం వెల్లడించారు. -
నిబంధనలు పాటించాలి
డోర్నకల్: విత్తన విక్రయ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీఏఓ విజయనిర్మల సూచించారు. డోర్నకల్, గొల్లచర్ల, చిలుకోడు గ్రామాల్లోని ఫెస్టిసైడ్స్ దుకాణాలతో పాటు సొసైటీ కార్యాలయాల్లో శుక్రవారం డీఏఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులతో పాటు విత్తనాల నిల్వ లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. దుకాణదారుల పీఓఎస్ మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. దుకాణదారులు స్టాక్ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మురళీమోహన్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. ● డీఏఓ విజయనిర్మల -
వ్యాపారుల ఇష్టారాజ్యం!
మహబూబాబాద్: పశు వధశాలలు లేకపోవడంతో మాంసం విక్రయాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా పశు వధశాలల్లో గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉంటేనే వధించేందుకు పశువైద్యాధికారి అనుమతి ఇస్తారు. కాగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో పశు వధశాలలు లేకపోవడంతో పలువురు వ్యాపారులు చనిపోయినవి, అనారోగ్యంతో ఉన్న వాటిని వధించి విక్రయిస్తున్నారనే ఆరోపణ లు వస్తున్నారు. కాగా పన్ను వసూలు చేసేందు కు మాత్రం కమేళా వేలం నిర్వహిస్తున్న మున్సిపాలిటీలు.. ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో కానరాని పశు వధశాలలు.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు మానుకోట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రంలో పశువధశాలలు లేవు. కాగా మానుకోట మున్సిపాలిటీగా ఏర్పడకముందే.. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సుమారు 40ఏళ్ల క్రితం పశువధశాల నిర్మించి వ్యాపారాలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మూత పడింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధి పశు సంత సమీపంలో పశువధశాల ఉన్నప్పటికీ అది మూతపడింది. ఇలా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం పశువధశాలలు లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా, అధిక ధరలకు మాంసం విక్రయాలు జరుపుతున్నారు. కిలో మాంసం ధర రూ.1000 కాగా, బోన్లెస్ మటన్ ధర రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. వధశాల ఉంటే.. పశువధశాల ఉంటే.. అందులో పశువైద్యాధికారి పరీక్షలు నిర్వహించి జీవాలు ఆరోగ్యంగా ఉంటేనే కోసేందుకు అనుమతి ఇస్తారు. స్లాటరీ, సర్టిఫై చేసి, స్టాంప్ వేసిన తర్వాత మాంసం విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా ఆరోగ్యవంతమైన జీవాల మాంసం కొనుగోలు చేసిన ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఎలాంటి నిబంధనలు లేకుండానే.. వ్యాపారులు తక్కువ ధరలకు వయస్సు మీదపడిన, అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెలు కోనుగోలు చేసి వాటిని వధించి విక్రయాలు చేస్తున్నారు. షాపుల వద్ద కనీస పరిశుభ్రత పాటించడం లేదు. అక్కడ సరైన నీటి వసతి కూడా ఉండడం లేదు. బకెట్లో నీళ్లు తెచ్చుకుని దానిలో కడిగి వ్యర్థాలు కూడా అక్కడే వేస్తున్నారు. దుర్గంధం వెదజల్లడంతో పాటు ఈగలు వాలుతున్న మాంసం వికయ్రిస్తున్నారు. కొంత మంది ఎక్కడో కోసుకుని వచ్చి మాంసం మాత్రం రోడ్లపై పెట్టి విక్రయిస్తున్నారు. అది ఏ జంతువు మాంసం అనేది తెలియకుండానే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారంగా భావిస్తున్నారే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. స్థలాల కేటాయింపు పరిశీలనకే పరిమితం.. మానుకోట మున్సిపాలిటీలతో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో పశువధశాలల ఏర్పాటుకు స్థలా ల పరిశీలన చేశారు. కానీ నేటి వరకు స్థలాల కేటా యింపు జరగలేదని అధికారులు తెలిపారు. వధ శాలల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో కానరాని పశు వధశాలలు విచ్చలవిడిగా మాంసం విక్రయాలు చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న జీవాలను వధిస్తున్నట్లు ఆరోపణలు -
శిథిలావస్థలో ‘డబుల్ ఇళ్లు’
డోర్నకల్: మండలంలోని వెన్నారం గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇళ్ల పంపిణీ అటకెక్కింది. 2017లో 72 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాగా 2019లో 18ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్, సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. విద్యుత్ మీటర్లు ఊడి, కిటికీల అద్దాలు పగిలి ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. అలాగే కొద్ది రోజుల క్రితం మధ్యలో నిచిలిపోయిన మరో 26ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోవడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 440 దరఖాస్తులు.. వెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 440 మంది దఖాస్తు చేసుకున్నారు. ఇటీవల మొదటి విడతలో 28మందికి ఇళ్లు మంజూరయ్యాయి. కాగా 23 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. వీరిలో చాలామంది ముగ్గులు పోసుకుని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. వెన్నారంలో 72ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం 44ఇళ్లు పూర్తి.. పంపిణీపై దృష్టి సారించని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం 440 దరఖాస్తులు.. 28మందికి మంజూరు -
ప్రాణం పోస్తున్నారు..
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ●● రక్తదానంలో యువత ముందంజ●● అవగాహన కల్పించడంలో ఎన్జీఓల కృషి ● అత్యవసర సమయంలో కాపాడుతున్న రక్తదాతలుప్రమాదం జరిగినప్పుడు.. అనారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తం అందక అనేకమంది మృత్యుఒడికి చేరిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం ఎన్జీఓలు, యువజన సంఘాలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా రక్తదానంపై వారిలోని అపోహలను దూరం చేస్తున్నారు. తద్వారా అనేకమంది యువత రక్తదానం చేసి చావుబతుకుల్లో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భం ప్రత్యేక కథనం. టేకుమట్ల: రక్తదానం చేయడం వల్ల నీరసించి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహ ప్రజల్లో ఉంటుంది. కానీ, అలాంటిది జరగదు. కేవలం 21 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రక్తం శరీరంలో సమకూరుతుంది. అలాగే 6 నుంచి 12 వారాల్లో పురుషులకు, 6 నుంచి 16 వారాల్లో మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయిలు సమంగా చేరుకుంటాయి. ఈవిషయంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రెడ్క్రాస్ వంటి సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా చొరవ చూపుతున్నాయి. దీంతో యువత రక్తదానం వైపు అడుగు వేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. ఎవరు రక్తదానం చేయాలి.. ఎవరు రక్తదానం చేయాలనే విషయంపై ఎంతో మంది ఆలోచనలో పడి రక్తదానం చేయడంలో కాస్త వెనుకడుగేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హెపటైటిస్ బీ, హెచ్ఐవీ, రక్తహీనత, బలహీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. రక్తదానం చేసేందుకు అనర్హులుగా వైద్యులు చెబుతారు. ఎంతో మందికి పునర్జన్మ అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది పునర్జన్మ పొందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు. -
అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: అసంక్రమిత వ్యాధుల ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నర్సింగ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మా ట్లాడుతూ.. టెలిమానస్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్పెషలిస్టు డాక్టర్లతో కౌన్సెలింగ్, చికిత్స అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా అబా కార్డులను జనరేట్ చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, మాస్ మీడియా అధి కారి కొప్పు ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, డీడీఎం సౌమిత్, సూపర్వైజర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. స్థాయికి మించి వైద్యం చేస్తే చర్యలు డోర్నకల్: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. డోర్నకల్ పట్టణం ఇందిరానగర్లోని ప్రైవేట్ క్లీనిక్లో నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు శుక్రవారం క్లీనిక్ను సీజ్ చేశారు. బ్యాంక్ స్ట్రీట్లోని మరో క్లీనిక్లో ఆర్ఎంపీ స్థాయికి మించి వైద్యం చేస్తున్నాడని హ్యూమన్ రైట్స్కు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు దానిని కూడా సీజ్ చేశారు. కార్యక్రమంలో అధికారి కొప్పు ప్రసాద్ పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్, నూతనంగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారురు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. కేసముద్రం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని ఎమ్మెల్యే తెలి పారు. అలాగే మహబూబాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి, త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. యోగాతో సంపూర్ణ ఆర్యోగం కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: ప్రతీ ఒక్కరు పోషకాహారం తీసుకోవడంతో పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఆయుష్శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి చేతుల మీదుగా యోగా పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాతోనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రావణ్ కుమార్, డీవైఎస్ఓ జ్యోతి, యోగా ఇన్స్ట్రక్టర్ డాక్టర్ హేమ, కమల్, పావని, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన సీఆర్పీఎఫ్ ఐజీ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. టూరిజం గైడ్ వెంకటేష్ ఆలయ విశిష్టతను వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్సై చల్లా రాజు పాల్గొన్నారు. రేపు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం 10గంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు. తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈ ఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి–తిరుపతి మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. జూలై 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చర్లపల్లి–తిరుపతి (07251) ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో జూలై 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–చర్లపల్లి (07252) ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు చేరుకుటుంది. 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు అప్ అండ్ డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డిమందు స్వాధీనం
కాటారం(మహాముత్తారం): కాటారం, మహాముత్తారం మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డి మందు దందాను పోలీసులు, వ్యవసాయశాఖ అధికా రులు ఛేదించారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో ఎస్సై మహేందర్కుమార్, ఏఓ అనూష సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డి మందు నిల్వలను పట్టుకున్నా రు. కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్ శుక్రవారం మహాముత్తారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరా లను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఘనికపూడికి చెందిన అచ్చ హన్మంతరావు, కాటారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ సమ్మిరెడ్డి, మల్హర్ మండలం పాతరుద్రారానికి చెందిన జాడి సమ్మయ్య, మహాముత్తారం మండలం నల్లగొండ మీనాజిపేటకు చెందిన చీర్ల సతీశ్, కాటారానికి చెందిన బొమ్మన వెంకట స్వామి, కొత్తపల్లికి చెందిన కందుల కోటేశ్వరరావు.. నకిలీ పత్తివిత్తనాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానితుల ఇళ్లలో శుక్రవారం దాడులు నిర్వహించగా.. భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు, నిషేధిత గడ్డిమందు గుర్తించినట్లు తెలిపారు. సుమారు రూ.5,06,250 విలువ చేసే 202.5కేజీల నకిలీ పత్తి విత్తనాలు, సుమారు రూ.1,20,000 విలువ చేసే 300లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనపర్చుకున్నట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. ఏఓ అనూష ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాటారం, మహాముత్తారం మండలాల్లో అధికారుల తనిఖీలు ఆరుగురిపై కేసు నమోదు -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
కొత్తగూడ: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణ తాగునీటి సరఫరశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందాపురంలో ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా మరిన్ని ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే జీర్ణించుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీ ర్వదించాలని కోరారు. అనంతరం గోవిందాపురం జీపీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. విద్యకు పెద్దపీట.. నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నా రు. మండలకేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకుసామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతుల మానిటర్ను పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. కొత్తగూడ, గంగారం మండలాల ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు పాకాల చెరువుపై లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీడబ్ల్యూఓ ధనమ్మ, మండల స్పెషల్ ఆఫీసర్ సురేశ్, కొత్తగూడ, గంగారం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క -
బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడి మృతి
● మృతుడిది ఖమ్మం జిల్లా మద్దులపల్లి వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాల బాత్రూంలో జారిపడి ఉపాధ్యాయుడు మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ రాజేంద్ర ప్రసాద్(55) పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం బడిబాట కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా రాజేంద్ర ప్రసాద్కు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో (కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు) పాఠశాలలోనే ఉండాలని తోటి సిబ్బంది చెప్పి వెళ్లారు. ఈనేపథ్యంలో హాస్టల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్ కోసం భోజనం తీసుకుని క్వార్టర్స్కు రాగా.. బాత్రూంకు వెళ్లి వచ్చాక భోజనం చేస్తానని చెప్పాడు. ఎంతకూ బాత్రూంనుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది.. తలుపు తెరిచి చూడగా కింద పడిపోయి ఉన్నారు. దీంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడినుంచి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజేంద్ర ప్రసాద్కు భార్య ప్రమీలరాణి, కుమారుడు రామ్కుమార్, కుమార్తె స్రవంతి ఉన్నారు. ఏటీడబ్ల్యూఓ క్షేత్రయ్య ఏటూరునాగారం వైద్యశాలకు వచ్చి వివరాలు సేకరించారు. -
ఆయుర్వేదంలో నూతనవిధానాలను అన్వేషించాలి
● స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సులో ప్రముఖ వైద్యులు జనగామ: ఆయుర్వేద వైద్య రంగంలోకి రాబోతున్న నూతన వైద్యులు నూతన విధానాలను అన్వేషించాలని ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. జనగామలోని వేద పంచఖర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సును నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాలల్గో రోజు సదస్సులో డాక్టర్ కల్నల్ భిక్షపత్తి మాట్లాడుతూ హృదయం, మెదడు, శ్వాస సంబంధిత అత్యవసర పరిస్థితులపై వైద్యవృత్తిని చేపట్టబోతున్న విద్యార్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. డాక్టర్ శివ మాట్లాడుతూ.. శాలాక్య తంత్రంలో స్వస్థ వృత్తం(తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు యాక్టివిటీస్) ప్రాముఖ్యతను వివరించారు. రుతు, దినచర్యలు మనిషి ఆరోగ్య పరిరక్షణకు ఎలా ఉపయోగపడతాయనే పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ వందనాసింగ్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ లక్ష్మణ్ యాదవ్, డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడారు. -
రాజీమార్గమే మేలు..
మహబూబాబాద్ రూరల్ : ప్రజలు పగలు, ప్రతీకారాలను పక్కనపెట్టి రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుంది. ఈమేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ, సెక్రటరీ, నర్సంపేట సీనియర్ సివిల్ జడ్జి వరూధిని ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. అదే విధంగా తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలోనూ లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం.. సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వేదికగా కక్షిదారులు రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కోరుతుంది. సుప్రీంకోర్టు 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీకి చట్టబద్ధమైన హోదాను కల్పించింది. అప్పటినుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయమూర్తులు చర్యలు తీసుకుంటున్నారు. జడ్జిలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్, సివిల్ పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ వివిధ కేసుల్లోని కక్షిదారులను సమన్వయం చేస్తూ కేసులను పరిష్కరిస్తున్నారు. పరిష్కరించేందుకు సిద్ధం.. రాజీ పడదగిన సివిల్, మోటార్ వాహన ప్రమాదాలు, క్రిమినల్, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యు త్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కో ర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటున్నారు. కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలి.. లోక్ ఆదాలత్ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు, కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అందుకనే లోక్ అదాలత్లో కేసులను రాజీచేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి. మహమ్మద్ అబ్దుల్ రఫీ, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి. రాజీ కుదుర్చుకోండి.. ప్రశాంతంగా జీవించండి నేడు జాతీయ లోక్ అదాలత్ -
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి
● కార్యకర్తలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపు కొత్తగూడ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరా జ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూ చించారు. మహబూబా బాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన కొత్తగూడ, గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐఏఎస్ అధికారుల బదిలీల వల్ల కొంత జాప్యం జరుగుతుందని, వారం పది రోజుల్లో ఎన్నికలపై స్పష్టత వస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. రైతు భరోసా కొంత ఆలస్యమవుతున్న విషయం నిజమేనని, అది కూడా త్వరలో ప్రభుత్వం వేస్తుందన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలతో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు మంత్రి సీతక్క.. సామూహిక విద్యాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. ప్రైవేట్లో అధిక ఫీజులను నియంత్రించాలి విద్యారణ్యపురి: ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారాన్ని నియంత్రించాలని విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేదవర్గాల పిల్లలకు అడ్మిషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. హనుమకొండ డీఈఓ వాసంతి, వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్కు శుక్రవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దాసు సురేష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్డూ.. అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. పేదపిల్లలకు ప్రైవేట్లో ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలోనే ఉందన్నారు. ప్రతి తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వంగ రవియాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుగొండ హైమవతి, సిలువేరు రవీందర్, అశోక్, కొడపాక దేవి, శ్రీరామోజు అంజలి, యోగేశ్వర్ పాల్గొన్నారు. -
విలువైన ప్రాణాలను కాపాడొచ్చు..
ప్రతీ సంవత్సరం అక్టోబర్లో నిర్వహించే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. గ్రామాల్లోని యువతకు రక్తదానంపై అవగాహన కల్పించి ఎంతో మందిచే రక్తదానాన్ని చేయించాను. రక్తదానంపై అపోహలను నివృత్తి చేస్తూ ముందుకు సాగేలా కృషి చేశాను. భవిష్యత్లో కూడా యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూ నేను చేసేందుకు సిద్దంగా ఉన్నాను. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. – దాసరి సుధాకర్, ఎస్సై టేకుమట్ల -
కేఎంటీపీ టౌన్షిప్ పనులు పూర్తి చేయాలి
గీసుకొండ: వరంగల్ గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో భూములు కోల్పోయిన 863 మంది రైతులకు ప్లాట్ల కోసం అభివృద్ధి చేసిన ‘రాజీవ్ మెగా లేఅవుట్ టౌన్షిప్’ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి కేఎంటీపీని సందర్శించారు. టౌన్షిప్లో పురోగతిలో ఉన్న ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వ, మంచినీరు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వెంటనే లేఅవుట్ మంజూరు చేసి ప్లాట్లు కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్ చేయించాలని ‘కుడా’ అధికారులను ఆదేశించారు. గణేశా ఎకోపెట్, యంగ్వన్ కంపెనీల్లో తయారవుతున్న ఉత్పత్తులు, కై టెక్స్ కంపెనీలో జరుగుతున్న ట్రయల్రన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మూడు కంపెనీల ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులతో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. కేఎంటీపీలో వరద మంపును నివారించడానికి వంద మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కాల్వ పనులను పరిశీలించి సాంకేతికంగా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ఎంత వరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు పంపాలన్నారు. టీజీఐఐసీ చీఫ్ ఇంజనీర్ రవి, జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, గణేశ కంపెనీ వైస్ చైర్మన్ కేఎస్ రెడ్డి, హెచ్ఆర్ శంకర్, టీజీఐఐసీ, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్కుమార్ టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల ఉత్పత్తుల పరిశీలన -
మేనత్తను హతమార్చిన మేనల్లుడి అరెస్టు
వరంగల్ క్రైం: మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన వరంగల్లోని మట్టెవాడ రాజీవ్కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్ని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు ఈస్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు రూ.18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగా రు, 34 గ్రాముల వెండి అభరణాలతోపాటు రూ.10 వేలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప (70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించి ప్రణయ్ని శుక్రవారం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్లో విచారించినట్లు తెలిపారు. ఈక్రమంలో ప్రణయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జల్సాలు, బైక్ కొనుగోలుకు పెద్ద మొత్తంలో అప్పు చేసినట్లు తెలిపారు. ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న తన మేనత్త స్వరూప వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని, ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని ప్లాన్వేసినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన తన మేనత్త స్వరూప వద్దకు వెళ్లిన ప్రణయ్ ఆమెతో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. స్వరూప గాఢ నిద్రలో ఉన్న సమయంలో డంబెల్తో మేనత్త తలపై కొట్టినట్లు తెలిపారు. స్వరూప మరణించినట్లుగా నిర్ధారించుకుని ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతోపాటు ఇంట్లోని వెండి ఆభరణాలు, డబ్బును దోచుకొని వెళ్లినట్లు తెలిపారు. 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్కుమార్ -
చిన్నతనంలోనే పెళ్లి!
సాక్షి, మహబూబాబాద్: యుక్తవయస్సు రాకముందు వివాహాలు జరిగితే మగవారికి బాధ్యత తెలియదు.. ఆడవారి ఆరోగ్యం సహకరించదు. చదువుకునే వయస్సులో పెళ్లిళ్లు చేసుకుంటే ఎన్నో బాధలు, మరెన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత మంది ఉద్యోగులతో నిఘా పెట్టిన జిల్లాలో బాల్య వివాహాలు ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి నెట్వర్క్ ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో బాల్య వివాహాలను అడ్డుకోలేక పోతున్నారు. వివాహ తంతు ముగిసిన తర్వాత సమాచారం తెలుస్తుండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. 291 వివాహాలు అడ్డుకున్న అధికారులు జిల్లా వ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 291బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన లేకపోవడం, ఆకర్షణకు లోనై పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో తొందరగా పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందనే ఆలోచనతో తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తున్నారు. అడ్డుకున్నవి తక్కువే.. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతుంటే.. పదుల సంఖ్యలో మా త్రమే అడ్డుకుంటున్నారనే విమర్శలు వస్తున్నా యి. బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను అడ్డుకోవడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దత్తత, వీధి బాలల సంరక్షణ, అనాథ పిల్లల సంరక్షణ మొదలైన వాటికోసం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు, చైల్డ్లైన్, బాలల పరిరక్షణ, మహిళా సాధికారత వంటి విభాగాలతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. బాలల సంక్షేమం కోసం ప్రతీ జిల్లాలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలో చైర్పర్సన్, మరో ఇద్దరు కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో సమన్వయం లేకపోవడంతో బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు క్షేత్ర స్థాయికి చేరడం లేదని విమర్శలు ఉన్నాయి. అదే విధంగా బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు, ప్రమాదాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, ప్రతీ నెల సీడీపీఓలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించినా పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శ ఉంది. దీనికి తోడు ఫిర్యాదులుకు స్పందించకపోవడం, రాజకీయ ఒత్తిడికి తలొగ్గడం, పలువురు ఉద్యోగులు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి జరిగేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి కట్టడి చేస్తాం జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉండడం బాధాకరం. దీనిని అదుపు చేయడం కోసం జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో క్షేత్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే అదరి సహకారం కావాలి. –రాజ్యలక్ష్మి, బాలరక్షాభవన్ కోఆర్డినేటర్నాలుగు సంవత్సరాలుగా జిల్లాలోని అడ్డుకున్న బాల్య వివాహాల వివరాలు.. 2021లో 109 2022 68 2023 37 2024 53 2025 24(ఇప్పటి వరకు) మొత్తం 291జిల్లాలో ఆగని బాల్య వివాహాలు అవగాహన లేకపోవడంతో అనర్థాలు ప్రేక్షక పాత్రలో అధికారులు వివాహం తర్వాత సమాచారంతో ఏమీ చేయలేని పరిస్థితిఅదుపు చేయకపోతే అంతే సంగతులు.. జిల్లాలో జరుగుతున్న బాల్య వివాహాలను అదుపు చేయకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు, మానసికవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏజెన్సీ గూడేలు, గిరిజన తండాల్లో చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎక్కువగా ఉన్నారు. రక్తహీనత, గైనిక్ సమస్యలతో సతమతమవుతున్నవారు అధికంగా ఉన్నారు. చిన్నతనంలో వివాహాలు, కుటుంబ పోషణ భారం, భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 836 మంది సీ్త్రలు ఉన్నట్లు జాతీయ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరినట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రజాభవన్లో బట్టి విక్రమార్కను వారు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు చెప్పిన వెంటనే ట్రాన్స్ కో సీఎండీకి ఫోన్ చేసి త్వరలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ మార్పు చేయడంతోపాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, 01.02.1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సంస్థలో మిగిలివున్న 6,500 అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఖాళీలను భర్తి చేయాలని, ట్రాన్స్కో సీబీడీ గ్యాంగ్లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు విద్యార్హతతో పనిలేకుండా గ్రేడ్–1 జీతం ఇవ్వాలని కోరామన్నారు. కారుణ్య నియామకాల వయస్సును 25 నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని కోరినట్లు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సమావేశంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, బీఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
భూమికి పరిహారం చెల్లించాలని..
కురవి: తన భూమికి పూర్తి పరిహారం చెల్లించకుండా గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నారని మహబూ బాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో రైతు నూకల రవి పురుగుల మందు డబ్బా పట్టుకుని హైవే రోడ్డు కోసం పక్కన నిర్మించిన విద్యుత్ స్తంభం(టవర్) ఎక్కాడు. పూర్తి పరిహారం చెల్లించే వరకు దిగేది లేదని, పురుగుల మందు తాగి టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. తన 1.34 ఎకరాల భూమి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ చేశారని, 1.12 ఎకరాలకు నష్టపరిహారం కింద రూ.14లక్షలు చెల్లించారని, ఇంకా 22 గుంటల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంకన్న, ఆర్ఐ రవి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్తంభం ఎక్కిన రైతుతో మాట్లాడారు. ఎంతచెప్పినా వినకుండా కిందికి దూకుతానని అనడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో టవర్ కింద రైతు తల్లి ఉప్పలమ్మ, భార్య రజిత, కొడుకు వంశీకృష్ణలు ఆందోళనకు దిగారు. చివరికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు సామ పాపయ్య సంఘటన స్థలానికి వచ్చి పరిహారం అందే వరకు నీ తరఫున పోరాటం చేస్తామని చెప్పడంతో టవర్ దిగాడు. మళ్లీ లారీల్లో మట్టి తీసుకొచ్చి పనులు చేస్తుండడంతో రవి ఆ వాహనం ఎదుట బైఠాయించాడు. భూమిలో పనులు చేయొద్దని కాంట్రాక్టర్కు చెప్పడంతోపాటు పూర్తిస్థాయి అందేలా సాయం చేస్తానని రవికి ఆర్ఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కాగా, ఈ విషయమై ఆర్ఐ రవికుమార్ వివరణ కోరగా నూకల రవికి సంబంధించిన బంధువు(పెద్దభార్య కొడుకు) తన కు వాటా కావాలని, పరిహారం చెల్లించాలని మహబూబాబాద్ కోర్టును ఆశ్రయించాడని, అందుకే పరిహారం అందడంలో ఆలస్యం అవుతుందని వివరించాడు. పురుగుల మందు డబ్బాతో విద్యుత్స్తంభం ఎక్కి రైతు హల్చల్ -
ఏటీఎం అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
జనగామ: ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, డబ్బులు డ్రా చేసుకుంటున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జనగామ పట్టణంలో శుక్రవారం జరిగింది. స్థానిక పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఇనుమెల్ల గ్రామానికి చెందిన ముల్లముడి వెంకటకోటేశ్వరావు ఓ కంపెనీలో ఆఫీస్బాయ్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ నష్టపోయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి.. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏటీఎంల నుంచి సులువుగా డబ్బులు ఎలా డ్రా చేయొచ్చని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న వెంకటకోటేశ్వరావు ప్రజలు ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు డ్రా చేసుకునే క్రమంలో వారిని మాటల్లో పెట్టి కార్డు మార్చి డబ్బులు డ్రా చేసుకునేవాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు డ్రా చేసుకుని నల్లగొండ, సంగారెడ్డి, పరకాల జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు. ఈక్రమంలో జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్ శివారు సూర్యబండ తండాకు చెందిన భూక్యా భాస్కర్ ఏటీఎం వద్ద గుర్తు తెలి యని వ్యక్తి ఏమార్చి డబ్బులు కాజేసినట్లు ఫిర్యాదు చేయడంతో.. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏఎస్పీ, సీఐ దామోదర్రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై భరత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏటీఎంల వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో బస్టాండ్ రోడ్డు వైన్స్ సమీపంలోని ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వెంకట కోటేశ్వరరావును ఎస్సై భరత్ అదుపులోకి తీసుకుని విచారించగా, ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కర్ణాకర్, సాగర్, మహేందర్, సల్మాన్లను సీపీ అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ -
విద్యార్థుల బడిబాట..
మహబూబాబాద్ అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆటపాటలకు గుడ్బై చెప్పి పాఠశాలలకు తొలిరోజు వెళ్లారు. 45 రోజులపాటు వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాటపట్టారు. ఇన్ని రోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు, బంధువులు తమ పిల్లలను పాఠశాలల వద్ద దింపారు. కొందరు చిన్నారులు నవ్వుతూ వెళ్లగా.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు ఏడుస్తూ మారం చేస్తూ కనిపించారు. కాగా బుక్స్టాళ్లు, షూమార్ట్లు, బట్టల షాపులు విద్యార్థులతో కిక్కిరిశాయి. హాజరు అంతంతే.. తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరుకాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడు తూ, పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలకు భిన్నంగా ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థులతో కళకళలా డాయి. అధికశాతం విద్యార్థులు హాజరయ్యారు. సమస్యల స్వాగతం.. ప్రతి ఏటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలికాయి. చాలాచోట్ల తాగునీరు, విద్యుత్ అంతరాయం, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో సమస్యలు దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు సరిగాలేక, ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కాగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. మరికొన్ని పాఠశాలల్లో యూనిఫాం అందజేశారు. జిల్లాలోని పలు తండాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని పాఠశాలలు కొన్ని తెరుచుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. విద్యార్థులు ఎదురుచూసి తిరిగి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ, గుమ్ముడూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలు హల్యానాయక్, ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. సమయానికి ఉపాధ్యాయులు హాజరుకావాలి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరుకావాలి. అదేవిధంగా గైర్హాజరైన, పాఠశాలలు సమయానికి తీయని ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేవిధంగా నడుచుకోవాలి. – రవీందర్రెడ్డి, డీఈఓపూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మొదటి రోజు పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తిచూపని స్టూడెంట్స్ -
రాఘవాపురాన్ని సందర్శించిన కేంద్ర బృందం
పాలకుర్తి టౌన్: కేంద్ర జలశక్తి పురస్కారానికి ప్రామాణిక అంశాలను పరిశీలించేందుకు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాఘవాపురం గ్రామాన్ని కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ సైంటిస్టు పి. యాదయ్య, కేంద్ర వాటర్ కమిషన్ సబ్ డివిజన్ ఇంజనీర్ డి. చైతన్య సందర్శించారు. గ్రామంలో పదేళ్లలో భూగర్భ జలాలు పెంచడానికి చేపట్టిన పనులను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా యాదయ్య, చైతన్య మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయన్నారు. పురస్కారం అందజేయడానికి దేశంలో 30 గ్రామాలను ఎంపిక చేశామని, ఇందులో తెలంగాణలో రాఘవాపురం గ్రామం ఎంపికై ందన్నారు. రాఘవాపురంలో వందశాతం ఇంకుడు గుంతలు, వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయిందన్నారు. గ్రామంలో చేపట్టిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలించామన్నారు. నివేదికను కేంద్ర భూగర్భ జలవనరుల శాఖకు అందజేస్తామని తెలిపారు. వారి వెంట డీఆర్డీఓ పీడీ వసంత, ఎంపీడీఓ ఆవుల రాములు, ఏపీఓ మంజుల, ఎంపీఓ రవీందర్, పంచాయతీ కార్యదర్శులు మహేందర్, కపిలవాయి వెంకటేశ్వరాచారి, యుగేంధర్, శీరిష, ప్రియాంక, మహేశ్యాదవ్, లింగయ్య తదితరులు ఉన్నారు. కేంద్ర జలశక్తి పురస్కారానికి ప్రామాణిక అంశాల పరిశీలన -
మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు కృషి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిన్ని పీఎంశ్రీ స్కూళ్ల ఎంపికకు తనవంతు కృషిచేస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం పాఠశాలల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పోటీపరీక్షల ద్వారానే నియమితులవుతారన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే సర్కారు బడులు జ్ఞానకర్మాగారాలుగా మారుతాయన్నారు.ఉపాధాయులు నిత్యవిద్యార్థిగా ఉంటూ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కృత్రిమ మేధతో తరగతి గదుల అనుసంధానం డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారని విద్యాబోధన పద్ధతుల్లో నవీనప్రక్రియలను చేపడుతోందన్నారు. ఈవిద్యాసంవత్సరంలో 135 పాఠశాలల్లో కృత్రిమ మేధ తరగతులను,16 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. డీఈఓ డి. వాసంతి మాట్లాడుతూ బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓ బి. మ నోజ్కుమార్, ఆ పాఠశాల హెచ్ఎం జి. ఉప్పల య్య, రిటైర్డ్ హెచ్ఎం బి. రాధ, పర్యావరణ పరిరక్షణ సమితి బాధ్యులు, రిటైర్డ్ డీఎఫ్ఓ కాజిపేట పురుషోత్తం, అశోక్బాబు, ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అదనపు కలెక్టర్లు లెనిన్వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిపాదనల ప్రకారం నిధుల మంజూరు జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో కమిటీ సభ్యులు లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
పెళ్లికి అడ్డుగా మారిన వరుస..
బయ్యారం: ప్రేమికురాలితో కడదాకా జీవిద్దామనుకుంటే వరుస అడ్డురావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమికుడు బలవన్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కాపువారిగూడెం గ్రామానికి చెందిన పానుగోత్ దేవీలాల్(34) మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నీటిపారుదలశాఖ ఏఈఈ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్లో మొ దటి పోస్టింగ్ పొందిన దేవీలాల్.. గార్లలో విధులు నిర్వర్తిస్త్తూ బయ్యారంలో అద్దెకుంటున్నాడు. పెళ్లికి యువతి నిరాకరణ.. దేవీలాల్కు ఉద్యోగం రాకముందు పది సంవత్సరాలుగా తన తండాకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి వరుసకు కూతురు అవుతుండడంతో పెళ్లికి అభ్యంతరాలొచ్చాయి. దీంతో మనస్తాపం చెంది మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కాలు కోల్పోయాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగం సాధించినా ఆ యువతిని మరవలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో దేవీలాల్కు పెళ్లి చేసేందుకు కుటుంబీకులు సంబంధాలు చూస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువతితో పెళ్లి అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగే ముందు చివరి ప్రయత్నంగా బుధవారం ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడాడు. అయితే వరుస కుదరని ఆ యువతి తెలపడంతో పురుగుల మందు తాగాడు. అనంతరం ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేసే అటెండర్ కుమారుడికి ఫోన్లో తెలిపాడు. వెంటనే దేవీలాల్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి మంగ్త్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. కూతురు వరుస కావడంతో పెళ్లికి అభ్యంతరం చెప్పిన యువతి వేరే సంబంధాలు చూస్తుండగా మనస్తాపంతో ఏఈఈ ఆత్మహత్య -
వ్యవసాయ సర్వీస్లు త్వరగా మంజూరు చేయాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని 16 సర్కిళ్లలో వ్యవసాయ సర్వీస్లను త్వరితగతిన మంజూరు చేయాలని ఆ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ లింకింగ్ లైన్లు 68 పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరు వరకు మిగతా 97 పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతీ సబ్ స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ కాకుండా నిర్వహణ చేపట్టాలని, పిడుగుల నిరోధకం అమర్చాలని సూచించారు. పురోగతిలో ఉన్న కొత్త సబ్ స్టేషన్ల పనులు వేగవంతం చేయాలన్నారు. పట్టణాల్లో అవసరమైన చోట 8 ఎంవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు టి.సదర్ లాల్, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, జీఎంలు ఉత్తమ్, సురేందర్, డి.ఈలు అనిల్ కుమార్, ప్రభావతి పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
వంట మనిషి ఇంట్లోనే బడి..
కేసముద్రం: ప్రాథమిక పాఠశాలకు సొంతభవనం లేక అద్దె భవనాల్లో నడిపిస్తూ వచ్చారు. చివరకు ఆ తండాలో అద్దెకు భవనం దొరకలేదు. దీంతో గత ఏడాది మధ్యాహ్న భోజనం వండి వడ్డించే వంటమనిషి ఇంట్లో బడిని నడిపించారు. అయితే స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా వంట మనిషి ఇంట్లోనే పాఠశాలను గురువారం పునఃప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కేసముద్రం మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారితండాలో 2001లో ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాగా, అప్పటి నుంచి సొంతభవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే బడిని నడిపిస్తూ వచ్చారు. మొదట్లో 60 మంది విద్యార్థులు ఉండగా, ఆ తర్వాత సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది. మూడేళ్ల క్రితం మన ఊరు–మన బడి కింద స్కూల్ భవనం కోసం రూ.28 లక్షల నిధులు మంజూ చేయగా.. పిల్లర్ల వరకే నిర్మాణం చేపట్టారు. తర్వాత పనులు చేపట్టకపోవడంతో అద్దె భవనంలోనే బడిని నడిపిస్తూ వచ్చారు. ఈ మేరకు గత ఏడాది తండాలో అద్దెకు భవనం దొరకలేదు. దీంతో బడిలో మధ్యాహ్నం భోజనం వండే వంట మనిషి వినోద.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తన ఇంట్లో బడిని నడిపించడానికి అంగీకరించింది. ఈఏడాది కూడా స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉండటంతో.. ఆమె ఇంట్లో రేకులషెడ్డుకింద బడిని పునఃప్రారంభించారు. ఇటీవల బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ ఉపాధ్యాయులు ప్రచారం చేస్తుండగా, సొంత భవనంలేని బడికి ఎలా పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, భవన నిర్మాణం పూర్తిచేయాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పాఠశాల -
పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తాం
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తామని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూని ఫాంలు పంపిణీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో అర్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారన్నారు. ఎంఈఓ బుచ్చయ్య, హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు తెచ్చుకోవాలి మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పాఠశాలలుగా గు ర్తింపు తెచ్చుకోవాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నా రు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా గురువారం మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు. డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. హెచ్ఎంధారావత్ బద్రునాయక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఈదులపూసపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం పూజారి వీరయ్య, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాశ్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్ విద్యార్థులు ల్గొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ కురవి: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ వి ద్యార్థులకు డీఈఓ రవీందర్రెడ్డి గురువారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన పాఠశాలను సందర్శించారు. హెచ్ఎం మహమ్మద్ వహీద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, రిటైర్డ్ టీచర్ వెంకట్రాంనర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీధర్, విజ య్రాజ్, వెంకన్న, వెంకటేశ్వర్లు, నరసింహచారి, ప్రేమ్సాగర్, దేవి, యాకమ్మ, మల్లికార్జున్రావు, రాజు, రత్నమాల, పద్మలత పాల్గొన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి -
చిత్రకళా ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఆడెపు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ గూగుల్ రజనీకాంత్ ప్రతిభను గుర్తించి వికీపిడియాలో చోటు ఇచ్చింది. అంతర్జాతీయంగా, జాతీయంగా విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలు చేసే వారిని గుర్తించి గూగల్ వికీపిడియాలో సమాచారం పొందుపరుస్తారు. రజనీకాంత్ సూక్ష్మకళలో అంతర్జాతీయంగా రాణిస్తూ సుమారు 100కు పైగా విభిన్న ఆకృతుల్లో సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు. ఇందుకు గాను ఆర్హెచ్ఆర్ వరల్డ్ రికార్డు, రికార్డు హోల్డర్ రిపబ్లిక్ ఇండియా రికార్డు, రెండు బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలుగుబుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, సృజనపుత్ర అవార్డు, ఉత్తమ కళారత్న అవార్డు, గ్రామీణ కళాజ్యోతి అవార్డు, ఉత్తమ కళాకారుడి అవార్డులు అందుకున్నారు. రెండు బియ్యపు గింజలపై 278 అక్షరాలను, జాతీయగీతం జనగణమన, జాతీయగేయం వందేమాతరం రూపొందించారు. అంతేకాకుండా రజనీకాంత్ గుండుపిన్ను సహాయంతో పెన్సిల్ గ్రాఫైట్పై ప్రపంచంలో అతి సూక్ష్మ ఎత్తుకలిగిన గణపతి విగ్రహాన్ని రూపొందించడంతోపాటు చాక్పీస్లపై 78 జాతీయజెండాలను, 109 శివలింగాలను తయారు చేశారు. రజనీకాంత్ ప్రతిభను గుర్తించి పూర్తి సమాచారం సేకరించి వికీపిడియాలో పొందుపర్చినట్లు వికీపిడియా సమాచార సేకరణకర్త ఆత్రపు మోతీరామ్ తెలిపారు. గూగుల్ వికీపిడియాలో రజనీకాంత్కు చోటు -
30 మంది అధికారులు
రెండు గంటలు..కాజీపేట రూరల్ : సౌత్ వెస్ట్రన్ ఇంటర్ రైల్వే సేఫ్టీ ఆడిట్ అధికారుల బృందం గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకుంది. రైల్వే గేట్లు, వంతెనలు, సిగ్నల్ పాయింట్లు, ట్రాక్ను తనిఖీ చేసుకుంటూ కాజీపేటకు చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన దాదాపు 30 మంది బృంద సభ్యులకు కాజీపేట రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ ప్రిన్సిపాల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ రామకృష్ణ నేతృత్వంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట అధికారులు రైల్వే సీఆర్ఎస్ఈ వి.ఎం.దాస్పుత్ర, సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ రవీంద్రనాథ్, సీటీపీఎఫ్ దినేశ్, సీనియర్ డీఎస్ఓ సురేశ్, సీఈఎల్ఈ, సీనియర్ డీఎస్టీఈ ప్రియ అగర్వాల్, డీఓఎం జనరల్ సుధీర్కుమార్, కాజీపేట డీజిల్ సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ ప్రశాంత్ కృష్ణసాయి, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, ఇతర అధికారులు బృందం వివిధ డిపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. కాజీపేట రైల్వే స్టేషన్, 140 టన్నుల క్రేన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, మెడికల్ రిలీఫ్ వ్యాన్ ట్రైన్, క్యారియజ్ అండ్ వ్యాగన్ డిపో, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపో, లోకోపైలెట్ కార్యాలయం, రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టం, రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్, రైల్వే ఇంజనీరింగ్ డిపో, సిగ్నల్ వ్యవస్థ, పాయింట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన విషయాలపై ఆరా తీసి నోట్ చేసుకున్నారు. గతంలో పలు చోట్ల జరిగిన రైలు ప్రమాదాలను గుర్తు చేస్తూ అలా జరగకుండా సేఫ్టీ నియమాలు పాటించాలని సలహాలు, సూచనలు చేశారు. మధ్యాహ్నం 3.09 గంటలకు చేరుకున్న అధికారుల బృందం.. రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సాయంత్రం 5.20 గంటలకు కాజీపేట నుంచి సికింద్రాబాద్కు బయలుదేరి వెళ్లారు. అధికారుల బృందం తనిఖీల్లో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్తోపాటు అన్ని విభాగాల అధికారులు, సూపర్వైజర్లు ఉన్నారు.కాజీపేట జంక్షన్లో రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలు ప్రత్యేక స్పిక్ రైలులో కాజీపేటకు చేరుకున్న సౌత్ వెస్ట్రన్ రైల్వే బృందం -
ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి
తొర్రూరు:ప్లాస్టిక్ నిర్మూలనకు పట్టణవాసులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్ అన్నారు. 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపార సముదాయాల్లో లభ్యమైన ప్లాస్టిక్ను సీజ్ చేయడంతో పాటు పలువురికి జరిమానా విధించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోనివారికి, లైసెన్స్ తీసుకోని వారికి జరిమానా విధించారు. అనంతరం జంగిల్ కటింగ్ చేశారు. తడిపొడి చెత్త వేరు చేయ డం, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రకృతికి విఘాతం కలిగి ంచే ప్లాస్టిక్ వాడొద్దన్నారు. -
కమిషన్ ఎదుట అబద్ధాలు చెప్పిన కేసీఆర్
నెహ్రూసెంటర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెప్పారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లేలా చేసిన బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని తానై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్లు చెప్పుకున్న కేసీఆర్.. కూలిపోతుందని తెలియగానే అధికారులు, ఇంజనీర్లదే తప్పదమంటూ చెబుతున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ఎకరాకు కూడా నీటిని అందించలేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, నాటి మంత్రులు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమాయక గిరిజనులను కాల్చి చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోలు తమ పంథా మార్చుకుని తుపాకులను వదిలేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొట్లాడాలని హితవుపలికారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. విద్యశాఖపై సమీక్షలు నిర్వహించాలని, విద్యశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలన్నారు. జూలై 5, 6 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. 5న బహిరంగ సభ ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని సూచించారు. అనంతరం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు బి.అజయ్సారథిరెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పెరుగు కు మార్, నవీన్, వెంకన్న, వరిపెల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నెల్లూరు నాగేశ్వర్రావు, కట్లోజు పాండురంగాచారి పాల్గొన్నారు. -
టైరు పేలి కారు బోల్తా..
గీసుకొండ: టైరు పేలి కారు చెట్టుకు ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వరంగల్ జిల్లా గీసుకొండ పీఎస్ పరిధిలోని వసంతాపూర్ శివారులో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కారులో నలుగురు యువకులు వరంగల్ నుంచి కోట వెంకటాపురం వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వెంకటాపురం నుంచి వసంతాపురం గ్రామ శివారుకు చేరుకోగా వెనుక ఎడమవైపు టైరు పేలడంతో కారు అదుపు తప్పి చెట్టుకు ఽఢీకొని పల్టీలు కొట్టి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వరంగల్ ఎల్బీ నగర్కు చెందిన ఎండి. షోయబుద్దీన్(17), వరంగల్ చింతల్కు చెందిన షేక్ మహ్మద్(18) అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్బీ నగర్కు చెందిన ఎండి. సమీర్పాషా, జాన్పాకకు చెందిన ఎండి. ఇస్మాయిల్ అలీకి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. గీసుకొండ ఎస్సై ప్రశాంత్కుమార్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ● ఇద్దరు యువకుల దుర్మరణం ● వసంతాపూర్ శివారులో ఘటన -
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
హన్మకొండ చౌరస్తా: వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో గురువారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా నాటి యతిరాజారావు నుంచి మొన్నటి దయాకర్రావు వరకు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా ఉంటున్నాం.. అంతకుముందు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జంగా రాఘవరెడ్డి తమను కోరాగా.. పార్టీలతో సంబంధం లేకుండా దయాకర్రావుకు సపోర్ట్ చేశామన్నారు. అవమానాలు భరించలేకే రాజకీయాల్లోకి.. దయాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబుల్బెడ్రూం ఇళ్ల కోసం సొంత ఖర్చుతో స్థలం కొనుగోలు చేసి ఇచ్చాం. స్థలం ఇచ్చే ముందు నా భర్త పేరుపెడతామని చెప్పి చేయలేదు. అప్పటి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ నిలిపివేస్తే, మా సంస్థ ఆధ్వర్యాన ఇవ్వడానికి ముందుకొచ్చాం. ఆ కార్యక్రమానికి దయాకర్రావు రాలేదు. కలెక్టర్, స్కూల్ ఉపాధ్యాయులను సైతం రానివ్వకుండా చేశాడు. మేము చేసే అనేక కార్యక్రమాలను అడ్డుకుంటూ నన్ను అవమానించాడు. అమెరికా వెళ్లాక ఏనాడు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. దయాకర్రావు చేసిన అవమానాలను తట్టుకోలేకే రావాల్సి వచ్చింది. మంత్రిగా దయాకర్రావు నా ఫోన్ను సైతం ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్, సీ్త్రనిధి నిధుల గోల్మాల్, పంచాయతీ రాజ్ నిధుల్లో అక్రమాలు ఇలా అనేక విషయాల్లో ఆయన జైలుకు పోవడం ఖాయమన్నారు. మహిళగా నన్ను అవమానించారు ఫోన్ట్యాపింగ్, సీ్త్రనిధి, పీఆర్ అవినీతిలో జైలుకు ఖాయం దయాకర్రావుపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఫైర్ -
నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు
చిట్యాల: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవన్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని నైన్పాక, కుమ్మరిపల్లి గ్రామాల్లో నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై శ్రవన్కుమార్తో పాటు, వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి సోదాలు నిర్వహించారు. నైన్పాకకు చెందిన జంగ కుమార్, కుమ్మరిపల్లికి చెందిన బిక్కనూరు విజయ్ అనుమతి లేని ఆర్–కొట్–999 బీటీ–5, 32 ప్యాకెట్లు, ది క్యాప్టన్ పింక్ గార్డ్ –5జీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. దీంతో ఆ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పత్తి విత్తనాల విలువ రూ.38 వేలు ఉంటుంది. ఈ ఘటనపై ఏఓ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై పేర్కొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలను గురువారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాడీ వరుణ్రెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడా ప తాకాన్ని ఆవిష్కరించిన ఆయన క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ని రంతరం విధుల్లో ఉంటూ ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు క్రీడా పోటీలతో మానసిక, శారీరక విశ్రాంతి లభిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారందరం అన్నదమ్ములమే.. పోటీల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ వరంగల్(ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీ ఎల్, ట్రాన్స్కో) ఆధ్వర్యాన ఈనెల 14 వరకు జరిగే ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ క్రీడా పో టీలు ఉంటాయని, కబడ్డీ 12 జట్లు, బాల్బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్కుమార్, టి.సదర్రలాల్, వి.తిరుపతిరెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్రా వు, డీఈ టెక్నికల్ ఎ.విజయేందర్రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, కోశాధికారి ఎం. సంతోష్, కౌన్సిల్ సభ్యులు యాకూబ్పాషా,సునీల్కుమార్, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
బడి తెరవాలని పూర్వ విద్యార్థుల నిరసన
మహబూబాబాద్ అర్బన్: తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలని కుమ్మరికుంట్ల తండా పాఠశాల పూర్వ విద్యార్థులు బానోతు శ్రీను, బానోతు రఘు డిమాండ్ చేశారు. మానుకోట మున్సిపల్ పరిధి 10వ వార్డు కుమ్మరికుంట్ల తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ముందు పూర్వ విద్యార్థులు గురువారం నిరసన చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కుమ్మరికుంట్ల తండా పాఠశాలలో 2018 వరకు సుమారు 60 మంది విద్యార్థులు చదువుకున్నారని, కరోనా సమయంలో విద్యార్థులు రాక మూసివేశారన్నారు. ఇప్పటికై నా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలను తెరిచి, గిరిజన విద్యార్థుల చదువుకు తోడ్పడాలన్నారు. పూర్వ విద్యార్థులు బానోతు హరి, నరేశ్, నవీన్, దేవేందర్, సురేశ్, అశోక్, శివ, జోహన్, బాలు తదితరలు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. మా వాటా మాకు దక్కాల్సిందే..కురవి: రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన సంగం వాటా దక్కాల్సిందేనని జన అధికార సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మధ్యప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి రచించిన ఓబీసీ రైసింగ్ పుస్తకాన్ని కురవి వీరభద్రస్వామి ఆలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓబీసీ పోరుబాట పుస్తకంలో పొందుపర్చడం జరిగిందన్నారు. ఓబీసీల పోరుబాట పుస్తకం తొమ్మిది విభాగాలుగా విభజించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి యాకమ్మ, గుర్రపు సత్యనారాయణ, బాణాల వీరయ్య, పింగిలి శ్రీనివాస్, కోట జనార్దన్, రేణిగుంట్ల శ్రీదేవి, మాచర్ల రమేశ్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద అర్బన్: జిల్లా గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన ఆర్సీఓ రత్నకుమారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొనాన్రు. 2024–25 విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు మానుకోట జిల్లా కేంద్రంలోని ఇందిరా కాలనీ పాత కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ హాజరుకావాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం..మహబూబాబాద్ రూరల్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థాన ప్రాంగణం నుంచి తొర్రూరు బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం మీదుగా తిరిగి మళ్లీ కోర్టు వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. న్యాయ చైతన్య సదస్సుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మనవంతు కృషి చేయాలని సూచించారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నాగవాణి, జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ చంద్ తదితరులు ఉన్నారు. -
సునీల్ కుటుంబానికి అండగా ఉంటా..
ములుగు రూరల్ : అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన సాక్షి ములుగు ఆర్సీ ఇన్చార్జ్ భూక్య సునీల్ కుటుంబానికి అండగా ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సునీల్ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడంతోపాటు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, నల్లెల భరత్కుమార్, మండల అధ్యక్షుడు చాంద్పాషా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
ధాన్యం సేకరణ పూర్తి
మహబూబాబాద్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు. ఈనెల 9వ తేదీ వరకు 1,76,101 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందుకు రూ.408.47 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.321.20 కోట్లు చెల్లించారు. ప్రతీసారి ఆన్లైన్లో జాప్యంతో చెల్లింపులు నెమ్మదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈసారి వెనువెంటనే ధాన్యం మిల్లులకు తరలింపుపై అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అకాల వర్షాల వల్ల పలు సమస్యలు తలెత్తినా.. వాటిని అధిగమించి కొనుగోళ్లను సజావుగా పూర్తి చేశారు. 1,36,236 ఎకరాల్లో వరి సాగు.. జిల్లాలో 18 మండలాలు ఉండగా గంగారంలో వరిపంట సాగు చేయలేదు. దీంతో 17 మండలాల్లో 1,36,236 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈమేరకు 1,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే సన్నధాన్యం 1,40,130మెట్రిక్ టన్నులు ,గ్రేడ్ ఏ రకం 32,224 మెట్రిక్ టన్నుల ధాన్యం, కామన్ రకం 3,746 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తంగా 1,76,101 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 35,207 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.408.47 కోట్లు అని అధికారులు తెలిపారు. ఆన్లైన్లో జాప్యం.. 32,216 మంది రైతులకు సంబంధించిన 1,48,412 మెట్రిక్టన్నుల ధాన్యం ఆన్లైన్ అయ్యి ంది. దాని విలువ 344.23 కోట్లు ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా 29,921మంది రైతులకు రూ.321.20 కోట్లు చెల్లింపులు చేశారు. ఇంకా 2,295 మంది రైతులకు సంబంధించి రూ.23.02 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే రూ.64 కోట్ల విలువైన ధాన్యం ఆన్లైన్ చేయాల్సి ఉంది. కాగా ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. 1,76,101 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు ధాన్యం మొత్తం మిల్లులకు తరలింపు రూ.408.47 కోట్లకు గానూ.. రూ.321.20కోట్లు చెల్లింపు -
పూజారుల భవనం ప్రారంభం
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారంలో రూ. కోటి 98 లక్షలతో నిర్మించి సమ్మక్క, సారలమ్మ పూజారుల సముదాయ భవనాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క.. పూజారులతో సమావేశమై జాతర నిర్వహణపై చర్చించారు. జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజారులు మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రి సీతక్క తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు మంత్రి సీతక్కకు పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవీందర్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, పూజారులు కాక సారయ్య, అరుణ్కుమార్, భోజరావు, కాక కిరణ్ , తదితరులు పాల్గొన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న ఎంఓపీఆర్డీ బృందం మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి వారిని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ(ఎంఓపీఆర్డీ) భారత ప్రభుత్వ న్యూఢిల్లీకి చెందిన రాంబాబుగుప్తా, సమీ ఆశ్రర్ మిశ్రా బృందం గురువారం దర్శించుకుంది. అనంతరం మండలంలోని వాడగూడెం గ్రామాన్ని సందర్శించి పెసా చట్టం అమలు తీరుపై లఘు చిత్రం చిత్రీకరించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటీడీఏ ఎస్డీసీ డీటీ అనిల్, పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, టీజీఎండీసీ డీపీఓ మేకల కిరణ్, పెసా మొబిలైజర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డబ్బుల ముత్యాలరావు, మొబిలైజర్లు పూసం కార్తీక్, మడి శోభన్బాబు, పాయం రమేశ్, పూనెం రఘురాం, పున్నం శ్రవణ్, యాలం శ్రీను, తాటి విజయ్బాబు పాల్గొన్నారు. 7 నుంచి కరీంనగర్, తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ ఖిలా వరంగల్: జూలై 7వ తేదీ నుంచి కరీంనగర్– తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8న తిరుపతి– కరీంనగర్ వీక్లి వన్స్ ట్రైన్ నడవనుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ట్రెయినీ కలెక్టర్లు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ట్రెయినీ కలెక్టర్లు సౌరభ్ శర్మ, సలోని చోబ్రా, హర్ష చౌదరి, కెరోలిన్ చింగ్తయానమావి, కొయ్యాడ ప్రణయ్ కుమార్ బృందం గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెనను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్ను సందర్శించింది. పంపుహౌస్ వివరాలను ఇరిగేషన్ డీఈ సత్యబాబు వివరించారు. విద్యుత్ వినియోగం, ఎత్తిపోతల వివరాలు, స్టోరేజీ, మో టార్ల సామర్థ్యం, సాగు, తాగు అవసరాల వినియోగంపై వివరించారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ల బృందం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని సందర్శించింది. మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, లైసన్ అధికారి అబ్బాస్, కోర్సు డైరెక్టర్ శ్రీనివాస్, డీఈ సురేశ్ తదితరులు ఉన్నారు. కాగా, ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ప్రైవేట్కు పరుగు..
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో డయోగ్నోస్టిక్స్ ల్యాబ్, రేడియాలజిహబ్ను ఏర్పా టు చేశారు. అయితే రోగులకు మాత్రం అక్కడ పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి సీటీ స్కానింగ్, ఎక్స్రే ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. కానీ, రేడియాలజిహబ్లో సరిపడా టెక్నీషియన్స్ లేకపోవడంతో సాయంత్రం తర్వాత స్కానింగ్, ఎక్స్రే సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. వేధిస్తున్న కొరత.. టెక్నీషియన్లు, రేడియాలజిస్టుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. రేడియాలజి హబ్లో 9మంది టెక్నీషియన్లకు గానూ ఇద్దరు మాత్రమే ఉండడంతో సాయంత్రం 4 గంటల వరకే సేవలు అందిస్తున్నారు. సాయంత్రం, రాత్రి వేళ, అత్యవసర సమయాల్లో ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు తెలుపుతున్నారు. ఆదివారం సేవలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పెద్దాస్పత్రిగా అప్గ్రేడ్ అయినప్పటికీ పేదలకు అందాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా.. ఆదిశగా అడుగులు పడడం లేదు.జీజీహెచ్లో అందని స్కానింగ్, ఎక్స్రే సేవలు అత్యవసర సమయంలో ప్రైవేట్ బాట పడుతున్న రోగులు ఖాళీగా టెక్నీషియన్ పోస్టులు కలెక్టర్కు నివేదించాం ఆస్పత్రిలోని రేడియాలజిహబ్లో ఇద్దరు మాత్రమే టెక్నీషియన్లు ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, కలెక్టర్ భర్తీ ప్రక్రియను పెండింగ్లో ఉంచారు. చాలా సార్లు కలెక్టర్కు నివేదించాం. 72 పోస్టుల్లో టెక్నీషియన్లు, మెకానిక్, డ్రైవర్లు, సిబ్బంది ఇతర పోస్టులు ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేస్తే పూర్తిస్థాయిలో సేవలు అందుతాయి. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నాం. – శ్రీనివాసరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చాలి
విద్యారణ్యపురి: తరాలుగా ఉత్పత్తి శ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చడమే లక్ష్యమని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. బుధవారం హనుమకొండలోని టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన ఆ ఓబీసీ జాక్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజహితం కోసం నిత్యం శ్రమ చేస్తున్న బీసీ సమాజం నేడు బతకలేక ఎంతో మంది బలిదానాలు చేసుకుంటున్నారన్నారు. బీసీ సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చి చట్టసభల్లో వాటా సాధించాలని పిలుపునిచ్చారు. సమాజంలో బీసీ సంఘాలు విడిపోయి పాలకవర్గాలకు పావులుగా మారాయన్నారు. విడిపోయిన కుల, బీసీ సంఘాలను ఐక్యం చేయడమే ఓబీసీ లక్ష్యమన్నారు. ఏఐఓబీసీ జిల్లా కమిటీ ఎన్నిక ఈ సమావేశంలో ఏఐఓబీసీ కమిటీని ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తాడిశెట్టి క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి వీరస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి. వెంకటాచారి, కోశాధికారిగా తాడూరి మోహన్, ఉపాధ్యక్షులుగా వల్లాల జగన్ గౌడ్, తాటికొండ సద్గుణ, నవీన్కుమార్, రాచమల్ల శ్రీనివాస్, మహ్మద్ ఇస్మాయిల్, సెక్రటరీలుగా నిరంజన్, కృష్ణమూర్తి, రవికుమార్, నారాయణగిరి రాజు ఎన్నికయ్యారు. సలహాదారులుగా పులి రజనీకాంత్, గౌరవ అధ్యక్షుడిగా పులి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామ్మూర్తి, బీసీ పొలిటికల్ జాక్ నాయకులు మాదం రజనీకుమార్, జాక్ బాధ్యులు కె. రంజిత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఆల్ఇండియా ఓబీసీ చైర్మన్ సాయిని నరేందర్ -
ఆయుర్వేద అవసరం పెరిగింది
జనగామ: ఆధునిక యుగంలో ఆయుర్వేద వైద్యా నికి ఉన్న అవసరం మరింత పెరిగిందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని వేద పంచ కర్మ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, తెలంగాణ విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో ఆయుర్వేద విద్యార్థులకు స్టేట్లెవల్ కౌశలం–2025 ఐదురోజుల ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది. ‘వేద’ హాస్పిటల్ డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతి థిగా పాల్గొని శిక్షణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేట్లెవల్లో జరిగే శిక్షణలో విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే లేని అనేక ప్రామాణిక విషయాలను నేర్చుకునే గొప్ప అవకాశం కలు గుతుందన్నారు. ఒత్తిడి, జీవనశైలి రుగ్మతలు, నడు ము, మెడ నొప్పి వంటి సమస్యలకు సహజ పరి ష్కారం ఆయుర్వేద వైద్యమన్నారు. జిల్లాలో ఈ త రహా ఆరోగ్యవంతమైన కార్యక్రమాలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై దృష్టి సారించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్కు సూ చించారు. ఆయుర్వేద వైద్యాధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి సుమారు వంద మందికి ఉచితంగా మందులు అందించారు. అంతకు ముందు డాక్టర్ అంజిరెడ్డి రచించిన ‘వై టూ చాయిస్ వేద’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ వైస్ ప్రెసిడెంట్ టి.ప్రేమానంద్రావు, వీఏపీ ప్రెసిడెంట్ ఎస్. శారంగపాణి, వీఏపీ జనరల్ సెక్రటరీ, బి.కిషన్, హైదరాబాద్ బీఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్యుడు, కల్నల్ బిక్షపతి, డాక్టర్లు యశోదా, మమతా, సురేశ్ జకోటియా తదితరులు పాల్గొన్నారు. కాగా 15వ తేదీ వరకు స్టేట్లెవల్ కౌశలం ప్రోగ్రాం కొనసాగనుంది. ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు సహజ పరిష్కారం జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా స్టేట్ లెవల్ కౌశలం–2025 శిబిరం ప్రారంభం -
అంతా నా ఇష్టం..
ఓ ఆర్టీసీ డిపోలో ఆ అధికారి తీరే వేరు!హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఓ డిపో (జిల్లా కేంద్రం బయట)లో ఓ అసిస్టెంట్ మేనేజర్ తీరుపై కార్మిక వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ అధికారి తీరే వేరంటూ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా డబుల్ డ్యూటీలు చేసినా సాధారణ సెలవు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మిక వర్గాలు వాపోయాయి. కార్మికుల విధులు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఈ అధికారి.. తన వరకు వస్తే మాత్రం తనకు రూల్స్ ఉండవని చెప్పకనే తన వైఖరి చాటుకుంటున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థానికంగా ఉండాల్సిన ఈ అధికారి.. పొరుగున ఉన్న పూర్వ జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తూ తనకు అనుకూలంగా బస్ షెడ్యూల్ను నిబంధనలకు విరుద్ధంగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నైట్ హాల్ రద్దు.. ఆ డిపో నుంచి హైదరాబాద్కు నడిచే యూపీఎల్–02 షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో నైట్ హాల్ చేయాల్సి ఉండగా తాను ప్రతీ రోజు పూర్వ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా హైదరాబాద్ నైట్ హాల్ రద్దు చేసి, తాను నివాసముండే పూర్వ జిల్లా కేంద్రానికి నడించుకుంటున్నారని ఆ డిపో కార్మికులు పేర్కొంటున్నారు. కిలో మీటర్లు చూపించుకునేందుకు ప్రయాణికుల రద్దీ లేని రూట్లలోనూ బస్సులు తిప్పుతున్నారని కార్మి కులు వివరించారు. ఇంత జరుగుతున్న ఆ డిపో మేనేజర్ చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తె లిసే జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసరాలకు కూడా సెలవులు ఇవ్వ డం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తన అవసరాల కోసం నిబంధనలు కాలరాసే ఆ అధి కారి.. ఉద్యోగుల అవసరాలను పట్టించుకోవడం లే దని, ఇది వేధింపులకు గురి చేయడమేనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్ప టికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. డబుల్ డ్యూటీలు చేసినా కార్మికులకు సెలవు ఇవ్వరు.. ఆమె కోసం బస్ షెడ్యూల్నే మార్చిన అధికారులు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న కార్మికులు -
ఎయిడెడ్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి: ఎయిడెడ్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి హనుమకొండలోని పీఈఆర్టీయూ భవనంలో తెలంగాణ ఎయిడెడ్ ఉపాధ్యాయుల జాక్ కన్వీనర్ ఎంకె. తన్వీర్ అధ్యక్షతన శ్రీపాల్రెడ్డి అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. తన హైస్కూల్ విద్యాభ్యాసం ఎయిడెడ్ లోనే జరిగిందన్నారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రతీ నెల ఆలస్యంగా వేతనాలు వస్తున్నాయన్నారు. ఆరోగ్య భద్రత, పదోన్నతులు, కారుణ్య నియామకాల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎయిడెడ్ టీచర్ల జాక్ బాధ్యులు సీతారామాచారి, శ్రీధర్, శవకుమార్, సరళ, తిరునగరి నరేందర్, జాక్ కోకన్వీనర్ బెల్లంకొండ పూర్ణచందర్ మాట్లాడారు. కార్యక్రమంలో పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎం. తిరుపతిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి, బాధ్యులు తోట భిక్షపతి, శ్రీనివాస్, గఫార్, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి -
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
హన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్లలో పూర్తి స్థాయిలో రెవెన్యూ వసూళ్లు చేయాలని ఆదేశించారు. విధిగా నోడల్ జీఎంలు తమ పరిధిలోని సర్కిళ్లలో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు చిందరవందరగా తీగలు అమర్చుతున్నారని, వీటిపై సర్వే నిర్వహించాలని ఆదేశించారు. పోల్ రెంటల్ విధిగా గ్రామాల్లో రూ.15, పట్టణం, నగరాల్లో రూ.20 చొప్పున వసూలు చేయాలన్నారు. సర్కిళ్లలో కాలిన, పనిచేయని మీటర్లను వెంటనే మార్చాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, జనరల్ మేనేజర్లు వేణు బాబు, కృష్ణ మోహన్, వెంకట కృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
‘భూ భారతి’తో ప్రతీ రైతుకు న్యాయం
గోవిందరావుపేట: నిరుపేద రైతుల భూసమస్యలు పరిష్కరించడానికే రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, ఈ చట్టం ద్వారా ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’తో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. పేద రైతులకు కాకుండా పెద్ద రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో ప్రతీ రైతు సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతీ రైతుకు పట్టా అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి అనేక అంశాలతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ తమ భూములపై హక్కులు పొందడానికి ఈ చట్టం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు తప్పు చేస్తే చర్యలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
అక్రమార్కులు ఎవరు..
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు హన్మకొండ : సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఎన్పీడీసీఎల్) విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రత్యేకంగా నియమించిన అత్యున్నత స్థాయి విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఇది జరిగి నెలలు గడిచిపోతున్నాయే కాని ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడంలో ఉన్న ఆంతర్యమేమిటని విద్యుత్ ఉద్యోగ వర్గాలతో పాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్రమాల్లో ఉన్నతాధికారిదే హస్తం.. ఈ అక్రమాల్లో మానవ వనరుల విభాగం ఉన్నతాధికారిదే హస్తం ఉందని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మానవ వనరుల విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఆ పాలకవర్గ సభ్యుడు అంతా తానై సబ్ ఇంజనీర్ల నియామక ప్రక్రియ పూర్తి చేశాడని, ఇందులో తనకు ఏ మాత్రం సంబంధం లేదని నియామకాల ప్రక్రియ చూసుకునే కీలక ఇండస్ట్రీయల్ రిలేషన్స్ విభాగ అధికారి సహ అధికారులు, ఉద్యోగుల ఎదుట తన బాధ చెప్పుకుంటున్నారని చర్చ సాగుతోంది. దీంతో నియామక ప్రక్రియలో అక్రమాలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ కీలక అధికారిపై పలు ఆరోపణలుండడంతో మానవ వనరుల విభాగం కీలక బాధ్యుడు, పాలక మండలి సభ్యుడు నియామకాల ప్రక్రియతో సంబంధం లేని మరో జనరల్ మేనేజర్ సాయంతో అంతా తానై చూసుకున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా, పదవీచ్చుతుడైన మాజీ పాలక వర్గ బాధ్యుడు ఈ ఉచ్చులో చిక్కుకోనున్నాడా అనే సందేహాలు విద్యుత్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు వాస్తవాలని తెలిసినా యాజమాన్యం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో అర్థం కావడం లేదని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. 24 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కమిటీ.. టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు 497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018 మే 24న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 31న ఫలితాలు ప్రకటించారు. డిసెంబర్లో నియామకాలు చేపట్టారు. ఇందులో ముందుగా కాల్ లెటర్లు పంపిన 24 మందిని కాకుండా ఇతరులతో భర్తీ చేశారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాల్ లెటర్ అందుకుని ఉద్యోగాలు రాని అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్సీ నుంచి ఒక అధికారి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి ఇద్దరు, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఇందులో 24 పోస్టుల భర్తీలో అక్రమాలకు జరిగినట్లు గుర్తించింది. అర్హులు కాని వారు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన విచారణ కమిటీ.. యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి నోటీసు జారీ చేయగా వారు కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అయితే అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.కమిటీ నిజాలు నిగ్గు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..టీజీ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మానవ వనరుల విభాగంలోని ఇండస్ట్రీయల్ విభాగం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూసినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తే చర్యలు తీసుకునే యాజమాన్యం.. ఇంత పెద్ద అక్రమం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆకాశరామన్న ఉత్తరాలు (పేరు లేని వినతులు) రాస్తే భూతద్దంలో పెట్టి చూస్తున్న యాజమాన్యం... ఆ యాజమాన్యం వేసిన విచారణ కమిటీ నిజాలు నిగ్గు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోకుండా నాన్చివేతధోరణి అవలంబించడంలో ఉన్న మతలబేమిటని ప్రశ్నిస్తున్నారు. చిన్న తప్పులకు ఉద్యోగులకు పెద్ద పనిష్మంట్లు ఇచ్చే యాజమాన్యం, పెద్ద తప్పు చేసిన ఉన్నతాధికారులకు ఎలాంటి శిక్షలు ఉండవా అని నిలదీస్తున్నారు. సంస్థ వీలైనంత త్వరగా అక్రమార్కులపై చర్యలు తీసుకుని నిజాయితీ చాటుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు విచారణ ముగిసి నెలలు గడుస్తున్నా అక్రమార్కులను గుర్తించని వైనం మానవ వనరుల విభాగంలో అప్పటి ఉన్నతాధికారిదే హస్తమని చర్చ తన ప్రమేయం లేదంటున్న ఇండస్ట్రీయల్ విభాగం కీలక అధికారి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై యాజమాన్యం తాత్సారం పెద్దలు తప్పు చేస్తే మినహాయింపేనా..! ప్రశ్నిస్తున్న ఉద్యోగులు -
కాజీపేట జంక్షన్లో అధికారుల తనిఖీలు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, ఇతర అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారులు బుధవారం సంయుక్తంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ అడిషనల్ రైల్వే మేనేజర్ గోపాల్, సీనియర్ డీసీఎం షిపాలి, డీఓఎం జనరల్ సురేశ్కుమార్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి తనిఖీ చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, స్టేషన్లోని క్యాంటీన్, ప్లాట్ఫామ్లపై స్టాళ్లు, రైల్వే కాలనీలో నిర్మిస్తున్న రన్నింగ్ రూ మ్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాజీ పేట జంక్షన్ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, ఏడీఈఎన్ సంతోశ్, అన్ని విభాగాల అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈఆర్ఏఆర్ఎం వ్యాన్ కూడా.. రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు హుటాహుటిన ఘటనాస్థలికి తరలివెళ్లే ఎమర్జెన్సీ రైల్వే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్(ఈఆర్ఏఆర్ఎం)ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) నారాయణస్వామి తనిఖీ చేశారు. వ్యాన్లో నిల్వ ఉండే మందులు, వైద్య పరికరాలు, ఇతరత్రా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించే వైద్య సదుపాయాల సెటప్ కిట్లను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రైల్వే ఆస్పత్రి వైద్యాధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే ఆస్పత్రి వైద్యులు నిరంజన్రావు, యాకూబ్, చీఫ్ ఫార్మసిస్ట్ చింత తిరుపతి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుధీర్, రాజు, లక్ష్మీనారాయణ, సతీశ్, లక్ష్మి పాల్గొన్నారు. ముగిసిన రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంపికలు బుధవారం ముగిశాయి. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ పర్యవేక్షణలో జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ క్రీడాంశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంపికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు అశోక్కుమార్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి త్వరలో వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో శాట్ పరిశీలకులు డాక్టర్ రవికుమార్, నర్సింగరావు, స్వర్ణలత, సంతోశ్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్, కరీం, స్వామిచరణ్, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. -
అప్పు తీసుకుని ఇవ్వడం లేదని..
ములుగు రూరల్: పైసాపైసా కూడబెట్టిన రూ. 3లక్షలను వ్యాపారి అప్పుగా తీసుకుని ఇవ్వడం లేదనే కారణంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అబ్బాపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదె రాజు (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారికి పైసాపైసా కూడబెట్టిన రూ. 3 లక్షలను మూడు సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చాడు. అయితే సంవత్సరం నుంచి అప్పు చెల్లించాలని పలుమార్లు అడుగుతున్నా సదరు వ్యాపారి చెల్లించకపోవడంతో రాజు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వడ్డీ ఇవ్వకున్నా అసలు డబ్బు అయిన ఇవ్వాలని ప్రాధేయపడినా సదరు వ్యాపారి ఇవ్వకపోవడంతో రాజు మంగళవారం రాత్రి వ్యాపారి బిల్డింగ్పై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు బుధవారం ఉదయం గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకుని రాజు మృతికి గల వివరాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య అబ్బాపూర్లో ఘటన -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మరిపెడ రూరల్: పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక పంట దిగుబడులు సాధించాలని డీఏఓ విజయ నిర్మల రైతులకు సూచించారు. బుధవారం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించడంతో పాటు పంట మార్పిడి చేపట్టాలన్నారు. అడువులు, బీడు భూముల్లో మొక్కలు పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు. ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలను రైతులు సాగు చేయవద్దని, సాగు చేసిన వారు శిక్షార్హులు అవుతారని ఆమె హెచ్చరించారు. ఏడీఏ విజయ్చంద్ర, శాస్త్రవేత్తలు బి.క్రాంతికుమార్, ఈ.రాంబాబు, ఏఓ బోడ వీరసింగ్, ఏఈఓ సాయి శృతి, రైతులు అశోక్రెడ్డి, సందు అశోక్, జర్పుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాలి మహబూబాబాద్ రూరల్: రైతులు తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాలని డీఏఓ ఎం.విజయనిర్మల బుధవారం తెలిపారు. జిల్లాలో 1,80,227 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 43,393 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంకా 1,36,834 మంది రైతులు విశిష్ట గుర్తింపు కార్డులు తీసుకోవాల్సి ఉందని, ఈ నెల చివరి వరకు మిగిలిన రైతులు తీసుకోవాలని సూచించారు. -
రెవెన్యూ సదస్సులపై అవగాహన పెంచుకోవాలి
గూడూరు: గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులపై రైతులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ అన్నారు. మండలంలోని మట్టెవాడ, మధనాపురంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులతో పాటు మట్టెవాడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, గూడూరులో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ బాలుర హైస్కూల్, బ్రాహ్మణపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్రెడ్డి, సీడీపీఓలు నీలోఫర్ అజ్మీ, శిరీష, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
అందమైన బడి.. యూపీఎస్ బ్రాహ్మణపల్లి
● ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన ● రాష్ట్ర స్థాయిలో అవార్డులు సొంతం ● పునఃప్రారంభానికి సిద్ధం సాక్షి, మహబూబాబాద్: కృషి, పట్టుదల ఉంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయవచ్చు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, గ్రామస్తుల సహకారం తీసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అంకితభావం తోడైతే.. అవార్డులు సొంతం చేసుకోవచ్చు అనడానికి మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులను పంపించకుండా కట్టడి చేశారు. ఇందుకోసం తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్నారు. కాగా పాఠశాల నేడు పునఃప్రారంభం కానుండగా.. బడిని అందంగా ముస్తాబు చేశారు. ప్రవేశాలకు పోటీ.. పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 110 మంది విద్యార్థులు, తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా బడిని అందంగా తీర్చిదిద్దేందుకు గ్రామ మాజీ సర్పంచ్ షఫియోద్దిన్, ఇతర గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. రూ.1.50లక్షలతో పాఠశాలలో అందమైన మొక్కలు నాటారు. ప్రధాన గేటు నుంచి పాఠశాల లోపలి వరకు ట్రాక్ నిర్మించి ఇరువైపులా మొక్కలు నాటారు. దీంతో పాఠశాలకు అందం వచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన సాగుతోంది. కాగా మూడు సార్లు ఇన్స్పైర్లో రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును కై వసం చేసుకుంది. బడి బాట కార్యక్రమంలో ప్రత్యేకతలు చాటుతూ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. ఈ ఏడాది చుట్ట్టూ పక్కల ఉన్న గ్రామాలు, తండాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు పోటీ పడుతున్నారు. -
అమ్మ మాట.. అంగన్వాడీ బాట
మహబూబాబాద్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ‘అమ్మ మాట..అంగన్వాడీ బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించడం, అంగన్వాడీ వ్యవస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను తెలియడంతో పాటు ప్రీ స్కూల్ విధానం ప్రాధాన్యతను వివరిస్తారు. ఈనెల11 నుంచి 17వరకు కార్యక్రమాలు.. ఈనెల 11 నుంచి 17వరకు ప్రభుత్వం అమ్మ మాట ..అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగానే ఈనెల 10న అంగన్వాడీ కేంద్రాలను అందంగా అలంకరించాలని ఆదేశించారు. ● 11న తల్లితండ్రులకు, పిల్లలకు స్వాగతం పలికి సెల్ఫీలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి. ఇళ్ల సందర్శన, పిల్లలను కేంద్రాల్లో చేర్పించడం, ప్రీస్కూల్ పూర్తి చేసిన పిల్ల లకు సర్టిఫికెట్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన వారిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి. ● 12,13, 16 తేదీల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేయాలి. కూరగాయల మొక్కలు నాటాలి. టీహెచ్ఆర్, హెచ్సీఎం, పిల్లలకు అందించే పోషకాహారం గురించి గ్రామస్తులకు చెప్పాలి. కేంద్రాల్లో బొమ్మలు, పుస్తకాలు, ప్రీస్కూల్ కిట్లోని వస్తువులను ఎగ్జిబిషన్లా ప్రదర్శించాలి. ● 17న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ని ర్వహించాలి. పిల్లల అభివృద్ధి కార్డులు ప్రదర్శించాలి. ఇంటింటికీ అంగన్వాడీ కౌన్సెలింగ్ పుస్తకాన్ని ఉపయోగించి అవగాహన కల్పించాలి. ఇందిరానగర్ సెంటర్ సందర్శన... అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమంలో భా గంగా జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ అంగన్వాడీ సెంటర్లో సీడీపీఓ శిరీష ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుండు సులోచన పాల్గొన్నారు. పిల్లల పేర్లు నమోదు చేసుకుంటాం.. అమ్మమాట..అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా పిల్లల పేర్లు నమోదు చేసుకుంటాం. ప్రధానంగా ప్రీస్కూల్ విధానం ప్రాధాన్యత తెలియజేస్తాం. టీచర్లు ఇంటింటికీ తిరిగి రెండున్నర సంవత్సరాల వయస్సు గల పిల్లల ను గుర్తిస్తారు. 5 సంవత్సరాలు దాటిన పిల్ల లను ప్రైమరీ స్కూల్లో నమోదు చేస్తారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేలా తల్లిదండ్రులకు ప్ర భుత్వ కార్యకలాపాలను వివరిస్తారు. – ధనమ్మ, డీడబ్ల్యూఓ ఈనెల 17వ వరకు కార్యక్రమం అంగన్వాడీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ఏర్పాట్లలో నిమగ్నమైన అఽధికారులు అంగన్వాడీల వివరాలు ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 5 సెక్టార్లు : 58 అంగన్వాడీ సెంటర్లు : 1,435 జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు : 3,604 ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు : 20,295 మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు : 16,181 -
పాఠశాలల సందర్శన
మరిపెడ: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోనున్నాయని, హెచ్ఎంలు ముందస్తుగా పాఠశాలలను శుభ్ర ంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు అ న్ని సౌకర్యాలు అందేలా చూడాలన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. ఆయన వెంట ప్రత్యే క అధికారి కిరణ్కుమార్, మరిపెడ మున్సిపల్ కమిషనర్ నరేశ్రెడ్డి తదితరులు ఉన్నారు.ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు రుణాలివ్వండిగూడూరు: మండలంలో ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాలున్న రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు కార్యాలయంలో బుధవారం రుణాల మంజూరుపై అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక మారుమూల ఏజెన్సీ మండలం అని, ఇక్కడి రైతులకు ఎక్కువగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాలు హక్కు పత్రాలు ఉన్న రైతులకు రుణాలు ఇస్తామని చెబుతుండగా, బ్యాంకు అధికారులు ఎందుకు ఇవ్వడంలేదో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటికై నా మండలంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు వెంటనే రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు.మంత్రులను కలిసిన డిప్యూటీ స్పీకర్మరిపెడ రూరల్: నూతనంగా ఎంపికై న డిప్యూటీ స్పీకర్ జాటోతు రాంచంద్రునాయక్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబును హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మంత్రులను శాలువాలతో సన్మానించారు.విత్తనభారం.. వానపైనే!బయ్యారం/కొత్తగూడ: తొలకరికి ముందే కురిసిన వర్షాలతో మెట్ట పంటలసాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. ఇటీవల కురిసిన చిరు జల్లులకు బుధవారం బయ్యారం, కొత్తగూడ మండలాల్లో కొందరు రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు నాటారు. అయితే మళ్లీ వర్షం కురిస్తేనే నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి. కాగా వానదేవుడిపైనే భారం వేసి రైతులు ఏరువాకను మొదలు పెట్టారు.నేడు రైల్వే సేఫ్టీ ఆడిట్ బృందం పర్యటనకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో గురువారం ఇంటర్ రైల్వే సేఫ్టీ అడిట్ సికింద్రాబాద్ అధికారుల బృందం పర్యటించనున్నట్లు బుధవారం రాత్రి కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి అధికారుల బృందం ప్రత్యేక రైలులో రియర్ విండో ద్వారా రైల్వే గేట్లు, సిగ్నల్స్, నష్కల్–పెండ్యాల మధ్య రైల్వే బ్రిడ్జిలు, ఇతర సేఫ్టీ చర్యలను తనిఖీ చేసుకుంటూ 1:30 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటారు. జంక్షన్లోని రైల్వే గెస్ట్హౌస్లో అధికారులకు లంచ్ ఉంటుంది. తర్వాత క్యారియజ్ అండ్ వ్యాగన్ డిపో, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్రూం కార్యాలయాల్లో సేఫ్టీ ఆడిట్ తనిఖీ ఉంటుంది. 3:00 గంటల నుంచి 05:30 గంటల వరకు ఆర్ఆర్ఐ కార్యాలయం, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కార్యాలయం, రైల్వే పాయింట్, క్రాసింగ్, ఎస్ఎస్పీ, ఎస్పీఎఆర్టీ, ఎస్పీఎంఆర్వీలలో తనిఖీ చేస్తారు. అనంతరం కాజీపేట నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరి సికింద్రాబాద్కు వెళ్తారని రైల్వే అధికారులు తెలిపారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే పనుల వద్ద రైతుల ఆందోళన
నెల్లికుదురు: గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆందోళనకు దిగిన ఘటన మండలంలోని నర్సింహులగూడెంలో బుధవారం జరిగింది. బాధిత రైతుల వివరాల ప్రకారం.. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులతో గతంలో ఉన్న రోడ్డును ధ్వంసం చేశారని, వ్యవసాయ భూముల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, కలెక్టర్ కార్యాలయంలో విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని రైతులు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు పొన్నం వెంకన్న, రామస్వామి, సోమయ్య, నర్సయ్య, నరేశ్, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు కొత్తందాలు..
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక పాఠశాల 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు రంగులు వెలిసిపోయి కళాహీనంగా మారింది. అయితే జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రామసహాయం శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవచూపి ఎంపీపీఎస్ రూపురేఖలను మార్చా రు. దాతల సహకారంతో రంగలు వేయించారు. విద్యార్థులకు అవసరమైన విద్యాబోధనకు సంబంధించిన పట్టికలు, ఇతర అంశాలను భవనం గోడలపై చిత్రీకరింపజేశారు. దాతలు శేరి వీరయ్య రూ.20 వేలు, బిర్రు కిరణ్, మరికొంతమంది దాతల సహకారంతో పాఠశాల అందంగా ముస్తాబై నేడు విద్యార్థులకు అపూర్వ స్వాగతం పలకనుంది. -
కొంచెం భయం.. కొంచెం సంతోషం
సాక్షి, మహబూబాబాద్: నేను కుటుంబంలో చిన్న వాడిని.. మా కుటుంబ సభ్యులమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం. నేను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా పైతాను తాలూకా, జయక్వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. సెలవుల తర్వాత బడికి వెళ్లాలంటే ఏదో తెలియని భయం.. ఇబ్బందిగా ఉండేది. కానీ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ను కలుస్తామని సంతోషంగా ఉండేది. పాఠశాల తెరిచిన నాటి నుంచి వారం రోజుల పాటు వేసవి సెలవుల్లో ఎవరెవరూ ఏం చేశారు.. ఏ ఊరు వెళ్లారు అనే విషయాలతోనే కాలం గడిచేది. మిత్రులం కలిసినప్పుడు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటాం. ప్రతీ ఒక్కరి జీవితంలో పాఠశాల రోజులు గోల్డెన్ డేస్... మరుపురాని రోజులు. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ, మహబూబాబాద్ -
రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఆవరణలోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మంగళవారం ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండను క్రీడాహబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్ను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ అండర్–10,12,14,16 బాలబాలికల విభాగాల్లో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఎంపిక పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 300 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి పరిశీలకులుగా డాక్టర్ రవికుమార్, నర్సింగరావు, స్వర్ణలత, సంతోశ్, రెజ్లింగ్, హ్యాండ్బాల్ అసోసియేషన్ల రాష్ట్ర కార్యదర్శులు కరీం, పవన్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, శ్రీమన్నారాయణ, రాజు, విష్ణువర్ధన్, వెంకటేశ్వర్లు, నవీన్కుమార్, రమేశ్, అఫ్జల్, జీవన్గౌడ్, శంకర్, దేవిక తదితరులు పాల్గొన్నారు. -
పింగిళి డిగ్రీ కాలేజీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల (అటానమస్) డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ, బీసీఏ కోర్సుల రెండు, నాల్గవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి విడుదల చేశారు. రెండో సెమిస్టర్లో 497మంది విద్యార్థినులకు 251మంది (50.50శాతం), నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో 441మందికి 289మంది (65.53శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆరవ సెమిస్టర్లో 419మందికిగాను 397మంది (94.75శాతం) విద్యార్థినులు పాసయ్యారు. ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చునని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల నియంత్రణాఽఽధికారి డాక్టర్ సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు కొలిపాక శ్రీనివాస్, రాజిరెడ్డి, ఏక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్బాబు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
సీహెచ్సీలో మౌలిక వసతులు కల్పించాలి
గూడూరు: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవసరమైన మౌలిక వసతులతో పాటు వైద్యులను నియమించాలని సూపరింటెండెంట్ వీరన్న కోరారు. మండల కేంద్రంలోని సీహెచ్సీని మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ సందర్శించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి, లోపల వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏమైనా అవసరాలు ఉంటే చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరన్న మాట్లాడుతూ.. ఆసుపత్రిలో మొత్తం 16 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా, ఐదుగురు మాత్రమే ఉన్నారన్నారు. వైద్యుల నియామకానికి కృషి చేస్తానని హుస్సేన్నాయక్ అన్నారు. అదే విధంగా పాకాలవాగు సమీప పోస్టుమార్టం గది వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, శవాలను భద్రపరిచేందుకు రెండు ఫ్రీజర్లు అవసరమని సూపరింటెండెంట్ చెప్పగా తప్పక ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం చెంద్రుగూడెంలోని ఏకలవ్వ పాఠశాల నిర్మాణ పనులను హుస్సేన్నాయక్ పరిశీలించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ వెంకట్రాములు, తహసీల్దార్ నాగభవాని, వైద్యులు పాల్గొన్నారు. -
డెహ్రాడూన్కు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–డెహ్రాడూన్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్లు నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల సర్వీస్ల వివరాలు.. ఈ నెల 17, 24వ తేదీల్లో చర్లపల్లి–డెహ్రాడూన్ (07077) ఎక్స్ప్రెస్ ప్రతీ మంగళవారం ఉదయం 6.23 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. ఈ నెల 12,19, 26వ తేదీల్లో డెహ్రాడూన్ –చర్లపల్లి( 07078) ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం ఉదయం 7 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉత్తర, దక్షిణ భారతదేశ పర్యాటక కేంద్రాలకు వెళ్లే పర్యాటకులకు ఈ రైళ్ల సర్వీస్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైళ్ల సర్వీస్లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, రాణి కమలాపతి, భీనా, ఝాన్సీ, ఆగ్రా, మధుర, హజ్రత్నిజాముద్దీన్, మీరట్, రూర్కి, హరిద్వార్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరీంనగర్ కలెక్టర్ను కలిసిన యశ్వంత్ మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మంగళవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్.. కలెక్టర్కు మొక్క అందించాడు. ఎల్లప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం, ఆశీస్సులు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని కలెక్టర్ సత్పతి ఈ సందర్భంగా యశ్వంత్కు సూచించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను ధృడసంకల్పంతో అధిరోహించి భారతదేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటాలని యశ్వంత్కు తెలిపారు. రెండో రోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంహన్మకొండ: ‘పీఎం కుసుం’ పథకంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మంగళవారం రెండో రోజు కొనసాగింది. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కంపెనీ పరిధిలోని 16 సర్కిళ్ల నుంచి రైతులు చేరుకున్నారు. 461 మందికి రెడ్కో లెటర్ ఆఫ్ అక్సెప్టెన్సీ జారీ చేయగా సోమవారం మొదటి రోజు ఇరువురి మధ్య 37.50 మెగావాట్లకు చెందిన 38 ఒప్పందాలు జరిగాయి. రెండో రోజు దాదాపు 45 మెగావాట్లకు చెందిన 47 ఒప్పందాలు జరిగాయి. జూలై 7 వరకు పవర్ పర్చేజ్ ఒప్పందాలు చేసుకోవచ్చని రెడ్కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్పై రైతులతో పాటు ఎన్పీడీసీఎల్ నుంచి ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ సంతకాలు చేశారు. -
ఆటోను ఢీకొన్న లారీ..
స్టేషన్ఘన్పూర్: లారీ.. ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన సింగారపు రమేశ్(42) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఆటో నడుపుకుంటూ జనగామ నుంచి హనుమకొండకు వస్తున్నాడు. ఆటో స్టేషన్ఘన్పూర్కు రాగానే హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేశ్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు రమేశ్ కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుమ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ లింగస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా, ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ● అక్కడికక్కడే ఆటోడ్రైవర్ మృతి ● స్టేషన్ఘన్పూర్ బస్టాండ్ వద్ద ఘటన -
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuజిల్లాలోని మొత్తం సాగు భూమి: 4.50లక్షల ఎకరాలు ఎర్ర నేలలు : 2.34లక్షల ఎకరాలు(52శాతం) నల్లరేగడి నేలలు : 2.16లక్షల ఎకరాలు(48శాతం)జిల్లాలోని నేలల్లో పోషకాల వివరాలు (హెక్టార్కు కిలోలు ) పోషకాలు ఉండాల్సినమోతాదు ప్రస్తుత పరిస్థితి నత్రజని 200 నుంచి 250 కేజీలు 120 కేజీలు భాస్వరం 30 నుంచి 35 కేజీలు 300 కేజీలు పొటాష్ 200 నుంచి 270 కేజీలు 180 కేజీలు సాక్షి, మహబూబాబాద్: వడ్రంగికి కలప స్వభావం తెలియాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థి స్వభావం, డాక్టర్కు రోగి స్వభావం తెలియాలి. అప్పుడే వారివారి వృత్తుల్లో రాణిస్తారు. అలాగే రైతుకు నేల స్వభావం తెలియాలి. లేకపోతే ఏ పంట వేసినా నష్టపోతాడు. జిల్లాలో విచ్చలవిడిగా ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం, పంట మార్పిడి చేయకపోవడం మొదలైన కారణాలతో భూమిలో ఉండే ఖనిజ లవణాల సమతుల్యత దెబ్బతిని భూములు సారం కోల్పోతున్నాయి. కాగా, సాగు పద్ధతుల్లో మార్పు, పంట మార్పిడి, భూసార పరీక్షల ద్వారా అనువైన పంటలు సాగు చేస్తేనే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దెబ్బతిన్న నేలల సమతుల్యత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి వసతులు పెరిగాయి. దీంతో జిల్లాలో అప్పటి వరకు 3లక్షల మేరకు ఉన్న సాగు భూమి విస్తీర్ణం 4.50లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో 2.34లక్షల ఎకరాలు(52శాతం) ఎర్ర నేలలు(ఎర్రచెక్క, దుబ్బ, చౌడు, ఇసుక), 2.16లక్షల ఎకరాలు(48శాతం) నల్లరేగడి నేలలు(నల్లరేగడి, బంక, జిగురు) ఉంటాయి. అయితే వ్యవసాయశాస్త్ర వేత్తలు చెప్పిన వివరాల ప్రకారం పోషకాలు ప్రతీ 2.5ఎకరాలు(హెక్టారు) నేలలో 20 సెంటీమీటర్ల లోతు వరకు నాలుగైదు చోట్ల మట్టిని తీసి పోషకాలను లెక్కిస్తారు. దీని ప్రకారం నత్రజని 200నుంచి 250 కేజీల వరకు ఉండాలి. కానీ ప్రస్తుతం 120 కేజీలు మాత్రమే ఉంది. భాస్వరం 30 నుంచి 35 కేజీల వరకు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం 300 కేజీలకు పైగా ఉంది. దీంతో పాటు పొటాష్ 200 నుంచి 270 కేజీల వరకు ఉండాలి. ప్రస్తుతం 180 కేజీలు మాత్రమే ఉంది. అంటే జిల్లాలోని నేలల్లో నత్రజని, పొటాష్ మోతాదుఉండావల్సిన దాని క న్నా తక్కువగా.. భాస్వరం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అదే విధంగా సూక్ష్మ పోషకాలు ఐరన్, జింక్, మాంగనీస్, బోరాన్ వంటివి తక్కువ మోతాదుల్లో ఉన్నాయి. నేల స్వభావం తెలుసుకొని సాగు చేయాలి ప్రతీ రైతుకు తన భూమిలోని పోషకాలపై అవగాహన ఉండాలి. పోషకాల మోతాదు తెలుసుకొని పంటలు వేయాలి. నేలను తక్కువ లోతుకు దున్నాలి. సేంద్రియ ఎరువుల వాడకం, పచ్చిరొట్ట పంటలు వేయడం పెంచాలి. పంటలను కాల్చి వేయకుండా నేలలోనే కలియ దున్నాలి. పంట పంటకు మార్పు చేయాలి. పోషకాల సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. – క్రాంతి కుమార్, కేవీకే మల్యాల శాస్త్ర వేత్తన్యూస్రీల్కారణాలు ఇవే.. భూమి సారంలో తేడా రావడానికి అనేక కారణా లు ఉన్నా.. ప్రధానంగా రైతుల స్వయంకృతాపరాధంతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. గతంలో తొలకరి వర్షాలకు ముందుగానే పెంట మట్టి, చెరువు మట్టి వేసేవారు. కానీ ఇప్పుడు అది మరిచిపోయారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత పెసర, నువ్వులు, జనుము మొదలైన పంటలు వేసే వారు. ఇప్పుడు ఆ పంటలు కానరావడం లేదు. పంటలను భూమిలో కలియ దున్నడం, గొర్రెలు, బర్రెల మందలు పెట్టేవారు. ఇప్పుడు అది లేదు. అదే విధంగా కాంప్లెక్స్ ఎరువులు డీఏపీ, 28–28, 24–24, 20–20, యూరియా వాడకం పెరిగింది. ధర ఎక్కువగా ఉందని పొటాష్ వాడకం తగ్గించారు. దీంతో నత్రజని, భాస్వరం, పొటాష్ తోపాటు సూక్ష్మఽ పోషకాల్లో కూడా వ్యత్యాసం వచ్చింది. దీంతో పంటలు సక్రమంగా ఎదగకపోవడం, పూత, కాత లేకపోవడం, వచ్చినా నిలువక పోవడం, పంట బలంగా ఉండకపోవడం, చీడ పీడల బెడద ఎక్కువగా రావడంతో పంటల దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు.జిల్లా నేలల్లో పోషకాల భేదం ఎక్కువ రసాయన ఎరువుల వాడకంతో సారం కోల్పోతున్న భూములు ఏ పంట వేసినా.. దిగుబడులు అంతంతే సాగు పద్ధతుల్లో మార్పు అనివార్యం -
సమస్యల అంతానికి పరిశోధనే ఆయుధం
కేయూ క్యాంపస్: సామాజిక సమస్యల పరిష్కారానికి పరిశోధనే ఆయుధమని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలపై దృష్టిసారించాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి కోరారు. వారం రోజులుగా కేయూలోని పొలిటికల్ స్సైన్స్ విభాగంలో పరిశోధక విద్యార్థులకు పరిశోధనాపద్ధతులపై నిర్వహిస్తున్న అవగాహన తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక శాస్త్రాల పరిశోధన ఎంతో కీలకమన్నారు. పరిశోధనల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన బడ్జెట్,అలాగే పుస్తకాలు అందుబాటులో ఉంచేలా కృషి చేస్తానన్నారు. కేయూ ఎకనామిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్. విజయ మాట్లాడుతూ ఈ ఆధునిక సమాచార యుగంలో మానవుడు సేకరిస్తున్న సమాచారం పరిమితులు లేనిదన్నారు. అయితే సమాచారాన్ని గణనీయంగా ఉపయోగించేందుకు రెండు ముఖ్యమైన పద్ధతులు సహకరిస్తున్నాయన్నారు. కంటెంట్ అనాలిసిస్, డేటా ప్రదర్శన అన్నారు. ఇవి పరిశోధన, విద్యమాధ్యమం, వ్యాపారం వంటి రంగాల్లో ముఖ్యమైన సాధనాలుగా వెలుగొందుతున్నాయన్నారు. సమావేశంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, బీఓఎస్ కృష్ణయ్య, అధ్యాపకులు వడ్లకొండ సత్యనారాయణ, వి. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
లడ్డూల మిస్సింగ్పై చర్యలేవీ!
కాళేశ్వరం: పన్నెండేళ్లకొకసారి వచ్చే సరస్వతీనది పు ష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ.35కోట్లు మంజూరు చేసి 12 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించింది. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన పుష్కరాలకు సుమారు 20లక్షలకుపైగా మంది భక్తులు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు. ఫలితంగా కాళేశ్వరాలయానికి రూ. 1.33 కోట్లు ఆదాయం సమకూరింది. అయితే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి వద్ద విక్రయించిన లెక్కల్లో ఆరు వేల లడ్డూలకు సంబంధించి తేడాలు రావడంతో దేవస్థాన ఈఓ మహేశ్ సదరు ఉద్యోగికి నోటీసుచ్చి సంజాయిషీ ఇవ్వాలని కోరగా, అతడి నుంచి స్పందన లేదని తెలిసింది. 9న మరో నోటీసు ఇచ్చారు. దీంతో దేవస్థానంలో మరికొన్ని లడ్డూలకు సంబంధించిన స్టాక్లో లెక్కలు లభించినట్లు తెలిసింది. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగిని లెక్కల్లో తక్కువ వచ్చిన లడ్డూలకు సంబంధించి రూ.2.38 లక్షల వరకు చెల్లించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నగదు చెల్లిస్తే తానే లడ్డూల నగదును తీసుకున్నట్లు అవుతుందని ఆ ఉద్యోగి డబ్బులు చెల్లించడానికి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. లడ్డూల మిస్సింగ్ అంశంపై ఎవరిపై చర్యలు తీసుకుంటారో తెలియక దేవస్థానం సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. లెక్క ప్రకారమే.. లడ్డూలు స్టోర్రూమ్ నుంచి విక్రయాలు జరిగే గది వరకు సంబంధిత ఇన్చార్జ్ లెక్క ప్రకారం సంబంధిత సదరు ఉద్యోగికి చేరవేస్తాడు. మధ్యలో చేరవేయడానికి వలంటీర్లు తీసుకెళ్తారు. వారి వద్ద ఏమైనా లెక్కలు తగ్గాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 రోజుల సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తులు పేర్కొంటున్నారు. ప్రసాదం అందరికీ.. పుష్కరాల 12 రోజుల సమయంలో ఎండోమెంట్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, టూరిజం శాఖలు, జర్నలిస్టులతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి సుమారు 3వేల మందికిపైగా విధులు నిర్వర్తించారు. వీరిలో కొంత మంది విధులు ముగిసిన తర్వాత ఒక్కొక్కరు రెండు–మూడు లడ్డూల ప్రసాదం తీసుకెళ్లారు. వారికి లడ్డూల విడిగా ఇచ్చేవారు. ఇక్కడ మిస్సయినవి మాత్రం సింగిల్ బాక్స్, డబుల్ బాక్స్ల్లో ఉండే లడ్డూలు. ఇలా ఎక్కడ లెక్కలు మిస్సింగ్ అయ్యాయో తెలియాల్సి ఉంది. పుష్కరాలు ముగిసి 21 రోజులు గడుస్తున్నా లెక్కలు తేలకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎవరిని బాధ్యులను చేస్తారో అని దేవస్థానం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈవిషయమై కాళేశ్వరం దేవస్థానం ఈఓ శనిగెల మహేశ్ను ఫోన్లో సంప్రదించగా..6వేల లడ్డూలు లెక్కల్లో తక్కువ వచ్చాయన్నారు. అందులో కొంత లడ్డూలకు సంబంధించి లెక్కలు లభించాయన్నారు. మిగతా లడ్డూలకు సంబంధించిన నగదు చెల్లించాలని సదరు ఉద్యోగికి గడువు ఇచ్చినట్లు తెలిపారు. సరస్వతీనది పుష్కరాలు ముగిసి 21 రోజులు గడచినా తేలని లెక్కలు లెక్కల్లో 6వేల లడ్డూలు తక్కువ రావడంపై దేవస్థానంలో చర్చ ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై వేటుకు రంగం సిద్ధం? -
సీడ్.. ఫ్రాడ్..
రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తిజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలులో సతమతమవుతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకె ట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 ర కాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 ర కాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901లకు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350 నుంచి రూ.1,450 వరకు అమ్ముతున్న ట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సీజన్ ఆరంభం నుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులు -
క్రీడా పాఠశాల పిలుస్తోంది..
భూపాలపల్లి అర్బన్ : విద్యార్థులకు చదువు ఎంతో ముఖ్యమో క్రీడలూ అంతే ముఖ్యం. అందుకే చిన్నప్పటి నుంచే ఈ రెండు రంగాల్లో రాణించాలి. అప్పుడే ప్రభుత్వ కొలువులు, ఇతర లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు స్పోర్ట్స్ స్కూల్లో సీటుసాధిస్తే అత్యుత్తమ క్రీడాకారులుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ కొలువులు సాధించొచ్చు. ఈనేపథ్యంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు ఎలా చేసుకోవాలి? ఎప్పుడు జరుగుతాయి? ఎలాంటి టెస్టులు పెడతారు? ఏ ప్రాంతంలో పెడుతారు అనే విషయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఎంపిక విధానం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ స్కూల్ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని హకీంపేటలో, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక సామర్థ్యంతో పాటు పలు టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో మూడు స్కూళ్లు ఉండగా 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలో విద్యార్థులకు శారీరక సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు మండల, జిల్లాస్థాయిలో నిర్వహించి రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తారు. ● మండల స్థాయి పోటీలకు.. మండలస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్ఎంతోపాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంటతెచ్చుకోవాలి. అలాగే, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు 3వ తరగతి పాస్ సర్టిఫికెట్లతో మండల స్థాయి ఎంపిక పోటీలకు హాజరుకావాలి. ● మండల స్థాయిలో ఎంపికలు.. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు స్థాయిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ● జిల్లా స్థాయిలో .. ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఇందులో విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి పంపిస్తారు.రాష్ట్రస్థాయిలో ఎంపికలు.. జూలై 1వ తేదీన హాకీంపేట స్పోర్ట్స్ న్కూల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. జూలై రెండో వారంలో ప్రవేశాలు నిర్వహిస్తారు. అర్హతలు.. 4వ తరగతిలో ప్రవేశాలు పొందగొరే విద్యార్థులు సెప్టెంబర్ 1, 2016 నుంచి ఆగస్టు 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. అనర్హులు వీరే.. దొడ్డు కాళ్లు, ప్లాట్ఫీట్, వెన్నముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత బాధితులు, బౌలెగ్స్ ఉన్న వారు. అలాగే ఎక్కడైన ఎముకలు విరిగిన వారు కూడా అనర్హులు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లెయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6, 10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్ త్రో (కిలో బరువు), వర్టికల్ జంప్, ప్లెక్సీబిలిటీ టెస్ట్, (ముందుకు వంగి భూమిని తాకడం), మెడికల్ టెస్ట్.స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో పాఠశాలలు ఒక్కో స్కూల్లో 40 మంది బాలురు, 40 మంది బాలికలకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి క్రీడాకారులుగా ఎదగాలనే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ స్కూళ్లలో చదివి అంతర్జాతీయ స్థాయితోపాటు ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లో పాల్గొని సత్తాచాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ లభిస్తుంది. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –రఘు డీవైఎస్ఓ, జయశంకర్భూపాలపల్లి -
అమ్మవారిని దర్శించుకున్న ట్రెయినీ ఐఏఎస్లు
హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా భద్రకాళి దేవాలయాన్ని మంగళవారం 2024 ట్రెయినీ ఐఏఎస్లు సౌరభ్శర్మ, సలోని ఛబ్రా సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన ఐఏఎస్లను ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు వారికి స్నపనమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఆలయ చరిత్ర వివరించారు. అదేవిధంగా.. ఖిలా వరంగల్ కోటను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. వారి వెంట రామ్రెడ్డి, కుమారస్వామి, శ్యామ్లాల్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య మామునూరు: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్నగర్ కాలనీకు చెందిన కస్తూరి కుమార్(55), అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కూలీ లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన కస్తూరి కుమార్ సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బావమరిది రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు సీఐ రమేష్ తెలిపారు. -
మాతా, శిశు మరణాలు తగ్గించాలి
మహబూబాబాద్: జిల్లాలో మాతా,శిశు మరణాల ను తగ్గించాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాతాశిశు మరణాల నివారణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ, సబ్సెంటర్ల వారీగా గర్భిణుల వివరాలు సేకరించాలన్నారు. హైరిస్క్ కేసులు ఉంటే ప్రభు త్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్, అధికారులు ఉన్నారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన.. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం డీఈఓ రవీందర్రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో పాఠశాలల పునఃప్రారంభం చేయాలన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తిచేసి పునఃప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, న్యూట్రిషన్, శానిటేషన్పై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
జర్నలిస్టు ‘కొమ్మినేని’ అరెస్టు అప్రజాస్వామికం
నెహ్రూసెంటర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, సాక్షి మీడియా కార్యాల యాలపై దాడులు సరికాదని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మానుకోట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ప్లకార్డులు పట్టుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే–143 జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చిర్రగోని ఉదయ్ధీర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై కక్షసాధింపు వైఖరి సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టడం పత్రి కాస్వేచ్ఛకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. శ్రీనివాసరావు అక్రమ అరెస్టును ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఎంఏ ఫయీజ్, చందా శ్రీనివాస్, ఆకుల రమేశ్, పద్మం మహేశ్, బండారి జ్ఞానేందర్, వీరంటి ముఖేశ్, నూకల యశ్వంత్, గుండోజు సుబ్రహ్మణ్యం, గుండోజు దేవేందర్, కరుణాకర్, ఎర్రోజు అశోక్, దొంతు పురుషోత్తం, మాదాసు మహేశ్, గౌస్ పాషా, పసుపులేటి వెంకటేశ్వర్లు, రామరాజు ప్రవీణ్, ఆకుల నవీన్, తోకల రాంచంద్రు, శ్రీను, లావుడ్యా మనో హర్, కుమార్, బానోత్ శంకర్, గుంజె హన్మంతు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు సామ పాపయ్య, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం,అర్రం రమేశ్చందర్, బోనగిరి శ్రీనివాస్, గుజరాతి రాంప్రసాద్, చింతకుంట్ల యాకాంబ్రం, ఇరుకుళ్ల కిరణ్కుమార్, జిల్లె ల్లమూడి మురళీమోహన్ పాల్గొన్నారు.– మరిన్ని ఫొటోలు, వివరాలు 9లోu -
చోరీ సొత్తుతో ప్రియురాలితో జల్సాలు
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం.. ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా.. జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్ల్ఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్ల్ఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాఽధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు.ఇంటి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు 24గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరామ్నాయక్ -
నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎవరై న వ్యాపారస్తులు,సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చే స్తూ నకిలీ విత్తనాలను,పురు గు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం.ఇందుకోసం ప్రత్యే క ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ కమిషనరేట్● -
ప్రత్యేకాధికారుల బడి బాట
సాక్షి, మహబూబాబాద్: వేసవి సెలవుల అనంతరంగురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇన్నిరోజులు జన సంచారం లేక అస్తవ్యస్తంగా మారిని పాఠశాలల్లో ప్రారంభం నాటికి అన్ని వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం, పండుగను తలపించే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఉదయం ఆదేశించడంతో మండల ప్రత్యేకాధికారులు బడి బాట పట్టారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యేకాధికారితో టీమ్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల దృష్టి విద్యాశాఖపై పడింది. ఇప్పటికే ఐదు రోజులుగా ఉపాధ్యాయులు బడి బాట పేరుతో విద్యార్థులను బడిలో చేర్పించే పనిలో ఉన్నారు. అయితే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పర్యవేక్షణ కోసం ఇప్పటికే ప్రతీ మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఇప్పుడు ఆ అధికారికి తోడుగా తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓతో కలిసి టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి బడి తెరిచే నాటికి సర్వం సిద్ధం చేయనున్నారు. ప్రధాన సమస్యలు.. సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల గేట్లకు తాళాలు వేశారు. దీంతో పాఠశాల ఆవరణ పిచ్చిమొక్కలతో అపరిశుభ్రంగా తయారైంది. దీంతోపాటు తరగతి గదుల్లో దుమ్ము, ధూళి చేరింది. పలు పాఠశాలలకు సరైన గేట్లు లేకపోవడంతో ఆకతాయిలు వెళ్లి తాగునీటి పైపులైన్లు విరగకొట్టడం, ఫ్యాన్లు, లైట్లు తీసివేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేకాధికారితో కూడిన టీమ్ పాఠశాలలకు వెళ్తోంది. మంగళ, బుధవారాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడడం, ఆవరణలోని పిచ్చి మొక్కలు తీసేసి శుభ్రం చేయడం, మామిడాకుల తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో పిల్లలకు స్వాగతం పలికేలా సర్వం సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.బడులు తెరిచే నాటికి సర్వం సిద్ధం చేసే పనిలో నిమగ్నం మండల ప్రత్యేకాధికారితో బృందం అన్ని పాఠశాలలకు వెళ్తున్న సభ్యులు -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఆయుర్వేద వైద్య సదస్సు
● 11న ఉచిత మెగా వైద్యశిబిరం జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డున ఉన్న వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్లో ఈనె ల 11 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆ యుర్వేద వైద్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్నెస్ సెంటర్ ఫౌండర్ అంజిరెడ్డి సోమవారం తెలిపారు. ‘కౌశలం 2025 ఆయుర్వేదం’ పేరుతో విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జనగామ వేద పంచకర్మ, వెల్నెస్ సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు ఢిల్లీ, ముంబాయి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. పంచకర్మ విధానాలపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఓపీ, ఐపీడీ సందర్శనలు, ఆయుర్వేద చికిత్స విధానాలపై చర్చా గోష్టి, ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా ఆయుర్వేద వైద్య విద్యార్థులు నైపుణ్య చికిత్స విధానం, భవిష్యత్ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా 11వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనుమతిలేని విత్తనాలు విక్రయించొద్దు ● విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య ● విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు ఖిలా వరంగల్ : ప్రభుత్వ అనుమతులు లేని పు రుగు మందులు, విత్తనాల విక్రయించినా, నిల్వచేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని విజిలెన్స్ డీఎస్పీ బి.మల్లయ్య, ఏఓ రవీందర్ హెచ్చరించారు. సోమవారం వరంగల్ స్టేషన్రోడ్డు, ఫోర్ట్రోడ్డులోని సీడ్స్, పురుగు మందుల షాపులపై విజిలెన్స్, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు విత్తనాల షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెర్టిలైజర్ షాపుల్లో రికార్డుల్లో నమోదు చేయని రూ.1,12, 03,718ల విలువైన పురుగు మందులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఏఓలు మాట్లాడుతూ నిబంధనల మేరకు విత్తనాలు విక్రయించాలని, రికార్డుల ప్రకారం స్టాక్ మెంటేన్ చేయాలని సూచించారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసేటప్పుడు డీలర్ను కచ్చితంగా రశీదు తీసుకో వాలని సూచించారు. ఆలాగే బీటీ–3 విత్తనాలు ఎవరైనా అమ్మితే పోలీసు, వ్యవసాయశాఖ ఆధికా రులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. తనిఖీలో ఇన్స్పెక్టర్ రాకేష్, రెవెన్యూ అధికారి ఏవీ భాస్కర్, పీ.రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆకేరువాగులో పడి వివాహిత మృతి
చిన్నగూడూరు: ఆకేరువాగులో పడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన రచ్చ పద్మ(48) భర్తతో కలిసి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసముంటున్నారు. తన తల్లి గ్రామమైన చిన్నగూడూరుకు రెండు రోజుల క్రితం భర్తతో కలిసి వచ్చింది. సోమవారం ఉదయం పద్మ ఆకేరువాగులో పడి మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పద్మ మానసిక స్థితి కొద్ది రోజులుగా బాగోలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు, భర్త ఉన్నారు. -
తల్లి వైద్యానికి వెళ్లి.. కొడుకు మృతి!
కాళేశ్వరం: తల్లికి ఆరోగ్యం బాగాలేదని కొడుకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్న తల్లి తన కొడుకు అన్నం సరిగ్గా తింటలేడు, కడుపు నొప్పి అంటున్నాడని వైద్యులకు చూపించింది. పరీక్షలు చేసిన వైద్యులు (సెలెన్) గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ ఇవ్వడంతో అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సరోజన తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కుమారుడు నాగరాజు(23) బైక్పై మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసిచ్చారు. కాగా, తల్లి తన కొడుకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదని వైద్యులకు తెలిపింది. వైద్యులు నాగరాజుకు పరీక్షలు చేసి (సెలెన్) గ్లూకోజ్ ఎక్కించి, అందులో ఇంజక్షన్ వేశారు. ఈ క్రమంలో ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తల్లికి సూచించి వెంటనే పంపారు. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కొడుకు మరణవార్తతో కోపోద్రేకులైన తల్లిదండ్రులు మృతదేహంతో కలెక్టరేట్ గేట్ వద్ద వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహదేవపూర్ ఎస్సై వారికి నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ ఘటనపై తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వపన్కుమార్ తెలిపారు. సరోజన సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మృతితో శోకసంద్రంలో మునిగారు. కాగా, వైద్యుల తప్పిదంతోనే నాగరాజు చనిపోయాడని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత వైద్యులను సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ఆందోళన -
టీపీసీసీలో ఉమ్మడి జిల్లా నేతలకు కీలక పదవులు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్ష పదవి, 69 మందికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నమిండ్ల శ్రీనివాస్, లకావత్ ధన్వంతి, టి.కుమార్రావులను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, మల్లాడి రాంరెడ్డిలకు అవకాశం దక్కింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా పలువురికి అవకాశం -
లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం
రేగొండ: నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలవిల్లాడింది. రేపాకలో ట్రాక్టర్తో సహబావిలో పడి చనిపోయిన యువరైతు బోయిని తిరుపతి రాజ్ (30) మృతదేహం వద్ద అతడి కుమార్తె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్ తన వ్యవసాయ భూమిలో రోటవేటర్తో దున్నేందుకు ఉద యం ట్రాక్టర్పై వెళ్లాడు. దున్నే క్రమంలో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీరు లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రాజ్ మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. నాన్న లే .. నాన్న లే అంటూ దిక్కులు పిక్కటిలేలా కూతురు, కుమారుడు విలపించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోయిని రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కూతురు, కొడుకు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన కూతురు ట్రాక్టర్తో సహా బావిలో పడి వ్యక్తి మృతి రేపాకలో ఘటన -
కేయూలో ఉద్యోగుల ఎన్నికల సందడి
● ముగిసిన నామినేషన్ల ప్రక్రియకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగుల ఎన్నికల సందడి నెలకొంది. కేయూలో ఎన్జీఓ, క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు ఇటీవలనే అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. వివిధ పదవులకు నామినేషన్లను స్వీకరించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ పదవులకు నామినేషన్లు పోటీపోటీగా వేశారు. కేయూ ఎన్జీఓ అధ్యక్ష పదవికి నవీన్కుమార్, నిరంజన్, పోతు రాజు, జనరల్ సెక్రటరీగా తిరుపతి, నిరంజన్, అక్రమ్ మహ్మద్ నామినేషన్లు వేశారు. కోశాధికారి పదవికి దామోదర్, రాజు, సహెచ్ ప్రవీణ్కుమార్లు పోటీపడుతున్నారు. మిగతా పదవులకు నలుగురి చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. మహిళా కార్యదర్శి కోసం ముగ్గురు ఉద్యోగులు పోటీపడుతున్నారు. క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి గుమ్మయ్య, కోర్నెల్, నిజాముద్దీన్లు, జనరల్ సెక్రటరీ కోసం బొక్క మొగిలి ,అంకూస్లు నామినేషన్లు వేశారు. ఈనెల 13వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఓటింగ్ ఈనెల 20న నిర్వహించనున్నారు. 21న ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా టీచింగ్ నాన్ టీచింగ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక జాబితాను రాత్రి 8 గంటలకు వెల్లడించారు. -
వివాహిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్
ఎల్కతుర్తి : వివాహిత హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ముల్క నూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్కు చెందిన మృతురాలు కోల సుమలత, నిందితుడు గూళ్ల రాజు ఇళ్లులు పక్కపక్కన ఉంటాయి. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం రాజుకు చెందిన లేగదూడ చని పోయిన విషయంలో గొడవ జరిగింది. ఈ ఘటనలో సుమలత బావ సంపత్ను కొట్టిన విషయంలో రాజుపై ముల్కనూరు పీఎస్లో కేసు నమోదైంది. దీంతో రాజు రెండు రోజులు జైలుల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ కేసులో సుమలత ప్రత్య క్ష సాక్షిగా ఉండగా నిందితుడు తనను పలుమార్లు రాజీ పడాలని కోరగా సుమలత వినలేదు. ఈ కేసులో సాక్ష్యం చెప్పొద్దని, రాజీ పడాలని రాజు.. సుమలత ఇంటికెళ్లి చంపుతానని బెదిరిస్తున్న సమయంలో మృతురాలి కుమారుడు వెంకటేశ్ అడ్డొచ్చాడు. దీంతో అతడిపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటనలో ఇదే పీఎస్లో రాజుపై హత్యాయత్నం కేసు న మోదు కాగా నిందితుడు 60 రోజుల పాటు జైలులో ఉండి మెయిల్పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే మొదటి కేసు ట్రయల్కు వచ్చింది. ఈ నెల 11న పేషీ ఉంది. ఈ కేసులో సుమలత సాక్ష్యం చెప్పితే శిక్ష పడుతుందని తెలిసి కొన్ని రోజుల నుంచి రాజు.. సుమలతను రాజీపడమని బెదిరించగా ఆమె వినలేదు. ఈ క్రమంలో ఈనెల 5న సుమలత ఇంటివద్ద ఉంది. దీంతో సుమలతను చంపితే కేసులో శిక్ష నుంచి తప్పించుకోచ్చని భావించిన రాజు.. గొడ్డలితో ఆమైపె దాడికి పాల్పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ముల్క నూరు గ్రామ శివారులో కనిపించగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో సమర్థవంత విధులు నిర్వర్తించిన సీఐ పులి రమేశ్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, దివ్యను ఏసీపీ అభినందించారు. వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ -
‘క్రూ’ వర్కింగ్ సిస్టంపై చిన్నచూపు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయ కేంద్రంగా పని చేస్తున్న క్రూ (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్)లను మెయిన్లైన్లో కాకుండా బొగ్గు, సిమెంట్ సైడిండ్ పాయింట్లకే పరిమితం చేసి పని చేయిస్తున్నారని రన్నింగ్స్టాఫ్ రైల్వే కార్మికులు ఆరోపిస్తున్నారు. కాజీపేట క్రూ డిపో ఏర్పాటు చరిత్రలో ఇప్పటి వరకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు మెయిన్లైన్లో కాజీపేట–బల్లార్షా వరకు అప్ అండ్ డౌన్లో విధులు నిర్వర్తించేవారని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం అనాలోచితంగా కాజీపేట క్రూ డిపోను చిన్నచూపు చూస్తూ క్రూ వర్కింగ్ సిస్టం నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి కొంత సిబ్బందిని (కాజీపేట క్రూలు) మంచిర్యాల, మందమర్రి, రామగుండం, బెల్లంపల్లిలో సైడింగ్లకు పరిమితం చేసి వర్కింగ్ చేయిస్తున్నారని, ఖాళీ వ్యాగన్లతో గూడ్స్ను తీసుకెళ్లి లోడింగ్ చేయించడం, అక్కడ ఉండి మళ్లీ లోడింగ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోచింగ్ క్రూ లింక్లను కూడా విడదీస్తూ గూడ్స్ డ్రైవర్ల వర్కింగ్ మాదిరి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానంలో కోచింగ్ క్రూలను బుక్ చేస్తున్నారని రన్నింగ్స్టాఫ్ పేర్కొంటున్నారు. హెడ్క్వార్టర్స్, ఔట్ స్టేషన్లలో ఈ విధానం పాటించడం వల్ల హెచ్ఓఈఆర్ (అవర్స్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ రూల్స్) నిబంధనలు ఉల్లంఘనకు గురై ప్రయాణికులకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. దీనిపై ఇప్పటికై నా సికింద్రాబాద్ రైల్వే యంత్రాంగం స్పందించి కాజీపేట క్రూ డిపో, లోకోపైలెట్ల, అసిస్టెంట్ లోకోపైట్ల ప్రాధాన్యం తగ్గించొద్దని రైల్వే నాయకులు, రన్నింగ్స్టాఫ్ కార్మికులు సోమవారం కోరారు. కాగా, ఇటీవల వరుసగా ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో ఏదో ఒక విషయంపై చర్చిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రూల పనితీరుపై లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్లు ఆరోపణలు చేయడం గమనార్హం. సైడింగ్ పాయింట్లకే కాజీపేట రైల్వే క్రూల పరిమితం ఆందోళనలో రన్నింగ్ స్టాఫ్ కార్మికులు -
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ షురూ!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కార్యక్రమం షురూ అయ్యింది. టీజీ ఎన్పీడీసీఎల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సోమవారం హనుమకొండలోని కంపెనీ కా ర్యాలయంలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభీయాన్ (పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పు నరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వా రా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు ఉ త్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్కు 5 కిలో మీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలా ర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యా ప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉ త్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మె గావాట్లు రైతులతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చే యించి ఉత్పత్తి చేయాలదే ఈ పథం ఉద్దేశం. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో దరఖాస్తు చేసుకుని రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించిన 461 మందికి రెడ్ కో లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ జారీ చేసింది. వీరితో ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కాగా, మొదటి రోజు 80కి పైగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగాయి. ఈ కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగనుంది. ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ కె.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీల్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం తొలి రోజు 80కి పైగా పీపీఏలు రెండు రోజుల పాటు కొనసాగింపు -
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
● కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరికి షాక్ ● తండాధర్మారం గ్రామంలో సంఘటన మరిపెడ రూరల్: విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతడిని కాపాడే యత్నంలో మరో ఇద్దరు షాక్కు గురయ్యారు. ఈ ఘటన సోమవారం మరిపెడ మండలం తండాధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధరంసోత్ పత్యానాయక్ (70) ఎదురింటి కప్పుపై పట్టాలు కల్పి దానికి ఇనుప తీగ బిగించారు. కరెంట్ తీగ ఆ ఇంటిపై బిగించిన ఇనుప తీగకు ఆనుకుని విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ క్రమంలో పత్యానాయక్ ఆ ఇంటి ఎదుట పని చేస్తుండగా ఇనుప తీగ తగలడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మనవడు సతీశ్, కోడలు బుజ్జి షాక్ గురయ్యారు. ఇది గమనించిన మరో మనవడు రాజేశ్ కర్ర సాయంతో వారిని రక్షించాడు. ప్రాణాపాయస్థితి నుంచి కోడలు, మనవడు బయటపడగా పత్యానాయక్ మాత్రం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలుమడికొండ: ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మడికొండ–ధర్మసాగర్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం దామెరకు చెందిన అశోక్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తు కారులో పని నిమిత్తం హనుమకొండకు వెళ్లి తిరిగి మడికొండ నుంచి ధర్మసాగర్ వైపు వెళ్తున్నాడు. ధర్మసాగర్ పెట్రోల్ పంపు సమీపంలో టైరు బ్లాస్ట్ కావడంతో కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో అశోక్తో పాటు అతని కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భార్య వేధింపులు.. ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట : భార్య వేధింపులు తట్టుకోలేక ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబీకుల కథనం వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ 125 బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ గొడువలు జరుగుతున్నాయి. భార్యతోపాటు అత్తింటి వారు కూడా ప్రవీణ్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీ కార్డు దాచిపెట్టి వేధించారు. ఈక్రమంలో ప్రవీణ్ రెండు నెలల క్రితం విధులకు వెళ్లగా తన భార్య బెటాలియన్ వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ చేసి ప్రవీణ్ పరువు తీయడంతో మనస్తాపం చెందాడు. దీంతో సెలవుల నిమిత్తం ప్రవీణ్.. ఈ నెల 6న ఇంటికొచ్చి కుటుంబీకులతో మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. 8న హనుమకొండలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన అన్న ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే ప్రవీణ్ను తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘డియర్ ఫ్రెండ్స్ నేను చనిపోతున్నా.. నా చావుకి కారణమెవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో. మన గ్రామంలో వాలీబాల్ టీమ్ బతకాలి, ఎప్పుడూ గేమ్ను వదలొద్దు’ అని పేర్కొన్నారు. -
భూమి కబ్జా చేశారని మనస్తాపం..
ఖిలా వరంగల్: తమ జీవనాధారమైన 14 గుంటల భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉర్సుగుట్ట తాళ్లపద్మావతి కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూ మిని విక్రయించగా.. మిగతా 14గంటల భూమి ఉర్సు గుట్ట తాళ్లపద్మావతి కళాశాల సమీపంలో ఉంది. ఇటీవల తాళ్ల మల్లేశం, బండి కుమారస్వామి, పులి రజింత్రెడ్డి అనే వ్యక్తులు 14 గుంటల భూమి కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తమదేన ని పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్బాషలా డుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తా పం చెందిన కుమారస్వామి సోమవారం సాయంత్రం తన భూమి వద్దకు వెళ్లాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్ నోట్ రాసి ఒంటిపై పె ట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈవి షయం తెలిసిన వెంటనే మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితుడి బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడికి 80 శాతంపైగా గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు.. తన 14 గంటలు భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ పొలెపాక కుమారస్వామి ఆత్మహత్యకు యత్నించి ఎంజీఎంలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపై కుమారస్వామి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు పులి రజింత్రెడ్డి, బండి కుమారస్వామి, తాళ్ల మల్లేశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఉర్సుగుట్టలో ఘటన న్యాయం చేయాలని కలెక్టర్కు సూసైడ్నోట్ -
ఉపాధ్యాయుల సర్దుబాటు
సాక్షి, మహబూబాబాద్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పుస్తకాలు, నోట్బుక్స్తోపాటు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం పంపిణీకి కసరత్తు ముమ్మరం చేశారు. దీంతోపాటు బోధన సక్రమంగా సాగేందుకు ఉపాధ్యాయుల కొరతను గుర్తించి మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ.. అధికారులను ఆదేశించింది. ఈమేరకు సర్దుబాటు ప్రక్రియను మొదలు పెట్టారు. ఉపాధ్యాయుల కొరత.. ప్రతీ పాఠశాలలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలో డీఈఓ పరిధిలో పనిచేసే పాఠశాలలు 898 ఉన్నాయి. ఇందులో 15కేజీబీవీలు, ఎనిమిది మోడల్ స్కూల్స్ పోగా మిగిలిన 898 పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. అయితే గత ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు చేపట్టారు. ఇలా జిల్లాలో మొత్తం 3,297 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో 1,730 ఎస్జీటీలు, 1,390 అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు ఉండగా మరో 177 మంది భాషా పండితులు, పీడీలు, పీఈటీలు ఉన్నారు. అయితే 102 హైస్కూళ్లలో ఇటీవల అప్గ్రేడ్ అయిన మహబూబాబాద్ మండలం శనిగపురం, ముడుపుగల్లు, మాధవపురం, గూడూరు మండలం పొనుగోడు, డోర్నకల్ మండలం మన్నెగూడెం, దంతాలపల్లి మండలం రేపోని, కొత్తగూడ మండలం మత్తులపల్లి హైస్కూళ్లలో సరిపడా ఉపాధ్యాయులు లేరు. ప్రధానంగా ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు 25 మంది అవసరం. కాగా జూన్, జూలైలో పదవీ విరమణ పొందే వారు 12 మంది మేరకు ఉంటారు. వీరితోపాటు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లినవారు ఉన్నారు. ఈమేరకు మొత్తం 50 మంది మేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగులు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి.. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రూపొందించిన నిబంధనల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. అయితే జిల్లాలో ఇప్పటికే 154 పాఠశాలలు విద్యార్థులు లేక మూత పడ్డాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఇలా అన్ని లెక్కలు వేస్తే వెయ్యి మంది మేరకు ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా అమలు చేయాల్సి వస్తే సర్ప్లస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ. అందుకోసమే ప్రీప్రైమరీ పాఠశాలలు పెట్టడం, బడి బాట ద్వారా మూత బడిన బడులను తెరిపించడం మొదలైన కార్యక్రమాలు చేస్తేనే కేటాయించిన చోట ఉంటారు. లేకపోతే ఎక్కడికై నా బదిలీ చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఉపాధ్యాయులకు హెచ్చరికలు కూడా వచ్చినట్లు తెలిసింది. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. బడి బాట కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహకారంతో మూత బడిన పాఠశాలలు తెరిచే పనిలో ఉన్నాం. ఈ ఏడాది ప్రీప్రైమరీ పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నాం. – రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారికోరుకున్న చోటుకు పంపించండి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను అడ్డుపెట్టుకొని, వారికి అనుకూలంగా ఉండే చోటుకు వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి సన్నిహితులతోపాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక జాబితాను తయారు చేసి కోరుకున్న చోటుకు పంపించేలా చూడాలని ఇప్పటికే డీఈఓను కోరినట్లు తెలిసింది. ఇలా ఒక వైపు ఉన్నతాధికారుల ఆదేశాలు, మరోవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ఇంకోవైపు సంఘాల పైరవీలు.. ఈ నేపథ్యంలో అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పాఠశాల సంఖ్య ఉపాధ్యాయులు ప్రభుత్వ 02 36 డీఎన్టీ పీఎస్ 24 48 ఎంపీపీ– జెడ్పీపీ 873 3,213పీఎస్, యూపీఎస్లో ఉపాధ్యాయులు ఇలా ఉండాలి విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య 1–10 మంది 01 11–60 మంది 02 61–90 మంది 03 91–120 మంది 04 121–150 మంది 05 151–200 మంది 06జిల్లా విద్యాశాఖలో ప్రక్రియ షురూ అప్గ్రేడ్ హైస్కూళ్లలో టీచర్ల కొరత ఎస్జీటీల్లో మిగులు ఉపాధ్యాయులు మంచి పోస్టుల కోసం పైరవీలు ఎస్జీటీలు : 1,730 ఎస్ఏ : 1,390 ఎల్పీ : 20 పీడీ : 56 పీఈటీ : 09 ఇతరులు : 92 -
ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు
మహబూబాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ప్రజల కోసం వినియోగించాల్సిన గ్రీన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికావడం దారుణమన్నారు. మానుకోట నియోజకవర్గం అభివృద్ధి పథకంలో పరుగులు పెడుతున్న క్రమంలో కొంతమంది అధికారుల తీరు తలనొప్పిగా మారిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సర్కారులో నిరుపేదలకు ఇళ్లు, పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్తో పాటు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలని ఆదేశించారు. విధుల్లో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిషనర్ టి.రాజేశ్వర్, డీఈ సీహెచ్ ఉపేందర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
డోర్నకల్: భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని గొల్లచర్ల గ్రామ రైతువేదికలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు. సదస్సులో రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. భూసమస్యల పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ వీరన్న, సిబ్బంది పాల్గొన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన సదస్సులో తహసీల్దార్ ఇమ్మానియల్, సీనియర్ అసిస్టెంట్ నందా, ఆర్ఐ యాసీన్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సు తనిఖీ.. గార్ల: మండలంలోని ముల్కనూరులో జరిగిన రెవె న్యూ సదస్సును కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా సమాచారం అందించి సదస్సుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. తహసీల్దార్శారద, డీటీ సంజీవ, ఆర్ఐలు శ్రీరామ్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి బయ్యారం: భూ సమస్యలు ఉన్న ప్రతీ రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. సోమవారం మండలంలోని జగత్రావుపేట, కొత్తపేటలో జరిగిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో ఈ నెల 20 వరకు కొనసాగే రెవెన్యూ సదస్సుల్లో రైతులు పాల్గొని తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి ● ప్రజావాణిలో 87 అర్జీల అందజేత మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతుల ను నిర్లక్ష్యం చేయండా వెంటనే పరిష్కరించాలని అ దనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ.. పెండింగ్ వినతులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరి ష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గమనించాలన్నారు. మొత్తం 87 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, డీడబ్ల్యూఓ ధనమ్మ,ఆర్అండ్బీ ఈఈ బీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఇద్దరు పిల్లలు అంధులే.. ఆదుకోవాలి మాకు 10 సంవత్సరాల అమ్మాయి గీతిక, 9 సంవత్సరాల అబ్బాయి చరణ్తేజ్ ఉన్నారు. ఇద్దరు పుట్టుకతోనే అంధులు, వారిని అంధుల పాఠశాలలో చేర్పించాం. 40శాతమే అంధత్వం ఉందని సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ వారికి పూర్తిగా కనబడదు. వందశాతం అంధులుగా సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. మేము బతుకు దెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్నాం. – జి.నవీన్–అనూష, పిల్లల తల్లిదండ్రులు, జయ్యారం, చిన్నగూడూరు మండలం భూమి అమ్మిన వ్యక్తే ఇబ్బంది పెడుతున్నాడు కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 5 సంవత్సరాల క్రితం 3ఎకరాల భూమి కొనుగోలు చేశాం. ఆ భూమి అమ్మిన వ్యక్తి కారుపోతుల బాలరాజు ప్రస్తుతం ఆ భూమిలో 23గుంటలు తనదేనని ఇబ్బంది పెడుతున్నాడు. నా భర్త సోమయ్య మూడు నెలల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి బాలరాజు ఇబ్బంది పెడుతున్నాడు. సంబంధించిన అన్ని పత్రాలు మా వద్ద ఉన్నాయి. అధికారులు సర్వే చేసి పత్రాలు పరిశీలించి న్యాయం చేయాలి. – రాయిలి సోమలక్ష్మి, ఉపేందర్, తల్లీకుమారుడు, చెట్ల ముప్పారం, ఇనుగుర్తి మండలం ● -
కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
మహబూబాబాద్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడి బాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. పెట్రోల్ బంక్ వల్ల పది కుటుంబాలు బాగుపడుతాయన్నారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు చేపట్టామన్నారు. నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫాం కుట్టు పనులు వేగవంతం చేసి ఈనెల 12న పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీలో మంత్రి ధనసరి సీతక్క -
స్పెషల్ టూర్ ప్యాకేజీలు
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రయాణికులు, భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ నుంచి అతితక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు సామూహికంగా వెళ్లేందుకు ఆర్టీసీ సౌకర్యం కల్పించింది. మానుకోట ఆర్టీసీ డిపో నుంచి 5రకాల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్యాకేజీని అమలు చేస్తారు. పూర్తి వివరాలకు 99592 26054, 94417 13896 నంబర్లలో సంప్రదించవచ్చు. మానుకోట నుంచి టూర్ ప్యాకేజీలు.. ● మహబూబాబాద్ డిపో నుంచి హనుమకొండ వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, ఖిలా వరంగల్ వరకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 450 చార్జ్గా నిర్ణయించారు. ఎక్స్ప్రెస్ బస్సు ఉదయం 5 గంటలకు డిపో నుంచి బయలుదేరుతుంది. ● మహబూబాబాద్ నుంచి మల్లూరు–బొగత జలపాతం–లక్నవరం–రామప్పకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 650 చార్జ్ వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్ బస్సు ఉదయం 4 గంటలకు డిపో నుంచి వెళ్తుంది. ● మహబూబాబాద్ నుంచి హనుమకొండ–వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం–కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయం, గూడెం గట్టు సత్యనారాయణస్వామి దేవాలయం టూర్కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.750చార్జ్గా నిర్ణయించారు. డిపో నుంచి రాత్రి 11 గంటలకు ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరుతుంది. ● మహబూబాబాద్ నుంచి సూర్యాపేట, నాగార్జునసాగర్, మాచర్ల చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీశైలం రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 1,500 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి 11 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరుతుంది. ● మహబూబాబాద్ నుంచి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షరామం, సామర్లకొటకు రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.1,500 చార్జ్ వసూలు చేయనున్నారు. డీలక్స్ బస్సు రాత్రి 10 గంటలకు టూరిస్టులతో వెళ్తుంది. సద్వినియోగం చేసుకోవాలి మహబూబాబాద్ ఆర్టీసీ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువచ్చిన విహార యాత్ర, పుణ్యక్షేత్రాల ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశఽం. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీని వినియోగించుకోవాలి. ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్న ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – శివప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ మానుకోట నుంచి పుణ్యక్షేత్రాలు, యాత్రలకు ఆర్టీసీ సర్వీసులు ఈ నెల 27 నుంచి అమలు -
దరఖాస్తుల ఆహ్వానం
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పాలియేటివ్ కేర్ విభాగంలో అద్దెకు వాహనం పెట్టడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సోమవారం తెలిపా రు. వాహనం అన్ని మండలాలు, గ్రామాల్లో తిరగాల్సి ఉంటుందని, ప్రతీ నెల 25 వేల కిలోమీటర్లు తిరగాలని, ఇందుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. వాహనంలో ముగ్గురు లేదా నలుగురు కూర్చునేలా ఉండాలని, ఎమర్జెన్సీ సమయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వాహనానికి జీపీఎస్ ట్రా కింగ్ అమర్చబడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను వైద్య ఆరోగ్యశాఖలో సమర్పించాలన్నారు. రుచికరమైన భోజనం అందించాలితొర్రూరు: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జీసీడీఓ విజయకుమారి అన్నా రు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల వంట సిబ్బందికి నూతన మెనూపై సోమవారం డివి జన్ కేంద్రంలోని కేజీబీవీలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయకుమారి మాట్లాడు తూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని, శుచి, శుభ్రతతో వంటలు చేయాలన్నా రు. కస్తూర్బాల్లో విద్యతో పాటు మంచి ఆహా రం అందించేందుకు కృషి చేస్తున్నామన్నా రు. ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య, ఎస్ఓ శైలజ, సిబ్బంది ఉన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలిమహబూబాబాద్ రూరల్: వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. సీజనల్ వ్యాధులపై మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాల కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, తండాల్లో వర్షపు నీరు నిల్వకుండా చూడాలని, మురికి కాలువలు శుభ్రం చేయాలని, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. వినియోగంలో లేని బావులు, నీటి కుంటలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ లేదా దోమల మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలని, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ వంద రోజుల క్యాంపెయిన్ గురించి అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, ఎంపీఓ పార్థసారథి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్జున్, సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐగా మహేందర్రెడ్డి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ టౌన్ సీఐగా జి.మహేందర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ మల్టీజోన్ వన్ ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహబూ బాబాద్ టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న పెండ్యాల దేవేందర్ను హైదరాబాద్లోని మల్టీజోన్ వన్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పాలకుర్తి సీఐగా పనిచేస్తున్న జి.మహేందర్ రెడ్డి మహబూబా బాద్ టౌన్ సీఐగా విధుల్లో చేరనున్నారు. భవనంలేని బడికి.. పిల్లల్ని ఎలా పంపాలికేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారితండాలో ప్రాథమిక పాఠశాలకు సొంతభవనం లేకపోవడంతో.. 24ఏళ్లుగా అద్దె భవనంలోనే తరగతులు కొనసాగుతున్నాయి. భవనం మంజూరైనప్పటికీ..నిర్మాణ పనులు మధ్యలో నే నిలిచిపోయాయి. కాగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించగా.. సొంత భవనం లేని పాఠశాల కు పిల్లల్ని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో టీచర్ల నుంచి సమాధానం లేదు. కాగా ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు,18 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏ డాది కూడా వంటమనిషి ఇంట్లోనే బడి నడిపించాల్సి వస్తుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈవిషయం తెలిసిన వెంటనే ఏసీపీ నందిరామ్నాయక్.. మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్, స్పెషల్ పోలీసులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించి మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్లకు చెందిన కొత్తపెల్లి రమణ (28) కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా కొనసాగుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చాడు. పనులు ముగించుకుని అనంతరం ఇంటికి బయలుదేరాడు. మొగిలిచర్ల గ్రామంలోని ప్రధాన రహదారిపై రాత్రి 11.30 గంటల సమయంలో గూడ్స్ వాహనం.. బైక్ను వెనక నుంచి ఢీకొంది. దీంతో రమణ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బంధువులు 108లో రమణను వరంగల్లోని సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. ఈవిషయం తెలిసి మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే (వైద్యం వికటించడంతోనే) తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆసత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్.. వైద్యులు, బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం గీసుగొండ పోలీస్ స్టేషన్లో మృతుడి తండ్రి కొత్తపెల్లి భిక్షపతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.కుటుంబీకులు, బంధువుల ఆరోపణ సంరక్ష ఆస్పత్రి ఎదుట ఆందోళన ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన విరమింజేసిన పోలీసులు -
‘ఇందిరమ్మ’ ఇళ్ల శ్లాబ్లు పడేదెప్పుడు?
ఉమ్మడి వరంగల్లో లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్జారీలో ఆలస్యం ఇటీవల ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సందర్భంగా విడుదల చేసిన లెక్కలు ఇలా...సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాపై కసరత్తు జరుగుతూనే ఉంది. తుది జాబితా పూర్తిగా కొ లిక్కిరాలేదు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికా రుల మధ్య సమయం, సమన్వయం కుదరకపోవడమే కారణంగా చెబుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎటూ తేల్చలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేయడం కోసం గత నెల 29న రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి వరంగల్కు చెందిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ నెల 6 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. మంత్రి ఇచ్చిన గడువు ముగిసినా లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు.. ఇందిరమ్మ కమిటీలతోపాటు అధికారులు పక్కాగా అర్హులను గుర్తిస్తున్నారు. ఎక్కడైనా అనర్హులకు ఇల్లు ఇస్తే అధికారులపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర మంత్రులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో లోపాలు లేకుండా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలవారీగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రాధాన్య క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నారు. కాగా, గత నెల 29న వెల్లడించిన అధికారుల గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్కు 46,892 ఇళ్లు మంజూరు కాగా 38,551 ఇళ్లకు ఎంపీడీఓలు ఆమోదం తెలిపారు. ఇందులో 18,122లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఆమోదించగా, 15,306 మంది లబ్ధిదారులకు మంజూరు ప త్రాలు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్రెడ్డి సమీక్ష తరా ్వత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే పనులపై కసరత్తు చేస్తున్నారు. సమయం, సమన్వయలోపమే అసలు సమస్య.. లబ్ధిదారుల ఎంపిక ప్రగతిని ఇటీవల విడుదల చేసిన అధికారులు జనగామలో 58.16 శాతం ప్రొసీడింగ్స్ జారీ.. 0.28 శాతానికే భూపాలపల్లి పరిమితం ములుగు జిల్లాలో పెరగని వేగం.. మానుకోట, వరంగల్లలో 35, 36శాతం 39.94 శాతంలో హనుమకొండ.. సమీక్ష తర్వాత మారిన పరిస్థితి నిర్మాణంపై దృష్టిసారించిన అధికారులు.. వేగం పెరిగితేనే సకాలంలో నిర్మాణం జిల్లా కేటాయింపు ఎంపీడీఓలు కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ ఆమోదించినవి ఆమోదించినవి సిద్ధమైనవి సిద్ధమైన శాతం హనుమకొండ 10,621 7,156 4,950 4,242 39.94 వరంగల్ 11,459 7,080 3,422 2,979 36.00 జనగామ 6,202 5,183 3,667 3,607 58.16 మహబూబాబాద్ 9,745 6,945 3,703 3,447 35.37 ములుగు 4,175 7,247 1,423 1,018 24.38 భూపాలపల్లి 4,690 4,940 957 13 0.28 మొత్తం 46,892 38,551 18,122 15,306ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాంఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చూస్తున్నాం. ఓ వైపు మొదటి విడుత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ.. ప్రొసీడింగ్స్ జారీ, మరోవైపు ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను కలిసి నిర్మాణాలకు ఎంత ఖర్చయిందని, నిర్మాణ సామగ్రిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని తెలుసుకుంటున్నాం. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు జరిగేలా అఽధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. – పి.ప్రావీణ్య, జిల్లా కలెక్టర్, హనుమకొండజిల్లాల వారీగా స్పెషల్ టీమ్లు.. మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా జిల్లాల వారీగా స్పెషల్ టీమ్లు వేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ఈ నెల 15లోగా వీలైనన్ని ఎక్కువ ఇళ్లు నిర్మాణం దిశగా ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో లబ్ధిదారుల తీరుని పరిశీలించి ఆమోదముద్ర వేస్తున్నారు. గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తూ వీలైనంత తొందరగా వీటి నిర్మాణం పూర్తయ్యేందుకు సహకరిస్తున్నారు. హనుమకొండలో 332 ఇళ్లు గ్రౌండింగ్ చేయగా, 156 బేస్మెంట్ లెవెల్కు చేరుకున్నాయి. వరంగల్లో 275 ఇళ్లకు 126, మహబూబాబాద్లో 287లకు 122, జనగామలో 405లకు 235, ములుగులో 595లకు 309, జేఎస్ భూపాలపల్లిలో 160 గ్రౌండింగ్ చేయగా, 68 బేస్మెంట్ లెవెల్కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో శనివారం నాటికి మొత్తంగా 82 ఇళ్ల వరకు స్లాబ్ లెవెల్కు చేరినట్లు అధికార వర్గాల సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● వడిచర్ల సమీపంలో ఘటన లింగాలఘణపురం: మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డులో వడిచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన ముదుగులోజు వినయ్ (27) దుర్మరణం చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వినయ్ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై జనగామ వెళ్తున్నాడు. వడిచర్ల సమీపంలోని పీవీఆర్ పాఠశాల మలుపు వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపునకు వెళ్తున్న డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, వినయ్ మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నర్సింగాపురంలో బైక్పై నుంచి పడి మరో యువకుడు.. కొడకండ్ల : బైక్ అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని నర్సింగాపురం శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం కోమటిగూడెం గ్రామానికి చెందిన గూడెల్లి కుమార్(38) బైక్పై కొడకండ్ల మండలానికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో కొడకండ్ల–పాలకుర్తి రహదారిపై నర్సింగాపురం శివారులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలున్నారు. ఎస్సై చింత రాజు ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాద వివరాలు సేకరించారు. వేములవాడలో ములుగు జిల్లా వాసి మృతి ములుగు రూరల్: వేములవాడలో ములుగు జిల్లా వాసి మృతి చెందాడు. మ ల్లంపల్లి మండలం భూపాల్నగర్కు చెందిన సాద రాజు (32) ఈ నెల 5వ తేదీన బంధువులతో కలిసి వేములవాడ వెళ్లాడు. మూడు రోజులు అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం బంధువులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో బంధువులు లక్ష్మీనరసింహ స్వామి గుడి ఆవరణలో వెతుకుతుండగా పక్కన ఉన్న కోనేరు వద్ద రాజుకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో కోనేరులో పడి ఉంటాడని భావించి స్థానికులతో కలిసి వెతకగా మృతదేహం లభించింది. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని రాజు తండ్రి సమ్మయ్యకు అప్పగించినట్లు తెలిసింది. కాగా, రాజు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
మహబూబాబాద్ అర్బన్: గిరిజనుల భూముల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్రమంగా నిర్మాణం చేపట్టారని, ఆ స్కూల్ ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ను గిరిజనులు అడ్డుకున్నారు. మహబూబాబాద్ మున్సిపల్ శనిగపురం పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఆదివారం గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేశ్నాయక్ మాట్లాడుతూ.. శనిగపురం రెవెన్యూ వీరారంతండాకు చెందిన మాజీ వార్డు కౌన్స్లర్ భూక్య శ్రీను కుటుంబానికి చెందిన(సర్వే నంబర్ 275, 278, 279లలో) సుమారు 30 ఎకరాల భూమిని డాక్టర్ జన్నపురెడ్డి ప్రమోద్రెడ్డి వారి అనుచరులతో కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. రెవెన్యూ ఉద్యోగులను, మున్సిపల్ ఉద్యోగులకు లంచాలు ముట్టజెప్పి అక్రమ మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రమోద్ హోమ్స్ పేరుతో గృహ నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ ప్రమోద్రెడ్డి గిరిజన భూములను సుమారు 30 నుంచి 60 ఎకరాలు కబ్జా చేసి ప్రస్తుతం ఆ భూముల్లో అనుమతులు లేకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో(డీపీఎస్ పేరును కలిగి ఉన్న డ్యూప్లికేట్ లోగో) నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఆ స్కూల్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్కు వినతిపత్రం అందజేయగా ఆయన ఆదేశం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన విచారణలోనూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు అక్రమించినట్లు తేలడంతో డాక్టర్ ప్రమోద్రెడ్డి, అతడి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైందని చెప్పారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ స్పందించి భూములను అప్పగించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై డీఈఓ రవీందర్రెడ్డిని వివరణ కోరాగా ఆన్లైన్లో మాత్రమే ప్రారంభానికి అనుమతులు వచ్చాయని, ఆరు నెలల్లో అన్ని పత్రాలు సరైన రీతిలో అందజేస్తే అనుమతులు వస్తాయని తెలిపారు. అనంతరం ‘గోబ్యాక్ ఎమ్మెల్యే’ అంటూ గిరిజనులు నిరసన తెలిపడంతో ఎమ్మెల్యే మురళీ నాయక్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభంలో చేదు అనుభవం స్కూల్కు ఆన్లైన్లోనే అనుమతులు -
గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు : గుర్తుతెలి యని వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గుడెప్పాడ్ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ సంతోశ్ కథనం ప్రకారం.. గుడెప్పాడ్ శివారులోని వ్యవసాయభూములకు వెళ్లే దారిలో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు 70 నుంచి 80 ఏళ్లు ఉంటాడు. నీలి రంగు, తెలుపు గీతల హాఫ్ షర్టు, ఆకుపచ్చ రంగు గీతల గల్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి ఎడమ కనుబొమ్మ దగ్గర పులిపిరి ఉంది. మృతుడి వివరాలు తెలిస్తే సంతోశ్(సీఐ) 8712685225 నంబర్, తిరుపతి(ఎస్సై) 8712685252 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. రేఖియానాయక్ తండాలో వృద్ధురాలు.. సంగెం: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం పోచమ్మతండా పరిధిలోని రేఖియానాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ ద్వాలి(70),నాను దంపతులకు నరసింహ, భద్రు సంతానం. నాను చాలా కాలం క్రితం చనిపోయాడు. పెద్ద కుమారుడు నరసింహ ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. ద్వాలి చిన్న కుమారుడు భద్రు వద్ద ఉంటోంది. ద్వాలికి రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఎప్పటిలానే శనివారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున కోడలు రంగమ్మ లేచి కిచెన్లోకి వెళ్లి చూడగా ద్వాలి ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడి కనిపించింది. మృతురాలి మనవడు వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్. నరేశ్ తెలిపారు. రెడ్డిపాలెంలో కౌలు రైతు.. గీసుకొండ: అప్పల బాధతో వరంగల్ 15వ డివిజన్ రెడ్డిపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు వరగాని సత్యం(40) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. సత్యం కూలి పనులు చేస్తూ జీవించేవాడు. రెండేళ్ల నుంచి ఓ రైతు భూమిని కౌలుకు తీసుకు సాగు చేయగా పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు అతడి భార్య వైద్య ఖర్చులు, పిల్లల చదువులు మొత్తం కలిపి రూ. 6 లక్షల అప్పు అయింది. ఈ అప్పు తీర్చలేని స్థితిలో ఈ నెల 1వ తేదీన పురుగుల మందుతాగాడు. గమనించిన బంధువులు వరంగల్ ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ ఆదివారం తెలిపారు. -
పంట అవశేషాలను కాల్చొద్దు..
మహబూబాబాద్ రూరల్ : వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ రైతులకు సూచిస్తున్నారు. దేశంలో ప్రతీ సంవత్సరం 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట అశేషాలు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న నుంచి ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం వరకు రైతులు కాల్చివేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. గ్రామాల్లో రైతుల స్థితిగతులు మారి పశువుల, మూగజీవుల పెంపకం తగ్గడం వల్ల పశుగ్రాసం వాడడం లేదన్నారు. ఈ అవశేషాలు ప్రధానంగా పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా కాల్చడం వల్ల వాటి పక్కన ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో భారీస్థాయిలో గాలి కాలుష్యం నమోదవుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చివేయడమని, తెలంగాణ రాష్ట్రంలో సగటున 30 నుంచి 40శాతం వరి, 90 నుంచి 95శాతం పత్తి అవశేషాలను కాల్చివేస్తున్నారన్నారు. కలియదున్నండి మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త మాలతి రైతులకు సూచనలు -
టిప్పర్ ఢీకొని బాలిక మృతి
పెద్దవంగర: ఈ లోకంలో ఆనందమంతా తనదే అన్నట్టు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకుందా చిన్నారి. సరదాగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలికను టిప్పర్ రూపంలో మృత్యువు బలిగొంది. రెక్కల కష్టంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురుకి పదకొండేళ్లకే నూరేళ్లు నిండడంతో కన్నపేగు కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతి కిరణ్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం బావోజీతండా గ్రామ పంచాయతీ పరిధి కిష్టుతండాకు చెందిన జాటోతు అనిత–సోమన్న దంపతులకు ఇందుమతి(11), దీక్షిత్ ఇద్దరు సంతానం. ఇందుమతి ఐదో తరగతి పూర్తికాగా వేసవి సెలవులు కావడంతో ఇంటివద్దనే తమ్ముడితో ఉంటున్నది. తండ్రి ట్రాక్టర్ డైవర్గా పని నిమిత్తం వెళ్లగా.. తల్లి తమకు ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇందుమతి ఆడుకుంటూ సైకిల్ తొక్కేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తండా సమీపాన ఉన్న నేషనల్ హైవే 930పీ పక్కనే నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డు మీదుగా దుర్గామాత ఆలయం వద్దకు సైకిల్పై వెళ్తుండగా రోడ్డు నిర్మాణ పనుల కోసం వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీకొటింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ఇందుమతి అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై క్రాంతి కిరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
టీచర్ల సంక్షేమానికి అండగా ఉంటా
విద్యారణ్యపురి: విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, టీచర్ల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని పీఆర్టీయూ భవనం మొదటి అంతస్తును ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆభవన్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. పీఆర్టీయూటీఎస్ పాతినిథ్యం మేరకు పీఆర్టీయూ కాన్ఫరెన్స్ భవనం కోసం తప్పకుండా స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, హక్కుల కోసం ఉద్యమించింది పీఆర్టీయూనే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో గొంతుకనై పోరాడాతానన్నారు. ఈసమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, వివిద జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈదునూరి రవీందర్రెడ్డి, అబ్దుల్గఫార్, మిర్యాల సతీశ్రెడ్డి, కిరణ్కుమార్, తిరునగరి శ్రీనివాస్, పీఆర్టీయూ మాస పత్రిక ఉపసంపాదకుడు ఎడ్ల ఉపేందర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, బాధ్యులు దేవిరెడ్డిమాలకొండారెడ్డి, జాలి రాఘవరెడ్డి, ఉమామహేశ్వర్, నర్సింహారెడ్డి, అడప రామారావు, బాలిని రామయ్య వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకం పీఆర్టీయూ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని -
మృగశిర కార్తె సందడి
నెహ్రూసెంటర్: మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే నానుడి ఉంది. ఆదివారం మృగశిర కార్తె కావడంతో జిల్లా కేంద్రంలో చేపలను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో కేజీ రూ.150 నుంచి రూ. 500 వరకు వివిధ రకాల చేపలను విక్రయించే వారు. మృగశిర కార్తె సందర్భంగా అందుకు భిన్నంగా రూ. 250 నుంచి రూ. 600పైగా ధరలకు వివిధ రకాల చేపలను విక్రయించారు. అయినప్పటికీ ప్రజలు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. చేపల కొనుగోలుకు ఆసక్తి చూపిన ప్రజలు కేజీ రూ. 250 నుంచి రూ. 600 వరకు అమ్మకాలు -
మదర్ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకం!
నష్టాల ఊబిలో సంస్థ ● బిల్లులు అందక 25 వేల మంది పాడి రైతుల్లో ఆందోళన ● సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపాలని విన్నపం ఆలేరు: మదర్ డెయిరీ (నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూ నియన్ లిమిటెడ్–నార్ముల్) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా అంచున నిలబడింది. పాడి రైతులకు బకాయిలు చెల్లించలేని దీనస్థితి. శుక్రవారం ఆలేరు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. మదర్డెయిరీకి చేయూతపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉద్యోగులు, రైతులు పెట్టుకున్న కాస్తోకూస్తో ఆశలు ఆవిరయ్యాయి. రైతులకు బకాయిలు ఇలా.. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మద ర్ డెయిరీ కింద పాల ఉత్పత్తిదారుల సంఘాలు గుర్తింపు పొందినవి 300 ఉండగా.. ఓటు హక్కు లేని సభ్యులున్న సంఘాలు మరో 150 ఉన్నాయి. రైతుల వద్ద సేకరించిన పాలు రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 23 పాల శీతలీకరణ కేంద్రాలకు వస్తాయి. ఆయా సంఘాల పరిధిలోని 25వేల మంది పాడి రైతులకు ఐదు బిల్లులకు సంబంధించి సుమారు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పులు, వడ్డీలు ఇవీ.. చిట్యాల వద్ద మదర్ డెయిరీకి సుమారు 30 ఎకరాల భూమి ఉంది. ఆ స్థలంపై గడిచిన కొన్నేళ్లుగా రూ.35 కోట్ల వరకు రుణం(ఓడీ) తీసుకున్నారు. ఇందుకు నెలకు రూ.45 లక్షల వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. ఇతరత్రా నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. పడిపోయిన సేల్స్.. గత రెండేళ్లగా మదర్ డెయిరీ రైతుల నుంచి సేకరించిన పాలకు, విక్రయాలకు మధ్య చాలా తేడా ఉంది. సుమారు రోజుకు లక్ష లీటర్ల పాలు సేకరిస్తే... 60వేల లీటర్లు మాత్రమే సేల్స్ ఉంటున్నాయి. దాదాపు 40వేల లీటర్ల పాలను పౌడర్గా చేయడం, స్కిన్ మిల్క్ రూపంలో బయట విక్రయించాల్సిన పరిస్థితి. దాంతో లీటర్కు రూ.6 చొప్పున సంస్థ నష్టపోయింది. దీనికితోడు ప్రైవేట్ డెయిరీలతో సవాళ్లు ఎదురవుతున్నాయి. జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయని, ఏప్రిల్ నెల జీతం జూన్లో చెల్లించారని ఓ ఉద్యోగి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 80 కోట్ల నష్టాల్లో ఉంది నేను చైర్మన్ అయిన తరువాత బ్యాంకర్లతో మాట్లాడుతూ.. రుణాలను సర్దుబాటు చేస్తూ ఇంత వరకు నెట్టుకొచ్చాను. ప్రస్తుతం బ్యాంకు ఖాతా ఆపరేటింగ్ అవడంలేదు. బ్యాంకర్లు టర్నోవర్ చేయనివ్వడం లేదు. మొత్తం రూ.80 కోట్ల నష్టాల్లో సంస్థ ఉంది. సంస్థను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నాం. –మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ డబ్బులు లేవు 25 వేల మంది రైతులకు సుమారు రూ.20 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చిట్యాలలో ఉన్న 30ఎకరాలు విక్రయించి, రైతులకు బిల్లులు చెల్లించాలని పాలకమండలిలో నిర్ణయించారు. కానీ కొంతమంది డైరెక్టర్ల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. –బి.కృష్ణ, మదర్ డెయిరీ ఎండీ -
హైరిస్క్ గర్భధారణపై జాతీయ సదస్సు
పాల్గొన్న గైనకాలజిస్టులు, సర్జన్లు హైదరాబాద్: యశోద హాస్పిటల్స్–హైటెక్సిటీ ప్రసూతి, గైనకాలజీ విభాగం అధ్వర్యంలో హై రిస్క్ గర్భధారణపై ఆదివారం జాతీయ స్థాయి సదస్సు, లైవ్వర్క్షాప్ నిర్వహించారు. 500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యశో ద గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవ న్ గోరుకంటి మాట్లాడుతూ ఈ సదస్సులో విభిన్న వైద్య విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారన్నారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ నూతన మార్గదర్శకాలు, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సంక్లిష్టమైన సర్జరీలను మరింత సులభంగా, ఖచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారనానరు. యశోద హాస్పిటల్ సీనియర్ గైనకా లజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో విజయవంతంగా తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. బాలు పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: తనికెళ్ల హైదరాబాద్: చరిత్ర ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని తనికెళ్ల భరణి అన్నారు. ఆదివారం రాత్రి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయగానసభలో కొండూరి భారతి సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ పుట్టినరోజు సందర్భంగా సినీనటులు తనికెళ్ల భరణికి ఎస్పీ బాలు నటనా పురస్కారాన్ని అంద జేశారు. వంశీ సంస్థల అధినేత వంశీ రామరా జు అధ్యక్షతన జరిగిన సభలో అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ప్రముఖ దర్శకులు రేలంగి నర్సింహారావు , తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గాయకుడు చింతలపూడి త్రినాథరావు, సినీనేపథ్య గాయకుడు వినోద్బాబు, రామచారి, శశికళాస్వామి విజయలక్ష్మి, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 79 పాటలతో 21 మంది గాయనీ గాయకులతో నిర్వహించిన ఏకగళ స్వరార్చన అందరినీ అలరించింది.క్లుప్తంగా... -
బీవీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
విద్యారణ్యపురి: సామాజిక స్పృహ కలిగిన మేధావుల కలయికతో ఏర్పాటైన భారత్ వికాస్ పరిషత్ (బీవీపీ) ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ సంస్థ దక్షిణ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి డి. పురుషోత్తం శాస్త్రి కోరారు. ఆదివారం హనుమకొండలోని వాగ్దేవి కాలేజీ సెమినార్హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన ముఖ్యఅతిథి గాపాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి, విలువలు పెంపొందించాలన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలపై చైతన్య పర్చాల్సిన అవసరం ఉందన్నారు. బీవీపీ శాఖల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థు, రైతులకు చేయూతనివ్వడంతోపాటు ఉచిత వైద్యశిబిరాలను కూడా విస్తృతంగా చేపట్టాలన్నారు. ఆర్గనైజేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ నిర్మాణం, కెపాసిటీ బిల్డింగ్తో బీవీపీని మరింతగా బలోపేతం చేయాలన్నారు. బీవీపీ ప్రాంత అధ్యక్షుడు నాగశేఖరగుప్తా మాట్లాడుతూ భగవద్గీతలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని, భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెడితే బాగుంటుందని సూచించారు. ఈ సభలో దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి ఇ.డి నాగరాజు, ఓరుగల్లు బీవీపీ అధ్యక్షుడు డి. సుధీర్కుమార్, జనరల్ సెక్రటరీ కె. సత్యనారాయణ, రాష్ట్ర రీజినల్ సభ్యులు ప్రభాకర్రెడ్డి, వి.వి నాగేందర్, మాధవీలత, ఫణీకుమార్, ఓరుగల్లు శాఖ కార్యదర్శులు శివరామకృష్ణ, బి. వెంకటరెడ్డి, చంచల్ అగర్వాల్, వివేకానంద, రత్నమంజు మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటలవరకు ఈ వర్క్షాప్ కొనసాగింది.రాష్ట్రంలోని 25 శాఖల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి పురుషోత్తం శాస్త్రి -
పొంచి ఉన్న ముప్పు!
సాక్షి, మహబూబాబాద్: వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువ అవుతుంది. డెంగీ, మలేరియా జ్వరాలతోపాటు, టైఫాయిడ్, ఇతర జ్వరాలతో ఏజెన్సీ గూడేలు, గిరిజన పల్లెల్లో జనం ఇబ్బందులు పడుతారు. ఏటా మాదిరిగానే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీం ఏటా ఏదో మూలన తాగునీటి కలు షితం, అపరిశుభ్ర వాతావరణంతో ఇబ్బందులు, వైద్య సేవలు అందక ఇక్కట్లు పడుతున్నారు. అయి తే ఈ ఏడాదిలో ఇప్పటికే డెంగీ, మలేరియా కేసుల నమోదు మొదలైంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ముందస్తు ముప్పును పసిగట్టి నివారణకు మార్గం చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. భయం భయంగా.. ప్రతీ సంవత్సరం డెంగీ విజృంభనతో ప్రజలు జ్వ రాల బారిన పడి మరణించిన సంఘటనలు ఉండటంతో వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో ప్రధానంగా గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భయంభయంగా గడపాల్సి వస్తోంది. జిల్లాలో 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు, 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 300పైగా గ్రామాలు ఏజెన్సీ, గిరిజన తండాలే ఉన్నాయి. ఇక్కడ సరైన వైద్యం అందకపోవడం, పారిశుద్ధ్య పనులు చేయకపోవడం, తాగునీరు కలుషితం కావడంతో గతేడాది 419 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటే ప్రాణాలతోపాటు, నిరుపేద గిరిజనులు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. పైసలు లేవు.. ప్రణాళికలు లేవు వర్షాకాలం రాకముందే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ నాలుగు సంవత్సరాలుగా దోమ తెరలు రాలేదని గిరిజనులు చెబుతున్నారు. అదే విధంగా డెంగీ, మలేరియా పరీక్షలు చేసేందుకు ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాల్సిన ఆర్డీటీ (రాపిడ్ డైగ్నో టెస్ట్) కిట్లు ఇప్పటి వరకు రాలేదు. పీహెచ్సీల్లో సరిపడా మందులు కూడా రానట్లు సమాచారం. అదే విధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయ డం బ్లీచింగ్, ఫాగింగ్ మొదలైన పనులకు నిధులు లేవు. దీంతో అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. మొదలైన విష జ్వరాలు భయం భయంగా ఏజెన్సీ పల్లెలు అధికారుల పనితీరుపై ఉన్నతాధికారుల ఆగ్రహం 2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల వివరాలు సంవత్సరం మలేరియా డెంగీ 2020 22 07 2021 30 43 2022 20 125 2023 06 40 2024 11 419సమన్వయం అవసరం.. వర్షాకాలం ఆరంభంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండాలంటే ప్రధానంగా పంచాయతీ, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా శాఖల మధ్య సమన్వయం అవసరం. ఈ శాఖలు సమన్వయంలో పనిచేయడం లేదని, కొన్నిచోట్ల కో–ఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టలేదని తెలిసింది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి నెలకొంటే వర్షాలు ఎక్కువ కురిసి, దోమల స్వైర విహారం మొదలైతే జ్వరిపీడితుల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికై నా కమిటీలు వేసి ఏరోజు డేటా ఆరోజు నమోదు చేయాలని జిల్లా అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. అప్రమత్తంగా ఉన్నాం.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. ఇటీవల కలెక్టర్తో జిల్లా స్థాయి అధికారుల సమీక్షలు జరిగాయి. మండల స్థాయిలో పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, తాగునీటి సరఫరా అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తాం. దోమ తెరల పంపిణీ విషయం మా పరిధిలో లేదు. – రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి -
డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్కు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా అవకాశం లభించింది. ఈమేరకు ఆదివారం జరిగిన పా ర్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి కోసం పోటీపడి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న రామచంద్రునాయక్ 2014లో టీడీపీ నుంచి, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీమంత్రి డీఎస్ రెడ్యానాయక్పై 55వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రునాయక్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు, పార్టీలోని కీలక నాయకుల ఆశీస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సముచితస్థానం కల్పిస్తుందని అందరూ ఊహించారు. మొదటి విడత మంత్రి వర్గం ఏర్పాటులో మంత్రి పదవి కాకుండా, ప్రభుత్వ విప్ ఇచ్చి సంతృప్తి పరిచారు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఈ సారి అవకాశం వస్తుందని చర్చ జరిగింది. ఆదివారం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కోసం జరిగిన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో రామచంద్రునాయక్కు ఉపసభాపతిగా నియమించేందుకు తీర్మానించారు. అనుకూలించిన సామాజిక సమీకరణలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో అత్యధిక మంది మంత్రి వర్గంలో స్థానం, లేదా మరో కీలక పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. కాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇతర కీలక పార్టీ నాయకులు ఎన్నో తర్జనభర్జన చేశారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ, కొత్త మంత్రివర్గంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ ముగ్గురికి స్థానం కల్పించారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఈసారి అవకాశం వస్తుందని చర్చ జరిగింది. ఈ విషయంపై పలు లంబాడ, గిరిజన సంఘాల నాయకులు కూడా ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జ్లను కలిసి, వినతి పత్రం అందజేశారు. అయితే మంత్రి పదవి కాకుండా లంబాడ సామాజికవర్గానికి చెందిన రామచంద్రునాయక్కు ఉపసభాపతిగా అవకాశం కల్పించారు. మంత్రి పదవికి ప్రయత్నాలు ఉప సభాపతి పదవితో సర్దుబాటు మరింత బాధ్యతతో పని చేస్తా: రామచంద్రునాయక్ పార్టీ పెద్దలకు రుణపడి ఉంటా: రామచంద్రునాయక్ అట్టడుగు వర్గానికి చెందిన తనకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పిస్తున్న కాంగ్రెస్ పా ర్టీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని రామచంద్రునాయక్ అన్నారు. మ రింత బాధ్యతతో పనిచేసి, పార్టీ ప్రతి ష్టను పెంచుతానన్నారు. డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన డోర్నకల్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. -
రెస్కూ ్య.. సెవెన్ అవర్స్!
కాళేశ్వరం: సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను ఏడు గంటల పాటు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్లో వివిధ బృందాల గాలింపుతో పోలీసులు త్వరగా కనుగొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోవివాహ వేడుకలు ముగిసిన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని సరదాగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు సొంత ఆటోలో పట్టి వెంకట్స్వామి అతడి ఇద్దరు కుమారులు, మరో ఐదుగురితో కలిసి వెళ్లారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అప్స్ట్రీమ్ మూడో బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రాంతంలో ఈతకు దిగిన ఏడుగురిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. కవలల్లో ఒకరు మృతి అంబట్పల్లికి చెందిన సమ్మయ్యకు కుమారుడు కర్ణాల సాగర్(16), స్రవంతి కవలలు. వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సాగర్ మృతి చెందడంతో సోదరి కన్నీటి ధారలతో వీడ్కోలు పలికింది. వారిదీ కూలీ కుటుంబమే. కొడుకు మరణంతో.. మల్హర్ మండలం మల్లారానికి చెందిన తొగరి రాజయ్య–సాంబ దంపతుల కుమారుడు తొగరి రక్షిత్(13) 9వ తరగతి చదువుతున్నాడు. వారు అంబట్పల్లిలోనే నివాసం ఉంటున్నారు. కూలీ పని చేస్తూ జీవించే వీరికి కుమార్తె కూడా ఉంది. రక్షిత్ మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి సాంబ రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతితో.. మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల వెంకటయ్య–స్వర్ణ దంపతుల పెద్ద కుమారుడు రామ్చరణ్(17) డిగ్రీ చదువుతున్నాడు. వీరు వ్యవసాయ కూలీలు.. వారికి చిన్న కుమారుడు ఉన్నాడు. రామ్చరణ్ మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది. అన్నా.. అంటూ నీటిలోకి.. పట్టి వెంకట్స్వామి చిన్న కుమారుడు శివమనోజ్ నీటిలోకి దిగి అన్నా..అన్నా అని పిలుస్తూ లోతుకు జారుకుంటున్నాడు. ఆక్రమంలో ఒడ్డున ఉన్న అన్న మధుసూదన్ తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నం చేసి అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పట్టి మధుసూదన్ను కాపాడే ప్రయత్నంలో పట్టి శివమణి(18) కూడా నీటిలోకి దిగి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ఫీలతోనే.. ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ క్రమంలోనే జారి లోతు ప్రవాహంలో పడినట్లు తెలిసింది. దీంతో ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు అంతా గల్లంతై మృత్యువాత పడ్డారని తెలిసింది. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 12 గంటల వరకు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, ఫైర్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాలు వెలికి తీశారు. అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో మార్మోగింది. రాత్రి ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఘటన జరగడంతో హుటాహుటిన కదిలిన అధికారులు లైటింగ్ ఏర్పాటు చేసి కొంతమేర లోతుకు వెళ్లి పరిశీలించి రాత్రి 11.50గంటలకు వరకు వేచి చూసి నిలిపి వేశారు. శనివారం గోదావరి ప్రవాహం 5,100 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 4,500 క్యూసెక్కులకు తగ్గింది. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు మృతులందరివీ సాధారణ కూలీ కుటుంబాలే తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు ప్రాణాలు తీసిన ఈత సరదా.. సెల్ఫీలపై ఆసక్తి!7 గంటల్లో ఇలా.. ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహు ల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్,11.16 గంటలకు రామ్చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్ కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగా ర్జునరా వు, ఎస్సైలు పవన్కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. డీటీ కృష్ణ, ఆర్ ఐ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు. అన్నీ కూలీ కుటుంబాలే.. అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి–యశోద దంపతులకు ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్(18) డిగ్రీ, చిన్నకుమారుడు పట్టి శివమనోజ్(15) (పదో తరగతి పూర్తి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కళ్ల ముందే నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పిల్లల చెప్పులు, బెల్టులు పట్టుకొని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.వివాహ వేడుకలకు వచ్చి.. మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల శ్రీనివాస్–లక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు రాహుల్(19) డిగ్రీ చదువుతున్నాడు. వివాహ వేడుకలకు వచ్చి రాహుల్ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారు కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రూ.10లక్షలు పరిహారం చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి వదిలేశారని, నీటిని నిల్వ చేసి కాపలా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. ఆరుగురు మృతి ఘటనకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబే కారణమని ఆరోపించారు. -
టీసీలు లేకుండానే అడ్మిషన్లు..
కేయూ క్యాంపస్: పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఏ కళాశాలలోనూ వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందినా అంతకుముందు చదివిన విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) లేకుండా విద్యార్థులను చేర్చుకోరు. ఎందుకంటే ఒకే విద్యా సంవత్సరంలో రెండు చోట్ల వేర్వేరు కోర్సులు చదవకుండా నిరోధించేందుకు టీసీ తప్పనిసరిగా ఉంటేనే అడ్మిషన్లు ఇస్తారు. అయితే కేయూలోని విద్యాకళాశాలలో బీఈడీ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్కోర్సుగా, ఎంఈడీ రెగ్యులర్ కోర్సుగా కొనసాగుతోంది. ఆయా కోర్సుల్లో (2024–2025 )విద్యాసంవత్సంలో అడ్మిషన్లు పొందినవారిలో కొందరు విద్యార్థులు టీసీలు సమర్పించలేదనే విషయాన్ని కొంతకాలం క్రితం ఆ కళాశాలకు ఇన్చార్జ్ (ఎఫ్ఏసి) ప్రిన్సిపాల్ బాధ్యతలను చేపట్టిన ప్రొఫెసర్ మనోహర్ గుర్తించారు. ఎవరైతే విద్యార్థులు టీసీలు సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారో వారికి గత మే నెలలో నోటీస్లు జారీచేశారు. వారికి ఇచ్చిన గడువు వరకూ టీసీలు సమర్పించని 11మంది విద్యార్థుల అడ్మిషన్లు ఈనెల 4న రద్దు చేసినట్లు మనోహర్ వెల్లడించారు. ఆ కళాశాలలో ఆయా విద్యార్థుల పేర్లను కూడా నోటీసు బోర్డులో పెట్టామని తెలిపారు. ఇప్పటికే ఆయా విద్యార్థులు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశారని పేర్కొన్నారు. అడ్మిషన్లు జరిగినప్పుడు ఆ సమయంలో టీసీలు లేని వారు తాము వారం పదిరోజుల్లో సమర్పిస్తామని కూడా లేఖ కళాశాలలో సమర్పిస్తారు. ఒక వేళ వారు ఆ తర్వాత సమర్పించకపోతే కూడా ప్రిన్సిపాల్ ఆయా విద్యార్థులను అడగాల్సింటుంది. విద్యా కళాశాలలో గతంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వర్తించిన ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎందుకు పట్టించుకోలేదనే అంశం ఇప్పుడు ప్రశ్నతలెత్తుతోంది. టీసీలను సమర్పించని విద్యార్థులను మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎలా అనుమతించారనే అంశం ప్రస్తుత ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ లేవనెత్తుతున్నారు. టీసీలు సమర్పించని విద్యార్థుల అడ్మిషన్ల రద్దుచేయడమేగాకుండా అప్పటి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్పై కూడా చర్యలు తీసుకునే అవకాశంలేకపోలేదని సమాచారం. యూనివర్సిటీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారని సమాచారం. బీపీఈడీలో నలుగురికి, ఎంపీఈడీలో ఆరుగురికి నోటీసులు కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీకోర్సులో నలుగురు, ఎంపీఈడీ కోర్సులో ఆరుగురు విద్యార్థులు మొత్తం 10మంది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ( టీసీలు) సమర్పించకుండానే (2024–2025 )విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందారనే విషయాన్ని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్ గుర్తించారు. తాను బాధ్యతలు చేపట్టాక ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో అడ్మిషన్లకు సంబంధించిన విద్యార్థుల జాబితా పరి శీలించారు. అందులో 10మంది విద్యార్థులు టీసీ లు సమర్పించలేదని గుర్తించారు. ఇప్పటికే ఆయా విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశారు. ఆయా 10 మంది విద్యార్థులకు ఈనెల 6న నోటీసులు జారీచేసినట్లు మనోహర్ తెలిపా రు. ఈనెల 16వతేదీవరకు టీసీలు సమర్పించా లని గడువును విధిస్తూ ఆ నోటీసులో పేర్కొన్నా రు. వారికి ఇచ్చిన గడువు వరకు టీసీలు సమర్పించని విద్యార్థుల అడ్మిషన్లు రద్దుచేస్తామని కూడా మనోహర్ తెలిపారు. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కా లేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా కొంతకాలంపాటు ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యతలు నిర్వర్తించారు. టీసీలు సమర్పించని విద్యార్థులను ఎలా మొదటి సెమి స్టర్ పరీక్షలకు అనుమతించారనేది కూడా ప్రశ్నతలెత్తుతుంది.ఆయా విద్యార్థులు టీసీలు సమర్పిస్తారా లేదా అనే అంశం ఈనెల16వ తేదీ వరకు తెలియనుంది. మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు బీఈడీ, ఎంఈడీలో కలిపి 11మంది అడ్మిషన్లు రద్దు బీపీఈడీ, ఎంపీఈడీలో కలిపి 10 మందికి నోటీసులు -
ఏీపీ ఎప్సెట్లో మనోళ్ల ప్రతిభ
విద్యారణ్యపురి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈఏడాదిలో నిర్వహించి ఆదివారం విడుదల చేసిన ఏపీ ఎప్సెట్ పరీక్ష ఫలితాల్లో మనోళ్లు అత్యంతప్రతిభ చూపి ర్యాంకులు సాధించారు. ఎప్సెట్ ఇంజనీరింగ్లో హనుమకొండ వడ్డేపల్లి సురేంద్రపురికాలనీకి చెందిన శాగంటి త్రిశూల్ రాష్ట్రస్థాయిలో 92.5801 కంబైన్డ్ స్కోఽర్తో 8వ ర్యాంకు సాఽధించాడు. టెన్త్ హనుమకొండ శ్రీచైతన్యలో చదివిన అతను ఇంటర్ హైదరాబాద్ శ్రీచైతన్యలో 986 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే త్రిశూల్ ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ఇండియాలో 579వ ర్యాంకు సాధించాడు. ఖరగ్పూర్/కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంగా ఉందని, సీటు వస్తుందని భావిస్తున్నామని త్రిశూల్ తెలిపాడు. త్రిశూల్ తల్లి సబిత, నర్సయ్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీలో షణ్ముక్కు 4వ ర్యాంకు ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో అగ్రికల్చ రల్ అండ్ ఫార్మసీలో 92.3809 స్కోర్తో హనుమకొండ సుబేదారి టీచర్సకాలనీ ఫేజ్–1కు చెందిన ఎండ్రపాటి శ్యాంసుందర్, రజనీ దంపతుల కుమారుడు షణ్ముక్ 4వ ర్యాంకు సాధించాడు. అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే షణ్ముక్ ఇప్పిటికే నీట్ పరీక్ష రాశాడు. డాక్టర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపాడు. నీట్ కీ ఇప్పటికే విడుదలేందని, మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాడు. ఎంబీబీఎస్లో సీటు లభిస్తుందని ఆశిస్తున్నాడు. రాకపోతే ఫార్మసీలో అడ్మిషన్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపాడు. ఇంటర్ హైదరాబాద్ శ్రీచైతన్యలో చదివిన శన్ముఖ్ 987 మార్కులు సాధించాడు. టెన్త్ హనుమకొండ శ్రీచైతన్యలో చదివి 10/10జీపీఏ తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్లో శాగంటి త్రిశూల్కు 8వ ర్యాంకు -
హెమోఫిలియా బాధితులకు మందుల పంపిణీ
విద్యారణ్యపురి: హెమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని రెడ్క్రాస్ సొసైటీ హాల్లో ఇంటన్స్ ఫార్మా వారి సహకారంతో హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీచేశారు. హెమోఫిలియా అనేది రక్తస్రావం జరగడం వల్ల సంక్రిమించేవ్యాధి అని, ఇది వంశపారంపర్యంగా ఫాక్టర్ 7, 8, 9 లోపించడం వల్ల వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈవ్యాధిగ్రస్తులకు దంత పరమైన సమస్యల గురించి డాక్టర్ సంఘర్ష్ వివరించారు. ఇంటన్స్ ఫార్మా హెమోఫిలియా వరంగల్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ నారెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 120 మంది వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్చందర్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, పాపిరెడ్డి, ఎంసీ మెంబర్ పుల్లూరు వేణుగోపాల్ పాల్గొన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అర్బన్: క్రీడలలో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల స్థాయి అండర్–19 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. భూపాలపల్లి–ములుగుల మధ్య జరిగిన మ్యాచ్ను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. 40 రోజుల నుంచి జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వంద మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి మాట్లాడారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం నూతన పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ఏదో ఒక క్రీడను ఎంచుకుంటే ప్రతీ విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సిరిమళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కోచ్ రాజు కుమార్ పాల్గొన్నారు. -
ఆర్యూబీలో మురుగు నీరు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మహబూబాబాద్: మానుకోట పట్టణంలోని అండర్ రైల్వే బ్రిడ్జి(ఆర్యూబీ)లో మురుగు నీరు నిల్వతో దుర్గంధం వెదజల్లడంతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు శరీరంపై పడి చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఽధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆర్యూబీపై ఇటీవల రైల్వే మూడో లైన్ పనులు చేపట్టి పూర్తి చేశారు. కానీ ఆ బ్రిడ్జి కింది భాగాన ఉన్న డ్రెయినేజీ నిర్మాణ పనులు రైల్వే అధికారులు పూర్తి చేయలేదు. కాగా, సమీపంలో జిల్లా ప్రధాన ఆస్పత్రికి సంబంధించిన డ్రెయినేజీ మురుగు నీరు ఆ బ్రిడ్జిలో నిల్వ ఉంటుంది. దీంతో మురుగు నీటి దుర్వాసనతో పాటు వాహనదారులు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు కూడా సమస్యను రైల్వే ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్ప.. ఆచరణలో అమలు చేయడం లేదు. కాగా ఈనెల 9వ తేదీ వరకు ఆపనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు.. అలంకారప్రాయం మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని మదర్ థెరిస్సా విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలం నుంచి పనిచేయకుండా అలంకార ప్రాయంగా మారి దర్శనమిస్తున్నాయి. వాహనాల రాకపోకలు, నేరాల నియంత్రణ, ఇతర కార్యక్రమాల సమాచార సేకరణ నిమిత్తం పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం, చోరీ, ఇతర సంఘటనలు జరిగినప్పుడు సమాచార సేకరణకు తలనొప్పిగా మారుతుండగా.. సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవికాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పనిచేయటంలేదని ప్రజలు, వాహనదారులు పేర్కొన్నారు. పోలీసులు ఏర్పాటు చేయించిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పుటేజీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. వైభవంగా ‘సందల్’ ఊరేగింపు మహబూబాబాద్ రూరల్: బక్రీద్ పండుగ నేపథ్యంలో సందల్(గంధం), ఖందిల్ ఊరేగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి మానుకోటలో వైభవంగా జరిగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో సయ్యద్ ఇమాంషావలీ దర్గాలో సమర్పించేందుకు తీసుకెళ్లే సందల్కు ముస్లిం మతపెద్దలు అబ్దుల్ హమీద్, మహ్మద్ సయీద్ అహ్మద్ రిజ్వీ, ఎస్.కే.ఇమ్రాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ రావు, డీటీ నాగరాజు, ఆర్ఐలు ప్రవీణ్ కుమార్, విక్రమ్, సీనియర్ అసిస్టెంట్ రహెమాన్, జూనియర్ అసిస్టెంట్ బిస్మిల్లా గంధాన్ని ఇమాంషావలీ దర్గాకు సాగనంపారు. సందల్ ఊరేగింపు సందర్భంగా ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాగా ఖందిల్తోపాటు రెండు రకాల గంధాన్ని ఈదులపూసపల్లిలోని ఇమాంషావలీ దర్గాలో సోమవారం తెల్లవారుజామున సమర్పించనున్నారు. అదేరోజు ఆ ప్రాంతంలో ఘనంగా ఉర్సు ఉత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ముస్లింలు ఎండి.హారుణ్, జమీల్, ఖలీల్, ఆసిఫ్ అలీ ఫకీర్, ఫరీద్, ఇస్మాయిల్, ఖైసర్, ఫారూఖ్, ఫెరోజ్, ఫయాజ్, యాకూబ్, జిలానీ, వాహెద్, చాంద్, ఎక్బాల్, రెహమాన్, గౌస్, దస్తగిరి, ఖాజాపాషా, వాజీద్పాషా, ఆదిల్, ఈదులపూసపల్లి దర్గా ముతవల్లి అన్వర్, పద్మం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ఎత్తివేతపై కుట్రలు మానుకోవాలి
తొర్రూరు: ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను విరమించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని లయన్స్క్లబ్లో వ్యవసాయ కార్మిక సంఘం మూడో జిల్లా మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు ఏడాదికి 200 రోజులు పని, రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. ఈ పథకంలో అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్లు దాటిన కూలీలకు నెలకు రూ.6 వేల పింఛన్, మృతి చెందిన కూలీకి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి రూ.4 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయి ంచాలని కోరారు. సీపీఐ, బీకేఎంయూ నాయకులు అజయ్, విశ్వేశ్వర్రావు, కుమార్,వెంకన్న ఉన్నారు. -
తెలుగు వెలుగులు సాకారమయ్యేనా?
● ఈ విద్యాసంవత్సరం నుంచే సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి చేస్తామన్న సీఎం ● ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అన్ని రకాల స్కూళ్లలో అమలుకు ఆదేశాలు ● పక్కాగా అమలుకు వెంటనే మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న టీచర్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలుగుకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అన్ని రకాల సిలబస్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో తెలుగు మీడియంలో చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించినవారు ఎందరో ఉన్నా, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడి యానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతోంది. అయితే మాతృభాషలో చేసే వ్యక్తీకరణ మరే ఇతర భాషల్లోనూ రాదన్నది భాషా నిపుణుల అభిప్రాయం. ఐదో తరగతి వరకు మాతృ భాషలో బోధన ఉండాలని, 8వ తరగతి వరకు ఉంటే మరింత మేలని నూతన విద్యా విధానం చెబుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని రకాల సిలబస్ స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తామని ఆ దిశగా చర్యలు చేపడతామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి సిలబస్ కలిగిన స్కూళ్లలోనూ అమలు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఈనెల 12 నుంచే పాఠశా లలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది. గతంలో ఉత్తర్వులు జారీ చేసినా.. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని తెలంగాణ (కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ తెలుగు ఇన్ స్కూల్స్) యాక్ట్ 2018ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అదే ఏడాది జూన్ 30వ తేదీన దశల వారీగా తెలుగు అమలు కోసం జీవో 24ను కూడా జారీ చేసింది. అయినా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా పక్కాగా అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర సిలబస్ కలిగిన కొన్ని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలతోపాటు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐసీఎస్ఈ), ఇంటర్నేషనల్ బకలరియట్ (ఐబీ) సిలబస్ కలిగిన ఇంటర్నేషనల్ స్కూళ్లు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడం లేదు. రాష్ట్ర సిలబస్ కలిగిన చాలా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, సీబీఎస్ఈ స్కూళ్లు తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా మాత్రమే అమలు చేస్తున్నాయి. తప్పనిసరి కాకపోవడంతో విద్యార్థులు ఎవరూ తెలుగు సబ్జెక్టును పెద్దగా ఎంచుకోవడం లేదు. దీంతో ఆయా స్కూళ్లలో తెలుగు భాష అమలుకు నోచుకోవడం లేదు. మెజారిటీ స్కూళ్లలో అమలు అంతంతే ప్రస్తుతం రాష్ట్రంలో 42,901 పాఠశాలలు ఉండగా, అందులో 59,35,927 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం పాఠశాలల్లో 10,741 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 33,93,010 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఆ స్కూళ్లు అన్నింటిలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడం లేదు. కొన్ని స్కూళ్లు అమలు చేస్తుండగా, మరికొన్ని ఆప్షనల్గా అమలు చేస్తున్నాయి. మరోవైపు 533 సీబీఎస్ఈ సిలబస్ కలిగిన స్కూళ్లు ఉండగా, మిగితావి ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లోనూ తెలుగు పక్కాగా అమలుకు నోచుకోవడం లేదు. ఇకనైనా ‘తప్పనిసరి తెలుగు’అమలయ్యేనా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ కలిగిన పాఠశాలల్లో 9, 10 తరగతులకు సంబంధించిన రాష్ట్రేతర విద్యార్థుల కోసం సింపుల్ తెలుగు పాఠ్య పుస్తకం ‘వెన్నెల’ను సీఎం రేవంత్రెడ్డి గత ఫిబ్రవరి 26వ తేదీన ఆవిష్కరించారు. ఆ సమయంలో అన్ని రకాల సిలబస్ కలిగిన స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా 2025–26 విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పారు. దానిని ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు టీచర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. -
చదువుల కల చెదిరింది..
నెహ్రూసెంటర్/కురవి: టెన్త్ వార్షిక పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాసైన విద్యార్థిని ఇంటర్మీడియట్ చదివేందుకు సిద్ధమవుతూ విధి ఆడిన వింత నాటకంలో రోడ్డు ప్రమాదానికి గురై కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మానుకోట జిల్లా కురవి మండలానికి చెందిన తొడుసు వెంకన్న, సరిత దంపతుల కుమార్తె నేహ(15) ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తన తల్లి సరితతో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ కంటి ఆస్పత్రిలో చూపించుకుని, దుస్తులు కొనుగోలు చేసి ఆటోలో తిరుగుపయనమయ్యారు. కురవి శివారు లింగ్యాతండా సమీపంలో 365 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఆటోను అశోక్ లేలాండ్ వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో నేహ అక్కడికక్కడే మృతి చెందగా తల్లి సరిత, డ్రైవర్ కానుగంటి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ రాజు, తల్లి సరితను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన నెమలి వంశీని ప్రత్యక్ష సాక్షులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కురవి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తండ్రి వెంకన్న కుమార్తె నేహ మృతదేహంపై పడి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు. ఇదిలా ఉండగా.. తీవ్ర గాయాలపాలైన సరిత, రాజుకు ఎక్స్రే, సీటీ స్కాన్ అవసరముండగా ప్రభుత్వ ఆస్పత్రిలో టెక్నిషియన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ సెంటర్ను ఆశ్రయించాల్సి వస్తుందని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు. నేహ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు జ్యోతిబసు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతూ అనంత లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి ప్రాణాపాయస్థితిలో తల్లి మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు -
‘ఓపెన్ స్కూల్’ పరీక్షల ఫలితాలు విడుదల
● ఉమ్మడి జిల్లాలో టెన్త్లో 69.04 శాతం.. ● ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత విద్యారణ్యపురి: ఈ ఏడాది ఏప్రిల్–మే లో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ పరీక్షలకు 2,478 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 1,711 మంది (69.04 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,449 మంది హాజరుకాగా 2,989 మంది విద్యార్థులు(67.17శాతం) ఉత్తీర్ణత సాధించారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేట్ అనగోని సదానందం తెలిపారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు.. ● హనుమకొండ జిల్లాలో టెన్త్లో 390 మంది విద్యార్థులకు గాను 318మంది (81శాతం), ఇంటర్లో 997 మందికిగాను 673 మంది (67శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● వరంగల్ జిల్లాలో టెన్త్లో 476 మందికిగాను 127 మంది (27శాతం), ఇంటర్లో 650 మందిలో 323 (49శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● మహబూబాబాద్ జిల్లాలో టెన్త్లో 441 మందికిగాను 337 మంది (76 శాతం), ఇంటర్లో 657మందికిగాను 488 మంది (74శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● జనగామ జిల్లాలో 349మందికిగాను 293మంది (84శాతం), ఇంటర్లో 942మందిలో 777 మంది ఉత్తీర్ణత (82.1శాతం) సాధించారు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్త్లో 269 మందికిగాను 216 మంది (80శాతం), ఇంటర్లో 394 మందికిగాను 302 మంది (76.6శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● ములుగు జిల్లాలో 553 మంది విద్యార్థులకుగాను 420 మంది (76 శాతం), ఇంటర్లో 809 మందికిగాను 426 మంది విద్యార్థులు (51.7శాతం) ఉత్తీర్ణత సాధించారు. చోరీలకు పాల్పడిన నలుగురి అరెస్ట్ కమలాపూర్: తాళాలు పగులగొట్టి ఆలయాల్లోకి చొరబడి హుండీలను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని గూడూరు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా జమ్మికుంట మారుతినగర్కు చెందిన జానబోయిన అరవింద్, హుజూరాబాద్ కొత్తపల్లికి చెందిన గుల్ల ప్రవీణ్, హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లికి చెందిన గట్టు మనోజ్, జమ్మికుంట ఇందిరానగర్కు చెందిన శ్రీరాముల రాజేష్ అనే నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారని తెలిపారు. వాహనాలతోపాటు వారిని తనిఖీ చేయగా వారి వద్ద రూ.38 వేలు లభించాయని, వివరాలు అడగ్గా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. దీంతో కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం, భీంపల్లి గ్రామాల్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలతోపాటు జమ్మికుంట, దామెర, శాయంపేట, ఆత్మకూరు మండలాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.38 వేల నగదు, 2 బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్సై వీరభద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నదీతీరం..శోకసంద్రం
మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొకరు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడవ బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాధం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. సాయంత్రం 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది. నేనూ సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. గల్లంతైన వారు.. అంబట్పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంట వాసులు: బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్(19)వరంగల్ నగరంలో మరో విద్యార్థి మృతుడు నెక్కొండ వాసి హసన్పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని అతిథి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేష్, సాయి కిరణ్తో కలిసి గణేష్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుకు ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేష్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.50 వరకు సాగిన గాలింపు చర్యలు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదం -
త్వరలో మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ప్రతిభ గల మహిళా క్రీడాకారులను గుర్తించేందుకు త్వరలో మహిళా క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బస్వరాజు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరాలు శనివారం ముగిశాయి. ముగింపు వేడుకలు కరుణాపురంలోని వంగాలపల్లి క్రికెట్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బస్వరాజు హాజరై క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సదాశివ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బస్వరాజు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో ని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే ధ్యేయంగా హెచ్సీఏ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు నిరంతరంగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డబ్ల్యూడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో నిరంతర క్రికెట్ క్యాంపుల ఆవశ్వకతను గుర్తుచేస్తూ వంగాలపల్లి గ్రౌండ్ను హెచ్సీఏ పరిధిలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. రాబో యే జనరల్ బాడీ మీటింగ్లో జిల్లాలో ఫ్లడ్లైట్ల వెలుతురులో క్రికెట్ అకాడమికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్లబ్ కార్యదర్శులు భార్గవ్, శంకర్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, అభివవినయ్, అజయ్సారథి పాల్గొన్నారు. హెచ్సీఏ సంయుక్త కార్యదర్శి బస్వరాజు ముగిసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు -
బడి బస్సు భద్రమేనా?
మహబూబాబాద్ అర్బన్: ఈ విద్యాసంవత్సరం ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. బడిలో అడుగు పెట్టేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. నిత్యం వారు ప్రయాణించే బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ప్రైవేట్ బడుల బస్సులు రోడ్డు ఎక్కాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. లేదంటే బస్సులను సీజ్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు ముందస్తుగా పాఠశాల యాజమాన్యాలను అప్రమత్తం చేసినా.. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 118 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా సుమారు 222 బస్సులు ప్రస్తుతం పాఠశాలల్లో నడుస్తున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా బస్సుల తనిఖీ కోసం పాఠశాలలు ప్రారంభం కాగానే ప్రత్యేక టీంలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలల బస్సులపై కొరఢా ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫిట్నెస్ పరీక్షలపై నిర్లక్ష్యం.. స్కూలు, కళాశాల బస్సు ఫిట్నెస్ అర్హత సాధించాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పాత బస్సులకు కొత్తరంగులు అద్ది బస్సులు నడిపిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. రవాణాశాఖ నిర్ధేశించిన ప్రమాణాలు పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మానుకోట జిల్లాకేంద్రం చుట్టుపక్కల ఉన్న మండలాలకు, గ్రామాలకు ఎక్కువ శాతం బస్సులు నడుస్తున్నాయి. పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా గడువు తేదీ చివరి వరకు వేచిఉండి వెంటవెంటనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చూస్తున్నట్లు సమాచారం. మోటారు వాహనాల చట్టం 185(ఎఫ్) ప్రకారం విద్యా సంస్థల బస్సులు నిబంధనల ప్రకారం ఫిట్నెస్తోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలను విద్యాసంస్థల యాజమాన్యాలు సమకూర్చుకోవాలి.ప్రైవేట్ స్కూల్ బస్సులు (ఫైల్)ఫిట్నెస్ లేకుంటే బస్సులు సీజ్..పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి. ఆ తర్వానే విద్యార్థులను ఎంచుకుని బస్సులు నడిపించాలి. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే వాటిని సీజ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –జైపాల్రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి●నిబంధనలు ఇవే.. ● రవాణాశాఖ కార్యాలయానికి ఫిట్నెస్ కోసం వచ్చే బస్సుల్లో 15 సంవత్సరాలు దాటిన వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వీలు లేదు. ● 15లోపు ఉన్న స్కూలు, కళాశాల బస్సులు, వాహనాల కండీషన్, ఇంజిన్ కండీషన్ పూర్తిస్థాయిలో పరిశీలించాలి. ● విద్యార్థులు కూర్చునే సీట్లు, బస్సులు ఎక్కే ఫుట్బోర్డు, బస్సు కిటికీల నుంచి బయటకు చూడటానికి గ్రిల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ● ఇంజిన్ కంపార్ట్మెంట్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఉండాలి. ● విద్యార్థులు బస్సులో నుంచి దిగడం, ఎక్కడం స్పష్టంగా కనిపించేందుకు కన్వెక్స్ అద్దాలు ఉండాలి. ● ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను బస్సులో ఏర్పాటు చేయాలి. ● బస్సు డ్రైవర్ కనీస విద్యార్హత 8వ తరగతి పాసై ఉండాలి. హెవీ వెహికిల్ లైసెన్స్, అనుభవం ఉండాలి. ● జిల్లా రవాణాశాఖ అధికారిచే జారీ చేయబడిన విద్యాసంస్థల బస్సు పర్మిట్, బస్సు జీవిత కాలపు తేదీ తప్పనిసరిగా ఉండాలి. ● బస్సులో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లరాదు. ● డ్రైవర్కు మద్యం తాగి వాహనం నడిపే అలవాటు ఉండొద్దు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం నిర్లక్ష్యంలో పాఠశాలల యాజమాన్యం -
వడదెబ్బతో వ్యక్తి మృతి
జనగామ: జనగామ పట్టణం బీరప్పగడ్డకు చెందిన నేతి అంతయ్య(70) వడదెబ్బకు గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. రోజువారీ పని ముగించుకుని ఇంటికి చేరిన ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతయ్యకు భార్య సుగుణమ్మ, కుమారుడు ఉపేందర్, కుమార్తె ఉమ ఉన్నారు. పాముకాటుతో.. సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన వ్యక్తి పాముకాటుకు గురై ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన చాగంటి యాకయ్య(56) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటున్నాడు. నెల రోజుల క్రితం సైకిల్పై నుంచి పడిన యాకయ్య ఇంటి వద్దనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనాల అనంతరం ఇంటి ముందున్న రేకుల షెడ్ కింద యాకయ్య, అతని కుమారుడు రంజిత్ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున యాకయ్య ఏదో కుట్టినట్లయిందని కుమారుడు రంజిత్కు తెలియజేశాడు. పరిశీలించగా.. బొడ్డు కింద, పురుషాంగంపైన పాము కాటు వేసినట్లు కన్పించింది. చుట్టుపక్కల వారి సాయంతో వెతకగా.. కట్ల పాము కన్పించింది. దీంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శనివారం ఉదయం యాకయ్య మృతి చెందాడు. కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. భూమి కబ్జా చేశారని దివ్యాంగుడి ఆందోళన పాలకుర్తి టౌన్: భూమిని కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని మండుటెండలో దివ్యాంగుడు ఆందోళన చేసిన సంఘటన శనివారం జ నగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో చోటు చేసుకుంది. మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగు డు రూపాని సాలయ్య 16 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కజ్జా చేశారని తన కు న్యాయం చేయాలని మండల కేంద్రంలోని ఆందోళన చేశాడు. ఈ సందర్భంగా దివ్యాంగు డు సాలయ్య మాట్లాడుతూ మల్లంపల్లి గ్రా మానికి చెందిన చింతం మహేందర్ వద్ద 5.20 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తన భార్య యాదమ్మ పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించానని తెలిపాడు. ఇప్పడు అదే గ్రామానికి చెందిన చింతం వెంకన్న అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసి సాగు చేసుకుంటున్నాడని త నకు నాయ్యం చేయాలని కలెక్టర్ను కోరారు. -
‘అక్షర వాచస్పతి’ దాశరథి
చిన్నగూడూరు: అక్షరమే ఆయుధంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ‘అక్షర వాచస్పతి’(జ్ఞానానికి అధిపతి) దాశరథి రంగాచార్య. మానుకోట జిల్లాలోని ఉద్యమాల పురిటిగడ్డ చిన్నగూడూరు ప్రస్తుతం మండల కేంద్రంగా కొనసాగుతోందంటే కారణం దాశరథి సోదరులు (దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు) స్ఫూర్తితోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు(ఆదివారం) దాశరథి రంగాచార్యుల వర్థంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చిన్నగూడూరులో వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో వెంకటాచార్యులు– వెంకటమ్మ దంపతులకు 24 ఆగష్టు 1928 సంవత్సరంలో దాశరథి రంగాచార్యులు జన్మించారు. విద్యాభ్యాసం ఖమ్మం జిల్లాలో సాగింది. 12 ఏళ్లకే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. తెలంగాణ పల్లెల్లో నాటి జీవన విధానాన్ని ఆయన రాసిన నవలల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు అనే నవలలు ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. రంగాచార్యులు సోదరుడు దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నవాబు పాలనను ఎదిరించి ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తన కవిత్వంతో వెలుగెత్తి చాటి తెలంగాణ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడిగా పేరొందాడు. తమ్ముడు రంగాచార్య వచనంతో అన్న కృష్ణమాచార్యుల బాటలో నడిచి మలిదశ ఉద్యమానికి ఊపిరిపోశాడు. నిజాం పాలనలో అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఉద్యమబాటలో నడిచాడు. దాశరథి రంగాచార్యులు సాహితీవేత్తగా, సాయుధ పోరాట యోధుడిగా, బహూముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన రాసిన నవలలు తెలంగాణకే పరిమితం కాకుండా భారతదేశమంతటా కీర్తి గడించాయి. ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, సికింద్రాబాద్ పురపాలక శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. పురస్కారాలు.. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు రంగాచార్యులు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. ఆయన రాసిన చిల్లర దేవుళ్లు రచనకు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1980 సంవత్సరంలో వెంకటశివయ్య సాహితీ పురస్కారం, 2000 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. తెలుగు సాహిత్య రచనల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఆయన 2015 జూన్ 8న తుది శ్వాస విడిచారు. దాశరథి సోదరులు పుట్టిన చిన్నగూడూరులో వారి జ్ఞాపకార్థంగా దాశరథి గ్రంథాలయం ఏర్పాటు చేసి, చిన్నగూడూరును దాశరథి గూడూరుగా నామకరణం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. నేడు రంగాచార్యుల వర్థంతి -
1,200 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
హసన్పర్తి: ఎస్సార్ యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంపై శుక్రవారం సాయంత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాలు పరిశ్రమ అవసరాలను గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించిన ఫలితంగా సాధ్యమయ్యాయన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని కోణాల్లో వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ విజయాల్లో కీలకంగా పనిచేసిన డీన్లు, వివిధ శాఖాధికారులు, డైరెక్టర్లు, ప్లేస్మెంట్ సమన్వయ కర్తల కృషిని అభినందించారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించేందుకు అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ జి.సునీల్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, ప్రొ వైస్ చాన్స్లర్ డాక్టర్ మహేష్తోపాటు వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. -
క్షయ రహిత సమాజమే లక్ష్యం
నెహ్రూసెంటర్: క్షయ వ్యాధిని (టీబీ) అంతమొందించేందుకు క్షయ రహిత సమాజమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. 2030 నాటికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతుంది. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంతో వంద రోజుల టీబీ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు వైద్య సిబ్బంది రంగంలో దిగారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, టీబీ రోగులకు పోషకాహారానికి ఆర్థిక సాయం అందించనున్నారు. జిల్లాలో టీబీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. డిసెంబర్ 2024 నుంచి మే నెల వరకు 661 కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ టీబీ నివారణకు గ్రామాల్లో వైద్యసిబ్బంది స్క్రీనింగ్ చేపట్టారు. టీంలుగా ఏర్పడి... జిల్లాలో 483 గ్రామ పంచాయతీల్లో ఇతర వ్యాధులతో పాటు క్షయవ్యాఽధి స్క్రీనింగ్కు రెండు టీంలుగా ఏర్పాటు చేసి తెమడ పరీక్షలు, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయవ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులను 102 వాహనాల ద్వారా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, సీహెచ్సీలకు తరలించి ఉచితంగా మందులను ఆరు నెలల పాటు అందజేస్తున్నారు. జిల్లాలోని విద్య, గ్రామీణాభివృద్ధి, సమాచార పౌర సంబంధాలు, ఐసీడీఎస్, మున్సిపాలిటీ, మెప్మా శాఖలతో కలిసి గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. అందని ప్రోత్సాహం... క్షయ వ్యాధిగ్రస్తులకు ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా పౌష్టికాహార కొనుగోలుకు ప్రతీ నెల రూ.1,000 అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ నేటి వరకు పౌష్టికాహారం కోసం అందించే రూ.1,000 అందలేదని సమాచారం. రోగులకు అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ క్షయ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి. క్షయ రహిత సమాజ ఏర్పాటుకు తమ వంతు కృషి చేయాలి. – డాక్టర్ విజయ్కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ ‘టీబీ ముక్త్ భారత్’ పేరుతో వంద రోజుల ప్రణాళిక రోగులకు 6నెలల పాటు ఉచిత మందులు, ఆర్థికసాయంజిల్లాలో క్షయవ్యాధిగ్రస్తుల వివరాలు సంవత్సరం కేసులు 2023 1,349 2024 1,287 2025 (మే నెల వరకు) 661 -
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం
చిన్నగూడూరు: దేశ రక్షణలో ఎన్నో త్యాగాలు చేస్తున్న సైనికుల సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాల్గొని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి శనివారం గ్రామానికి చేరిన జయ్యారం గ్రామానికి చెందిన దేశగాని లక్ష్యయ్య తనయుడు వీరజవాన్ దేశగాని రవిగౌడ్కు గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుల పోరాటాలతోనే ప్రజలు సంతోషంగా ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ చీకటి మహేష్గౌడ్, సింగారం సతీష్, ఘనగాని వేణు, సారెడ్డి రాణిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి నెహ్రూసెంటర్: ఈ నెల 8వ తేదీన జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టెబోయిన శ్రీనివాస్, చింతకుంట్ల వెంకన్న శనివారం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో ఉపాధి పనులు చేపట్టాలని, ఏడాదికి 200 పని దినాలను కల్పించి రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం నెహ్రూసెంటర్: జిల్లాకేంద్రంలోని 11కేవీ ఫీడర్పై చెట్ల కొమ్మలు కొట్టుట, ఇతర విద్యుత్ సమస్యల పరిష్కరించేందుకు పాత బజారులో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్శాఖ ఏఈ సంగీత శనివారం తెలిపారు. నందినగర్, గుండ్లకుంట కాలనీ, స్ధూపం కాలనీ, ఆర్టీసీ కాలనీ, రాహుల్నగర్, కంకరమిల్, చిట్యాల గోపయ్యనగర్, ఎటిగడ్డ తండా, రాంచంద్రాపురం కాలనీ, బస్టాండ్ రోడ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ కాలనీ, ఈదులపూసపల్లి రోడ్డు ఏరియాలో విద్యుత్ను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ‘స్పోకెన్ ఇంగ్లిష్’ను వినియోగించుకోవాలి.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను వినియోగించుకోవాలని సెల్ట్ (సెంటర్ ఫర్ లాంగ్వేజ్ ఫర్ ఇంగ్లిష్ టీచింగ్) డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సెల్ట్ ఆధ్వర్యంలో ఆరువారాల స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, గృహిణులు, బోధన, బోధనేతర ఉద్యోగులు ఈనెల 14 తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులకు ఫీజు రూ.1,000, బయటివారికి రూ.1,500లు ఉంటుందని, ఫీజును యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాన్ యూనివర్సిటీ ఫండ్ ఖాతాలో చెల్లించి పేర్లు నమోదు చేసుకో వాలని సూచించారు. ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వా రు వినియోగించుకోవాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి, 23 నుంచి 26వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికల్లో 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్స్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్, 6ఇంటు10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఎత్తు, బరువు, మొత్తం 9 విభాగాల్లో 27 మార్కులకు ఫిజికల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 01, 2016 నుంచి ఆగస్టు 30, 2017 మధ్య జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్లైన్లో ఈనెల 7వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
వినియోగం వెనుక ప్రమాదం
ఖిలా వరంగల్ : మార్కెట్లోకి వెళ్లిన వెంటనే ప్రధానంగా ఆకర్షించేవి ప్లాస్టిక్ బాటిళ్లు. రంగు బాగుందనో.. ఆకృతి బాగుందనో.. ధర తక్కువనో.. ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రతి ఇంటిలోనూ ఇవే దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే వాటి వినియోగం వెనుక ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ప్లాస్టిక్ బాటిళ్లను సక్రమంగా శుభ్రం చేయకుంటే రోగాల బారిన పడడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా నీరు తాగుతున్నారు. నేడు ఏ అవసరరానికైనా ప్లాస్టిక్ బాటిళ్లు తప్పనిసరి అయ్యాయి. తాగునీరు, మజ్జిగ, శీతల పానీయాలు.. ఇలా ఏది తాగాలన్నా .. కొనాలన్నా.. ప్రజలు వాటిపైనే ఆధారపడుతున్నా రు. అయితే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నా.. శుభ్రం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మినరల్ ప్లాంట్లో చల్లటి నీరు ఇచ్చే డబ్బాలు శుభ్రపర్చకుండానే సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని తాగడంతోనే జ్వరం, గొంతునొప్పి, జలుబుకు గురవుతున్నారు. ఫలి తంగా రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ శుభ్రం చేయాలి.. నిత్యం వినియోగించే ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ శుభ్రం చేయాలి. లేనిపక్షంలో వాటి అడుగు భాగంలో జిడ్డు పదార్థం ఏర్పడుతుంది. దీనిలో బ్యాక్టీరియా చేరి పెద్ద ఎత్తున వృద్ధి చెందుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జీర్ణకోశ, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా నాసిరకం ప్లాస్టిక్తో తయారయ్యే బాటిళ్లలో సులభంగా నీరు కలుషితమవుతుంది. ఇదిలా ఉండగా మినరల్ వాటర్ క్యాన్లతో వ్యాధులు వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాటర్ క్యాన్లను నిర్వాహకులు పెద్దగా శుభ్రం చేయరు. ఇలాంటి క్యాన్లను వినియోగించడం కన్నా స్టీల్ బాటిళ్లు, బిందెలు, రాగి పాత్రల్లో నీరు తాగితే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడొద్దని వారు సూచిస్తున్నారు. అనర్థాలివే.. ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా చేరుతుంది. వాటిల్లో గోనో కొక్కల్స్, న్యూమో కొక్కల్స్ వంటి బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల గొంతు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు జర్వం రావొచ్చు. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువ.. ప్లాస్టిక్ బాటిళ్లు వాడే వారికి సూచనలు నాణ్యమైన నీటి బాటిళ్లను కొనుగోలు చేయాలి. మార్కెట్లో తక్కువ ధరకు లభించేవి కొనుగోలు చేయొద్దు..రోజు వేడినీటితో బాటిళ్లను శుభ్రం చేసుకోవాలి. బ్రష్తో అడుగు భాగం కడగాలి.. పూర్తిగా ఎండేలా చూసుకోవాలి. ఇందులో నీరు ఎక్కువగా నిల్వ లేకుండా చూసుకోవాలి.. బాటిళ్లను తరచూ మారుస్తూ ఉండాలి.ప్లాస్టిక్ బాటిళ్లతో రోగాలు అడుగు భాగంలో బ్యాక్టీరియా వృద్ధి రోజు శుభ్రం చేసుకోవాల్సిందే.. లేదంటే ప్రమాదమే.. వ్యాధులను కొని తెచ్చుకోవద్దంటున్న వైద్య నిపుణులుఅప్రమత్తంగా ఉండాలి.. నాసిరకం ప్లాస్టిక్ బాటిళ్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లి. పిల్లలు వినియోగించడంలో చూపించే శ్రద్ధ శుభ్రపరచడంలో చూపించడం లేదు. దీంతో బాటిల్ అడుగు భాగంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తద్వారా పిల్లలకు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా జీర్ణకోశ, గొంతు వ్యాధులు వస్తాయి. తరచూ జలుబు వస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిళ్లు వినియోగించొద్దు.. వాడితే రోజూ శుభ్రం చేయాలి. – రేవూరి మాధవి, హెచ్ఎం,కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాల వరంగల్ తరచూ శుభ్రం చేయాలి.. పాఠశాలలకు వెళ్లే చిన్నారులే ఎక్కువ ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తుంటారు. వివిధ రూపాల్లో ఉండే వాటికి పిల్లలు బాగా ఆకర్షితులవుతుంటారు. అయితే వాటిని శుభ్రం చేయకపోతే అడుగుభాగంలో ఉండే బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తుంది. క్రమంగా పిల్లలు టైపాయిడ్, వాంతులు, విరేచనాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులను నివారించాలంటే బాటిళ్లను వాడకపోవడమే మంచిది. – డాక్టర్ మహ్మద్ అజీమ్, వరంగల్ -
ఇందిరమ్మ ఇళ్లతో శాశ్వత నీడ
మహబూబాబాద్ రూరల్: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో శాశ్వతంగా నీడ కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మురళీనాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం, అధికారులు సూచించిన విధంగా ఇల్లు కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు దేవరం ప్రకాష్ రెడ్డి, మిట్టకంటి రామిరెడ్డి, శంతన్ రామరాజు, నీరుటి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ -
కాజీపేట జంక్షన్ మీదుగా మరో ‘వందేభారత్’
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్–న్యూఢిల్లీ మధ్య వందేభారత్ స్లీపర్, ఏసీ క్లాస్ ఎక్స్ప్రెస్ను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ, దక్షిణ మధ్య రైల్వే అధికారులు టెక్నికల్గా స్పీడ్ ట్రాక్ సిద్ధం చేస్తున్నారని వారు తెలిపారు. కాగా, ఇప్పటికే సికింద్రాబాద్–నాగ్పూర్, నాగ్పూర్–సికింద్రాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య నాలుగు వందేభారత్ సర్వీస్లు నడుస్తున్న విషయం విధితమే. కాజీపేటలో నిర్మాణమవుతున్న వ్యాగన్షెడ్, కోచ్ఫ్యాక్టరీ, కాజీపేట ఫిట్లైన్లను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వందేభారత్ ఎక్స్ప్రెస్ను నడిపించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తుందని తెలిపారు. సికింద్రాబాద్–న్యూఢిల్లీ రూట్లో ప్రవేశపెట్టబోయే సర్వీస్లతో కలుపుకుని కాజీపేట జంక్షన్మీదుగా ఆరు వందేభారత్ రైళ్ల సర్వీస్లు ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. -
అమాయక రైతులే లక్ష్యంగా..
వరంగల్ క్రైం : అమాయక రైతులే లక్ష్యంగా ప్రముఖ కంపెనీల పేర్లతోపాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురు నిందితులను టాస్క్ఫోర్స్, పరకాల, గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వీరి నుంచి సుమారు రూ.63.62 లక్షల విలువైన నకిలీ, గడువు తీరిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 8 వందల లీటర్ల గడ్డి మందుతోపాటు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన జయదీప్ గౌతమ్, హైదరాబాద్కు చెందిన ముద్దంగుల ఆదిత్య, పరకాల మండల నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి, ములుగు గణపురం మండల చెల్పూరు చెందిన అన్నం కుమారస్వామి, గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలికి చెందిన బెరిరెడ్డి మర్రిరెడ్డి, సంగారెడ్డికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసెఫ్ ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, పరకాల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రధాన నిందితుడు నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన తిరుపతి ఇంటిపై దాడి చేసి నకిలీ, కాలం తీరిన పురుగు మందులు స్వాధీనం చేసుకుని విచారించారు. నిందితుడి సమాచారంతో హైదరాబాద్లోని మోహిదీపట్నం ప్రాంతంలో నకిలీ పురుగు మందులు తయారు చేస్తున్న గోదాంపై దాడి చేసి రూ.57.44 లక్షల నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం చేసుకోవడంతో పాటు జయదీప్ గౌతమ్, ఆదిత్య, కుమారస్వామిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఘటనలో గీసుకొండ పీఎస్ పరిధిలోని ఎల్కుర్తి హవేలీ ప్రాంతంలో బెరిరెడ్డి మర్రిరెడ్డి ఇంటిపై దాడి చేసి కిలో నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని విచారించారు. నిందితుడి సమాచారంతో సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామానికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయ్ జోసెఫ్ ఇళ్లలో తనిఖీ చేసి సుమారు రూ.6.18 లక్షల విలువైన 166 కిలోల నకిలీ విత్తనాలతోపాటు 8 వందల లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, పరకాల, మామునూరు ఏసీపీలు వెంకటేశ్, సతీశ్బాబు, ఇన్స్పెక్టర్లు బాబులాల్, సార్లరాజు, రంజిత్, క్రాంతికుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ఫోర్స్, పరకాల ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందుల విక్రయం రెండు ముఠాలకు చెందిన ఏడుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ -
ఇంజనీర్లు.. సమస్యల పరిష్కారకర్తలు
హసన్పర్తి: ఇంజనీర్లు.. కొత్త ఆవిష్కరణలు, సమస్యకు పరిష్కారకర్తలని ఏపీ ప్రభుత్వ ఎయిరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు డాక్టర్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడో స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సతీశ్ రె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సార్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో వంద ర్యాంకింగ్లో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు. ఇన్నోవేషన్ రంగం, అటల్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం సాధించడం సంస్థ పరంగా గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశం విద్యారంగంలో ముందుకు దూసుకెళ్తోందని వివరించారు. ఏటా 1.4 మిలియన్ ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పారు. పబ్లికేషన్, పీహెచ్డీ పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. క్యాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు లాంటి రంగాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశం రక్షణ రంగంలో స్వదేశి శక్తితో ముందుకు వెళ్తోందన్నారు. డ్రోన్స్, రాడార్లు, మిస్సైల్ వ్యవస్థల ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి.. పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కీరవాణి, ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దీపక్గార్గ్, రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, వైస్చాన్స్లర్లు మధుకర్రెడ్డి, డాక్టర్ అర్చనారెడ్డి, డాక్టర్ మహేశ్తో పాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నాం డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు సతీశ్ రెడ్డి ఎస్సార్లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
హన్మకొండ అర్బన్ : రోగులకు అందుబాటు ధరలో మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈమేరకు హనుమకొండ బాలసముద్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తన క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సర్జన్ డాక్టర్ సుధాకర్రెడ్డి, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ యాకోబు నాయక్, డాక్టర్ అర్చన, డాక్టర్ స్ఫూర్తిరావు, తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బాలసముద్రంలో సంకీర్తన ఆస్పత్రి ప్రారంభం -
గుంటూరులో రోడ్డు ప్రమాదం..
● గూడూరు వాసి మృతి గూడూరు: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ట్రాక్టర్ డ్రైవర్ ఏదుల ఆదినారాయణ (52) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదినారాయణ వరంగల్లో ఓ ట్రాక్టర్ ఏజెన్సీలో డ్రైవర్గా పని చేస్తూ, ఇతర జిల్లాలు, ప్రాంతాలకు కొత్త ట్రాక్టర్లను తరలిస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుంటూరు నుంచి చిత్తూరుకు ట్రాక్టర్ తరలిస్తుండగా ప్రకాశం జిల్లా కనిగిరి మండల పామర గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆదినారాయణ మృతిపై మండల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహం గూడూరుకు తీసుకొస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉంది. -
పీడీఎస్యూ రౌండ్టేబుల్ సమావేశం అడ్డగింత
● కేయూ గేట్వద్ద పీడీఎస్యూ, ప్రజాసంఘాల నిరసనకేయూ క్యాంపస్: మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కేయూ ఫార్మసీ కళాశాల భవనంలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటుచేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమావేశానికి వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర , జిల్లా నాయకులు కూడా వచ్చారు. సమావేశం నిర్వహించుకునేందుకు ఉపక్రమించబోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐ రవికుమార్ సిబ్బందితో వచ్చి పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్ను పిలిచి రౌండ్టేబుల్ సమావేశానికి అనుమతిలేదని పేర్కొన్నారు. దీనికి మహేశ్ స్పందిస్తూ తమకు రిజిస్ట్రార్ అనుమతి ఇచ్చారని తెలిపారు. అయినా పోలీసులు నిర్వహించొద్దని తేల్చిచెప్పడంతో ఇక చేసేది ఏమిలేక ప్రజాసంఘాల బాధ్యులు బయటకు వచ్చారు. రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించలేదు. కేయూ గేట్వద్ద నిరసన.. యూనివర్సిటీలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదుట నుంచి మొదటి గేట్ వరకు పీడీఎస్యూ, ప్రజాసంఘాల బాధ్యులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మధ్యభారతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రౌండ్టేబుల్ సమావేశం అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాణి, నాయకులు జయంత్, టీపీఎఫ్ రాష్ట్ర నేత బి. రమాదేవి, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, మాజీ ఉపాధ్యక్షుడు బండి కోటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
పెండ్యాల రైల్వే స్టేషన్లో తనిఖీలు
కాజీపేట రూరల్: కాజీపేట ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెండ్యాల రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సీఐ సి.ఛటర్జీ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛటర్జీ మాట్లాడుతూ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై దుండగులు రాళ్లతో దాడికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు 10 రోజుల నుంచి పెండ్యాల స్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లో రైల్వే గేట్లు, ట్రాక్ పాయింట్ల వద్ద తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాజీపేట–పెండ్యాల రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతూ అనుమానాస్పదంగా కనిపించిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఏఎస్సై జావిద్ ఇక్బాల్, కానిస్టేబుల్ నితిన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్పై కేసు కాజీపేట రూరల్ : శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కుమారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్తో పాటు మరో ఏడుగురిపై కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్క తుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలతో కలిసి వెళ్లే క్రమంలో ఉప్పల్ రైల్వే గేట్ వద్ద ట్రాక్పై ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సిరికొండ ప్రశాంత్, తాటి జనార్ధన్, గురుకుట్ల కిరణ్, ఈర్ల రాజు, కన్నెహల ప్రకాశ్, శశికాంత్గౌడ్, బి.ఆరిపూర్ణపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాలు వెళ్లకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆటంకాలు సృష్టించాయని ప్రశాంత్ ఆరోపించారు. భూపాలపల్లి నుంచి సభకు వెళ్లే వాహనాలను ఉప్పల్ మీదుగా మళ్లించి ఉద్దేశపూర్వకంగా దాదాపు రెండు గంటలకు పైగా రైలు నిలిపివేశారని, తద్వారా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయన్నారు. దీంతో కేంద్ర,రాష్ట్రాల వైఖరి నిరసిస్తూ తాము రైల్వే గేట్వద్ద ఆందోళన చేపట్టామని, ఇందుకుగాను తనతో పాటు 14 మందిపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ప్రతిభ
బాలికల జట్టులో వరంగల్ జట్టుకు ప్రథమ స్థానం, బాలురలో ద్వితీయస్థానంనకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 47వ హ్యాండ్బాల్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వరంగల్ జట్టు, తృతీయ స్థానంలో నల్లగొండ జట్టు నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, ఖమ్మం జట్టు ద్వితీయ, రంగారెడ్డి జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించాయి. -
త్యాగాల పండుగ.. బక్రీద్
నేడు ఈదుల్ జుహా.. ఖుర్బానీ.. బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఖుర్భానీ ఇవ్వడం అ త్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి.. ఒక భా గాన్ని నిరుపేదలకు, మిగిలిన భాగాల్లో రెండోది బంధువులకు, మూడోది తమ కోసం ఉంచుకుంటారు. దీనిని ఖుర్బానీ అంటారు. హజ్యాత్ర.. ముస్లింలు ఈ పవిత్రమైన మాసంలోనే మక్కాను సందర్శించేందుకు వెళ్తారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరం వెళ్లి మసీదు–అల్ హరామ్లోని కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. బక్రీద్ పండుగ రోజు ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఈద్ ముబారక్తో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈద్గాల వద్ద ఏర్పాట్లు.. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్(ఈదుల్ జుహా) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గా, మసీదుల్లో శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులోని ఈద్గా, ఖిలా వరంగల్ ఈద్గాను శుభ్రపరిచి, భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు.. బక్రీద్ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈద్గాల వద్ద పోలీసుల పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, ఈద్గాల వద్ద షామీయానాలతో పాటు పండగకు సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం పెద్దల సమాధుల వద్ద నివాళులర్పించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకలకు సర్వం సిద్ధం ఉదయం 9గంటలకు సామూహిక ప్రార్థనలు ఏర్పాట్లను పరిశీలించిన ఈద్గా ప్రతినిధులుపండుగ విశిష్టత.. హజ్రత్ ఇబ్రహీం అనే ప్రవక్త నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లాహ్ కనిపించి నీ కుమారుడిని తనకు బలి ఇవ్వమని ఆదేశిస్తాడు. నిద్రలేచిన తర్వాత ఇబ్రహీం తనకు వచ్చిన కల గురించి తన ఒక్కగానొక్క కుమారుడు ఇస్మాయిల్కు వివరిస్తాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ అందుకు అంగీకరించి బలికి సిద్ధమవుతాడు. దీంతో కుమారుడిని బలిస్తున్న సమయంలో అల్లాహ్ అతడి త్యాగ నిరతిని మెచ్చుకుని బలి ఇవ్వడానికి ఆకాశవాణి ద్వారా ఓ గొర్రెను సృష్టించి ఇస్తాడు. నాటి నుంచి ఈ పండుగను బక్రీద్ అని పిలుస్తారు. రంజాన్ తర్వాత ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ బక్రీద్ . ప్రవక్త ఇబ్రహీం కుమారుడి త్యాగానికి గుర్తుగా.. పవిత్ర మక్కా హజ్ తీర్థ యాత్రకు ముగింపుగా ఈ పండుగ సూచిస్తుంది. దాన, ధర్మాలు చేయడం ఆచారం. పేద, ధనిక తారతమ్యం లేకుండా పండుగను జరుపుకుంటారు. దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రీహీం అల్లాహ్ ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఈదుల్ ఫితర్ తర్వాత రెండు నెలలకు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల(జుల్ హజ్జా) 10వ రోజున బక్రీద్ను జరుపుకుంటారు. నేడు బక్రీద్ పండుగ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. –జనగామ/ఖిలా వరంగల్సామూహిక ప్రార్థనలకు సర్వం సిద్ధం ఈద్గాలో నేడు ఉదయం 9 గంటలకు ఈదుల్ జుహా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ముఖ్యఅతిఽఽథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు, పోశాల పద్మ, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉదయం 9గంటల లోపు ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు చేయాలి. ఎంఏ జబ్బార్, ఈద్గా ప్రతినిధి, ఫోర్ట్ రోడ్డు, వరంగల్ -
మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి
డోర్నకల్: మున్సిపాలిటీల పరిధిలో పని చేస్తు న్న మహిళా ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారి స్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీలా రావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ పరిధిలోని మహిళా సిబ్బందితో పాటు మెప్మా ప్రతినిధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీలారావు మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మెప్మా, మహిళా సిబ్బందికి బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ కేన్సర్, కంటి పరీక్షలతో పాటు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి సేకరించిన నమూనాలను ప్రభు త్వ జనరల్ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు తెలిపా రు. మహిళా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి సాధ్విజ, వైద్యులు మేఘన, పృథ్వీ పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలిమహబూబాబాద్ అర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపైనే పాఠశాల పరిశుభత్ర ఆధారపడి ఉంటుందన్నారు. కేజీబీవీలు బాలికల రెసిడెన్షియల్ అయినందున 24గంటలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థినులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ విజయ కుమారి, ఏఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, డీఆర్పీలు ప్రవీణ్, రజిత, నాగమణి, సుమలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందన్నారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ పరిధి బాపూజీనగర్ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఇద్దరు యువకుల నుంచి శుక్రవారం పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం.. బాపుజీనగర్లో యడమల్ల పవన్కుమార్, పిల్లి ఈశ్వర్ అనే యువకులు గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై ఉమ, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్రావు, సిబ్బంది సైదులు, శ్రావణ్ వారిని గమనించారు. వారి వద్ద నుంచి 64.17 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మహబూబాబాద్ శివారు పత్తిపాక గ్రామానికి చెందిన డానీ అలియాస్ డానీ ఈశ్వర్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు పట్టుబడిన యువకులు తెలిపారు. -
సర్కారు బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: సర్కారు బడుల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెంచాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో ఉపాధ్యాయులను ఆదేశించారు. మానుకోట పట్టణంలోని వివేకానంద సెంటర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బాడిబాట కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 19వ వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, భోజన వసతి ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు డిజిటల్ బోర్డుపై బోధిస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, సైన్స్ఫెయిర్, క్రీడలు, యోగా వంటివి ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పిస్తున్నట్లు బడిబాట కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయాలన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మదర్ థెరిస్సా సెంటర్లో తెలంగాణ సాంస్కృతిక కళాబృందం జానపద పాటలు ఆలపించింది. ఈ కార్యక్రమంలో ఏడీ రాజేశ్వర్, ఏజీసీ మందుల శ్రీరాములు, ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు, ప్లానింగ్ కోఆర్డినేటర్ పూర్ణచందర్, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, హల్యానాయక్, సిరినాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మానుకోట పట్టణంలో బడిబాట ర్యాలీ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్: సీజనల్ వ్యాధులపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాయల ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. వానాకాలంలో కార్మికులు పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. దోమలు, ఈగల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు బయట పడుతాయన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. కార్యక్రమంలో డీఈ ఉపేందర్, మెప్మా డీఎంసీ విజయ, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, వైద్యులు నాగేశ్వర్రావు, మౌనిక, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. భూసమస్యలపై దృష్టి సారించాలి.. డోర్నకల్: భూసమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మండలంలోని పెరుమాళ్లసంకీస, బొడ్రాయితండా, ఉయ్యాలవాడ, చాప్లాతండా గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కాగా బొడ్రాయితండా రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్ రికార్డులను తనిఖీ చేశారు. రైతుల దరఖాస్తులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూసమస్యల పరిష్కారంపై సిబ్బంది దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీ వీరన్న, తహసీల్దార్ ఇమ్మానీయల్, ఆర్ఐ యాసీన్ తదితరులు పాల్గొన్నారు. యువకుల జలకాలాట..గార్ల: ఉక్కపోతను తట్టుకోలేక, వేసవితాపం తీర్చుకునేందుకు యువకులు గార్ల సమీపంలోని పాకాల ఏటిలో జలకాలాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏటిలో యువకులు ఈత కొడుతున్న దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. ● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
మహబూబాబాద్ రూరల్: రైతులు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడొద్దని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. మహబూబాబాద్ పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఏడీఏ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి ఫిజికల్ స్టాక్ వివరాలు, ధరల పట్టికలు రైతులకు కనపడే విధంగా ఉంచాలని తెలిపారు. రైతులు ఎక్కువ మోతాదులో రసాయనికి ఎరువులు వాడవద్దని, వాటి స్థానంలో పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించుకుని భూసారాన్ని కాపాడాలని కోరారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో పచ్చిరొట్ట విత్తనాలు జీలుగ, జనుములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు -
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
దంతాలపల్లి మండలం ఆగాపేటతండా గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపిక చేశారు. విద్యార్థుల తాగునీరు, మరుగుదొడ్ల కోసం రూ.90వేల నిధులు మంజూరు చేశారు. పనులు పూర్తి చేయగా.. కాంట్రాక్టర్కు రెండు దఫాల్లో రూ.57వేలు చెల్లించారు. అయితే పనుల్లో నాణ్యత లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కల్యాణ రామయ్య తెలిపారు. ఇనుప నల్లాలకు బదులు ప్లాస్టిక్ నల్లాలు ఏర్పాటు చేయడంతో కొన్ని విరిగిపోయాయని చెప్పారు. అలాగే పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యుత్మోటారు నాణ్యత లేక కాలిపోయిందని, ప్రస్తుతం విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. న్యూస్రీల్ -
తరగతి గదుల కొరత
కురవి: మండలంలోని కందికొండ ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలు లేవు. ప్రస్తుతం మూడు తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో రెండు తరగతి గదులు అవసరం. మిగిలిన తరగతుల విద్యార్థులకు వరండాలోనే చదువులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కిచెన్ షెడ్డు లేదు. దీంతో ఆరుబయట వంటవండాల్సిన పరిస్థితి ఉంది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికై న ఈ పాఠశాలకు గత ఏడాది రూ.2.30లక్షలు కేటయించగా.. రూ.లక్ష వచ్చాయి. మిగిలినవి రాలేదని పాఠశాల హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. పాఠశాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు. -
నిర్వహణ భారం
తొర్రూరు: గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్తో పాటు ట్రక్కు, ట్యాంకర్లను తీసుకున్నారు. వాటితో చెత్త సేకరణతో పాటు మొక్కలకు నీటిని సరఫరా చేశారు. పాలకవర్గాలు ఉన్న సమయంలో ట్రాక్టర్ కిస్తీలతో పాటు నిర్వహణ సక్రమంగా ఉండేది. ప్రత్యేక పాలన వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ట్రాక్టర్లు మరమ్మతు చేయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో కొన్ని నెలలుగా చెత్త సేకరణ నత్తనడకన సాగుతుండగా, చిన్న పంచాయతీల్లో పూర్తిగా నిలిచిపోయింది. కిస్తీలు చెల్లించలేక, మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉండడంతో పల్లెల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. మరమ్మతులు చేయించలేక... జిల్లాలో 461 పంచాయతీలుండగా అన్ని చోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన కిస్తీలు ప్రతినెల రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీల్లో ఉన్న కొద్ది నిధులు పారిశుద్ధ్య పనులకే సరిపోతుండగా మిగతా పనులకు ఆటంకంగా మారింది. ట్రాక్టర్లు తీసుకుని ఐదేళ్లు దాటడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయించాలంటే రూ.30 వేల వరకు ఖర్చవుతుండడంతో పంచాయతీలకు భారంగా మారింది. కనీసం డీజిల్కు డబ్బులు లేక కొన్ని పల్లెల్లో వారానికి ఓసారి మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో డీజిల్, కిస్తీలకు సంబంధించిన నగదు సర్దుబాటు చేస్తున్నా.. చిన్న పంచాయతీల్లో మాత్రం ట్రాక్టర్లు తిప్పలేని పరిస్థితి ఉంది. చిన్న పంచాయతీల్లో తిప్పలు.. జిల్లాలోని దంతాలపల్లి, పెద్దవంగర, గంగారం, చిన్న గూడూరు, ఇనుగుర్తి, సీరోలు తదితర మండలాల్లోని చిన్న పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.50 వేల లోపే. ఇప్పటికే విద్యుత్ దీపాలు, బ్లీచింగ్, సభలు నిర్వహించిన సందర్భాల్లో షామియానాలు, భోజనాల ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. నిధుల కొరతతో ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులెందుకని ప్రకృతి వనాలకు నీళ్లు పో యడం కూడా విస్మరిస్తున్నారు. మరో పక్క బ్యాంకులు బకాయిలు చెల్లించనందుకు వడ్డీ వేస్తూనే.. ఇంకో పక్క వాహనం సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు. ఆటంకాలను అధిగమించి చెత్త సేకరణ చేస్తున్నాం పంచాయతీల్లో ట్రాక్టర్ల నిర్వహణకు సంబంధించి నిధుల కొరత వాస్తవమే. ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా మొదటి ప్రాధాన్యం ట్రాక్టర్లకు ఇస్తున్నాం. ఏదో రకంగా చెత్తను సేకరిస్తూ గ్రామాలను స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్. పుల్లారావు, డీఎల్పీఓ, తొర్రూరు గుదిబండగా జీపీ ట్రాక్టర్ల మెయింటనెన్స్ డీజిల్కు నగదు లేక మూలకు పడుతున్న వైనం గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం -
పనులు పెండింగ్!
పూర్తికాని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులుజిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తాగునీటి పైపులైన్ కోసం రూ రూ.3,5000, మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.లక్ష, విద్యుత్ మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల కోసం రూ.50,000 నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రహరీ, భవనం శిథిలావస్థలో ఉంది. అలాగే మరుగుదొడ్ల పనులు పూర్తి కాలేదు. పనులు పూర్తికాకపోవడంతో అద్దె భవనంలో పాఠశాల కొనసాగుతోంది. ● టాయిలెట్స్ అందుబాటులో లేక ఇబ్బందులు ● పలుచోట్ల తరగతి గదుల కొరత ● వరండాల్లోనే విద్యార్థుల చదువులు ● బిల్లులు రాక పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లు ● ఐదు రోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులు నడవాలి. అందుకోసం అన్ని వసతుల కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ప్రవేశపెట్టింది. అయితే పాఠశా లల్లో విద్యార్థులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక.. ఉన్నచోట నీటి వసతి లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పనులు పూర్తి చేసినా.. అధికారులు కావాలనే బిల్లులు చేయలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తేనే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని కొందరు కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం.పథకం వివరాలు.. జిల్లాలో మొత్తం పాఠశాలలు : 922అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి ఎంపికై న స్కూళ్లు: 438పనులు పూర్తి చేసి అప్పగించినవి : 403బిల్లులు చేయలేదని అప్పగించనివి : 35మొత్తం పనుల అంచనా విలువ : రూ. 12.42 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లులు: రూ. 9 కోట్లు నిధులు నిలిచిపోయినవి : రూ 3.42 కోట్లు438 పాఠశాలల ఎంపిక జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో 438 బడులు ఎంపికయ్యాయి. సుమారు రూ.12.42కోట్లు నిధులు కేటాయించారు. కాగా 403 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా.. రూ.9 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అయితే చేసిన పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో బిల్లులను అందించకపోవడంతో నిధులు మంజూరుకాలేదని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. చేసిన పనుల బిల్లులన్నీ అందిస్తే పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. -
పనులు నాణ్యత లేక మళ్లీ మొదటికి..
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఏ మేరకు పనులు జరుగుతున్నాయో పరిశీలించే వారు కరువయ్యారు. దీంతో బోరు మోటారు కాలిపోయింది. నాసిరకం నల్లాలు పెట్టడంతో విరిగిపోయాయి. మరుగుదొడ్లు పాడయ్యాయి. దీంతో పనులు చేసినట్లు అధికారులు చెప్పినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. – భూక్య శ్రీను, ఆగాపేటతాండవాసి ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశాం.. గతంలో రజాలిపేట, పత్తిపాక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశాం. వర్షాకాలంలో పత్తిపాక ప్రైమరీ పాఠశాల భవనం ఉరుస్తుంది.. కూలిపోయే పరిస్థితిలో ఉంది. రజాలిపేట స్కూల్లో వంటగదిలేక వంట మనుషులు ఇంటి దగ్గర నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుకొని తీసుకొస్తున్నారు – డి.వీరన్న, రజాలిపేట, విద్యార్థి తండ్రి నిధులు వస్తే మరమ్మతులు చేయిస్తాం గతంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం నుంచి వచ్చిన నిధులు స్కూళ్లకు వినియోగించాం. పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరకున్న పాఠశాలల భవనాలకు బదులు అద్దె భవనాల్లో తరగతులు కొనసాగించాం. విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి పాఠశాలలకు ప్రత్యేక నిధులు వస్తే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. – ఏ.రవీందర్ రెడ్డి, డీఈఓ● -
నిన్న రణరంగం.. నేడు నిశ్శబ్దం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు.. పోలీసుల నిర్భంధం.. ఇరు వర్గాల తోపులాటలతో అట్టుడికిన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో తాజాగా నిశ్శబ్దం అలుముకుంది. బుధవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులపై డేగకన్ను వేసిన పోలీసులు పెద్ద ధన్వాడతో పాటు పరిసర గ్రామాల్లో మఫ్టీలో సంచరిస్తూ స్థానికుల కదలికలను గమనిస్తున్నారు. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోననే భయం ఆయా గ్రామప్రజల్లో నెలకొనగా.. ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఫ్యాక్టరీ పరిసరాలు, గ్రామాల్లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. 12 మందికి రిమాండ్.. పెద్ద ధన్వాడ శివారులో పచ్చని పొలాల మధ్య గాయత్రి ఇండస్ట్రీస్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీతో వాయు, జల కాలుష్యం బారిన పడతామని.. ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలంటూ బుధవారం ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు రాత్రి వరకూ జల్లెడ పట్టారు. ఆందో ళనలో చురుగ్గా పాల్గొన్న 41 మందిని గుర్తించి.. ఆ రాత్రే 12 మందిని అరెస్టు చేసి మానవపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. గురువారం ఉదయం ఆ రైతులను గద్వాల జిల్లా కోర్టులో హాజరుపరచగా.. వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా.. మిగిలిన 29 మంది ఆందోళనకారుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ‘జనంసాక్షి’ పత్రిక ఎడిటర్ రహమాన్తోపాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజుపై కూడా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మా రింది. దాడుల సమయంలో వారు ఘటనా స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మరో పక్క పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. 10 గ్రామాలపై మఫ్టీలో నిఘా.. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న 10 గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూరు, మాన్దొడ్డి గ్రామాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. వీటితో పాటు పచ్చర్ల, తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడుతోపాటు వడ్డేపల్లి మండలం తనగల, అయిజ మండలంలో తాండ్రపాడు, వేణిసోంపురంపైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, రైతుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు మఫ్టీలో సంచరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారినీ పోలీసులు ఉపేక్షించడం లేదు. వ్యతిరేక పోస్టులు పెట్టిన పలువురికి ఫోన్లు చేసి.. పిలిపించుకుని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయం గుప్పిట్లో పెద్ద ధన్వాడ 12 మంది రైతుల అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు.. ‘మా పచ్చని పొలాలతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాలుష్య కారక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు’అని రైతులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. గురువారం పెద్ద ధన్వాడలోని రైతు వేదిక వద్ద పలువురు గ్రామస్తులు, రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ఖండించారు. 41 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు దాడికి దిగినా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి తమ జిల్లా వాసి అయి ఉండి.. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నా స్పందించకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. 41 మంది రైతులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ప్రదర్శించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ తరహాలో ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
యువత చూపు.. టైపు వైపు
కాజీపేట: టైపు రైటింగ్ .. ఒకప్పుడు ఈ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగం గ్యారంటీ. దీంతో టైపు ఇన్స్టిట్యూట్లు కిటకిటలాడేవి. తర్వాతి కాలంలో కంప్యూటర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా యువత అటు వైపు ఆసక్తి కనబర్చడంతో టైపు రైటింగ్కు కొంత ప్రాధాన్యం తగ్గింది. కానీ ప్రస్తుత కాలంలో తిరిగి టైపు రైటింగ్కు ఆదరణ పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు అవకాశాలు లభిస్తుండడంతో యువత టైపు రైటింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా వరంగల్ నగరంలో 8 ఇన్స్టిట్యూట్లలో శిక్షణ ఇస్తున్నారు. నిత్యం సుమారు 350 మంది యువతీ, యువకులు బ్యాచ్ల వారీగా శిక్షణ పొందుతున్నారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యం.. 1714లో హెన్రీ మిల్ కనుగొన్న ఈ టైపు మిషన్కు అనంతర కాలంలో ప్రాధాన్యం ఏర్పడింది. టైపు రైటింగ్లో లోయర్, హయ్యర్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగింది. దీంతో విద్యార్తులు ఓ వైపు చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో టైపు రైటింగ్ కోర్సు నేర్చుకుంటున్నారు. టైపు రైటింగ్లో హయ్యర్, లోయర్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కార్పొరేట్ సంస్థలు, కోర్టుల్లో టైపిస్ట్లుగా, జడ్జిలకు పీఏలుగా పనిచేసే అవకాశం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో చిగురించిన ఆశలు.. ఏడున్నర సంవత్సరాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీంతో వందల సంఖ్యలో యువకులు టైపు ఇన్స్టిట్యూట్లకు రావడంతో ఆదరణ పెరిగింది. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. కోర్సుల వివరాలు.. లోయర్: మూడు నెలలు ప్రాక్టీస్ చేయాలి. నిమిషానికి 30 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది. హయ్యర్: ఆరు నెలలు ప్రాక్టీస్ చేయాలి. నిమిషానికి 45 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది. బ్యాచ్ల వారీగా శిక్షణ.. 25 సంవత్సరాలుగా టైపులో బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్లో ప్రతీ సంవత్సరం కనీసం పదిమంది వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం టైపు రైటింగ్ నేర్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతోంది. – సిరికొండ రామేశ్వరాచారి, లిఖిత టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్ పెరుగుతున్న ఉద్యోగావకాశాలు..ఇటీవలి టైపు రైటింగ్ నేర్చుకు న్న వాళ్లకు ఉద్యోగావకాశాలు వి స్తృతంగా లభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు వెలువడుతున్నాయి. దీంతో టైపు నేర్చుకోవాలనే అభిలాషతో శిక్షణ తీసుకుంటున్నాం. – దుబ్బ రాము, కాజీపేట టైపు రైటింగ్కు పెరిగిన ఆదరణ ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సాధన -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వరంగల్ అర్బన్ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బల్దియా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా బృందాల ఆధ్వర్యంలో (ఎస్హెచ్జీ) పలు డివిజన్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, హార్టికల్చర్ అసిస్టెంట్ అనూహ, సీఓలు శ్రీలత, సుజాత, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే