breaking news
Mahabubabad District News
-
సంతానం కలగడం లేదని..
● వ్యక్తి ఆత్మహత్య సంగెం: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం వంజరపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర్య రామారావు(47)కు 25 ఏళ్ల క్రితం విజయతో వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో రామారావు నిత్యం మనస్తాపానికి గురయ్యేవాడు. దీనిపై భార్య విజయ.. రామారావుకు ధైర్యం చెప్పుతుండేది. ఈ క్రమంలో గురువారం పురుగుల మందు తాగగా గ్రామస్తురాలు మోర్తాల స్నేహ చూసి విజయకు చెప్పింది. దీంతో రామారావును హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుతం
● కాకతీయ వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ ● ముగిసిన రాష్ట్రస్థాయి వర్క్షాప్ విద్యారణ్యపురి : కాకతీయుల త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుత శిల్పకళావైభవానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ‘కాకతీయ టెంపుల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల త్రికూటాలయాలు శివకేశవుడు, సూర్యదేవ ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయన్నారు. బడంగ్పేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల దేవాలయాల శిల్పకళ ప్రసిద్ధిగాంచిందన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. విజయలక్ష్మి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళలకు నిలయం రామప్పదేవాలయం అన్నారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి వర్ధన్నపేట, కేడీసీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పోచయ్య, జి. శ్రీనివాస్, టీహెచ్సీ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఎం. వీరేందర్, హెరిటేజ్ యాక్టివిస్ట్ ఆర్య, ఈవర్క్షాప్ కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్ప్రిన్సిపాల్ జి. సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం. అరుణ, ఐక్యూఏసీకోఆర్డినేటర్ సురేశ్బాబు మాట్లాడారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులకు అతిథుల చేతులమీదుగా సరిఫికెట్లు అందజేశారు. వాగులో గల్లంతైన ఆశ వర్కర్ మృతి వెంకటాపురం(కె): వాగులో గల్లంతైన ఆశ వర్కర్ మృతి చెందింది. ఈఘటన మండల పరిధిలోని పాత్రాపురం జీపీ పరిధి లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆశ వర్కర్ ఇర్ప లక్ష్మి(60) బుధవారం సాయంత్రం తన కుమారుడు రమేశ్ పశువులను మేపేందుకు లక్ష్మీపురం నుంచి మోట్లగూడెం గ్రామానికి బండల వాగు దాటి వెళ్తున్నాడని తెలిసి అతడి వెనుక వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగు ఉధృతిలో కొట్టుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వాగులో గాలించగా గురువారం ఉదయం లక్ష్మి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భారత్ మెరవాలి
● ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుంది.. ● పాలకుల విధానాలు మారాల్సిన అవసరం ఉంది ● అభిప్రాయాలు వ్యక్తం చేసిన ‘నలంద’ విద్యార్థులు ● ‘వందేళ్ల భారత్ ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ టాక్షోమహబూబాబాద్ అర్బన్: ‘మనది ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశమే. మారుతున్న ఆధునిక టెక్నాలజీని అందుకుని ఇంకా మార్పు రావాలి.. అప్పుడే భారత్ మెరుస్తుంది’ అని విద్యార్థులు అంటున్నారు. నేడు (శుక్రవారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘2047కు వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే భారత్ ఎలా ఉండాలి’? అనే అంశంపై, ఉచిత పథకాలు, పాలకుల విధానం, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగ అంశాలపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ టాక్షో నిర్వహించింది. ఇందులో విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకొనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. – జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరంకొన్ని పథకాలు తొలగించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రజలకు ఉపయోగం లేనివి ఉన్నాయి. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. వాటిని సక్రమంగా పేద, మధ్య తరగతి వారికి, చిరువ్యాపారులకు అందిస్తే దేశం ఆర్థిక పురోగతి సాధిస్తుంది. మిగిలిన నిధులను రైతులకు, పాఠశాలలు, గ్రామాలు, తండాల అభివృద్ధికి ఉపయోగించాలి. – హర్షవర్ధన్, బీఎస్సీ, ఫస్ట్ ఇయర్ నాయకుల్లో మార్పు రావాలి.. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది. – గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం -
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం
● ఏర్పాట్లను పరిశీలించిన ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోమహబూబాబాద్ అర్బన్: పంద్రాగస్టు వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారన్నారు. వీఐపీలు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని, వాటర్ ఫ్రూప్ టెంట్లు వేయాలని సూచించారు. అన్ని ప్రభు త్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు హాజరుకావాలన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మార్చ్ఫాస్ట్ రిహార్సల్స్ను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజ్, ఆర్అండ్బీ డీఈ బీమ్లానాయక్, డీఈఓ రవీందర్రెడ్డి, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ము న్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వర్రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్ మహబూబాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేశారు. గురువారం కలెక్టరేట్ను విద్యుత్ దీపాలు, జాతీయ జెండాలతో అలంకరించారు. రాత్రివేళ విద్యుత్ వెలుగుల్లో కలెక్టరేట్ జిగేల్మంది. కాగా, కలెక్టరేట్ దారిలో వెళ్లే వారు విద్యుత్ వెలుగులను ఆసక్తిగా తిలకించారు. -
నారాయణపురంలో మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా
బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురంలో గ్రామస్తులు సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాల కంటే భిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ గ్రామస్తులు.. గ్రామంలో దాదాపు ఏడేళ్ల నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. గతంలో గల్లీకో బెల్టు షాపు ఉండేది. ఫలితంగా చాలా మంది ఉదయమే ‘టీ’కి బదులు మద్యం తాగే వారు. ఎంత చెప్పినా మందుబాబులు వినకపోవడంతో వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుని గ్రామంలో మద్యపానం నిషేధాన్ని అమలు చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యలు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ఇందుకు పలు శాఖల అధికారులు కూడా సహకరించడంతో నిషేధం విజయవంతమైంది. -
నకిలీ పాసుపుస్తకాల కలకలం!
● పుస్తకాల ప్రింటింగ్.. బ్యాంకు రుణాలు ● బ్యాంకర్లు సహకరించారనే అనుమానం ● చేతులు మారిన కోట్ల రూపాయలు ● పోలీసుల అదుపులో పలువురు నిందితులు సాక్షి, మహబూబాబాద్: భూమి పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా బ్యాంకులు రైతులకు పంట రుణాలు మంజూరు చేస్తాయి. రైతులు ఆ డబ్బులను పంట పెట్టుబడికి వినియోగించుకుంటారు. అయితే ఇదే అదునుగా పలువురు దళారులు నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయించి పలుచోట్ల బ్యాంకర్లను బురిడీ కొట్టించి రుణాలు తీసుకోగా.. మరికొన్ని చోట్ల బ్యాంకర్లతో కుమ్మకై ్క కోట్ల రూపాయలు కాజేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఈవిషయంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కొందరు రైతులను ప్రశ్నించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. పుస్తకాల ముద్రణ.. జిల్లాలోని కురవి, నెల్లికుదురు మండలాలకు చెందిన పలువురు యువకులు తమకు ఉన్న పరిచయాలతో మీసేవ ఇతర ఆన్లైన్ సెంటర్ల ద్వారా పాసుపుస్తకాలు, సర్వే నంబర్లు, భూ యజమానుల వివరాలు సేకరించారు. తర్వాత గతంలో నకిలీ పాసుపుస్తకాలు, సర్టిఫికెట్లు తయారు చేసిన ముఠాను ఆశ్రయించి నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయించుకున్నట్లు సమాచారం. ఇలా కురవి, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో పలువురు రైతుల నుంచి రూ.10వేల చొప్పున వసూళ్లు చేసి.. నకిలీ పాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణం పెంచి ఇచ్చారు. అలాగే అసలు భూమి లేని వారి వారి పేరున బ్యాంకు రుణాలు తీసుకునేందుకు సహకరించినట్లు ప్రచారం. ఇలా వందకుపైగా నకిలీ పాసుపుస్తకాలతో కోట్ల రూపాయలు రుణాల రూపేణా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు తండాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకుల రుణాలు.. ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా కూడా రుణాలు ఇచ్చేందుకు పలువురు బ్యాంకు మేనేజర్లు ఇబ్బందులు పెట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు పాసుపుస్తకం అసలుదా.. నకిలీనా అని పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే కొత్త రుణాలు ఇస్తారు. కానీ కొందరు బ్యాంకర్ల నకిలీ పాసుపుస్తకాలను పెట్టుకొని రుణాలు ఇవ్వడం ఏంటనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ విషయంలో పాసుపుస్తకాల ప్రింటింగ్, నకిలీ రైతులు, వీరికి బ్యాంకు రుణాలు ఇప్పి ంచే దళారులు ఇలా అందరి పాత్ర ఉన్నట్లు సమాచారం. నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు ఇచ్చేందకు కొందరు బ్యాంకు అధికారులు కూడా చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మానుకోట జిల్లాతో పాటు వరంగల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా అదుపులోకి తీసుకున్న వారి ద్వారా నకిలీ పాసుపుస్తకాల గుట్టును రట్టుచేసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. -
అడిషనల్ డీసీపీ రవికి ఇండియన్ పోలీస్ మెడల్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిపాలన విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న నల్లమల రవి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండ ప్రాంతానికి చెందిన అడిషనల్ డీసీపీ నల్లమల రవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేసి 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మెదక్ జిల్లాలోని శివంపేట, తుఫ్రాన్, మునిపల్లె పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. అనంతరం సీఐగా అమ్రాబాద్, మిర్యాలగూడ,సదాశివాపేట సర్కిల్ పీఎస్లలో పనిచేశారు. డీఎస్పీగా సంగారెడ్డి, జహీరాబాద్, అడిషనల్ డీసీపీ కరీంనగర్, పోలీస్ టైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్గా, అదనపు డీసీపీగా పనిచేశారు. నక్సల్ ప్రాబల్యం ఉన్న పీఎస్లల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోపాటు సమస్యాత్మాక ప్రాంతాల్లో కూడా విజయవంతంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రవికి సీపీ సన్ప్రీత్ సింగ్తోపాటు డీసీపీలు, అడిషనల్ డీసీపీ, ఏఎస్పీలు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
మద్యం మాటే లేదు..
ఏటూరునాగారం : ఆ రెండు గ్రామాల్లో మద్యం మాటే వినపడదు. పండుగ, ఇతర ఏ శుభకార్యమైనా ఉంటే మండల కేంద్రానికి వెళ్లి మద్యం పుచ్చుకోవాల్సిందే. అంతే తప్పా ఆ గ్రామాలకు తెచ్చుకోవడం.. దాచుకోవడం.. ఇంటి వద్ద పార్టీలు చేసుకోవడం లాంటి పనులకు తావేలేదు. ఆయా గ్రామస్తులు కట్టుమీద నిలబడుతున్నారు. అందుకే ఆయా గ్రామాలు 25 ఏళ్ల నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఇతర ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అవే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రానికి కూతవేటు దూరంలోని బూటారం, ఎక్కెల గ్రామాలు. ఈ గ్రామాలు మద్య పాన నిషేధం నూటికి నూరుశాతం అమలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి దివంగత సర్పంచ్ దుబ్బ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆ గ్రామాల్లోని మహిళలు, యువకులు గుడుంబా, మద్యం ధ్వంసం చేశారు. ఆ రోజు రాసిన తీర్మానాన్ని ఇప్పటికీ అవలంబిస్తున్నారు. ఎన్నికలు వచ్చినా ఆ గ్రామాలకు మద్యం రావాలంటే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. 2000, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి గ్రామాల్లో ఎవరూ మద్యం తాగడం, విక్రయించడం చేయొద్దని అందరు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఆ గ్రామాల్లో 25 ఏళ్ల నుంచి మద్యపాన నిషేధం -
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
‘దేశంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. దీనిని రూపుమాపినప్పుడే సమాజం బాగుపడుతుంది. బీద, ధనిక తేడాలు, అధికార దర్పం తదితర కారణాలతో స్వేచ్ఛాసమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు కొలువుదీరే చట్టసభలు న్యాయంగా పనిచేస్తేనే నాడు ఏ ఉద్దేశంతో అయితే బ్రిటిష్ వాళ్లనుంచి స్వాతంత్య్రం పొందామో ఆ ఫలితాలు తారతమ్యాలు లేకుండా అందరికీ చేరుతాయి.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లావాసులు అంటున్నారు. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో పలు అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా ప్రజలు తమ మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్అవినీతి పేదరికం నాణ్యమైన విద్య వైద్యం కుల వివక్ష మార్పు రావాలి.. -
ఆ రైతు స్ఫూర్తి ప్రదాత..
● సేంద్రియ సాగులో రాణిస్తున్న వెంకన్న మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం లక్ష్మీతండా జీపీ పరిధి బూరుకుంట తండాకు చెందిన రైతు ధరావత్ వెంకన్న సేంద్రియ వ్యవసాయం చేస్తూ సహరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వెంకన్నకు మూడెకరాల భూమి ఉండగా కొన్నేళ్ల క్రితం వరకు కూరగాయలు, వరి, ఇతర పంటలు సాగు చేశారు. కోతుల బెడద కారణంగా కూరగాయలు వేసినప్పుడు నష్టం జరిగింది. గతేడాది నుంచి కేవలం వరి మాత్రమే సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది సేంద్రియ పద్ధతిలో ఎకరంలో పూస బాస్మతి రకం, మిగతా రెండు ఎకరాల్లో మాంగ్యల్య సన్నరకం పంట సాగు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సేంద్రియ పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తూ వెంకన్న పలు అవార్డులు, రివార్డులు పొందారు. మండల స్థాయి ఉత్తమ రైతు అవార్డు పొందారు. అలాగే, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పలుమార్లు సన్మానాలు, ప్రశంస పత్రాలు స్వీకరించారు. మండల స్థాయి ఉత్తమ రైతుల ఎంపికలో రూ .10,116 నగదు పారితోషికం పొందారు. కాగా, వర్మి కంపోస్టు తయారుచేసి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్న వెంకన్నను ఆదర్శంగా తీసుకుని ఇతర రైతులు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పాలకేంద్రం వద్ద జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిన్నచిన్న గుంతలు పెద్దగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటిప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తాం
మరిపెడ రూరల్: గత ఏడాది ఆకేరు వాగు ఉధృతితో మండలంలోని సీతారాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాల మంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామని తొర్రూరు ఆర్డీఓ గణేష్ అన్నారు. ముంపు గ్రామాల పరిస్థితిపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘నెరవేరని హామీ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొర్రూ రు ఆర్డీఓ గణేష్ బుధవారం మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద ఆకేరు వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారాంతండా బాధిత గిరిజనులతో ఆర్డీఓ మాట్లాడారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటుందని, ఎవరు కూడా అధైర్యపడొద్దనిసూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని వారికి భరోసా కల్పించారు. మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పాకాల ఏటి వరద ఉధృతి పరిశీలన
గార్ల: గార్ల సమీపంలో చెక్డ్యామ్ పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల ఏరును బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీ లించారు. పాకాల ఏటి చెక్డ్యామ్ వద్ద ప్రమాదాలను నివారించేందుకు రహదారికి అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేసి డ్యూటీ పోలీస్ను నియమించాలని స్థానిక ఎస్సై రియాజ్పాషాను ఆదేశించారు. ఏరు ఉధృతి తగ్గేంత వరకు పగలు, రాత్రి వేళల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే తానే స్వయంగా హాజరవుతానని ఎస్పీ హామీ ఇచ్చారు. ప్రతీరోజు వరద ఉధృతి ఫొటోలను ఎస్పీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రవికుమార్, ఎస్సైలు ఎస్కె రియాజ్పాషా, తిరుపతిరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. సంప్రదాయాలను కాపాడుకోవాలిగూడూరు: బంజారాలు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మండల తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన తీజ్ నవరాత్రి వేడుకలు బుధవారం ముగిశాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తీజ్ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గోధుమ నారు బుట్టలను యువతులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తలపై పెట్టుకొని సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం సమీప పాకాలవాగులో గోధుమ నారు బుట్టలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతిని ధులు ధర్మానాయక్, వాల్యానంద స్వామి, బాలూనాయక్, లక్ష్మణ్నాయక్, గోపినాథ్, పెద్దలు పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుగార్ల: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) విజయనిర్మల హెచ్చరించారు. బుధవారం గార్ల, పుల్లూరు గ్రామాల్లో పలు ఎరువుల దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాస్ యంత్రాలతోనే ఎరువుల అమ్మకాలు జరపాలని, నిబంధనలు పాటించని డీలర్లపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. లైసెన్స్లో ఓఫారం పొందుపర్చిన ఎరువులనే రైతులకు అమ్మాలని, స్టాక్బోర్డులో ఎరువుల నిల్వ లు, ధరలు రైతులకు కనబడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. యూరియాకు బదులు నానో యురియా పంటలకు వాడాలన్నారు. డీఏఓ వెంట ఏఓ కావటి రామారావు, ఏఈఓ కిరణ్, రైతులు ఉన్నారు. రోడ్డుపై నాటు వేసి నిరసన బయ్యారం: బురదమయమైన రోడ్డుపై స్థానికులు బుధవారం నాటు వేసి వినూత్న నిరసన తెలిపారు. బయ్యారంలోని బండ్లమాంబ ఆలయ సమీపంలో ప్రధానరహదారి బురదమయంగా మారడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాటు నాటువేసి నిరసన తెలుపగా.. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి అక్కడికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో వరినారును తొలగించారు. -
కల్వల వాసికి అరుదైన అవకాశం
● ఆసియా పసిఫిక్ గ్రామీణాభివృద్ధి కేంద్రంలో ప్రోగ్రాం ఆఫీసర్గా వెంకటమల్లు నియామకంకేసముద్రం: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ(ఎన్ఐఆర్డీపీఆర్)లో రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం కల్వ ల గ్రామానికి చెందిన తాడబోయిన వెంకటమల్లు అంతర్ ప్రభుత్వ సంస్థ సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ (సీఐఆర్డీఏసీ)లో ప్రోగ్రాం ఆఫీసర్గా నియామకమయ్యారు. 15 దేశాల్లో గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో ప్రోగ్రాం ఆఫీసర్గా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు వెంకటమల్లును అభినందించారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్న ఆ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్గా తనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెంకటమల్లు పేర్కొన్నారు. -
16న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
హన్మకొండ: శ్రీ కృష్ణ జన్మాషమి వేడుకలను ఈ నెల 16(శనివారం)న ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోనే అత్యంత భారీగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యాదవ కుల దైవం శ్రీ కృష్ణుడు, బలరాముడని తెలిపారు. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మీదనే విద్యార్థులు, యువకుల దృష్టి సారిస్తున్నారు. అందుకే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు రాంనగర్ నుంచి శ్రీ కృష్ణుడి శోభాయాత్ర ప్రారంఽభమై అంబేడ్కర్ కూడలి, పోలీస్ హెడ్క్వార్టర్, అశోక, బస్టాండ్ కూడళ్ల మీదుగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం వరకు సాగుతుందన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమీ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, గిరబోయిన రాజయ్య యాదవ్, బొంగు అశోక్, కెంచ కుమారస్వామి, రాజేందర్, ఎల్లావుల కుమార్ యాదవ్, రజనీకుమార్, దూడయ్య, చెన్నమల్లు, బుట్టి శ్యాం యాదవ్, బొంగు రాజు యాదవ్ పాల్గొన్నారు. యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు -
కాకతీయుల శిల్పకళ అద్భుతం
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి విద్యారణ్యపురి: కాకతీయుల శిల్పకళ అద్భుతమని, నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయాస్ టెంపుల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై రెండు రోజులు నిర్వహించునున్న రాష్ట్రస్థాయి వర్క్షాప్ ప్రారంభ సభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల కాలంలో వివిధ కట్టడాల్లో నాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సౌండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ప్రభుత్వ పింగిళి మహిళా కళా శాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేందుకు ఈ వర్క్ షాప్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సాంస్కృతిక పరిశోధకుడు, తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ కీలకపోన్యాసం చేస్తూ దక్షిణాసియాలోనే ప్రసిద్ధ హోజసాల చాళుక్య శైలులతో కూడిన కాకతీయుల శిల్పకళా ప్రసిద్ధిగాంచిందన్నారు. రామ ప్ప, వెయ్యిస్తంభాల ఆలయాల్లో అద్భుత సౌందర్యం దాగి ఉందన్నారు. వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పదేవాలయాన్ని ప్రకృతి విపత్తులనుంచి పరిరక్షించుకోవాలన్నారు. కేయూహిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె.విజయబాబు మాట్లాడుతూ రామప్పదేవాలయంలో మదనిక, నాగిని వంటి శిల్పాల సౌందర్యం 800 సంవత్సరాలనాటి సాంకేతికత నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం కేయూ పాలకమండలి సభ్యుడు మల్లం నవీన్, హెరిటేజ్ యాక్టివిస్ట్ అరవింద్ ఆర్య, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ మాట్లాడారు. ఈ వర్క్షాప్లో కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు,శ్యామ్యూల్ప్రవీణ్కుమార్, యుగేంధర్, మధు, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పరికరాలు లేవు.. వైద్యం అందించలేము
ఎంజీఎం : పూర్తిస్థాయి వైద్యాధికారులు లేకపోవ డం, హెచ్ఓడీలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండ డం, వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతుండడం వెరసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద సార్లు ఉంటారు అని భరోసాతో వస్తున్న రోగులకు ఆశించిన మేర వైద్యం అందడం లేదు. అలాంటి ఘటనే ఇది. జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో వందలాది మంది రోగులకు చికిత్సలు అందిస్తున్న క్రమంలో పైల్స్తో బాధపడే ఓ రోగికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం అందించలేమని గెంటేసినంతా పనిచేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిపాలనాధికారులు క్యాజు వాలిటీ వద్దకు పరుగులు పెట్టి సదరు రోగిని అడ్మి ట్ చేసుకుని చికిత్స అందించడం మొదలు పెట్టా రు. వివరాలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండం కొండూరు గ్రామానికి చెందిన బాచబో యిన రత్నాకర్ అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక భార్య బుచ్చమ్మతో కలిసి సోమవారం ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు పైల్స్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని చెప్పి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కి వెళ్లాలని రెఫర్ చేశారు. దీంతో ఏమీ తోచని స్థితి లో సదరు రోగి మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లోనే వేచి ఉన్నాడు. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో రావడంతో వెంటనే ఎంజీఎం పరిపాలనాధికారులు కా ర్యాలయాలు వదిలి క్యాజువాలిటీ వద్దకు పరుగులు పెట్టారు. బాధితుడిని స్వయంగా అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స మొదలు పెట్టారు. కాగా, చివరకు మెరుగైన చికిత్స నిమిత్తం మళ్లీ హైదరాబాద్కు తరలించారు. ట్రాక్టర్ ప్రమాదంలో విద్యార్థి మృతి శాయంపేట : ట్రాక్టర్ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మంగళ వారం రాత్రి మండలంలోని నేరేడుపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై పరమేశ్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రా మానికి చెందిన షేక్ ఫరాజ్ అహ్మద్ (16) శాయంపేట మండలం నేరేడుపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరి మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. సా యంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో పా ఠశాల ఎదుట హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన షేక్షబినాబీకి చెందిన ట్రాక్టర్ను డ్రైవర్ ఉమర్ నడుపుకుంటూ వస్తుండగా షేక్ ఫరాజ్ అహ్మద్తో పాటు కొంత విద్యార్థులు ఎక్కారు. ఈ క్రమంలో నేరేడుపల్లి శివారులోని మలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయగా ట్రాక్టర్లో కూర్చున్న ఫరాజ్ అహ్మద్ ఎగిరి రోడ్డుపై పడగా తీవ్ర గాయాలయ్యాయి. వారి వెను క వస్తున్న అదే గ్రామానికి చెందిన షేక్ కరీం.. ఫరా జ్ అహ్మద్ తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఫరాజ్ అహ్మద్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి షేక్ కమ ల్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● ఎంజీఎంలో కొనసాగుతున్న రెఫరల్ ట్రీట్మెంట్ ● మూడు రోజులుగా వైద్యం కోసం క్యాజువాలిటీ ఎదుట పడిగాపులు ● సోషల్ మీడియా కథనాలతో రోగి వద్దకు వైద్యులు -
పాముకాటుతో మహిళ మృతి
కురవి: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిర్మలాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూల సుజాత(35) మార్చి 10వ తేదీన మొక్కజొన్న చేనులో పనిచేస్తుండగా పాముకాటు వేసింది. దీంతో కుటుంబసభ్యులు మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లింది. దీంతో ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 5వ తేదీన మళ్లీ మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
వేగంగా ‘భువన్’ సర్వే
సీడీఎంఏ ఆదేశాలతో.. సీడీఎంఏ ద్వారా వచ్చిన ఇళ్ల జాబితా ఆధారంగా భువన్ సర్వే చేస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. ఆన్లైన్ వివరాలకు.. యాప్లో నమోదైన వివరాల్లో తేడా ఉంటే దాని ప్రకారం పన్ను విధిస్తున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్స్లపై కూడా ఆయాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. గతంలో ట్రేడ్ లైసెన్స్లు కమర్షియల్లో ఉన్నాయా.. రెసిడెన్షియల్లో ఉన్నాయా అని చూడకుండా లైసెన్స్లు జారీ చేశారు. కాగా, సర్వే ద్వారా వాటి లెక్క కూడా తేలుతోంది. దీంతో కమర్షియల్ భవనమైతే లైసెన్స్ పన్ను పెంచుతున్నారు. ఒక్క మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 1150 ట్రేడ్ లైసెన్స్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.మహబూబాబాద్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వందరోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా భువన్ సర్వే చేపడుతున్నారు. యాప్లో ఇళ్ల వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే ట్రేడ్ లైసెన్స్లు కమర్షియల్లో ఉన్నాయా, రెసిడెన్షియల్లో ఉన్నాయా అనే అంశాలను కూడా సర్వేలో నమోదు చేస్తున్నారు. ఇళ్ల కొలతల్లో తేడాలు ఉంటే పన్ను పెంచి ఆన్లైన్ చేస్తున్నారు. కాగా, ఈ సర్వే ద్వారా మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఐదు మున్సిపాలిటీలు.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 57,828మంది ఓటర్లు, 68,889 మంది జనాభా, 25,000 పైచిలుకు గృహాలు ఉన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో 19,100 జనాభా ఉంది. మరిపెడలో 15 వార్డులు, 17,875 మంది జనాభా, డోర్నకల్లో 15 వార్డులు, 14,425 మంది జనాభా ఉంది. ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. ఈ ఏడాది జూన్ 2నుంచి వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే భువన్ సర్వే నిర్వహిస్తున్నారు. కొనసాగుతున్న సర్వే.. ఐదు మున్సిపాలిటీల్లో భువన్ సర్వే జరుగుతోంది. ప్రతీవార్డులో వార్డు ఆఫీసర్తో పాటు బిల్ కలెక్టర్ మరో ఇద్దరి సిబ్బందితో భువన్ సర్వే చేస్తున్నారు. ప్రతీ ఇంటిని ఆ యాప్లో నమోదు చేయడమే సర్వే లక్ష్యం. కాగా, గూగుల్ ద్వారా లొకేషన్లో అన్ని వివరాలు తెలుసుకునే అవకాఽశం యాప్ ద్వారా కలుగుతుంది. మానుకోట మున్సిపాలిటీలో 25,262 గృహాలు ఉండగా.. దాదాపు 23,000 గృహాలు నమోదు అయ్యాయి. 2,262 ఇళ్లు భువన్ యాప్లో నమోదు కాలేదు. అయితే ఆన్లైన్లో నమోదై పన్ను చెల్లిస్తున్నప్పటికీ భువన్ యాప్లో నమోదు కాలేదు. కాగా 2,262 ఇళ్లకు గానూ 1400ఇళ్లకు వెళ్లి కొలతలు వేసి యాప్లో నమోదుచేశారు. కొలతలు వేసి అదనంగా నిర్మాణాలు ఉంటే వాటిని నమోదు చేస్తున్నారు. తద్వారా ఆ ఇళ్లకు చెల్లించే పన్ను పెరిగి మున్సిపాలిటీలకు మరింత ఆదాయం సమకూరుతుంది. ఈనెలలో సర్వే పూర్తి రెండు నెలలుగా భువన్ సర్వే జరుగుతోంది. దీంతో ఇళ్ల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వే ద్వారా అదనపు నిర్మాణాలు బయట పడుతున్నాయి. దాని ప్రకారం ఇంటి పన్ను వేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ల వివరాలు కూడా పక్కాగా తెలిసి ఆదాయం పెరుగుతోంది. – టి.రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ ఇళ్ల కొలతలు, ట్రేడ్ లైసెన్స్ల వివరాలు యాప్లో నమోదు వందరోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మున్సిపాలిటీల్లో సర్వే కొలతల్లో తేడాలు ఉంటే పన్ను పెంపు -
విద్యుత్ పోటీల్లో వరంగల్ సర్కిల్ అత్యుత్తమ ప్రదర్శన
హన్మకొండ: టీజీ ట్రాన్స్కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ సర్కిల్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. కప్లు గెలుచుకున్నారు. 2025–2026 సంవత్సరానికిగాను టీజీ ట్రాన్స్ కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నిజామాబాద్లో జరిగాయి. ఇందులో హాకీలో ఉమ్మడి వరంగల్ సర్కిల్ జట్టు ప్రథమ స్థానం, కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించి ట్రోఫీలు అందుకుంది. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ పి.మధసూదన్ రావు, డీఈ టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ విజేందర్ రెడ్డిని ఇరు జట్ల క్రీడాకారులు కలిసి ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను అభినందించారు. హాకీలో ప్రథమ స్థానం, కబడ్డీలో ద్వితీయ స్థానం -
గిరిజనేతరుల ఆశలు!
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చసాక్షి, మహబూబాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన మాట వినపడితే చాలు జిల్లాలో ఏ నలుగురు ఒకచోట చేరినా ఇదే చర్చ జరుగుతోంది. గత నాలుగు పర్యాయాలు ఎస్టీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు ప్రస్తుతం జనరల్గా మారే అవకాశం ఉందా అని గిరిజనేతరులు లెక్కలు వేస్తున్నారు. అయితే ఆది వాసీలు, లంబాడ గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జనరల్గా మారడం అంత సులువు కాదని గిరిజన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పర్యాయాలుగా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం 2009కి ముందు జనరల్ కేటగిరిలో ఉండేది. వరుసగా 2009, 2014, 2018, 2024లో ఎస్టీ రిజర్వేషన్తో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత జరిగిన భౌగోళిక మార్పులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కలిసిన గార్ల, బయ్యారం మండలాల్లో కూడా అత్యధికంగా గిరిజనులే ఉన్నారు. దీంతో జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్తోపాటు ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో కూడా ఎస్టీ రిజర్వేషన్ కొనసాగుతూ వస్తోంది ఏ ప్రాతిపదిక పునర్విభజన.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే మూడు జిల్లాల జెడ్పీ, ఇతర రివ్యూ మీటింగ్లకు హాజరు కావాల్సి వస్తోంది. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమలులో కూడా మండలం ఒక జిల్లా, నిధుల కేటాయింపు మరో జిల్లాలో జరుగుతోంది. దీంతో ఎవరు ఎక్కడ దృష్టి సారించలేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బాగుంటుందనే ఆలోచన ఉంది. అయితే పునర్విభజన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అలా కాకుంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పునర్విభజన జరగాలి. అప్పుడు మళ్లీ బయ్యారం, గార్ల మండలాలు ఖమ్మం జిల్లా పరిధిలోకి వెళ్తాయి. అప్పుడు మళ్లీ ఇబ్బందులు తలెత్తుతాయి. కాగా ఏ ప్రాతిపదికన విభజన జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. ఆ రెండు పట్టణాలపైనే గిరిజనేతరుల ఆశలు జనరల్ స్థానం వస్తే గిరిజనేతరులు క్రియాశీలకం అంత సులువుగా రిజర్వేషన్ మారదని గిరిజన నాయకుల ధీమా రోజురోజుకూ పెరుగుతున్న ఉత్కంఠ -
‘భూ భారతి’ దరఖాస్తులను పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ దంతాలపల్లి: భూభారతి దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్, సిబ్బందిని భూభారతి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ సునీల్కుమార్, ఆర్ఐ రాజు, డీటీ శ్రీలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి మహబూబాబాద్: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేటితో ముగింపు
మరోసారి అవకాశం లభిస్తుందని పాలకవర్గాల ఆశ.. గత ప్రభుత్వం పీఏసీఎస్ల కాలపరిమితి ముగిసినా వాటినే పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగించింది. సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించలేక పోతే ఆరు నెలల పాటు పర్సన్ ఇన్చార్జ్లను నియమించొచ్చు. ఈ మేరకు ప్రస్తుత పాలకవర్గానికి ముందు ఉన్న కమిటీలను ఆరు మాసాల చొప్పును నాలుగు పర్యాయాలు పొడిగింపు ఇచ్చారు. దీంతో వారు అదనంగా రెండు సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగారు. ఈసారి కూడా గతంలో మాదిరి పర్సన్ ఇన్చార్జ్లుగా పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి ముగియనుండడంతో గతంలో మాదిరిగానే మరోసారి అవకాశం దక్కుతుందనే ఆశలో ప్రస్తుత పాలక వర్గాలున్నాయి. డీసీసీబీలకు కూడా ప్రస్తుత పాలకవర్గాలకు పొడిగింపు ఇచ్చారు. ఓడీసీఎంఎస్కు మాత్రం ప్రభుత్వం వరంగల్ అదనపు జిల్లా కలెక్టర్ను పర్సన్ ఇన్చార్జ్గా నియమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగగా చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది పీఏసీఎస్ చైర్మన్లు, మెజారిటీ డీసీసీబీ చైర్మన్లు అధికార కాంగ్రెస్లో చేరారు. దీంతో అంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మరోసారి తమకు పర్సన్ ఇన్చార్జ్ చైర్ పర్సన్లుగా పొడిగింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్ చైర్పర్సన్ల కొనసాగింపేనా?హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువు ముగుస్తోంది. దీంతో పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమను పర్సన్ ఇన్చార్జ్ చైర్ పర్సన్లుగా, కమిటీలుగా కొనసాగిస్తారా? లేక పదవీ కాలపరిమితి ముగియడంతో వైదొలగాల్సి వస్తోందా అనే మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గం ఎన్నిక ముందు గత పాలక వర్గాన్ని పర్సన్ ఇన్చార్జ్లుగా కొనసాగించారు. ఈసారి కూడా ప్రస్తుత పాలక వర్గాలకు ఆరు నెలల పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి నేటి(గురువారం)తో ముగుస్తుంది. దీంతో మరోసారి తమకే అవకాశం దక్కుతుందనే ఆశల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్సన్ ఇన్చార్జ్ చైర్పర్సన్లు ఉన్నారు. సహకార శాఖలో కనిపించని ఎన్నికల సన్నాహాలు.. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ప్రజాపరిషత్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గం కాల పరిమితి ముగిసి ఒకసారి పొడిగింపు అవకాశమిచ్చి ఆ కాలపరిమితి కూడా ముగుస్తున్నా ఆ శాఖలో ఎన్నికల సన్నాహాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిపే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుత పాలక వర్గాలు తమకు పొడిగింపు లభించొచ్చని ఆశిస్తున్నాయి. 2020, ఫిబ్రవరి 15న పీఏసీఎస్లకు ఎన్నికలు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు కావడంతో వీటి కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అదే విధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ఓరుగల్లు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఓడీసీఎంఎస్)ల కాల పరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 29తో ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పీఏసీఎస్లు ఉండగా వరంగల్ డీసీసీబీ పరిధిలో 91 సంఘాలున్నాయి. వరంగల్ డీసీసీబీ పూర్వ వరంగల్ జిల్లా పరిధి మేరకు విస్తరించి ఉంది. వరంగల్ డీసీసీబీ పరిధిలో హనుమకొండ జిల్లాలో 14 పీఏసీఎస్లు, భూపాలపల్లి జిల్లాలో 6, జనగామలో 14, మహబూబాబాద్లో 16, ములుగులో 11, సిద్దిపేటలో 2, వరంగల్ జిల్లాలో 28 పీఏసీఎస్లున్నాయి. అయితే నూతనంగా ఏర్పాటైన జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలో 16, వరంగల్లో 28, జనగామలో 14, మహబూబాబాద్లో 19, ములుగులో 12, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. 2025, ఫిబ్రవరి 12తో కాలపరిమితి ముగియగా ఆరు నెలలు పొడిగింపు నేటితో పూర్తి కానున్న పొడిగింపు పాలకవర్గాల కాలపరిమితి అయినా సహకార శాఖలో కనిపించని ఎన్నికల హడావుడి ఆరు నెలల వరకు ప్రస్తుత పాలకవర్గాన్ని పొడిగించే అవకాశం -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మరిపెడ రూరల్: వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిల్ వత్సల్ టొప్పో అన్నారు. గత ఏడాది ముంపునకు గురైన మండలంలోని పురుషోత్తమాయగూడెం పరిధి ఆకేరు వాగు బ్రిడ్జిని బుధవారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, రాత్రి వర్షం పడితే సహాయక చర్యలు చేపట్టేందుకు రిలీప్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, రాజేశ్వర్రావు, ఆర్ఎస్ శరత్చంద్ర, మున్సిపల్ కమిషనల్ విజయానంద్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి మహబూబాబాద్: అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా అలర్ట్ చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, బంధం చెరువును బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజేశ్వర్, అధికారులు ఉన్నారు. వ్యాధులపై జాగ్రత్తలు అవసరం మరిపెడ: విద్యార్థులు వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మరిపెడలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రుచికరమైన వేడివేడి ఆహారం వడ్డించాలన్నారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల పెద్దచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటల వద్ద అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. తహసీల్దార్లు కృష్ణవేణి, రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, ఎంపీడీఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానంపై అవగాహన ఉండాలి
● తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి హన్మకొండ: అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ బాలసముద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్కులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ అవయవ దానం అవసరమని చాటి చెప్పేందుకే ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో అవయవలేమితో ప్రతీ సంవత్సరం ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దేశంలో అవయవదానం రేటు అతి తక్కువ ఉందన్నారు. ప్రతీ 10 లక్షల మందికిగాను 0.65 మంది దాతలుగా ముందుకు వస్తున్నారని వివరించారు. పాశ్చాత్య దేశాలు స్పెయిన్, క్రొయేషియాలో 10 లక్షల మందికి గాను 30 మంది దాతలు అవయవదానానికి ముందుకువస్తున్నారన్నారు. భారతదేశంలోనూ అవయవదాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు, ప్రతినిధులు ఎం.పద్మ, నిమ్మల శ్రీనివాస్, భారతి, విజయ కుమారి, నిర్మల, జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, పుల్లారెడ్డి, రాంబాబు, అంజలి, భాస్కర్, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్ తరహా సేవలు..
హన్మకొండ: విద్యుత్ అంతరాయాల నివారణ, త్వరితగతిన పునరుద్ధరణకు టీజీ ఎన్పీడీసీఎల్ అంబులెన్స్ తరహా సేవలకు సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు, ఈదురు గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కలిగే విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి ఎమర్జెన్సీ రీస్టోర్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీ రిస్టోర్ టీం వాహనంతోపాటు సిబ్బంది, మెటీరియల్ నిత్యం అందుబాటులో ఉంటుంది. సమస్య తలెత్తిన క్షణాల్లో ఈ వాహనం అంబులెన్స్లా దూసుకెళ్తుంది. జీపీఆర్ఎస్ లోకేషన్ ద్వారా వేగంగా చేరుకుని సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. ఈవాహనంలో సంబంధిత మెటీరియల్ థర్మో విజన్ కెమెరాలు, రంపాలు, టార్చ్ లైట్లు, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్, ఇతర విద్యుత్ మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ సర్కిల్లో ప్రత్యేక డ్రెస్ కోడ్తో సిబ్బంది, మెటీరియల్, ఎమర్జెన్సీ రిస్టోర్ వాహనంతో సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలిగిన వెంటనే చేరుకునేలా సమాయత్తంగా ఉన్నారు.వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరావినియోగదారులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ అందిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలకు విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే సరఫరా పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ క్రమంలో ఎమర్జెన్సీ రిస్టోర్ టీంను సిద్ధంగా ఉంచాం. వీరు సమస్య తలెత్తిన వెంటనే వేగంగా చేరుకుని సరఫరా పునరుద్ధరిస్తారు. – కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్ సర్కిల్ టీజీ ఎన్పీడీసీఎల్లో ఎమర్జెన్సీ రీస్టోర్ టీం -
ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ
సాక్షిప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్గ్రౌండ్స్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా మహబూబాబాద్లో డిప్యూటీ స్పీకర్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్లో గౌరవ వందనం స్వీకరిస్తారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్లకు సూచించారు. పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు మహబూబాబాద్కు రామచంద్రునాయక్.. -
అలంకరణ లైట్లు సర్దుతుండగా..
తొర్రూరు: అలంకరణ లైట్లు సర్దుతుండగా ఓ యువకుడు విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజా మున మహబూ బాబా ద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. తొర్రూరు మండలం పెద్దమంగ్యా తండాకు చెందిన జాటోత్ సుమన్(30) వారాంతపు సంతల్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూ రు పట్టణం 2వ వార్డులోని అరుణోదయ కాలనీలో కొత్త ఇల్లు నిర్మించుకుని సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశాడు. మంగళవారం బంధువులకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంటి గోడపై అలంకరణ లైట్లు సర్దుతుండగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలాడు. బంధువులు గుర్తించి విద్యుత్ నిలిపివేసి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమన్కు గతంలో ఓ మహిళతో వివాహమై విడాకులు కాగా ప్రస్తుతం మరో మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● తొర్రూరులో ఘటన -
పింఛన్లు పెంచకుంటే గద్దె దించుతాం
పాలకుర్తి టౌన్: పింఛన్లు పెంచకుంటే సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించే మహా గర్జనను విజయవతం చేయాలని కోరుతూ మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం సాధన కోసం ఎమ్మారీఎస్ ఎంతో శ్రమించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వీడాలని, గడీ నుంచి బయటకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 లక్షల మంది దివ్యాంగులను మోసం చేస్తోందని, దీనిపై కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ. 6 వేలు, వృద్ధులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు పెంచి పింఛన్లు ఇస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకుండా రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పింఛన్ పెంపు ఎప్పుడు అమల్లోకి వస్తుందని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని 50 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సునీల్ మాదిగ, యాదగిరి స్వామి, తాళ్లపెల్లి కుమార్, గద్దల కిశోర్, దిండిగల వెంకన్న, గుండాల రవి, రమేశ్, వలపు వెంకన్న, సుధాకర్, జలగం నరేశ్, దండు రామచంద్రం, శ్రీధర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్కు మందకృష్ణ హెచ్చరిక పాలకుర్తిలో నియోజకవర్గ సన్నాహక సమావేశం -
ఆర్టీసీకి ఆదాయం
నెహ్రూసెంటర్: వరలక్ష్మీ వ్రతం, రాఖీ, బోనాల పండుగతో ఐదురోజుల పాటు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మహబూబాబాద్ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి 11వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సు లను నడిపించారు. సాధారణ ప్రయాణికులతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అధికంగా బస్సుల్లో ప్రయాణాలు సాగించారు. దీంతో 85.56 ఈపీకే, 139 ఓఆర్తో మహబూబాబాద్ డిపో ముందంజలో ఉంది. 5రోజులపాటు 47ప్రత్యేక బస్సులు, 167 ట్రిప్పులు, 1,8565 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా రూ.19,70,030 ఆదాయం సమకూరింది. అదే విధంగా తొర్రూరు డిపో నుంచి 93 రెగ్యులర్ బస్సులతో పాటు 10 ప్రత్యేక బస్సులను ఐదు రోజులు నడిపించగా రూ.1,77,15,571 ఆదాయం వచ్చింది. చాలెంజ్ల్లో ముందంజ.. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు, విహార యాత్రలు వంటి ఆర్టీసీ చాలెంజ్ కార్యక్రమాల్లో ముందు వరుసల్లో ఉండడంతో పాటు అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన డిపోల్లో నిలుస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా బిజీగా మారిన ఆర్టీసీ బస్సులు.. పండుగలు, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా మారుతున్నాయి. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా బస్సులను నడపడం ద్వారా మానుకోట ఆర్టీసీకి ఆదరణ పెరుగుతోంది. మహాలక్ష్మి పథకంలోనూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదురోజుల పాటు ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలు అధికంగా ప్రయాణాలు సాగించారు. మానుకోట డిపో నుంచి ఐదు రోజుల్లో 18,565 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగా అందులో అత్యధిక శాతం అనగా 13,031మంది మహిళా ఉచిత ప్రయాణికులే ఉన్నారు. ఇతర ప్రయాణికులు 5,534మంది ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రద్దీకి అనుగుణంగా.. బోనాలు, రాఖీ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 47 ప్రత్యేక సర్వీసులు, రెగ్యులర్ బస్సులను నడిపించాం. ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేశాం. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలి. ఆర్టీసీ చాలెంజ్లో ముందుండేలా ఉద్యోగులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. –ఎం.శివప్రసాద్, ఆర్టీసీ డీఎం, మానుకోట తొర్రూరు డిపోకు వచ్చిన ఆదాయం తేదీ కిలోమీటర్లు ఆదాయం 7 40590 రూ.2,378,289 8 42536 రూ.3,216,026 9 47725 రూ.4,758,067 10 41684 రూ.3,081,017 11 46841 రూ.4,282,172ఐదు రోజుల్లో మానుకోట డిపోకు వచ్చిన ఆదాయం తేదీ బస్సులు ట్రిప్పులు కిలోమీటర్లు ఆదాయం 7 2 6 744 రూ.58,450 8 13 38 6104 రూ.5,52,780 9 12 44 5818 రూ.5,04,310 10 7 32 3516 రూ.2,94,570 11 13 47 6842 రూ.5,59,920 రాఖీ, బోనాల పండుగకు ప్రత్యేక బస్సులు మానుకోట డిపోకు ఐదు రోజుల్లో రూ.19 లక్షల ఆదాయం తొర్రూరు డిపోకు రూ.1.77కోట్ల ఆదాయం -
29న కేయూ డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొంది ఆరో సెమిస్టర్ పరీక్షలో ఒక సబ్జెక్టు ఫెయిల్యిన విద్యార్థులకు ఈనెల 29న ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించనున్నామని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. సంబంధిత కళాశాలల నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కేయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్ను చూడాలని రాజేందర్ పేర్కొన్నారు. కేజీబీవీలో డీఆర్ఓ విచారణ బచ్చన్నపేట : మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. ‘టీచర్లు కొడుతున్న విషయం చెప్పొద్దు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జీసీడీఓ గౌసియాబేగం స్పందించి మంగళవారం విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటలకు కేజీబీవీకి వచ్చిన అధికారులు పాఠశాలలోని ప్రతీ విద్యార్థితో సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడారు. అలాగే, ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు. సీఈసీ సెకండియర్లో ఆరుగురు బాలికలకు టీసీలు ఎవరు ఇస్తామన్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే, క్రమశిక్షణతోపాటు నాణ్యమైన బోధన చేపట్టాలన్నారు. విచారణ నివేదికను కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులకు అందిస్తామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషలాఫీసర్ గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడి రిమాండ్ కన్నాయిగూడెం: కూలి హత్య కేసులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనువాస్, ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. సీఐ శ్రీనువాస్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం స ర్వాయి గ్రామానికి చెందిన మడి రాజబాబు భ వన నిర్మాణ పనికి వెళ్లి మేసీ్త్ర కుమ్మరి బాబును కూలీ అడిగాడు. ఈ విషయంలో మేసీ్త్ర బావమరిది కోరం రంజిత్.. రాజబాబును హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేశారు. నిందితుడిని పట్టుకుని విచారించిన అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఉద్యాన పంటల ఆవశ్యకతను గుర్తించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరూ ఉద్యాన పంటల ఆవశ్యకతను గుర్తించాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సెంట్రల్ తెలంగాణ జోన్ హెడ్ సుచిత్ర అన్నారు. ఈమేరకు మంగళవారం మహబూబాబాద్ మండలం మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానంలో ఐసీఏఆర్, ఐఐఎంఆర్ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఆర్థిక సౌజన్యంతో ఉద్యాన పంటల సాగుపై రైతులకు శిక్షణ నిర్వహించి మొక్కలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఉద్యాన పంటల ఆవశ్యకత, ప్రస్తుతం మార్కెట్ డిమాండ్, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై తెలిపారు. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనలు, మామిడి తోటల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, నీటి యాజమాన్యంపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి కత్తుల నాగరాజు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కవిత, శాస్త్రవేత్త క్రాంతికుమార్, జేవీఆర్ హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్త ప్రశాంత్, కేవీకే శాస్త్రవేత్త సుహాసిని పాల్గొన్నారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సెంట్రల్ జోన్ హెడ్ సుచిత్ర -
రజితకు కన్నీటి వీడ్కోలు..
● నివాళులర్పించిన రచయితలు, వివిధ సంఘాల ప్రతినిధులు ● మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్, రిజిస్ట్రార్ రామచంద్రం ● కేఎంసీకి రజిత భౌతికకాయం దానం కేయూ క్యాంపస్ : ప్రముఖ కవి, రచయిత్రి, ప్రజా స్వామిక రచయిత్రీల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలోనివాసం ఉండే అనిశెట్టి రజిత (67)సోమవా రం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విష యం విధితమే. రజిత కేయూలో నాన్టీచింగ్లో జూని యర్ అసిస్టెంట్గా పనిచేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఉద్యోగవిరమణ పొందారు. ఆమె అవివా హిత. కొంతకాలంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. గుండెపోటు వచ్చి అపస్మారకస్థితికి చేరడంతో రచయిత శోభారమేశ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి యజమాని నిరాకరించడంతో కేయూ తెలుగు వి భాగం రిటైర్డ్ ఆచార్యులు కాత్యాయనివిద్మహే ఇంటి వద్దకు రజిత భౌతికకాయాన్ని తరలించారు. ఇ క్కడ రచయితలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు.. రజితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజితతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర.. ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత మృతి బాధాకరమని, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారని మాజీ ఎ మ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రజిత భౌ తిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వి లువలతోకూడిన జీవితానికి ఆమె నిదర్శనమన్నా రు. సీ్త్ర సామాజిక సమానత్వం కోసం తన రచనల ద్వారా చైతన్యం నింపారన్నారు.అనిశెట్టి రజిత తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపర్చారని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. అనిశెట్టి రజిత మృతి ప్రజాస్వామిక రచయిత్రిల వేదికకు తీరని లోటని ఆవేదిక జాతీయ కార్యదర్శి ఎల్లూరి మాన స అన్నారు. రచయిత్రీగా రజిత తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడించేవారని పౌరహక్కు ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డల లక్ష్మణ్ అన్నారు. ఘన నివాళి.. అనిశెట్టి రజిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కేంద్రసాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్యనవీన్, రచయితలు బన్నఅయిలయ్య, వీఆర్ విద్యార్థి, టి చందు, తాయమ్మరణ, శోభారమేశ్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, ప్రజాఫ్రంట్ నేత బి.రమాదేవి, మహిళా సంఘం నేత సదాలక్ష్మి, ప్రొఫెసర్ శ్రీనివాస్రావు, రిటైర్డ్ ప్రొఫెసర్లు జ్యోతిరాణి, వి.శోభ,గిరిజారాణి, విజయలక్ష్మి, కిష్టయ్య, విరసం నేత కుమారస్వామి, ప్రముఖ అనువాద రచయిత నలిమెల భాస్కర్, బంధుమిత్రుల కమిటీ బాధ్యురాలు భారతక్క ఉన్నారు. కేఎంసీకి రజిత భౌతికకాయం దానం సంతాపసభ అనంతరం రచయితలు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు అంబులెన్స్లో రజిత భౌతికకా యంతో కేయూ మొదటి గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రజితకు జోహార్లు అ ర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని వరంగల్ కేఎంసీకి తరలించి దానం చేశారు. అంతకు ముందు నేత్ర వైద్యులు రజిత నేత్రాలు సేకరించారు. వివిధ సంఘాల బాధ్యుల సంతాపంప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత మృతి బాధాకరమని, సమాజంలో మహిళల హక్కులపై తన రచనలతో చైతన్యం కలిగించారని మానవ హక్కుల వే దిక బాధ్యుడు జీవన్కుమార్ తన ప్రగాఢ సంతా పం తెలిపారు. అదేవిధంగా సహృదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరాబాబు, ఉపాధ్యక్షుడు ఎన్వీఎన్చారి, సాహిత్య కార్యదర్శి మల్యాల మనోహర్రావు, వనం లక్ష్మీకాంతారావు, లక్ష్మణరావు, కాళోజి ఫౌండేషన్ బాధ్యుడు డాక్టర్ ఆగపాటిరాజ్కమార్ సంతాపం తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
మరిపెడ రూరల్: MýS$r$…º çÜ¿¶æ$Å-ÌS…§ýlÆý‡* MýSÍíÜ K Ô¶æ$¿ýæ-M>Æ>Å-°MìS ÐðlâýæÏ-V> C§ól A§ýl$-¯]l$-V> ¿êÑ…-_¯]l §ö…VýS-Ë$ ™éâýæ… ÐólíÜ E¯]l² C…sZÏ ^øÈMìS ´ëÌS-µyézÆý‡$. D çœ$r¯]l ÝùÐ]l$-ÐéÆý‡… Æ>{† Ð]l$çßæ-º*»ê»ê§Šæ hÌêÏ Ð]l$ Çò³yýl Ð]l$…yýl-ÌS… º$Æ>ᯌS-ç³#-Æý‡…-ÌZ ^ør$ ^ólçÜ$-MýS$…¨. »ê«¨™èl MýS$r$…º çÜ¿¶æ$Å-Ë$, ´ùÎçÜ$ÌS MýS£ýl¯]l… {ç³M>Æý‡….. {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l VýSyýlz… Ððl…MýS-sŒæ-Æð‡yìlz Ð]lÅÐ]l-ÝëĶæ$ ^ólçÜ$-MýS$…r* iÐ]l¯]l… ÝëWçÜ$¢-¯é²yýl$. BĶæ$-¯]lMýS$ MýS$Ð]l*Æð‡¢, MýS$Ð]l*-Æý‡$yýl$ E…yýl-V> C§ýlª-ÇMîS ÑÐéàÌS-Ķæ*ÅÆ‡$$. M>V>, MýS$Ð]l*Æð‡¢ C…sZÏ K Ô¶æ$¿ýæ-M>Æý‡Å… E…yýl-V> MýS$r$…½MýS$-ÌS…™é MýSÍíÜ D ¯ðlÌS 9Ð]l ™ól©¯]l కM>iõ³r ÐðlâêÏÆý‡$. C§ól A§ýl$-¯]l$-V> ¿êÑ…-_¯]l §ýl$…yýl-VýS$-Ë$ C…sZÏS ^öÆý‡-ºyìl ½Æý‡$-Ðé ç³VýS$-ÌS-Vösìæt A…§ýl$-ÌZ ¿ýæ{§ýl-ç³-Ç_¯]l BÆý‡$ ™èl$ÌêÌS º…V>Æý‡$ B¿ýæ-Æý‡-×êË$, Æý‡*.50 ÐólÌS ¯]lVýS§ýl$ Aç³-çßæ-Ç…^éÆý‡$. Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ™ðlÌS-ÏÐéÆý‡$-gêÐ]l¬¯]l C…sìæ ™èlË$ç³#-Ë$ ¡íÜ E…yýl-yýl…-™ø Ý린MýS$-ÌSMýS$ A¯]l$-Ð]l*¯]l… Ð]l_a Ķæ$fÐ]l*-°MìS ¸ù¯ŒS §éÓÆ> çÜÐ]l*-^éÆý‡… A…¨…-^éÆý‡$. ©…™ø MýS$r$…º çÜ¿¶æ$Å-Ë$ çßæ$sêçßæ$-sìæ¯]l {V>Ð]l*-°MìS ^ólÆý‡$-MýS$° ´ùÎçÜ$-ÌSMýS$ çÜÐ]l*-^éÆý‡… A…¨…-^éÆý‡$. D Ðól$Æý‡MýS$ ïÜI Æ>gŒæ-MýS$-Ð]l*-ÆŠæ, GOòÜÞ çܡԌæ, A§ýl-¯]lç³# GOòÜÞ Møsôæ-ÔèæÓ-ÆŠ‡-Æ>Ð]l# çœ$r¯é çܦÍMìS ^ólÆý‡$-MýS$° B«§é-Æ>Ë$ õÜMýS-Ç…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… Ķæ$fÐ]l*° Ððl…MýS-sŒæ-Æð‡yìlz íœÆ>ŧýl$ Ðól$Æý‡MýS$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MýS$° §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢-¯]l²r$Ï ïÜI Æ>gŒæ-MýS$-Ð]l*ÆŠ‡ ™ðlÍ´ëÆý‡$. ఆరు తులాల బంగారం, రూ.50 వేలు అపహరణ బుర్హాన్పురంలో ఘటన -
బేస్బాల్ సీనియర్ జిల్లా జట్ల ఎంపిక
మహబూబాబాద్ అర్బన్: జిల్లా బేస్బాల్ సీనియర్ మహిళా, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు బేస్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్లూరు ప్రభాకర్ అన్నారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ ఎంపికలో పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సమ్మెట ప్రేమ్కుమార్, బేస్బాల్ అసోసియేషన్ బాధ్యులు, ఫిజికల్ డైరెక్టర్లు ఆవారి శ్రీనివాస్, తులసి పద్మావతి, సురేష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కేసముద్రం: కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ కలెక్టర్ లెని న్ వత్సల్ టొప్పో హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎరువుల దుకాణం, పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్కు అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. పీహెచ్సీలో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా,శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను, డంపింగ్ యార్డు, అంతర్గత పనులు పూర్తి చేయాలని సూచించారు. తహసీల్దార్ వివేక్, ఎస్సై మురళీధర్రాజు, ఏఓ వెంకన్న, వైద్యసిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
దంచికొట్టిన వాన
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 10 ప్రాంతాల్లో 2 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లిలో కుండపోత వర్షం పడటంతో ఆ ప్రాంతంలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అలాగే జిల్లా మీదుగా ప్రవహించే ఆకేరు వాగు, మున్నేరు, పాలేరు, రాళ్లవాగు, పందిపంపుల మొదలైన వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చెరువులు అలుగు పోయడం, వాగులు పొంగడంతో ఏజెన్సీ ప్రాంతాలు కొత్తగూడ, గంగారం, గూడూరుతో పాటు దంతాలపల్లి మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు ఇబ్బందిగా మారింది. న్యూస్రీల్ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులుకొత్తగూడ: ఏజెన్సీలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గాదె వాగు, ముసలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నర్సంపేట నుంచి ఉదయం 11గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రజలు దాటకుండా ఎస్సై రాజ్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాళ్లఒర్రె బ్రిడ్జి కోతకు గురై గుంత ఏర్పడడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాగుల ఉధృతిని తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ రాజారాణి పర్యవేక్షించారు. జిల్లాలోని పది ప్రాంతాల్లో భారీ వర్షం పెద్దవంగరలో కుండపోత పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం -
బకాయిలు వెంటనే చెల్లించాలి
నెహ్రూసెంటర్: పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఽమంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ... పదివేల మంది కార్మికులకు బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని, పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యానికి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్తో పాటు అన్ని రకాల బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎం శివప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టాబి లక్ష్మ య్య, ఆర్.ముత్తయ్య, నాగేశ్వర్రావు, సాంబయ్య, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, కోటయ్య, సత్యనారాయణ, రాధాకృష్ణ, కృష్ణమూర్తి, రాజమల్లు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా -
సగానికిపైగా డిగ్రీ సీట్లు ఖాళీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో సీ ట్లు ఎక్కువ శాతం భర్తీకాగా మరికొన్ని కళాశాలల్లో తక్కువ భర్తీ అయ్యాయి. పలుకోర్సులకు డిమాండ్ ఉండగా కొన్నింటికీ అంతగా ఆదరణ లభించడడం లేదు. మూడు దశల్లోనూ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు కల్పించారు. ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలు కల్పించగా స్పెషల్ ఫేజ్లో సీట్లు కేటాయించిన వారికి రిపోర్టింగ్ కూడా మంగళవారం ముగిసింది. యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్, అటానమస్ డిగ్రీ కాలేజీలు 211 ఉన్నాయి. అందులో బీఏ, బీఎస్సీ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీబీఏ రిటైల్ పలు కోర్సులు కంప్యూటర్ బేస్డ్ తో కూడా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇందులో 97వేల 930సీట్లు ఉన్నాయి. మూడుదశల్లోనూ, స్పెషల్ ఫేజ్లో కలిపి ఇందులో సోమవారం వరకు 40,585 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అక్కడక్కడ కాలేజీల్లో వేళ్లమీద లెక్కపెట్టేంత మంది అడ్మిషన్లు మినహా ఇంకా సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండబోతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు.. విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు కంటే వృత్తివిద్య, ఉపాధి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, పారా మెడికల్ తదితర కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులు డాటా సైన్స్ లైఫ్ సైన్సెస్తో కూడిన త దితర కోర్సులున్నప్పటికీ అంతగా ఆసక్తి చూపడంలేదు. డిగ్రీ విద్యార్థుల కోసం కొన్ని సంవత్సరాలు గా కేయూ పరిధిలో 30 వరకు గురుకుల డిగ్రీ కళా శాలలు కూడా ఏర్పాటై కొనసాగుతున్నాయి. కొందరు విద్యార్థులు గురుకుల డిగ్రీకళాశాలల్లోను నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో కూడా ప్ర భుత్వ కళాశాలల అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్లో మొ త్తం 1,770 సీట్లకు 1,110 మాత్రమే భర్తీ అయ్యా యి. పింగిళి మహిళా కళాశాలలో 1,200 సీట్లకు 706 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. అలాగే ఇతర డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీలకే.. డిగ్రీలో దోస్త్ ద్వారా సీట్లు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం గడువు ముగిసింది. ఆ తరువాత ఈనెల 13,14 తేదీల్లో రెండు రోజులపాటు ఇప్పటివరకు ఏఏ కళాశాలల్లో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నేరుగా తమ కళాశాలల్లో వేకెన్సీ సీ ట్లను భర్తీ చేసుకునే వీలు కల్పించింది. అయితే ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీచేసుకునేందకు అవకాశం కల్పించాలని ఆ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేందర్రెడ్డి, ఇతర బాధ్యులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.అవకాశం ఇస్తారా లేదా అని చూడాల్సిందే.కేయూ పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలు : 211 మొత్తం సీట్లు : 97,930భర్తీ అయిన సీట్లు : 40,585కేటాయింపులు, భర్తీ సీట్ల వివరాలు.. కేయూ పరిధిలో మొదటిదశలో డిగ్రీ కళాశాలలకు 10,652 సీట్లు కేటాయించగా 5,289 మంది రిపోర్టు చేశారు. రెండో దశలో 9,732 సీట్లు కేటాయించగా అందులో 6,550 సీట్లు భర్తీ అయ్యాయి. మూడోదశలో 21,373 సీట్లు కేటాయించగా అందులో 17,019 సీట్లు భర్తీ అయ్యాయి. స్పెషల్ ఫేజ్లో 12,916 సీట్లు కేటాయించగా అందులో 11,727 మొత్తంగా 40,585 సీట్లు భర్తీ అయ్యాయి. కేయూ పరిధిలో మొత్తం 97,930 సీట్లకు భర్తీ అయ్యింది 40 వేలే.. మూడు దశలు, స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు కూడా పూర్తి నేడు, రేపు ప్రైవేట్ కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు సాంకేతిక కోర్సులు అందించినా ఆదరణ కరువు -
పొంగిన పాకాల వాగు..
కేసముద్రంలో.. కేసముద్రం: మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని కుంటలు, చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. అర్పనపల్లి గ్రామంలో వట్టివాగు బ్రిడ్జి మీదుగా వరదనీరు ప్రవహించింది. దీంతో గూడూరు, కేసముద్రం మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వట్టివాగు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. గూడూరు సమీప నెక్కొండ, కేసముద్రం రోడ్డులో పొంగిన పాకాల వాగుగూడూరు: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గూడూరు సమీప నెక్కొండ, కేసముద్రం రహదారిలోని పాకాలవాగు మంగళవారం సాయంత్రం పొంగి ప్రవహించింది. దీంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. దంతాలపల్లిలో.. దంతాలపల్లి: మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారి అలుగు పోస్తున్నాయి. పాలేరు వాగు బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో పెద్దముప్పారం గ్రామానికి దంతాలపల్లికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
తెలంగాణ సైన్స్కాంగ్రెస్కు ఏర్పాట్లు చేయాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్కు ఏర్పాట్లు చేయాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అకడమిక్ కమిటీ హాల్లో సంబంధిత కమిటీల బాధ్యులతో నిర్వహించిన సమీక్షలో వీసీ మాట్లాడారు. సైన్స్కాంగ్రెస్కు హాజరు కాబోయే అతిథులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో కూడా అందుకనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. క్యాంపస్లోని పలు సెమినార్హాళ్లలో పేపర్ ప్రజెంటేషన్లు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆధునిక సాంకేతిక పరికరాలను కూడా ఏర్పాటుచేయాలన్నారు.ఈ సమీక్షలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్లు మల్లారెడ్డి, ఎన్. ప్రసాద్, స్వర్ణలత, డి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
కురవి పోలీస్స్టేషన్ తనిఖీ
కురవి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మంగళవారం తనిఖీ చేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలు, వాహనాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. సిబ్బంది పని తీరును పరిశీలించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులను తరచూ చెక్ చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన వెంట మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బి.బిందు, బి.గణేష్ రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు మందుల శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు నట్టె రవి, పెరుమయ్య, రవికుమార్, ఉమారాణి, కృష్ణ, ప్రభాకర్, నాగవర్థన్, ఫిజికల్ డైరెక్టర్ అవారి శ్రీనివాస్ అభినందించారు. అక్షరాస్యత పెంచాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో నిరక్షరాస్యతను రూపుమాపి అక్షరాస్యతను పెంచాలని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలో మంగళవారం వయోజన విద్య.. నవభారత్ సాక్షరత కార్యక్రమంపై రిసోర్స్పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అక్షరాస్యతతో సమాజంలో ఎదురయ్యే మోసాలను తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను తెలుసుకొని ఆర్థికంగా, సామాజిక ఎదుగుదలకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,5768 మంది నిరక్షరాస్యులున్నారని, వారంతా ఉల్లాస్ యాప్లో నమోదై.. ప్రతీ ఒక్కరు అక్షరాస్యత సాధించాలన్నారు. శిక్షణ పొందిన రిసోర్స్పర్సన్లు జిల్లా 100శాతం అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్సు డైరెక్టర్ బి.అప్పారావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డీడీ ఎడ్యుకేషన్ అధికారి ధన్రాజ్, ఆర్పీలు ప్రవీణ్ కుమార్, యాదగిరి, మహేష్, పాఠశాల హెచ్ఎం సిరినా యక్ తదితరులు పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 31 శాతం, రెండో సెమిస్టర్లో 30 శాతం, మూడో సెమిస్టర్లో 35 శాతం, నాలుగో సెమిస్టర్లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్లో చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, జి.పద్మ, ఆసిం ఇక్బాల్, చిర్ర రాజు, వి.మహేందర్, పి.వెంకటయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : ఇద్దరు చైన్ స్నాచర్ల అ రెస్ట్ చేసి వారి వద్ద నుంచి 27 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ టౌన్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమవారం తొర్రూరు మండలం మాటేడుకు చెందిన ముత్యం ప్రేమలీలను కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును ఇద్దరు వ్యక్తులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే తొర్రూ రు పోలీసులు.. దంతాలపల్లి ఎస్సై రాజుకు విష యం తెలిపారు. ఎస్సై సూచన మేరకు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గణేశ్, లోకేశ్ వెంబడించి రామానుజపురానికి చెందిన మల్లం లింగయ్య సహకారంతో సూర్యాపేట జిల్లా మద్దిరాల పీఎస్ పరిధిలోని వేములపల్లి వైపునకు పారిపోయినట్లు తెలుసుకుని ఆ గ్రామస్తులు, సాయి, ఉదయ్, భిక్షపతికి సమాచారం చేరవేశారు. అంతలోనే తొర్రూరు, దంతాలపల్లి ఎస్సైలు ఉపేందర్ రావు, రాజు అక్కడికి చేరుకుని నేరం జరిగిన గంటలోనే ఉత్తర్ప్రదేశ్కు చెందిన చైన్స్నాచర్లు వికాస్ కుమార్, శుభంకుమార్ను అరెస్ట్ చేసి బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో సహకరించిన ప్రజలను, తొర్రూరు సీఐ గణేశ్, ఎస్సైలు ఉపేందర్ రావు, రాజు, బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గణేశ్, లోకేశ్ను ఎస్పీ అభినందించారు. 27 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
శైవ క్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: శ్రావణమాసం సందర్భంగా శైవ క్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పంచారామాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ఈ నెల 17న హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రలో భక్తులు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలు అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర లింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శించుకోవచ్చన్నారు. ఒకే రోజు ఐదు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలు పొందొచ్చన్నారు. ఈ యాత్ర బస్సులు ఆగస్టు 17న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం ఉదయం హనుమకొండకు చేరుకుంటాయన్నారు. సూపర్ లగ్జరీ సర్వీస్ చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,400 నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం, టికెట్ బుకింగ్ కోసం 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గార్ల: గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను నివారించేందుకు గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశవర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపట్టాలన్నారు. విషజ్వరాలతో బాధపడే వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఇప్పటి వరకు మండలంలో ఎన్ని డెంగీ కేసులు నమోదయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి గుంటలు, ప్లాస్టిక్ డబ్బాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, డాక్టర్లు రాజ్కుమార్ జాదవ్, శివకుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
రైలు ఎటొస్తుందో..
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్లో వరంగల్ వైపు వెళ్లే రైళ్లు ఏ ప్లాట్ఫాంపైకి వస్తాయో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ వైపు వెళ్లే రైళ్లు సహజంగా ఒకటి, రెండో నంబర్ ప్లాట్ఫారాలపైకి రావాలి. అయితే రెండు, మూడో నంబర్ ప్లాట్ ప్లాట్ఫారాలపైకి రైళ్లు వస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది సేపట్లో ఒకటి, రెండో నంబర్ ప్లాట్ఫారాలపైకి రావాల్సిన రైలు మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తుందని మైక్లో అనౌన్స్ చేస్తుండడంతో ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా పరుగున వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జి, మెట్లపై కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి, రెండో ప్లాట్ఫారాలపై నిత్యం గూడ్స్ రైళ్లు నిలిచి ఉండడంతో ఎక్స్ప్రెస్ రైళ్లను మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి మళ్లిస్తున్నారు. అధికారులు స్పందించి వరంగల్ వైపు వెళ్లే రైళ్లను ఒకటి, రెండో నంబర్ ప్లాట్ఫారాల మీదుగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కట్టుకాల్వలో పిచ్చి మొక్కల తొలగింపు
డోర్నకల్: మున్నేరువాగు నుంచి సీతారాంపు రం వరకు విస్తరించి ఉన్న కట్టుకాల్వ లో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు పనులు జరుగుతున్నాయి. కాల్వలో చెట్లు, పిచ్చి మొక్కలు పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితులపై ఈనెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ‘చివరికి నీరందేనా?’ అనే శీర్షికన వెలువడిన కథనంపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈమేరకు సోమవారం కట్టుకాల్వలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తను తొలగించే పనులు చేపట్టారు. పనులను పరిశీలించిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల హాస్టల్స్ ప్రారంభించాలినెహ్రూసెంటర్: మానుకోట పట్టణంలోని వైద్య కళాశాల హాస్టళ్లను వెంటనే ప్రారంభించి, విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు డిమాండ్ చేశారు. సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. మెడికల్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా.. నిర్మాణాలు పూర్తయిన హాస్టల్ భవనాలను ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ సింహాద్రి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బాషపాక పవన్, గుండ్ల రాకేశ్, నాయకులు మహేశ్, వినోద్, ప్రవీణ్, యాకన్న, ప్రమోద్, నరేశ్ పాల్గొన్నారు. దాడిచేసిన వారిపై కేసు నమోదు చేయాలిమహబూబాబాద్ అర్బన్: నిర్మల్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఎస్టీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ సమక్షంలో రాజేష్ నాయక్పై దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దుర్భాషలాడుతూ కులం పేరుతో అసభ్యపదజాలాన్ని ఉపయోగించిన మహేశ్వర్రెడ్డి అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా డీఈఓపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. సమావేశంలో సంఘం నాయకులు నిలయ్య శ్రీనివాస్, వాసం నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్లో నూతన బ్రేకర్లు ప్రారంభంనెల్లికుదురు: మండల కేంద్రంలోని 11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో నూతన బ్రేకర్లను ప్రాంభించినట్లు ఎన్పీడీసీఎల్ మహబూబాబాద్ ఎస్ఈ పి.విజేందర్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లో నైనాల నుంచి రావిరాల బ్రేకర్ మరమ్మతులు చేసినట్లు తెలిపారు. చిన్ననాగారం సబ్ స్టేషన్లో 11 కేవీ సీతారాపురం ఫీడర్ను వేరుచేసి నూతన బ్రేకర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందడంతో పాటు విద్యుత్ అంతరాయాలు తుగ్గుతాయన్నారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు రవి, చలపతిరావు, సింధూ, సిబ్బంది పాల్గొన్నారు. -
కలగానే కళాక్షేత్రం?
సాక్షి, మహబూబాబాద్: నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి.. తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయడంలో కవులు, రచయితలు, కళాకారుల పాత్ర కీలకమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జిల్లా కేంద్రంలో కళాకారుల ప్రదర్శనలకు వేదిక లేకపోవడం శోచనీయం. వేదిక నిర్మాణం కోసం పార్టీలు, పాలకులు ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారే తప్ప.. పనులు చేపట్టలేదు. అడుగు పడినట్లే పడి.. జిల్లాలో ప్రముఖ కవి దాశరథి పేరిట కళాక్షేత్రం నిర్మించాలనే ఆలోచన దశాబ్దకాలం క్రితమే వచ్చింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మానుకోట పట్టణంలోని శిథిలావస్థకు చేరుకున్న ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం కూల్చివేసి వేరోచోట అవసరాలకు అనుగుణంగా కొత్త భవనం నిర్మించా లని ఆలోచించారు. తహసీల్దార్ కార్యాలయం స్థానంలో కళా క్షేత్రం నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మానుకోట మున్సిపాలిటీకి రూ.100కోట్లు తన ప్రత్యేక నిధుల నుంచి కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఈ నిధుల వినియోగంలో బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలతో జాప్యం జరిగింది. చివరకు రూ. 5కోట్లు కళాభవన్ నిర్మాణం కోసం కేటాయించినట్లు ప్రకటించారు. మున్సిపాలిటీలో పాలకమండలి ఆమోదం కూడా తెలిపింది. ప్రతిపాదనలు తయారు చేశారే తప్ప పనులు ప్రారంభించలేదు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కళాభవన్ నిర్మాణ ప్రతిపాదన మరుగున పడిపోయింది. కళాక్షేత్ర భవన నిర్మాణానికి పడని అడుగులు ప్రతీసారి ఎన్నికల హామీగా మారుతున్న వైనం కళాకారుల ప్రదర్శనలకు తప్పని తిప్పలు పాలకులు దృష్టి పెట్టాలని వినతికవులు, కళాకారుల కోట.. నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తమ రచనల ద్వారా నవాబుకు వణుకు పుట్టించిన కవి, రచయితలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల పుట్టినిల్లు మా నుకోట. ‘మానుకోట నా చందమామ’ అంటూ వారికి ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమను చాటారు. అలాగే కవి, రచయి త జయరాజు ప్రజా చైతన్యమే లక్ష్యంగా సింగరేణి కా ర్మికుల హక్కులు, నిరక్షరాస్యత, సారా నిర్మూలన ఉద్య మం, కులవ్యవస్థ నిర్మూలన, ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ మొదలైన అంశాలపై రచనలు చేస్తున్నారు. ఇక సినీ రంగంలో భారవి, ఎన్నో జానపద కళారూపాలకు ఈ ప్రాంత క వులు ప్రాణం పోశారు. అయితే వీరి రూపాలు ప్రదర్శించడం, కొత్త కళాకారులను పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కళావేదిక లేకపోవడం లోటుగా మారింది. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులను పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యంకాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, డీపీఓ హరిప్రసాద్, డీఏఓ విజయ నిర్మల, పశుసంవర్థక శాఖ అధికారి కిరణ్కుమార్, మెప్మా పీడీ విజయ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● బయ్యారం మండలానికి చెందిన షబ్బీరుద్దీన్ మీసేవ కేంద్రం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వినతి అందజేశాడు. ● డోర్నకల్ మండలం ఎర్రమట్టి తండాకు చెందిన జి.పద్మ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి అందజేసింది. ● కేసముద్రం మండలానికి చెందిన జాహెద తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసింది. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో ప్రజావాణిలో 84 అర్జీలు స్వీకరణ -
అరుణకీర్తిపతాకకు గజల్ కవి పురస్కారం
హన్మకొండ కల్చరల్ : హనుమకొండకు చెందిన గజల్ రచయిత్రీ, గాయని గంకిడి అరుణకీర్తిపతాకరెడ్డికి గజల్ కవి పుస్కారం అందజేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన గజల్ కవయిత్రీ విజయగోలి రాసిన మూడో గజల్ సంపుటి నవరాగిణి పుస్తకావిష్కరణ, తెలుగు గజల్ గాన విభావరి జరిగాయి. ఈ కార్యక్రమంలో అరుణకీర్తిపతాక పాల్గొని గజల్ వినిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అరుణకీర్తిపతాకను సన్మానించి పురస్కారం అందజేశారు. రచనలతో సమాజంలో మార్పు ● మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల డీఎస్పీ కూజా విజయ్కుమార్ హన్మకొండ కల్చరల్ : కవులు తమ రచనల ద్వారా సమాజంలో మార్పులు తీసుకొస్తారని, రాసే పదాలలో నిగూడార్థం దాగి ఉంటుందని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల డీఎస్పీ కూజా విజయ్కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలో కవయిత్రీ బాదం జయశ్రీ, వెంకటేశ్వర్లు దంపతుల షష్టిపూర్తి కార్యక్రమం జరిగింది. ఇదే సందర్భంలో జయశ్రీ రాసిన ‘మదిలో మెదిలిన మాటలు’ కవితాసంపుటి ఆవిష్కరణ జరిగింది. డీఎస్పీ కూజా విజయ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. విశిష్ట అతిథి, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ కవితలు ప్రతీఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జయశ్రీ పుస్తకాన్ని తన భర్త వెంకటేశ్వర్లుకు అంకితమిచ్చారు. కార్యక్రమంలో సౌమ్మ, రాకేశ్, రెయాన్ష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మూగబోయిన మహిళా చైతన్య దీప్తి..
నేడు కేఎంసీకి రజిత పార్థివదేహం అప్పగింత రచయిత్రీ అనిశెట్టి రజిత పార్థివదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. రజిత వివాహం చేసుకోలేదు. ఆమెకు సొంతిల్లు లేదు. ఈ నేపథ్యంలో కేయూ ఫస్ట్ గేటు దగ్గర గల కేయూ విశ్రాంతాచార్యులు కాత్యాయనీవిద్మహే గృహంలో రజిత పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఐ’ బ్యాంక్ టెక్నీషియన్లు రాత్రి ఆమె కళ్లను సేకరించి భద్రపరిచారు. హన్మకొండ కల్చరల్ : మహిళా చైతన్య దీప్తి మూగబోయింది. హనుమకొండకు చెందిన ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత సోమవారం రాత్రి కన్నుమూశారు. అనిశెట్టి రజిత మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. అనేక కథలు, విమర్శనవ్యాసాలు, సమీక్షలు, ఉద్యమ డాక్యుమెంట్లు రాశారు. కుటిలరాజకీయాలకు లేని బలం కలానికి, నిజానికి ఉందని నమ్మి కవిత్వమే శ్వాసగా జీవించారు. 52 సంవత్సరాలుగా కవితావ్యాసంగం కొనసాగిస్తూ, వివిధ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పొషిస్తూ కూడా నిరాడంబరంగానే కనిపించేవారు. నాలుగు దశాబ్దాల కాలంలో జీవనదిలా అన్ని ఉద్యమాలకు ఊటనీరందిస్తూ చైతన్యాన్ని సజీవంగా ఉంచారు. ఆమె కవితలో శిల్పంపై వ్యామోహం తక్కువ, వస్తువుపై ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ప్రస్థానం.. అనిశెట్టి రజితది హనుమకొండలోని కుమార్పల్లి. బాలరాజు, జయలక్ష్మి దంపతులకు 1958 ఏప్రిల్ 14న జన్మించారు. కాజిపేట ఫాతిమా బాలికల పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు), ఎంఫిల్ పూర్తి చేశారు. అలాగే, ఇదే విశ్వవిద్యాలయంలో ఎంఏ(ప్రభుత్వ పాలనా శాస్త్రం) చదివి యునివర్సిటీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. కేయూలోనే ఎంఫిల్ పూర్తిచేసి కొంతకాలం ఉమెన్స్ స్టడీ సెంటర్, ఎస్సీ, ఎస్టీ సెల్లో పరిశోధకురాలిగా పనిచేస్తూ అనేక జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. 1969–71 మధ్య తెలంగాణ ఉద్యమం ముగింపు దశలో చురుగ్గా పాల్గొన్నారు. 1975లో పైసా కవితతో స్టేజీపై కవితలు చదవడం ఆరంభించారు. అప్పటి నుంచి నిరంతరం కృషి చేస్తూ దళిత, బహుజన, స్రీ వాద, పౌర, మానవ హక్కుల, సాహిత్య, సామాజిక ఉద్యమాలన్నీటిలోనూ మమేకమై అనేక స్థానిక, జాతీయ వేదికలు, సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రచురణలు.. గులాబీలు జ్వలిస్తున్నాయి(1984), నేనొక నల్లమబ్బునవుతా(1997), చెమటచెట్టు(1999), ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2000–2005), ఉసురు(కవితా సంపుటాలు 2002), గోరంతదీపాలు (నానీలు 2005), దస్తఖత్ (హైకులు 2005), అనగనగా కాలం (2005), మట్టిబంధం (కథలు 2006), నన్హే ఓ నన్హే (నానీలు 2007), మార్కెట్ స్మార్ట్ శ్రీమతి. (దీర్ఘ కవిత 2010) సంపాదకీయాలు.. వెతలే కథలై(రచయిత్రుల కథాసంకలనం 2011), ఊపిరి (తెలంగాణలో ఆత్మహత్యలపై నిరసన కవిత 2012), జిగర్ (తెలంగాణ విశిష్ట కవితా సంకలనం 2013), ఉద్విగ్న( లైంగిక భారతంపై ఓరుగల్లు క వుల నిరసన 2013), ఆకాశపుష్పం (అపూర్వ త్యా గానికి నీరాజనం 2014), ముజఫర్నగర్ మారణ కాండ(నిషిద్ధమేఘాల్లోకి మాయాత్ర 2014),2 0 14లో పోలవరం ప్రాణాంతక ప్రయోగం వెలువరించగా 2016లో అక్షరశరధి దాశరథి, నిర్భయాకా శం పుస్తకాలు ప్రచురించారు. 2017 ఆమె సంపాదకత్వ ంలో భిన్న అస్తిత్వాల సీ్త్రల సాహిత్యం– పరిచయ వ్యాసాలు తీరొక్క పూల పుస్తకం వెలువరించారు. అవార్డులు.. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం, ల యన్స్ ఇంటర్నేషనల్ పురస్కారం, కృష్ణవేణి కళాసమితి ఉగాది పురస్కారం తదితర అనేక అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. ఎంపీ సంతాపం.. రజిత హఠాన్మరణం పట్ల వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సాహితీలోకానికి, వరంగల్ సాహితీ రంగానికి రజిత మృతి తీరని లోటని పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత హఠాన్మరణం -
ఎన్ఐఆర్ఎఫ్ వర్క్షాప్లో కేయూ వీసీ
కేయూ క్యాంపస్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో సోమవారం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్ జి. షమిత, డాక్టర్ ఫణీంద్రకుమార్, బన్నూర్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్షాప్ సలహాదారు డాక్టర్ కె. వీరాంజనేయులు పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కొలమానం, విశ్లేషణ విధానాలు వివరించారని వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి నైపుణ్యాల అభివృద్ధికి అనుసరించాల్సిన కార్యాచరణను వివరించారు. తొలుత ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డి. రాజిరెడ్డి.. కేయూ వీసీ ప్రతాప్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు అవసరం ● కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం కేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే నాణ్యతాప్రమాణాలతో కూడిన పరిశోధనలు అవసరమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. హనుమకొండ యూనివర్సిటీ న్యాయ కళాశాలలోని పీహెచ్డీ స్కాలర్లకు సోమవారం నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఓరియెంటేషన్ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను పరిశోధకులుగా మీ సిద్ధాంత గ్రంథాల్లో నాణ్యతాప్రమాణాలతో రూపొందించాలన్నారు. గౌరవ అతిథి, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో ఆదర్శంతమైన పరిశోధకులుగా రాణించాలన్నారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సుదర్శన్ మాట్లాడుతూ ఈ ఓరియెంటేషన్ తరగతులు వారంరోజులపాటు వివిధ సబ్జెక్టు నిపుణలతో పరిశోధనల అంశాలపై నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, శ్రీనివాస్, అధ్యాపకులు హరిప్రసాద్, సుజాత, వేదశ్రీ , లక్ష్మణ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలా శంకర్, తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ ఫలితాల్లో భావన ప్రతిభ.. ● రాష్ట్ర స్థాయిలో తృతీయస్థానం నర్సంపేట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి ఎమ్మెస్సీ ఓబీజీ ఫలితాల్లో నర్సంపేటకు చెందిన వైద్యాధికారి పొనుగంటి భావన ప్రతిభ కనబర్చి రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేటకు చెందిన మమత ఆస్పత్రి వైద్యులు భారతి, గోపాల్ దంపతుల కూతురు పొనుగంటి భావన హైదరాబాద్ నాగోల్లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ సెంటర్లో ఎమ్మెస్సీ ఓబీజీ విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో కామినేని మెడికల్ కళాశాలలో ఓవరాల్గా ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా కామినేని వైద్య కళాశాల యాజమాన్యం భావనను మెమోంటో అందజేసి సన్మానించారు. కళాశాల ఎండీ వసుంధర, శశిధర్, కళాశాల సూపరింటెండెంట్ అజయ్య, వైస్ ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు, ఓబీజీ విద్యార్థులు, నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు బీఎం జయుడు, డాక్టర్ ఉదయ్సింగ్, డాక్టర్ రాజారాంతోపాటు పలువురు వైద్యులు, నర్సంపేట విద్యాసంస్థల అధినేతలు తదితరులు అభినందించారు. కాగా, ఈ సందర్భంగా భావనను తల్లిదండ్రులు గోపాల్, భారతి అభినందించారు. చైన్స్నాచర్లకు దేహశుద్ధి తొర్రూరు రూరల్: చైన్ స్నాచింగ్కు పాల్పడి పారిపోతు న్న ఇద్దరు యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశా రు. ఈ ఘటన సోమవారం తొర్రూరు మండలం మా టేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాటేడుకు చెందిన ముత్యం ప్రేమలీల రోడ్డు పక్క న నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై వెళ్తూ ప్రేమలీల మెడలోని పుస్తెలతాడును లాక్కొని పారిపోతుండగా బాధిత మహిళ కేకలు వేసింది. దీంతో స్థానికులు గమనించి ఆ యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులను వివరణ కోరగా ఆ యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. -
నెరవేరని హామీ..
వర్షం వస్తే భయం భయంగా.. వర్షం వస్తే భయం వేస్తుందని ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాన కురిసిన రోజు రాత్రి జాగారం చేస్తున్నారు. ఆకేరు వాగు వరద ఎప్పుడు.. ఏ ప్రమాదం తెచ్చి పెడుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముంపు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.మరిపెడ రూరల్: జిల్లాలో గత ఏడాది ఆగస్టు 31న అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆకే రు వాగు ఉప్పొంగి మరిపెడ మండలంలోని సీతా రాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాలను వరద చుట్టిముట్టింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్ల స్లాబ్లు ఎక్కారు. తెల్లవారుజామున అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేక బృందాలు వచ్చి ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొద్దిరోజుల తర్వాత సీఎం రేవంత్రెడ్డి సందర్శించి మరోచోట ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయి తే సంవత్సరం కావొస్తున్నా.. హామీ నెరవేరకపోగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయా గ్రామా ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రూ.10 వేల ఆర్థికసాయం.. సుమారు 15 ఫీట్ల ఎత్తులో వచ్చిన ఆకేరు వాగు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలు, బి య్యంతో సహా అన్ని తడిసిముద్దయ్యాయి. ముంపునకు గురైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ.10 వేల ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చే శారు. వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. బాధితులు వేడుకున్న విధంగా బ్యాంకు రుణాలు అందించలేదు. వారు కోరిన విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. తరలింపు లేనట్లేనా.. ఆకేరు వాగు వరద వచ్చిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి సీతారాంతండాను సందర్శించారు. ఈ సందర్భంగా ముంపు బాధిత కుటుంబాలను గుర్తించి అందరికీ సురక్షిత ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే నేటికీ సీఎం హామీ నెరవేరలేదు. గత ఏడాది ఆకేరు వాగు వరదలో చిక్కుకున్న గ్రామాలు సీతారాంతండాను సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి సురక్షిత ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ హామీపై నీలినీడలు రూ.10 వేల ఆర్థిక సాయం మాత్రమే అందజేత ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భయాందోళనలో ముంపు బాధితులు -
ప్రాణం తీసిన మద్యం మత్తు..
● ప్రభాకర్ హత్య ఘటనలో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : మద్యం మత్తు మిత్రుడి ప్రాణం తీసింది. మహబూ బాబాద్ పట్టణంలోని లెని న్ నగర్ కాలనీకి చెందిన యువకుడు తూళ్ల ప్రభాకర్ ఈ నెల 3వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. లెనిన్ నగర్ కాలనీకి చెందిన సంపతి శ్రీను, తూళ్ల ప్ర భాకర్ స్నేహితులు. ఈ నెల 3వ తేదీన రాత్రి ప్రభాకర్ మద్యం సేవిస్తు న్నాడు. ఎందుకు తాగుతున్నావని అప్పటికే మద్యం సేవించి ఉన్న శ్రీను అడిగాడు. ఈ క్రమంలో ప్రభాకర్ నువ్వేంది నాకు చెప్పేదని శ్రీనును అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఫలితంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రెకుడైన శ్రీను.. పక్కన ఉన్న కర్రతో తల, ముఖంపై కొట్టగానే ప్రభాకర్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయి కొంత సమయానికి మృతిచెందాడు. భయంతో శ్రీను అక్కడి నుంచి ఖమ్మం వెళ్లి అక్కడ మిల్లుల్లో పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో రైలులో మహబూబాబాద్ వచ్చి ఇంటికి వెళ్తుండగా పోలీసులు కనిపించారు. దీంతో భయంతో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తూళ్ల ప్రభాకర్ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో శ్రీనును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. టీచర్లు కొడుతున్న విషయం చెప్పొద్దు.. ● అలా చేస్తే టీసీలు ఇచ్చి ఇంటికి పంపుతా.. ● విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఎస్ఓ ● అధికారులు పట్టించుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలుబచ్చన్నపేట : విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ విద్యాబుద్దులు నేర్పించాల్సిన బాధ్యత గురువులదే. అయితే గురువులే ఇబ్బందులకు గురి చేస్తే ఆ విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి. టీచర్లు కొడుతున్న విషయం తల్లిదండ్రులకు చెప్పొద్దని, ఒకవేలా చెప్పితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తానని స్పెషలాఫీసర్(ఎస్ఓ) భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు విద్యార్థినులతోపాటు తల్లిదండ్రులు వాపోయారు. మండల కేంద్రంలోని కేజీబీవీ స్పెషలాఫీసర్ గీత విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు శుక్రవారం నిరసన తెలిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. రాఖీ పండుగ నిమిత్తం తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు గురువారం ఉదయం రాగా వారితో స్పెషలాఫీసర్ దురుసుగా ప్రవర్తించారు. గురువారం వస్తే శుక్రవారం ఉదయం రమ్మని తెలిపారు. దీంతో మరుసటి రోజు ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆగాలని తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారు. తమ పిల్లలను టీచర్లు కొడుతున్నారని, ఆ విషయాన్ని తమకు చెప్పితే టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తానని విద్యార్థినులను స్పెషలాఫీసర్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాలలోకి అధికారులు, పాత్రికేయులు వెళ్లొద్దని, కేవలం మహిళలను మాత్రమే అనుమతిమస్తామని ఎస్ఓ చెప్పారన్నారు. విద్యార్థులను కొట్టి ఆస్పత్రికి తీసుకెళ్లిన విషయం ఇతరులకు తెలియకుండా చీకటి గదిలో బంధించిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. దీంతో విద్యార్థులు చదువుకోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని, పాఠశాలకు వెళ్లమని మారాం చేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, కలెక్టర్.. పాఠశాలను తనిఖీ చేసి సదరు స్పెషలాఫీసర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పాఠశాల స్పెషలాఫీసర్ గీతను వివరణ కోరగా రాఖీ పండుగకు తల్లిదండ్రులు కోరగానే విద్యార్థులను పంపించానని, కొట్టి చీకటి గదిలో బంధించానని పేర్కొనడంలో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తమ పాఠశాలను బద్నాం చేస్తున్నారన్నారు. -
సమానత్వపు సమాజం దిశగా..
ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య కేయూ క్యాంపస్: సమాజంలో వివక్ష, అవహేళన, నిరాదరణకు గురవుతున్న ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఇక నుంచి ఉన్నత విద్య అనే ఆయుధంతో సగౌరవంగా జీవించగలరు. ఆయా వర్గాల్లో విజ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరిగి స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తాజాగా సమతా సహాయక పథకాన్ని (సమతా ఫ్రి షిప్స్) ప్రారంభించారు. విద్యను సామాజిక మార్పు, సాధికారతకు అత్యంత శక్తివంతమైన సాధనంగా గుర్తిస్తూ సమతా సహాయక పథకాన్ని చేపట్టారు. ఈ ఉన్నత విద్య డిగ్రీలో తక్కువ ప్రాతినిథ్యం ఉన్న వర్గాలు, ప్రధాన సమూహాలకు ఉచిత విద్యనందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఆ యూనివర్సిటీ పాలకమండలి కూడా ఆమోదించింది. ఇందులో ప్రధానంగా ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఈ సమతా సహాయక పథకం కింద ఉన్నత విద్య డిగ్రీ చదువుకునేందుకు ఈ విద్యాసంవత్సరం 2025–2026లోనే ఉచిత విద్యనందించబోతుంది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియ, ప్రొఫార్మాలో మార్పులు చేపట్టారు. దీంతో ఆర్థిక సమస్యలు, వివిధ కారణాలతో ఉన్నత విద్యకు దూరమైన ఆయా వర్గాలు చదువుకునే వీలు కలగబోతుంది. ఆదివాసీల్లో ఈతెగలకు.. ఆదివాసీల్లో ప్రధానంగా తెలంగాణలో ఉన్న చెంచులు, గోండులు, కోయ, గొత్తికోయ, కొండరెడ్లు, నాయక్ పోడ్, పార్దాన్, తౌటి తెగల్లోని యువతకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉచిత విద్యనదించబోతున్నారు. కేవలం రూ. 500 ఫీజు రిజిస్ట్రేషన్తోనే అడ్మిషన్లు కల్పిస్తారు. పుస్తకాలు కూడా అందజేస్తారు. కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు వార్షిక ఆదాయం (తాజా) రూ. 2 లక్షలలోపు ఉన్న వారికి ఈ పథకం వర్తించనున్నది. దివ్యాంగులకు.. దివ్యాంగులకు కూడా పథకం వర్తింపజేశారు. 40 శాతం వైకల్యం కలిగిన యువత డిగ్రీలో ప్రవేశాలు పొందొచ్చు. నామినల్ ఫీజు వీరికి కూడా రూ. 500 మాత్రమే. వీరికి గతంనుంచే పరీక్ష ఫీజు కూడా లేదు. నివాస ద్రువీకరణపత్రంతోపాటు వార్షిక ఆదాయం రూ. 6లక్షల లోపు కలిగి ఉన్న వారు కూడా అర్హులే. సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ట్రాన్స్జెండర్లకు.. ట్రాన్స్జెండర్లు సమాజపు అపహాస్యం, వివక్ష కారణంగా ప్రధాన విద్యావ్యవస్థ నుంచి బయటకు నెట్టివేయబడుతున్నారు. వీరికి కూడా ఉచిత ఉన్నత విద్య అందించేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం కల్పించేందుకు ఉపక్రమించింది. ఈ వ్యవస్థాపరమైన అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా సమతా సహాయక పథకాన్ని రూపొందించారు. ట్రాన్స్జెండర్లు జెండర్ ధ్రువీకరణపత్రం, ఆదాయం అర్బన్ ప్రాంతంవారికి రూ. 2లక్షల వరకు, గ్రామీణం రూ. లక్షా 50వేల వరకు ఉన్న వారికే ఈపథకం వర్తింపు. వీరు కూడా రూ .500 ఫీజుతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత విద్యతో నమోదు పెరగనుంది.. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఆదివాసీలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్యను ప్రవేశపెట్టిన నేపథ్యంలో వివిధ కోర్సుల్లో నమోదు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈయూనివర్సిటీ పరిధిలో 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. డిగ్రీ, పీజీ డిప్లొమా కలిపి సుమారు 39 కోర్సులు నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్టడీసెంటర్లు ఉన్నాయి. సమతా సహాయక పథకం కింద ఆర్థిక, సాంస్కృతిక అడ్డంకులు తొలగి సమానత్వ సమాజం ఏర్పడుతుందని భావిస్తున్నాం. ఆయా వర్గాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరిగి స్వయం సమృద్ధి సాధిస్తారు. – డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమతా సహాయక పథకం డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు.. స్టడీ మెటీరియల్, పాఠ్యపుస్తకాలు ఫ్రీ -
లాభసాటి పంటలు ఎంచుకోవాలి
ములుగు రూరల్: రైతులు లాభసాటి పంటలను ఎంచుకుని సాగు చేయాలని, అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఇంచర్ల శివారులో కేన్ బయో సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ధనసరి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆ యిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ సంచాలకుడు షేక్ యాస్మిన్ బాషా, కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ గార్డెన్లో ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ములుగు వ్యవసాయానికి అనువైన జిల్లా అన్నారు. ఆయిల్ పామ్ రైతుల కు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో అ న్ని జిల్లాల్లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ములు గు జిల్లాలో ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో ఆయిల్ పా మ్ సాగవుతోందని, అది వచ్చే ఏడాదికి 10 వేల ఎకరాలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్ర భుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు బీసీ లకు 70 నుంచి 80 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శా తం సబ్సిడీ అందిస్తుందన్నారు. మూడున్నర ఏళ్లలో పంట కోతకు వస్తుందన్నారు. ఆయిల్ పామ్ గింజ లు టన్ను రూ. 18 వేలు ఉందని, భవిష్యత్లో రూ. 25 వేలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయిల్ పామ్ సాగుతో తక్కువ కష్టం.. అధిక రాబడి ఆయిల్ పామ్ సాగుతో రైతులకు తక్కువ కష్టం.. అధిక రాబడి ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో ప్రతీ ఏడాది రైతులకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు లాభం చేకూరుతుందన్నారు. జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళా సంఘాలకు విజయ డెయిరీ నుంచి గురుకులాలకు పాల సరఫరాకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లాకు త్వరలో మరో ఐటీ కంపెనీ రాబోతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఉద్యాన శాఖ అధికారి సంజీవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి సుధారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీబీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క విమర్శించారు. ఈమేరకు సోమవారం ఆర్అండ్ బీ గెస్ట్హౌస్లో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బీజేపీ నాయకులు రామభక్తులు అయితే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ లిస్ట్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా చేసుకుని అరెస్ట్లు చేయిస్తోందన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆధారాలతో సహా బయటపడిందని చెప్పారు. బీజేపీ దుర్మార్గపు నిర్ణయాలను ప్రతీ గడపకు వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆయిల్ పామ్ సాగుతో అధిక రాబడి రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క -
జారుతోంది.. జర జాగ్రత్త
కొత్తగూడ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో మండలంలోని కొత్తపల్లి సమీపంలో మట్టి రోడ్డు బురదమయంగా మారి గుంతలు పడ్డాయి. కాగా, బ్రిడ్జి నిర్మించి ఏడాది దాటిన అక్కడ తారురోడ్డు వేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా బురదగా మారడంతో ద్విచక్రవాహనదారులు జారి పడుతున్నారు. ఇప్పటికై నా కాంట్రాక్టర్ స్పందించి కనీసం కంకర, డస్ట్ పోస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాహనదారులు అంటున్నారు. రుద్రతత్వమే విశ్వశక్తి హన్మకొండ కల్చరల్: రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడో సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ ధరణికోట అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
మహబూబాబాద్ రూరల్: వరలక్ష్మీవ్రతం, రాఖీ, బోనాలు, తీజ్ వేడుకలకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలు సెలవులు ముగియడంతో మళ్లీ హైదరాబాద్, వరంగల్ ఇతర పట్టణాల బాటపట్టారు. ఈమేరకు సోమవారం ప్రయాణికులు మానుకోట రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. కాగా వేలాదిమంది ప్రయాణికులతో రైల్వే స్టేషన్ సందడిగా మారింది. స్టేషన్లో రైళ్లను తక్కువ సమయం నిలపడంతో చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేకపోయారు. పలువురు ప్రయాణికులు తాము చేసుకున్న టికెట్ రిజర్వేషన్లను రద్దు చేసుకొని ఇతర మార్గాల ద్వారా వెళ్లారు. -
రామప్ప కీర్తిని చాటేలా..
కాకతీయుల కళావైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంతో రామప్ప కీర్తి మరోసారి మార్మోగింది. 1213 లో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో దేశ,విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. పర్యాటక ప్రాంతానికి మారుపేరు ములుగు జిల్లా. రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, తాడ్వాయి హట్స్, ఏటూరునాగారం అభయారణ్యం, మల్లూరు లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, బొగత జలపాతంతో పాటు మరికొన్ని జలపాతాలు ములుగు జిల్లాకు ప్రత్యేకం. పర్యాటక జిల్లాగా పేరొందిన ములుగు జిల్లాలోని కూడళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలుచోట్ల థీంలు ఏర్పాటు చేస్తుండడంతో కూడళ్లు జిగేల్ మంటున్నాయి.విద్యుత్ కాంతుల్లో డమరుకం–వెంకటాపురం(ఎం)జిల్లాలో రూ.2.61 కోట్లతో పలు కూడళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టి ఆదివారంతో పూర్తి చేశారు. జంగాలపల్లి క్రాస్లోని జంక్షన్లో రామప్ప ఆలయ విశిష్టత తెలియజేసేలా శివుడి వాహనమైన నందీశ్వరుడిని (నంది విగ్రహాన్ని) ఏర్పాటు చేసి మూడు పక్కల మూడు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా శివుడు డమరుకం వాయిస్తున్నట్లు చూపుతూ డమరుకం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రామప్ప ఆలయాన్ని చూపే విధంగా శిలాశాసన మండపం మాదిరి మండపాన్ని నిర్మించారు. మండపం చుట్టూ ఆరుగురి మదనికల శిల్పాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి లోపల గ్రాస్తో గ్రీనరీ ఏర్పాటు చేసి వివిధ రకాల పూలమొక్కలు నాటారు. గ్రిల్స్కు డమరుకం, త్రిశూలం, శివుని మూడో కన్నుతో కూడిన త్రినయనం చిహ్నాలు నిర్మించారు. రాత్రివేళ విద్యుత్ కాంతుల మధ్య నంది విగ్రహం, డమరుకం, మండపం, మదనికల భంగిమలతో కూడిన శిల్పాలు జిగేల్ మంటున్నాయి. నంది విగ్రహంతోపాటు మండపం నుంచి ఫౌంటేన్లా నీరు ఎగిసిపడుతుండడంతో ప్రజలు సెల్ఫీలు దిగుతూ సంబురపడిపోతున్నారు. విద్యుత్ వెలుతురులో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా జంగాలపల్లి కూడలి మెరిసిపోతోంది. రామప్ప ఆలయ విశిష్టత తెలియజేసేలా..కాకతీయ కళావైభవంతో మెరిసిపోతున్న జంగాలపల్లి కూడలి రూ.2.61 కోట్లతో పూర్తయిన సుందరీకరణ పనులు విద్యుత్ వెలుగుల్లో నంది విగ్రహం, డమరుకం, శిలాశాసన మండపం -
జీజీహెచ్ భవనం పైనుంచి పడి రోగి మృతి
నెహ్రూసెంటర్ : ఓ రోగి ప్రమాదవశాత్తు మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన నాయిని ఐలయ్య (55) జ్వరంతో బాధపడుతూ ఈ నెల 7వ తేదీన జీజీహెచ్కు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్ల వారుజామున చికిత్స పొందుతున్న వార్డు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య యాదమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
● టీపీఆర్టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మన్నె చంద్రయ్య విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరాడుతామని టీపీఆర్టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మన్నె చంద్రయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలని, 317 జీఓతో నష్టపోయిన ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని, రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరారు. ఇటీవల తాత్కాలికంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మళ్లీ త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న బంగారం అప్పగింత హన్మకొండ కల్చరల్ : వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఓ భక్తురాలు పోగొట్టుకున్న బంగారాన్ని సిబ్బంది ఆమెకు అప్పగించారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ భక్తురాలి అర్ధతులం చెవికమ్మ ఆలయ ప్రాంగణంలో పడిపోయింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ ఆభరణాన్ని ఆలయ పర్యవేక్షకుడు అద్దంకి విజయ్కుమార్కు అందజేయగా ఆయన భక్తురాలికి అప్పగించారు. దీంతో భక్తురాలు.. ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం ● మరొకరి పరిస్థితి విషమం ● గణపురం సమీపంలో ఘటన గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రం సమీపంలోని కోట కాల్వ వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గణపురం ఎస్సై రేఖాఅశోక్ కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన దాసరి జగదీశ్(24) ఏసీ టెక్నీషియన్గా, తన స్నేహితుడు మర్వికుసుముదార్ జగదీశ్ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు ఆదివారం సెలవు సందర్భంగా ఇద్దరు బైక్పై రామప్పకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలకేంద్రం శివారు కోట కాల్వ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈఘటనలో దాసరి జగదీశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు మర్వికుసుముదార్ జగదీశ్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహంతోపాటు క్షతగాత్రుడిని 108లో భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బెల్లం, పటిక పట్టివేత కాజీపేట రూరల్: 80 కిలోల బెల్లం, 20 కిలోల పటికను కాజీపేట జంక్షన్లో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట జీఆర్పీ ఎస్సై ఎం.అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అనిల్ ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బల్హార్షకు వెళ్లి తక్కువ ధరకు బెల్లం, పటిక కొని తిరిగి కాజీపేటకు చేరుకుని వేరే రైలులో మహబూబాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో సమాచారం మేరకు పోలీసులు రంగంలో కి దిగి అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. బెల్లం, పటికను స్వాధీనం చేసుకునున్నట్లు ఎస్సై అభినవ్ చేసినట్లు వివరించారు. -
పంటకు ప్రయోజనకారి..
డోర్నకల్: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విరివిగా పెరుగుతోంది. దీంతో భూమిలో సారం తగ్గడంతోపాటు దిగుబడులు తగ్గుతున్నాయి. ఫలితంగా రైతులు అప్పులపాలవుతున్నారు. అంతేకాకుండా రసాయన పురుగు మందుల వినియోగంతో మిత్ర పురుగులు అంతరించడంతో పాటు వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. ఫలితంగా నేల కాలుష్యంతో నేలసారం తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఉండి నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అనేక దుష్పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అధికమించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రూపొందించారు. ఇందులో భాగంగా రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా జీవశిలీంధ్ర నాశినిలుగా గుర్తింపు పొందిన సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి పొడి మందులను వినియోగంలోకి తీసుకొచ్చి కాలుష్యాన్ని అరికడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి వినియోగంతో విత్తనశుద్ధి, పంట ఎదుగుదల, తెగుళ్ల నివారణ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. సుడోమోనాస్ బ్యాక్టీరియా మొక్కల్లో ఆక్సిజన్, జిబ్బరిలిన్లను ఉత్పత్తి చేసి పంట ఎదుగుదలకు సహాయపడడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. పంట తొలిదశలో వీటిని వినియోగిస్తే ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తాయి. సుడోమోనాస్ కేజీ రూ.150, ట్రైకోడెర్మావిరిడి కేజీ రూ.100 చొప్పున వ్యవసాయ కార్యాలయాలు, ఫర్టిలైజర్ దుకాణాల్లో లభ్యమవుతాయి. సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి పొడి మందులు వినియోగించే పద్ధతులు.. విత్తన శుద్ధి.. కిలో విత్తనానికి 8–10 గ్రాముల పొడిమందు సరిపోతుంది. లేదా పొడి మందు 10 మి.లీ నీటితో కలిపి విత్తనశుద్ధి చేయొచ్చు. అరటి, పసుపు దుంపలు, చెరుకు ముచ్చెలను శిలీంధ్ర ద్రావణంలో కలిపి ముంచి నాటాలి. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించుకోవాలి. వేర్లను శుద్ధి చేయడం.. వరి, వంకాయ, టమాట, మిరప పైర్లను కిలో సుడోమోనాస్ ఫార్ములేషన్ నిల్వ ఉండే నీళ్లలో కలిపి వాటి వేర్లను గంట సమయం పాటు ఈ నీటిలో ఉంచిన తర్వాత నాటకుంటే తెగుళ్లను నివారించడమే కాకుండా పెరుగుదలను పెంచుతుంది. భూమిలో చల్లే విధానం.. ఎకరాకు 2 నుంచి 3 కిలోలు దుక్కిలో వేయాలి. కిలో సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్, 10 కిలో గ్రాముల వేపపిండి, 90 కిలోగ్రాముల బాగా చితికిన పశువుల ఎరువుతో మిశ్రమాన్ని తయాలు చేసి వారం రోజులు నీడలో ఉంచి దుక్కిలో వేసుకోవాలి. వేపపిండి, పశువుల ఎరువు అందుబాటులో లేకుంటే ఇసుకతో కలిపి వాడొచ్చు. పిచికారీ..కిలో పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేయాలి.పంట పేరు సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి పొడి మందులతో అరికట్టే తెగుళ్లు సుడోమోనాస్, ట్రైకో డెర్మావిరిడి పొడి మందులతో తెగుళ్లు అంతం.. విత్తనశుద్ధి, భూసారం, పంట పెరుగుదల కూడా ఈ మందులతో పెంపు వినియోగంలో ఈ జాగ్రత్తలు పాటించాలి... వినియోగించే ముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి. వీటిని కంపోస్ట్, ఇతర పశువుల ఎరువులు, జీవ సంబంధ పదార్థాలతో కలిపి వాడొచ్చు. రసాయన పురుగుమందులతో కలిపి వాడకుంటే పంటలకు మేలు. చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. మిశ్రమాన్ని తయారు చేసిన ఆరు నెలలలోపు వాడాలి.వరి అగ్గితెగులు, మెడవిరుపు, పాముపొడ తెగులు పత్తి (బ్యాక్ట్రీరియా), ఎండు తెగులు మిరప నారుకుళ్లు, వేరుకుళ్లను నివారిస్తాయి వేరుశనగ ఆకుపచ్చ, ఎండుతెగుళ్లు మినుము, శనగ ఎండుతెగుళ్లు పొద్దుతిరుగుడు వేరుకుళ్లు మామిడి నల్లమచ్చల తెగుళ్లు(ఆన్ త్రక్నస్) పామాయిల్ మొక్క ఎదుగుదల, దిగుబడి పెరగడం (సుడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడి కలిపి వాడాలి) -
మరికొన్నిచోట్ల..
జిల్లాలో జంగాలపల్లి కూడలితోపాటు బండారుపల్లి రోడ్డు కూడలి వద్ద ‘ఐ లవ్ ములుగు’ అనే థీం ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ తాడ్వాయి మండలం నార్లాపూర్–బయ్యక్కపేట కూడలి వద్ద సమ్మక్క–సారలమ్మ ప్రాచుర్యాన్ని తెలిపేలా కుంకుమ భరిణె థీంను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మేడారం జాతరలోగా కుంకుమ భరిణె థీంను నెలకొల్పి ఆసియాలోనే అతిపెద్ద జాతరకు వచ్చే భక్తులకు కనువిందు చేయనున్నారు. అదేవిధంగా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం ఆర్చీ వద్ద ఆదివాసీ జీవన విధానం, వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా ‘ఆదివాసీ బాణం సంధించే థీం’ ను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.విద్యుత్ కాంతుల్లో నంది విగ్రహం -
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
● తాళ్లపూసపల్లిలో ఘటనకేసముద్రం: కుటుంబ కలహాలతో ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తాళ్లపూసపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వలసాని మురళి(39) కొంతకాలంగా మద్యానికి బానిసై భార్య రేణుకతో తరచూ గొడవ పడుతూ చనిపోతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో శనివారం మురళి భార్య రాఖీ పండుగ సందర్భంగా తన తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మురళి మద్యం తాగి మత్తులో చెరువుకట్టపై గడ్డిమందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అన్న యాకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదివారం తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో రేపాకలో వ్యక్తి..రేగొండ: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఈ ఘటన మండలంలోని రేపాకలో చోటు చేసుకుంది. ఎస్సై షాఖాన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామర్ల బాబు (47) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య అహల్య, ఇద్దరు కుమారులు రాజు, అజయ్ ఉన్నారు. -
దేవాదుల, సమ్మక్క బ్యారేజీని పరిశీలించిన మంత్రులు
ఏటూరునాగారం/ కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం సందర్శించారు. ప్రాజెక్టులోని పలు దశల పనులను అధికారులు మంత్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మంత్రులు మాట్లాడారు. -
బొగతలో పర్యాటకుల సందడి..
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవుదిన కావడంతో భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఈ సందర్భంగా జలపాతం జలధారలను వీక్షించడంతోపాటు సెల్ ఫోన్లలో బంధించారు. కొలనులో స్నానాలు చేస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగి సందడి చేశారు. ప్రకృతి అందాలకు ఫిదా అయ్యారు. నడిచి వెళ్లలేని పర్యాటకుల కోసం రైడర్ వాహనం ఏర్పాటు చేసి జలపాతం వద్దకు తరలించారు.గుర్తుతెలియని వాహనం ఢీ.. ఐనవోలు: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని కక్కిరాలపల్లి క్రాస్ సమీపం వరంగల్–ఖమ్మం రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన చాట్ల నవీన్, వరుసకు బావ మరుదులైన ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన జక్కుల సన్నీ, జక్కుల బన్నీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అనంతరం నవీన్ ద్విచక్ర వాహనంపై బావమరదులు సన్నీ, బన్నీలతో కలిసి పున్నేలుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కక్కిరాలపల్లి క్రాస్ సమీపంలో వరంగల్–ఖమ్మం రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న ప్ర యాణికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే ప్రమాదం జరిగి గంటదాటినా ఘటనా స్థలికి 108 వాహనం రాకపోవడంపై పలువురు మండిపడ్డారు. తీవ్ర గాయాలైన ఒకరిని ముందు ఆటోలో తరలించగా మరో ఇద్దరిని 108లో ఆస్పత్రికి తరలించారు. -
కబ్జా చేశాడు.. అద్దెకిచ్చేశాడు!
హసన్పర్తి: ఓ అక్రమార్కుడు దర్జాగా ఎస్సారెస్పీ భూములు ఆక్రమించాడు. అంతటితో ఆగలేదు. ఆ భూమిని అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.10కోట్ల మేరకు భూమి స్వాహా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు క్యాంపులోని నీటి పారుదలశాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు రెండెకరాల ఎస్సారెస్పీ భూమి ఉంది. అయితే ఈ స్థలాన్ని మూడేళ్లుగా ఓ అక్రమార్కుడు కబ్జా చేశాడు. దర్జాగా ఇసుక లారీల పార్కింగ్.. ఈ భూమిలో దర్జాగా ఇసుక లారీల పార్కింగ్ నిర్వహిస్తున్నారు. నెలకు ఒక్కొక్క లారీ యజమాని నుంచి కొంతమొత్తంలో అద్దె డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానికంగా చెబుతున్నారు. ఈ మాముళ్లల్లో అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు స్థా నికులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అలాగే, ఈ భూమి లో ఓ డబ్బా కూడా ఏర్పాటు చేశాడు. ఆ డబ్బాల ను కూడా అద్దెకిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. ఇసుక లారీల పార్కింగ్ అసాంఘిక కార్యకలాపాల కు అడ్డాగా మారింది. ఫలితంగా ఇటు వైపు రాకపోకలు సాగించాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. లారీ డ్రైవర్లు మద్యం సేవిస్తూ న్యూసె న్స్ చేస్తున్నారని, దీంతో రాత్రి వేళ ఈ మార్గం నుంచి వెళ్లాలంటే భయమేస్తోందని స్థానికులు తెలిపా రు. కాగా, కాలనీవాసుల ఇటీవల సమావేశం ఏ ర్పాటుచేసి లారీల పార్కింగ్ తొలగించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించినట్లు తెలిసింది.చర్యలు తీసుకుంటాంకబ్జాదారుడిపై చర్యలు తీసుకుంటాం. ఇక్కడ నుంచి లారీల అడ్డాను తొలగిస్తాం. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం –రాజు, డీఈఈ, నీటిపారుదలశాఖ రూ.10 కోట్ల భూమి స్వాహా దర్జాగా ఇసుక లారీల పార్కింగ్ అక్రమార్కుడిపై ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు -
సురేశ్కు జాతీయ పురస్కారం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన నల్లగొండ సురేశ్ గిడుగు రామ్మూర్తి స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ సీఈఓ ఉలవలపుడి వెంకటరత్నం, జాతీయ కమిటీ ప్రోగ్రాం డైరెక్టర్ ధనశి ఉషారాణి, భవాని సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్ చేతుల మీదుగా సురేశ్ పురస్కారం అందుకున్నారు. కాగా, సురేశ్ నవయుగ శతకం, దశధీరులు, కావ్య ఖండికతో పాటు అనేక పద్యాలు, రచనలు రాశారు. సురేశ్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇడిపిలవంచ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా కొప్పూరు గ్రామస్తులు, సహ ఉపాధ్యాయులు.. సురేశ్కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫైలేరియా నివారణకు మాత్రలు వేసుకోవాలి
గార్ల: ఫైలేరియా(బోదకాలు) నివారణకు రెండేళ్లు పైడిన వారందరూ విధిగా మాత్రలు వేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. ఆదివారం గార్లలో ఫైలేరియా వ్యాధి నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, వైద్యసిబ్బంది స్థానికంగా ఉంటూ విధుల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దోమ కుట్టిన 3 లేదా 4 సంవత్సరాల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడతాయని సూచించారు. డీఎంహెచ్ఓ రవి రాథోడ్ మాట్లాడుతూ.. గత ఏడాది జిల్లాలో ఫైలేరియా వ్యాధి నివారణ మాత్రల పంపిణీ 64శాతం మాత్రమే నమోదైందని, ఈ ఏడాది 100శాతం నమోదయ్యేలా వైద్యులు, వైద్యసిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రజలకు సూచించారు. ప్రతీ ఒక్కరు విధిగా మాత్రలు వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నోడల్ అధికారిరాజ్కుమార్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, డీసీహెచ్ఎస్ చింత రమేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రమీలారావు, జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి సుధీర్రెడ్డి, డీపీఓ హరిప్రసాద్, ఎంపీడీఓ మంగమ్మ, డాక్టర్ బాలునాయక్, పీహెస్సీ డాక్టర్ శివకుమార్, హెచ్ఎస్ ఇస్మాయిల్ బేగ్ పాల్గొన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
బోదకాలు నిర్మూలన అందరి బాధ్యత
గంగారం: బోదకాలు వ్యాధి నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా రోగనిరోధకత, శిశు ఆరోగ్య కార్యక్రమాల అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఫైలేరియా నిర్మూలనలో భాగంగా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ౖఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఫైలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు రెండు సంవత్సరాలు పైబడిన వారందరూ మందులు వాడాలన్నారు. ఈ మందులను ఉచితంగా వైద్య సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రత్యూష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న యువకులు..?మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రూరల్ పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల గంజాయి రవాణా, క్రయవిక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని పలు గ్రామాల్లో పలువురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సదరు యువకులు గంజాయి సేవిస్తున్నారా.. రవాణా, క్రయవిక్రయాలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.కేయూలో రేపు లైబ్రేరియన్స్ డేకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా), యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం, టీఎస్ లైబ్రరీ అసోసియేషన్ (టీఎస్ఎల్ఏ) ఆధ్వర్యంలో ఈనెల 12న లైబ్రేరియన్స్ డే నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఐసాక్ ప్రభాకర్, టీఎస్ఎల్ఏ ట్రెజరర్ డాక్టర్ జి.రాజేశ్వర్కుమార్, కుల్పా ట్రెజరర్ ఎం.మనోహర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపస్లోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా వీసీ కె.ప్రతాప్రెడ్డి హాజరుకానున్నారు. కుల్పా అధ్యక్షుడు డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు అధ్యక్షత వహిస్తారు. ‘రోల్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ ది డిజిటల్ ఎరా’ అంశంపై లైబ్రరీ సైన్స్విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రమణయ్య కీలకోపన్యాసం చేస్తారు. ‘రెలవెన్స్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్ ఇన్ది ఏజ్ ఆఫ్ ఐఐ’ అంశంపై కేయూ లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ రాధికారాణి ప్రసంగిస్తారు. కుల్పా జనరల్ సెక్రటరీ వి.కృష్ణమాచార్య, టీఎస్ఎల్ఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఇ.సత్యనారాయణరావు పాల్గొంటారని వారు తెలిపారు.భద్రకాళి అమ్మవారికి అధికారుల పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం ఐఏఎస్ వీపీ గౌతం కుటుంబ సమేతంగా, జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను ఆలయ అర్చకులు, పర్యవేక్షకుడు అద్దంకి విజయ్కుమార్, ధర్మకర్తలు ఆలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. -
నులిపేద్దాం..
నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు జిల్లా వివరాలు పీహెచ్సీలు 21 అంగన్వాడీ సెంటర్లు 1412 ప్రభుత్వ స్కూల్స్ 968 ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 32 ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేట్ పాఠశాలలు 104 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 9 మొత్తం ఆశవర్కర్లు 888 మొత్తం అంగన్వాడీ టీచర్లు 1388నెహ్రూసెంటర్: నులిపురుగుల నివారణలో భాగంగా సంవత్సరం వయసు నుంచి 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నేడు(సోమవారం) అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు విద్యార్థ్ధులకు మాత్రలు పంపిణీ చేస్తారు. నేడు వేసుకోని పిల్లలకు ఈ నెల 18న పంపిణీ చేస్తారు. కాగా జిల్లాలో 1,46,201 మందికి మాత్రలు వేసేందుకు వైద్యాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆరు నెలలకు ఒకసారి.. నులిపురుగులను నివారించేందుకు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేస్తారు. 1నుంచి 19 ఏళ్ల వయసు వారికి మాత్రలు అందజేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల పిల్లలకు 200 మిల్లీగ్రాముల మాత్ర, 2 నుంచి 19 ఏళ్ల పిల్లలకు 400 మిల్లీ గ్రాముల టాబ్లెట్ అందజేస్తారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత పరిశుభ్రతపై అవగాహన కల్పించిన అనంతరం ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రతీ ఒక్కరికి వేసేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు తెలుపుతున్నారు. పిల్లల్లో నులిపురుగుల ప్రభావం.. ● నులిపురుగులు ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ● నులిపురుగులు ఉంటే నీరసంగా ఉంటారు. బరువు తగ్గుతారు. ● రాత్రిపూట నిద్రపోకపోవడం ● కడుపు నొప్పి రావడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. ● పిల్లల్లో మలబద్ధకం ఏర్పడుతుంది. ఆకలి మందగిస్తుంది. ఆల్బెండజోల్ ప్రయోజనాలు... ● పోషకాహార వినియోగాన్ని మెరుగు పరుస్తుంది. ● రక్తహీనతను నియంత్రిస్తుంది. ● నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని నియంత్రిస్తుంది. జాగ్రత్తలు ఇలా... మాత్రలు వేసిన వెంటనే పిల్లల్లో వాంతులు, విరోచనాలు అవుతున్నట్లు గుర్తిస్తే పిల్లల్ని నీడలో పడుకోబెట్టాలి. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయొద్దు. అదే విధంగా పిల్లలకు కూడా బలవంతంగా మాత్రలు వేయకూడదు. పిల్లలందరికీ మాత్రలు వేయాలి నులిపురుగుల నివారణకు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేయాలి. విద్యార్థులకు మాత్రలు వేసేలా చర్యలు చేపడుతున్నాం. 1– 19 వయస్సు గల అంగన్వాడీ, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను గుర్తించి మాత్రలు వేసేందుకు సిద్ధం చేశాం. మాత్రలు వేయడం వల్ల పిల్లల్లో ఎదుగుదలతో పాటు నులిపురుగుల నివారణ జరుగుతుంది. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ నేడు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ జిల్లాలో 1.46 లక్షల మంది పిల్లలకు అందజేత జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు 1నుంచి19 సంవత్సరాల విద్యార్థుల వివరాలు .. అంగన్వాడీ కేంద్రాల్లో 1–5 సంవత్సరాల పిల్లలు 61,903 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లోని విద్యార్థులు 42,941 ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు 41,357 -
విద్యార్థులకు అందని రాగిజావ
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రాగిజావ పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో రాగి పిండి, బెల్లంతో కలిపి తయారు చేసిన పౌష్టికాహార మిశ్రమాన్ని ప్యాకెట్ల రూపంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. ఉదయం పాఠశాలకు హాజరైన విద్యార్థులు అందించేవారు. ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి రాగిజావ అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. ఆకలితో అలమటిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతుండడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చదువుపై ఆ ప్రభావం పడేది. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న గొప్ప సంకల్పంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు స్వచ్ఛందంగా రాగి జావ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ విద్యాసంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం నుంచే పిల్లలకు రాగిజావ అందించడం లేదు. దీంతో విద్యార్థులు ఉదయం పూట తినిరాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఎదుగుదలకు దోహదం.. జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలల్లో 1,9213 మంది విద్యార్థులు చదువుతున్నారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5,354 మంది, 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,3497 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు పది గ్రాముల చొప్పున రాగి జావను అందించేవారు. రాగుల్లో వివిధ ఖనిజ పోషక విలువలు కలిగి ఉండడంతో విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అటువంటి రాగిజావను విద్యార్థులకు అందించకపోవడంతో చదువులో వెనకబడుతారని, రక్తహీనతతో ఇబ్బందులు, విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులతో అనారోగ్యం పాలవుతారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి రాగిజావను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాగిజావ అందించాలి.. ఎక్కువ శాతం పిల్లలు ఉదయం పూట ఖాళీ కడుపుతో పాఠశాలకు వస్తుంటారు. గత ప్రభుత్వ ం మాదిరిగానే సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగిజావ అందించాలి. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. – పట్ల మధు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాఠశాలల పునఃప్రారంభం నుంచే అమలుపై నీలినీడలు ఉదయం ఆకలితో అలమటిస్తున్న పిల్లలు -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాకులగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు. ములుగు జిల్లాకు న్యాయం చేయాలి : మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్ కోసం సంబంధిత ఫైల్ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్ ఇవ్వాలి. గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్పాటిల్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్పాషా పాల్గొన్నారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ పరిశీలన -
పాల సేకరణ
బిల్లుల చెల్లింపులో జాప్యం పాడి రెతు నుంచి పాలు సేకరించిన తర్వాత 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. కానీ నెలరోజుల తర్వాత చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల ఆలస్యంతో పాడి రైతులు కేంద్రాల్లో విక్రయించకుండా హోటళ్లు, స్వీట్ హౌస్లు, గ్రామాల్లో విక్రయిస్తున్నారు. మహబూబాబాద్: పాల ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం పెద్దగా ఆశక్తి చూపడం లేదు. దీంతో పాల శీతలీకరణ కేంద్రాల పరిస్థితి మరీ ఆధ్వానంగా తయారైంది. పాల బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, ఆధునాతన మిషనరీలు అందుబాటులో లేకపోవడం, తదితర కారణాలతో జిల్లాలో పాల సేకరణ ఏటేటా తగ్గుతూ వస్తోంది. అలాగే నల్లజాతి పశువుల సంఖ్య తగ్గడం కూడా పాల సేకరణపై ప్రభావం చూపుతోంది. నల్ల జాతి పశువుల పోషణకు ఖర్చు ఎక్కువ కావడంతో పాటు పనిభారం ఉండడంతో పాడి రైతులు వాటి పెంపకం విషయంలో ఆసక్తి చూపడం లేదు. మానుకోటలో.. జిల్లా కేంద్రంలో 2003లో పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో మేనేజర్, సూపర్వైజర్, వర్కరు పని చేస్తున్నారు. కేంద్రం పరిధిలో కురవి, మానుకోట, డోర్నకల్, గార్ల, బయ్యారం, గూడూరు, కేసముద్రం మండలాలు ఉన్నాయి. కేంద్రాలకు మూడు ఆటోలు ఉన్నాయి. ఒకటి బయ్యారం రూట్, రెండోది డోర్నకల్, మూడోది గూడూరు రూట్లో పాల సేకరణతో పాటు ఆయా రూట్లలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లకు విజయ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. తొర్రూరులో.. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పాలశీతలీకరణ కేంద్రం ఉంది. మేనేజర్, సూపర్వైజర్తో పాటు ముగ్గురు వర్కర్లు పని చేస్తున్నారు. ఆ కేంద్రం పరిధిలో పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ, సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లు మండలాలు ఉన్నాయి. ఆరు ఆటోల ద్వారా పాల సేకరణతో పాటు ప్రభుత్వ హాస్టళ్లకు విజయపాల ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. పాల సేకరణ తగ్గుదల.. మానుకోట పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో సుమారు 800 మంది పాడి రైతులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 500కు పడిపోయిందని సిబ్బంది తెలిపారు. గతంలో ప్రతీరోజు 1,000 లీటర్ల పాల సేకరణ జరిగితే ప్రస్తుతం 400 లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. అలాగే తొర్రూరు పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో గతంలో 1,800 మంది పాడిరైతులు ఉండగా.. ప్రస్తుతం 1,000 మంది మాత్రమే ఉన్నారని సిబ్బంది పేర్కొన్నారు. గతంలో ప్రతీరోజు 4,800 లీటర్ల సేకరణ జరుగగా.. ప్రస్తుతం 1,000 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వెన్న శాతాన్ని బట్టి ధర.. ఆవు పాల సేకరణ చాలా తక్కువగా ఉండగా లీటరు రూ.40 నుంచి రూ.46 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గేదె పాలు లీటరు రూ.42 నుంచి రూ.85 వరకు కొనుగోలు చేస్తున్నారు. వెన్న శాతాన్ని బట్టి ధర కేటాయిస్తున్నారు. తగ్గిన నల్లజాతి పశువులు.. ప్రతీ ఐదేళ్లకోసారి పశుగణన జరుగుతుంది. కాగా, గత ఏడాది అక్టోబర్లో పశుగణన ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేశారు. జిల్లాలో ఐదేళ్లక్రితం 11,85,568 పశువులు ఉండగా.. ప్రస్తుతం 8,40,114 పశువులు ఉన్నాయి. వాటిలో నల్లజాతి పశువులే చాలా వరకు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది పాల ఉత్పత్తిపై చలా ప్రభావం చూపుతోంది. నిర్వహణ మరీ దారుణం.. మానుకోట పాల శీతలీకరణ కేంద్రం ఆవరణ అంతా పిచ్చి మొక్కలతో దారుణంగా తయారైంది. ఆ కేంద్రం బయట బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం, పలు కారణాలతో అక్కడికి వెళ్లి పాలు విక్రయించేందుకు పాడి రైతులు మక్కువ చూపడం లేదు. ప్రభుత్వం పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని, అందుకోసం పాల శీతలీకరణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మిషనరీలు సరఫరా చేయాలని, బిల్లులు సకాలంలో చెల్లించాలని పాడి రైతులు కోరుతున్నారు. -
అమరుల స్ఫూర్తితో పోరాడాలి
ఏటూరునాగారం: అమరుల స్ఫూర్తితో పోరాడాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దామోదర్, చిరంజీవి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని వై జంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గిరిజన తెగ ఉనికి ప్రమాదంలో పడుతోందన్నారు. ఈ తరుణంలో గిరిజన హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు, గిరిజన హక్కుల సంఘాలు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నిర్వహించడం లేదని తెలిపారు. రాజ్యాంగంలోని గిరిజన హక్కులను కాపాడుకుందామని, అడవులు, భూముల నుంచి గిరిజనులను గెంటివేయడాన్ని ఆపాలన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుదాం అనే నినాదాలతో ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన 16 వాగ్దానాలను వెంటనే అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పూనం నగేశ్, కుర్సం చిరంజీవి, కుర్సం శాంతకుమారి, తోలెం కృష్ణయ్య, సౌలం వీరబాబు, ఆలెం అశోక్, కోరం చిరంజీవి, కుర్సం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దామోదర్, చిరంజీవి ఘనంగా ఆదివాసీ దినోత్సవం -
వైద్యం వికటించి వ్యక్తి మృతి..
● గోపాల్నగర్లో ఘటన ● ఆర్ఎంపీ కారణమని కుటుంబీకుల ఆరోపణ బచ్చన్నపేట: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని గోపాల్నగర్లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరబోయిన భిక్షపతి (45) ఒళ్లు నొప్పులతో స్థానిక ఆర్ఎంపీ కృష్ణ వద్దకు వెళ్లగా ఆయన ఇంజక్షన్ చేసి మందులు రాసి ఇచ్చాడు. ఇంటికెళ్లిన భిక్షపతి పడిపోవడంతో కుటుంబ సభ్యులు జనగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు.. ఆర్ఎంపీ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై హమీద్ ఘటనాస్థలికి చేరుకుని ఆర్ఎంపీ, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పారు. -
నలుగురి బలవన్మరణం
వేర్వేరు కారణాలతో రఘునాథపల్లి: అప్పు చెల్లించాలని బంధువుల ఒత్తిడితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేకలగట్టు గ్రామానికి చెందిన ముక్క ఎల్లయ్య (52)–రేణుకకు ఇద్దకు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆరు నెలల క్రితం పెద్ద కూతురు వివాహం చేశారు. వివాహ సమయంలో ఫతేషాపూర్ గ్రామంలోని బంధువు గడ్డం మహేందర్ వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. మహేందర్.. ఎల్లయ్య కుమార్తె వివాహానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బిడ్డ పెళ్లికి రావడంతోనే మహేందర్ మరణించాడని, ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని మేకలగట్టుకు చేరుకొని ఎల్లయ్యపై బంధువులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య శుక్రవారం రాత్రి కిచెన్షెడ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం లేచి చూడగా చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. వివాహం కావడం లేదని పానీష్తండాలో యువకుడు.. రాయపర్తి: తనకు వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పానీష్తండాలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన కొర్ర బీమా, నాజీ దంపతుల పెద్ద కుమారుడు మోహన్(25) కొంతకాలంగా తనకు వివాహం కావడం లేదని మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకుయత్నించాడు. గమనించిన కుటుంబీ కులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి భీమా ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సీతానగరలో వ్యక్తి.. గూడూరు: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన శనివారం మండలంలోని సీతానగరం శివారు ఆకులబండతండా సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరం గ్రామానికి చెందిన తాటి రాకేశ్ (45), రజిత దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వారికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో రాకేశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యను మద్యానికి డబ్బులు అడగుతూ ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. రెండు రోజుల క్రితం డబ్బులు ఇవ్వనందుకు ఇంటి నుంచి కోపంతో వెళ్లాడు. ఈ క్రమంలోనే బావిలో దూకి ఉంటాడనే భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. ఆర్థిక కారణాలతో మొగుళ్లపల్లిలో తాపీమేసీ్త్ర.. మొగుళ్లపల్లి: ఆర్థిక కారణాలతో ఓ తాపీమేసీ్త్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య(54) తాపీమేసీ్త్రగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆర్థికపరంగా గొడవ జరగడంతో డబ్బులు తీసుకొస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శనివారం మొగుళ్లపల్లి శివారులో గొర్రెలు మోపుతున్న కాపరికి చెట్ల పొదల్లో కొమురయ్య మృతి చెంది కనిపించాడు. దీంతో గొర్రెల కాపరి పోలీసులు, కుటుంబీకులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు అజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అప్పు చెల్లించాలని బంధువులు ఒత్తిడి చేయడంతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టులో వ్యక్తి, వివాహం కావడం లేదని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పానీష్ తండాలో యువకు డు, మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో వ్యక్తి, ఆర్థిక కారణాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తాపీమేసీ్త్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
రాఖీ కట్టొస్తూ.. మృత్యుఒడికి
ఎస్ఎస్తాడ్వాయి : రాఖీ కట్టొస్తూ ఓ అంగన్వాడీ టీచర్ మృత్యుఒడి కి చేరింది. బైక్ అదుపు తప్పిన ఘ టనలో మృతి చెందింది. ఈ ఘట న శనివారం గంగారం జీపీ పరిధిలోని నాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఎస్ఎస్తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన అంగన్వాడీ టీచర్ మొగిలిపల్లి పద్మ(42), భర్త కృష్ణయ్య బైక్పై మండలంలోని అంకంపల్లిలో సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. రాఖీ కట్టి తిరిగొస్తుండగా గంగారం జీపీ పరిధిలోని నాంపల్లి సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వచ్చే కారును తప్పించి రోడ్డు దిగారు. మళ్లీ రోడ్డెక్కుతున్న క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో పద్మకు తీవ్రంగా, కృష్ణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ప ద్మను 108లో తాడ్వాయి పీహెచ్సీకి తీసుకొచ్చే క్ర మంలో మృతి చెందింది. రాఖీ కట్టి ఆనందంగా తి రిగొస్తున్న క్రమంలో పద్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో ముని గింది. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. పండుగకు ఇంటికెళ్తూ ఆరెపల్లి వద్ద యువతి.. న్యూశాయంపేట : రాఖీ పండుగకు తమ్ముడితో కలిసి ఇంటికెళ్తున్న క్రమంలో బైక్ డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతి చెందింది. ఈ ఘటన ఆరెపల్లి వద్ద చోటు చేసుకుంది. ఏనుమాముల సీఐ జవ్వాజి సురేశ్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా ములుగు మండలం మంచినీళ్ల పల్లె గ్రామానికి చెందిన రాయనబోయిన శ్యామల(23) ములుగు రోడ్డులోని గార్డియన్ ఆస్పత్రిలో స్టాఫ్నర్స్గా పనిచేస్తోంది. రాఖీ సందర్భంగా శుక్రవారం రాత్రి తన తమ్ముడు శ్రీనుతో కలిసి బైక్పై తన గ్రా మానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఆరెపల్లి సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ దాటిన తర్వాత బైక్ డీవైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న శ్యామల అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్ అదుపు తప్పి అంగన్వాడీ టీచర్ మృతి నాంపల్లి సమీపంలో ఘటన -
పలకరిస్తే కన్నీళ్లే!
‘ఇంటర్ సిటీ’లో సాంకేతిక లోపం ● రెండు గంటలపాటు నిలిచిన రైలు కేసముద్రం: సాంకేతిక లోపంతో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గంటల పాటు నిలిచింది. దీంతో ఆప్లైన్లో వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ కూడా గంటపాటు నిలిచింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపునకు ఆప్లైన్లో వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య రాత్రి 8.10 గంటలకు నిలిచింది. దీంతో రైల్వే సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేశారు. చివరకు రాత్రి 9.45 గంటల సమయంలో రైలు బయలు దేరింది. ఇదిలా ఉండగా ఇంటర్సిటీ వెనుక, ఆప్లైన్లో వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గంటపాటు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. అంతే కాకుండా ఆప్లైన్లో వెళ్లే రెండు గూడ్స్ రైళ్లు కేసముద్రం రైల్వే స్టేషన్లో నిలిచాయి. కాగా, ఇంటర్సిటీ రైలు రెండు గంటలు, వందేభారత్ సుమారు గంటపాటు నిలిచింది. నెక్కొండలో గంటకు పైగా.. నెక్కొండ: సాంకేతిక లోపంతో గుంటూరు– సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి నెక్కొండ రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచింది. రాత్రి 9.50 గంటలకు నెక్కొండకు చేరుకున్న రైలు 11.30 వరకు గంటకుపైగా నిలిచింది. ఈ విషయమై అధికారులను అడుగగా ఎస్–6 బోగిలో బ్రేక్ ఎయిర్ లీక్ కావడంతో రైలు నిలిచిందని తెలిపారు. -
అన్న విగ్రహానికి రాఖీ కట్టిన చెల్లెలు
నెల్లికుదురు: అన్నపై మమకారం చంపుకోలేక ఓ చెల్లెలు అన్న విగ్రహానికి రాఖీ కట్టి తన అభిమానం చాటుకుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో శనివారం చోటు చేసుకుంది. చిన్ననాగారం గ్రామ మాజీ ఎంపీటీసీ గుగులోత్ లక్ష్మణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామంలో లక్ష్మణ్ విగ్రహాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆయన చెల్లెలు బానోత్ లింగమ్మ రాఖీ పండుగరోజు విగ్రహానికి రాఖీ కట్టి అన్నా చెల్లెలు అనుబంధాన్ని చాటిచెప్పింది. కమిటీ పేరిట వసూళ్లు.. ● తొమ్మిది మందిపై కేసు న్యూశాయంపేట: వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లి పరిధి ఆర్టీసీ కాలనీలో డెవలప్మెంట్ కమిటీ పేరుతో కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుదారు మిట్టపల్లి స్వప్న ఆర్టీసీ కాలనీలో 2005లో ఆర్టీసీ సొసైటీలో ఉన్న తన మామ మిట్టపల్లి ఉప్పలయ్య దగ్గర 140 గజాల భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిలో ప్రహరీ నిర్మాణం చేపడుతున్న క్రమంలో కాలనీకి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నిర్మాణాన్ని కూలగొట్టారు. భూమి మీది కాదని బెదిరించారు. ప్రహరీ నిర్మిస్తే కాలనీ డెవలప్మెంట్ కమిటీకి రూ. రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భూమిలో అడుగు పెట్టనీయమని, వెళ్తే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై స్వప్న భర్త ఫిర్యాదు మేరకు ఆ తొమ్మిది మందిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు. విధులకు ఆటంకం కల్పించిన వ్యక్తిపై కేసు స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఇప్పగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు సాయిప్రణిత, వైద్య సిబ్బంది విధులకు ఆటంకం కల్పిస్తూ దుర్భాషలాడిన పసునూరి తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జి.వేణు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే సాయిప్రణిత ఈ నెల 7న ఇప్పగూడెం ఆస్పత్రిలో ఉదయం 11 గంటల సమయంలో విధులు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి రాగా ఓపీ చూసి మందులు రాసి ఫార్మసీలో తీసుకోవాలని చెప్పింది. ఫార్మసిస్టు ప్రపుల్ల వద్దకు వెళ్లి మందులు అడుగుతూ మీరు ఏ టైంకు ఆస్పత్రికి వస్తున్నారు, ఏ టైంకు వెళ్తున్నారు.. అంటూ దుర్భాషలాడారు. వెంటనే వైద్యురాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారని అడిగితే మాపై కూడా దుర్భాషలాడారని, సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నట్లుగా బెదిరిస్తూ మా విధులకు ఆటంకం కల్పించారని ఫిర్యాదులో పేర్కొంది. వైద్యురాలి ఫిర్యాదు మేరకు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వినియోగదారుల ముంగిట్లో సేవలు..
కన్జ్యూమర్ గ్రీవెన్స్.. సెల్ఫోన్లో టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ఓపెన్ చేసి అందులోని కన్జ్యూమర్ గ్రీవెన్స్ ఆప్షన్పై టచ్ చేయగానే న్యూ కాంప్లెంట్, కాంప్లెంట్ స్టేటస్, రీఓపెన్ కాంప్లెంట్, క్యాన్సల్ అనే ఫీచర్స్ కనిపిస్తాయి. ● న్యూ కంప్లైంట్: వినియోగదారుడికి సంబంధించిన సమస్యలను నేరుగా ఇందులో పొందుపరచొచ్చు. వారి మీటర్ నంబర్, సమస్య తాలూకు వివరాలు ఇందులో న మోదు చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్కు సంబంధించిన ప్రతీ అంశం పై ఫిర్యాదు చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ● కంప్లైంట్ స్టేటస్: ఫిర్యాదు చేసిన సమ స్య స్టేటస్ను ఇందులో చూసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా కార్యాలయం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే చూసుకునే అవకాశముంది. ● రీ–ఓపెన్ కంప్లైంట్: ఫిర్యాదు చేసిన సమస్యకు జరిగిన పరిష్కారంపై సంతృప్తి చెందక పోతే పునరావృతం చేసుకునే వీలుంది.హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం.. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారుల ముంగిట్లోకే విద్యుత్ సేవలు తీసుకెళ్తుంది. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన, నాణ్యమైన సేవలు వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వినియోగదారుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ సమాచారం చేరుకునేలా డ్యాష్ బోర్డు రూపకల్పన చేశారు. అలాగే, టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా ఫిర్యాదులు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. విద్యుత్ ప్రజావాణి.. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేకంగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సెక్షన్, డివిజన్ కార్యాలయాల్లో, మఽ ద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సర్కిల్ కా ర్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి వి నతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స మస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే లేదా సమయం తీసుకొని పరిష్కరిస్తున్నారు. ఎమర్జెన్సీ రిస్టోర్ టీమ్.. వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు తగ్గించడానికి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చెప్పట్టడానికి ఎమర్జెన్సీ రీస్టోర్ టీమ్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతికంగా విద్యుత్ సమస్యలతో ఏర్పడే అంతరాయాలు తగ్గించడానికి, బ్రేక్ డౌన్ టీమ్లు ఏర్పాటు చేశారు. ఈఆర్టీ వాహనాల ద్వారా జీపీఆర్ఎస్ లొకేషన్ ఆధారంగా వేగంగా వెళ్లి పరిష్కరిస్తారు. పొలం బాట.. టీజీ ఎన్పీడీసీఎల్ రైతుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. హెచ్టీ వినియోగదారులకు సింగిల్ విండో వ్యవస్థ.. హెచ్టీ వినియోగదారులకు విద్యుత్ సర్వీస్ల మంజూరును సరళీకృతం చేస్తూ ఎన్పీడీసీఎల్లో సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. హెచ్టీ 11 కేవీ, 33 కేవీ ఓల్టేజీ సర్వీస్ల మంజూరును సింగిల్ విండో ద్వారా చేస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో ఏడీఈ కమర్షియల్ 11 కేవీ దరఖాస్తులను మానిటర్ చేస్తుండగా, ప్రధాన కార్యాలయంలోని ఏడీఈ 33 కేవీ, ఆపై ఓల్టేజీ దరఖాస్తులను మానిటర్ చేస్తారు. అసెట్ మ్యాపింగ్.. అసెట్ మ్యాపింగ్లో భాగంగా అన్ని 33 కేవీ, 11 కే వీ విద్యుత్ స్తంభాలకు యూనిక్ ఫోల్ నంబర్ పె యింటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని వెంటనే చేరుకుని వేగంగా సమస్యను పరిష్కరించే అవకాశముంది. తద్వారా అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్.. టీజీ ఎన్పీడీసీఎల్ యాప్లోని రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ ఫీచర్ ఓపెన్ చేసి ఎక్కడైనా, ఎలాంటి ఘటన జ రిగిన ఇందులో జీపీఎస్ లొకేషన్ ద్వారా వినియోగదారుడు ఫొటో తీసి పంపొచ్చు. తద్వారా రిపోర్ట్ నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. వెంటనే ఆ అధికారి స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం.. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పలు కార్యక్రమాలురైతులకు తెలుగులో సమాచారంనూతన విద్యుత్ సర్వీస్ కోసం దరఖాస్తు చేసిన రైతులకు మంజూరుకు సంబంధించిన సమాచారం తెలుగులో అందిస్తున్నారు. ఎస్టిమేట్కు సంబంధించిన మెటీరియల్ తాలూకు వివరాలు, స్కెచ్ (నక్ష) వంటివి తెలుగులో అందిస్తున్నారు. రైతులకు ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందించడం ద్వారా సులభంగా అర్థమవుతాయి. ఈ వివరాలు రైతుల సెల్ ఫోన్కు ఎస్ఎంఎస్ రూపేణ అందుతాయి. -
మరో ఏడు నెలలే..!
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. భూసేకరణే అసలు సమస్య.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకు భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ సీతక్క, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పంపింగ్ స్టేషన్ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్లోనే హైదరాబాద్కు బయలుదేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్లైన్ 2026 మార్చి నాటికి పూర్తయ్యేనా.. భూసేకరణకు అడ్డంకులు ఇప్పటికే నాలుగు పర్యాయాలు ప్రాజెక్టుపై సమీక్ష 9 శాతం పెండింగ్తో అసంపూర్తి... రూ.17,500 కోట్లకు అంచనా... నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా ఐదుగురు మంత్రుల రాక సమ్మక్క బ్యారేజీ పరిశీలన.. అనంతరం అధికారులతో సమీక్ష9 జిల్లాలకు ప్రయోజనం.. ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. -
‘రాఖీ’ రద్దీ
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuరాఖీ పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని తమ అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్లే యువతులు, మహిళలతోపాటు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో మానుకోట రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కిటకిటలాడాయి. సమయానికి బస్సులు, రైళ్లు రాకపోవడం.. వచ్చినా.. కిక్కిరిసి ఉండడంతో కాస్త ఇబ్బందిపడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రయాసకొర్చిమరీ.. తమ సోదరులను చేరుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి
● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మహబూబాబాద్ అర్బన్: ఆదివాసీ సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మదర్థెరిస్సా సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కొమరంభీం విగ్రహం వరకు జిల్లా గిరిజన అధికా రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరంభీం విగ్రహానికి అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, అధికారి గుగులోతు దేశీరాం నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడు తూ.. ఆదివాసీ, గిరిజన బిడ్డల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. విద్యార్థులకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సీబీఎస్ విద్యను అందిస్తున్నట్లు తెలిపా రు. చదువుతోపాటు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్ మాట్లాడుతూ.. మహనీయుల చరిత్ర, ఆదివాసీల కోసం పోరాడిన నాయకుల గురించి విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. విద్యార్థులు విద్యతోపాటు ఆటపాటలో ముందుండాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులకు కృషి చేసి భవిష్యత్లో పది ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు యాప సీతయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు గుగులోతు కిషన్ నాయక్, ఆదివాసుల రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జీసీడీఓ విజయ, ఎల్హెచ్పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ బోడ లక్ష్మణ్ నాయక్, హెచ్ఎంలు నర్సయ్య, కిషన్ నాయక్, హెచ్డబ్ల్యూఓ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒక సీసీ కెమెరా వందమందితో సమానం
నెల్లికుదురు: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తొర్రూర్ డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, మీఠ్యతండా పరిధిలో శనివారం నెల్లికుదురు పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న రూ.20వేల విలువ చేసే మద్యం, 20 లీటర్ల గుడుంబా, 4 క్వింటాళ్ల నల్ల బెల్లం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, పత్రాలు లేని 22 వాహనాలు, ఆటోను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. అక్రమ దందాలు, మద్యం, గంజాయి, గుడుంబా మత్తు పదార్థాలకు బానిసై ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రయమంలో తొర్రూరు సీఐ వివిధ మండలాల ఎస్సైలు చిర్ర రమేష్ బాబు, రాజు, సురేష్, క్రాంతి కిరణ్, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గేట్ వాల్వ్ లీకేజీ మహబూబా బాద్: జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ ప్రాంతంలోని మెయిన్రోడ్డులో తాగునీటి పైపు లైన్కు సంబంధించిన గేట్ వాల్వ్ పాడైపోయింది. గేట్ వాల్వ్ లీకేజీతో నీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు గేట్ వాల్వ్కు అడ్డుగా రాళ్లు కవర్లు కట్టారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్పై శిక్షణ తరగతులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు మేఘనరావు తెలిపారు. భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు
మహబూబాబాద్: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి శనివారం ఆయన రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్టీ) నవీన్ మిట్టల్, రెడ్కో సీఎండీ, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారంలోగా సంబంధిత వివరాలను విద్యుత్ శాఖకు పంపించాలని తెలిపారు. మూడు సంవత్సరాల లోపు ప్రక్రియ పూర్తి అయ్యోలా అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, విద్యుత్ శాఖ ఎస్ఈ విజేందర్ రెడ్డి, డీఈ విజయ్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క -
సాగు అంతంతే!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పంటలు సాగు చేయలేదు. ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో పంటల సాగు ఆగుతూ.. సాగుతోంది. ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న సాగు లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాగే వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వరినాట్లు వేసి.. అనంతరం విరమించుకుంటున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షానికి జిల్లాలో రైతులు వరినాట్లు వేస్తున్నారు. తగ్గిన పత్తి, మొక్కజొన్న.. జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన వానాకాలం పంటల ప్రణాళిక అంచనాను వర్షాలు తారు మారు చేశాయి.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఆశించినస్థాయిలో వర్షాలు పడకపోవడంతో 78,797 ఎకరాల్లో పత్తి, 57,264 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అదే విధంగా పెసర 4,555 ఎకరాల్లో అంచనాలో పేర్కొనగా కేవలం 1,724 ఎకరాలకు పరిమితమైంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 2,77,345 ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. వరి సాగు చేయగా మిగిలిన భూముల్లో మిర్చి సాగు పెరిగే అవకాశం ఉంది. మిర్చి గతేడాది 52వేల ఎకరాల్లో సాగు చేయగా.. ప్రస్తుతం 60వేల ఎకరాలకు చేరుకోవచ్చు. ఒకవైపు నిండి.. మరో వైపు ఎండి.. జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసి చెరువులు నిండగా... మరికొన్ని చోట్ల కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లాలో 1,590 చెరువు ఉన్నాయి. ఇందులో 175 చెరువుల్లో 25 శాతం నీరు కూడా రాలేదు. ఇందులో తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల్లోని చెరువులు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా 898 చెరువుల్లో 75శాతం నుంచి 100శాతం, 65 చెరువులు మత్తడి పోస్తున్నాయి. వీటిలో కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల, మహబూబాబాద్, కురవి మండలాల్లోని చెరువులు ఉన్నాయి. అంటే జిల్లాలోని సగం చెరువులు నిండి.. సగం చెరువులు ఎండి కనిపిస్తున్నాయి. నీటి లభ్యత ఆధారంగా వరి సాగు చేయాలి వరి సాగుకు సాగునీరు ఎక్కువ అవసరం. నీటి లభ్యత ఆధారంగా వరి నాట్లు వేసుకోవాలి. సన్న రకాలు, స్వల్పకాలిక కాలం రకాలు సాగు చేసుకోవాలి. నారు పోసుకున్నవారు ఆగస్టు చివరి వరకు వరి నాట్లు వేసుకుంటే ఇబ్బంది లేదు. నీరు లేకపోతే ఆరుతడి పంటలు సాగుచేసుకోవడం మేలు. మొక్కజొన్న, జొన్న, పెసర సాగుకు అనువుగా ఉంటుంది. – క్రాంతి కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, మల్యాలజిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వల వివరాలు నీటి శాతం చెరువుల సంఖ్య 0–25శాతం 175 25–50శాతం 165 50–75శాతం 287 75–100శాతం 898 అలుగులు పోసేవి 65 మొత్తం 1,590తగ్గిన పత్తి, మొక్కజొన్న పంటలు ఆగుతూ.. సాగుతున్న వరినాట్లు మిర్చి విస్తీర్ణం పెరుగుతుందనే నమ్మకం లోటు వర్షపాతమే కారణం సాగలేక.. ఆగలేక జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సాగు కాస్త ముందుకు కాస్త వెనక్కి అన్నట్లు మారింది. 2,21,282 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు 1,38,576 ఎకరాల్లోనే సాగు చేశారు. ఇందులో అత్యధికం బావులు, బోర్లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరో 1,56,110 ఎకరాల్లో నాట్లు వేసే విధంగా వరి నార్లు పోశారని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతుండడం, రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో నాట్లు ముమ్మరం చేశారు. వారంరోజుల్లో మరో 50 వేల ఎకరాల్లో వరినాట్లు పడే అవకాశం ఉంది. -
సొంతింటి కల నెరవేరుస్తాం
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేదకుటుంబ సొంతింటి కలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండలోని బాలసముద్రం అంబేద్కర్నగర్లో జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించిన 592 డబుల్ బెడ్రూం ఇళ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి, తన వద్దకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పలుమార్లు వచ్చారన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి ఆరు సంవత్సరాలైన గత పాలకులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల మందిని పాత కార్డుల్లో కొత్తగా చేర్చామని, ఆరు లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే సంతోషంగా ఉంది..: నాయిని పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే సంతోషంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గుడిసెలు వేసుకున్న అందరికీ ఇళ్లు కేటాయించామని, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా న్యూ శాయంపేటలో కేటాయిస్తామన్నారు. ఇంకా చాలా మంది నిరుపేదలున్నారని, శాయంపేట, తదితర ప్రాంతంలో ప్రభుత్వ భూములు గుర్తించి అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేవిధంగా కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిని కోరారు. 592మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా 2,500 మంది వద్ద అక్రమంగా ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి, ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తీవ్ర కష్టాలు అనుభవించిన రహీమున్సీసాకు తొలి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ -
సీడబ్ల్యూసీ నియామకానికి మోక్షం
మహబూబాబాద్: బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) నియామకానికి ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కమిటీ కాలపరిమితి ముగిసిన 17 నెలల తర్వాత నూతన కమిటీ కోసం నోటిఫికేషన్ వేశారు. అయితే కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో చాలా మంది అర్హులు సమా చారం లేక దరఖాస్తు చేసుకోలేదు. బాలరక్షా భవన్లోనే.. జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్లోనే జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల న్యాయ మండలి, చైల్డ్లైన్ 1098, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, చైల్డ్ లెవల్ ప్రాజెక్ట్ ఆఫీసర్, పిల్లల పోలీస్ యూనిట్ విభాగాలు కొనసాగుతున్నాయి. ఆ కార్యాలయంలో సుమారు 35 మంది పని చేస్తుండగా ప్రత్యేక వాహనం కూడా కేటాయించారు. సీడబ్ల్యూసీ కమిటీని 2021 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. కమిటీలో చైర్మన్తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. పదవీకాలం మూడేళ్లు కాగా.. 2024 ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ కమిటీనే కొనసాగుతోంది. 15 రోజుల క్రితం నోటిఫికేషన్.. నూతన కమిటీ నియామకం కోసం మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయినట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో డబ్ల్యూసీడీ (ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్లో ఉంది. అర్హతలివే.. పీజీలో ఎంఎస్డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, సోషియాలజీ) కోర్సు పూర్తి చేసి ఉండాలి. 35 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులు. ఏడు సంవత్సరాల పాటు పిల్లల కోసం పని చేసిన అనుభవం, ఆ సంస్థ (ఎన్జీఓ) నుంచి జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి. ముందుగా దరఖాస్తుదారులు కమిటీ చైర్మన్, సభ్యుల పదవుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా చైర్మన్తో పాటు సభ్యులను నియమిస్తారు. కమిటీకి గౌరవ వేతనం.. కమిటీ చైర్మన్తో పాటు సభ్యులకు సమానమైన గౌరవ వేతనం ఉంటుంది. కానీ ప్రొటోకాల్ ప్రకారం చైర్మన్కు ప్రాధాన్యత ఉంటుంది. జీరో నుంచి 18సంవత్సరాలలోపు బాలబాలికల సమస్యలన్నీ వారి పరిధిలోకే వస్తాయి. బాల్య వివాహాలు, బాల కార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అమ్మకాలు చేస్తే చర్యలు తీసుకుంటారు. పిల్లల దత్తత, తదితర అంశాలు సీడబ్ల్యూసీ పరిధిలోకి వస్తాయి. కార్యాలయంలో సీడబ్ల్యూసీ కోర్టు నిర్వహిస్తారు. నెలలో 20సార్లు ఆ కోర్టులో కేసుల విచారణ నిర్వహిస్తారు. ఒక్కసారి నిర్వహిస్తే ఐదుగురు కమిటీ సభ్యులకు గానూ ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున వస్తాయి. ఇలా వారికి నెలకు రూ.40,000వరకు వస్తాయి. హాజరు కాకపోతే వేతనం తగ్గుతుంది. నోటిఫికేషన్పై గోప్యం.. మహిళా,శిశు సంక్షేమశాఖ కమిషనర్ నుంచి ఎలాంటి సమాచారం వచ్చిన జిల్లాలో ప్రకటన రూపంలో తెలియజేస్తారు. కానీ సీడబ్ల్యూసీ, బాలల న్యాయ మండలి సభ్యుల నియామక నోటిఫికేషన్ విషయంలో జిల్లాలోని డీడబ్ల్యూఓ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అర్హత ఉన్న వారు సమాచారం లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదు. బాలల న్యాయ మండలిలో సభ్యుల నియామకం కోసం కూడా.. అలాగే బాలల న్యాయమండలి సభ్యుల నియామకం కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ విభాగం పరిధిలోకి జీరో నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలు వస్తారు. చట్టంతో విబేధించిన పిల్లలు, దొంగతనాలు, హత్యలు చేసిన వారు ఆ విభాగంలోకి వస్తారని అధికారులు పేర్కొన్నారు. ఆ విభాగంలో ఇద్దరు సభ్యుల ఉంటారు. వారి పదవీకాలం పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఆ దరఖాస్తుల గడు వు కూడా ఈనెల 8తో ముగిసింది. దీనికి కూ డా ఎంఎస్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఏడు సంవత్సరాల పాటు పిల్లల కోసం పనిచేసిన అ నుభవం ఉండాలి. వారంలో ఒక్కరోజు కా ర్యాలయంలో కోర్టు మాదిరిగా నిర్వహిస్తారు. జడ్జి వచ్చి పరిష్కరిస్తారు. సభ్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.8,000 వేతనం ఉంటుంది. వారు వారంలో ఒక్కరోజు మాత్రమే వస్తారు. ముగిసిన దరఖాస్తుల గడువు నోటిఫికేషన్ విడుదలలో గోప్యం దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు -
రైల్వే క్యాంపింగ్ బోగి దగ్ధం
కేసముద్రం: ప్రమాదవశాత్తు రైల్వే క్యాంపింగ్ కోచ్(బోగి) దగ్ధమైన సంఘటన కేసముద్రం రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగా చేపడుతున్న రైల్వే థర్డ్లైన్ పనుల్లో భాగంగా కేసముద్రం రైల్వేస్టేషన్లోని థర్డ్లైన్ పక్కనున్న లూప్లైన్పై రైల్వే క్యాంపింగ్ కోచ్ను నిలిపారు. థర్డ్లైన్ పనుల అనంతరం నలుగురు సిబ్బంది (ఇద్దరు టెక్నిషియన్స్, ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది) ఆ క్యాంపింగ్ కోచ్లో నిద్రించేందుకు ఎక్కారు. ఈ క్రమంలో బోగిలో పొగలు వస్తుండటంతో గమనించిన నలుగురు అప్రమత్తమయ్యారు. మంటలు వ్యాపిస్తుండటంతో చల్లార్పే ప్రయత్నం చేసిన తగ్గకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత సంఘటన స్థలానికి మానుకోట, డోర్నకల్ నుంచి రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పివేశాయి. బోగిలో ఉన్న సిబ్బందికి సంబంధించిన దుస్తులు, ఇతర సామగ్రితోపాటు, సీట్లు, ఏసీ, ఫ్యాన్లు దగ్ధం కాగా, 8 ఆయిల్ డ్రమ్ములు సురక్షితంగా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే భోగి దగ్ధమైనట్లుగా రైల్వే అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపింగ్ బోగి దగ్ధంతో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. శుక్రవారం సంఘటనా స్థలాన్ని ప్రిన్సిపల్ ఛీప్ ఇంజనీరింగ్(పీసీఈ) ఆంజనేయులురెడ్డి, పీసీఎంఈ ధర్మేందర్కుమార్, సీనియర్ ఎస్పీ సికింద్రాబాద్ కె.నవీన్కుమార్, ఏడీఆర్ఎం గోపాలక్రిష్ణతోపాటు పలువురు అధికారులు సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టారు. ఘటనపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారించనున్నారు. అర్ధరాత్రి సమయంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో ఘటన నలుగురు సిబ్బందికి తప్పిన ప్రమాదం షార్ట్సర్క్యూట్ కారణమని అంచనా..? -
కాజీపేట మీదుగా వెళ్లే 16 రైళ్లు పొడిగింపు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్తో మేజర్ అప్గ్రేడేషన్ వర్క్స్తో ఆగస్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లు కాచిగూడ, మల్కాజ్గిరి వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. పొడిగింపు రైళ్ల వివరాలు.. విజయవాడ–సికింద్రాబాద్ (12713) వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ను కాచిగూడ నుంచి సికింద్రాబాద్–విజయవాడ (12714) వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ను కాచిగూడ నుంచి సికింద్రాబాద్–పోరుబందర్ (20967) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను, ఉమ్దానగర్ నుంచి పోరుబందర్–సికింద్రాబాద్ (20968) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను, ఉమ్దానగర్ నుంచి సికింద్రాబాద్–మణుగూరు (12745) వెళ్లే డైలీఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, మణుగూరు–సికింద్రాబాద్ (12746) వెళ్లే డైలీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–దర్భాంగా (17007) వెళ్లే బై వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, దర్బాంగా–సికింద్రాబాద్ (17008) వెళ్లే బైవీక్లి ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, ముజఫరుద్దీన్–సికింద్రాబాద్ (05293) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్ –ముజఫరుద్దీన్ (05294) వెళ్లే వీక్లి ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–సంత్రగచ్చి (07221) వెళ్లే బై వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, సంత్రగచ్చి–సికింద్రాబాద్ (07222) వెళ్లే ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, సికింద్రాబాద్–దానాపూర్ (07647) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, దానాపూర్–సికింద్రాబాద్ (07648) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, హైదరాబాద్–రక్సోల్ (07051) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి, రక్సోల్–చర్లపల్లి (07052) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
ఓం వరలక్ష్మీ దేవాతాయనమః
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంశ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వ్రతం అనంతరం లక్ష్మీదేవికి చీరరవికలు, నైవేధ్యాలు సమర్పించారు. ఒకరికొకరు నైవేధ్యప్రసాదాలు, వాయినాలు అందించుకున్నారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, శ్రీభద్రకాళి దేవాలయం, ఎంజీఎం సమీపంలోని రాజరాజేశ్వరస్వామి వారి దేవాలయం, హంటర్రోడ్ని సంతోషిమాత దేవాలయం, శ్రీకాశీవిశేశ్వరస్వామి వారి దేవాలయం, పలు వేంకటేశ్వరస్వామి దేవాలయాలలోనూ వందలాది మంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు. వరాల రుద్రునిగా శ్రీరుద్రేశ్వరస్వామి.. శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసోత్సవాలలో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారిని 11కిలోల పసుపు, 11కిలోల కుంకుమతో వరాల రుద్రునిగా అలంకరించి పూజలు, మహాహారతి జరిపి భక్తులకు సందర్శనం కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ రుద్రాభిషేకం నిర్వహించారు. భద్రకాళి దేవాలయంలో.. శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శ్రావణమాసపూజలు నిర్వహించా రు. శుక్రవారం కావడంతో వేలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని వాయినాలు ఇచ్చుకున్నారు. వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి , మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. –హన్మకొండ కల్చరల్ -
నిర్మాణసంస్థ నిర్లక్ష్యమే..
ములుగు రూరల్: ములుగు జిల్లా నుంచి భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారిపై మల్లంపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి గురువారం రెయిలింగ్ పడిపోయి కుంగిన విషయం తెలిసిందే. జాతీయరహదారి విస్తరణ పనుల్లో భాగంగా మల్లంపల్లి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ అలసత్వం కారణంగానే బ్రిడ్జి కుంగిందని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు. గతేడాది జూలై 17వ తేదీ వరకు పనులను పూర్తి చేయవలసిన వృద్ధి సంస్థ యాజమాన్యం పనులను జాప్యం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన సమయం పూర్తయిన కూడా..సదరు సంస్థ అధికారులను మచ్చిక చేసుకొని ఈఓటీ అనుమతులు లేకుండా 6 నెలల క్రితం పనులను ప్రారంభించింది. ఎస్సారెస్పీ కాలువపై ఉన్న గత బ్రిడ్జి నిర్మాణంలో కాలువ నీటి ప్రవాహం దృష్టిలో పెట్టుకొని పైపులు వేసి పై నుంచి మట్టిని నింపి బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. నిర్మాణ సంస్థ పనులు చేపడుతున్న సమయంలో నిర్లక్ష్యం కారణంగా పాత బ్రిడ్జి రెయిలింగ్ పడిపోవడంతో పాటు మట్టి పోయి కుంగిపోయింది. దీంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దారి మళ్లింపు దూరభారం జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగిపోవడంతో పోలీస్శాఖ ఆధ్వర్యంలో వాహనాలను దారిమళ్లించారు. హనుమకొండ నుంచి ములుగు, ఏటూరునాగారం వెళ్లే వాహనదారులకు రవాణా అంతరాయం ఏర్పడింది. హనుమకొండ నుంచి ములుగు వైపు వస్తున్న భారీ వాహనాలను గుడెప్పాడ్–పరకాల–రేగొండ–జంగాలపల్లి మార్గంలో దారిమళ్లించడంతో వాహనదారులకు సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. హనుమకొండ, నర్సంపేట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను, కారులను శ్రీనగర్–రాంచంద్రాపూర్–పందికుంట మీదుగా దారిమళ్లించడంతో సుమారు 15 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. బ్రిడ్జి కుంగిపోవడంతో మల్లంపల్లి వద్ద బ్రిడ్జికి ఇరుపక్కల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బారికేడ్లు, చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మల్లంపల్లి వద్ద కుంగిన బ్రిడ్జిని ఎన్హెచ్ అధికారులు పర్యవేక్షించారు. భారీ యంత్రాలలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో వాడిన రివిటింగ్ కదిలిపోవడంతో సంఘటన చోటుచేసుకుందని అధికారులు భావిస్తున్నారు. నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. మల్లంపల్లి పాత బ్రిడ్జి కుంగుబాటుకు కారణం కొత్త బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అలసత్వంతో ఘటన దారిమళ్లింపుతో వాహనదారుల ఇబ్బందులుబస్సులు దారిమళ్లింపు హన్మకొండ: హనుమకొండ–ములుగు రూట్ మల్లంపల్లి వద్ద బ్రిడ్జి కూలడంతో ఆర్టీసీ బస్సులను దారిమళ్లిస్తున్నారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ములుగు, ఏటూరునాగారం రూట్లో దారి మళ్లించి బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మల్లంపల్లి, శ్రీనగర్, పందికుంట ద్వారా ములుగుకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో వెళ్తాయి. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎలక్ట్రిక్ బస్సులు హనుమకొండ, పరకాల, రేగొండ, సుల్తాన్పూర్, అబ్బాపూర్, గోరికొత్తపల్లి మీదుగా జాకారం ద్వారా ములుగు, ఏటూరు నాగారం నడుస్తున్నాయి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రూట్లో వెళ్తాయి. మల్లంపల్లి వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఈ రూట్లలో బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు సహకరించాలితాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలి. వాహన రాకపోకలకు డైవర్షన్ మార్గాలను అనుసరించాలి. ఆర్టీసీ ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ మార్గంలో భారీ వాహనాలను అనుమతించడం లేదు గమనించాలి. –ములుగు ఎస్పీ శబరీష్ -
కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచారం?
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. మండలంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో దుక్కిటెద్దును చంపి తిన్నట్లు ఆలస్యంగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పుల్సం పెద్ద సాంబయ్యకు చెందిన దుక్కిటెద్దు వారం రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. ఎద్దు కోసం పరిసర గ్రామాల్లో, అడవిలో వెతుకుతుండగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఎద్దు కళేబరం కనిపించింది. కళేబరంలో కొంత భాగం కొంత దూరంలో కనిపించడంతో అనుమానం వచ్చిన రైతు పెద్దసాంబయ్య అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఎఫ్ఆర్వో వజ్రహత్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పులి అడుగులు కనిపించడంతో ఎద్దును పులి వేటాడినట్లు నిర్ధారించారు. రాంపూర్, సరసనపల్లి, పూనుగొండ్ల, కర్నెగండి, కోనాపురం గ్రామాల ప్రజలు పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని సూచనలు చేశారు. గత సంవత్సరం కోనాపూర్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లో అధికారులు పులి పాద ముద్రలు గుర్తించారు. ఆ పులి పూనుగొండ్ల మీదుగా కిన్నెరసాని అటవీ ప్రాంతానికి వెళ్లిపోయినట్లు పాద ముద్రల ఆధారంగా అంచనాకు వచ్చారు. అయితే అది వెళ్లిందా లేక ఈ అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాంపూర్ అడవుల్లో దుక్కిటెద్దును చంపినట్టు నిర్ధారణ -
‘భూ భారతి’ని వేగవంతం చేయాలి
● అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్కురవి: భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చి రైతుల సమస్యలను విని పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లను సత్వరమే అందించాలన్నారు. కార్యక్రమంలో డీటీ గణేశ్, ఆర్ఐ రవికుమార్ పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలికల వసతి గృహంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతిబసు, కొలిపాక వీరేందర్, జశ్వంత్, యాకన్న, తరుణ్, విగ్నేష్ పాల్గొన్నారు. -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
● ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గంగారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దని, రైతులకు అవసరమైన ఎరువుల నిల్వలు ఉన్నాయని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల చదువు సామర్థ్యాలను పరిశీ లించారు. డిజిటల్ విధానంలో విద్యాబోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మె నూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశా ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పా రిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు చేపించాలన్నారు. ప్రత్యేకాధికారులు వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. కాగా, గంగారం గ్రామానికి చెందిన 350మంది రైతుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇన్చార్జ్ కలెక్టర్ను మాజీ ఎంపీటీసీ బూర్క వెంకటయ్య కోరారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అజ్మీరా శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలి●మహబూబాబాద్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మానుకోట మున్సిపాలిటీ పరిధి లో పలు వార్డులు, కూరగాయాల మార్కెట్, జంక్షన్లలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు కృషి చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు. పెండింగ్ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. కమిషనర్ రాజేశ్వర్, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీకి రాఖీలు కట్టిన విద్యార్థినులు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్కు విద్యార్థినులు శుక్రవారం రాఖీలు కట్టారు. ఎస్ ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మన్నూరు నిక్షిప్త, జిల్లా నాయకురాళ్లు శృతి, జాస్మిన్, నాయకులు జ్యోతిబసు, రాకేశ్, మహేశ్, వినోద్ ఉన్నారు. చట్టబద్ధతతోనే పిల్లలకు హక్కులుమహబూబాబాద్ : చట్టబద్ధతతోనే పిల్ల లకు హక్కులు వస్తాయని ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల రక్షాభవన్లో పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న వారు పిల్లలను ప్రేమ, వాత్సల్యంతో పెంచాలన్నారు. పిల్లలు లేని దంపతులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రందించాలన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న, కౌన్సిలర్ రమేశ్, కమిటీ సభ్యుడు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అప్రెంటిస్షిప్ మేళామహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 11గంటలకు జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. బాబు శుక్రవారం తెలిపారు. అర్హులు ఆన్లైన్లో మహబూబాబాద్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత ధ్రువపత్రాలు ఐటీఐ కళాశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రం ఇల్లెందు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు. కేంద్ర బృందం సందర్శనపెద్దవంగర: మండలంలోని వడ్డెకొత్తపల్లి పల్లె దవాఖానను ఎన్హెచ్ఎస్ఆర్సీ బృందం శుక్రవారం సందర్శించింది. దేశ వ్యాప్తంగా జాతీయ గ్రేడింగ్ పరిశీలనకు దవాఖాన ఎంపిక కాగా.. అందుతున్న 12 రకాల వైద్య సేవలపై కేంద్ర బృంద సభ్యులు రమణీ, గంగాధరన్ సమీక్షించారు. గర్భిణులు, బాలింతల సంరక్షణ, కౌమర బాలికలకు అందించే సేవలు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నివారణ, ప్రాథమిక వైద్యం, కుటుంబ నియంత్రణ, శిశు సంరక్షణ వంటి సేవలు సంతృప్తి కరంగా ఉన్నట్లు పరిశీనలలో తేలింది. మరో ఐదు రకాల సేవలు పాక్షికంగా అందిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లభిస్తున్న ప్రయోజనాలు, మాతా–శిశు మరణాల నియంత్రణ, చర్యలు వంటి అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు మాట్లాడుతూ.. రోగులకు అందుతున్న సేవలు, గుర్తించిన లోపాలు, మెరుగైన వైద్య సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులకు అందిస్తామని వెల్లడించారు. -
ఆ పార్టీలను వెలివేద్దాం
● కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వైఖరిని ప్రజల్లో ఎండగడుతాం ● 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే ● ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు హన్మకొండ: బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వైఖరిని ప్రజల్లో ఎండగడుతా మని, ఆ మూడు పార్టీలను బీసీలు వెలివేయాలని ఎమ్మెల్సీ, బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, తాను నాలుగు నెలల క్రితమే చెప్పానన్నారు. ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పి, ఇప్పుడు తాము రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా అడ్డుకున్నారని సీఎం రేవంత్రెడ్డి చెప్ప డం విడ్డూరమన్నారు. తమ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి చెప్పకనే చెప్తున్నారని విమర్శించారు. అగ్రనేత రాహుల్గాంధీ చెప్పుతున్నట్లు జనాభా ఎంతో అంతే అవకాశాలు కల్పించాలన్న దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీసీలపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, చట్టసభల్లోని బీసీ జేఏసీ పోటీ చేస్తుందన్నారు. 2028లో ఏర్పడేది బీసీ ప్రభుత్వమేనన్నారు. సమావేశంలో ఎం.జానయ్య, రజనీకుమార్, సూదగాని హరిశంకర్, నవీన్, నర్సింహగౌడ్, ప్రవీణ్, రవి పటేల్ పాల్గొన్నారు. అనారోగ్యంతో ఖోఖో మాజీ క్రీడాకారుడు సారంగపాణి మృతిఖిలా వరంగల్: ఖిలావరంగల్ మధ్యకోటకు చెందిన అంతర్జాతీయ ఖోఖో మాజీ క్రీడాకారుడు నాగవెల్లి సారంగపాణి(48) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లానుంచి అంతర్జాతీయస్థాయి వరకు ఎదిగిన సారంగపాణి.. పలువురు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేతిలో ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది అంతర్జాతీయస్థాయికి ఎదిగారు. ేఆయనకు భార్య, ఒక దత్తపుత్రిక ఉంది. విషయం తెలిసి తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్, తెలంగాణ ఖోఖో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి.. సారంగపాణి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఆయన వెంట ఖోఖో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్, కై లాస్ యాదవ్, తదితర క్రీడాకారులు ఉన్నారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలో రక్షాబంధన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శుక్రవారం డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, పలు సెంటర్లలో టౌన్ పోలీ సులు, జిల్లా బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీ లు నిర్వహించారు. టౌన్ ఇన్చార్జ్ సీఐ సర్వయ్య, ఎస్సైలు ప్రశాంత్, శివ, అశోక్, మౌనిక, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంజయ్య, అశోక్, డాగ్ హ్యాండ్లర్ యాకయ్య ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు కేసముద్రం: అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ పరిధిలోనిగిర్నితండాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 40 ద్విచక్రవాహనాలు, 2 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 లీటర్ల గుడుంబా, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సైలు మురళీధర్రాజు, నరేష్ ఉన్నారు. సైబర్ మోసం● రూ.లక్ష పోగొట్టుకున్న డోర్నకల్ వాసి డోర్నకల్: సైబర్ మోసగాళ్ల వలలో పడి డోర్నకల్కు చెందిన ఓ వ్యక్తి రూ.లక్ష మోసపోయాడు. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్ర పోలీస్శాఖలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న డోర్నకల్ మండలం చాప్లాతండాకు చెందిన లక్ష్మణ్నాయక్ పేరిట ఫేస్బుక్లో ఫర్నీచర్ అమ్ముతున్నట్లు ఈనెల 1న ఐడీ కనిపించడంతో డోర్నకల్కు చెందిన పాట్ని ఆర్యన్జైన్ అదే రోజు రూ.70వేలను సంబంధిత ఐడీ అకౌంట్కు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మరికొంత డబ్బు పంపాలని సమాచారం రావడంతో మరోసారి రూ.30 వేలు పంపాడు. కొద్దిరోజుల వరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆర్యన్జైన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు వెంటనే నిందితుడి అకౌంట్ను గుర్తించి అందులోని రూ.28 వేలను హోల్డ్లో ఉంచారు. కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతుంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతి సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. న్యూస్రీల్ -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో గురువారం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలిన్, కిడ్స్) పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్త్రోలో బంగారు పథకం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జనగామలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బైరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, కిరణ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సుగుణాకర్, హనుమంతరావు, గజ్జెల్లి రాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. 33 జిల్లాలు.. 6వందల మంది క్రీడాకారులు జనగామ జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లె టిక్స్ పోటీలకు 33 జిల్లాల నుంచి 6 వందల మంది క్రీడాకారులు హాజరయ్యా రు. జావెలిన్ క్రీడతోపాట అండర్–8,10,12 విభాగాల్లో బాల, బాలికలకు పరుగు పందెం, అప్రోచ్ లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించారు. అండర్–8 విభాగంలో బాల, బాలికలకు 1.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 2.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–12 విభాగంలో బాల, బాలికలకు 3.60 మీటర్లు ఫైవ్ మీటర్స్ అప్రోచ్డ్ లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో బాల, బాలికలకు కిడ్స్ జావెలిన్త్రో, అండర్–16,18, 20 విభాగాల్లో యువతీ, యువకులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించారు. చదువుతోపాటు ఆటల్లో రాణించాలి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అట్టహాసంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం 33 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు -
వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి
మరిపెడ రూరల్: ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిచెల్మ మల్సూర్, మహేశ్వరి దంపతులకు కూతురు మణిదీప (3)ఉంది. చిన్నారికి వరుసకు సోదరుడైన వ్యక్తికి గాయమైతే ఇటీవల మందులు తెచ్చి ఇంట్లో ఉంచారు. కాగా, బుధవారం సాయంత్రం మనిదీప ఇంట్లో ఆడుకుంటూ మందులు, ఆయింట్మెంట్ మిగింది. దీంతో బాలికకు వాంతులు అయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు మరిపెడలోని రవి క్లీనిక్ ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ రవిబాబు పాపను పరీక్షించి చికిత్స అందించాడు. బాగానే ఉందని రాత్రి 8 గంటలకు ఇంటికి పంపించాడు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో చిన్నారికి వాంతులు ఎక్కువ కావడంతో సదరు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఇంజక్షన్ వేసి అర్ధరాత్రి ఇంటికి పంపాడు, అయితే తెల్లవారుజామున చిన్నారి ఉలుకుపలుకు లేకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు చిన్నారిని తీసుకొని ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎంపీ రవిబాబు నిర్లక్ష్య వైద్యం వల్లే పాప మృతి చెందిందని ఆగ్రహంతో ఉల్లెపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి రవి క్లీనిక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్ఎంపీపై దాడికి యత్నించారు. దీంతో గంటపాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసులు ఆర్ఎంపీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ ఖమ్మం–వరంగల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఇదిలా ఉండగా తమకు బాబు పుట్టిన 18 ఏళ్ల తర్వాత మణిదీప పుట్టిందని తల్లి దండ్రులు బోరున విలపించారు.మహిళా ఉద్యోగులకు ఒక పూట సెలవుకేయూ క్యాంపస్: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కేయూ బోధన, బోధనేతర మహిళా ఉద్యోగులకు శుక్రవారం ఉదయం ఒక పూట సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సర్క్యులర్ జారీచేశారు. మహిళా ఉద్యోగుల అభ్యర్థన మేరకు సెలవు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరో పూట మధ్యాహ్నం యథావిధి గా విధులకు హాజ రుకావాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన గుండల కృష్ణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో పనికి వెళ్లి తిరిగి రాత్రి బైక్పై ఇంటికి బయలుదేరాడు. ముస్కులపల్లి బొడ్రాయి సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక ఉన్న బైక్.. లారీని ఢీకొంది. దీంతో బైక్పై నుంచి రోడ్డు మీద పడిన కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి గుండల అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాగా, ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్డీసీపీ అంకిత్ కుమార్ పరిశీలించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. జ్వరంతో మహిళ మృతి వెంకటాపురం(కె): జ్వరంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పర్శిక అరుణ(31) జ్వరంతో బాధపడుతూ మూడురోజుల క్రితం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయినా తగ్గకపోవడంతో ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించి చికిత్స చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు జనగామ రూరల్: బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మో సం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. గురువారం జనగామలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని స్ప ష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డి మాండ్ చేశారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని, అక్రమాలపై విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అర్థం అవుతోందన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీజేపీని ఆదరించాలని కోరారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర నాయకులు మూర్తినేని ధర్మారావు, బూర నర్సయ్య గౌడ్, గుండె విజయరామారావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, లేగ రామ్మోహన్రెడ్డి , ఉడుగుల రమేశ్, కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదనపు కట్నం వేధింపులు..
● భర్తకు ఏడాది జైలు వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేలు జరిమానా విధిస్తూ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిసోని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దొనికల అనూషకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గుడ్డేటి దిలీప్కుమార్తో 2020, నవంబర్ 11న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.40 లక్షలు, 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం కొద్ది రోజులు బాగానే చూసుకున్న దిలీప్కుమార్ కుటుంబీకులు తక్కువ కట్నం తెచ్చావంటూ అనూషను వేధించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా దిలీప్కుమార్.. భార్య అనుషాతో కలిసి 2021, జూలై 27న అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రూ. కోటి అదనపు కట్నం తీసుకురావాలని, లేనిపక్షంలో విడాకులు ఇస్తానని బెదించాడు. దీంతో అనూష.. దిలీప్కుమార్పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మందలించి వదిలేశారు. అనంతరం 2022, జూలై 30న అనూష, దిలీప్కుమార్ ఇండియాకు తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన దిలీప్కుమార్ తల్లిదండ్రులు అనూషను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో అనూష తల్లిదండ్రులు తాత్కాలికంగా ఉంటున్న ఘట్కేసర్ వద్ద ఆమెను వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అనూష ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రుల ఎదుటే ‘నీకు విడాకులు ఇస్తా’ అని చెప్పి దిలీప్కుమార్తోపాటు కుటుంబీకులు స్వగ్రామం వచ్చారు. ఈ విషయంపై అనూష తల్లిదండ్రులు పంచాయితీ నిర్వహించగా విడాకులు తీసుకుంటానని దిలీప్కుమార్ పెద్దల సమక్షంలో చెప్పాడు. దీంతో చేసిదేమీ లేక అనూష మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శాంతిసోని.. నేరస్తుడు దిలీప్కుమార్కు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేల విధిస్తూ తీర్పు వెలువరించారు. -
చావులోనూ వీడని బంధం..
దుగ్గొండి : 60 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అన్యోన్య దంపతులుగా జీవనం గడిపారు. పిల్లలందరూ ఎవరికివారు బతుకుతున్నారు. కొంత కాలంగా వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి భర్త మనోవేదనకు గురవుతూ గురువారం కన్నుమూశాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోశాల యాకయ్య, సారమ్మ (75) దంపతులు. సారమ్మ పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి యాకయ్య (80) మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సారమ్మ దశదిన కర్మ అనంతరం మరుసటి రోజు యాకయ్య తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరణంలోనూ యాకయ్య, సారమ్మ దంపతుల బంధం వీడలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రాజేందర్, కృష్ణమూర్తి ఉన్నారు. పది రోజుల వ్యవధిలో దంపతులు మృతి కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు -
రీజన్స్ లేకుండా రిజెక్టు చేయొద్దు..
జనగామ: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే కారణం లేకుండా రిజెక్ట్ చేయొద్దని.. ఒక వేళ చేసినా కారణం చెప్పాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహిసినపర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. డీసీపీ రాజమహేంద్రనాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి రాష్ట్ర సమాచార కమిషన్కు ఘనస్వాగతం పలికింది. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ప్రజల కోరిన మేరకు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆర్టీఐకి ఎప్పుడూ భయపడొద్దన్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం కోరిన 30 రోజుల వరకు సమయం ఉంటుందని, కారణం చూపకుండా గడువు దాటితే సంబంధిత అధికారి నుంచి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే అప్పీల్కు వెళ్లొచ్చన్నారు. గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే స్టేట్ కమిషన్కు ఫిర్యాదు వెళ్తుందని, మొదటి అప్పీల్ జిల్లా అప్పీలేట్, రెండో అప్పీల్ స్టేట్ కమిషన్ వద్దకు వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుడు నష్టపోతే ఆ పరిహారాన్ని పీఐఓలు భరించాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో సహచట్టం ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతో తీసుకొచ్చారో, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని చెప్పారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కుచట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మూడు, ఆరు నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి సలహాలు, సూచనలు అందించారు. అధికారులు ఆర్టీఐకి భయపడొద్దు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి -
ఆడిందే ఆట!
పూర్తిస్థాయి అధికారులతోనే.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 చిట్ఫండ్ల పర్యవేక్షణకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదు. ప్రజలకు బాధలు తీరేలా లేవు. పదోన్నతుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖలోని ఉన్నతాధికారుల పాలన ఇన్చార్జ్ల చేతుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే శాఖలో ఇన్చార్జ్ పాలనతో నిర్వహణ గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 బ్రాంచ్లతో కూడిన చిట్ఫండ్ కార్యాలయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక కింది స్థాయి అధికారుల విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఆడిందే ఆటగా కొలువులు సాగిస్తున్నారు. ప్రజల బారులు.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు చిట్స్, ఆడిటింగ్, కోర్టు కేసులు, ప్రొహిబిటెడ్, ల్యాండ్ కేసులు, డాక్యుమెంట్లలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి నిత్యం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు బారులు దీరుతుంటారు. ఇక్కడ పని చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ను జూలైలో హైదరాబాద్తో పాటు మహబూబ్నగర్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా బదిలీ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్కుమార్ను ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ నియమించారు. ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చిన యామిని రెండు నెలల కాలవ్యవధిలో విధులు చేపట్టి నాటినుంచి నేటి వరకు లాంగ్ లీవ్లో వెళ్లిపోవడంతో ఇన్చార్జ్ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పాలనే కొనసాగుతోంది. దీంతో చిట్స్లో పేరుకుపోయిన చిట్ఫండ్స్ లావాదేవీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్చార్జ్ల చేతుల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం పూర్తి స్థాయిలో అధికారులను నియమిస్తే సమస్యలు పరిష్కారం -
చేతిలోనే సమస్త సమాచారం..
ఖిలా వరంగల్: భారతీయ రైల్వే ప్రయాణికులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగా ట్రైన్లో ప్రయాణించాల్సిన వ్యక్తి ఇక నుంచి రైల్వే సేవలకు అటు ఇటు వెళ్లాల్సిన పనిలేదు. కావాల్సిన సమాచారమంతా కూర్చున్న చోటు నుంచే తెలుసుకునేలా అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో యూటీఎస్, రైల్ వన్ యాప్ల ద్వారా ప్రయాణికులకు క్షణాల్లో మెరుగైన సేవలు అందుతాయి. దీనికి కావాల్సింది చేతితో స్మోర్ట్ ఫోన్ మాత్రమే. ఈ క్రమంలో ఈ రైలు యాప్లు ఎలాంటి సేవలు అందిస్తాయి.. ఎలా పొందాలనే అంశాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం టికెట్కు ఇబ్బంది లేదు.. యూటీఎస్, రైల్ వన్ యాప్ల నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.అంతేకాదు అత్యవసరంగా అన్ రిజర్వుడ్ టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందొచ్చు. అలాగే, యాప్ల ద్వారా సాధారణ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, నెలవారీ టికెట్, క్యాన్సలేషన్, టికెట్ హిస్టరీ, బుకింగ్ టికెట్ సమాచారం, ఆర్.వాలెట్, టికెట్ ప్రొఫైల్, టికెట్ ట్రాన్జాక్షన్, రైల్ లైవ్ లోకేషన్ మొత్తం యాప్ల ద్వారా సులభంగా తెలుసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రైళ్ల కోసం.. ఈ యాప్ల సేవలు అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్ వన్, యూటీఎస్ యాప్ల ద్వారా వెళ్లాల్సిన ప్రాంతం, ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రైన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్పైకి రైలు వస్తుంది, కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది.. ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రైన్ ద్వారా తెలుసుకోవచ్చు. రిజర్వేషన్ స్థితి.. ఈయాప్ల్లో టికెట్ రిజర్వేషన్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ స్థితి, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలు, రిజర్వేషన్ రద్దు, తదితర అంశాలనూ తెలుసుకోవచ్చు. సీటు వద్దకే ఆహారం.. రైలు ఎక్కగానే ప్రయాణికులకు ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ముందే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే రైలులో సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులు.. ఏమైనా సూచనలు ఇవ్వాలనుకున్నా.. రైళ్లలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదులు చేయడానికి రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కాగా, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 8వేలకు పైగా మంది ప్రయాణిస్తుంటారు. ఫలితంగా ప్రతీ రోజు రైల్వేశాఖకు రూ.6లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కూర్చున్న చోటే క్షణాల్లో వివరాలు అందుబాటులో రైల్వన్, యూటీఎస్ యాప్లు రైల్వే సమాచారం కోసం ఇక నుంచి ఎటు వెళ్లాల్సిన అవసరం లేదుడౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి.. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజస్ట్రేషన్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది. -
విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
నెల్లికుదురు: నిత్యం పరిసరాలను గమనిస్తూ ఒక్కసారిగా వచ్చే మెరుపు వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదం లాంటి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కమాండర్ భూపేంద్ర కుమార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు, మదనతుర్తి, మునిగలవీడు, రావిరాల, రాజులకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి గురువారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విపత్తులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బృందం వివరించింది. కాగా, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు రావిరాలలో కొట్టుకుపోయిన రోడ్డును విపత్తు బృందం, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు బృంద సభ్యులు మురళీరాథోడ్, మోహన్రావు, మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందానరేశ్, ఎంపీఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ భూపేంద్ర కుమార్ -
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
మహబూబాబాద్ అర్బన్: గ్రంథాలయాలు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ రీడింగ్ గదిని ప్రిన్సి పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు విద్యార్థులు న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా ప్రపచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. గ్రంథాలయ అధ్యాపకుడు రాజశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్ కుమార్, మసూద్ అహ్మ ద్, సాంబశివరావు, శ్రీనివాస్, హతీరాం ఉన్నారు. -
రికవరీ చేయట్లే!
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంత పేదలకు పని కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. అయితే పనుల్లో జరిగిన అవకతవలపై సోషల్ ఆడిట్ నిర్వహించిన అధికారులు దుర్వినియోగమైన నిధుల రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానరు. కాగా అక్రమార్కులకు పలువురు అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే రికవరీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నారు. ఏడాదిలో రూ.65లక్షల అవకతవకలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో చేపట్టిన పనుల్లో రూ. 65లక్షల అవకతవకలు జరిగినట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా 1,41,774 కుటుంబాలు జాబ్కార్డు ద్వారా 2,51,040 మంది కూలీలు పనులు చేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 60శాతం కూలీలు, 40శాతం మెటీరియల్ నిష్పత్తిన రూ. 88.14కోట్ల విలువచేసే కూలీ పనులు, రూ. 39.82కోట్లు విలువచేసే మెటీరియల్ పనులు చేశారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ప్రతీ మండలంలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనుల తీరు, నిధుల వినియోగంపై సోషల్ ఆడిట్ టీమ్ పర్యటించింది. గ్రామ సభలు పెట్టి నివేదికను చదివారు. అయితే ఇందులో ఫీల్ట్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఏపీఓ, ఎంపీడీఓ వరకు అక్రమాలకు సోషల్ ఆడిట్లో తేలింది. అక్రమార్కులకు అండగా.. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై నిజానిజాలు తేల్చాల్సిన కొందరు అధికారులు సదరు ఉద్యోగులు ఎలాంటి తప్పులు చేయలేదని నిర్ధారించారు. ఇందుకోసం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్న విషయంపై జిల్లాలో చర్చగా మారింది. ఈ విషయంపై ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సదరు అధికారిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం. అదే విధంగా మరికొన్న గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు చట్టసభలకు ఎన్నికై న నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. వెనకడుగు.. సోషల్ ఆడిట్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అవకతవకలకు పాల్పడిన బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయించాలి. కానీ జిల్లా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన సోషల్ అడిట్ ద్వారా రూ. 65,63,732 రికవరీకి రాశారు. ఇందులో ఇప్పటి వరకు రూ.3,98,959 మాత్రమే రికవరీ చేయగా.. రూ.61,55,773 రికవరీ చేయించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా కొత్తగూడ మండలంలో రూ.6,32,000 ఉండగా.. రూ.65,200 మాత్రమే రికవరీ చేశారు. అదే విధంగా నర్సింహులపేట మండలంలో రూ.6,15,378కి గాను రూ.15,100, మహబూబాబాద్ మండలంలో రూ. 6,10,542గానూ రూ.11,666 మాత్రమే రికవరీ చేశారు. రికవరీ వేగవంతం చేస్తాం ఉపాధి హమీ పథకంలో పనుల నిర్వహణ, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ఉంటుంది. వారు నిర్ధారించిన అవకతవకల డబ్బుల రికవరీలో పలు కారణాలతో జాప్యం జరిగింది. తిరిగి వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –మధుసూదన్ రాజు, డీఆర్డీఓఉద్యోగుల వారీగా చేయాల్సిన రికవరీ హోదా పెండింగ్ రికవరీ ఫీల్డ్ అసిస్టెంట్ రూ. 10,79,245 పంచాయతీ సెక్రటరీ రూ. 11,19,245 టెక్నికల్ అసిస్టెంట్ రూ. 11,24,245 ఇంజనీరింగ్ విభాగం రూ. 10,74,245 కంప్యూటర్ ఆపరేటర్ రూ. 8,79,396 ఏపీఓ రూ. 4,39,698 ఎంపీఓ రూ. 4,39,698 మొత్తం రూ.61,55,772 అక్రమార్కులకు అండగా పలువురు అధికారుల చర్యలు తీసుకోకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం -
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. -
తీజ్ను రాష్ట్ర పండుగగా గుర్తించాలి
హన్మకొండ: తీజ్ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ అని అన్నారు. 9 రోజులపాటు ఆటపాటలతో అలసట నుంచి విముక్తి కావాలని, అందరూ బాగుండాలని జరుపుకుంటారన్నారు. పెళ్లికాని యువతలు ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గోర్ బంజార తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బంజారాలు అందరు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తీజ్ ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లోక్నాయక్, బాదావత్ బాలాజీనాయక్, ధరావత్ కిషన్ నాయక్, భూక్యా రాజునాయక్, డాక్టర్ చందునాయక్, మాలోత్ రమేశ్, భిక్షపతినాయక్, కిశోర్ నాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ -
ఆకస్మిక తనిఖీ
గంగారం: మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. భూభారతి సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం- డీడబ్ల్యూఓ శిరీషకురవి: తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామంలోని రైతు వేదికలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం అన్నప్రాసన, సీమంతాలు, అక్షరభ్యాసం, వివిధ రకాల ఆహారపదార్థాల ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహా రం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సూపర్వైజర్ సుగుణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.రాకపోకలకు అంతరాయండోర్నకల్: బుగ్గవాగు పొంగడంతో గురువారం డోర్నకల్–లింగాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కామెపల్లి మండల పరిధి లోని బుగ్గవాగు పొంగి రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో డోర్నకల్–కొత్తలింగాల మార్గంలో రాకపోకలు నిలిచాయి.వైద్యులు అందుబాటులో ఉండాలిగూడూరు: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీసీహెచ్ఎస్ చింత రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. సిబ్బంది సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరన్ననాయక్ వైద్యులు, నర్సు, స్టాఫ్ నర్సుల కొరతపై వివరించారు. ముఖ్యంగా స్టాఫ్ నర్సు, నర్సులు అవసరమని, తొందరగా కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.ఆయిల్ పామ్ సాగుతో ఆదాయంమహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ గెలల కత్తిరింపుపై మహబూబా బాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి ఆయిల్ పామ్ మొక్కల గెలల కత్తిరింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళ్లెం జనార్దన్ రెడ్డి, కళ్లెం మధుకర్ రెడ్డి, ఏఈఓ రంజిత్, ఈజీ ఫాం టూల్స్ కంపెనీ ప్రతినిధులు రమేశ్, రాజు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి కరుణాకర్, శ్రీకాంత్, కుమార్ డ్రిప్ కంపెనీ డీసీఓ అశోక్, ఎఫ్సీఓ నవీన్, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి క్రాంతికుమార్, కంబాలపల్లి ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం..
నెహ్రూసెంటర్: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలు సంజీవనిగా మారుతున్నాయి. ఫోన్ రాగానే అంబులెన్స్ పైలెట్లు, ఈఎంటీలు వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారికి సకాలంలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. కాగా, జిల్లాలో 21అంబులెన్స్లు, ఏడు 102 వాహనాలు, ఒక పార్థివ వాహనం, 3 పశుసంచార వాహనాలు, అత్యాధునిక నియోనెటల్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి రాగా.. సేవలు అందుతున్నాయి. కాగా, మండలానికి ఒకటి చొప్పున అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.గర్భిణులు, బాలింతలకు..ప్రమాదాలకు గురైన వారితో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి, గర్భిణులు, బాలింతలకు సైతం వైద్య సేవలు అందించేలా తోడ్పాటునందిస్తున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు సమారు 4వేల మందికి పైగా క్షతగాత్రులు, వైద్య సహాయం అవసరమైనవారు, గర్భిణులు, బాలింతలకు అంబులెన్స్ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, పురిటి నొప్పులతో గర్భిణులు అంబులెన్స్లోనే ప్రసవం జరిగిన సంఘటనలు ఉన్నాయి.సురక్షితంగా..రోడ్డు ప్రమాదాల బాధితులను అంబులెన్స్లో వెంటనే ఆస్పత్రులకు తరలించడం, గర్భిణులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం, బాలింతలను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా తరలిస్తున్నారు. గత ఏడాదిగా 108 అంబులెన్స్ల ద్వారా 17,339మంది, 102 వాహనం ద్వారా 16,704 మందికి సేవలు అందించారు. హలో అంటే.. మేమున్నామంటూ ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ వైద్య సేవలు సకాలంలో అందించడంతో ప్రాణాలు నిలబడేలా చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్ను దృష్టిలో పెట్టుకుని సత్వర చర్యలు చేపడుతున్నారు.రెండు నెలల్లో అంబులెన్స్ల ద్వారా తరలించిన బాధితులునెల క్షతగాత్రులు గర్భిణులు, బాలింతలుమే 19 44 14 69జూన్ 20 27 21 37 -
విధుల్లో చిత్తశుద్ధితో పనిచేయాలి
కేసముద్రం: అధికారులు విధుల్లో చిత్తశుద్ధితో పని చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల, ఎస్సీ బాలుర హాస్టల్, పీహెచ్సీ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ పరిధిలోని సబ్సెంటర్ల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల పరిసరాలను పరిశీలించి, మెనూ ప్రకారంగా భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్లో సౌకర్యాలను పరిశీలించారు. ఇదే హాస్టల్ భవనంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ హరిప్రసాద్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శాలిని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో కక్షిదారులు, న్యాయవాదులతో న్యాయ చైతన్య సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఖర్చులేని సులభమైన పరిష్కార ప్రక్రియ లోక్ అదాలత్ అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కోర్టు వరకు రాని వివాదాలను న్యాయ సేవాధికార సంస్థ ప్రీ లిటిగేషన్ విధానంలో పరిష్కరిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆంగ్ల భాషలో వెలువరించిన తీర్పులను కృత్రిమ మేధ పద్ధతి ద్వారా ప్రాంతీయ భాషలోనికి అనువదించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టి.సునీత తదితరులు పాల్గొన్నారు. -
మునిగలవీడులో కేంద్ర బృందం పర్యటన
నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం పర్యటించి, ఈజీఎస్ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించింది. ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య సేవలను బృందం సీనియర్ పరిశీలన అధికారి దామోదర్, పరిశీలన అధికారి అశ్విన్ గోపాల్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఈజీఎస్ జాబ్ కార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, మాజీ సర్పంచ్ నల్లాని నవీన్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎప్పుడు ఫోన్ వచ్చినా..
క్షతగాత్రులు, ఇతర వైద్య సహాయం అవసరమున్న వారు ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులోనే ఉంటున్నాం. వెంటనే స్పందించి ఆస్పత్రులకు తరలించి సకాలంలో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. – జక్కుల వీరన్న, పైలెట్ ప్రాథమిక వైద్య సేవలు అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్కు సమాచారం రాగానే స్పందిస్తున్నాం. అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స అందిస్తూ సైలెన్ బాటిల్ పెట్టడం, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు అందజేస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది. – బంగారి, టెక్నీషియన్ అత్యవసర సమయాల్లో... ప్రభుత్వం, వైద్య అధికారులు సూచన మేరకు అంబులెన్స్ సేవలను విస్తృతంగా అందజేస్తున్నాం. అత్యవసర సమయాల్లో ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వైద్య సేవల కోసం సమాచారం ఇస్తే వెంటనే అంబులెన్స్ సంఘటన స్థలికి చేరుకుంటుంది. – బత్తిని మహేష్, 108 జిల్లా మేనేజర్ -
పట్టువదలని కార్మికులు ..
జనగామ: పట్టు చీర.. మహిళలు అమితంగా ఇష్టపడే వస్త్రం. చూడడానికి హుందాగా, అందంగా కని పించే చీర. వివాహాది, ఇతర శుభకార్యాల్లో కట్టుకోవడానికి మగువలు అత్యంత ఇష్టపడే చీర. అందుకే వస్త్ర ప్రపంచంలో పట్టుచీర మకుటం లేని మహారాణి. అయితే ఆ చీర తయారీ వెనుక నేతకార్మికుల కష్టం వెలకట్ట లేనిది. పట్టుదారం నుంచి రంగులు అద్దే వరకు చేతి వేళ్లనే ఆడిస్తూ అందమైన చీరను తయారు చేస్తున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టు చీరలకు స్వర్గధామమైన పోచంపల్లి తర్వాత జనగామకు ప్రత్యేక స్థానం ఉంది. నేతకార్మికులు రోజుకు వెయ్యి పట్టు చీరలు తయారు చేస్తూ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే 30 నుంచి 45 రోజుల్లో ఎనిమిది చీరలు నేసే నేత కార్మికులకు పావలా లాభం వస్తే, రిటైల్ మార్కెట్లో వ్యాపారులు వేల రూపాయలు అర్జిస్తున్నారు. ఫలితంగా నేత కార్మికులు మాత్రం ఇంకా పూటగడవని స్థితిలోనే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వాలు సాయం చేసినా, చేయకున్నా దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) జాతీయ చేనేత దినో త్సవం. ఈ సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల వివరాలు, సొసైటీలు, మరమగ్గాలు, ప్రభుత్వం సా యం, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్లో బచ్చన్నపేటలోనే మొదటి మగ్గం.. ఉమ్మడి వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో 1970–71 సంవత్సరంలో మొట్టమొదటి మగ్గం ప్రారంభించారు. నేత కార్మికులు రెండు నెలల పాటు మగ్గం నేస్తూ ఎనిమిది చీరల(వార్పు)ను తయారు చేసేవారు. ఒక్కో చీరకు రూ.20 లాభం తీసుకుని రూ.120కి పోచంపల్లికి చెందిన హోల్సేల్ వ్యాపారు లకు అమ్ముకునే వారు. అప్పటి వరకు వివిధ రంగాల్లో పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు మగ్గం బాటపట్టారు. బచ్చన్నపేటలో మొదలైన పట్టుచీర తయారీ మండలంలోని అనేక గ్రామాలకు విస్తరించింది. ఏడాది తర్వాత జనగామలోని వీవర్స్ కాలనీ, లింగాలఘణపురం మండలం వడిచర్ల, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో మగ్గాలతో పట్టు చీరలు తయారు చేయడం మొదలు పెట్టారు. జనగామ జిల్లాలో 11 సొసైటీలు.. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం జనగామ జిల్లాలో 11 సొసైటీలుండగా, 3వేల మంది నేత, అనుబంధ కార్మికులు, 17 వందల మగ్గాలు, 450 పవర్ లూమ్స్ ఉన్నాయి. జిల్లాలో నెలవారీగా 15 నుంచి 17 వందల వరకు సెమికతాన్, రాజ్కోట్, పాట్లిపళ్లు, రాజ్కోట్పేటి, బార్డర్ సాదా, బార్డర్డిజైన్, కాటన్ తదితర డిజైన్లకు సంబంధించి పట్టు చీరలు త యారు చేస్తున్నారు. రూ.5,500 నుంచి రూ.13వేల వరకు హోల్సేల్ మార్కెట్కు సరఫరా చేస్తున్నారు. రుణమాఫీకి నోచుకోని నేత కార్మికులు.. ప్రభుత్వం నేత కార్మికులకు రుణ సాయంతోపాటు నేతన్న పొదుపు, బీమా ద్వారా భరోసా కల్పిస్తోంది. జిల్లాలో రుణసాయం కోసం 679 మంది నేత కార్మికుల జాబితాతో జిల్లా కమిటీ అప్రూవల్ చేసి ప్రభుత్వానికి పంపించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల రుణమాఫీ హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. అలాగే, చేనేతబంధు పథకం అమలు కూడా అదే పరిస్థి నెలకొనడంతో కార్మికులకు ఎదురుచూస్తున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవందశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకుంటున్న నేత కార్మికులు పోచంపల్లి తర్వాత పట్టు చీరకు నిలయం జనగామ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి బచ్చన్నపేటలో మొదలైన ‘మగ్గం’ చప్పుళ్లుజనగామ జిల్లాలో నేత కార్మికుడి ఇంట్లో, షోరూంలలో పట్టు చీరల ధరలు నేత కార్మికుడి ఇంట్లో షోరూంలో.. సెమికతాన్ రూ.5,500 రూ.8,000 రాజ్కోట్ రూ.8,500 రూ.10,500 పాట్లిపళ్లు రూ.9,000 రూ.14,000 రాజ్కోట్పేటి రూ.9,000 రూ.16,000 బార్డర్ సాదా రూ.5,000 రూ.7,000 -
కుక్క అడ్డొచ్చి ఆటో బోల్తా..
న్యూశాయంపేట: వరంగల్ దూపకుంట రోడ్డులోని గిరిప్రసాద్ నగర్ వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో బాలికల మైనారిటీ గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీజీటీ ఉర్దూ టీచర్గా పనిచేస్తున్న అజ్మీరీబేగం(38) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దూపకుంట రోడ్డులోని మైనారిటీ బాలికుల గురుకులంలో పనిచేస్తున్న ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల సమయం పూర్తికాగానే ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో మహిళ కూడా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో గిరిప్రసాద్నగర్ వద్దకు రాగానే కుక్క ఆటోకు అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. కాగా, డ్రైవర్ పక్కన కూర్చున్న అజ్మీరీ బేగానికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్కు తీవ్ర, నలుగురు టీచర్లు, మరో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఎంజీఎం, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని మిల్స్కాలనీ పోలీసులు తెలిపారు. ● గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్ మృతి ● డ్రైవర్తోపాటు మరో ఐదుగురికి గాయాలు -
లారీ, కారు ఢీ
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట సమీప వైకుంఠధామం ఎదుట 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై బి. గిరిధర్రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఐరన్ షాపు యజమాని బూర అశోక్కుమార్గౌడ్ (55) కారులో మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు మండలం భూపతిపేట సమీపంలోని వైకుంఠధామం వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపున వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు సగభాగం నుజ్జునుజ్జయి అశోక్కుమార్ గౌడ్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. ఎస్సై గిరిధర్రెడ్డి రెండు గంటల పాటు శ్రమించి కారు సగభాగం వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. అక్కడికక్కడే ఒకరు దుర్మరణం భూపతిపేట సమీపంలో ఘటన -
ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఏటూరునాగారం: నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ ద్వారా మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నుంచి 357 మంది, ఇతర జిల్లాల నుంచి 21 మంది హాజరు కాగా 77 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేయగా వారికి పీఓ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులు తమకు సరైన ఉద్యోగం లేదని కాలాన్ని వృథా చేయొద్దన్నారు. అందుబాటులో ఉన్న ఉద్యోగం చేస్తూ లక్ష్యం వైపు పయనించాలన్నారు. ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, కిశోర్, ప్రభాకర్, శ్రీనివాస్, కొండల్రావు, భిక్షపతి, పాపారావు, సరస్వతి, ఏపీఎంలు, సీసీలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్● కిలో 300 గ్రాముల సరుకు స్వాధీనం● వివరాలు వెల్లడించిన సీఐ జానకిరామ్రెడ్డిపాలకుర్తి టౌన్: గంజాయి విక్రయిస్తున్న ము ఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్రెడ్డి తెలిపా రు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన వడ్లకొండ శబరి నాథ్, గోవిందా శ్రీనాథ్, సముద్రాల గ్రామానికి చెందిన గుండె నవీన్, పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన గుగ్గిళ్ల ప్రవీణ్, గుండమల్ల సంపత్, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన చిటూరి శ్యామ్, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన బండారి అఖిల్ ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి కొనుగోలు చేసి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి శివారు కూసిగుట్ట సమీపంలో గంజాయి ముఠా ఉందనే సమాచారం మేరకు ఎస్సై దూలం వపన్కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజీ 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ముంపుగ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ పర్యటన
మరిపెడ రూరల్: గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని సీతారాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో గురువారం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం సభ్యులు స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ముందు గతేడాది జరిగిన విపత్తు గురించి ఆయా గ్రామాల ప్రజలను అడిగా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వరదలు వచ్చిన సమయంలో ధైర్యం కోల్పోకుండా ఒకరికొకరు సాయంగా ఉండాలన్నారు. తాళ్ల సాయంతో వరద ఉధృతి నుంచి బయటకొచ్చే వీలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ప్రజలకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, ఎంపీఓ సోమ్లానాయక్, ఆర్ఐ శరత్చంద్ర, తదితరులు పాల్గొన్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన -
సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలి
హన్మకొండ: విద్యుత్ సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్ఏఓ, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మన్ల గద్దెలను, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ స్తంభాలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతీ వారం దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తూ పనులు పురోగతిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జీఎంలు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
రైల్వే సమస్యలు పరిష్కరించాలి
● కేంద్ర మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి కాజీపేట రూరల్ : న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్ను బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో బస్స్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణ, కాజీపేట అమృత్ భారత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం కాజీపేట బస్స్టేషన్ ఆవశ్యకతపై రైల్వే మంత్రికి వివరించి, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించారని, ప్రజారవాణా దృష్ట్యా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి ఆ అంశాలను పరిశీలించి నివేదికలు పంపించాలని అధికారులకు చెప్పారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆటోడ్రైవర్కు ఏడాది జైలు వరంగల్ లీగల్ : నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమమైన డ్రైవర్ మరుపట్ల తారయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ కోర్టు జడ్జి చింతాడ శ్రావణ స్వాతి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020, అక్టోబర్ 9న బీటెక్ విద్యార్థి బి.జశ్వంత్ బైక్పై హైదరాబాద్ నుంచి హనుమకొండ బయలుదేరాడు. మార్గమధ్యలో రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా జంక్షన్లో మడికొండ నుంచి వస్తున్న ఆటో నిర్లక్ష్యంగా కుడి వైపునకు ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియా వైపుగా మళ్లించడంతో బైక్కు తగిలింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, బైక్ నడుపుతున్న బి.జశ్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో ఎంజీఎం తరలించారు. ఆటో డ్రైవర్ కాజీపేట రహమత్నగర్కు చెందిన మరుపట్ల తారయ్య అని తెలిసింది. అనంతరం జశ్వంత్ కుటుంబీకులు ఎంజీఎం వెళ్లేసరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శ్రావణ స్వాతి.. నేరస్తుడికి ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు సీఐ కిషన్, ఎస్సై కుమారస్వామి, పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్గా పరమేశ్వరి, కుమారస్వామి విచారణ పర్యవేక్షించారు. కానిస్టేబుల్ వీరగోని రాజేశ్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టం చేయాలి
హన్మకొండ : బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గద్దర్ స్ఫూర్తిని ఈతరం కొనసాగించాలన్నారు. దేశ సాంస్కృతిక చరిత్రలో గద్దర్ది చెరగని స్థానమని, ఆయన జీవించి ఉన్నంత కాలం ప్రజల కోసమే పాటుపడ్డారన్నారు. తొలి రోజుల్లో బుల్లెట్ను నమ్ముకున్న గద్దర్.. తర్వాత అంబేడ్కర్ మార్గంలోకి వచ్చి బ్యాలెట్ని నమ్మారన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినా తన వర్గానికి కాకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ముస్లింలను చూపిస్తూ కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ పోరాటం చేసిన స్వాగతిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన గద్దర్ కృషి మరువలేనిదన్నారు. గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ వరంగల్తో పాటు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడ రంజిత్ కుమార్, కాడపాక రాజేందర్, రామంచ శ్రీను, ప్రొఫెసర్ వీరస్వామి, ఆస్నాల శ్రీనివాస్, బండి మొగిలి, సాయిని నరేందర్, టి.ఎన్.స్వామి, మన్నే బాబురావు, రామంచ భరత్, తాళ్ల సునీల్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య -
విద్య, ఆరోగ్యంతోనే ప్రజాశ్రేయస్సు
కేయూ క్యాంపస్ : అభివృద్ధి అంటే మౌలిక వసతులు, తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తియే కాదని, విద్య, ఆరోగ్య ద్వారానే ప్రజాశ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా రాష్ట్రాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో డాక్టర్ జయశంకర్ స్మారకోపన్యాసం కార్యక్రమంలో ‘డెవలప్మెంట్ డిపార్టీస్ అండ్ ది ఫర్మార్మెన్స్ ఆఫ్ ది సోషల్ సెక్టార్ ఇన్ది సౌథర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వివిధ రంగాల్లో వెనుకబాటులోనే ఉందన్నారు. విద్య, వైద్య శ్రేయస్సు ద్వారానే ఉత్పాదకత పెరుగుతుందన్నారు.బాలికలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ ఉందన్నారు.డాక్టర్ జయశంకర్ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణను కలగన్నారన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్ మాట్లాడుతూ జయశంకర్ గొప్పమానవతావాది అన్నారు. తెలంగాణ స్వాప్నికుడు, విద్యావేత్త, దూరదృష్టిగల గొప్పవ్యక్తి అని కొనియాడారు. కేయూ విశ్రాంత కామర్స్ విభాగం ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్, జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎ. శంకరయ్య మాట్లాడుతూ జయశంకర్ గొప్పపరిపాలనాదక్షుడన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కొనాలి
మహబూబాబాద్ అర్బన్: స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజ లు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన ఉత్పత్తులు బాగున్నాయన్నా రు. ముఖ్యంగా ఇప్పుపువ్వు లడ్డూ, మిల్లెట్ బిస్కెట్స్, తేనె, చేతితో తయారు చేసిన జ్యూట్ బ్యా గులు చాలా బాగున్నాయన్నారు. ఈ నెల 4నుంచి నుంచి 8వ తేదీ వరకు ఈ ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శించబడుతాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మార్జా మునవర్బేగ్, తహసీల్దార్ రాజేశ్వర్, మెప్మా పీడీ విజయకుమారి, అధికారులు శ్రీనాథ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీబయ్యారం: బయ్యారంలో ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలతో పాటు పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి పఠనాశక్తిని పరిశీలించారు. పీహెచ్సీలో నమోదవుతున్న వ్యాధుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
పూడికతీత పనుల్లో ఆలస్యం
బయ్యారం: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు నిండే వరకు ప్రేక్షకపాత్ర పోషించి.. ఆ తర్వాత కాల్వల పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు దేవుడెరుగు వరినారును కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. కాగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత నెల 27న చెరువు తూములను ఓపెన్ చేశారు. కాగా తూములు తెరిచి 11రోజులైనా బయ్యారం వరకు చెరువు నీరు చేరలేదు. సకాలంలో నాట్లు వేసుకుందామంటే నత్తనడకన సాగుతున్న కాల్వల పూడికతీత పనులతో వరినార్లు ముదిరి దిగుబడి తగ్గే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే పొక్లెయినర్తో ఎన్నిరోజులు.. బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగు నీరందించేందుకు పెద్దకాల్వ, తునికికాల్వ, పెరుగుబుడ్డి, గుండ్లోరి కాల్వలు ప్రధానమైనవి. ఈ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి బలహీనంగా ఉన్న చోట కట్టలు పటిష్టం చేసేందుకు నీటిపారుదలశాఖాధికారులు టెండర్ ద్వారా పనులు ప్రారంభించారు. సుమారు 12 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వల పూడికతీతకు కనీసం మూడు పొక్లెయినర్లు ఏర్పాటు చేస్తే త్వరితగతిన పనులు పూర్తయ్యేవి. అయితే ప్రస్తుతం ఒకే మిషన్తో పనులు చేపడుతుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్న మిషన్తో పాటు మరో మిషన్ ఏర్పాటు చేసి త్వరితగతిన పూడికతీత పనులు చేపట్టాలని, సకాలంలో సాగునీరు అందించాలని అధికారులను కోరుతున్నారు. వృథాగా సాగునీరు.. తూములు తెరిచినప్పటికీ కాల్వల పూడికతీత వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇదిలా ఉండగా అలుగు ద్వారా వెళ్లే నీరు వృథా అవుతోంది. ఆ నీటిని ఆయకట్టుకు మళ్లీంచే అవకాశం లేకపోవడంతో అలిగేటిలో కలిసిపోతోంది. నీళ్లు వస్తే నాట్లు పడేవి.. చెరువు కాల్వలను ఇంతక ముందే బాగు చేస్తే చెరువు నిండిన వెంటనే పంట పొలాలకు నీళ్లు వచ్చేవి. అలుగు ద్వారా ఏటిలో పడుతున్న నీటిని కాల్వలకు విడుదల చేస్తే మా పొలాల్లో నాట్లు పడేవి. మా గుండ్లోరి కాల్వ బాగు చేసి చివరన ఉన్న బంజరతండాకు ఎప్పుడు నీరు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. – బి.బిచ్చ, బంజరతండాఏటా సీజన్ ప్రారంభంలో బయ్యారం చెరువు కాల్వల మరమ్మతు 11రోజులక్రితం తూములు తెరిచిన ఎమ్మెల్యే బయ్యారం వరకు చేరని సాగునీరు ఎండుతున్న వరినారు మడులు -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి ● లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ● ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ● ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపుమెటల్ క్రషర్ (ఫైల్) సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నా యి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తు న్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మా రుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రా తి ఖనిజం కంకర,గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరి నా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలి స్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది.మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. -
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuసాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● తొమ్మిది రోజులపాటు నిష్టతో కన్నె పిల్లల పూజలు ● గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు. ● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు. ● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. ● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు. ● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు. సంప్రదాయ పాటలుమొదటి రోజు :చివరి రోజు :● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు. తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. 9 -
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
గూడూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కె. అనిల్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట సర్వే సక్రమంగా చేయాలని సూచించారు. తహసీల్ సందర్శన.. కేసముద్రం: ఇనుగుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. భూభారతి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన 1,684 దరఖాస్తులలో సరైన పత్రాలు ఉండి, ఆమోదయోగ్యమైనవి కలెక్టర్కు పంపించాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఆర్ఐ బషీర్, సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ కె.అనిల్కుమార్ -
జయశంకర్ ఆశయాలను సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను సాధించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సిహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషొత్తం, అధికారలు వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, సురేష్, మరియన్న, కిరణ్, వీరన్న, వెంకటరమణ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
పల్లెల్లో ఆరోగ్య అవగాహనకు ప్రత్యేక చర్యలు
బయ్యారం: పల్లెల్లో ఆరోగ్య అవగాహన కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ అన్నారు. బయ్యారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బుధవారం బయ్యారం, గంధంపల్లి, కొత్తగూడ, ముల్కనూర్, కోమట్లగూడెం, గంగారం పీహెచ్సీల వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులు, పైలేరియాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పైలేరియా వ్యాఽధిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నెల 10నుంచి 25వ తేదీ వరకు ఆరు పీహెచ్సీల పరిధిలో ౖపైలేరియా నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వానాకాలంలో వచ్చే రోగాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమశాఖకు సహకరించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో రోగ నిర్ధారణకు ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్లు, ఔషధాల లభ్యత, రిజిస్టర్ల నిర్వహణ, పోర్టల్లో ఎంట్రీ చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, సబ్యూనిట్ ఆఫీసర్ రామకృష్ణతో పాటు ఆరు పీహెచ్సీల వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. వ్యాధుల నివారణకు చర్యలు నెహ్రూసెంటర్: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్నాయక్ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం సీజనల్ వ్యాధుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని టీహబ్ డయాగ్నస్టిక్స్, బ్లడ్బ్యాంక్ పరిశీలించారు. ఈ నెల 10 నుంచి 25వరకు పైలేరియాపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, ఆర్ఎంఓలు హర్షవర్ధన్, జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారులు, వైద్యా అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ -
పిల్లలూ పాఠాలు అర్థమవుతున్నాయా..
మహబూబాబాద్ అర్బన్: పిల్లలూ.. సార్లు బో ధించే పాఠాలు అర్థమవుతున్నాయా అని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయానికి హాజరుకావాలని, విద్యార్థుల్లోని సామర్థ్యాలను వెలికితీయలన్నారు. మ్యూజిక్ పరికరాలను విద్యార్థులకు వినియోగించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరి ధిలోని అనంతారం మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమలో డీఈఓ రవీందర్రెడ్డి, రాష్ట్ర ఏఎంఓ జావీద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జిల్లా కోఆర్డి నేటర్ ఆజాద్చంద్రశేఖర్, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, ఉపేందర్రావు ఉన్నారు.ఈ–పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టాలి కురవి: ఈ–పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని డీఏఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని మోద్గులగూడెంలోని ఫౌల్ట్రీఫాంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాలు, గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, నానో యూరియా వాడాలని సూచించారు. ఆమె వెంట ఏఓ నర్సింహారావు, సీఈఓ జితేందర్, శ్రీపాల్, రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ఇంజన్లో పొగలుమహబూబాబాద్ రూరల్: హనుమకొండ నుంచి మహబూబాబాద్ పట్టణానికి వస్తున్న ఆర్టీసీ బస్సు కంబాలపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఇంజన్లో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చిన సంఘటన బుధవారం జరిగింది. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దింపాడు. ఆ బస్సు వెనుకాలే వస్తున్న నర్సంపేట డిపోకు చెందిన మరో బస్సులో ప్రయాణికులను ఎక్కించి మహబూబాబాద్ పంపించారు. ఇటలీ వాసులకు రాఖీలు కట్టిన ముస్లిం మహిళలుతొర్రూరు: అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ముందస్తు వేడుకల్లో భాగంగా ముస్లిం మహిళలు విదేశీయులకు రాఖీలు కట్టి సమైక్యత చాటారు. బాల వికాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఇటలీ దేశానికి చెందిన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్లు బుధవారం తొర్రూరుకు వచ్చారు. అతిథులను చూసిన ముస్లిం మహిళలు షాహీన్ సుల్తానా, ఆసియాలు వారికి రాఖీలు కట్టి సోదరభావం చాటారు. ఇటలీ వాసులకు దుస్తులు, గాజులు బహూకరించారు. ఇటలీలోని క్యాథలిక్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులైన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్లు 4 వారాలుగా భారత్లో బాలవికాస కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నారు. -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హన్మకొండ: అవినీతి ఉద్యోగులపై టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం వేటువేసింది. ఖమ్మం సర్కిల్లోని తిరుమలయపాలెంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్.భాస్కరరావు, ఏఎల్ఎం యు.జగత్ జీవన్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సర్కిల్ పరిధిలోని చింతల్తండా రైతులు కొత్త వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకోగా, మంజూరు చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. తాము అంత మొత్తం చెల్లించుకోమని చెప్పి చివరకు రూ.90 వేలు అందించారు. ఈవిషయం యాజమాన్యం దృష్టికి రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టగా..రైతుల నుంచి రూ.90 వేలు తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో వారిని సస్పెండ్ చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడితే 92810 33233 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని యాజమాన్యం కోరింది. ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్విద్యారణ్యపురి: స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మంగళవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. హనుమకొండ జిల్లాకు సంబంధించి సీనియారిటీ తాత్కాలిక జాబితాను వెల్లడించడంతో 460మందిని సర్వీస్బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచారు. మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటుచేసి పరిశీలన జరిపారు. 360మంది వరకు వెరిఫికేషన్కు హాజరయ్యారు. అందరి వెరిఫికేషన్ పూర్తయ్యాక మరోసారి సీనియారిటీ జాబితా వెల్లడిస్తారు. చేయూత పెన్షన్ సకాలంలో అందించాలిహన్మకొండ: చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు పద్ధతి ద్వారా సకాలంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయాలని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేయూత పెన్షన్ రాష్ట్ర డైరెక్టర్ గోపాల్ రావు సూచించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా ఎంపీడీఓలు, సెక్షన్ క్లర్కులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు చేయూత పెన్షన్లపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలోని రిజిస్టర్లో పెన్షన్ పంపిణీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మరణించిన పెన్షన్దారులను వెంటనే ఆన్లైన్నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సదస్సులో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేయూలో ఉద్రిక్తత
కామన్ మెస్లో విద్యార్థుల ఆందోళనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కామన్మెస్లో వంటచేసేందుకు లారీలో 13టన్నుల లోడ్ కట్టెలు రావాల్సిండగా ట్రాక్టర్లో తక్కువగా తీసుకురావడంతో మెస్ కమిటీ బాధ్యులు ప్రశ్నించారు. లారీలో 12నుంచి 13టన్నులు రావాల్సిన కట్టెలను ట్రాక్టర్లో తక్కువగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసందర్భంగా సంబంధిత సిబ్బందితోనూ, అక్కడున్న కేర్టేకర్తోనూ వాగ్వాదానికి దిగారు. జాయింట్ డైరెక్టర్ అక్కడికి చేరుకోగా డైరెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ కామన్ మెస్ వద్దకు చేరుకోగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలోడ్కు బదులుగా సంబంధిత కాంట్రాక్టర్ ట్రాక్టర్లో కట్టెలు పంపారని ఇలా మిగతా వాటిల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. కూరగాయలు సరఫరా చేసేవారు కూడా తక్కువగానే తీసుకొస్తున్నారని, భోజనం నాణ్యతగా ఉండటంలేదన్నారు. కామన్ మెస్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మెస్ కమిటీ బాధ్యులు పలువురు, విద్యార్థులు హాస్టళ్ల డెరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టళ్ల నిర్వహణకు కమిటీ కూడా ఉంటుందని వీసీ, రిజిస్ట్రార్ వద్దకు వచ్చి మాట్లాడాలని మెస్ కమిటీ బాధ్యులకు, విద్యార్థులకు డైరెక్టర్ సూచించారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్స్టేషన్ సీఐ రవికుమార్, ఎస్ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బందితో అక్కడి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనూ డైరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడాలని సూచించగా వీసీని కలిసేందుకు వెళ్లారు. వీసీతో సమావేశం.. మెస్ కమిటీ బాధ్యులు, కొందరు విద్యార్థులు కేయూలోని పరిపాలనా భవనం వద్దకు వచ్చారు. కేయూ వీసీ ఆచార్య కే ప్రతాప్రెడ్డి మెస్ కమిటీ బాధ్యులతో అకాడమిక్ కమిటీహాల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మెస్ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. మెస్లో అవకతవకలకు పాల్పడుతుండడంతో భోజనం నాణ్యతగా ఉండటం లేదని ఆరోపించారు. సూపర్వైజర్ నిరంజన్రెడ్డి, కేర్టేకర్ రాజు, హాస్టళ్ల డైరెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి వీసీ స్పందిస్తూ.. కేర్టేకర్ రాజును, సూపర్వైజర్ నిరంజన్రెడ్డిని కామన్మెస్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. హాస్టళ్ల డైరెక్టర్ను కూడా మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేయగా..ప్రస్తుతం హాస్టళ్ల డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని, త్వరలోనే కామన్మెస్ వ్యవహారంపై అవసరమైతే ఓ కమిటీ నియమిస్తామని, హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగుతారని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తితే రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కట్టెల సరఫరా కాంట్రాక్టు రద్దు.. కాకతీయ యూనివర్సిటీ కామన్మెస్కు కట్టెలను సరఫరా చేసే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ రాజ్కుమార్ తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చామన్నారు. 13 టన్నులు రావాల్సిన కట్టెలను తక్కువగా తీసుకొచ్చారని ఆరోపణ కూరగాయల సరఫరాలో కూడా అవకతవకలు.. భోజనం నాణ్యతగా ఉండటం లేదని కేర్టేకర్, డైరెక్టర్తో వాగ్వాదం పోలీసులు నచ్చజెప్పినా వినని విద్యార్థులు మెస్ కమిటీ బాధ్యులు, విద్యార్థులతో వీసీ సమావేశం కేర్టేకర్, సూపర్వైజర్లను తొలగిస్తున్నట్టు ప్రకటన -
ట్రాలీఆటో ఢీకొని చిన్నారి మృతి
కమలాపూర్: ట్రాలీఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతిచెందింది. ఈఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుండేడుకు చెందిన కాలేశ శ్రీకాంత్, తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు రిషిక ఇంటిముందు ఆడుకుంటుండగా హసన్పర్తికి చెందిన గుండమీది శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాలీఆటోకు మైక్ పెట్టుకుని పెద్ద శబ్దంతో అల్లం, వెల్లుల్లి అమ్ముకుంటూ.. అతివేగంగా ఆటో నడుపుకుంటూ వచ్చి రిషికను ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రిషిక అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ పారిపోయాడు. అప్పటివరకు తమతో ఆడుకున్న రిషిక రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రిషిక తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు గుండమీది శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. జ్వరంతో యువతి..వాజేడు: ఏజెన్సీలో జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన ఉయిక దీపిక(22) కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. గత నెల 29న వాజేడు వైద్యశాలలో చేరగా పరీక్షలు చేసి రెండు రోజులు వైద్యం అందించారు. ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నట్లు తెలపడంతో వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరగా నాలుగు రోజులు వైద్యం చేశారు. కుడివైపున నొప్పి వస్తుందని దీపిక తెలపడంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ వెళ్లాలని సూచించారు. వరంగల్కు తరలించి వైద్యం అందిస్తుండగానే దీపిక సోమవారం రాత్రి మృతి చెందింది. దీపిక బీఈడీకి ప్రిపేర్ అవుతుంది. మృతురాలి తండ్రి రామారావు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోగా, తల్లి దేవమ్మ, అన్న కలిసి దీపికను చదివిస్తున్నారు. ప్రమాదవశాత్తు వాగులో పడి వృద్ధుడు..కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బూజునూర్పల్లికి చెందిన మామిడాల ఇంద్రారెడ్డి (60) అనే వృద్ధుడు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఇంద్రారెడ్డి సోమవారం గొర్రుకొట్టడానికి వెళ్లి సాయంత్రం గొర్రును, ఎద్దులను కడగటానికి దగ్గరలో ఉన్న వాగు వద్దకు వెళ్లాడు. ఎద్దులను కడిగిన అనంతరం గొర్రు కడుగుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. రాత్రయినా ఇంద్రారెడ్డి ఇంటికి రాకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబసభ్యులు ఇంద్రారెడ్డి కోసం వెతికారు. వాగు వద్ద ఎద్దులు, గొర్రు, వాగులో ఇంద్రారెడ్డి మృతదేహం కనిపించింది. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. -
ప్రజాసమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వాలు మారుతున్న పేదరికం మాత్రం పోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ములుగు జిల్లాలో పేదరికం అధికంగా ఉందని, ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది ఆస్తులు పెంచుకోవటం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంపాల రవీందర్, అహ్మద్ పాషా, భిక్షపతి, రాజు, తోట మల్లికార్జునరావు, బండి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
● జూలై 31న రైలు ఎక్కబోతూ జారిపడడంతో తీవ్రగాయాలు ఖిలా వరంగల్: చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ఓ వ్యాపారి వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ వద్ద జారి పడి తీవ్రగాయాలు కాగా.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రామన్నపేటకు చెందిన వ్యాపారి చందా జగదీశ్వర్(62) గత నెల 31న ఉదయం 8.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా.. రైల్వే జీఆర్పీ అధికారులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం జగదీశ్వర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మృతుడి కుమారుడు అభిషేక్కు అప్పగించినట్టు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్రాజు పేర్కొన్నారు. -
ముంపు సమస్యను ఎదుర్కోవాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయత్తం కావాలని, గతంలో వరద ముంపుతో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కావొద్దని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీ నీటినిల్వలు, గేట్ల వివరాలను పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎంతవరకు వస్తుందని, ఏ మేరకు నీటిని విడుదల చేస్తారని ఆరా తీశారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన ఉన్న లక్ష్మీ, సరస్వతీ, ఎస్సారెస్పీతోపాటు ఎగువన ఉన్న నదులు, ఉపనదుల నుంచి బ్యారేజీలోకి చేరుతుందని దివాకర తెలిపారు. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. బ్యారేజీ ఎగువన దేవాదుల ఎత్తిపోతల వద్ద 10 మోటార్లు మూడు ఫేజ్లలో ఉన్నాయని, దిగువన ఉన్న రిజర్వాయర్ల నీటి వినియోగాన్ని బట్టి పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ..వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అప్రమత్తంగా ఉన్నాం.. ఈసందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ..వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బందిని, వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్, టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 80 పునరావాస కేంద్రాలను ముందస్తుగా గుర్తించామన్నారు. బెడ్ షీట్లు, ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7గా పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్సింగ్, ఏపీఓ వసంతరావు, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కన్నాయిగూడెంలో సమ్మక్క బ్యారేజీ పరిశీలన ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో వరద ముంపుపై సమీక్ష -
యూరియా వచ్చిందయా !
ఖిలా వరంగల్: యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్షెడ్కు వ్యాగన్ చేరింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఈ యూరియాను మార్క్ఫెడ్కు 60శాతం, ఇతర ఫర్టిలైజర్స్కు 40శాతం కేటాయించారు. మార్క్ఫెడ్ అధికారులు ప్రధానంగా ఎక్కడ కొరత ఉందో ఆ ప్రాథమిక సహకార సంఘాలకు లారీల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో కావాల్సిన యూరియా మొత్తంలో 60శాతం పైగా ఇప్పటికే చేరింది. తాజాగా వచ్చిన దానితో సమస్యలు తీరినట్లేనని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు యూరియా దొరకదనే ఆపోహలకు గురికాకుండా ఒకటి, రెండు బస్తాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వీటి అమ్మకాలు పూర్తయితే మరింత వచ్చే వీలుందని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. దాదాపు అన్ని మండలాల్లో తగినన్ని నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఒకేసారి కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన మొత్తాన్ని ఒకేసారి చల్లలేరని, తీసుకున్న యూరియాను పంటకు ఎక్కువగా చల్లడం వల్ల నష్టాలు వస్తాయని చెప్పారు. రైతులు ఎకరానికి 25 కిలోలకు మించి వినియోగించొద్దని అధికారులు సూచించారు. రైల్వే గూడ్స్షెడ్కు చేరిన యూరియా వ్యాగన్ ఉమ్మడి జిల్లాకు 1,319.220 మెట్రిక్ టన్నులు కేటాయింపు అన్ని మండలాల్లో తగినంత యూరియా ఉంది: అధికారులు -
టీవీ రిపేర్ పేరుతో ఇంట్లో చోరీ
నడికూడ: టీవీ మరమ్మతు చేస్తానంటూ వచ్చి ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలీబ్ రాజు తన భార్యతో సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ‘మీ కొడుకు టీవీ రిపేరు చేయమన్నాడు..’ అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. టీవీ గదిలో ఉన్న బీరువా తాళం పగలకొట్టి రూ.లక్షా 38 వేల విలువ గల రెండు బంగారు ఉంగరాలు, ఒక జత కమ్మలు, మాటీలు, బంగారు చైన్, వెండి పట్టగొలుసు, నగదు రూ.11,000 చోరీ చేసి.. టీవీ రీపేర్ పూర్తయ్యిందని చెప్పి వెళ్లిపోయాడు. 20 నిమిషాల అనంతరం రాజు తల్లిదండ్రులు ఇంటి లోపలికి వెళ్లిచూడగా బీరువా పగలగొట్టి ఉండడం గమనించి తమ కుమారుడికి సమాచారం ఇచ్చారు. బాధితుడు రాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
రామప్ప హుండీ ఆదాయం రూ.5.58 లక్షలు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయానికి గత మూడు నెలలల్లో రూ.5,58,506 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. గత మూడు నెలలుగా భక్తులు, పర్యాటకులు హుండీలో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. దేవాదాయశాఖ పరిశీలకులు కవిత ఆధ్వర్యంలో శ్రీభ్రమరాంబిక సేవా సమితి సభ్యులు హుండీ కానుకలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఆర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరమశివుడి అలంకరణలో రామలింగేశ్వరస్వామి రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి మంగళవారం పరమశివుడి అలంకరణలో పర్యాటకులకు, భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీశ్శర్మ తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా రామలింగేశ్వరస్వామికి రోజుకో అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘ఆరు’లోనే అర్హురాలైందట..!
● ఇందిరమ్మ ఇంటి కోసం వెళ్లిన మహిళకు వింత అనుభవం బయ్యారం: ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఇందిరమ్మ ఇంటికి అర్హులరాలిని చేయడమే కాకుండా ఆమె పేరున రూ.22,350 నగదును ఖాతాలో జమ, రూ.7,500విలువైన సిమెంట్ బస్తాలు ఇచ్చినట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. ఈ ఘటన బయ్యారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని బాలాజీపేటకు చెందిన గుగులోత్ లాలు కుమార్తె బేబి 2008వ సంవత్సరంలో ఆరో తరగతి చదివింది. 2014లో బేబికి బాల్యాతండాకు చెందిన వినోద్తో వివాహం జరిపించారు. బాల్యాతండాలో రేకుల ఇంట్లో ఉంటున్న బేబి కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి మంజూరుకు అన్ని అర్హతలు బేబికి ఉన్నప్పటికీ గృహనిర్మాణశాఖ వెబ్సైట్లో ఆమె ఫొటోతో చూపెడుతున్న వివరాలు ఇంటి మంజూరుకు అడ్డుగా మారాయి. 2008లో బేబి పేరున ఇల్లు మంజూరు కావడంతో పాటు గంధంపల్లిలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.22,350 నగదు ఖాతాలో జమచేసినట్లు, రూ.7,500 విలువైన 50 సిమెంట్కట్టలు ఇచ్చినట్టు రికార్డులో ఉంది. చదువుకుంటున్న సమయంలో తనకు ఇల్లు ఇచ్చినట్టు రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయటం ఏమిటని బేబి వాపోతోంది. తన ఆధార్కార్డు ఫొటోను జగ్గుతండాకు చెందిన గుగులోత్ బేబి, హచ్చ పేరుకు అనుసంధానం చేసి ఇల్లును మంజూరైనట్టు గృహనిర్మాణశాఖ వెబ్సైట్లో నమోదు చేశారని, తనకు ఇల్లు మంజూరు చేయాలని బేబి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వేడుకుంది. నాటి అధికారులు చేసిన తప్పుకు తాను బలవుతున్నానని, ఇప్పటికై నా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. -
● ఆదరణ లేని ‘ఆకాంక్ష’..
కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న దుకాణాలు జిల్లాలోని స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను ఆకాంక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన జనపనార సంచులు, తేనె తదితర గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించడం, అమ్మకాలు జరపడంతో పాటు ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఆదరణ కరువైంది. పూర్తిస్థాయిలో స్టాళ్లను ఏర్పాటు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమయ్యారు. అంతేకాక ఏర్పాటు చేసిన స్టాళ్లకు కూడా సరైన ప్రచారం లేక వెలవెలబోతున్నాయి. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
నాణ్యమైన సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: వినియోగదారులకు నా ణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పిదాలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. దరఖాస్తుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. సమావేశంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది రఘుపతి, రాకేశ్ శర్మ, అశోక్ కుమార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. పీఆర్టీయూ పోరాటాలతోనే పదోన్నతుల ప్రక్రియగార్ల: పీఆర్టీయూ పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పలు పాఠశాలల్లో చేపట్టిన పీఆర్టీయూ సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాద్లో చేపట్టే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు చింతనిప్పు రమేశ్, ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సురేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రమేశ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలిమహబూబాబాద్: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మంగళవారం హైదరాబాద్నుంచి ఆమె సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో డైట్ కమిటీలు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భోజనం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావుకేసముద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11ఏళ్లుగా సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. మంగళవారం కేసముద్రంలో మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మారావు మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచందర్రావు, మండల అధ్యక్షుడు రమేశ్, జి ల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరాచారి, నాయకులు వెంకట్రెడ్డి, ఉపే ందర్, మధుకర్, మహేందర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.