Mahabubabad District News
-
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనిని అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు మే 26వ తేదీ వరకు గడువు ఉందని, ప్రవేశ రుసుం రూ. 1,325 చెల్లించి ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్:అడ్మిషన్.జేఎంఐ.ఏిసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష జూ న్ 6వ తేదీన హైదరాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8520860785 నంబర్లో సంప్రదించాలన్నారు. విపత్తుల పర్యవేక్షణ వ్యవస్థ వివరాలివ్వండి ● వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య హన్మకొండ చౌరస్తా: వరంగల్ జిల్లాలో భూకంప, వర్షాలు, ఉరుములు, మెరుపుల హెచ్చరికలు అందించేందుకు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ లేదా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కావ్య ఆధునిక విపత్తుల పర్యవేక్షణ వివరాలపై ప్రశ్నించారు. వరంగల్ వంటి ఉష్ణతరంగాలు, అనియంత్రిత వర్గాలకు గురయ్యే ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెంపు, విపత్తు నిర్వహణ చర్యలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూకంప పరిశీలన కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని సూచించారు. కావ్య ప్రశ్నకు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లా సిస్మిక్ జోన్–2 తక్కువ ప్రమాద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మైక్రోజోనేషన్ అధ్యయనాలు ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ ఐదు కిలోల సరుకు స్వాధీనం జనగామ రూరల్: ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్ను ఎస్సై సతీశ్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేశ్, సాగర్ తనిఖీ చేశారు. ఇందులో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో సుమారు 5 కిలోల గంజాయి లభించింది. దీంతో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాముకాటుతో మహిళ మృతి మల్హర్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం తాడిచర్లలో చోటు చేసుకుంది. తాడిచర్ల గ్రామానికి చెందిన గంగుల రాధమ్మ(50) తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తున్న క్రమంలో పాముకాటు వేసింది. గమనించిన కుటుంబీకులు 108లో మంథని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్స్ సమీపంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధిలోని నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను, వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్ (23) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సమయంలో ఆర్తి గార్డెన్స్ సమీపంలో ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం.. బైక్ను ఢీకొని వెళ్లింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గణపతి, నరేశ్ 108లో ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీ కరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీను ఫి ర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎల్.శ్రీనివాసరావు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. 15 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరి మృతి.. నెహ్రూనగర్కు చెందిన బానోత్ శ్రీను కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 15 రోజుల క్రితం శ్రీను తండ్రి భోజ్య గుండెపోటుతో మృతిచెందగా ప్రస్తుతం అతడి కుమారుడు మహేందర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహేందర్కు మరికొద్ది రోజుల్లో వివాహం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్రమంలో అతడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికులు, బంధువులు బోరున విలపించారు. మహబూబాబాద్ శివారులో ఘటన 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి -
బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యం
ఆపదలో బాధితులను ఆ దుకోవడమే మా లక్ష్యం. కాల్ వచ్చిన వెంటనే సాంకేతికత ద్వారా సమాచారం సేకరించి 30 సెకన్లలో అంబులెన్స్ను పింపిస్తాం. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాం. – శివకుమార్, 108 సర్వీస్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం12 ఏళ్లుగా 108 సేవల్లో పనిచేస్తున్నా. ప్రతీ కాల్ వెనుక ఒక ప్రాణం ఉంటుంది. సమయానికి స్పందించి వారి ప్రాణం కాపాడడం మా బాధ్యత. ఇది ఉద్యోగం కాదు ఒక ప్రాణం కాపాడే పవిత్ర సేవ. – బొక్క చైతన్య, ఈఎంటీ సేవలు ప్రశంసనీయంఅత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ చాలా ము ఖ్యమైంది. మా సిబ్బంది 24 గంటలూ పని చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఐస్ బాక్సులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలెన్లు అందుబాటులో ఉంచాం. వెలుదండి రాము( ఈఎంఈ), 108 జనగామ జిల్లా కోఆర్డినేటర్18 ఏళ్లుగా సేవలు 18 ఏళ్లుగా 108లో సేవలు అందిస్తున్నా. బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్కు తీసుకెళ్లే సమయంలో గంటల తరబడి అంబులెన్స్లోనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. అయినా అవన్నీ లెక్క చేయకుండా బాధితులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మామిడి రాకేశ్,ఈఎంటీ -
మాటలతోనూ ప్రాణం పోసే దేవుళ్లు ఈఎంటీలు..
హనుమకొండ 16, జనగామ జిల్లాలో 12 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న సిబ్బంది (మెడికల్ టెక్నీషియన్లు) రోజూ ప్రాణాలతో పోరాడుతున్నారు. గోల్డెన్ అవర్ అంటే పుస్త కాల మాట కాదు, అ ది వీరు ప్రతిరోజూ రాసుకునే ‘ప్రాణరక్షణ గడియారం’. ఫోన్ గంట మోగగానే పరుగెడతారు. మార్గం కష్టమైనా, వర్షం వచ్చినా, అర్ధరాత్రి అయినా క్షతగాత్రుల పాలిట సంజీవనిగా మారి ప్రమాద స్థలానికి చేరే వేగమే వారి విజయం. ఒకవైపు రోగికి శ్వాస ఆగకుండా ఆక్సిజన్ ఇస్తూ, మరోవైపు రక్తస్రావం ఆపడానికి కట్లు కడుతూ తోబుట్టువుల్లా సేవలందిస్తారు. పక్కనే ఏడుస్తున్న బంధువులకు ధైర్యం చెప్పడం కూడా వారి పని. రోగిని అంబులెన్స్లో ఎక్కించగానే శ్వాస ఆగకుండా, మాటలతోనూ ప్రాణం పోసే ఈఎంటీలను దేవుళ్లుగా భావిస్తారు. ఇది ఈఎంటీల జీవితంలో రోజు రాసుకునే ఎపిసోడ్. జీపీఎస్ సాంకేతికతతో కాల్ వచ్చిన వెంటనే సమీప అంబులెన్స్కు సమాచారం చేరి, సగటున 12 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని ‘గోల్డెన్ అవర్’ కాన్సెప్ట్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఎక్కిస్తున్న ఈఎంటీలుక్షతగాత్రులను లోయ నుంచి తీసుకొస్తున్న ఈఎంటీలు -
బడికి తాళం వేసి మహిళ నిరసన
● భూమి తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతృత్వంగా ఇచ్చిన భూమి తిరిగి అప్పగించాలని బుధవారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దొంగరి శ్రీలత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దొంగరి శ్రీలత, ఉపేందర్రావు దంపతులతో పాటు వారి పాలివాళ్లు కలిసి 400 గజాలకు పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. దొంగరి శ్రీలత, ఉపేందర్రావు దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్లో ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నారు. ఉపేందర్రావు 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. శ్రీలత గ్రామంలో ఉన్న తన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో బంధువుల ఇంటిలో నిద్రిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో డబుల్బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమి లేక స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు గేటు బయట వేచి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎం తండ మల్లయ్యతో కలిసి మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శ్రీలత నిరసన విరమించింది. -
కాజీపేటలో చైన్స్నాచింగ్
కాజీపేట: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చైన్స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐలోని ధనలక్ష్మి వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బైక్పై వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానిక యువకులు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులతో పాటు క్రైం పార్టీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణను వేగవంతం చేశారు. జల్లెడ పడుతున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నా రు. ఇటీవల పట్టణంలో రెండు దఫాలుగా చైన్ స్నా చింగ్లకు పాల్పడిన ముఠాకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు అపహరణ రంగంలోకి క్రైం పార్టీ పోలీసులు -
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను అరెస్ట్ చేసి రూ.15.20 లక్షల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఇద్దరి నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకి చెందిన కల్యాణ సుందరం గంజాయి విక్రయాలతోపాటు బైక్ చోరీలకు పాల్పడిన కేసులో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సెల్ ఫోన్ షాపులో సేల్స్ మెన్గా పనిచేస్తున్న సమయంలో మదురైకి చెందిన సెల్వ రాజ్తో పరిచయమైంది. ఇరువురు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. ఆదాయం సరిపోకపోవడంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చైన్స్నాచింగ్లకు పాల్పడేందుకు గత నెల వరంగల్కు చేరుకున్నారు. ప్లాన్ ప్రకారం మట్టెవాడ పీఎస్ పరిధిలో బైక్ చోరీ చేసి, దానిపై ప్రయాణిస్తూ సుబేదారి, హనుమకొండ, కేయూ పీఎస్లతోపాటు ఏపీలోని కర్నూల్తో కలుపుకొని మొత్తం ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్ప డ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మరోమారు బుధవారం చైన్ స్నాచింగ్ చేయడానికి వరంగల్ వచ్చారు. బైక్పై హనుమకొండ బస్టాండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపునకు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని పటుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్ల సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి.బాలస్వామి, క్రైమ్ ఏసీపీ పి. సదయ్య, హనుమకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఇద్దరు దొంగలు అరెస్ట్.. తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నగరంలోని కొత్తూరు జెండాకు చెందిన బింగి రఘు, బొక్కలగడ్డకు చెందిన మహ్మద్ అసద్.. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో, తాళం వేసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడతున్నట్లు అంగీకరించారు. దీంతో చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వివరించారు. 95 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ -
మెగా ప్రైట్ మెయింటెనెన్స్ పనులు ప్రారంభించాలి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్లో మంజూరైన మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో పనులను ప్రారంభించాలని కోరుతూ బీ ఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మహబూబాబాద్ మెగా ప్రైట్ మెయింటెనెన్స్ డిపో, రైల్వే అభివృద్ధిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. స్పందించిన కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాధి నివారణకు అవగాహన ముఖ్యంనెహ్రూసెంటర్:హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నివా రణలో అవగాహన ఎంతో ముఖ్యమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ, చికిత్స, కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లింక్ వర్కర్స్, సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, కోఆర్డినేటర్స్ సమన్వయంతో పని చేస్తూ కేసుల గుర్తింపు, చికిత్సపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ప్రొగ్రాం అధికారి అర్జున్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, డెమో ప్రసాద్, హెచ్ఈ కేవీ రాజు, నీలిమాశ్వేత, అశోక్, సారంగం పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గార్ల: విద్యార్థులకు ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాంనాయక్ అన్నారు. బుధవారం రాత్రి గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వంట వర్కర్లకు కూరలు నాణ్యమైన కూరగాయాలతో వండాలని సూచించారు. కూరలు రుచిగా లేవని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో మెనూ అమలుపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థుల పడక గదుల్లో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీడీ వెంట హెచ్ఎం జోగయ్య, వార్డెన్ మేగ్యానాయక్, పీడీ పద్మ ఉన్నారు . ‘ఏప్రిల్ను మహనీయుల మాసంగా నిర్వహించాలి’ మహబూబాబాద్ అర్బన్: ఏప్రిల్ నెలల్లో జ్యోతిబాపూలే, బాబు జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహనీయుల మాసంగా నిర్వహించాలని డీపీఆర్ఓ పసూనూరి రాజేందర్ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పౌరసంబంధల శాఖ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల మహనీయుల మాసం కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు మద్దెల వీరస్వామి, జిల్లా కార్యదర్శులు దాసరి మహేందర్, గంగుల రమేష్, జక్కుల నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాలల్లో ఎంపికలు
మహబూబాబాద్ అర్బన్: క్రీడాపాఠశాలల్లో విద్యాభాస్యం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మానుకోట జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవవారం ఉదయం క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి ప్రవేశానికి మూడో తరగతి చదువుతున్న బాలబాలికలకు 9 రకాల పోటీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ● పశుసంవర్ధక శాఖ జిల్లాఅధికారి దంతాలపల్లి: రైతులు తమ పశువుల, గేదెల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో బుధవారం పశువులు, గేదెలకు నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ వైద్యశిబిరంలో పాల్గొని సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గతో కలిసి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకడంవల్ల పశువుల్లో వచ్చే నష్టాల గురించి వివరించారు. ప్రభుత్వం పశువుల్లో సోకే వివిధ వ్యాధుల నుంచి కాపాడి పశు సంపదను పెంచే విధంగా బుధవారం జాగ్రత్తలు తీసుకుంటుందని రైతులకు గుర్తుచేశారు. మండలంలోని గ్రామాల్లో పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తమ పశువులకు ఎలాంటి వ్యాధి సోకినా దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నౌసిని, సిబ్బంది వరలక్ష్మి, రాములు, వెంకన్న, రైతులు పాల్గొన్నారు. -
చెక్
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అక్రమ రవాణాకుఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్సాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణా.. అవసరం ఉన్నవారికి ఇసుక అందకపోవడం.. అందినా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి చరమ గీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. మన ఇసుక వాహనం పేరుతో రూపొందించిన వెబ్సైట్ ద్వారా ఇసుక బుకింగ్ నుంచి పంపిణీ వరకు అంతా పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బుకింగ్ ప్రక్రియ పారంభిస్తే కొందరు పోలీస్ అధికారులు, ఇసుక దందా చేసేవారికి ఇబ్బందిగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఐదు మండలాల్లో ఇసుక జిల్లా వ్యాప్తంగా పలు వాగుల్లో ఇసుక లభ్యమవుతున్నా.. ప్రధానంగా ఐదు మండలాల్లో ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఆకేరు, మున్నేరు వాగుల పరివాహక ప్రాంతాల్లో ఇసుక లభిస్తుంది. ఇందులో నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు, డోర్నకల్ మండలాల్లో ప్రవహించే ఆకేరు వాగులో ఎక్కువ ఇసుక లభ్యత ఉంది. అక్రమాలకు చెక్ ఇప్పటి వరకు జిల్లాలో లభించే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. జిల్లా నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు తరలించి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకునేవారు. ఈ ఇసుక అక్రమ వ్యాపారానికి కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులే తమ అనుచరులను పెట్టి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అనుచరుల ట్రాక్టర్లు మినహా ఇతరుల వాహనాలు నడపొద్దని అలా నడిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ ద్వారా సామాన్యులు సైతం తమ అవసరాలకు కావాల్సిన ఇసుక తమ సొంత వాహనాల్లో తీసుకెళ్లే అవకాశం లభించనుంది. పారదర్శకత కోసం కొత్త పాలసీప్రతీ ఒక్కర వినియోగదారుకు ఇసుకను అందుబాటులోకి తేవడం కోసం ఈ కొత్త పాలసీ దోహదపడుతుంది. కూపన్ల పంపిణి, డబ్బుల చెల్లింపు అంతా ఆన్లైన్లోనే నమోదు అవుతుంది. ఈ పాలసీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్, రెవెన్యూసురక్షిత సమాజ నిర్మాణానికి కృషి ఇసుక వాహనం పేరుతో కొత్త వెబ్సైట్ పంచాయతీ కార్యదర్శి నుంచి తహసీల్దార్, ఎస్ఆర్ఓ వరకు సమాచారం అవసరాలకు అనుగుణంగా సరఫరాఅంతా ఆన్లైన్ ద్వారా.. ఇప్పటి వరకు అడ్డూ అదుపు లేకుండా సరఫరా అవుతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రైవేట్ గృహాల నిర్మాణం, ఇతర పనులకోసం వినియోగించే ఇసుక ఇలా మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో ఆయా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్కు రేటు ఫిక్స్ చేశారు. అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే అది నేరుగా పంచాయతీ కార్యదర్శి లాగిన్కు, అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్కు ఆతర్వాత సాండ్ రీచ్ ఆఫీసర్(ఎస్ఆర్ఓ)కు లాగిన్ అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులు నేరుగా ఇసుక తీసుకునే అవకాశం ఉంది. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గూడూరు: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో పెట్టుకోవాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు చెంద్రుగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించారు. ఓపీ వివరాలతో పాటు వైద్యులు, సిబ్బంది విధులపై ఆరా తీశారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం చెంద్రుగూడెంలోని పాఠశాలలో తరగతి గదులు, స్టోర్ రూం పరిశీలించారు. రుచికరమైన భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని నిర్వాహకులకు సూచించారు. పదో తరగతిలో ప్రతీ ఒక్కరు ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధవహించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ రైతుల అగచాట్లు..
జిల్లాలో ఆయిల్ పామ్ పండించిన రైతులు పంటను మిల్లులకు చేరవేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లలో గెలలను తీసుకువెళ్లి ప్రధాన రహదారి పక్కన డంప్ చేస్తే కొనుగోలు దారులు లారీల్లో లోడ్ చేసుకునేవారు కానీ, ప్రధాన రహదారి వెంట డంప్ చేసే అవకాశం లేకపోవడంతో కొనుగోలుదారులు వచ్చి లారీల్లో గెలలను వేసుకునేవరకు రైతులు ఆయా గెలలను తాము తీసుకొచ్చిన కందికొండ వద్ద ట్రాక్టర్లలోనే ఉంచి దారి వెంట వేచి ఉండగా.. సాక్షి తమ కెమెరాలో బంధించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
ఆర్టీఏలో వాహనదారుల సందడి
● నేడు సారథి పోర్టల్పై అవగాహన ఖిలా వరంగల్ : రవాణాశాఖ సేవలన్నీ సారఽథి పరివాహన్ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రమేయం తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణ రవాణాశాఖ ఇటీవల పోర్టల్లో చేరింది. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండా ఇంటి వద్ద కూర్చొని సారఽథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, శాశ్వత లైసెన్స్ (డీఎల్) పొందే ఆవకాశం ఉంది. ఈప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ప్రచారం జోరందుకుంది. ఈ విధానంతో వాహనదారులు మొబైల్ ఫోన్, కంప్యూటర్ నుంచి ఆన్లైన్లో లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) పరీక్ష పాస్ కావడం అంత సులభం కాదని, ఒక్కసారి పరీక్ష ఫెయిల్ ఆయితే మరోసారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలిసి మంగళవారం వాహనదారులు పెద్ద ఎత్తున స్లాట్స్ బుక్ చేసుకున్నారు. మంగళవారం 70ఎల్ఎల్ఆర్, 50 డీల్ కోసం వాహనదారులు సారథి పోర్టల్లో స్లాట్స్ బుక్ చేసుకుని ఆర్టీఏకు చేరుకున్నారు. అనంతరం జీరో కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిరీక్షించి ఆర్టీఏ సేవలు అందుకున్నారు. రేపు మెగా జాబ్మేళా హన్మకొండ అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ప్రాంగణంలో రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు మెగాజాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. వివరాల కోసం వరంగల్ ఐటీఐ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనల అతిక్రమణ
ఎంజీఎం : మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి సుజాత (40) తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే ముందు చేపట్టే పంచనామాలో తండ్రి సంతకం తీసుకోకపోవడంతోపాటు కనీస సమాచారం అందించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని ఆర్ఎంఓ అశ్విన్ వివరించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి బంధువుల ఆరోపణ ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన -
యశ్వంత్కు గోవా సీఎం అభినందన
మరిపెడ రూరల్ : తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ గోవాలో పర్వతరోహణ చేసిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను మంగళవారం మర్యాదప్వూకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్ను సీఎం అభినందించారు. యశ్వంత్ ప్రస్తుతం ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ మిషన్లో భాగంగా గోవాలోని ‘సోన్సోగోర్’ ఎత్తైన పర్వతాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించడం సాహసంతో కూడిన అరుదైన విజయమన్నారు. దేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరాలను, ఏడు ఖండాల్లోని శిఖరాలను అధిరోయించాలనే లక్ష్యంతో శిఖరాగ్ర సమావేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందని సీఎం కొనియాడాడు. పిన్న వయసులో మౌంటైనర్ యశ్వంత్ చేసే ఈ ప్రయాణం దేశ యువతకు స్ఫూర్తిని ఇవ్వడంతోపాటు ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. పంటమార్పిడితో నేల ఆరోగ్యం హసన్పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడి ఇంటికి నిప్పు
చెన్నారావుపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యంతండాకు చెందిన బోడ స్రవంతి(28) తన ఇద్దరు కుమారులు కార్తీక్(12), కౌశిక్ (08)తో మంగళవారం హైదరాబాద్లోని కూకట్పల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, భర్తే.. భర్య, కుమారులను హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆమె భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంటి చుట్టూ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో సామగ్రి కాలిపోయింది. నాడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. నేడు అదే ప్రేమను చిదిమేశాడు.! చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు బోడమాణిక్యతండా జీపీకి చెందిన బోడ ప్రవీణ్ సమీపంలోని 16 చింతల తండాకు చెందిన స్రవంతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ జన్మించారు. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ ఒక్కటయ్యే వారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ప్రవీణ్ మరో మహిళకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రవీణ్ వేధింపులు అధికమవడంతో త ట్టుకోలేక స్రవంతి ఆరు నెలల క్రితం తనపిల్లలను తీసుకుని వచ్చి తల్లిగారి ఇంటి వద్ద 16 చింతల తండాలో ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రవీణ్ తీరు మారడం లేదని తల్లిదండ్రుల వద్ద వాపోయేది. అయితే చివరి అవకాశంగా ఒక్కసారి చూడమని తల్లిదండ్రులు సోమవారం నర్సంపేటలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇక నుంచి సక్రమంగానే ఉంటానని నమ్మబలికిన ప్రవీణ్.. భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ 24 గంటలు గడవక ముందే ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలతో కలిసి స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంతోపాటు తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు.. తమ కూతురు స్రవంతి, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ను తమ అల్లుడు ప్రవీణే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు భద్రి, భిక్యా ఆరోపించారు. ప్రవీణ్ రెండు సంవత్సరాల క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, గతంలో గొడవలు జరిగా యని తెలిపారు. ఆరు నెలలుగా స్రవంతి,ప్రవీణ్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అతను స్రవంతిని వేధిస్తున్నాడని, తన ప్రేమకు ఇతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే నెపంతో భార్యాపిల్లలను హత్య చేశాడని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తల్లికుమారుల అనుమానాస్పద మృతి బోడమాణిక్యంతండాలోని భర్త ఇంటికి నిప్పు పెట్టిన మృతురాలి బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపణ -
ఆకట్టుకున్న ‘జగన్నాథ దేవాలయ చరితం’
● ముగిసిన పోతన విజ్ఞాన పీఠం వార్షికోత్సవం హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞానపీఠం 39వ వార్షికోత్సవంలో భాగంగా చివరిరోజు జగన్నాథ దేవాలయ చరితం నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం వరంగల్లోని పోతనవిజ్ఞాన పీఠం ఆడిటోరియంలో గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఏ త్రిపురనేని గోపిచంద్, ఆత్మీయ అతిథులుగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, నెల్లుట్ల రవీందర్రావు, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పౌరాణిక కళాకారుడు పల్లకొ ండ రాజేందర్ను సన్మానించి ‘నటచతుర’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం పోతన విజ్ఞానపీఠం వారిచే పీఎల్ఎన్ ప్రసాద్ రచించిన జగన్నాథ దేవాలయ చరితం చారిత్రక, పౌరాణిక వచన నాటకాన్ని కుసుమ సుధాకర్ దర్శకత్వంలో ప్రదర్శించారు. జగన్నాథుడిగా జూలూరి నాగరాజు, విశ్వావసుగా కాజీపేట తిరుమలయ్య, నారధుడిగా గొట్టె రమేశ్, ఇంద్రద్యుయుడుగా జేఎన్ శర్మ, విద్యావతిగా కుసు మ సుధాకర్, లలితగా సురభిహారిక తదితరులు పాత్రలు పోషించారు. నాటక నిర్వహణ అడ్లూరి చంద్రశేఖర్, సహకారం షఫీమహ్మద్, మాలిజయరాజ్, సురభి సంతోష్ రాగాలంకరణ చేయగా,బాపనపల్లి పరమేశ్వర్ మేకప్ చేశారు. -
ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స విజయవంతం
నయీంనగర్: అకస్మాత్తుగా వచ్చే తీవ్ర తలనొప్పిని సాధారణంగా తీసుకోవద్దని, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకర బ్రెయిన్ అన్యూరిజం కావొచ్చని హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆస్పత్రి న్యూరో సర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి తెలిపారు. మలక్పేట్ యశోద ఆస్పత్రి వైద్య బృందం సకాలంలో అత్యవసర ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికి త్స చేసి రోగి ప్రాణం కాపాడారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర తలనొప్పితో డిసెంబర్ 5న ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్య సిబ్బంది సిటి స్కాన్ పరీక్ష నిర్వహించగా అందులో మెదడులో రక్తస్రావం ఉన్నట్లు తేలింది. మరికొన్ని పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ అన్యూరిజం ఉన్నట్లు గుర్తించారు. ఇది అత్యంత ప్రాణాపాయకర పరిస్థితి. అన్యూరిజం నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉండడంతో కోయిలింగ్, స్టంట్ చికిత్సలు సురక్షితంగా చేయడం సాధ్యం కాలేదు. అవి మెదడుకు రక్తప్రవాహాన్ని ఆపే ప్రమాదం ఉండడంతో అత్యవసరంగా ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్) నిర్వహించారు. క్లిష్టమైన బ్రెయిన్ అన్యూరిజం కేసులకు కూడా విజయవంతంగా చికిత్స చేస్తున్నామని వారు తెలిపారు. సమావేశంలో మేనేజర్ ఎ.వాసుకిరణ్ రెడ్డి, గంగయ్య పాల్గొన్నారు. యశోద ఆస్పత్రి న్యూరోసర్జన్లు జయానంద్ సుధీర్, వంశీరెడ్డి -
ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించాలి
వరంగల్ చౌరస్తా : రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన రైతు ఉద్యమ నేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూసం రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే నిరుద్యోగం నిర్మూలనవుతుందన్నారు. 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత కేంద్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ కొత్త వంగడాలను రూపొందించి రైతాంగానికి దిగుబడి వచ్చే విత్తనాలను అందించాలని సూచించిందన్నారు. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల ని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50శాతం సబ్సిడీతో అందించాలని, ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. నాయకులు ఓదల రాజయ్య, సోమ రామ్మూర్తి, పల్నాటి మల్లేశం, వంగూరు నర్సింహ, వన్నాల తిరుపతిరెడ్డి, వివిధ జిల్లా బాధ్యులు తిరుపతి, మస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి రాష్ట్ర సదస్సులో జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ -
అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి
హన్మకొండ: విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడి అన్మ్యాన్డ్డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ వరంగల్ నగరంలోని యాదవనగర్ సెక్షన్లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ విధుల్లో భాగంగా సోమవారం విద్యుత్ స్తంఽభాన్ని నిచ్చెన పై నుంచి ఎక్కుతూ కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా అంబులెన్స్లో మృతదేహంతో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మృతుడి భార్య శ్వేతకు ఆర్టిజన్గాన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం రాజు చౌహాన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, ఇతర అధికారులు చేరుకుని పున్నం చందర్ చనిపోవడం బాధాకరమని, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని చెప్పారు. సీఎండీ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ధర్నా విరమించకపోవడంతో ప్రతినిధుల బృందాన్ని హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. డైరెక్టర్లు సి.ప్రభాకర్, వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి సంస్థ పరంగా రూ.17 లక్షల ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు మొత్తం రూ.22 లక్షలు అందజేస్తామని వివరించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్ స్తంభం ఎక్కుతూ కింద పడిన పున్నం చందర్ మృతదేహంతో టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
పెత్తందారుల గుప్పిట్లో హెచ్సీఏ
వరంగల్ స్పోర్ట్స్: పెత్తందారులు, అగర్వాల్, తమిళీయులు, తెలంగాణేతరుల కబంధహస్తాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొనసాగుతుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్సీఏలో నిధుల దుర్వియోగం, ఇతర అక్రమాలపై విచారణ జరపాలనే టీసీఏ ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగిందన్నారు. విచారణలో రూ.660 కోట్లు దుర్వినియోగమైనట్లు సీఐడీ గుర్తించిందని, అందులో భాగంగానే హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతరులు జైలుకెళ్లారన్నారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. 70 సంవత్సరాలుగా వందల కోట్ల హెచ్సీఏ నిధులను కొల్లగొట్టిన అక్రమార్కులు ప్రతీ ఒక్కరు జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. హెచ్సీఏ అక్రమాలపై బాంబే హైకోర్టులో కేసు నడుస్తోందని త్వరలోనే టీసీఏకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో మినీస్టేడియం నిర్మాణానికి 8 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. వచ్చే ఏడాదిలో రంజీ మ్యాచ్ నిర్వహించేలా క్రీడాకారులకు శిక్షణ అందిస్తామన్నారు. స్టేడియంతోపాటు నగరంలో ఎక్సలెన్సీ ఆఫ్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ఫైనల్ చేసి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయచందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ అలీం, సీనియర్ క్రికెటర్ జయచందర్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి -
గుముడెల్లి రేణుకకు ఘన నివాళి
దేవరుప్పుల : ఏడాది క్రితం కగార్ ఆపరేషన్లో నేలకొరిగిన మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, విప్లవ రచయిత గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో అమరత్వ స్మరణతో ఉద్యమాల ఖిల్లా కడవెండి మరోసారి ఎరుపెక్కింది. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో ప్రథమ వర్ధంతి తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ సమక్షంలో నిర్వహించారు. ఈ వర్ధంతికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షత వహిచంగా పలువురు స్మారక స్తూపం వద్ద ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ గాయకురాలు విమలక్క, విరసం నేత పాణి మాట్లాడు తూ రేణుక ఉన్నత జీవితం వదిలి ప్రజాసమస్యల పరిష్కారానికి పుస్తకాల్లో మిరుగుడుపూవు(మి డ్కో)గా అటవీబాట పట్టి వెనుకంజ వేయలేదన్నారు. ఓ మహిళగా అనేక పోరాట రూపాల్లో సమాజ స్థాపన కోసం పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట పొట్టన బెట్టుకుందన్నారు. రేణుక భౌతికంగా మన మధ్యలో లేకున్నా ఆమె రచనలు దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా మారాయన్నారు. అనంతరం పద్మకుమారి మాట్లాడుతూ నక్సల్ ఉద్యమంలో నేటికి ఇరవై వేల మంది నేలకొరగగా ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నా లొంగుబాటు నేతల భరోసా తమకు అవసరం లేదన్నారు. అమరుల ఆశయాల సాధనకు వారి వైఖరి వెలిబుచ్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, గాయకులు మిడ్కో త్యాగాన్ని గుర్తు చేసేలా కవితలు, పాటలు ఆలోచింపజేశా యి. సమావేశంలో విరసం ప్రతినిధి పాణి, సామాజిక ఉద్యమకార్యకర్త సజయ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్, రమాసుందరి, మిడ్కో కుటుంబ సభ్యులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కడవెండిలో విప్లవ రచయిత మిడ్కో మొదటి వర్ధంతి సభ హాజరైన ప్రజాసంఘాలు, విరసం, మాజీ మావోయిస్టులు -
నేటినుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2,40,100 జవాబుపత్రాలు కేటాయించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీసర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటినుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యా థ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30 గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 1,250 మంది ఉపాధ్యాయుల వరకు నియామాక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10 నుంచి 17వ తేదీ వరకు.. టెన్త్ మూల్యాంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడోదశలో 15 నుంచి 23వ తేదీ వరకు.. మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం 15 నుంచి 23వ తేదీ వరకు చేపటనున్నారు. ఇందులో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. విధులు సక్రమంగా నిర్వర్తించాలి.. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2,40,100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
గందరగోళంగా బడ్జెట్
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యో తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. వస్తే ఎందుకు బడ్జెట్లో పొందుపర్చలేదని కమిషనర్తో కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. ఈ విషయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సైతం కమిషనర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చైర్పర్సన్కు అయినా జీఓ చూపించారా లేదా అని సీరియస్ అయ్యారు. దీంతో కమిషనర్ మళ్లీ బడ్జెట్ రూ.92,66,70,000 రూపకల్పన చేసి ప్రవేశపెట్టారు. సీపీఐ వర్సెస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు.. సీపీఐ కౌన్సిలర్ అజయ్సారథిరెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రవికుమార్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, వేరే విషయాలు వద్దని రవికుమార్ అనడంతో సీపీఐ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చిదిరాల అరుణ పారిశుద్ధ్యం తదితర సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గుండా రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. కేవలం బడ్జెట్ గురించి మాట్లాడాలని, ఇతర విషయాలపై మాట్లాడొద్దన్నారు. ఈక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రూ.60కోట్ల నిధులపై లొల్లి.. ఎమ్మెల్యే విడుదల చేయించిన రూ.60 కోట్ల నిధుల జీఓ వచ్చిందా.. ఫైనాన్స్ క్లియర్ అయిందా.. లేకుంటే కమిషనర్ బాధ్యత వహించాల్సి వస్తుందని పలువురు కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. అనంతరం రూ.92,66,70,000 బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమోదించారు. మున్సిపల్ చట్టాన్ని చదవాలి: కలెక్టర్ ముందుగా ప్రతీ కౌన్సిలర్ మున్సిపల్ చట్టాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేయడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి గత ఏడాది రూ.30 లక్షలు వస్తే.. ఈ ఏడాది రూ.6కోట్లు ఎలా వస్తాయని, అధికారులు బడ్జెట్ రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. వాహనాలు ఎక్కువగా మరమ్మతుల బారిన పడుతున్నాయన్నారు. నిధులు రావడం లేదని, స్టాఫ్ సక్రమంగా రావడం లేదని కలెక్టర్కు వివరించారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. మున్సిపల్ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొర్రూరు బస్టాండ్ ఏరియాలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, టీపీఓ సాయిరాం, మేనేజర్ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీహరి, అధికారులు తదిత రులు పాల్గొన్నారు. -
నానో యూరియాతో రైతులకు మేలు
డోర్నకల్: నానో యూరియాతో పంటలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని డీఏఓ సరిత తెలిపారు. మండలంలోని చిలుకోడు రైతువేదికలో మంగళవారం జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా టెలికాన్ఫరెన్స్లో పలువురు రైతులు అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. నానో యూరియా నేరుగా మొక్కలకు అంది ఎదుగుదల వేగంగా ఉంటుందని తెలిపారు. ఘన రూపంలో ఉండే యూరియా బస్తాల కంటే ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడకం తేలికగా ఉంటుందన్నారు. మామిడిపంట పూతదశలో వచ్చే తెగుళ్లను వెంటనే గుర్తించి మందులు పిచికారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అనిల్కుమార్, ఏఈఓ అవినాష్, సెరికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267ప్రజాహితానికి ప్రత్యేక కార్యాచరణ● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజాహితం కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశం మందిరంలో మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజల ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల సహకారం ఉండాలని కోరారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టి హెల్మెట్లు ధరించే విధంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గంజాయి సేవించే వారిని కట్టడి చేసందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీ నుంచి మూడు వార్డులను, ప్రతీ మండలం నుంచి రెండు గ్రామాలను ఎంపిక చేస్తామన్నారు. గంజాయి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య పాల్గొన్నారు. మానుకోట మున్సిపల్ బడ్జెట్పై కౌన్సిలర్ల అసంతృప్తి కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం సమావేశంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం సిబ్బంది తమ మాట వినడం లేదని చైర్పర్సన్ ఆవేదన -
ఈ–నామ్లో సాంకేతిక సమస్య
● సాయంత్రం వరకు ప్రారంభమైన కాంటాలు కేసముద్రం: ఈ–నామ్ విధానంలో కొత్తగా అప్డేట్ చేసిన 2.0వెర్షన్ సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో రైతులు రోజంతా తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రైతులు మక్కలు, మిర్చి బస్తాలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో ఉదయం 194 మంది రైతులకు లాట్ ఐడీలు ఇచ్చారు. ఈ క్రమంలో వ్యాపారులు రైతులు తీసుకువచ్చిన సరుకులను చూసిన అనంతరం, టెండర్లు వేసే క్రమంలో లాగిన్ ఓపెన్ కాలేదు. సాయంత్రం వరకు సాంకేతిక సమస్య అలాగే ఉండడంతో, చేసేదీ ఏమీలేక మాన్యువల్గా చీటీలపై ధరలను వేసి రైతులకు ఇచ్చారు. అప్పటి వరకు రైతులు పంట రాశుల వద్ద, మరికొందరు మార్కెట్ ఆఫీస్ వద్ద విన్నర్ జాబితా కోసం పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. కాగా సాయంత్రం 6 గంటలకు కాంటాలు మొదలు పెట్టడంతో రాత్రి సమయంలో తొలకాలు జరిగాయి. మార్కెట్కు 10వేల మక్కల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మానుకోట వ్యవసాయ మార్కెట్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. -
సాంకేతికతతో తగ్గిన విద్యుత్ అంతరాయాలు
హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లొకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీని వాస్, వేణు మాధవ్, వాసుదేవ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
రూ. 396.69 కోట్లు
కేయూ అంచనా బడ్జెట్కేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలనభవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ.126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొత్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50లక్షలు, అకడమిక్ , ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్ బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపకంగా నివాళులర్పిస్తూ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అకడమిక్ సెనెట్లో ఆమోదం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధిలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ఐ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫెల్లోలు గా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. –కె. ప్రతాప్రెడ్డి, వీసీ -
మహబూబాబాద్
మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 20267దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావా ణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్లు, దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నా రు. ప్రత్యేక అధికారులు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. కాగా, ప్రజావాణిలో 168వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పంచాయతీకి చెందిన నరేందర్, కాంతారావు, పాపారావు, శ్రీను ఆ గ్రామంలోని ఫర్టిలైజర్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఎరువులు ఉద్దెర ఇచ్చి వడ్డీలు వేసి లక్షల్లో వసూళ్లు చేసి ఇబ్బందులు పెడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. వ్యాపారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా కేంద్రం శివారులోని 107 సర్వే నంబర్లో భూ కబ్జా చేసిన ఓం నారాయణపై చర్యలు తీసుకోవాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ వినతిపత్రం అందజేశాడు.దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలి● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, కేసుల్లో దర్యాప్తు నాణ్యతను బలోపేతం చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన వివిధ రకాల కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసులు, గ్రేవ్ నేచర్ కేసులు, మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించిన కేసులపై చర్చించారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ విధానం, సాంకేతిక ఆధారాల వినియోగం, సాక్షుల వాంగ్మూలం నమోదు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రతీ కేసులో చట్టపరమైన విధానాలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా కేసుల్లో చార్జిషీట్లను పూర్తిస్థాయిలో ఎలాంటి లోపాలులేకుండా కోర్టులో దాఖలు చేయాలన్నారు. చార్జిషీట్ల తయారీలో ప్రతీ అంశం స్పష్టంగా ఉండేలా, సాక్ష్యాధారాలు బలంగా ప్రతిపాదించేలా, కోర్టులో కేసు నిలబడే విధంగా రూపొందించాలన్నారు. దర్యాప్తు అధికారుల బాధ్యతను గుర్తుచేస్తూ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం అందేలా దర్యాప్తు చేయడం పోలీస్ అధికారుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తరచూ రాత్రి పర్యటనలు నిర్వహించి పోలీస్ వ్యవస్థ పనితీరును సమీక్షించాలని సూచించారు. గంజాయి తాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశం అనంతరం ఇటీవల మూడు కేసుల్లో నిందితులకు శిక్షలు విధించేలా కృషి చేసిన సీడీఓలు, సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ శబరీష్ అభినందించి, ప్రశంస పత్రాలను అందజేశారు. వారి పనితీరును ఇతర అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాల పరిశీలనమహబూబాబాద్ అర్బన్: మూడో తరగతి విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరిశీలించినట్లు డీఈఓ రాజేశ్వర్ సో మవారం తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడం, సులభమైన అంకగణిత ప్రక్రియలను పరిశీలించామని తెలిపారు. జిల్లాలో డీఈడీ అభ్యర్థులతో ఏడు పాఠశాలల ఎఫ్ఎల్ఎస్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు. ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకెఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈయూ నాయకులు రావుల రమణారెడ్డి, కడెం మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, ట్రాన్స్ కోవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు ఎన్.రాంబాబు, పూర్ణాచారి, సతీశ్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సృజన, రాకేశ్, శ్రీధర్, సాగరం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2,400 అందడంలేదని, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు. కాగా, ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్కుమార్ను నిర్బంధించారు. ఆగ్రహించిన అన్నదాతలు ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ నిర్బంధం -
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు విద్యా సామగ్రి, యూనిఫామ్ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేష్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ అనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష పాల్గొన్నారు. కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’ ● రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య హన్మకొండ కల్చరల్: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్, సాదుల సురేశ్, కొడం సురేందర్, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్ నటించారు. సురభి సంతోష్ రంగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్ అందించారు. పీఠం కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీధర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
గ్రామాల్లో అంగన్వాడీ కోడిగుడ్ల విక్రయం● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని, అందుకు సంబంధిత అఽధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎస్సీ యాక్షన్ ప్లాన్పై డిస్ట్రిక్ లెవల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పథకాలపై విస్త్తృత ప్రచారం చేయాలన్నారు. బ్యాంకర్లతో మాట్లాడి రుణాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీమన్నారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీమరిపెడ రూరల్: మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం అంగన్వాడీ కేంద్రం–1ను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారులు ప్రార్థన చేయగా వారిని అదనపు కలెక్టర్ అభినందించారు. కేంద్రం నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని సీడీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, సీడీపీఓ ఎల్లమ్మ, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, ఎంపీఓ సోంలాల్, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ రేణుక పాల్గొన్నారు. ఇనుగుర్తి: చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు అందించే అంగన్వాడీ కోడిగుడ్లు గ్రామాల్లో విక్రయిస్తున్న ఘటన మండలంలోని చిన్ననాగారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కిశోర్ ఎగ్ సప్లయర్ పేరుతో ఉన్న టాటాఏస్ వాహనంలో తిరుగుతూ కేసు కోడిగుడ్లు రూ.60నుంచి రూ.70వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసిన గ్రామస్తులు కోడిగుడ్లపై అంగన్వాడీ ముద్ర ను గమనించి తహసీల్దార్ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. కొడిగుడ్ల వాహనాన్ని స్ధానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన గుడ్లను పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై దర్యాప్తు చేస్తామన్నారు. -
గడ్డిమందును నిషేధించాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్ను పూర్తిగా నిషేధించాలని అసెంబ్లీలో ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం అభినందనీయమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గడ్డి మందును నిషేధించాలనే అంశంపై సోమవారం మాట్లాడారు. పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని గతంలో అసెంబ్లీలో రెండు, మూడుసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. ఈ గడ్డిమందుకు విరుగుడు మందులేదని, కుటుంబ తగాదాలు, చిన్నచిన్న విషయాలకు మనస్థాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. గడ్డిమందును తాగిన గంటన్నరలోనే కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, తదితర అవయవాలు పనిచేయకుండా పోతున్నాయని, బాధితులకు వెంటనే డయాలసిస్ చేసి సరైన చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గడ్డిమందుపై నిషేధం విధించే వరకు అందరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, వ్యవసాయ అధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కోరారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మరో ఐదు డయాలసిస్ బెడ్లను పెంచారని, అందులో ఒక బెడ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారికి రిజర్వ్ చేశారని, ఐదు డయాలసిస్ బెడ్లను పెంచినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
పర్వతగిరి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టూక్యానగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(46) సోమవారం విధులకు హాజరయ్యాడు. పాఠం బోధిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మృతుడు చంద్రశేఖర్ది సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. వడదెబ్బతో యువకుడి మృతి కురవి: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కురవి మండలం కొత్తూరు(సీ)లో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పత్తేపురపు బాబు(36) రేకుల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా రేకుల కింద ఉండడంతో ఎండకు అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరోగ్యం క్షీణించి సోమవారం మృతి చెందాడు. మృతుడు బాబుకు భార్య రేణుక, కూతురు, కుమారుడు ఉన్నాడు. చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు ములుగు రూరల్ : చెక్ బౌన్స్ కేసులో ఒకరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న తీర్పు వెలువరించినట్లు ఎస్సై ఉపేందర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు మండలానికి చెందిన శంకర్ అనే వ్యక్తి వద్ద 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 8లక్షల అప్పు తీసుకొని చెక్ అందించాడు. చెక్కును బాధితుడు బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో శంకర్పై శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి కోర్టులో హాజరుపర్చుగా నేరం రుజువు కావడంతో జడ్జి.. శ్రీనివాస్కు నెల రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు. -
గంగపుత్రుల సంక్షేమానికి పాటుపడాలి
● గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు తొర్రూరు: గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు కోరారు. డివిజన్ కేంద్రంలోని తిరుమల గార్డెన్లో ఆదివారం గంగపుత్ర సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సైదులు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గంగపుత్రులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. చేపల వృత్తిదారులకు కోల్డ్ స్టోరేజీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదుమల సంపత్కుమార్, కోశాధికారి అనుమాస సత్యనారాయణ, నాయకులు అంబటి వెంకన్న, ఆనంద్కుమార్, పద్మావతి, రాములు, సాంబయ్య, కిరణ్, వెంకన్న, పిల్లి నాగరాజు, సంతోష్ పాల్గొన్నారు. వ్యవసాయరంగాన్ని పరిరక్షించండి నెహ్రూసెంటర్: దేశానికి అన్నంపెట్టే రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని పరిరక్షించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కోటేశ్వర్రావు, మండల వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై ఆధారపడిన రైంతాగానికి నష్టం చేసే లా, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులకు నష్టం కలిగించేలా చట్టాలను సవరిస్తూ తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. సంఘం గ్రామ, మండల, జిల్లా మహాసభలను పూర్తి చేసుకోవాలని, ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్లో జాతీయ మహాసభలను నిర్వహించనున్ననట్లు ఆయన పేర్కొన్నారు. ఐలయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ ఉన్నారు. -
ధరణి పేరుతో బీఆర్ఎస్ భూకబ్జాలు
● అసెంబ్లీలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : ధరణి పోర్టల్ను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ ఆదివారం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ అక్రమాలపై వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటుచేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని, మానుకోట జిల్లాలో దళిత, గిరిజనులు, పేద, మధ్యతరగతి కుటుంబాల భూములు కబ్జాకు గురయ్యయాని, ప్రభుత్వ భూముల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని, దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గించేలా ఉందని, వెంటనే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
చి‘వరి’కి పశువులపాలు..
కురవి: నీరు లేకపోవడంతో మండల కేంద్రం శివారు రేకుల తండాలో వరి పంట ఎండిపోయింది. తండాకు చెందిన రైతు శంకర్ తనకున్న వ్యవసాయ బావి కింద రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగుచేశాడు. బావిలో నీరు అయిపోవడం, పక్కనే ఉన్న కుంట అడుగంటడంతో ఎకరం పొలం ఎండిపోయింది. దీంతో చేసేదేమీలేక పొలంలో మేపేందుకు ఆదివారం గేదెలను వదిలాడు. ఎఫ్ఆర్ఎస్తో ఉన్నత విద్య బలోపేతం ● టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేష్ కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్గౌడ్, బ్రిజేష్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించింది. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కానరాని టీఫైబర్ సేవలు
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026కొనసాగుతున్న ఇంటర్నెట్ ప్రాజెక్టు పనులు ● కనెక్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం ● పలుచోట్ల తుప్పుపడుతున్న పరికరాలు ● గ్రామాల్లో అందని ద్రాక్షలా సేవలుగూడూరు: అతి తక్కువ ఖర్చుతో ప్రతీ పల్లెకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ ఫైబర్ సేవల ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్ ద్వారా ఫోన్, ఓటీటీ, టీవీ ఇతర సేవలు అందించాలని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో కనెక్షన్లులు ఇవ్వకపోవడంతో టీ ఫైబర్ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. భూగర్భ కేబుల్తో కనెక్షన్లు.. జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద ప్రభుత్వం రెండేళ్ల క్రితం లక్షలు ఖర్చు చేసి టీ ఫైబర్ సెట్లను అమర్చింది. వాటికి విద్యుత్ సరఫరా కోసం ఖరీదైన సోలార్ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేశారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. ఈమేరకు గూడూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో టీ ఫైబర్ సెట్లతో పాటు సోలార్ ప్యానళ్లను బిగించారు. అందులో గూడూరు మండల పరిషత్తో పాటు గూడూరు, చిన్న ఎల్లాపురం, భూపతిపేట, వెంగంపేట, కోబల్తండా, మర్రిమిట్ట, మచ్చర్ల, బ్రాహ్మణపల్లి, అయోధ్యపురం, బొల్లెపల్లి, రాములుతండా, పడమటితండాలో ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లాలోని రైతు వేదికల్లో టీ ఫైబర్ నెట్ ద్వారా టీవీలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ గూడూరు మండలంలో ఒక్క భూపతిపేట రైతు వేదికకు మాత్రమే టీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగిలిన జీపీలు, రైతు వేదికల్లో పరికరాలన్నీ దుమ్ముపట్టిపోతున్నాయి. ఇక గూడూరు వంటి మండల కేంద్రంలో కూడా ఈ సేవలకు సంబంధించిన పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. టీ ఫైబర్నెట్ గ్రిడ్తో ప్రయోజనాలు.. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒక ఇంట్లో ఒకే కనెక్షన్తో ఫోన్, ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలు పొందవచ్చు. ప్రత్యేక సెటప్బాక్స్ల ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చని, కీ బోర్డు మౌస్ ఉంటే చాలు ప్రత్యేకంగా కంప్యూటర్లు కొనాల్సిన పనిలేదని సమాచారం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడడంతో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్ క్లాసులు వినడం, హోంవర్క్ పనులు సులభంగా చేసుకోవచ్చు. పేపర్ లెస్ సేవలకు ఆటంకం టీ ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్ లెస్) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందని, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. -
పుట్టలమ్మ కుంటలో చేపలు మృత్యువాత?
స్టేషన్ఘన్పూర్ : ఘన్పూర్ శివారు పుట్టలమ్మ కుంట చెరువులో దాదాపు రెండు టన్నుల చేపలు అనుమానాస్పదంగా మృత్యువాత పడిన సంఘటన శనివారం జరిగింది. స్టేషన్ఘన్పూర్ మత్స్యసొసైటీ నాయకులు, మత్స్యకారుల కథనం ప్రకారం.. పుట్టలమ్మ చెరువులో చేపలు ఈసారి భారీగా పెరిగాయని, ఒక్కొ చేప కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు వచ్చాయని తెలిపారు. అయితే శనివారం ఉదయం చూసేసరికి వందల సంఖ్యలో చేపలు మృతిచెంది నీటిపై తేలుతూ ఉన్నాయని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలియడం లేదని, ఎవరైనా కుట్రపూరితంగా నీళ్లలో విషగుళికలు కలిపి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.5లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ విషయమై మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఘన్పూర్ మత్స్యసొసైటీ చైర్మన్ నీల సోమన్న, నాయకులు గోనెల ఐలోని, అనిల్కుమార్, వెంకన్న, మాజీ ఎంపీటీసీలు మునిగెల రాజు, గోనెల రాజయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూ.5లక్షల మేర నష్టం ఆదుకోవాలని మత్స్యకారుల వేడుకోలు -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
● డీఏఓ సరిత కేసముద్రం: పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే శారీరకశ్రమతోపాటు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మున్సిపాలిటీ పరిధి ధన్నసరి పీఏసీ ఎస్ను శనివారం ఆమె సందర్శించి, యూరియా నిల్వలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు మాన్యువల్గా పంటలకు మందులు పిచికారీ చేయడానికి బదులుగా, డ్రోన్లను వినియోగించాలని తద్వారా పురుగులు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ వెంకన్న, సాంకేతిక వ్యవసాయ అధికారి చాయారాజ్, ఏఈఓ దారావత్ రాజేందర్ పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యం
మహబూబాబాద్ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 202 Iఇచ్చేవారికే దిక్కులేదు..! మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో తాగునీటితోపాటు వివిధ అవసరాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోని మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతుండడంతో ఉద్యోగులు, సిబ్బంది ముక్కు మూసుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఉద్యోగులు ఒకటి, రెండుకు బయటకి పరుగులు తీయాల్సిందే. కనీసం కార్యాలయంలోని చేతి పంపు బోరు కూడా పనిచేయడంలేదు. ప్రజల అవసరాలకు, తాగునీటిని అందించాల్సిన కార్యాలయానికే నీటి సరఫరా లేకపోవడం ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేవిషయంపై జిల్లా మిషన్ భగీరథ ఈఈ సురేందర్ ను వివరణ కోరగా రెడ్యాలలో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో పైపులైన్ డ్యామేజ్ వల్ల కార్యాలయంతోపాటు పలు గ్రామాలకు నీటి సమస్య ఉందని తెలిపారు. -
‘క్రీస్తు జ్యోతి’లో టెక్నోజిల్–2026 ప్రారంభం
జనగామ : మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోజిల్–2026 మహోత్సవ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి ప్రారంభిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాల కోసం ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉదయం టెక్నోజిల్ క్విజ్, రంగోలి, ఐడియాథాన్, స్లో బైక్ రేస్ పోటీలు నిర్వహించారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగంలో మొదటి, ద్వితీయ సంవత్సరంలో 60 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగోలి పోటీల్లో 10 గ్రూపులు పాల్గొని మన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ముగ్గులు వేశారు. 80 మంది విద్యార్థులు స్లో బైక్ రేస్లో డ్రైవింగ్ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరిచిన వారిని కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి, ప్రి న్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో టెక్నోజిల్ కన్వీనర్ డాక్టర్ పీ.యూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్ పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన టీఎస్ఈఈయూ నేతలు
హన్మకొండ: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 నాయకులు కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని హనుమకొండ కలెక్టరేట్లో టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదేలు, వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్యగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
పోలీస్ రేంజ్ కార్యాలయ భవనం ప్రారంభం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ నూతన భవనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ కార్యాలయంలో వరంగల్ రేంజ్ పోలీస్ అధికారులకు సంబంధించిన శాఖాపరమైన పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ అధికారులు సమస్యలపై రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, పరిపాలన పనితీరులో పారదర్శకంగా, బాధ్యతాయుత పని తీరు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేంధర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్స్పెక్టర్లు ఇతర రేంజ్ కార్యాలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ‘షైన్’ స్కాలర్షిప్ టెస్ట్
హసన్పర్తి : మండలంలోని ఎర్రగట్టు గుట్ట సమీపంలో గల షైన్ పబ్లిక్ స్కూల్లో నేడు (ఆదివారం) మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు షైన్ విద్యా సంస్థల చైర్మన్ ఎం.కుమార్ యాదవ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 4వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఈ టెస్ట్కు అర్హులని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఆయా తరగతులకు సంబంధించిన ప్రశ్నలు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఆంగ్లంలో ఇవ్వడం జరుగుతుందని వివరించారు. విజిలెన్స్ విచారణ హన్మకొండ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని దేవోజి తండా సబ్స్టేషన్ బోరు నీటిని హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి సాగు నీటి అవసరాలకు వినియోగించడంపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నెల 24న సబ్ స్టేషన్ బోరు పరుల పాలు, దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్పీడీసీఎల్ అధికారి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. వాగులో పడి ఒకరి మృతి బయ్యారం : అలిగేరు వాగులో పడి ఒకరు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం మండలంలోని చింతోనిగుంపు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొనక రాములు (53) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. శుక్రవారం గొర్రెలను మేపేందుకు వెళ్లి సాయంత్రం వాటిని అలిగేరు వాగు దాటించే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలోపడి మునిగాడు. శనివారం ఉదయం వాగు ప్రాంతలో ఓ గుంతలో తేలిన మృతదేహం తేలడంతో అది రాములుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. సిగ్నల్ లోపం.. నిలిచిన వందేభారత్ రైలు స్టేషన్ఘన్పూర్ : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ స్టేషన్ఘన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాతగేటు వద్ద శనివారం సాయంత్రం నిలిచిపోయింది. సిగ్నల్లో సాంకేతిక లోపం వల్ల సాయంత్రం 4:15 నుంచి 4:25 నిమిషాల వరకు స్టేషన్ఘన్పూర్లో వందేభారత్ రైలును నిలిపారు. అనంతరం సాంకేతిక లోపాన్ని సరిచేసి కాజీపేట వైపునకు పంపారు. -
కేయూలో యూత్ పార్లమెంట్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో శనివారం విద్యార్థులకు యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ విభాగం అధిపతి డాక్టర్ భారవిశర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్మీరా శంకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పర్యవేక్షణలో ఈ మాక్ యూత్ పార్లమెంట్ను నిర్వహించారు. విద్యార్థి కృష్ణసౌజన్య లోక్సభ స్పీకర్గా, పి.మహేందర్, ఎల్.సాయికుమార్, ఎన్.సురేష్, అకింత వివిధ శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారత్పై ప్రభావం, యువతపై సామాజిక మాధ్యమాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంది అనే అంశాలపై చర్చించారు. విద్యార్థులకు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాలు, బిల్లులు, చట్టాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే యూత్ పార్లమెంట్ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ మాక్ పార్లమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అన్వేష్కు సన్మానం మేరా యువ భారత్ డిపార్ట్మెంట్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల స్టేట్ డైరెక్టర్గా పదోన్నతి పొందగా గణిత విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను సన్మానించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు -
సాంకేతిక విద్యకు చిరునామా..
కాశిబుగ్గ : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సాంకేతిక విద్యతో విశిష్ఠ గుర్తింపు పొందిన ఈ విద్యా సంస్థ, చిన్నస్థాయి నుంచి ప్రారంభమై నేడు మహావృక్షంగా అభివృద్ధి చెందింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు మార్గదర్శకంగా నిలిచింది. చిన్న షెడ్డుతో మొదలై.. కళాశాల ప్రారంభంలో నగరంలోని అజంజాహి మిల్లులోని ఒక షెడ్డులో 120 మంది విద్యార్థులతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రీకల్ కోర్సులతో తరగతులు ప్రారంభమయ్యాయి. అనంతరం వరంగల్లోని ఎన్ఐటీ (ఆర్ఈసీ) తరగతులు కూడా తొలినాళ్లల్లో ఇదే కళాశాలలో నిర్వహించారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా ఎదిగి కళాశాలకు గుర్తింపు తీసుకు వచ్చారు. బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, జెన్కో, ఎన్పీడీసీసీఎల్, హెచ్సీఎల్, డీఆర్డీఓ, ఇస్రో, ఐడీపీఎల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1995 జూలై నుంచి.. 1995 జూలై 10న పదెకరాల విస్తీర్ణంలో పాలిటెక్నిక్ కళాశాల నూతన క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కళాశాలలో 1,620 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 1995–96లో ఈసీఈ, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కళాశాలలో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉండేది. గ్రంథాలయంలో సుమారు 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ ప్రక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే వారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఈ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం విశేషం. నేడు పాలిటెక్నిక్ కళాశాలలో వేడుకలు కళాశాల ప్రాంగణంలో నేడు(ఆదివారం) ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుక వచ్చేందుకు ఈ మహా సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేడు 70 వసంతాల వేడుకలు -
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ చిన్నగూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 45 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 8,165 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.89 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. గ్రామసభలను ఘనంగా నిర్వహించాలి మహబూబాబాద్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల గ్రామసభలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రజాపాలన, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో లబ్ధిదారులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు. -
20 కేజీల గంజాయి పట్టివేత
రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం నుంచి వరంగల్కు గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని ఎండు గంజాయితోపాటు కారును స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలిమిల తాలూకాకు చెందిన విక్రమ్ మండేల్, గౌత మ్ మండేల్, విప్రోజిత్ మండేల్ కారులో 20 కేజీల ఎండు గంజాయిని తరలిస్తున్నారు.ఈ క్రమంలో రహదారిపై కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యం కాగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయిని తూకం వేసి నిర్ధారణ అనంతరం కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పంచాయతీ సెక్రటరీ అజీజ్పాషా, హెడ్ కానిస్టేబుళ్లు రవీందర్, ఏలియా, పోలీసులు హరి, తూళ్ల సంపత్, గణేష్, ప్రవీణ్, సుమన్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 2 కేజీల గంజాయి.. కేసముద్రం : ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకు వచ్చిన 2 కేజీల గంజాయిని తరలిస్తున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి చెందిన నలుగురిని కేసముద్రంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధి ముత్యాలమ్మగూడెనికి చెందిన ఎస్కె రఫీ, జుజ్జూరు రఘు, జమాండ్లపల్లికి చెందిన సముద్రాల శ్రీనాథ్, బెస్తవాడకు చెందిన పిట్టల సాయికుమార్ కలిసి కొన్ని నెలలుగా ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి మహబూబాబాద్, కేసముద్రం చుట్టుపక్కల యువతకు గంజాయి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నెలరోజులుగా వారిపై పకడ్బందీ సమాచారం సేకరించారు. ఈ క్రమంలో కేసముద్రం బైపాస్రోడ్డు వైపు నలుగురు కలిసి రెండు కేజీల గంజాయిని తీసుకెళ్తుండగా, వారిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాయపర్తిలో కారుతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
కళాశాలలో చదవడం అదృష్టం
పాలిటెక్నిక్ కళాశాలలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి పూర్వ విద్యార్థులందరూ దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. రూ.28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – ఈవీ శ్రీనివాసరావు, అధ్యక్షుడు ప్రిన్సిపాల్గా నాకు గర్వకారణంసుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పాలిటెక్నిక్ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేయడం గర్వకారణంగా ఉంది. మేధావుల నిలయంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. – డాక్టర్ బైరి ప్రభాకర్, ప్రిన్సిపాల్ -
నేడు విలవిల
నాడు జలకళ.. ● పాకాల ఏటిలో తేలిన రాళ్లు గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు వానాకాలంలో చెక్డ్యాం పైనుంచి పొంగి ప్రవహిస్తూ కనువిందు చేసేది. కానీ ప్రస్తుతం వేసవికాలం ప్రారంభంలోనే ఏరు ఎండిపోయి రాళ్లు తేలి కనిపిస్తుంది. పాకాల ఏరు నాడు జలకళతో నిండుకుండలా మారగా, నేడు బండలు తేలి నీళ్లు లేక వెలవెలబోతోంది. పాకాల ఏటి పరివాహక ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. వేసవికాలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోతే గార్ల మండలంలో పశువులు, మూగజీవాలు, ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం దాపురించింది. జిల్లా అధికారులు తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవానీప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా.. ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవానీ ప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. మొక్కజొన్నకు బోనస్ చెల్లించాలి గంగారం : మొక్కజొన్న పంటకు బోనస్ ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఇందులో భాగంగా మొక్కజొన్న పంటకు కూడా రూ.500 బోనస్ వెంటనే అందించాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరిపి క్వింటాకు ధర రూ.2,400 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపా రులు క్వింటాకు రూ.1600 మాత్రమే చెల్లిస్తున్నారన్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరతో మక్కలను కొనుగోలుచేయాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత మహబూబాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈక భిక్షం, పీడీఎస్యూ జిల్లా నాయకుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పూత మొత్తం కాయకాదు ఈ ఏడాది గతంలో కంటే అధికంగా మామిడిపూత వచ్చింది. అయితే వచ్చిన పూత మొత్తం కాయగా మారదు. జిల్లాలో కొన్ని చోట్ల తామరపురుగు ప్రభావం ఉన్నప్పటికీ మామిడి దిగుబడి మాత్రం ఆశాజనకంగా వస్తుందనే అంచనాలో ఉన్నాం. – జినుగు మరియన్న, జిల్లా ఉద్యానవనశాఖాధికారి -
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
తొర్రూరు : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ యూనియన్ చైర్మన్ ధరావత్ సికిందర్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్, అన్మ్యాన్డ్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ..విద్యుత్ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులకు జీఓ 11ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, కన్వీనర్ శ్రీనివాస్, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్, ప్రతినిధులు హరిప్రసాద్, ప్రకాశ్, వీరన్న, శ్రీను, వెంకన్న పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మహేశ్ అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు షబ్బీర్, నాయకులు సుశ్వాంత్, దిలీప్, సంజయ్, వినయ్, విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యం డోర్నకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తోందని డోర్నకల్ మున్సిపల్ చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి తెలిపారు. గురువారం పలు వార్డుల్లోని ముస్లింలతో సమావేశమై రంజాన్ కానుకలను పంపిణీ చేశా రు. వైస్ చైర్మన్ లావణ్యశ్రీనివాస్, కౌన్సిలర్లు, ముస్లింలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె, రేడియం జాకెట్, బూట్లు పంపిణీ చేశారు. అనంతరం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్కు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాదా లావణ్యశ్రీనివాస్ వాటర్ ఫ్యూరిపయర్ బహూకరించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల తొలగింపునకు తీర్మానం బయ్యారం : బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగిస్తూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. గురువారం సర్పంచ్ శాంతికిషన్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మెజార్టీ సభ్యులు ప్రస్తుత ఇందిరమ్మ కమిటీ సభ్యులను తొలగించి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని ప్రతిపాదనతో ఆమోదించారు. -
జీజీహెచ్ టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నం
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డయాలసిస్ విభాగం టెక్నీషియన్ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనిల్కుమార్ అనే వ్యక్తి డయాలసిస్ విభాగంలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఓ వైద్యుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. బాధితుడికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా డయాలసిస్ విభాగంలో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని, విచారణ చేపడుతామని ఆయన తెలిపారు. -
రాములోరి కల్యాణం చూతము రారండి
● నేడు శ్రీరామ నవమి మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా శ్రీరా మనవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఆలయా ల్లో తగిన ఏర్పాట్లు చేశా రు. మానుకోట పట్టణంలోని గాంధీపార్కు ఎదుట రాములోరి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం జరగనుంది. గురువారం ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కమిటీ సభ్యులు పరిశీలించారు. -
చేపల వలలో చిక్కుకుని మత్స్య కార్మికుడి మృతి
తొర్రూరు: చేపల వలలో చిక్కుకుని మత్స్య కార్మికుడు మృతి చెందిన ఘటన గురువారం డివిజన్ కేంద్రంలో జరిగింది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు...తొర్రూరు పట్టణంలోని అలువాల మురళి (48) చేపల పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలానే సాయంత్రం చేపల వేటకు స్థానిక పెద్ద చెరువుకు వెళ్లాడు. చేపల కోసం వల వేయగా అది అతడి కాళ్లకు చుట్టుకుని చెరువులో పడి మునిగాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది చెరువు వద్దకు వెళ్లి చూడగా వల చుట్టుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య గత కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా.. కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జీవశాస్త్రానికి అంత్యంత డిమాండ్
మహబూబాబాద్ అర్బన్: జీవశాస్త్రానికి అత్యంత డిమాండ్ ఉందని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇస్తారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రి కళాశాలలో గురువారం జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో జీవశాస్త్రాల్లో బహుముఖ పరిశోధనపై జాతీయ సెమినార్ ముగింపు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తారి హాజరై మాట్లాడారు. మెమోరీ, ఎపిజెనెటిక్స్, న్యూరల్ మెమోరీ వంటి అభివృద్ధి చెందుతున్న అంశాలను పరిశీలిస్తే జీవిశాస్త్రంలో రాణించవచ్చాన్నారు. ప్రొఫెసర్లు వెంకయ్య, నారాయణ మాట్లాడుతూ.. మానవ సంక్షేమానికి మాలిక్యులర్ సాంకేతికతను తెలుసుకోవాలని, పరిశోధనలను, మౌలిక ప్రదర్శనలను విశ్లేషించాలని సూచించారు. అనంతరం జాతీయ సదస్సులో పాల్గొన్న వారికి కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మరిపెడ ప్రిన్సిపాల్ జీవన్కుమార్, కన్వీనర్ అనిల్, అధ్యాపకులు మసూద్ఆహ్మద్, శ్రీనివాస్, సాంబశివరావు, అన్నపూర్ణ, హతీరాం, సుమలత, ఉపేందర్, ఖాసీంషా, సుమన్, రవితేజ, సంతోష్ పాల్గొన్నారు. -
మామిడి రైతు విలవిల..
బయ్యారం: ఆరంభంలో ఆశాజనకంగా వచ్చిన పూతను చూసి మురిసిపోయిన మామిడి రైతు.. తామర పురుగు ఉధృతితో పిందె, కాయలు రాలుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని సంవత్సరాలుగా మామిడిరైతు నష్టాలపాలవుతున్నాడు. అయితే, ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని భావించిన మామిడి రైతు ఆశలను తామరపురుగు తుంచేసింది. మామిడి పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 13 వేల ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 18 మండలాల పరిఽధిలో 13వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. ప్రస్తుతం పిందె నుంచి కాత దశలో పంట ఉంది. ప్రారంభంలో తామర పురుగు ఉధృతి పెరగడంతో ఎక్కువ సంఖ్యలో పూతతో పాటు పిందెలు రాలినట్టు రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు పగలు, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులు కూడా మామిడి పంటపై ప్రభావం చూపినట్లు రైతులు చెబుతున్నారు.ముప్పావు వంతు పూత రాలిపోయిందిమామిడితోటలో మొదట వచ్చిన పూతతో లాభాలు వస్తాయనుకున్నాం. రోజురోజుకూ పూత, పిందె, కాయలు రాలడం పెరిగింది. ప్రస్తుతం రూపాయిలో పావులా వంతు మాత్రమే కాయలు వచ్చాయి. ఎన్ని మందులు కొట్టిన కాత నిలువలేదు. ఏటా ఏదో ఒకవిధంగా నష్టపోవాల్సి వస్తోంది. – కోడి శ్రీను, కౌలు రైతు, బాలాజీపేటఅక్కడక్కడ కాయలు ఉన్నాయి నాకున్న ఐదెకరాల మామిడి తోటలో పూత, పిందె రాలిపోగా ఇప్పుడు అక్కడక్కడ కాయలు ఉన్నాయి. ఈ కాయల కోసం కోతులు రాకుండా కాపలా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న కాయల డబ్బులు తోటకు కాపలా ఉన్న వారి జీతాలకే సరిపోయేలా లేవు. – పి.శ్రీరాములు, కొత్తపేట తోటల్లో తామర పురుగు ఉధృతి రాలుతున్న పిందె, కాయలు వరుస నష్టాలతో రైతుల్లో ఆందోళన -
పురుగు మందుల వాడకం తగ్గించాలి
● చైనా మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్ ● మానుకోట ఏఎంసీలో మిర్చి పరిశీలన మహబూబాబాద్ రూరల్: రైతులు మిర్చి సాగులో పురుగు మందుల వాడకం తగ్గించాలని చైనా దేశ మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్ కోరారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును గురువారం సందర్శించి తేజ రకం మిర్చి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చైనా దేశంలో తేజ మిర్చి కంటే ఘాటు ఎక్కువగా, తక్కువగా ఉండే మిర్చిని పండిస్తారని, అయినా భారతదేశంలో పండే తేజ రకం మిర్చిని దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. చైనా ప్రజలు వంటల్లో భారతదేశ మిరప కారాన్ని ఉపయోగిస్తారని, గత సంవత్సరం చైనా దిగుమతి చేసుకున్న తేజ రకం మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండడంతో సుమారు 100 కంటైనర్లు వెనక్కి పంపించారన్నారు. రైతులు మిర్చిలో ఆకులు, గింజలు లేకుండా శుభ్రంగా ఉండే విధంగా, తేమ లేకుండా మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ మాట్లాడుతూ.. చైనా వ్యాపారులు ఇక్కడి మిర్చి శాంపిల్ తీసుకుని వెళ్లి పరీక్ష చేసుకుంటారని, ఆ పరీక్షలో పురుగు మందుల అవశేషాలు తక్కువగా ఉంటే దిగుమతి చేసుకుంటామని తెలిపారన్నారు. -
వసూళ్లు అంతంతే..
మహబూబాబాద్: ఇంటి పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీలు తడబడుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో.. వందశాతం వసూళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాగా, పన్నుల వసూళ్లలో కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ జిల్లాలో మొదటిస్థానంలో ఉండగా మరిపెడ మున్సిపాలిటీ చివరిస్థానంలో ఉంది. పన్నుల వసూళ్లపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది. అయితే సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల అభివృద్ధి కుంటుడుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. రాష్ట్రవ్యాప్తంగా 131 మున్సిపాలిటీలు ఉండగా.. జిల్లాలోనే ఐదు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు, డోర్నకల్లోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు, తొర్రూరులోని 16 వార్డుల్లో 21,451మంది ఓటర్లు ఉన్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 15,945 మంది ఓటర్లు, మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 13,687 మంది ఓటర్లు ఉన్నారు. 2025 –26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు) ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా అఽధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక సంవత్సరం జిల్లా వెనుకబడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 75శాతం వసూలు చేయగా.. ఈసారి ఇప్పటి వరకు 60.88శాతానికే పరిమితమైంది. కేసముద్రం మున్సిపాలిటీ 68.57శాతం వసూలు చేసి జిల్లాలో టాప్లో ఉంది. మున్సిపల్ ఎన్నికల కారణంతోనే.. ఈఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల జరగడం వల్ల పన్నుల వసూళ్లలో ఆలస్యమైనట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ మానుకోట పన్నుల వసూళ్లలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. కమిషనర్ రాజేశ్వర్ పన్నుల వసూళ్లలో శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతోంది. ఐదు రోజులు మాత్రమే.. ఈనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆలోపు బిల్ కలెక్టర్లతో పన్నుల వసూళ్ల వేగం పెంచితేనే కొంతమేర అయినా లక్ష్యం సాధిస్తారు. లేకుంటే జిల్లా వెనుకబడుతుంది. కాగా, పన్నుల వసూలు కమిషనర్లకు సవాల్గా మారింది. ఎన్నికల వల్లే పన్నుల వసూళ్ల శాతం తగ్గింది ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల వల్ల పన్నుల వసూళ్లు ఆలస్యమైంది. కానీ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పన్నుల వసూళ్ల వేగం పెంచాం. దాని వల్లే 60.88 శాతం వసూలు చేశాం. వేగం పెంచి వసూలు చేస్తాం. – రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ ఇంటి పన్నుల సేకరణలో మరిపెడ మున్సిపాలిటీ చివరి స్థానం కేసముద్రం మున్సిపాలిటీ మెరుగు.. మానుకోట వెనుకడుగు అధికారులు నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న అభివృద్ధి ఐదు రోజులు మాత్రమే గడువుపన్నులపైనే ఆధారం.. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర ఖర్చులు పన్నుల వసూళ్లపైనే ఆధారపడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 143మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. సంఖ్య సరిపోవడం లేదు. కాగా, కార్మికుల సంఖ్య పెంచాలని సీడీఎంఏను కోరారు. అయితే సీడీఎంఏ మాత్రం ఇంటి పన్నులు పెంచుకుని అధిక ఆదాయం పొంది, కార్మికులను పెంచుకోవాలని వారికి వివరించింది. దీనిని బట్టి చూస్తే పన్నులపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది. మున్సిపాలిటీ గృహాల డిమాండ్ వసూలు శాతం సంఖ్య (కోట్లలో) (కోట్లలో)కేసముద్రం 6,440 1.05 0.72 68.57 తొర్రూరు 6,712 4.85 3.27 67.42 మానుకోట 22,970 6.80 4.14 60.88 డోర్నకల్ 3469 1.43 0.74 51.75 మరిపెడ 5619 2.09 0.92 44.02 -
కఠిన చర్యలు తప్పవు
మహబూబాబాద్ రూరల్/నెహ్రూసెంటర్ : గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆటో అడ్డా, ఆర్టీసీ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తుపదార్థాల విని యోగంపై సోదాలు చేపట్టి గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. గంజాయి స్వాధీనం నెల్లికుదురు : మండలంలోని కాచికల్ స్టేజి వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. తొర్రూర్ మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ గంజాయి తాగుతూ కనిపించినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయించే నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉన్నట్లు, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉపాధ్యాయుడికి గాయాలుమరిపెడ: బొలెరో వాహనం ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలైన సంఘటన మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సూర్య పెట్రోక్ బంక్ సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.రాజు విధులు ముగించుకుని బైక్పై మరిపెడకు వెళ్తున్నాడు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెలుతున్న బొలెరో వాహనం ఉపాధ్యాయుడి బైక్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఉపాధ్యాయుడు రాజు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి
డోర్నకల్: నూతన పాలకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కోరారు. డోర్నకల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026–27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్పై సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై మాట్లాడారు. మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగించి సత్ఫలితాలు రాబట్టాలని కోరారు. పాలకవర్గాలు మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అప్పుడే పాలనపై పట్టు వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.52,96,85,000 ఆదాయం, రూ.52,92,20,000 వ్యయంతో బడ్జెట్ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండేటి రాజకుమారి, వైస్చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్, కమిషనర్ బి.నిరంజన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మామిడాల
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మామిడాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి కమల్ కుమార్, అసిస్టెంట్ ఎన్నిక ల అధికారులుగా జీ.సునీత, ఎం.ప్రవీణ వ్యవహరించారు. న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఎన్నికల అధికారి కమల్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గెలుపొందినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఉపాధ్యక్షుడిగా వి.హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జంగం సిద్ధార్థ, సహాయ కార్యదర్శిగా కొర్రమున్న, కోశాధికారిగా కాసాని మౌనిక, మహిళా ప్రతినిధిగా ఎన్.రాజమణి, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా బుర్ర శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ ఎన్నికై నట్లు ప్రకటించారు. -
మహిళల గౌరవాన్ని కాపాడాలి
హన్మకొండ అర్బన్: మహిళల గౌరవాన్ని కాపాడినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గార్డియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ పి.స్వర్ణలత అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో ‘డిగ్నిటీ అండ్ డ్రైవ్ ఫ్యూయలింగ్ ఉమెన్ సేఫ్టీ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛ, గౌరవాన్ని ఇచ్చినప్పుడే వారు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారన్నారు. తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థిని కావడం గర్వకారణమని పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ్చందర్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యతని అన్నారు. మహిళలు ప్రతిభ, మేధస్సుకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా నిర్వహించిన టెక్నికల్ సెషన్లో వివిధ కళాశాలల ఉపన్యాసకులు, పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించగా, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అతిథులను శాలువాలు, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అరుణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం.అరుణ, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర కళాశాలల ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో డాక్టర్ స్వర్ణలత -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
రేగొండ: అప్పుల బాధతో బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంగల రవీందర్ (49) అప్పులు తెచ్చి ఇటీవల నూతన ఇల్లు నిర్మించాడు. బుధవారం భార్య, కొడుకుతో కలిసి పొలం దగ్గరకు వెళ్లాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలు గుతోందని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిఽధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేసి గందరగోళం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ సన్ప్రీత్సింగ్ -
ఆగస్టు 21 నుంచి ఆర్థోపెడిక్ సర్జన్స్ సదస్సు
కాశిబుగ్గ: తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 23వతేదీ వరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు బాధ్యులు తెలిపారు. సదస్సు సందర్భంగా బుధవారం ఎంజీఎంలో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రస్థాయిలో జరగనున్న ఈ సదస్సు కోసం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నా రు. ఇందులో పాల్గొనే నిర్వాహక సభ్యులు, వైద్యులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, ప్రస్తుతం ఎర్లీ బర్డ్ ఆఫర్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్ పి. విజయ్చందర్రెడ్డి, సెక్రటరీ రాంకుమార్రెడ్డి, కోశాధికారి దిడ్డి శ్రవణ్కుమార్, వైద్యులు జె.వెంకటేశ్వర్లు, సుధీర్కుమార్, అశోక్, డాక్టర్ డి.మహేశ్వర్, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
హన్మకొండ: సహకార సంఘాలను బలోపేతం చేయాలని వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో వరంగల్ డీసీసీబీ మహాజన సభ నిర్వహించారు. ఈ సభకు చాహత్ బాజ్పాయ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ డిపాజిట్ సేకరణ, రుణవితరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, లాభాల దిశగా వరంగల్ డీసీసీబీ ముందుకు సాగుతోందన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు సమయానికి రుణాలు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. పీఏసీ యాక్సిలరేటరీ ప్రోగ్రామ్ కింద నాబార్డు సహకారంతో నాలుగు సంఘాలకు డ్రోన్లు, జన ఔషధి కేంద్రాల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇదే దారిలో ఇతర సంఘాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రావాలని సూచించారు. బ్యాంకు పరిపాలన నివేదిక, 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను మహాజనసభలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.195.58 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టగా మహాజన సభ ఆమోదం తెలిపింది. ఈ మహాజన సభలో నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జిల్లా సహకార అధికారులు సంజీవరెడ్డి, నీరజ, వాల్యానాయక్, కోదండ రాములు, వరలక్ష్మి, రామ్మోహన్, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, ఓఎస్డీ విజయలక్ష్మి డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీజీఎం అశోక్, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ చాహత్ బాజ్పాయ్ -
మత్తు పౌడర్ విక్రయదారులకు జైలు శిక్ష
వరంగల్ లీగల్: మత్తు పౌడర్ తరలించిన నేరంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణ్రావు, పూసల చైతన్యకుమార్, లింగాల సైదులుకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.రెండు లక్షల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి అపర్ణాదేవి బుధవారం తీర్పు వెలువరించారు. 2023 జనవరి ఒకటిన గుంటూరు నుంచి హైదరాబాద్కు మత్తు పదార్థాలు తరలించేందుకు కారులో బయలు దేరారు. మార్గమధ్యలో హనుమకొండ అలంకార్ జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు వారు చిక్కారు. కారు తనిఖీ చేయగా కిలో అల్ప్రొజోమ్ మత్తు పౌడర్ దొరికింది. వెంటనే నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి విచారణ చేయగా నేరం రుజువైంది. నేరస్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.రెండు లక్షల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. -
ఎన్జీఓల సాయంతో మానవ అక్రమ రవాణా నివారణ
హన్మకొండ: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సాయంతో వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణాను నిర్మూలించవచ్చని వరంగల్ పోలీసు కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవాసంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన బుధవారం వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణ నిర్మూలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇంకా వెట్టిచాకిరి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణకు గురైన వ్యక్తులు వెట్టిచాకిరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. చట్టం ప్రకారం కొన్ని అంశాలను ఆధారం చేసుకుని స్వచ్ఛంద సంస్థలు గుర్తించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు అధిక వేతనాల ఆశ చూపి ఎక్కువ పనిగంటలు చేయించుకుంటారని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పనిప్రాంతాలు, గ్రామాల నుంచి వలస వెళ్తున్న ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. వెట్టిచాకిరిలోకి నెడితే బీఎన్ఎస్, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, 1976 ప్రకారం చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ డాక్టర్ గోపికారాణి, సీడబ్ల్యూసీ సభ్యులు సుధాకర్, సుజాత, డేవిడ్, చైల్డ్రైట్స్ అడ్వకసీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్ఎంఎం కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, సిబ్బంది ఇక్బాల్సాషా, అజయ్ కుమార్, ప్రదీప్, ప్రసాద్, సుదర్శన్, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం చేరుకోవాలి
హన్మకొండ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్యం చేరుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్ల వంద శాతం సాధించాలన్నారు. ఈ నెల 31 వరకు అన్ని 33 కేవీ ఫీడర్లలో జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ సర్వీస్ల మంజూరు వేగంగా పూర్తి చేయాలని కోరారు. ‘జుగా’ పథకంలో మౌలిక వసతులు పూర్తయిన వాటికి వెంటనే మీటర్లు అమర్చాలని సూచించారు. వేసవి కార్యాచరణలో భాగంగా ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు చేపట్టి ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ ఇంటర్ లింకింగ్ లైన్స్ పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ఈ లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, సీజీఎం ఆర్.చరణ్ దాస్, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, మల్లికార్జున్, కృష్ణ మోహన్, జయరాజ్, వెంకట కృష్ణ, ఉపేందర్, వేణుమాధవ్, వాసుదేవ్, ప్రభావతి, డి.ఈలు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
● కంబాలపల్లిలో ఘటన మహబూబాబాద్ రూరల్ : కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు, 108 ఈఎంటీ బంగారి, పైలెట్ ప్రేమ్చంద్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గజ్జి ఎర్రయ్య (55) తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనులకెళ్లి ఇంటికి వస్తున్నాడు. రోడ్డు దాటుతూ మలుపు తిరుగుతుండగా మహబూబాబాద్ వైపు నుంచి గూడూరు వైపునకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎర్రయ్యకు తీవ్రగాయాలుకాగా చికిత్స నిమిత్తం 108లో మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రైలు ఎక్కబోతూ జారిపడి మహిళ.. ఖిలా వరంగల్: రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ మహిళ దుర్మరణం చెందింది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్ల పల్లి గ్రామానికి చెందిన బుర్రి మౌనిక(35) బుధవారం సికింద్రాబాద్కు వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. ప్లాట్ఫామ్పై మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ప్రమాద వశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలి వివరాలు సేకరించారు. ఎంజీఎం మార్చురీలో శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని భర్త సాంబయ్యకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
మార్కెట్కు మూడు రోజుల సెలవు
వరంగల్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ‘శ్రీరామనవమి’(ప్రభుత్వ సెలవు), శనివారం యార్డుబంద్, ఆదివారం వారాంతపు సెలవు ఉన్నందున మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవన్నారు. తిరిగి సోమవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. రైతులు, వ్యాపారులు, గుమస్తాలు, దడువాయిలు, కార్మికులు ఈ విషయం గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం కోరారు. దరఖాస్తుల గడువు పొడిగింపు న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చే (ఈవీ స్కూటర్, ఈవీ ఆటో, సోలార్ యూనిట్స్) పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తుకు గడువును వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సర్క్యూట్హౌస్ రోడ్డులోని తుషారా స్కూల్ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ‘చీఫ్ డి మిషన్’గా డీవైఎస్ఓ అశోక్వరంగల్ స్పోర్ట్స్: ఛత్తీస్గఢ్లో ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా ఫస్ట్ ఎడిషన్ ట్రైబల్ క్రీడాపోటీలకు చీఫ్ డి మిషన్గా హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ నియమితులయ్యారు. అశోక్కుమార్ ఎంపిక కావడంతో డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జేఎన్ స్టేడియంలోని డీఎస్ఏ ఆఫీస్లో ఆయనను అభినందించా రు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ ఈ బాధ్యత తనకు దక్కిన గౌరవమని, తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించా లని ఆకాంక్షించారు. డీవైఎస్ఓను అభినందించిన వారిలో కోచ్లు నరేందర్, శ్రీమన్నారాయణ, నవీ న్, రమేశ్, విష్ణువర్ధన్, శంకర్, దేవిక, ప్రభుదాస్, జయపాల్, డీఎస్ఏ సూపరింటెండెంట్ విజయశ్రీ, సిబ్బంది జ్యోతి, ప్రదీప్, మహేందర్రెడ్డి ఉన్నారు. జువైనల్ హోంకు బాల నేరస్తులు కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్లో ఎవరూ లేని సమయంలో ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో బాల నేరస్తులపై పోక్సో కేసు నమోదు చేసి జువై నల్ హోంకు తరలించినట్లు కాటారం డీఎస్పీ ఎ. సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 23న చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన బాల నేరస్తులను జువైనల్ కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్.. రిమాండ్ చేయగా వారిని వరంగల్లోని అబ్జర్వేషన్ హోంకు తరలించినట్లు వెల్లడించారు. వారి వెంట ఎస్సై కె. పవన్కుమార్ ఉన్నారు. ఆయుర్వేద విద్యార్థులపై యువకుల దాడికాశిబుగ్గ: వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల రాత్రివేళ హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. రోడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనం విషయంలో స్థానిక యువకులకు, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులను స్థానిక యువకులు మద్యంమత్తులో చితకబాదినట్లు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థులకు బలంగా గాయాలైనట్లు సమాచారం. అయితే ఈదాడి విషయంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా ఈ ఘటన బుధవారం తమ దృష్టికి వచ్చిందని, వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. -
సెకండ్ కారు కొంటున్నారా..!
ఖిలా వరంగల్ : సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో విక్రయిదారుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది. విక్రయదారులు సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలు పెట్టి డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి కారు బుక్ చేసుకోవాలని కోరుతుంటారు. డబ్బు పంపి మోసపోతున్న ఉదంతాలు లేకపోలేదు. ఢిల్లీ, హైదరాబాద్, ఇతర జిల్లాల కార్లు చూపుతామంటారు. ప్రమాదం జరిగిన వాటికి మెరుగులద్ది కొనుగోలుదారులకు అంటగట్టి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లు అంటూ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలుదారులు వాహన కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఏ, పోలీసు అధికారుల సూచిస్తున్నారు. సాధారణంగా కొత్త వాహనం కొంటే వాహనదారులు పక్కాగా రిజిస్టేషన్ చేయించుకుంటారు. దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు చేసే సమయంలో వాటి రికార్డులు, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, రోడ్డు టాక్స్ వంటి వాటిని చూడడం సర్వసాధారణం. అయితే ఆ వాహనం ఎవరి పేరున ఉంది? దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోలేకపోతే ఇబ్బందులు తప్పవు. హత్యలు, దోపిడీలకు వినియోగించిన వాహనాలు అంటగట్టే అవకాశం.. కొంత మంది నేరగాళ్లు హత్యలు, దోపిడీలకు వినియోగించిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తారు. ఆ వాహనాలను కొనుగోలు చేసిన అమాయకులు చిక్కుల్లో పడే పరిస్థితి ఆక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రవాణాశాఖ వాహనాలకు సంబంధించిన డేటా అంత ఆన్లైన్లోనే పొందపర్చింది. వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్టీఏ, ట్రాఫిక్ ఆధికారులను సంప్రదించి కేసుల వివరాలు సేకరించి సెకండ్ వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇంజన్.. ఇంధనం.. ముందే టైర్లు చూసి ఇంజన్ పరిశీలించాలి. ఆయిల్ గేజ్ చూడాలి. ఇంజన్ ఆన్ చేసిన సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా.. లీకై నా.. పొగ వచ్చినా ప్రమాదమే. ఇంజిన్ చుట్టూ బాటమ్కు కంపెనీ సీల్ ఉంటుంది. వీటికి ఏదైనా బిడింగ్, ప్యాచ్లు, టింకరింగ్ వంటివి చేశారా చూసుకోవాలి. ఇంజన్, ఛాసిస్, సంఖ్యత ఆర్సీలో పొందుపరిచిన నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వీటిని పరిశీలించడం తప్పనిసరి.. కారు తీసుకోవడం కాదూ వీటిని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. వీధిగా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఆర్సీ, బీమా, కాలుష్య నివారణ ధ్రువీకరణ పత్రం, అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్ఓసీ పొందిన 15 రోజులలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహనం కాలపరిమితి 15 ఏళ్లు. వాహన మోడల్, కంపెనీ( ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. వాహన అద్దాల చివరన కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి ఉంటారు. అవి లేకపోతే మార్చారని గ్రహించాలి.జిల్లాలు: సెకండ్ హ్యాండ్ బైక్, కార్ల షోరూంలు వరంగల్ 08 హనుమకొండ 28 జనగామ 02 జేఎస్ భూపాలపల్లి 01 ములుగు 01 మహబూబాబాద్ 02కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. సామాజిక మాధ్యమాల్లో చూడొద్దు కారుపై కేసులు, ఫైన్లు పరిశీలన తప్పని సరి ఇంజన్ కండీషన్, మోడల్ను పరీక్ష చేయించుకోవాలి -
సమర్థ్ధ పాలకుడు ప్రతాపరుద్రుడు
హన్మకొండ కల్చరల్ : కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు సమర్థ పాలకుడని, ఆయన పాలన దక్షిణ భారతదేశ చరిత్రలో ముఖ్యమైనదని చరిత్ర తెలియజేస్తోందని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. బుధవారం వేయిస్తంభాల ఆలయ ‘కుడా’ గార్డెన్లో దేవరకొండ విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఐదో కాకతీయుల రాజు ప్రతాప రుద్రదేవుడి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతాపరుద్రుడి చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి దేవాలయాలు నిర్మించారని తెలిపారు. విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. ప్రజల కోసం తాగునీరు, రైతులు సుభిక్షంగా ఉండాలని సాగునీరు కోసం గొలుసుకట్టు చెరువులు నిర్మించారని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, సురేందర్, రజవలి, జక్కుల రవీందర్ యాదవ్, తాడిశెట్టి విద్యాసాగర్, తోట పవన్కుమార్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, సోమయ్య, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఘనంగా ప్రతాపరుద్రుడి జయంతి -
రోగులను పట్టించుకోవడం లేదు
మహబూబాబాద్ రూరల్: మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ బుధవారం జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్య సేవలపై ప్రస్తావించారు. మహబూబాబాద్ పట్టణం జిల్లాగా ఏర్పడకముందు 100 పడకల ఏరియా ఆస్పత్రిగా ఉండేదని, జిల్లా ఏర్పాటుతో 300 పడకలకు అప్గ్రేడ్ చేశారన్నారు. దీంతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిందని, ఇది మంచి పరిణామం అయినప్పటికీ తదనంతరం వైద్య విధాన పరిషత్ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. వైద్య విధాన పరిషత్ వైద్యులు, డీఎంఈ, సంబంధిత వైద్య సిబ్బంది ఆస్పత్రిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఆస్పత్రికి రోజుకు వెయ్యిమంది రోగులు వైద్యం కోసం వస్తుండగా వారికి సరైన సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు లేరన్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ప్రసూతి ఆస్పత్రిగాగా మార్చాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలని కోరారు. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే మురళీనాయక్ -
లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ నెహ్రూసెంటర్: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కల్టెర్ స్నేహ శబరీష్ అన్నారు. రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, ఇతర అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురోగతి తదితర అంశాలను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు సంబంధించి రూ.4,830.32కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా.. 2025 డిసెంబర్ నాటికి 75.15 శాతం వివిధ రుణ సహాయం అందించినట్లు తెలి పారు. రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. పేద ప్రజల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా తో డ్పాటునిచ్చే ప్రణాళికలు ఉంటే వాటిని పరిశీలించాలని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బ్యాంకర్లు ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. అదేవిధంగా ముద్ర లోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో నాబార్డ్ అధికారి రవి, ఎల్డీఎం యాదగిరి, డీఆర్డీఓ మధుసూదన్ రాజు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధి తొర్రూరు: ప్రజల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం చైర్మన్ శ్రావణ్కుమార్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కాగా.. కమిషనర్ శ్యాంసుందర్ బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. ఆదాయం, వ్యయం వివరాలతో పాటు వివిధ పథకాల ద్వారా ఆదాయాన్ని ఆశిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించిన బడ్జెట్లో ఆదాయం రూ.17.84 కోట్లు కాగా, వ్యయం రూ.17.83 కోట్లుగా ఆమో దం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడ్జెట్కు అనుగుణంగా నిధులు సమకూర్చుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఆర్థిక వనరుల పెంపుపై దృష్టి సారించాలన్నారు. పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మెనూ అమలు చేయాలి
కురవి: వసతి గృహాల్లో మెనూ పక్కాగా అమలు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాం నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏటీడీఓలు, పీఎంఆర్సీ స్టాఫ్, హెచ్ఎంలు, వెల్ఫేర్ అధికారులు, ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వందశాతం ఫలి తాలు సాధించేలా పనిచేయాలన్నారు. రికార్డులు, రిజిస్టర్లు ప్రతీరోజు నమోదు చేయాలని, ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఆర్.భాస్కర్, ఉపేందర్, రాములు, విజయ, సారయ్య, బాబు, సునీత, శ్రీకాంత్, సోమని తదితరులు పాల్గొన్నారు. వైద్య పరీక్షలు అవసరందంతాలపల్లి: వాహన డ్రైవర్లకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు అవసరమని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్సై పిల్లల రాజు ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎస్పీ హాజరై మాట్లాడారు. వాహన డ్రైవర్లు ప్రతీ మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాహనదారుల కంటిచూపు బాగుంటేనే.. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయన్నారు. వాహనదారులు రహదారి నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో తొర్రూరు సీఐ గణేష్, వైద్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో వసంతనవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చామంతిపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బ ంది పాల్గొన్నారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు సిద్ధం
కొనుగోలు కేంద్రాల వివరాలు ఐకేపీ : 52 పీఏసీఎస్ : 143జీసీసీ : 08ఇతర కొనుగోలు కేంద్రాలు : 01మొత్తం : 204యాసంగిలో 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంసాక్షి, మహబూబాబాద్: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, నిల్వలు, ట్రాన్స్పోర్టు మొదలైన అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైస్ మిల్లుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్, ఇతర అధికారులు ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ యాసంగి సీజన్లో 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈమేరకు 3,77,916 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఇందులో రైతుల అవసరాలు, తిండి గింజలకు, ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లకు 1,17,154 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన 1,18,480 మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు, 1,42,282 మెట్రిక్ టన్నులు సన్న రకాలు.. మొత్తం 2,60,762 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నారు. 65లక్షల గన్నీ బ్యాగులు అవసరం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు 65,19,076 గన్నీ బ్యాగులు అవసరం. అయితే ఇందులో 35,20,301 గన్నీ బ్యాగులు కొత్తవి, 29,98,775 గన్నీలు పాతవి అవసరం ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 5లక్షల గన్నీ బ్యాగులు పాతవి, 4,10,000 కొత్త గన్నీలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 31,10,301 కొత్తవి, 24,98,775 గన్నీలు పాతవి మొత్తం 56,09,076 సంచులు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రవాణా ఇబ్బందు లేకుండా.. కొనుగోలు చేసి కాంటా పెట్టిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీల సరఫరా కోసం టెండర్లు పూర్తి చేశా రు. గతంలో ఐదు సెక్టార్ల ద్వారా లారీల సరఫరా చేసేందుకు టెండర్ వేసి అంగీకారం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు పెట్టలేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి మరో రెండు సెక్టార్లు పెంచి మొత్తం మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, డోర్నకల్ సెక్టార్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో ఏడు సెక్టార్ల నుంచి ఒక్కో సెక్టార్కు 60 లారీల చొప్పున మొత్తం 430 లారీలు జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో.. జిల్లాలోని యాసంగి కోతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం 204 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ముందస్తు కోతలు ఉండే తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి మండలాల్లో ముందుగా ప్రారంభిస్తామని, దశలవారీగా ధాన్యం రాకను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. సర్వం సిద్ధం చేస్తున్నాం.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా లారీల సంఖ్యను పెంచడం, లోడింగ్, అన్లోడింగ్లో సమస్య రాకుండా చూసుకునేందుకు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎక్కువ రోజులు ఉండకుండా చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఉండేలా చూస్తున్నాం. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ 204 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిల్వల కోసం మిల్లర్లతో సమీక్షలు ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లుకొనుగోలు కేంద్రాల్లో పరికరాలు ఇలా.. పరికరాలు అవసరం ఉన్నవి కావాల్సినవి టార్పాలిన్లు 12,122 7,396 4,726 తేమశాతం కొలిచే యంత్రాలు 447 296 151 ఎలక్ట్రానిక్ కాంటాలు 761 736 25 మాన్యువల్ ప్యాడీ క్లీనర్లు 423 246 177 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు 31 06 25 ధాన్యం పరీక్షించే యంత్రాలు 235 216 19 డ్రయర్స్ 91 02 89 డిజిటల్ కాలిపర్స్ 236 216 20 -
గార్లలో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి
గార్ల: గార్ల రైల్వేస్టేషన్లో శాతవాహన, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ను స్థానికులు కోరారు. బుధ వారం గార్ల రైల్వేస్టేషన్లో ఆయన కు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్కు నూతన భవనం నిర్మించి, ప్లాట్ఫారాలపై ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. అదే విధంగా రైల్వేస్టేషన్ ప్లాట్ఫారాలపై రైల్వే రిజర్వేషన్ బోగీల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, నీడ కోసం రేకుల షెడ్లు నిర్మించాలని కోరారు. డీఆర్ఎంను కలిసిన వారిలో రైల్వే డీఆర్సీయూ కమిటీ సభ్యుడు జర్పుల లచ్చిరాంనాయక్, ఖాదర్బాబా, స్థానికులు కందునూరి ఈశ్వర్లింగం, రాధాకృష్ణ, కోల కుమార్గౌడ్, బబ్లు, పాషా, బాబు, వెంకన్న, మల్లేష్, రంగారావు, ప్రభాకర్, నాగరాజు, కృష్ణ, అనిల్, రామారావు ఉన్నారు. -
అసెంబ్లీలో ప్రస్తావన
వెంకటాపూర్ భూ ఆక్రమణలపై న్యూశాయంపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 324లో కబ్జాదారులు ఆక్రమించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. అసైన్డ్ భూమి మార్పిడి కావడానికి వీలు లేదని పీఓటీ చట్టంలో ఉందన్నా రు. అలాంటిది అధికారుల సహకారం లేకుండా పే దలకు అసైన్డ్ చేసిన భూమి కేవలం ఒకే కుటుంబా నికి ఎలా మార్పిడి చెందుతుందని ప్రశ్నించారు. ఈ భూమి విషయంలో 20 సంవత్సరాలుగా గ్రా మానికి చెందిన దళితులు, నిరుపేదలు ఆందోళనలు నిర్వహించి పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయినా పట్టించుకోవడం లేదని గళమెత్తారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలనికోరారు. కాగా, సదరు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని పార్టీ జిల్లా కమిటీ బా ధ్యులు మంగళవారం కూనంనేనికి వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. దీనిపై సాంబశివరావుకు పార్టీ జిల్లా పక్షాన కార్యదర్శి కర్రె భిక్షపతి ధన్యవాదాలు తెలిపారు. భూమి దక్కే వరకూ పోరాటాలు చేస్తుంటామన్నారు. నాయకులు టి. భి క్షపతి, ఎల్లేశ్, శ్రీనివాస్, కరుణాకర్, వెంకట్రాజం, రవి, రాజు, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 20267‘ఈ ఫొటోలోని యువకుడి పేరు పాశం రాజు. ఇటీవల తొర్రూరులో మన చద్దన్నం పేరిట చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ పెట్టాడు. సెంటర్ నిర్వహణకు 10 రోజులకో గ్యాస్ సిలి ండర్ అవసరం. ప్రస్తుతం సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచింది. బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.6వేల వరకు పలుకుతోంది. అంత వెచ్చించే స్థోమత లేక ఒకటి రెండు మిల్లెట్స్ మాత్రమే చేస్తున్నాడు. దీంతో పూర్తిగా గిరాకీ తగ్గి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. నెలకు రూ.16వేల అద్దె, సామగ్రి కొనుగోలు కష్టంగా మారడంతో కుటుంబ పోషణ భారమైంది’. ‘పై ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రేఖ–సోమయ్య దంపతులు. ప్రతీరోజు టిఫిన్ సెంటర్లో ఇడ్లీ, పూరి, దోస అమ్మేవారు. వారం రోజులుగా సిలిండర్ సరఫరా లేకపోవడంతో నాలుగు రోజుల నుంచి హోటల్ తెరవడం లేదు. ఇంట్లో ఇబ్బందులు ఎదురుకావడంతో ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై చపాతి, ఇడ్లీ తయారు చేసుకొని హోటల్ వద్దకు వచ్చి అమ్ముతున్నారు. అయితే వేడిగా లేవని కస్టమర్లు తినడం లేదని, గ్యాస్ కొరత తీరిస్తే తప్ప తమ కుటుంబం గడవదని సోమయ్య దంపతులు వాపోతున్నారు’. -
కష్టపడితే అన్నీ సాధ్యమే
హసన్పర్తి: నిరంతం కష్టపడడంతోపాటు గెలవాలనే కోరిక బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మనోజ్కుమార్ అన్నారు. మంగళవారం కిట్స్ 37వ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి మనోజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో నైపుణ్యం పెంపొందుతుందన్నారు. ఐటీ కన్సల్టెంట్(అమెరికా సాఫ్ట్వేర్ డైవలపర్) సీవీఆర్ మోహన్ మాట్లాడుతూ శారీరక ధృఽఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా అతిథులను సన్మానించారు. కిట్స్ కళాశాల అదనపు సెక్రటరీ సతీశ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, కళాశాల ఏఓ రమేశ్రెడ్డి, పీడీ శ్రీనివాస్రెడ్డి,రిజిస్ట్రార్ కోమల్రెడ్డి, ప్రభా కరాచారి, స్పోర్ట్క్లబ్ విద్యార్థి అధ్యక్షులు విశాల్ ఆదిత్య, టి.కార్తీక్, క్లబ్ కో–ఆర్డినేటర్లు పి.లక్ష్మీరెడ్డి, వర్షిత, యశ్వంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బ్మాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు మనోజ్కుమార్ కిట్స్లో ఘనంగా క్రీడా వార్షికోత్సవం -
డీఎంహెచ్ఓకు ఉత్తమ ప్రతిభా పురస్కారం
నెహ్రూసెంటర్: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చేతుల మీదుగా డీఎంహెచ్ఓ రవిరాథోడ్ ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. జిల్లాలో టీబీ కేసులను గుర్తించడం, సమయానికి చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించడంపై వైద్య సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా పురస్కారం లభించిందని తెలిపారు. ప్రజలందరూ టీబీపై అపోహలు వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలినెల్లికుదురు: విద్యార్థులు భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి పేరు, ప్రతిష్టలు తీసుకొచ్చేవిధంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను మంగళవారం మండల అధికారులతో కలసి సందర్శించారు. మోడల్ స్కూల్లో లైబ్రరీ రూం, కంప్యూటర్ గది, భోజన సౌకర్యం, వంట గది సౌకర్యాలు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మోడల్ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పని తీరును విద్యార్థులతో కలసి పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో సక్రమంగా సరుకులు అందుతున్నాయా లేవా.. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందుతున్న సౌకర్యాలపై టీచర్ను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో నూతన అంగన్వాడీ భవనానికి ప్రపోజల్ పంపాలని ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, ఆర్ఐ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలి
మహబూబాబాద్: ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరస న కార్యక్రమం నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 8.23 శాతం నిధులు కేటాయించడం దారుణమన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ సమయంలో వారికి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేసి, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు మైస శ్రీనివాస్, చుంచు శ్రీశైలం, ఉపేందర్, భిక్షపతి, రామలింగా రెడ్డి, బాబురావు, విద్యాసాగర్ పాల్గొన్నారు. -
బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు జనగామ ఉపాధ్యాయురాలి ఎంపిక
● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై అధ్యయనం జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది. పట్టణ ప్రగతి పనులు వేగవంతం చేయాలి● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన – పట్టణ ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మేయర్ గుండు సుధారాణి మంగళవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, డ్రెయినేజీ శుభ్రత, చెత్త తొలగింపు పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి?హన్మకొండ చౌరస్తా: వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ ములుగురోడ్ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం రాజుపేట గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు రోదిస్తూ ఆస్పత్రి ఆవరణలో మృతదేహంతో ఆందోళన చేశారు. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు)లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు.. మానుకోటలో నాలుగు.. జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులలో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం.. ఆ ప్రకారమే 2029 ఎన్నికలు.. కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా డీలిమిటేషన్జిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
పునర్విభజనలో మరో తొమ్మిది!
‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు, మానుకోటలో నాలుగు, జేఎస్ భూపాలపల్లిలో రెండు, జనగామ, ములుగులలో యఽథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం.. ఆ ప్రకారమే 2029 ఎన్నికలు కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన – సాక్షిప్రతినిధి, వరంగల్ -
ఆందోళన.. అయోమయం
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధి విజయవాడలోని గాల (గుణదల) లోకోపైలెట్ డిపోపై రన్నింగ్స్టాఫ్లో ఆందోళన, అయోమయం నెలకొంది. ఇప్పటికే క్రూ లింక్ల తరలింపులు, అధిక పని భారంతో సతమతమవుతున్న రన్నింగ్స్టాఫ్కు గాల డిపో సమస్య కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2007లో 3 క్రూ లింక్లతో విజయవాడ డివిజన్లో గాల డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపో రన్నింగ్స్టాఫ్ విజయవాడ– బల్లార్షాకు 450 కి.మీ. అప్ అండ్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అతిపెద్ద డిపోగా గాల.. ప్రస్తుతం గాల డిపో 45 క్రూ లింక్లతో అతి పెద్దగా మారింది. కాజీపేట మాత్రం 15 క్రూ లింక్లతో నడుస్తోంది. గాల డిపో ఏర్పాటు కాకముందు కాజీపేట స్టాఫ్ పని చేసేది. ఒకప్పుడు లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లతో కలిపి 1,500 మందితో కాజీపేట డిపో నడిచేది. గాల డిపో ఏర్పాటు తర్వాత కాజీపేట స్టాఫ్ 700కు తగ్గింది. గాల కేంద్రంగా విజయవాడ–బల్లార్షా రన్నింగ్స్టాఫ్ 900 కి.మీ. త్రూ ఆపరేట్ చేయడం వల్ల దాదాపు 30 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తోంది. ఫలితంగా 130 కేఎంపీహెచ్ స్పీడ్తో 3వ లైన్లో ఆటోమెటిక్ సిగ్నల్స్ దాటుకుంటూ విధులు చేయడం రన్నింగ్ స్టాఫ్కు ఇబ్బంది అవుతోంది. దీంతో ఇప్పటికే గాల డిపోలో పని చేస్తున్న కొందరు అనారోగ్యాల బారిన పడ్డారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గాల డిపోను ఆపరేట్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2010 నుంచి వరంగల్లో డిపో ఏర్పాటు ఉద్యయం.. 2010 సంవత్సరం నుంచి గాల రైల్వే డిపోను ఎత్తివేసి వరంగల్లో డిపోఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బైపర్కేట్ కానున్న నేపథ్యంలో గాల డిపోను ఎత్తివేసి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వరంగల్లో ఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గాల డిపోను వరంగల్ తరలించాలి.. విజయవాడలోని గాల డిపోను వరంగల్కు తరలిస్తే తమపై అధిక పని భారం తగ్గుతుందని, ప్రయాణికుల భద్రత పెరుగుతుందని లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి వరంగల్, వరంగల్ నుంచి బల్లార్షాకు స్టాఫ్ విధులు ఉంటాయన్నారు. ఫలితంగా విశ్రాంతి ఉంటుందని, దీని వల్ల విధులకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు. కాగా, 500 మంది వరకు స్టాఫ్ వరంగల్కు వస్తారని, రైల్వే శాఖకు కూడా లాభాలు వస్తాయంటు పేర్కొంటున్నారు. కాగా, గాల డిపోపై రన్నింగ్స్టాఫ్ ఉద్యమ కార్యచరణలో భాగంగా సోమవారం జేఏసీ నాయకులు సికింద్రాబాద్లో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎం.రాఘవయ్యను, మంగళవారం మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరి సి.హెచ్.శంకర్రావును కలువగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. గాల(విజయవాడ) రైల్వే డిపోపై నెలకొన్న సందిగ్ధం 1వ తేదీ నుంచి బైపర్కేట్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు మారనున్న డిపో వరంగల్కు తరలించాలని లోకోపైలెట్లు, గార్డుల విజ్ఞప్తి రైల్వే జాతీయ నేతలు రాఘవయ్య, శంకర్రావుకు వినతిపత్రాలు అందజేత -
వరంగల్లో సెంట్రలైజ్డ్ కోచింగ్ డిపో ఏర్పాటు చేయాలి
విజయవాడలోని గాల రైల్వే డిపోను వరంగల్కు తరలించాలని కాజీపేట రైల్వే రన్నింగ్స్టాఫ్ జేఏసీ, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.శంకర్రావు, జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్కు సికింద్రాబాద్లో వినతి పత్రం అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి సౌత్ ఈస్ట్కోస్ట్ రైల్వే విభజన కానున్న నేపథ్యంలో అన్ని క్రూ లింక్లను వరంగల్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్యాదవ్, జేఏసీ కన్వీనర్ ఎం.రమేశ్, నాయకులు సంగ రమేశ్, ఆర్.రమేశ్, ఎస్.మహేశ్, ఎం.నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీకి నిధుల కొరత
మహబూబాబాద్ అర్బన్: జిల్లా పరిషత్ కార్యాలయాన్ని నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్రం నుంచి నిధులు రాక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉండడంతో కార్యాలయ నిర్వహణ భారంగా మారుతోంది. అధికా రులు తమ సొంత డబ్బులతో కార్యాలయంలో తాగునీరు ఏర్పాటు, పేపర్ బిల్లులు, బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పనులు చేయిస్తున్నారు. అయితే ఎంతకాలం తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టాలని వారు వాపోతున్నారు. కాగా, అధికారులు సొంతంగా వెచ్చించిన ఖర్చులు తిరిగి రాకపోగా, నగదు చెల్లించకుండా సామగ్రిని ఇచ్చేందుకు షాపుల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్లు, జిరాక్స్లకు ఉద్దెర పెట్టమని, సామగ్రి ఇచ్చేందుకు షాపుల వారు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ అవసరాలకు నిధులు చెల్లించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. -
కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాల్లో ‘అడ్వాన్స్సెస్ ఇన్లైఫ్ సైన్స్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్థాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కర్నాటి రాయ్.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆ విభాగం ప్రొఫెసర్ షిమిత, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి. వెంకటగోపినాఽథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్ సావనీర్ను వీసీ ప్రతాప్రెడ్డి అతిథులు ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్ కమిటీ హాల్లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి -
క్రీడలు ఆరోగ్యానికి దోహదం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సాయుధ దళ విభాగం (ఏఆర్)లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లింగయ్య క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎస్పీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలపై ఏఆర్ కానిస్టేబుల్ లింగయ్య అంకితభావాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్లో మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఆయన విజయాలు ఇతరులకు ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ తరఫున లింగయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయప్రతాప్, ఆర్ఎస్సై శేఖర్ పాల్గొన్నారు. -
కల్తీ కారం పట్టివేత
వరంగల్: ఏనుమాముల పీఎస్ పరిధిలోని లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో 60 కల్తీ కారం బస్తాలను పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ జువ్వాజి సురేశ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి తనిఖీలు నిర్వహించగా కల్తీకారం బస్తాలు లభ్యంకావడంతో సీజ్ చేశామన్నారు. సీనియర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.. పట్టుకున్న కల్తీకారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా, నిందితుడు గోనె సంపత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై రాజు పాల్గొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుళ్లు ఖిలా వరంగల్: రైలు పట్టాలపై మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని 100 నంబర్కు ఫోన్ రాగా.. సమీపంలోని మిల్స్కాలనీ బ్లూకోల్ట్స్ పోలీస్ కానిస్టేబుళ్లు వాజిత్, బాలరాజ్ హుటాహుటిన రైలు పట్టాలపైకి చేరుకున్నారు. ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడి అతడిలో మనోధైర్యం నింపారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. సరైన సమయానికి వచ్చి ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులకు స్థానికులు అభినందనలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ కురవి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల కేంద్రంతో పాటు మొగిలిచర్ల గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. కురవిలోని ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ అమలు చేయాలని, ప్రతీ రోజు అందించే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో పెండింగ్లో ఉన్న టాయిలెట్, కిచెన్షెడ్, వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధి లోని సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. మందులను సిద్ధంగా ఉంచాలని, వేసవి కాలంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పాఠశాల, వైద్యశాల ఇతర ప్రదేశాల్లో నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుని శానిటేషన్ నిర్వహించాలని వివరించారు. మొగిలిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. మొగిలిచర్లకు మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 10స్లాబ్ లెవల్, జగ్యా తండాలో 15 మంజూరు కాగా తొమ్మిది స్లాబ్లెవల్ పూర్తి అయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమ నాయక్, కురవి తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ కె.వీరబాబు, ఎంఈఓ బాలాజీ, సర్పంచ్ బాదావత్ లక్ష్మి పాల్గొన్నారు. -
హోడల్ బిజినెస్
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత.. హోటల్ నిర్వాహకుల బేజార్ సాక్షి, మహబూబాబాద్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం.. జిల్లాలోని హోటళ్ల నిర్వాహకులకు శాపంగా మారింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చిన్న హోటళ్లు మొదలుకొని పెద్ద రెస్టారెంట్ల వరకు నడవని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీకొట్లు ఉంటాయి. వీటిని నమ్ముకొని ప్రత్యక్షంగా పదివేలకు పైగా కుటుంబాలు, పరోక్షంగా పాలు, కూరగాయలు, వాటర్, ఇతర వస్తువుల సరఫరా చేసేవారు మరో పదివేల మంది బతుకుతున్నాయి. సిలిండర్ల కొరతతో వ్యాపారం తగ్గడం, హోటళ్లు మూతపడడంతో వీటినే నమ్ముకొని ఉన్న కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గిన ఐటమ్స్... పెరిగిన ధరలు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల హోటళ్ల రూపురేఖలు మారిపోయాయి. కళ్లముందు వేడివేడిగా పదార్థాలు చేసి అందించే పరిస్థితి నుంచి.. ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో చిన్న టిఫిన్ సెంటర్లలో కూడా ఇడ్లీ, వడ, బొండా, పూరి, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి టిఫిన్లు వేడివేడిగా దొరికేవి. కానీ ఇప్పుడు పూరి, ఇడ్లీ మాత్రమే అమ్ముతున్నారు. ఇవి కూడా ఆలస్యంగా చేయడం, చేసినవి సకాలంలో అమ్ముడుపోకపోతే చల్లారి పోతున్నాయి. అదే విధంగా గతంలో ప్లేట్ టిఫిన్ రూ.30 నుంచి రూ. 40 వరకు అమ్మేవారు. కానీ ఇప్పుడు ధరలు పెంచి రూ. 50 మేరకు అమ్ముతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. సగం హోటళ్లు మూత పడడంతో ఉన్న హోటళ్లు, కర్రీ పాయింట్లలో ధరలు పెంచినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం కమర్షిల్ సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. టీకొట్టు మీదనే కుటుంబ పోషణటీ కొట్టు నిర్వహణతో వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. పదిరోజులుగా సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. బ్లాక్లో సిలిండర్లు కొనే స్థోమత లేక వారం రోజులు టీకొట్టు మూసి వేశాను. దీంతో చిట్టీలు, ఇంటి కిరాయి, ఇతర ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై టీ చేసుకొని వచ్చి అమ్ముతున్నాను. – శ్రీలత, ఇందిరాగాంధీ సెంటర్, మహబూబాబాద్ కట్టెల పొయ్యిపై వంట చేసి నెట్టుకొస్తున్న కొందరు.. గ్యాస్లేక మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఐటమ్స్ తగ్గించి.. ధరలు పెంచిన నిర్వాహకులుజిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు కంపెనీ డీలర్లు కనెక్షన్లు హెచ్పీ 04 65,288ఇండెన్ 05 29,243భారత్ 03 41,648దీపం 00 34,314ఉజ్వల 00 32,379హాస్టల్స్(సీఎస్ఆర్) 00 8,659మొత్తం 12 2,11,531కమర్షిల్ కనెక్షన్లు 00 375 -
అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
● వనపర్తిలో ఘటన లింగాలఘణపురం : ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వనపర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరు మల్లయ్య (64) సోమవారం ఉద యం బావి వద్దకు వెళ్లి చెలుకలో గుంటుక తోలు తూ అక్కడే మృతి చెంది ఉన్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మల్లయ్య మధ్యాహ్నం వరకు రాకపోవడంతో అతడి భార్య అండాలు ఫోన్ చేసింది. ఎత్తకపోవడంతో అనుమానంతో బావి వద్దకు వెళ్లి చూడగా గుంటుక వద్దే చెలుకలోనే మృతి చెంది కనిపించాడు. గెట్ల పంచాయితీలో ఎవరైనా చంపారా..? లేదా గుండెపోటు వచ్చిందా? ఎద్దు తన్నితే చనిపోయాడా అనే అనుమానం నెలకొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారు. కల్తీ, కాలం చెల్లిన ఉత్పత్తులపై టాస్క్ఫోర్స్ కొరడా ● రూ.1,06,940 విలువైన ప్రొడక్ట్స్ స్వాధీనం గీసుకొండ: వరంగల్ గొర్రెకుంటకు చెందిన వెల్ మార్క్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లో గడువు దాటిన, పాడైన ఉన్న దాదాపు 16 రకాల రూ.1,06,940 వి లువైన ఉత్పత్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. టాస్స్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు సిబ్బందితో మార్క్ కంపెనీ నడుపుతున్న కింగ్ స్టన్కు చెందిన తయారీ, డిస్ట్రిబ్యూషన్ గోదాంలో దాడులు నిర్వహించారు. ఇందులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల స్వీట్లు, ఖారా, మురుకులు, లాలిపాప్స్, మ్యాంగో, ఫ్రూటీ, కాజా ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాశిబు గ్గకు చెందిన కంపెనీ ఓనర్ కింగ్ స్టన్తోపాటు సీజ్ చేసి ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తికి అప్పగించారు. -
‘వాహన్ పోర్టల్’ సేవలు షురూ!
ఖిలా వరంగల్ : వాహన వివరాలు ఇక నుంచి వాహన్ పోర్టల్లో కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వాహనాలు, లైసెన్సులు తదితర సేవలను వాహన్ పోర్టల్లో అందిస్తుండగా.. హైదరాబాద్లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సోమవారం వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ డీటీసీ సురేశ్రెడ్డి పర్యవేక్షణలో వాహన షోరూంలలో ఈ పోర్టల్ను ప్రారంభించారు. గతంలోనే వాహన్ పోర్టల్పై షోరూంల యజమానులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయితే వాహన దారులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి. సేవలు అందేదిలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొ చ్చిన వాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందనున్నాయి. ప్రధానంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలు, ఎన్ఓసీలు, ఫిట్నెస్, పర్మిట్, బీమా, ఇంజిన్ ఛాసిస్ నంబర్వంటి సమాచారం ఈపోర్టల్ ద్వారా అందుతాయి. ఇక నుంచి పూర్తి పారదర్శకంగా సేవలు నమోదవుతాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాహన వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించిన పక్షంలోనూ ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే కూర్చున్న చోట నుంచే తేలికగా ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసుకునే అవకాశం దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ షోరూం సోమవారం ఈపోర్టల్కు అనుసంధానమైంది. తద్వారా ఏ రోజు విక్రయించిన వాహనాలు ఆ రోజే పోర్టల్లో నమోదవుతాయి. ఇదే క్రమంలో వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకులను అనుసంధానం చేశారు. ఈప్రక్రియతో బోగస్ ఫైనాన్స్ సంస్థల ఆటకు అడ్డుకట్ట వేసినట్లైంది. షోరూంల్లో పారదర్శకంగా సేవలు.. కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలన్నీ సోమవారం మధ్యాహ్నం వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. పోర్టల్ను పూర్తిస్థాయిలో అప్ డేట్ చేశారు. వాహన్ పోర్టల్ పూర్తి స్థాయిలో అమలుల్లోకి వచ్చింది. కొనుగోలు చేసిన చోట రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించింది. జిల్లాలు ద్విచక్రవాహనాలు కార్లు / షోరూంలు జీపులు వరంగల్ 1,85,865 24,791 23 హనుమకొండ 2,16,234 48,513 26 జనగామ 61,036 8,537 12 జేఎస్ భూపాలపల్లి 95,681 11,258 7 ములుగు 4,433 3,767 2 మహబూబాబాద్ 1,23,103 9,096 17 ప్రారంభించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని షోరూంల్లో ఇకనుంచి లాంఛనంగా అమల్లోకి ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే.. దేశవ్యాప్తంగా ఒకే విధానందేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ పోర్టల్ సేవలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇక నుంచి షోరూంల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలందుతాయి. ఎలాంటి జాప్యం ఉండదు. – సురేశ్రెడ్డి, డీటీసీ, వరంగల్ -
విద్యుత్ సరఫరా మెరుగు
హన్మకొండ: డిజిటల్ టెక్నాలజీ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఫీల్డ్ ఇన్నోవేషన్స్ వినియోగించి విద్యుత్ సరఫరా మెరుగుపరచడం, అంతరాయాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్ అవార్డులు అందుకుంటుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఇటీవల న్యూ ఢిల్లీలో అందుకున్న అవార్డులను సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ.. సీఎండీ, డైరెక్టర్లకు అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 12వ పీఎస్యూ ఎక్సలెన్స్ అవార్డు, ఇన్నోవేషన్ విభాగంలో ఇప్పా యి అవార్డు లభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకంలో ఈ అవార్డులు ఎన్పీడీసీఎల్కు రావడం గర్వంగా ఉందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు రాజుచౌహాన్, అశోక్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎం శ్రీనివాస్, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కాంగ్రెస్ది ప్రజారంజక బడ్జెట్
స్టేషన్ఘన్పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే చక్కటి బడ్జెట్ అని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3లక్షల 24వేల కోట్ల బడ్జెట్లో సబ్సిడీలు, పెన్షన్లు తదితర సేవలపై రూ.లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీల నేతలు కేవలం తమ ఉనికిని చాటుకునేందుకే బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేదల కోసం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుందని, రాష్ట్రంలో తెల్లరేషన్కార్డుదారులైన కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు. దేవాదులకు రూ.వెయ్యి కోట్లు కోరుతా దేవాదుల పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే కడియం తెలిపారు. దేవాదుల పనులు పూర్తి చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఒక్క ఘన్పూర్ నియోజకవర్గంలోనే లక్షా 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఏంఎసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, మార్కెట్, మున్సిపల్ వైస్చైర్మన్లు నూకల ఐలయ్య, నీల రాజమ్మగట్టయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు బెలిదె వెంకన్న, మంతెన ఇంద్రారెడ్డి, మందపురం అనిల్, ఇనుగాల వెంకటేశ్వర్రెడ్డి, బూర్ల శంకర్, కొంతం శ్రీను, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు దుంపల పద్మారెడ్డి, రాంరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ములుగు కోర్టులో బాంబు కలకలం
ములుగు: ములుగు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో 25 చిన్న ౖసైనెడ్ గ్యాస్ బాంబులను సోమవా రం పేల్చనున్నట్లు ఆదివారం జిల్లా కోర్టుకు మెయి ల్ చేశారు. తమిళ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసులను ఉపసంహరించుకోవాలని ఆ మె యిల్లో పేర్కొన్నారు. ఆదివారం సెలవుదినం కా వడంతో అధికారులు మెయిల్ను చూడలేదు. సోమవారం విధులకు హాజరైన కోర్టు అధికారులు మెయిల్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జిల్లా కోర్టుకు చేరుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని సు రక్షిత ప్రాంతానికి తరలించి కోర్టు ప్రాంగణాన్ని త మ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్తో కోర్టులోని ప్రతీ ప్రదేశాన్ని త నిఖీ చేశారు. ఇందులో బాంబు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎ క్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఇది ఆకతాయిల పనా? లేక ఏదైనా కుట్ర ఉందా అనే కో ణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తె లంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా, సోమవారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చరిక రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కోర్టు పరిస రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. డాగ్ స్క్వా డ్, బాంబు డిస్పోజల్ టీమ్తో పోలీసుల తనిఖీలు లభ్యంకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం -
మాజీ వీసీ లింగమూర్తి సేవలు చిరస్మరణీయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్. లింగమూర్తి సేవలు చిరస్మరణీయమని, అనేక పరిపాలన పదవులు నిర్వర్తించి గొప్పపాలనాదక్షుడిగా పేరుగడించారని కేయూ వీసీ కె. ప్రతా ప్రెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి యాదిసభను సోమవారం తెలంగాణ పూలే ఆశయసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సంగానిమల్లేశ్వర్ అధ్యక్షతన జర్నలిజం విభా గం సెమినార్హాల్లో నిర్వహించారు. ఈ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తు తం యూనివర్సిటీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల్లో లింగమూర్తి నియమించిన వారే 50శాతం మంది ఉండడం ఆయన పనితీరుకు గొప్ప నిదర్శనమన్నారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యావేత్తగా, పరిపాలకుడిగా లింగమూర్తి ఆదర్శవంతమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ ఇక్బాల్ అలీ, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ రిటైర్డ్ అధ్యాపకుల సంఘం జనరల్సెక్రటరీ వడ్డె రవీందర్, రిటైర్డ్ ప్రొఫెసర్లు గజ్జెల రామేశ్వరం,తౌటం శ్రీనివాస్, ఎం. సారంగపాణి, కేయూ పాలకమండలి సభ్యులు చిర్రరాజు, రమ, పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి చందామల్ల య్య, ఉపాధ్యక్షులు మెరుగు బాబుయాదవ్, జిల్లా అధ్యక్షుడు తాడూరి శాస్త్రి, కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు మాట్లాడారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
పోలీస్ అని చెప్పి.. డబ్బు తస్కరణ
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కురవి : పోలీస్ అని చెప్పి.. ఓ వ్యక్తి వద్ద నుంచి దౌర్జన్యంగా రూ.22, 300 తీసుకు న్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. ఎ స్సై కథనం ప్రకారం.. గత ఫిబ్రవరి 15వ తేదీన కురవి వీరభద్రస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జరుగుతోంది. మరిపెడ మండలానికి చెందిన పులిచింత శ్రీనివాస్.. మహిళల నృత్యం చూస్తున్నాడు. ఈ సమయంలో శ్రీనివాస్ వద్దకు కుర వి క్రైమ్ కానిస్టేబుల్ అని చెప్పుకుని ‘నువ్వు మహిళల వైపు అసభ్యకరంగా చూస్తున్నావ్.. అని నిన్ను అరెస్ట్ చేస్తున్న.. డబ్బులు ఇస్తే వదిలేస్తా లేనిపక్షంలో జైలుకు పంపిస్తా’ అని బెదిరించి అతడి దగ్గర రూ.18, 400 నగదును మహబూబాబాద్ మండలం గాంధీపురానికి చెందిన ఏర్పుల నాగరాజు తీసుకున్నాడు. అంతటి వదిలేయకుండా బాధితుడి ఫోన్పే ద్వారా రూ.3,900 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు బాధితుడు శ్రీనివాస్కు అనుమానం వచ్చి కురవి పీఎస్లో క్రైమ్ కానిస్టేబుల్ నాగారాజు అనే వ్యక్తి ఉన్నాడా? అని వాకబు చేశాడు. ఎవరు లేరని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడి ఫోన్పే వివరాలు సేకరించి నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
వేసవిలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజి యన్ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జా గ్రత్తలపై నిర్వహించిన సమావేశంలో ఆర్ఎం మా ట్లాడారు. వేసవిలో వేడి గాలి నుంచి తల రక్షణ కోసం కాటన్ వస్త్రం తలపాగగా ధరించాలని, విధులకు వెళ్లినప్పుడు కనీసం 5 లీటర్ల తాగు నీటి క్యాన్ ను వెంట తీసుకెళ్లాలన్నారు. రాగి, జొన్న జావతో పాటు మజ్జిగ, కొబ్బరి నీరువంటి పానీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తీవ్ర దాహం, తల, కళ్లు తిరగడం, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. సిబ్బంది ఆరోగ్యం బాగుంటేనే సంస్థ బాగుంటుందన్నా రు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లకు అందించే కరపత్రాలను ఆవిష్కరించారు. డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, పి.మహేశ్, ఆర్టీసీ డిస్పెన్సరీ వైద్యాధికారి శృతి, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయ భాను -
సబ్స్టేషన్ బోరు పరుల పాలు..
హన్మకొండ: కొందరు అధికారుల తీరుతో టీజీ ఎన్పీడీసీఎల్ పరువు మసకబారుతోంది. నవ్విపోదురు కాక నాకేంటి అన్న చందంగా టీజీ ఎన్పీడీసీఎల్లో ఓ సీనియర్ అధికారి తీరు ఉంది. అక్రమాలు నియంత్రించాల్సిన సదరు అధికారి తానే దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో దిట్ట అయిన ఆ అధికారి చివరకు సబ్ స్టేషన్ బోరు నీటిని కూడా వదలడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య ఇంజనీర్ నిర్వాకం సంస్థ పరువు తీసేలా ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పంట పొలాలకు సబ్స్టేషన్ బోరు నీరు.. 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో సబ్ స్టేషన్, సి బ్బంది అవసరాల కోసం ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బోరు తవ్వించి విద్యుత్ మోటారు బిగించింది. ఇదే విద్యుత్ స్టేషన్కు సమీపంలో టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ముఖ్య అధికారితో పాటు సమీప బంధువుల పంట పొలాలున్నాయి. ఈ పంట పొలాలకు ఈ ముఖ్య అధికారి తన అధికారంతో బోరు నీటిని అక్రమంగా వాడుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. సంస్థ నిధులతోనే బోరుకు మరమ్మతు.. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దేవోజీ తండాలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించింది. ఇదే సమయంలో సబ్ స్టేషన్, సిబ్బంది నీటి అవసరాల కోసం బోరు తవ్వించి మోటారు బిగించింది. ఈ బోరు నుంచి సదరు ముఖ్య అధికారి అక్రమంగా సాగు నీటి అవసరాలు తీర్చుకుంటున్నాడని విద్యుత్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్న ఏ ఒక్కరూ నియంత్రించడం లేదని విద్యుత్ ఉద్యోగ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బోరు మోటారు మరమ్మతుకు వస్తే బాగు చేయించే వరకు క్షేత్ర స్థాయి అధికారిని సదరు అధికారి తీవ్రంగా వేధించే వారనే ఆరోపణలున్నాయి. తన సొంత పొలానికి సాగు నీటిని వాడుకుంటూ మోటారు పాడైతే కూడా క్షేత్ర స్థాయి అధికారిని బెదిరించి సంస్థ నిధులతో బాగు చేయించి తన సాగు నీటి అవసరాలు తీర్చుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు కోకొల్లలు. దీనిపై యాజమాన్యం స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ అధికారి సాగు నీటి అవసరాలకు సబ్ స్టేషన్ బోరు వాడుకుంటున్న వైనం -
హుస్సేన్నాయక్కు మంద కృష్ణ పరామర్శ
గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాకు చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ తండ్రి లచ్చనాయక్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం రాత్రి హుస్సేన్ను పరామర్శించారు. తొలుత లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎడ్ల అశోక్రెడ్డి, చిలువేరు సమ్మయ్య గౌడ్, మేరెడ్డి సురేందర్, చెల్పూరు వెంకన్న, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. -
సమ్మెకు సన్నద్ధం కావాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు సమ్మెకు సన్నద్ధం కావాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో నిర్వహించిన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమావేశంలో సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒకే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం సరికాదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న వారికి ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీగా ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 26, 30న అన్ని డివిజన్ కార్యాలయాల ఎదుట, ఏప్రిల్ 2న అన్ని సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదేనెల 7న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్న నిర్వహించాలని, 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కో–కన్వీనర్ చందర్ సింగ్, కోశాధికారి ప్రశాంత్, జాయింట్ సెక్రెటరీ వెంకన్న, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, ట్రాన్సో కో కన్వీనర్ వెంకటేష్, జేఏసీ నాయకులు రవీందర్, సృజన, భరత్, పాండు, సలీం పాషా, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీశ్ రెడ్డి -
ఫోన్ కూడా ఎత్తడం లేదు
విత్తనాలు ఇచ్చే ముందు ఎంతో తియ్యగా మాట్లాడి పంట దిగుబడి రావడం లేదని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. రెండు ఎకరాల్లో రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేటట్లు లేదు. మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. – తాటి కొమ్మయ్య, రైతు కౌలు కూడా వచ్చేలా లేదుఎకరం చెలక నాలుగు వేలకు మునాబా(కౌలు)కు తీసుకుని ఆర్గనైజర్ మాటలు నమ్మి ఈజొన్న వేసిన. అసలు కంకులే రాలేదు. మొత్తం క్వింటా కూడా అయితయో కావో. మునాబా డబ్బులు, ఎరువులు, పురుగుమందులు, దున్నకం కూళ్లు అన్ని మీద పడుతున్నాయి. పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – బానోతు శారద, మహిళా రైతు ● -
పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తాం
మహబూబాబాద్: మానుకోట పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తామని, ప్రజలు వాహనాల్లోనే చెత్త వేయాలని, రోడ్లపై వేయకూడదని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యలపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘కొరవడిన పర్యవేక్షణ!’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందించారు. 11వ వార్డులో పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లను ఆదేశించారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ దగ్గరుండి కార్మికులతో ఏ క్యాబిన్ రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. భవానీగర్ తండాలో అసంపూర్తి కాల్వ వద్ద పరిసరాలను శుభ్రం చేయించారు.. పలు వార్డుల్లోనూ పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు. ఈమేరకు ఆయా ప్రాంతాల ప్రజలు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాహనాల్లో చాలా వరకు తరచూ మరమ్మతులు రావడంతో సమస్యలు వస్తున్నాయన్నారు. పారిశుద్ధ్య సమస్యను పాలకమండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్మికులు సక్రమంగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పరిహారం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకోలేదు
దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.3500 చెల్లించి కొనుగోలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. దిగుబడి రాకపోతే పరిహారం ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇచ్చిన విత్తనాలు వంద రోజుల పంట కాల పరిమితి ఉంటుంది. అందుకు తగినవిధంగా యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడి రాలేదు. – కత్తుల కుమార్, ఆర్గనైజర్ దిగుబడి వస్తుందని నమ్మించారు..దిగుబడి వస్తుందని నమ్మించారు. రెండు ఎకరాల్లో విత్తనాలు వేసిన దగ్గర నుంచి నీళ్లు పెట్టిన ప్రతీసారి మొక్కలు చనిపోతున్నాయి. విషయం చెబితే ఎన్నో రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదు. తీవ్రంగా నష్టం జరిగింది. కనీసం దున్నిన కూళ్లు కూడా వచ్చేలా లేవు. కంపెనీ వారు ఆదుకోవాలి. – వాసం పాపయ్య, రైతు● -
పెండింగ్ దరఖాస్తులపై దృష్టిపెట్టాలి
మహబూబాబాద్: ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు జవాబు దారీతనంగా ఉండి సేవలందించాలన్నారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పా రు. కాగా, ప్రజావాణిలో 146 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● మానుకోట మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామానికి చెందిన ఉప్పలయ్య తన భూమికి సంబంధించిన పాసుపుస్తకం ఇప్పించాలని వినతి అందజేశాడు. ● ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఆవుల పద్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని అధికారులు తెలపగానే.. ఉన్న ఇల్లు కూల్చివేసిన తర్వాత మంజూరు కాలేదని చెప్పారని, వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వినతిలో కోరింది. ● మానుకోట మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కె.వెంకటాద్రి 2023లో జరిగిన ప్రమాదంలో కుడి కాలు, చేయి కోల్పోవడం జరిగిందని, తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నాడు. వసతి గృహాల్లో మెనూ పాటించేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 146 వినతులు -
‘బయ్యారం’ నీటిని విడుదల చేయాలి
డోర్నకల్: డోర్నకల్ మండలంలో వరి పంటలకు బయ్యారం చెరువు నుంచి నీటిని విడుదల చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఫీడర్ చానళ్లు, ఓటీలు సక్రమంగా లేకపోవడంతో చెరువులకు నీరుచేరని పరిస్థితి ఉందన్నారు. ఆకేరు, పాలేరు వాగుల చెక్డ్యామ్లు గతంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రైతులు సాగు చేసిన వరిపంటలు మరో ఇరువై రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్నాయని, ఒక తడి నీరు అవసరమన్నారు. దీనికి నీటిపారుదల శాఖమంత్రి స్పందించి బయ్యారం చెరువు నుంచి డోర్నకల్ ప్రాంతంలోని వాగులకు నీటిని వదలడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి నెహ్రూసెంటర్: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు వాణిజ్య పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు రాములునాయక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాణిజ్య పంటలు సాగు చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో క్షణికావేశంలో గడ్డిమందుతాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తొందరపాటు నిర్ణయాలతో జీవితా లను ఆగం చేసుకోవద్దని సూచించారు. గడ్డిమందు నివారించాలని మంత్రులకు కలిసి కోరినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సభ్యుల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. డీఏఓ సరిత, హార్టికల్చర్ అధికారి మరియన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ జగదీశ్వర్, ఏడీఏ శ్రీనివాసరావు ఉన్నారు. -
కలెక్టర్ను కలిసిన మాజీ మంత్రి సత్యవతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఆకేరు, మున్నేరు వాగులు ఎండిపోయాయని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎస్సారెస్పీ జలాలు వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఎస్పారెస్పీ జలాలు విడుదల చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇప్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పుల వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది అందుబాటులో ఉండాలిగూడూరు: ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా మేనేజర్ బత్తిని మహేశ్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు 108 అంబులెన్స్ వాహనాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందించిన సేవల వివరాలను పరిశీలించారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా వాహనంలో ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. అంబులెన్స్లో ఉన్న మందులు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది హనుమంత్, ప్రశాంత్, లలిత, నాగరాజు, రామ్కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల ఇబ్బందులుడోర్నకల్: మున్సిపాలిటీలోని జెడ్పీహెచ్ఎస్ ఎదుట బురద రోడ్డుతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ ఎదుట డ్రెయినేజీ నిర్మాణం కోసం ఇరుపక్కలా రోడ్డును తవ్వారు. దీంతో భూమిలోని పైపులు పగిలి తాగునీటితో పాటు డ్రెయినేజీ మురుగునీరు రోడ్డుపైకి రావడంతో రోడ్డు బురదయమంగా మారింది. కాగా, పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్ఎం సోమయ్య సస్పెన్షన్ మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మోడల్ యూపీఎస్ స్కూల్ హెచ్ఎం సోమయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ సోమవారం తెలిపారు. సోమయ్యపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు, ఇతరుల నుంచి అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల అడ్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అదేవిధంగా పాఠశాల స్కావెంజర్కు వేతనం అందించడంలో అవినీతి జరిగిందని రుజువైందని అన్నారు. దీంతో ఎంఈఓ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేశామన్నారు. -
రికవరీలో రణం
అప్పు తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యంస్త్రీనిధి రుణం..సాక్షి, మహబూబాబాద్: స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. అయితే స్త్రీనిధి రుణాలు తీసుకున్న సంఘాలు తిరిగి సకాలంలో చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది కొత్త రుణాల లక్ష్యాలను చేరుకోవడంలో పాత బకాయిలు కొరగాని కొయ్యగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతీ నెల కిస్తీలు సక్రమంగా చెల్లించేలా చూడాల్సిన అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమని, దీంతో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని ఉన్నత అధికారులు అంటున్నారు. ఇచ్చిన రుణాలు ఇలా.. మహిళలు చేతి వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు, వ్యవసాయ పెట్టుబడులకు స్త్రీనిధి రుణాలు అందజేస్తారు. ఇందులో సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య, ఐశ్వర్య పేరిట రుణాలు ఇస్తారు. ఇందులో వారి ఆర్థిక పరిస్థితి, పెట్టే యూనిట్ ఆధారంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు రుణాలు ఇస్తారు. అయితే ఇందులో రూ. 50వేల లోపు రుణా లు 48గంటల్లో అందజేస్తారు. ఈ రుణాలకు ప్రతీ నెల కిస్తీల రూపంలో చెల్లించాలి. రికవరీలో జాప్యం.. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో పలువురు మహిళలు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 571 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో 6,981 సంఘాలు, 32,473 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో గతంలో తీసుకున్న రుణాలు రూ.80కోట్లు ఉండగా ఇందులో రూ. 50కోట్లు వసూలు కాగా.. రూ. 30కోట్లు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ బకాయిలు రూ. 20.905కోట్లు ఉండగా.. మొండి బకాయిలు మాత్రం రూ.10కోట్ల మేరకు ఉంటాయి. ఇందులో ప్రధానంగా మరిపెడ మండలంలో అ త్యధికంగా రూ.4.70కోట్లు, గూడూరు రూ.1.70కోట్లు, గార్ల రూ.1.20కోట్లు, బయ్యారం రూ. 2.22కోట్లు ఉండడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 81 ఎస్ఎల్ఎఫ్ల్లో 1040 సంఘాలు, అందులో 6,774 మంది సభ్యులు ఉన్నారు. వీరు తీసుకున్న రుణాల్లో మొత్తం రూ.15కోట్లకు గాను.. రూ.3కోట్ల మేరకు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ రికవరీ రూ.1.88కోట్లు ఉంది. మిగిలిన రూ. 1.12కోట్లు మొండి బకాయి పడ్డారు. అధికారుల ఉదాసీనత.. రుణాల రికవరీలో కీలక పాత్ర పోషించాల్సిన అధికా రుల ఉదాసీనత వల్లే బకాయిలు పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ స్థాయిలో సీఏలు, మండల స్థాయి సెర్ప్ అధికారులు, మున్సిపాలిటీల పరిధి లో మెప్మా, జిల్లా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆర్పీలు, సీఏలు మహిళల పేరిట రుణాలు తీసుకొని సొంత అవసరాలకు వాడుకోవడం, ఇందుకోసం అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఫిర్యాదులు ఉ న్నాయి. దీంతో కొన్ని సంఘాలు సకాలంలో కిస్తీలు చెల్లించకపోయినా.. పట్టించుకోవడం లేదని, అందుకోసమే మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని సీ్త్రని ధి అధికారులు చెబుతున్నారు. రికవరీ వేగవంతం చేస్తున్నాం..జిల్లాలో సీ్త్ర నిధి రుణాల బకాయిలు పేరుకుపోయిన మాట వాస్తవమే. సంఘాల సభ్యుల నుంచి సకాలంలో డబ్బులు రికవరీ చేయించడంలో కొందరు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.56కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు రూ.34కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాం. రుణాలు చెల్లించడంలో బకాయి పడిన 2,600 సంఘాలకు నోటీసులు ఇచ్చాం. సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని కోరుతున్నాం. మొండి బకాయిల కోసం రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నాం. –ఎస్.మధు, సీ్త్రనిధి జిల్లా బాధ్యులు● కొత్త రుణాల టార్గెట్కు బకాయిల అడ్డంకి.. అధికారుల ఉదాసీనతతో రికవరీలో వెనకడుగు పలు సంఘాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ ఎదుట ధర్నా మహబూబాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజ మౌళి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ వ్యవస్థకు చట్టబద్ధత లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా అక్రమ అరెస్ట్లు చేశారన్నారు. కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. మే నెల మొత్తం సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, దుర్గారావు, తిరుపతమ్మ, సులోచన, జ్యోతి, లలిత, ఉమా, సంధ్య, మల్లికాంబ పాల్గొన్నారు. -
అధిక ధర ఆశ చూపి.. నట్టేట ముంచి!
కొత్తగూడ: అధిక ధర ఆశ చూపి మొక్కజొన్న రైతులను నట్టేట ముంచారు. పాప్కార్న్ మొక్కజొన్న ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.. క్వింటాకు రూ.3500చెల్లించి తామే కొనుగోలు చేస్తామని సంబంధిత మొక్కజొన్న కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. దీంతో కొంతమంది రైతులు సాగుకు ముందుకు వచ్చారు. మండలంలోని తాటివారివేంపల్లి, రౌతుగూడెం, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 50ఎకరాల్లో సాగు చేశారు. విత్తనాలు ఇచ్చిన వారి సలహాలు, సూచనల మేరకు రైతులు సాగు చేశారు. అయితే మొక్కజొన్న ఎదగకపోవడం, కంకులు వేయకపోవడంతో రైతులు ఆర్గనైసర్ కత్తుల కుమార్ను నిలదీశారు. ఆయన పలుమార్లు పొలాలు సందర్శించి వివిధ రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదని రైతులు తెలిపారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గనైజర్ మాయ మాటలు నమ్మి మోసపోయామని రైతులు అంటున్నారు. పొలం వద్దకు రావాలని, తాము నష్టపోయామని చెప్పేందుకు ప్రయత్నం చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.ఎదుగుదల లేని పాప్కార్న్ మొక్కజొన్న ఆదుకోవాలని రైతుల వేడుకోలు -
నేటి నుంచి ఉద్యమకారుల స్మారక వారోత్సవాలు
కేయూ క్యాంపస్: భారత జాతీయ ఉద్యమకారులైన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ఈనెల 23నుంచి 30వ తేదీ వరకు స్మారక వారోత్సవాలను విద్యాసంస్థల్లో నిర్వహించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహా రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకతీయ యూ నివర్సిటీ మొదటి గేట్ నుంచి రెండో గేట్ వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, కేయూ నా యకులు వంశీ, అశోక్ నాయక్, అనిల్, వరుణ్, వీరన్న, మాన్సింగ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ వైపు అద్దెబస్సు డ్రైవర్లు!
హన్మకొండ: ఔట్సోర్సింగ్ డ్రైవర్ల నియామకాల్లో ఏజెన్సీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంది. ఏజెన్సీలు దళారులను నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లే లక్ష్యంగా వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వసూళ్ల గుట్టు తెలిసినా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికారుల కనుసన్నల్లోనే ఔట్సోర్సింగ్ నియామకాల దందా కొనసాగుతోందని చర్చించుకుంటున్నారు. ఆయా డిపోల్లో కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటానికి పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్లో డ్రైవర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతందని ఆశ చూపుతూ దళారుల ద్వారా ఔట్సోర్సింగ్ ఎజెన్సీలు లాక్కుంటున్నాయని అద్దె బస్సు యజమానులు మొత్తుకుంటున్నారు. తగ్గుతున్న డ్రైవర్ల అవసరం.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పర్యావరణ పరి రక్షణ పేరుతో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాయి. వాటిని విస్తరిస్తున్న క్రమంలో ఆర్టీసీలో డ్రైవర్ల అవసరం తగ్గుతోంది. ఈ క్రమంలో కొత్తగా డ్రైవర్ల నియామకాలు చేపట్టే అవకాశం లేదని, అలాంటప్పుడు పర్మనెంట్ పేరుతో తీసుకుంటున్న వారి పరిస్థితి ఏంటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ రీజియన్లో ఇప్పటికే వరంగల్–2 డిపో 115 విద్యుత్ బస్సులతో జేబీఎం సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా వరంగల్ మహానగరానికి మరో 100 విద్యుత్ బస్సులు రానున్న క్రమంలో హనుమకొండ డిపోను కేటాయించడానికి యాజమాన్యం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కొత్తగా ఆర్టీసీ సొంతంగా రెగ్యులర్ డ్రైవర్ల నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఏ మాత్రం లేదని సుస్పష్టం. మరోవైపు రాష్ట్ర రాజధానిలో సిటీ బస్సులుగా విద్యుత్ బస్సులు నడపనుండడంతో నగరంలోని ఆయా డిపోల్లోని డ్రైవర్లను ఇతర డిపోలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏ రకంగా చూసినా డ్రైవర్ల రిక్రూట్మెంట్కు అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకుల అభిప్రాయం. రూ.50వేల వరకు వసూళ్లు! పర్మనెంట్ పేరుతో అద్దెబస్సు డ్రైవర్లను లాక్కుంటూ వారి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేలకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా డబ్బులు చెల్లించని వారి నుంచి తర్వాత ఇచ్చే జీతాల నుంచి రికవరీ చేసుకునేల ఒప్పందం చేసుకుంటున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఇప్పటికే 50 మంది అద్దెబస్సు డ్రైవర్లను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకోగా తాజాగా భూపాలపల్లి డిపో పరిధిలో నలుగురు, హనుమకొండలోని మూడు డిపోల నుంచి 36 మంది, తొర్రూరు డిపో పరిదిలో 8 మంది. పరకాల డిపో పరిఽధిలో నలుగురు, జనగామ డిపో పరిధిలో ఇద్దరు అద్దె బస్సు డ్రైవర్లను ఔ ట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుని ఆర్టీసీకి డ్రైవర్లుగా పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర రీజియన్లలో అద్దె బస్సు డ్రైవర్లను ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవద్దని అక్కడి అఽధికారులు ఆదేశాలు జారీ చేశారని, అయితే వరంగల్ రీజియన్లో ఆర్టీసీ అధికారులు మాత్రం అద్దెబస్సు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని అద్దెబస్సు యజమానులు ప్రశ్నిస్తున్నారు. అద్దెబస్సులు కూడా ఆర్టీసీకి సేవలందిస్తున్నాయని, ఈ క్రమంలో అద్దె బస్సు డ్రైవర్లను తీసుకుంటే అద్దె బస్సులు నిలిచిపోనున్నాయని, దీనికి ఆర్టీసీ అధికారులతే బాధ్యత అని అద్దె బస్సుల యజమానులు పేర్కొంటున్నారు. దళారులను నియమించి లాక్కుంటున్న ఏజెన్సీలు పర్మనెంట్ అవుతుందని ఆశ చూపుతూ వసూళ్లు ఆర్టీసీ డిపో అధికారుల చేతి వాటం? -
ఉద్యమకారుడికి ఆర్థికసాయం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ కిడ్నీలు పాడైపోయి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం ‘ఆపన్న హస్తం అందించరూ’ అనే శీర్శికతో శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి పలువురు దాతలు స్పందించారు. ఆదివారం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స నిమిత్తం రూ. 10 వేలు అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పీఏ హరికృష్ణ తెలిపారు. అలాగే, 16వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సుంకరి శివ రూ. 3 వేలు, ఏనుమాముల మార్కెట్ మాజీ చెర్మన్ చింతం సదానందం రూ. 2 వేలు, గజ్జి రాజు రూ. 2 వేలతోపాటు పలువురు తమకు తోచిన సాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్ది మోసపూరిత బడ్జెట్
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితంగా ఉందని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారని, దానిలో పర్సంటేజీలు తీసుకొని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల విషయంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, ముత్యం వెంకన్న, గుండా రాజశేఖర్, అశోక్, నాయిని రంజిత్రెడ్డి, నరేశ్, లక్ష్మణ్, రాము, సరోజ, పల్లా రాంచంద్రారెడ్డి, ఆదిల్, మహబూబ్ పాషా, తేళ్ల శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్మీడియట్ దశ కీలకం
హన్మకొండ : విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ ఇరుకుళ్ల మునీందర్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఫిజిక్స్ వాలా’ ఆధ్వర్యంలో జేఈఈ, నీట్పై విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఫర్ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్తోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండేళ్ల ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ దశలో రెండు సంవత్సరాలు తమ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. వివిధ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్లో లాంగ్టర్మ్ కోచింగ్ ఇస్తామన్నారు. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విద్యా సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ ను హనుమకొండలో ఆఫ్లైన్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ రామన్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులు ఐఐటీ, నీట్లలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా ప్రోగ్రాం రూపొందించి అద్భుత ఫలితాలు సాధించామన్నారు. సదస్సులో ‘ఫిజిక్స్ వాలా’ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ మునీందర్ -
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి నాలుగో ర్యాంకింగ్ చదరంగం పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఆక్యుపంక్చర్ డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. చదరంగంలో మేధో సంపత్తి పెంపొందుతుందని, తల్లిదండ్రులు పిల్లలను చెస్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. చెస్ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా 66 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, ప్రేమ్సాగర్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌత్జోన్ పోటీలకు కేయూ జట్టుకేయూ క్యాంపస్: కొట్టాయంలోని ఎంజీ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఎం.త్రివేణి, బి.కావ్య, జి.ఐశ్వర్య, బి.మీనాక్షి, బి.నందిని, డి.సాయిప్రసన్న, పి.శ్రీలత, బి.రాహేలు, కె. శిరీష, డి.పూజిత, మహేశ్వరి, బి.సౌమ్య, జి.వెన్నెల, బి.నాగజ్యోతి, డి.వైష్ణవి, యు.సంజన జట్టులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జట్టుకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ కె.మధుకర్ కోచ్ కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ముస్త్యాలపల్లిలో యువతుల అదృశ్యం దామెర : ఇద్దరు యువతులు అదృశ్యమైన సంఘటన మండలంలోని ముస్యాలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శాతరాశి శ్రీవాణి శనివారం సాయంత్రం 6 గంటలకు బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అలాగే, ఈనెల 20న సిలువేరు మిన్ను అదృశ్యమైంది. మిన్ను డీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా అనారోగ్యంతో మధ్యలోనే మానేసి ఇంటివద్దే ఉంటుంది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శ్రీవాణి తల్లి జయ, మిన్ను తండ్రి శంకర్ ఫిర్యాదుమేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 8712685228, 8712685020 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు. పిడుగుపాటుకు ఆవు మృత్యువాత దేవరుప్పుల : మండలంలోని రామరాజుపల్లిలో పి డుగుపాటుకు శనివారం రాత్రి ఉప్పునూతుల నాగరాజుకు చెందిన పాడి ఆవు మృత్యువాత పడింది. ఆదివారం ఉదయం రోజువారీగా తన వ్యవసాయ పొలం వద్ద ఆవును చూసేందుకు వెళ్లగా పిడుగుపాటుకు మృత్యువాత పడి కనిపించింది. ఘటనా స్థలి ని పశువైద్య సిబ్బంది పరిశీలించారు. కాగా, పశువు మృత్యువాత పడడంతో సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని, రైతును ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. -
ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొన్న కారు..
ఆత్మకూరు: కారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. కాజీపేట సిద్దార్థనగర్కు చెందిన పర్రెపాటి రాకేశ్ (29) ఓ ఐటీఐ కళాశాలలో ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి తన కారులో ములుగు వైపునకు వెళ్తున్నాడు. మార్గమధ్యలోని కటాక్షపూర్ సమీపంలో ఓ టిప్పర్ను అజాగ్రత్తగా పార్క్ చేశారు. పైగా లైట్లు కూడా వేయలేదు. దీంతో చీకట్లో టిప్పర్ కనిపించకపోవడంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు కూర్చున్న పత్రి వంశీకృష్ణకి తీవ్ర, వెనుక కూర్చున్న గంధం నాగశ్రావణ్ స్వల్పగాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న క్షతగాత్రుడు వంశీకృష్ణను 108లో నగరంలోని ఓ ఆస్పతికి తరలించారు. మృతుడి తల్లి పర్రెపాటి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. కాగా, హైవే163పై వాహనాలు పార్క్ చేయకుండా సంబంధింత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. యువకుడి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు కటాక్షపూర్ సమీపంలో ఘటన -
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితొర్రూరు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. మండలంలోని 53మంది లబ్ధిదారులకు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు, రైతును రాజును చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా పలు కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేశ్, నాయకులు పింగిళి ఉష, ఇట్టె శ్యాంసుందర్రెడ్డి, ముద్దం విక్రమ్రెడ్డి, బసనబోయిన రాజేష్, మహబూబ్రెడ్డి, ప్రతికంఠం దేవేందర్రాజు పాల్గొన్నారు. -
కూసం రాజమౌళి సేవలు ఆదర్శం
గీసుకొండ: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గంగదేవిపల్లి మాజీ సర్పంచ్, దివంగత కూసం రాజమౌళి సేవలు ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల మృతి చెందిన రాజమౌళికి బాలవికాస ఆధ్వర్యంలో ఆది వారం గంగదేవిపల్లిలో సంతాప సభ నిర్వహించా రు. ముందుగా రాజమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గంగదేవిపల్లిలోని శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరు పెడతామని హామీ ఇచ్చా రు. అవసరమైతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాజమౌళి సమాజం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడని ఆమె ప్రశంసించారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్గా రాజమౌళి, తాను ఎమ్మెల్యేగా నేపాల్ వెళ్లానని గుర్తుచేసుకున్నారు. రాజమౌళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న అన్ని గ్రామ పంచాయతీల గ్రామసభల్లో చర్చించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ రా జమౌళి అపారమైన సామాజిక స్పృహతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి నమూనాను 90 దేశాల ప్రతి ని ధులు వచ్చి అధ్యయనం చేయడం గర్వకారణమని గుర్తు చేశారు. బాలవికాస డైరెక్టర్ సింగారెడ్డి శౌరెడ్డి మాట్లాడుతూ రాజమౌళి గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఇంటిలో ఒక మొక్క నాటాలని అ న్నారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కూసం స్వరూప, వీఓఏల సంఘం ప్రతినిధులు మంత్రి సీతక్కకు వినతులు అందచేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీఓ పాక శ్రీనివాస్, ఆర్ఐ సాంబయ్య, జీపీఓ జక్కుల రమ, ఎంసీపీఐ స్టేట్ కమిటీ మెంబర్ గోనె కుమారస్వామి, మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, అధికార ప్రతినిధి చాడ కొమురరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, కూసం లింగయ్య, రాజమౌళి కుటుంబ సభ్యులు లలిత, రమేశ్,, ఈశ్వర్ పాల్గొన్నారు. సంతాప సభలో మంత్రి ధనసరి సీతక్క -
దళిత యువతకు దన్ను..
న్యూశాయంపేట : దళిత నిరుద్యోగ యువత తమ కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేయనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం పడకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు, సోలార్ కంట్రోల్ పంపు యూనిట్ల పంపిణీ చేయనుంది. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా రవాణా రంగంలో రాణించేలా ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం. ముఖ్యంగా డెలివరీ బాయ్స్గా స్విగ్గీ, జొమాటో వంటి పేరొందిన సంస్థల్లో గిగ్ వర్కర్లగా పనిచేసే వారికి ఈవీ వెహికిళ్లు వరంగా మారనున్నాయి. దీంతో పాటు వ్యవసాయ అవసరాలకు సోలార్ కంట్రోల్ పంపు యూనిట్స్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ రంగంలో ఎస్సీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణ హితం.. ఆర్థిక భరోసాయే పథకం ఉద్దేశం పెట్రోల్తో పోలిస్తే ఈవీ స్కూటర్లు, ఆటోల మె యింటెనెన్స్ చాలా తక్కువ. దీనివల్ల లబ్ధిదారులకు రోజువారీ ఆదాయం మెరుగు పడుతుంది. కాలుష్య రహిత సమాజం కోసం ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. సోలార్ పంపుసెట్లతో పొలాల్లో వెలుగులు, నిరుద్యోగ యువతకు చేతినిండా పనికల్పించాలనే ఉద్దేశంతో భారీ రాయితీతో కూడిన కంట్రోల్ యూనిట్లు అందించి ఆర్థిక భరోసా కల్పించాలని సర్కారు నిర్ణయించింది. సబ్సిడీతో కూడిన రుణాలు స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లతో పాటు టువీలర్పై చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో రూ.లక్ష విలువైన ఈవీ స్కూటర్ను అందించనుంది. అలా గే, ఎలక్ట్రిక్ ఆటో ప్యా సింజర్ గూడ్స్ వాహనాల విలువ ఒక్కొక్కటి రూ.3 లక్షలు కాగా 70 శాతం రాయితీ అందించనుంది. మిగతా 30 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. సోలార్ పంపు కంట్రో ల్ యూనిట్ ఒక్కొక్కటి రూ.3 లక్ష ల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. యూనిట్ విలువను బట్టి రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధి దారుడు భరించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల 24వ తేదీ గడువు అర్హులైన ఆసక్తి గల నిరుద్యోగ యువత నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 24 వ తేదీ వరకు గడువు ఉంది. ఆన్లైన్ ద్వారా టీ జీఓబీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ.ఇ న్ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలి. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్కా ర్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ ప త్రాలు జత చేయాల్సి ఉంటుంది. టు, త్రీ వీలర్ కోసం శాశ్వత డ్రై వింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో లార్ పంపు కంట్రోల్ యూనిట్ కోసం రెండు ఎకరాల భూమి, పట్టదారు పాస్బుక్, నీటి లభ్యత బో రు ఉన్నట్లు జీపీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. టు, త్రీ వీలర్ కోసం 2025 జూలై,1 నాటికి 21 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. సోలార్ పంపు యూనిట్ల కోసం 21 నుంచి 60 వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.లక్ష 50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించి ఆదాయం ఉండొద్దు. బ్యాంకు కాన్సెంట్ తప్పని సరి. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందని వారే ఈ పథకాలకు అర్హులు.ఉమ్మడి జిల్లాకు మంజూరైన యూనిట్లు జిల్లా జనాభా టువీలర్ త్రీవీలర్ సోలార్ యూనిట్లు జనగామ 1,19,796 110 54 12 హనుమకొండ 1,96,046 179 90 19 వరంగల్ 1,28,568 117 60 12 మహబూబాబాద్ 1,04,508 96 48 10 ములుగు 46,473 40 21 05 జేఎస్ భూపాలపల్లి 92,017 87 41 09 స్వయం ఉపాధి దిశగా సాగడానికి ప్రభుత్వం తోడ్పాటు ఎలక్ట్రిక్ వాహనాలతో ఆర్థికాభివృద్ధి సాధించడానికి బాటలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో ఈవీ స్కూటర్లు, ఆటోలు సోలార్ పంపు కంట్రోల్ యూనిట్ల పంపిణీకి చర్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 1,010 యూనిట్లు ఆన్లైన్లో దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు -
రసాయన రహిత వ్యవసాయంతో మేలు
డోర్నకల్: రసాయన రహిత వ్యవసాయంతో అన్ని విధాలా మేలు జరుగుతుందని డీఏఓ బి.సరిత అన్నారు. మండలంలోని చిలుకోడు, గొల్లచర్ల, అమ్మపాలెం రైతు వేదికలతో పాటు సీరోలు మండలం మన్నెగూడెం రైతు వేదికలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న రైతు మహోత్సవ కార్యక్రమం, ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని టీవీ ద్వారా రైతులు, అధికారులు తిలకించారు. అనంతరం రైతులతో శాస్త్రవేత్తల ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించి వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు, భూసార పరీక్షల ప్రాధాన్యం, పంట మార్పిడి విశిష్టత గురించి రైతులకు అవగాహన కల్పించారు. డీఏఓ మాట్లాడుతూ.. పూర్వపు వ్యవసాయ పద్ధతులు లాభదాయకమని, రసాయన రహిత వ్యవసాయంతో మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డి, ఏడీఏ విజయచంద్ర, కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్, ఏఓలు అనిల్కుమార్, చాయారాజ్, ఏఈఓలు అవినాష్, పవన్, చరణ్, ఎర్ర కర్ణ, భరత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. -
శ్రీవిద్య కుటుంబానికి పరామర్శ
కేయూ క్యాంపస్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ విద్యార్థిని శ్రీవిద్య కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బానిగండ్లపల్లిలో కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఆదివారం పరామర్శించారు. తొలుత శ్రీవిద్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవిద్య తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరారని కేయూ విద్యార్థి సంఘం నాయకుడు బొట్ల మనోహర్ తెలిపారు. శ్రీవిద్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు మంద భాస్కర్, కుమ్మరి శ్రీనాథ్, నవీన్, నాగరాజ్, లంక రాజ్గోపాల్, మాచర్ల శరత్చంద్ర, సోమేశ్, మట్టెడ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా..
మహబూబాబాద్: పన్నుల వసూళ్లలో జిల్లా వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరం 93శాతం వసూలు కాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు 63శాతం వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 9రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా.. వందశాతం వసూలు చేయడం అధికారులకు సవాల్గా మారింది. మల్టీపర్పస్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు పన్నులు వసూళ్లు చేస్తున్నారు. అయితే పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉంది. 18 మండలాలు.. 482 జీపీలు.. జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా, జిల్లాలో 1,687మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉండగా వారితో పాటు బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం 2024– 25లో ఇంటి పన్నుల డిమాండ్ 4,94,36,938 ఉండగా.. రూ.4,59,95,402 వసూలు చేశా రు. 93శాతం వసూలు చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. 63 శాతం మాత్రమే.. జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు రూ.4,90,14,538 డిమాండ్కు కేవలం రూ.3,09,92,606 వసూలు చేసి 63శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తొమ్మిది రోజుల్లో పన్నులు వసూలు అవుతాయని చెబుతున్నారు. అయితే వందశాతం మాత్రం పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. కనీస గత ఆర్థిక సంవత్సరం వసూలైన 93 శాతం కూడా దాటే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు 63శాతమే పన్నుల వసూలు మరో 9రోజులు మాత్రమే గడువు గత ఆర్థిక సంవత్సరంలో 93శాతం పన్నుల సేకరణ పన్నుల వసూళ్ల వివరాలు ఇలా.. మండలం జీపీలు డిమాండ్ వసూలు గంగారం 12 5,88,227 5,30,744 మానుకోట 41 26,616,08 22,858,73 చిన్నగూడూరు 11 7,76,235 6,24,065 డోర్నకల్ 26 12,374,67 9,66,328 నెల్లికుదురు 31 35,326,00 25,456,18 పెద్దవంగర 26 18,445,73 12,660,01 ఇనుగుర్తి 13 14,380,17 9,55,646 తొర్రూరు 31 34,270,92 22,140,76 సీరోలు 18 16,156,05 10,159,36 గార్ల 20 59,982,95 36,797,98 కొత్తగూడ 24 20,346,67 12,470,50 బయ్యారం 29 50,145,81 30,265,81 నర్సింహులపేట 23 21,985,90 13,219,50 మరిపెడ 48 21,338,01 12,719,78 కేసముద్రం 29 28,628,41 16,868,13 దంతాలపల్లి 18 19,594,05 11,082,17 గూడూరు 41 47,353,13 25,808,70 కురవి 41 49,556,21 26,650,62 మొత్తం 482 4,90,14,538 3,09,92,606 -
కొరవడిన పర్యవేక్షణ!
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు సగానికిపైగా వాహనాలు మరమ్మతుల బారిన పడడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే దోమల సంఖ్య పెరిగి కంటి మీద కనుకులేకుండా పోతుందని, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ పనితీరుపై పలువురు కౌన్సి లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలను కూడా కమిషనర్ పట్టించుకోవడం లేదు. ఇటీవల కార్యాలయం నిర్వహణ విషయంలో కలెక్టర్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్షకుపైగా జనాభా.. జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ మానుకోట. మన్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. కాగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. 12 ట్రాక్టర్లు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 14 మూడు చక్రాల ఆటోలు ఉండగా వాటిలో సగానికిపైగా మరమ్మతుల బారిన పడ్డాయి. వాటితో పాటు రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వలు శుభ్రం చేసే మిషన్లు మరమ్మతుల బారిన పడి తుప్పు పడుతున్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్తసేకరణ చేసి సిగ్నల్ కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం శివారులోని చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 143 మంది కార్మికులు.. మున్సిపాలిటీలో 36 వార్డులకు కేవలం 143 కార్మికులు ఉండగా వారిలో కొంత మంది హాజరు కాకపోవడంతో పాటు కొంత మంది కార్మికులు అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. సిబ్బంది కొరత, వాహనాల మరమ్మతులతో కొన్ని వార్డుల్లో రోజు వాహనం రాకపోవడంతో ప్రజలు రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దోమలు, పందుల సంఖ్య పెరుగుతోంది. ఫాగింగ్ కూడా నామమాత్రంగా చేస్తున్నారు. కాల్వలు తీయడం మరిచారు.. చాలా కాలనీల్లో కాల్వలను శుభ్రం చేయడం లేదు. కాల్వలు చెత్తాచెదారంతో నిండాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోందని ఆయా ప్రాంతాల ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వల విషయంలో పలుమార్లు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని అంటున్నారు. కమిషనర్ తీరుపై అసంతృప్తి.. మున్సిపల్ కమిషనర్ కేవలం కార్యాలయానికే పరిమితమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం సమయంలో మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో బిల్లులు, ఫైళ్లు ఇతరత్రా విషయాలపై మాట్లాడుతున్నారు. పర్సంటేజీ లెక్కలు చూసుకుంటున్నారే తప్ప..పారిశుద్ధ్యం, ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో కార్మికులు కాలనీల్లో తూతూమంత్రంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు ఈనెల 10న మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఆసమావేశంలో పారిశుద్ధ్యం, పందుల సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కమిషనర్ను ఆదేశించారు. పందుల పెంపకందారులతో సమావేశమై, పందులను పట్టణానికి దూరం ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ, నేటి వరకు పందుల పెంపకందారులతో సమావేశం పెట్టలేదు. కలెక్టర్ సీరియస్.. ఈనెల 11న కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న ఫైళ్లు, బీరువాలు, చెత్తాచెదారం చూసి కలెక్టర్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, నేటికి కార్యాలయంలో నిర్వహణ పనులు చేయకపోవడంతో పాటు ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కనీసం కార్యాలయంలో బూజు కూడా శుభ్రం చేయించడం లేదు. కమిషనర్ను బదిలీ చేస్తే మానుకోట మున్సిపాలిటీలో పాలన గాడిన పడుతుందని పలువురు కౌన్సిలర్లు, ప్రజలు విమర్శిస్తున్నారు. మానుకోట పట్టణంలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం అసంపూర్తి కాల్వలతో అపరిశుభ్రంగా పరిసరాలు కాలనీల్లో పందుల స్వైరవిహారం కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల అసంతృప్తి -
ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ రాజేశ్వర్రావు మృతి
వరంగల్ చౌరస్తా: ఎంజీఎం ఆస్పత్రి రిటైర్ట్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీరాం రాజేశ్వర్రావు (78) ఆదివారం ఉదయం వరంగల్ గిర్మాజీపేటలోని ఆయన నివాసంలో మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత గుండెనొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ రాజేశ్వర్రావు ఎంజీఎంలో ఆర్ఎంఓగా పనిచేసిన కాలంలో ప్రశంసలు అందుకున్నారు. అలాగే, పేదలకు వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజేశ్వర్రావు మృతికి డీఎస్పీ కిరణ్కుమార్, పెద్ద ముప్పారం సర్పంచ్ భరత్, పెరిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అచ్చ వినోద్కుమార్, హైకోర్టు న్యాయవాది పురుషోత్తమరెడ్డి, వరంగల్ న్యాయవాదులు మల్లికార్జున్, ధనుంజయ, డాక్టర్ పి.సాంబశివరావు, డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, డాక్టర్ అన్వర్పాషా, డాక్టర్ రంజిత్కుమార్, డాక్టర్ బందెల మోహన్రావు, డాక్టర్ సంగని మల్లేశ్వర్, కీత విజయ్కుమార్, శరత్కుమార్ సంతాపం తెలిపారు. -
కారుణ్య నియామక పత్రాలు అందజేత
కొత్తగూడ: ఐటీడీఎ పరిధిలో ఉద్యోగం చేస్తూ మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఆదివారం మండల కేంద్రంలోని ఐటీడీఎ గెస్ట్హౌస్లో కారుణ్య నియామక పత్రాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి కల్పనలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో తేజావత్ పద్మకు క్రీడా పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా, దయానారావు, చైతన్యకు ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఇంకా చాలా మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి త్వరలోనే నియామక పత్రాలు అందజేసేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ తండ్రి వీరయ్య ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, మండల నాయకులు పాల్గొన్నారు. -
సిరుల పంట.. నువ్వులు
మహబూబాబాద్ రూరల్: వేసవి(రబీ)లో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించి పెట్టే పంటల్లో ను వ్వుల సాగు ఒకటి. ఈ పంట అన్నదా తల ఇంట్లో సిరులు కురిరిస్తుంది. ఈ క్రమంలో ఈ పంటను ఏ సమయంలో సాగు చేయాలి.. ఏ నేలలో చేయాలి.. విత్తనం ఎలా చల్లాలి.. చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలి అనే అంశాలపై మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ● రబీలో ‘ఆరుతడి’గా నువ్వులు సా గు చేసి అధిక దిగుబడి పొందొచ్చు. ● నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 56 వరకు ఉంటుంది. ప్రొటీన్లు 20 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. ● విటమిన్లు, అమైనో ఆమ్లాలతోపాటు పాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ● ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసినప్పుడు, రెండో పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో పంట ఉత్పత్తిని పొందొచ్చు. ● రబీ పంటగా నువ్వుల సాగులో చీడపీడల బెడద తక్కువ ఉంటుంది. విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చు. ● మురుగు నీరు నిల్వని, తేలికపాటి నేలలు సాగుకు అనుకూలం. పొడి దుక్కి ఉండేలా చూసుకోవాలి. ● విత్తనాన్ని సన్నని ఇసుకలో కలిపి సమంగా వెదజల్లాలి. రకాలు: ● రాజేశ్వరి, శ్వేత, చందన, హిమ వంటి రకాలతోపాటు ఇతరత్రా అనువై న రకాలను సాగుకు ఎంచుకోవాలి. ● రకాలను బట్టి 80 నుంచి 85 రోజుల కాలపరిమితి ఉంటుంది. ● విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. ● పూత, కాయ అభివృద్ధి, గింజ కట్టుదశలో తడులు ఇవ్వాలి. ● విత్తిన 35 నుంచి 40 రోజుల వరకు, 65 నుంచి 70 రోజుల వ రకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ● పంట పెరిగే దశల్లో పిండినల్లి, ఆకుమచ్చ, వెర్రి తెగులు ఆశిస్తాయి. ● వాటి నివారణకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నువ్వుల సాగు దిగుబడిలో మంచి ఫలితాలు పొందొచ్చు. -
వ్యవసాయం, ఇరిగేషన్పై చిన్నచూపు
జనగామ: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, ఇరిగేషన్పై చిన్నచూపు చూసిందని, ఈ బడ్జెట్ పేరుగొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెన్షనర్లు, ఉద్యోగులకు ఐదు పీఆర్సీలు, ఒక డీఏ పెండింగ్, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికుల కోసం ఊసే ఎత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు స్కూటీ, వృద్ధులకు రూ. 4వేల పింఛన్, రైతులకు పెట్టుబడి కింద రూ.15వేలు, రాజీవ్ యువ వికాసానికి రూ.6వేల కోట్లు, అంబేడ్కర్ అభయ హస్తం కింద ఒక్కొక్కరికి రూ.12 లక్షలు, షాదీముబాక్, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, బీసీ వర్గాలకు ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని..బడ్జెట్లో గుండుసున్నా చూపించారన్నారు. బడ్జెట్ అంచనాలకు అటు ఇటుగా ఉండాలే తప్ప, మొత్తానికి మొత్తం జీరో చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన రెండున్నరేళ్లలో రూ.3.80 లక్షల కోట్లు అప్పు చేసి జీరో అభివృద్ధిని చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, సేవెల్లి మధు, గునిగంటి వెన్నెల, మామిడాల రజిత, అనూష, అనిత, ఉల్లెంగుల సందీప్, నీల యాదగిరి తదితరులు ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులోని వనిత టీస్టాల్ను యథాస్థానంలోనే ఉండే విధంగా కలెక్టర్ చొరవ చూపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు ఏవి? జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
మైనార్టీల సంక్షేమాభివృద్ధికి పెద్దపీట
ఖిలా వరంగల్: రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీల సంక్షేేమాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం ఉదయం 10గంటలకు ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్లోని ఈద్గామైదానంలో ఈద్గా అభివృద్ధి కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో ఈద్గా మత గురువు మౌలానా మహ్మద్ నౌమాన్ రాజ్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తహసీల్దార్ ఇక్బాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్ర జా ప్రభుత్వం పేద ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా రూ.కోటితో మట్టెవాడ, రూ.కోటితో ఖిలావరంగల్, రూ.60 లక్షలతో ఎల్బీనగర్, రూ.40 లక్షల వ్యయతో చింతల్ ఈద్గాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సోదరభావం, దాతృత్వం, ఆధ్యాత్మికత, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ముస్లింలు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేలా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈద్గా ప్రతినిధి చాంద్పాషా, ఎండీ ముగ్దూం, మహమ్మద్ షకీల్, మీర్జా హసన్ అలీబేగ్, యాకూబ్, సర్వర్, మాషూక్, అబీబ్, అంకూస్, మహమ్మద్ జానీ, రబ్బానీ, ఎండీ అమ్జద్, స్థానిక కార్పొరేటర్లు పోశాల పద్మ, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్రాజ్, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, జనార్ధన్, కొత్తపెల్లి శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్, కర్రె కుమార్, పగడాల సతీశ్, శ్రీరామ్ రాజేశ్, దామోదర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూ.3కోట్ల వ్యయంతో ఈద్గాల అభివృద్ధి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
బమ్మెరలో చైన్స్నాచింగ్
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో చైన్ స్నాచింగ్ జరిగింది. దుండగులు శుక్రవారం సాయత్రం ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. ఎస్సై దూలం పవన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు మానుపాటి సోమనర్సమ్మ గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వెనుక ఆవులను మేపుతోంది. ఈ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. వృద్ధురాలితో మాటలు కలిపి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్పై మరో వ్యక్తితో కలిసి పరాయ్యాడు. దీంతో సోమనర్సమ్మ బోరున విలపిస్తూ ఇంటికెళ్లి తన కుమారుడికి ఘటనను వివరించింది. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు విషయం తెలుపగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా అనుమానితలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శనివారం తెలిపారు.● వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ ● ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు -
తలసరిలో లాస్ట్
జీడీడీపీలో ఫస్ట్..సాక్షి, వరంగల్: భౌగోళిక హద్దుల్లోని వస్తుసేవల ఉత్పత్తుల్లో ఉమ్మడి వరంగల్లో హనుమకొండ జిల్లా 30,480 కోట్లతో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీడీపీ)లో ప్రథమ స్థానంలో నిలవగా, తలసరి ఆదాయంలో మాత్రం రూ.2,37,809తో చివరి స్థానంలో ఉందని తెలంగాణ సోషియో ఎకానమిక్ నివేదిక 2026 పేర్కొంది. అంతేకాదు తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే హనుమకొండ చిట్టచివరి స్థానం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పారిశ్రామికీకరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో 703 ఫ్యాక్టరీలు, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 82 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు అత్యధికంగా హనుమకొండలో 3 7,362 ఉండగా, అత్యల్పంగా ములుగులో 5,515 ఉన్నాయి. ఉదయ్ పోర్టల్లో 2020 జూలై నుంచి 2025 డిసెం బర్ 22 వరకు రిజిస్టర్ అయిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కువగా హనుమకొండలో 7,517 ఉంటే ములుగులో 1,636 ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లా విషయానికొస్తే జీడీడీపీలో రెండో స్థానం, ఫ్యాక్టరీ, ఎంఎస్ఎంఈ, ఉదయ్ పోర్టల్లో రిజిస్టర్ అయినమాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లలో రెండో స్థానంలో నిలిచింది.తెలంగాణ సోషియో ఎకానమిక్ నివేదికలో హనుమకొండ జిల్లా స్థానం జీడీడీపీ, ఫ్యాక్టరీలు, ఎంఎస్ఎంఈలో వరంగల్ రెండో స్థానం ఉమ్మడి వరంగల్లో తలసరి ఆదాయంలో ములుగు జిల్లా ఫస్ట్ -
పారదర్శకంగా ఎంటీఎస్ పోస్టుల ఎంపిక
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2026 కోసం జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 టెక్నికల్ అసిస్టెంట్, 1 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. ఈ మేరకు శనివారం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 243 మంది దరఖాస్తు చేసుకోగా అందులో భాగంగా మెరిట్ ఆధారంగా 84 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నైపుణ్య పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పో స్టుకు మొత్తం 52 మంది దరఖాస్తు చేసుకోగా 1:6 రేషియోలో మె రిట్ ఆధారంగా 6 మంది అభ్యర్థుల కు ఇంటర్వ్యూ నిర్వహించి ఒకరిని ఎంపిక చేశామన్నారు. ఇన్చార్జ్ ఉపాధి అధికారి రవికాంత్, సీపీఓ చిన కో ట్యా నాయక్, సూపరింటెండెంట్ ఫణికుమార్ పాల్గొన్నారు. పరీక్షకు పిలిచారు.. వద్దన్నారు జనగామ: జనగణన–2026 సేవలకు సంబంధించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ నియామకాల కోసం పరీక్ష ఉంటుందని సమాచారం అందించి, తమను కేంద్రంలోకి అనుమతించలేదని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో జనగణన కోసం ఔట్ సో ర్సింగ్ ప్రాతిపదికన (16)టెక్నికల్ అసిస్టెంట్, ఒక మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీ కోసం జిల్లా ఉపాధి అధికారి (ఇన్చార్జ్) రవికాంత్ ఆధ్వర్యంలో పరీక్ష న్విహించారు. మె రిట్ ఆధారంగా 84 మందిని పిలవాల్సి ఉండగా, సుమారు 13 మందికి అదనంగా మెసెజ్ పంపించారు. పరీక్షకు మెరిట్ ఆధారంగా లోపలికి అనుమతించగా, మిగతా వారు ఆవేదనకు గురయ్యారు. తమను ఎందుకు అనుమతించడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ విషయమై రవికాంత్ మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్లు మెసేజ్ పంపించే క్రమంలో సుమారు 10 నుంచి 13 మందికి అదనంగా సమాచారం వెళ్లిందన్నారు. పరీక్షకు అనుమతించని క్రమంలో వారికి జరిగిన తప్పిదాన్ని వివరించామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృ ష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. వచ్చే ఉద్యోగ మేళాలో వీరికి ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారన్నారు. -
ఆపన్నహస్తం అందించరూ!
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కిడ్నీలు పాడైపోయి చికిత్స కోసం డబ్బులు లేని దుస్థితిలో ఉన్నాడు. ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఇటీవల రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు, చికిత్స చేయించడానికి అవసరమైన డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీనిపై దాతలు స్పందించి ప్రవీణ్కు ఆపన్న హస్తం అందించాలని కుటుంబీకులతోపాటు ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు కోరుతున్నారు. సహాయం చేయాలని అనుకునే వారు 9908413955 నంబర్కు ఫోన్ పే చేయాలని వారు వేడుకుంటున్నారు. కాగా, శనివారం గీసుకొండ మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఉద్యమకారుడు నమిండ్ల ప్రమోద్ , ప్రభుత్వ టీచర్ కర్ణకంటి రామ్మూర్తి , గుర్రం రఘు, నాగుర్ల వెంకటేశ్వర్లు, సిరిసే శ్రీకాంత్, కొమరెళ్లి కిరణ్.. ప్రవీణ్కు ఆర్థిక సాయ అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ పాడైన కిడ్నీలు.. చికిత్స కోసం డబ్బులు లేని దుస్థితి దాతలు ఆదుకోవాలని వేడుకోలు -
బీసీలను మోసం చేసిన ప్రభుత్వం
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో 56 శాతం ఉన్న బీసీలకు 3.8 శాతం మాత్రమే నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని బీసీ సబ్ప్లాన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ అన్నారు. 2026–2027 బడ్జెట్లో బలహీనవర్గాల కు తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె.మురళీమనోహర్ మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రతీ బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడ్డారు. మూడు బడ్జెట్లలో ఇదే తీరుగా మోసం చేసిందన్నారు. ప్రొఫెసర్ ఎం.సారంగపాణి, ప్రొఫెసర్ వడ్డే రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు తక్కువ నిధులు కేటాయించడంతో పాటు కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు. బీసీ సంఘాల నాయకులు బుట్టి శ్యామ్ యాదవ్, ఎదునూరి రాజ మొగిలి, చందా మల్ల య్య మాట్లాడుతూ బడ్జెట్లో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, వివిధ కుల సమాఖ్యలకు కేటాయిస్తున్న నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు, నాయకులు దారబోయిన సతీశ్, ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ గోపు సుధాకర్, తాడిశెట్టి క్రాంతి, గొల్లపల్లి వీరస్వామి, ఆయా సంఘాల నాయకులు జిలకర శ్రీనివాస్, పల్లెబోయిన అశోక్, సంపత్ పటేల్, దార జనార్ధన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ మురళీమనోహర్ బడ్జెట్లో తక్కువ కేటాయింపులపై నిరసన -
‘బంగారు’ దీప్తి..
● పరుగు పందెంలో దీప్తి జివాంజీకి గోల్డ్మెడల్ పర్వతగిరి: ఒడిశా రాష్ట్ర రా జధాని భువనేశ్వర్లో ఇటీవల జరిగిన 24వ జాతీ య పారా అథ్లెటిక్స్ చాంపియన్ –2026 పోటీల్లో వరంగల్ జిల్లా కల్లెడ గ్రా మానికి చెందిన జివాంజీ దీప్తి పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. 57.75 సెకన్ల వ్యవధిలో నిర్ణీత గమ్యానికి చేరుకుని తెలంగాణ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించారు. శనివారం భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో దీప్తికి పతకం అందజేశారు. బాలికలపై వీధి కుక్కల దాడి ● శివనగర్లో ఘటన ● ఎంజీఎంకు తరలింపు ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్లోని నాలుగు జెండాల లేన్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం గుడియ చందన, వేణు దంపతుల కూతురు అక్షర , బుర్రి అన్నపూర్ణ, ప్రసాద్ దంపతుల కూతురు సంజిత ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలపై వీధి కుక్కలు దాడికి పా ల్పడ్డాయి. తల్లిదండ్రులు గమనించి కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. అప్పటికే గాయపడిన ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు ఎంజీఎం తరలించారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరారు. ఈ విషయం తెలిసి స్థానిక కార్పొరేటర్ ప్రవీణ్.. బాలికలను వారి ఇంటి వద్ద పరామర్శించారు. డివిజన్ పరిధిలోని వీధికుక్కలను ఆదివారం పట్టుకుని తరలిస్తామని తెలిపారు. యువకుడికి కత్తిపోట్లు ● మానుకోటలో ఘటన మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బుక్కబజారు ప్రాంతంలో నివాసం ఉండే బయ్య శివరాజన్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఓ వైన్స్ షాపులో క్యాంటీన్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొందరు యువకులు వచ్చి మద్యం సేవించి వెళ్లిన సందర్భంలో అతడితో ఘర్షణ పెట్టుకున్నారు. అనంతరం శనివారం రాత్రి మరికొందరు యువకులు వచ్చి శివరాజన్తో మళ్లీ ఘర్షణ పెట్టుకుని కత్తితో దాడిచేసి గాయపరచగా ఛాతి కుడివైపు భాగంలో, తలపై, ఎడమ చెవిలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై ప్రశంత్ బాబు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి చిన్నమ్మ కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోనే ఎఫ్ఐఆర్ నమో దు చేసి విచారణ చేస్తున్నామని సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. -
అదనపు కట్నం కోసమే జంట హత్యలు
కాజీపేట అర్బన్: అదనపు కట్నం కోసమే మామ భాషబోయిన రాజశేఖర్, భార్య రాజశ్రీని భర్త పొక్కుల ప్రవీణ్ హత్య చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం మడికొండ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల కడిపికొండ రాజీవ్గృహకల్ప సముదాయంలో జరిగిన తండ్రీకూతుళ్ల హత్య వివరాలు వెల్లడించారు. కడిపికొండ రాజీవ్గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న భాషబోయిన రాజశేఖర్ తన పెద్ద కుమార్తె రాజశ్రీని 2023, నవంబర్ 18వ తేదీన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్కు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహ సమయంలో రూ. 3 లక్షల కట్నంతోపాటు అన్ని రకాల సామగ్రి అందజేశాడు. ప్రవీణ్, రాజశ్రీ దంపతులకు ఏడాదిన్నర కుమారుడు జయాన్స్, ఆరు నెలల కూతురు దివిషా ఉన్నారు. ఈ క్రమంలో కూతురు పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లోని కొకాకోలా కంపెనీలో ఉద్యోగం మానేసి వ్యాపారం ఏర్పాటు చేసుకుంటానని, అందుకు అదనపు కట్నం తీసుకురావాలని ప్రవీణ్.. భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయంపై రాజశ్రీ తన తండ్రి రాజశేఖర్కు పలుమార్లు తెలిపింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో తండ్రి రాజశేఖర్ తన బిడ్డను వేధిస్తే చంపుతానని ప్రవీణ్ను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన రాజశ్రీ, ప్రవీణ్ మధ్య అదనపు కట్నం విషయంపై గొడవ జరిగింది. ఈ సమయంలో అదే గదిలో ఉన్న మామ తనను చంపుతాడని ప్రవీణ్ బయపడ్డాడు. దీంతో తానే ఇద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్లాన్ ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున మామ రాజశేఖర్, భార్య రాజశ్రీ నుదుటిపై సుత్తితో మోదాడు. వారు బతికుంటే తనకు ప్రమాదమని భావించి డీజిల్ పోసి నిప్పటించాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకుని బయటకొచ్చి ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు యత్నించాడు. వెంటనే 108, డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజశేఖర్ రెండో కుమార్తె తేజశ్రీ ఘటనా స్థలికి చేరుకుని ఎలా చనిపోయారని ప్రవీణ్ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని వారిలో వారే గొడవపడి కాల్చుకున్నారని తెలిపి పరారయ్యాడు. శనివారం సాయంత్రం తన పిల్లలతో పాటు తనపై కేసు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కడిపికొండ బ్రిడ్జి ప్రాంతంలో కనిపించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా మామ, భార్యను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్కుమార్, రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. మామ, భార్యను చంపిన ఘటనలో నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి -
కానరాని వార్డు అధికారులు
తొర్రూరు: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డుస్థాయి అధికారులను నియమించారు. ప్రతీ వార్డుకు ఒకరిని కేటాయించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ అధికారులు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా వరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, ఫలితంగా వార్డుల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు కొలువైన నేపథ్యంలో వార్డు అధికారుల పనితీరు మెరుగుపడుతుందేమోనని ప్రజలు ఆశిస్తున్నారు. పనులన్నీ అస్తవ్యస్తం.. జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 98 వార్డులు ఉన్నాయి. వార్డు పరిధిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోందన్న వాదనలున్నాయి. కోతులు, కుక్కల బెడద పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమస్య తీవ్రతను వార్డు అధికారులే ఉన్నతాధికారులకు నివేధించి చొరవ చూపాల్సి ఉంది. అసెస్మెంట్లు ఇష్టారీతిన సాగుతున్నాయి. డబ్బులిస్తే తప్ప కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బంది పనులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటికి అడ్డుకట్టపడాలన్నా, మున్సిపల్కు ఆదాయం సక్రమంగా సమకూరాలన్నా వార్డు అధికారుల పనితీరే అత్యంత కీలకం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక సర్వేలోనూ వార్డు అధికారులు చాలా మంది అంటీముట్టనట్లుగా ఉన్నారన్న విమర్శలు కోకొల్లలు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పని చేసిన కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న ప్రచారమూ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో వారు కేవలం కార్యాలయానికే పరిమితమవుతూ, తమకు కేటాయించిన విధులపై అంతగా దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పట్టణ వాసులను అసంతృప్తికి గురిచేస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు మున్సిపాలిటీ వార్డులు మహబూబాబాద్ 36తొర్రూరు 16మరిపెడ 15డోర్నకల్ 15కేసముద్రం 16విధి నిర్వహణపై నిర్లక్ష్యం కార్యాలయాలకే పరిమితం క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. జంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నట్లు సమాచారం. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఇక హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీలు ఖరారు ఉమ్మడి వరంగల్లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
వెనకడుగు
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసే సామాజిక, ఆర్థిక నివేదికలో జిల్లా వెనకబడింది. స్థూల జాతీయ, తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉంది. పంటల సాంద్రతలో మధ్యస్థంగా ఉండగా.. ఉత్పత్తి రంగంలో వెనకడుగు, అటవీ విస్తీర్ణంలో మొదటి పది స్థానాల్లో జిల్లాకు తొమ్మిదో స్థానం దక్కింది. అక్షరాస్యత వంటి అంశాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. జీడీడీపీలో వెనకబడి సంవత్సర కాలంలో జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తుసేవల విషయంలో ఇతర జిల్లాలతో పోలిస్తే మానుకోట వెనకబడి ఉంది. స్థూల జాతీయ ఆదాయంలో రాష్ట్రంలో రూ.3,41,080కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలువగా మహబూబాబాద్ జిల్లా రూ.23,060 కోట్లతో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో వ్యవసాయం మినహా ఇతర ఉత్పత్తి చేసే అవకాశం లేనందున ఈ పరిస్థితి నెలకొంది. కనీసం వ్యవసాయ పంటల ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమలు పెడితే జీడీపీ పెరిగే అవకాశం ఉంది. తలసరి ఆదాయంలో 29వ స్థానం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో మొదటి స్థానంలో నిలువగా రూ.2,56,485తో మానుకోట రాష్ట్రంలో 29వ స్థానంలో నిలిచింది. అయితే ఉపాధి అవకాశాలు తగినంతగా లేకపోవడం.. సంవత్సరంలో పనిదొరికే రోజుల సంఖ్య తగ్గడంతో తలసరి ఆదాయం కూడా తగ్గినట్లు స్పష్టమవుతుంది. ఉపాధి హామీలో మెరుపులు ప్రతీ ఒక్కరికి పనికల్పించి, వలసలను నివారించాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లా కాస్త మెరుగ్గా ఉంది. గడిచిన ఏడాది జిల్లాలో 28.6లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జిల్లాలో 26.5లక్షల పనిదినాలు అంటే 92.40శాతం లక్ష్యం చేరుకొని జిల్లాను మెరుగైన స్థానంలో నిలపారు. తొంభైశాతం గ్రామీణప్రాంతమే.. జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం.. మొత్తం జనాభా 7,74,549 మంది ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతంలో 6,98,173 మంది నివసిస్తున్నారు. పట్టణాల్లో కేవలం 76,376 మంది మాత్రమే నివాసముంటున్నారు. అయితే 2016లో మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావడంతో విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో మార్పులు వచ్చాయి. తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో కూడా జనాభా పెరిగింది. దీంతో ప్రస్తుతం పట్టణ జనాభా 2లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. 52.61శాతం శ్రామికులు జిల్లా జనాభాలో 52.61శాతం మంది శ్రామిక వర్గం ఉంది. రైతులు 1,22,597 మంది, వ్యవసాయ కూలీలు 2,04,458 మంది, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు చేసేవారు 7,427మంది, ఇతర శ్రామికులు 73,002 మంది మొత్తం 4,07,484 మంది శ్రమనే నమ్ముకొని జీవిస్తున్నవారున్నారు. సీ్త్ర, పురుషుల నిష్పత్తి ఆందోళనకరం సీ్త్ర, పురుషుల నిష్పత్తిలో జిల్లా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో సీ్త్ర, పురుషుల నిష్పత్తి 995 మంది, పట్టణ ప్రాంతంలో 1,035గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల నిష్పత్తి సగటున 903కు పడిపోయింది. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 901, పట్టణ ప్రాంతంలో 917 ఉంది. దీంతో జాతీయ ఆరోగ్య సంస్థ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి ఆబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలపై ఆరా తీస్తుంది. సగటున 2.04 ఎకరాల భూమి వ్యవసాయమే ఆధారంగాఉన్న జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. జిల్లాలో సగటున వ్యవసాయం చేసే రైతులకు 2.04 ఎకరాల చొప్పున భూమి ఉంది. ఇందులో షెడ్యూల్ కులాలకు చెందిన 15,676 మంది చేతిలో 8,414 ఎకరాలు, షెడ్యూల్ తెగలకు చెందిన 81,735 మంది చేతిలో 63,568 ఎకరాలు ఉంది. ఇతర వర్గాలకు చెందిన 91,398 మంది ఆధీనంలో 91,645 ఎకరాలు ఉంది. పశుసంపద ఇలా.. జిల్లాలో 1.82 లక్షల పశువులు, 1.30 లక్షల గేదెలు, 6.78 లక్షల గొర్రెలు, 1.78లక్షల మేకలు, 8 వేల పందులు ఉన్నాయి. 11వేల కుక్కలు, 11.10 లక్షల కోళ్లు జిల్లాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జీడీడీపీలో 24వ స్థానంలో మానుకోట తలసరి ఆదాయంలో 29వ స్థానం ఉత్పత్తి రంగంలోనూ వెనుకే.. టాప్ టెన్లో అటవీ విస్తీర్ణం -
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు
● ఎస్పీ శబరీష్ చిన్నగూడూరు: అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీష్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్సై ప్రవీణ్కుమార్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని సర్పంచ్లతో మాట్లాడారు. గ్రామ భద్రతలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఆయా గ్రామాల సర్పంచ్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతేగాకుండా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ద్విచక్రవాహనాలు ఉన్న ప్రతీ ఒక్కరికి హెల్మెట్ ఉండాలన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగంపై దృష్టిసారించి సమాచారం అందించాలన్నారు. అన్ని అంశాలపై సర్పంచ్లు పూర్తి బాధ్యత వహించి మండలంలోని ఏవేని మూడు జీపీలు వారంలోపు వందశాతం రిజల్ట్ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం @ ఇనుపరాతి గుట్టలు
అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశంగుట్టల శివారులో రిజర్వాయర్దర్మసాగర్ : హనుమకొండ జిల్లాలో అటవీ ప్రాంతంగా పిలువబడే ధర్మసాగర్ మండలంలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులతోపాటు పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో ఒక శాతం అటవీ సంపద ఉన్నది ఈ ప్రాంతమే. దేవునూరు అటవీప్రాంతాన్ని వరంగల్ త్రినగరి ఊపిరితిత్తులుగా పిలుస్తుంటారు. కానీ, ప్రస్తు తం ఈ అటవీ భూముల్లో అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. రెవెన్యూ, అటవీశాఖల ఆధునిక డిజిటల్ సర్వేలో సుమారు 3,900 ఎకరాల అటవీ శాఖ దేవునూరు గుట్టల్లో ఉన్నట్లు తేలింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు, అటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం దట్టమైన వృక్ష సముదాయం ఉండి రిజర్వ్ ఫారెస్ట్ పక్కన లేకున్నా ఆ ప్రాంతాన్ని అడవిగా పరిగణించాలి. కావునా దేవునూరు గుట్టలను రిజర్వ్ ఫారెస్ట్గా పరిగణించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. జంతు, వృక్ష జాతులకు నెలవు దేవునూరు ఇనుపరాతి గుట్టల్లో ఎన్నో రకాల జంతు, వృక్ష జాతులున్నాయి. ఇక్కడ ఎలుగుబంట్లు, జింకలు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలతోపాటు అనేక పక్షి జాతులు, వివిధ రకాల ఔషధ మొక్కలతోపాటుగా ఇప్ప, నార, వేప, చింత, రావి లాంటి వృక్షజాతులు ఉన్నాయి. ఆహారం, పశుగ్రాసం, ఔషధ మొక్కలు, వంట చెరుకు నిలయంగా ఈ గుట్టలు విరాజిల్లుతున్నాయి. ఈప్రాంతంలో అక్రమ మైనింగ్కు అడ్డుకట్టవేసి జీవవైవిధ్య పార్కుగా అభివృద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇనుపరాతి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రభుత్వనికి ఆదాయం సమకూరనుంది. కనీస వసతులుగా వాచ్ టవర్, పిక్నిక్ గద్దెలు, నైట్ క్యాంపు కల్పిస్తే వన సంపదకు రక్షణగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. ఇక్కడి ప్రజలు ముక్త కంఠంతో క్వార్జ్ మైనింగ్ ఏర్పాటును అడ్డుకోవడం అభినందనీయం. నగరానికి కూతవేటు దూరంలోనే.. వృక్ష, జంతు జాతులకు నెలవు గుట్టల్లో కొలువైన ప్రాచీన ఆలయాలు అభివృద్ధి చేయాలంటున్న పర్యావరణ ప్రేమికులుహనుమకొండలోని ఏకై క అటవీ ప్రాంతమైన ఇనుపరాతి గుట్టలు ఎకో టూరిజానికి అనుకూలంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వన్య సంపద ఉన్న ఈ ప్రాంతాన్ని రిజర్వ్ అడవిగా ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. సెక్షన్ 4, తెలంగాణ అటవీ చట్టం ప్రకారం ఇప్పటికే ఎన్నో భూసార, తేమ పరిరక్షణ చర్యలు చేపట్టినందుకున ఈ ప్రాంతం పర్యాటక పర్యావరణానికి అనుకూలమని స్పష్టమైంది. కావున ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


