మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం | - | Sakshi
Sakshi News home page

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : మరింత శ్రమిస్తే భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో కూ డా పతకాలు సాధిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ క్రీడాకారులకు సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమిషనరేట్‌ పోలీస్‌ క్రీడాకారులు ఈసారి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలు కై వసం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. క్రీడల్లో రాణించే వారికి తమ సహకారం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. డీసీపీలు దార కవిత, అంకిత్‌ కుమార్‌, ట్రైనీ ఐపీఎస్‌ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్‌ కుమార్‌, రవి, శ్రీనివాస్‌, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, జితేందర్‌ రెడ్డి, మధుసూదన్‌, అంతయ్య, ఆర్‌ఐలు స్పర్జన్‌ రాజ్‌, సతీశ్‌ ఇన్‌స్పెక్టర్‌ షూకూర్‌, ఆర్‌ఎస్సై శరత్‌, మణికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

లోకోపైలెట్‌కు అస్వస్థత

కాజీపేట రూరల్‌ : రైలులో ఓ లోకోపైలెట్‌ సోమవారం అస్వస్థతకు గురి కాగా కాజీపేట జంక్షన్‌లో దింపి చికిత్స నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తలించారు. యశ్వంత్‌పూర్‌–నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన లోకోపైలెట్‌ ప్రసాద్‌ మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే అధికారులకు స మాచారం అందించి కాజీపేట జంక్షన్‌లో దింపారు. అనంతరం కాజీ పేట రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement