Mahabubabad District News
-
పుష్కరాల్లో తనికెళ్ల భరణి ప్రవచనాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో ఆదివారం సినీనటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద సంగీత్ నాటక్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వామి వారి ప్రవచనాలు చెప్పారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ప్రాముఖ్యత, త్రివేణి సంగంమం, సరస్వతీనది పుష్కరాల గొప్పతనం గురించి వివరించారు. -
ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే సుస్థిర పాలన
మహబూబాబాద్ అర్బన్ : ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానంతో సుస్థిరపాలన అందించవచ్చని బీజేపీ రాష్ట్ర కోకన్వీనర్ శ్రీరామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి 100రోజుల్లోపు జరుగుతాయని, తద్వారా ప్రజాపాలన సులభం అవుతుందని, దేశ సంప ద, అధికార యంత్రాంగం శ్రమ వృథా కాదన్నారు. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ మహేశ్గౌడ్, కోకన్వీనర్ సందీప్గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అశోక్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు నాయక్ ఉన్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదాం
హన్మకొండ: ఈనెల 27న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుని 31న వరంగల్కు రానున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదామని మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్, ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద కుమార్, నాయకులు ఎస్.నరేంద్రబాబు, మంద వెంకటేశ్వరరావు, బొడ్డు దయాకర్, బొర్ర భిక్షపతి, బుర్ర సతీశ్, పుట్ట రవి, పేరెల్లి ఎలీషా, దుడ్డు రామకృష్ణ, చేతల శివ, మంద వర్ధన్, కుమ్మరి శ్రీనాథ్, దావు ఆదిత్య పాల్గొన్నారు. -
త్రివేణి సంగమం.. జనసంద్రం
పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలు పదకొండు రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవుదినం సందర్భంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరానికి భారీగా తరలి వచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు ఆచరించి, నదీ మాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. దంపతిస్నానాలు చేసి దొప్పల్లో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఘాటుపై ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. క్యూలైన్లో బారులుదీరడంతో రాత్రి వరకు ఆలయంలో రద్దీ నెలకొంది. రెండు లక్షల మంది భక్తుల రాక.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. సోమవారంతో పుష్కరాలు ముగియనుండంతో భక్తులు ఆదివారం భారీగా కాళేశ్వరం బాటపట్టారు. రెండు లక్షల మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వా మివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా. ట్రాఫిక్ జామ్.. కాళేశ్వరానికి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో పోలీసులు అన్నారం క్రాస్ నుంచి వయా మద్దులపల్లి మీదుగా వన్ వే ఏర్పా టు చేసి వాహనాలు తరలించారు. మంచిర్యాల వైపు నుంచి వచ్చేవాహనాలు అంతర్రాష్ట్ర వంతెన వద్ద నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ప్రాణహిత వంతెన వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులు పార్కింగ్ స్థలాల నుంచి కాలినడకన ఘాట్ వరకు నడిచివెళ్లారు. మహదేవపూర్ నుంచి వచ్చే వాహనాలు మధ్యాహ్నం నుంచి వన్వే తీయడంతో టూ వే ద్వారా మళ్లీ తరలివచ్చాయి. కలెక్టర రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే ట్రాఫిక్ను సమీక్షించారు. ఆర్టీసీ బస్సులు లేక అవస్థలు.. భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సాయంత్రం వేళల్లో బస్సులు అధిక సంఖ్యలో నడిపించడం లేదని భక్తులు ఆరోపించారు. పోలీసుల అత్యుత్సాహం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పుష్కరాల పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఐడీకార్డులు ఉన్న వారి ద్విచక్రవాహనాలనూ అనుమంతించలేదు. అలాగే, మీడి యా ప్రతినిధులతోనూ వాగ్వాదానికి దిగారు. ప్రధాన ఆలయం మండపంలోకి వెళ్లే గేటు వద్ద ఎస్సై ఎస్.రాజేశ్.. ఉత్సవ కమిటి సభ్యుడు అశోక్తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడున్న వారు సముదాయించే ప్రయత్నంలో అన్న సంబోధించగా ఎస్సై కో పోద్రెకుడయ్యాడు. తాను సబ్ఇన్స్పెక్టర్ను అని, తనను సార్ అని సంబోంధించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎస్సైపై సీఐకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఘనంగా హారతి.. సరస్వతిఘాట్ వద్ద ఆదివారం రాత్రి కాశీపండితులతో నవరత్నమాల హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏడుగురు పండితుల బృందం తొమ్మిది హారతులను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 45 నిమిషాల పాటు జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మంత్రులు దుద్దిళ్ల ఽశ్రీధర్బాబు, సీతక్క, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రా వు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాస రాజు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, ఈఓ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖుల పుష్కర స్నానం కాటారం/కాళేశ్వరం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, యోగా నంద సరస్వతి స్వామి, ఎమ్మెల్సీ సురభివాణి, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎంపీ నాందేవ్ కిర్సాన పుణ్యస్నానం ఆచరించారు. అలాగే, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజారామయ్యార్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్కు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే స్వాగతం పలికి పుష్ఛ గుచ్చం అందజేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం చేశారు. పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తజనం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన రద్దీ 11వ రోజు రెండు లక్షల మంది వరకు రాక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, యోగానందాసరస్వతిస్వామి, సినీనటుడు తనికెళ్ల భరణి పుష్కర స్నానాలు, పూజలు కాశీపండితులతో నవరత్నమాల హారతి -
పునఃప్రారంభమయ్యేనా?
మహబూబాబాద్ అర్బన్: పేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. గతంలో విద్యార్థులు లేరనే సాకుతో బంద్ చేశారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను అధికారులు మూసివేశారు. అలాగే కొత్తగూడ ఆశ్రమ ఎస్సీ హాస్టల్, ఇనుగుర్తి ఎస్సీ హాస్టల్ను గత ఏడాది మూసివేశారు. పునఃప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాల నాయకులు, మేధావులు కోరుతున్నారు. హాస్టళ్లను కాపాడాలి.. జిల్లా వ్యాప్తంగా గతంలో 23 హాస్టళ్లు ఉండేవి. ప్రస్తుతం 19 హాస్టళ్లలో 1,400 మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కాలేజీలకు సంబంధించి నాలుగు హాస్టళ్లు ఉండగా 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే కొత్తగూడ, ఇనుగుర్తి మండలాల్లోని హాస్టళ్లు క్లోజ్ చేయగా.. మరో రెండు హాస్టళ్లు మూతపడే ప్రమాదం ఉంది. మంత్రి సీతక్కకు కొత్తగూడ హాస్టల్ను ప్రారంభించాలని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇనుగుర్తి మండలం ఏర్పడిన నేపథ్యంలో అక్కడి ఎస్సీ హాస్టల్ పునఃప్రారంభిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నాయకులు కోరుతున్నారు. దీనిపై జిల్లా ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నరసింహ స్వామిని వివరణ కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ హాస్టళ్ల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జిల్లాలో మూతపడిన నాలుగు హాస్టళ్లను పునఃప్రారంభించేందుకు అధికారులు, నాయకులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. ఆ భవనం నిరుపయోగం ప్రత్యేక తెలంగాణలో 2016లో మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను మూసివేసి, ఆ భవనాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయానికి అప్పగించారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఎస్సీ సంక్షేమ కార్యాలయం అక్కడికి మార్చారు. దీంతో ప్రస్తుతం ఆనంద నిలయం ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉంది. గతంలో నాలుగు ఎస్సీ హాస్టళ్లు మూత మళ్లీ ప్రారంభిస్తే విద్యార్థులకు ఎంతో మేలు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి -
జీవీబాబు ఇక లేరు..
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ముద్దుబిడ్డ, ప్రముఖ రంగ స్థల క ళాకారుడు జీవీబాబు (70) ఇకలేరు. బలగంతోపాటు 20 సినిమాలకు పైగా నటించిన మహా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడై కొంత కాలంగా డయాలసిస్తో బాధపడుతున్నారు. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో వరంగల్ రామన్నపేట( పాపయ్యపేట)లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాటక ప్రదర్శనలతో చైతన్యం.. సినిమాలకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశు ల్కం వంటి సాంఘిక, సామాజిక సమస్యలను ఎత్తి చూపి వాటిని పారద్రోలేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక నాటకాలు రచించి నాటకాలు వేసి అగ్ర స్థానంలో నిలిపారు. పౌరాణిక నాటకాలు వేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఆటపాటతో ఉర్రూతలు ఊగించారు. జీవీబాబు భౌతికకాయానికి నివాళి.. జీవిబాబు మృతిపై బలగం డైరెక్టర్ యొల్దండి వేణుతోపాటు హీరో ప్రియదర్శి విచార వ్యక్తం చేశారు. రామన్నపేటలోని తన నివాసంలో జీవీబాబు భౌతికకాయాన్ని ఉంచగా.. నాటక సమఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక బాధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, బలగం డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, చిత్రం సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కొమురమ్మ, భాస్కర్, నటుడు సుధాకర్, ఇతర నటీమణులు, రంగ స్థల కళాకారులు సందర్శించి నివాళులర్పించారు.చికిత్స పొందుతూ బలగం నటుడి కన్నుమూత మూగబోయిన ఓరుగల్లు రంగస్థలం 50కి పైగా పౌరాణిక పాత్రల్లో.. 20కి పైగా సినిమాల్లో నటన వరంగల్ పాపయ్యపేటలో విషాదంనటనలో ఆయనకు సాటేరి.. వరంగల్ రామన్నపేట(పాపయ్యపేట)కు చెందిన జీవిబాబు బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా.. కొమురయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించాడు. జీవీ బాబు అసలు పేరు గుడిబోయిన బాబు. సుజాతతో వివాహమైంది. రంగస్థల వేదికపై 50పైగా నాటకాలు వేసి ప్రేక్షకులను మెపించారు. 20కి పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక నాటక రంతోపాటు సినిమా రంగంలో వరంగల్కే మూల స్తంభంగా నిలిచారు. -
మోక్షం
పెండింగ్ బిల్లులకుమహబూబాబాద్: గ్రామ పంచాయతీల్లో గతంలో చేసిన అభివృద్ధి పనుల బకాయి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో సర్పంచ్లు సొంత డబ్బులతో పనులు చేయించారు. కాగా మూడేళ్లుగా వాటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మేరకు వారు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రూ.10లక్షల లోపు ఉన్న బిల్లులకు మాత్రమే నిధులు విడుదల చేయగా.. మాజీ సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 482 జీపీలు.. జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,75,551 గృహాలు ఉన్నాయి. సర్పంచ్ల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు లేక పోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. కాగా సర్పంచ్లో పదవిలో ఉన్నప్పుడు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. దీంతో మాజీ సర్పంచ్లు బిల్లుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 9,990 బిల్లులను క్లియర్ చేస్తూ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2024 ఆగస్టు లోపు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.10లక్షలలోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్ కానున్నాయి. సంబంధిత కార్యాలయాల చుట్టూ మాజీ సర్పంచ్లు.. ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించగానే మాజీ సర్పంచ్లు డీటీఓ కార్యాలయం, డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అధికారులను అడుగుతున్నారు. అందుకు సంబంధిత అధికారులు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, పేపర్లలో మాత్రమే చూశామని చెబుతున్నారు. మాజీ సర్పంచ్ల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని అధికారులు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన.. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ని ర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మాజీ సర్పంచ్ల నిధులు విడుదలతో జీపీ ఎన్నికలు త్వరలోనే ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నా యి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాలను వేగవంతం చేసింది. జీపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో అధికార పార్టీ అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు అర్థమవుతోంది. మండలాల వారీగా పెండింగ్ బిల్లులు మండలం పెండింగ్ బిల్లుల డబ్బులు బయ్యారం 14,842,354 చిన్నగూడూరు 51,358,84 దంతాలపల్లి 67,53,189 డోర్నకల్ 84,61,548 గంగారం 63,233,68 గార్ల 99,716,85 గూడూరు 47,862,457 కేసముద్రం 23,763,998 కొత్తగూడ 26,215,657 కురవి 13,028,911 మానుకోట 27,499,764 మరిపెడ 18,006,391 నర్సింహులపేట 83,93,430 నెల్లికుదురు 23,171,816 పెద్ద వంగర 92,59,513 తొర్రూరు 86,32.184 మొత్తం 25,73,22,149 మాజీ సర్పంచ్లకు ఊరట రూ 10.లక్షలలోపు బిల్లులకు క్లియరెన్స్ 2024 ఆగస్టులోపు చేసిన పనులకే.. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు నిధుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గతంలో జిల్లాలో పెండింగ్ బిల్లుల జాబితా పంపించాం. ఆ బిల్లులు అన్ని ఎస్టీఓ కార్యాలయంలోనే జరిగాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల వస్తే దాని ప్రకారం ప్రాసెస్ చేస్తాం. – హరిప్రసాద్, డీపీఓ వారి ఖాతాల్లో జమ అవుతాయి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపాం. క్లియర్ చేసే బిల్లుల డబ్బులు మాజీ సర్పంచ్ల ఖాతాల్లోనే జమ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక జాబితా లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. – వి.సత్యనారాయణ, డీటీఓ -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ ని యా మకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమి ంచేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రైవేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేల జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాలి. సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఘన్పూర్ శివారులో ఘటన స్టేషన్ఘన్పూర్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం ఘన్పూర్ శివారు ఆర్ఆర్ దాబా సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన యాల వెంకటేష్, సురేశ్(21) తండ్రి నాగరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారు ప్రస్తుతం సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్, సురేశ్ డ్రైవర్లుగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉంటున్నారు. సురేశ్ బైక్పై శివునిపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ఘన్పూర్ శివారులో అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సైడ్ బర్మ్కు ఢీకొనడంతో రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న బాటసారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. చౌళ్లపెల్లిలో వ్యక్తి.. ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చౌళ్లపెల్లికి చెందిన రాచర్ల రవి(53) ఆదివారం రాత్రి పిల్లలను బస్ ఎక్కించడానికి బైక్పై ఆత్మకూరు వచ్చాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో గేదె ఎదురురావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పుష్కరాలకు వెళ్తూ...తిరిగిరాని లోకాలకు
కాటారం : పుష్కరాలకు వెళ్తూ ఓ వృద్ధురాలు తిరిగిరాని లోకాలకు చేరింది. కారు, తవేరా ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి వద్ద జాతీయ రహదారి 353(సి)పై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన సకోటి కిషన్లాల్, కడికె దుర్గాజీ కుటుంబ సభ్యులు, డ్రైవర్ మహేందర్ తవేరాలో పుష్కరాలకు బయలుదేరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన లక్ష్మీనర్సింహారావు కుటుంబ సభ్యులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కాటారం మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న తవేరాను ఢీకొంది. దీంతో వాహనాలు నుజ్జునుజ్జయి రోడ్డుకు ఇరువైపులా దూసుకుపోయాయి. ఈ ఘటనలో తవేరాలో ప్రయాణిస్తున్న డ్రైవర్, పదిమంది భక్తులు, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులలతో పాటు సమీపంలో అన్నదానం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు జేసీబీ సాయంతో వాహనాల డోర్లు తెరిచి క్షతగాత్రులను బయటకు తీశారు. తవేరాలో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన సకోటి లలిత(61) తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రికి తరస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అదే వాహనంలోని డ్రైవర్తో పాటు మరో తొమ్మిది మందికి గాయాలుకావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఓనర్ కమ్ డ్రైవర్ లక్ష్మీనర్సింహారావుతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిని ఎస్సై మ్యాక అభినవ్, పీఎస్సై గీతారాథోడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. కారు, తవేరా ఢీ.. వృద్ధురాలి దుర్మరణం కాటారం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఘటన -
ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల పరీక్ష
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం గ్రామపాలన అధికారుల పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపాలన అధికారుల పరీక్షకు 152 మంది అభ్యర్థులకు 130 మంది అభ్యర్థులు హాజరై, 22 మంది గైర్హాజరయ్యారన్నారు. గతంలో రెవెన్యూశాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామ పాలన అధికారుల పరీక్ష రాశారన్నారు. పరీక్షకు సహకరించిన అన్ని శాఖ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ మహబూబాబాద్: జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్లకు నేడు(సోమవారం) మానుకోట పట్టణం అనంతారం రోడ్డులోని తెలంగాణ మోడల్ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఎల్ఆర్ ఏడీ నర్సింహమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 390మంది గుర్తింపు పొందిన సర్వేయర్లు ఉన్నారన్నారు. 203 మందికి మొదటి విడతలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు చెప్పారు. టీజీఈసెట్లో సత్తాచాటిన మండలవాసి చిన్నగూడూరు: తెలంగాణ ఈసెట్ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో మండలవాసి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించింది. మండలంలోని జయ్యారం గ్రామానికి చెందిన తిప్పర్తి భాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఈసెట్ రాష్ట్రస్థాయి ఫలితాల్లో 234వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తేజోన్నత రెడ్డి, ఉపేందర్ సహకారంతో ర్యాంక్ సాధించినట్లు ఆమె తెలిపింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఆర్ట్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా జితేందర్ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్లేస్మెంట్ సెల్ అధికారిగా ఆ కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.జితేందర్ను నియమిస్తూ ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో నిర్వహిస్తున్న ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ద్వారా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వివిధ కంపెనీల్లో ఉద్యోగ కల్పన చేపట్టేందుకు ఈప్లేస్మెంట్ సెల్ అధికారి విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ నియమాక ఉత్తర్వులను జితేందర్కు అందించి అభినందించారు. కోటగుళ్లలో పూజలు గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కోటగుళ్ల సందర్శన ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, ఆలయ శిల్ప సంపద అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు. -
రైలు ఢీకొని ట్రాన్స్జెండర్ దుర్మరణం
ఖిలా వరంగల్: పట్టాలు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందింది. ఈఘటన ఆదివారం వరంగల్ చింతల్ ప్లైఓవర్ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన ట్రాన్స్జెండర్ మిరియాల ఐశ్వర్య (35) వ్యక్తిగత పని నిమిత్తం చింతల్కు వచ్చింది. అనంతరం మైసమ్మ ఆలయ సమీపాన పట్టాలు దాటి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో ఎంజీఎం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. వరంగల్ రైల్వే జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు శవ పంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలి తల్లి బొందమ్మకు ఐశ్వర్య మృతదేహం అప్పగించారు. -
కాళేశ్వరానికి పెరిగిన భక్తులు
● బస్సులు సమకూర్చిన అధికారులు ● నేడు భక్తుల రద్దీ పెరిగే అవకాశంహన్మకొండ: సరస్వతీనది పుష్కరాలు ముగింపు సమీపిస్తుండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్టీసీకి భక్తులు ఒక్కసారిగా పెరిగారు. ఉదయం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్తో పాటు వరంగల్ రీజియన్లోని ఇతర బస్ స్టేషన్లు భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి.అధికారులు అప్పటికప్పుడు బస్సులు సమకూర్చి భక్తులను చేరవేశారు. సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 15 నుంచి 24 వరకు 5574 ట్రిప్పుల ద్వారా 3,30,218 భక్తులను చేరవేశారు. వివిధ బస్ స్టేషన్ల నుంచి కాళేశ్వరానికి 3,347 ట్రిప్పుల ద్వారా 1,70,523 మందిని చేరవేయగా, తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి వివిధ బస్ స్టేషన్లకు 2,227 ట్రిప్పుల ద్వారా 1,59,695 మంది భక్తులను చేరవేశారు. సరస్వతి పుష్కరాలకు తరలిన భక్తుల సంఖ్య తేదీ కాళేశ్వరం వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణమైన భక్తులు ట్రిప్పులు భక్తులు ట్రిప్పులు భక్తులు 15న 123 4,198 117 3,287 16న 238 10,002 219 8,805 17న 259 12,324 240 9,869 18న 376 18,838 367 18,608 19న 310 15,152 307 14,474 20న 266 11,235 257 10,847 21న 374 19,028 359 17,996 22న 362 19,450 361 17,773 23న 445 24,786 434 24,971 24న 594 35,510 565 33,065భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. డి.విజయభాను ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ -
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
సౌధామిని.. పుష్కర మణి! ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే గోదావరికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని నదికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. – వివరాలు, ఫొటోలు: 8లోu -
ఏడు కిలోమీటర్ల దూరంగా...
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సర్వసతీనది పుష్కరాల నేపథ్యంలో శనివారం పదో రోజు భక్తుల వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. మహారాష్ట్ర వైపు నుంచి గోదావరిఖని, మంచిర్యాల భక్తుల సంఖ్య పెరగడంతో హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రైవేట్ వాహనాలను అన్నారం క్రాస్ నుంచి కాళేశ్వరానికి వన్ వేలో తరలించారు. ఉదయం 11 గంటల నుంచే సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో మద్దులపల్లి–పుసుకుపల్లి గ్రామాల మధ్య రెండు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. వాహనాల సంఖ్య పెరగడంతో నేరుగా ఎస్పీ కిరణ్ఖరే బైక్పై తిరుగుతూ కాళేశ్వరం నుంచి పుసుకుపల్లి, మద్దులపల్లి, అన్నారం మీదా అన్నారం క్రాస్ వరకు ట్రాఫిక్ రాకపోకలు, నియంత్రణను పరిశీలిస్తూ సిబ్బంది సూచనలు చేశారు. 7కిలో మీటర్ల దూరంగా అడవిలో హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి నడుకుంటూ వెళ్లారు. భక్తులను ఇబ్బందులకు చూడలేక పోలీసులు అటువైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులు, వ్యాన్లను ఆపి ఎక్కించి పుష్కర ఘాట్కు తరలించారు. ఆటోచార్జీ ఒక్కరికి రూ.100, భక్తుల మండిపాటు.. అడవిలో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడంతో భక్తులు అంత దూరం నడవలేక ఆటోల్లో ప్రయాణించారు. ఆటో యజమానులు ఒక్కొక్కరి నుంచి చార్జీ రూ.100 వరకు వసూళ్లు చేశారు. దీంతో భక్తులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. రోజు వర్షంతో ఇబ్బందులు.. ప్రతీ రోజు కాళేశ్వరంలో వర్షం కురుస్తుండడంతో సరస్వతి ఘాట్ నుంచి ముక్తీశ్వర ఆలయం వరకు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు పూర్తిగా బురదమయం కావడంతో వాహనాలు పార్క్ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ సవాల్గా మారింది. పుష్కర ఘాట్ సమీపంలో పార్కింగ్ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అడవిలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయకతప్ప లేదు. తిరుగు ప్రయాణానికి భక్తుల అవస్థలు.. బస్సుల కోసం పడిగాపులు.. కాళేశ్వరం సరస్వతీనది పుష్కరాలకు పదో రోజు హాజరైన భక్తులు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల లేక ఇబ్బందులు పడ్డారు. శనివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. కాళేశ్వరానికి ఉదయం 6గంటల నుంచే రద్దీ పెరిగింది. తిరుగు ప్రయాణానికి కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్కు మధ్యాహ్నం 2గంటల నుంచే అధిక సంఖ్యలో చేరుకున్నారు. హనుమకొండ, భూపాలపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల బస్సుల కోసం ఎదురుచుశారు. అదనపు టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలోనే కూర్చుకున్నారు. బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పలుమార్లు అధికారులను ఆదేశించారు. అయినా ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనట్లు కనిపిస్తోంది.కాళేశ్వరం పుష్కరాల పార్కింగ్ పాయింట్ ఏర్పాటు అక్కడి నుంచి వచ్చేందుకు భక్తుల అవస్థలు వాహనాలను దారి మళ్లించినా నియంత్రణ కాని ట్రాఫిక్ నేరుగా రంగంలోకి దిగిన ఎస్పీ.. -
డిగ్రీ ఇయర్వైజ్ పరీక్షల ఫలితాల వెల్లడి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధి లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సు ల బీఏ, బీకాం, బీబీఏ, బీఎసీ కోర్సుల (ఇయర్వైజ్ బ్యాక్లాగ్స్) మొదటి, ద్వితీయ, ఫైనలియర్ పరీక్ష ల ఫలితాలను శనివారం వీసీ కె.ప్రతాప్రెడ్డి.. రిజి స్ట్రార్ వి.రామచద్రంతో కలిసి విడుదల చేశారు. మొత్తం 1,832మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా అందులో1,370మంది (74.38శాతం)ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. ఈ ఫలితాలను కేయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్లో చూడొచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, పి. వెంకటయ్య, క్యాంప్ ఆఫీసర్ ఎన్. సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ పట్టాలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేయూ క్యాంపస్: కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. పీహెచ్డీ పొందిన అభ్యర్థులు స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాలు పొందాలనుకునే వారు రూ. వెయ్యి చొప్పు న యూనివర్సిటీకి ఆన్లైన్లో ఫీజు చెల్లించి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కేయూఆన్లైన్.కో.ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేంద ర్ శనివారం తెలిపారు. కేయూలో 2020 జనవరి 1 నుంచి 2025 మే 31వరకు పీహెచ్డీ పొందిన అ భ్యర్థులు 573 మంది ఉన్నారు. ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మసీ, ‘లా’, ఇంజనీరింగ్ కోర్సుల్లో పీహెచ్డీ పూర్తిచేసి న అభ్యర్థులు పట్టాలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చే సుకోవాలన్నారు. కాగా,2016, 2017, 2018, 201 9, 2020, 2021 సంవత్సరాల్లో వివిధ కోర్సుల్లో గోల్డ్మెడల్స్ సాధించిన 564 మందికి కూడా స్నాతకో త్సవంలో గోల్డ్మెడల్స్ ప్రదానం చేస్తారన్నారు. -
లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు అందజేత
ములుగు: లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు శనివారం ఎస్పీ శబరీశ్ రివార్డులు అందజేశారు. మణుగూరు ఎల్ఎస్జీ సభ్యురాలు, ఛత్తీస్గఢ్లోని ఊసూరు పీఎస్ పరిధి మలంపేటకు చెందిన మడవి మంగిలి అలియాస్ నవ్యకు రూ. లక్ష, మిలిషీయా సభ్యుడు, ఛత్తీస్గఢ్లోని ఊసూరు పీఎస్ పరిధి కొత్తపల్లికి చెందిన దూది జయరామ్కు రూ. 25 వేల రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాటాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సరెండర్ పాలసీ అమలు చేస్తోందన్నారు. ఆ పాలసీ ప్రకారం లొంగిపోయిన వారికి రివార్డు, వైద్య చికిత్సతో పాటు పునరావాస చర్యలు కల్పిస్తోందన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నూతన విజయ డెయిరీ ఏర్పాటుకు కృషి ● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రూ.25 కోట్లతో నూతన విజయ డెయిరీ నిర్మాణం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులందరం సీఎం రేవంత్రెడ్డిని కలిసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ ములుగురోడ్ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్ యూనిట్లో శనివారం నూతనంగా రూపొందించిన పాలు, పెరుగు నూతన ప్యాకింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై కొత్త ప్యాకింగ్లను విడుదల చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ అంటేనే నమ్మకం అన్నారు. కార్యక్రమంలో డెయిరీ జీఎంలు మల్లయ్య, మధుసూదన్రావు, రీజనల్ సేల్స్ మేనేజర్ ధన్రాజ్, డెయిరీ వరంగల్, జనగామ డిప్యూటీ డైరెక్టర్లు శ్రవణ్కుమార్, సత్యనారాయణ, జూనియర్ మేనేజర్ అశోక్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసం.. ● రూ.1.31 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● క్రెడిట్ కార్డులు ఇప్పిస్తే కమీషన్ ఇస్తామని మోసం.. మహబూబాబాద్ రూరల్ : క్రెడిట్ కార్డులు ఇప్పిస్తే కమీషన్ ఇప్పిస్తామనే మాటలు విన్న ఓ వ్యక్తి.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. రూ.1.31 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపిక శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రూరల్ పీఎస్ పరిధిలోని గాంధీపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జిలానీ సెల్ ఫోన్కు ఈనెల 5వ తేదీన ఓ మెస్సేజ్ వచ్చింది. అవతలి వ్యక్తులు క్రెడిట్ కార్డులు ఎవరికై నా అవసరం ఉంటే ఇప్పించండి మీకు కమీషన్ ఇస్తామని సమాచారం పంపించారు. నమ్మిన జిలానీ వాళ్లు పంపిన స్కానర్కు ఈ నెల 5వ తేదీన మొదట రూ.40 వేలు బదిలీ చేశాడు. మళ్లీ అదే రోజున ఒకసారి రూ.48 వేలు, తెల్లవారురోజున మరోసారి రూ.28 వేలు, అనంతరం రూ.15 వేలు, మొత్తం రూ.1.31 లక్షలు నగదు బదిలీ చేశాడు. రెండుమూడు రోజల అనంతరం తనకు స్కానర్ పంపిన వ్యక్తులకు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. దీంతో లబోదిమంటూ అదే రోజు సైబర్ క్రైమ్ 1930 నంబర్కు ఫిర్యాదు చేశాడు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై దీపిక పేర్కొన్నారు. -
సమగ్ర కీటక నివారణపై కేవీకేలో శిక్షణ
మామునూరు: మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ములుగు జిల్లాకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఖరీఫ్ పంటల్లో సమగ్ర కీటక వ్యాధి నివారణ (ఐపీడీఎం) పై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై ఐపీడీఎం సిద్ధాంతాలు, పద్ధతులు, రసాయనాల చట్టాలు, నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం మల్చింగ్ యూనిట్ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. అక్కడ కూరగాయల పంటల్లో ప్రధాన కీటకాలు, వ్యాధులను గుర్తించడం, వాటి నిర్వహణ పద్ధతుల గురించి వివరించారు. జె.సాయి కిరణ్ అజొల్లా తయారీ, పశువులకు ఇచ్చే ఆహార నియమాలు, అనువైన మేత గురించి కేవీకేలోని డెమో యూనిట్లలో వివరించగా.. డాక్టర్ గణేశ్ చేపల పెంపకం, వాటి నీటి, ఆహారం, ఆరోగ్య నిర్వహణ గురించి వివరించారు. కార్యక్రమంలో డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
నల్లబెల్లి : పెళ్లికి వెళ్లొస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన భూస కుమార్ (40), పెండ్లి రాజు ద్విచక్రవాహనంపై నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు ఒల్లెనర్సయ్యపల్లిలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక పూర్తయిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపునకు వెళ్తున్న లారీ రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కుమార్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు గాయాలుకావడంతో స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ఒకరి మృతి.. మరొకరికి గాయాలు -
పాలిసెట్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–25 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో 1,554 మంది అభ్యర్థులకు 1,331 మంది (85.65శాతం) ఉత్తీర్ణత సాఽధించినట్లు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లాలో పాలిటెక్నిక్ ఎంపీసీ స్ట్రీమ్లో బాలురు 3,374 మంది పాలిసెట్కు హాజరుకాగా.. వారిలో 2,742 మంది (81.27 శాతం), బాలికలు 2,875 మంది హాజరుకాగా 2,478 మంది (86.19 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో బాలురు, బాలికలు కలిపి 481 మందికి 428 మంది (88.90 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లాలో బాలురు, బాలికలు కలిపి మొత్తం 668 మందికి 551 మంది(82.49శాతం) ఉత్తీర్ణత సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 824 మంది అభ్యర్థుకు 683 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.89 శాతం) సాధించారు. జనగామ జిల్లాలో 1,343 మంది అభ్యర్థులకు 1,070 మంది (79.67శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. జిల్లాలో ఉత్తమ ర్యాంకులు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల ఉపేందర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు షణ్ముక ఎంపీసీ విభాగంలో 75, ఎంబైపీసీ విభాగంలో 83వ ర్యాంకు సాధించాడు. అలాగే గంజి వెంకటనారాయణ, జ్యోతి దంపతుల కుమార్తె లక్ష్మీతనుజ ఎంపీసీ గ్రూప్లో 230, ఎంబైపీసీలో 54వ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. ఈ మేరకు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు పలువురు అభినందించారు. జిల్లాలో 85.65శాతం ఉత్తీర్ణత -
భ్రూణహత్యలు నివారించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలో భ్రూణహత్యల నివారణకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం, జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ పై సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉందని, అబార్షన్ రేటు ఎక్కువగా ఉందన్నారు. ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్దంగా లింగ నిష్పత్తి జరిగిన, అబార్షన్ చేసిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, జీపీ నగేష్, డాక్టర్ మీనాక్షి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాహిని, కౌన్సిలర్ రమేష్, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, హెచ్ఈ కేవీ రాజు, లోక్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, అరుణ్, మనోహర్, అనిల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ -
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా నుంచి సీరోలు మండలం చిలుకొయ్యలపాడు వరకు రూ.3.75 కోట్లతో నిర్మిస్తున్న 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని రాకాసితండా, చిలుకొయ్యలపాడు మధ్య రోడ్డు నిర్మాణంతో రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీకి చెందిన బ్రోచర్ను నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్రెడ్డి, నాయకులు ఊడ్గుల వీరన్న, లక్ష్మినారాయణ, బోడ రమేష్, వేల్పుల శ్రీను, బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపు యాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ -
రోడ్డు సదుపాయం కల్పించాలి
వీసీలో మంత్రి సీతక్క మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం నుంచి దుబ్బతండాకు రోడ్డు సదుపాయం కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల అటవీ సమస్యలు, పర్యావరణ తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీసీ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాట్లాడారు. వీసీలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కె.వీర బ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యూనిఫాం అందజేతకు సిద్ధం మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు సిద్ధం చేస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మధుసూదన్ రాజు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం (బి) జీపీ పరిధిలోని జిల్లెళ్లగూడెం గ్రామంలో స్కూల్ యూనిఫాం కుట్టు శిక్షణ కేంద్రాన్ని డీఆర్డీఓ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. త్వరగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు పూర్తిచేసి పాఠశాలలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం తిలక్, సీసీ రూపాదేవి, వీఓఏ శశికళ, కుట్టు శిక్షణ కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. గార్ల రైల్వేగేటు ఓపెన్ గార్ల: గార్ల– డోర్నకల్ మధ్య గల రైల్వేగేటును శనివారం రైల్వే ఉన్నతాధికారులు ఓపెన్ చేశారు. గార్ల నుంచి డోర్నకల్ మధ్యలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాల్వ రైల్వే ట్రాక్ కింద నుంచి తీస్తున్నందున గత 2 నెలల నుంచి రైల్వే గేటును రైల్వే అధికారులు మూసివేశారు. దీంతో ఖమ్మం నుంచి గార్లకు వచ్చే వాహనదారులు, ఆర్టీసీ ప్రయాణికులు బుద్దారం నుంచి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ కోసం పక్కనే ఆర్అండ్బీ రహదారి తవ్వడంతో కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంతో రైల్వే అధికారులు రైల్వేగేటును ఓపెన్ చేశారు. దీంతో రెండు మండలాల ప్రజలకు ఇబ్బందులు తొలగినట్లయింది. రైల్వే ఉన్నతాధికారులు డీఎన్ దినకరన్, ఏఎన్ రమేష్బాబు, ఐఓడబ్ల్యూ అఖిల్, రైల్వేబోర్డు కమిటీ సభ్యులు ఖాదర్బాబా, జర్పుల లచ్చిరాంనాయక్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 2017 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఉన్నతి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాక్విలిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యంపై 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యగల వారు అర్హులన్నారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు 9704550189 ఫోన్ నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. రైళ్ల రద్దుతో ఇబ్బందులుకేసముద్రం: మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో థర్డ్లైన్ అనుసంధాన పనుల్లో భాగంగా సింగరే ణి, శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్ రైళ్లను ర ద్దు చేసి, కాకతీయ ఎక్స్ప్రెస్ రైలును మాత్రమే నడుపుతున్నారు. దీంతో కేసముద్రం రైల్వేస్టేష న్ శనివారం కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందు కు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, తాళ్లపూసపల్లి, కేసముద్రం రైల్వే స్టేషన్లలో కాకతీయ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉండటం, ఉదయం అప్లైన్లో ప్రయాణించే ప్ర యాణికులు ఆయా రైల్వేస్టేషన్లలో ఎక్కడంతో బోగీలన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయా యి. ఈ క్రమంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో ప్ర యాణికులంతా రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ప్లాట్ఫాంపైనే ఉ న్నారు. అలాగే పలు రైళ్లకు కేసముద్రం రైల్వే స్టే షన్లో హాల్టింగ్ ఉండటంతో మహబూబా బాద్లో దిగాల్సిన ప్రయాణికులు కేసముద్రంలో దిగి బస్సులు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానా నికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. -
నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం
మహబూబాబాద్ అర్బన్: గ్రామ పాలన అధికారి పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షకు 10,954 పోస్టులకు గాను జిల్లా నుంచి 152 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి జేఎన్టీయూహెచ్కు తరలించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిరాక్స్ షాపులు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, ఏఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి మహబూబాబాద్: గ్రామ పాలన అధికారుల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గ్రామ పరిపాలన అధికారుల పరీక్షల నిర్వాహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో హాజరుకానున్న152 మంది అభ్యర్థులు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
‘ఆడ’నే చిదిమేస్తున్నారు!
సాక్షి, మహబూబాబాద్: ఆడ, మగ ఇద్దరు ఉంటేనే సృష్టి.. వంటింటి స్థాయి నుంచి దేశ సరిహద్దుల్లో కాపలా వరకు శత్రు దేశాన్ని గడగడలాడించే శక్తియుక్తులకు భారత మహిళలు నిదర్శనమని ఇటీవల ఆపరేషన్ సిందూర్తో రుజువు చేశారు. ఇంత జరిగినా సమాజంలో ఆడవారంటే తక్కువ చూపు పోవడం లేదు. ఆడపిల్లలు పుడుతున్నారని తెలియగానే తల్లి గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకోవడం బాధాకరం. ఇందుకు నిదర్శనం పురుషుల నిష్పత్తితో పోలిస్తే సీ్త్రల నిష్పత్తి రాష్ట్రంలోనే మానుకోట కింది స్థాయికి దిగజారడం. అయితే ఈ పాపపు పనులు చేసే వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటున్నానే ప్రచారం జిల్లాకు తలవంపులు తెచ్చేలా ఉంది. ఇక్కడ ఇది సహజమే.. లింగనిర్ధారణ పరీక్షలు, గర్భవిచ్ఛిత్తి ఇతర ప్రాంతాల్లో అబ్బో అనే విషయాలు అయితే మహబూబాబాద్ జిల్లాలో సహజమే అన్నట్లు పేరుంది. గతంలో తొర్రూరు పట్టణంలోని ఓ ఆస్పత్రిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న విషయం బట్టబయలు కావడంతో ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. కురవి మండలంలో ఓ ఆర్ఎంపీ ఈ పాపానికి ఒడిగడుతున్న విషయంపై కేసు అయ్యింది. నెల్లికుదురు మండలంలో మొబైల్ వాహనంలో స్కానింగ్ మిషన్ తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో తొర్రూరు పట్టణంలో వరుస సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో మూడురోజుల క్రితం జరిగిన సంఘటనను అధికారులు స్వయంగా చూశారు. ముగ్గురిపై కేసు పెట్టినట్లు చె ప్పారు. కానీ ఇప్పటివరకు ఆయా ఆస్పత్రులపై చ ర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని పీసీపీఎన్డీటీ సమావేశంలో బాధ్యులపై చ ర్య తీసుకోవాలని ముక్తకంఠంతో చెప్పినట్లు తెలి సింది. ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో చివరి స్థానం.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో లింగ వ్యత్యాసంలో జిల్లా చివరిస్థానం(33)లో ఉంది. వెయ్యిమంది పురుషులకు గతంలో రూరల్ ఏరియాల్లో 996 మంది, అర్బన్ ఏరియాల్లో 1,035 మంది సీ్త్రలు సగటున 903 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో లింగ నిష్పత్తి భారతదేశంలో 894, రాష్ట్రంలో 879 ఉండగా రాష్ట్రంలో అతి తక్కువగా మానుకోట జిల్లాలో 836 ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 60శాతానికి పైగా జనాభా గిరిజన, ఆదివాసీలు ఉండటం, అక్షరాస్యత తక్కువగా ఉండటంతో మగ సంతానం కావాలనే ఆలోచనతో ఆడ, మగ అనే పరీక్షలు గర్భంలోనే గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా విచ్ఛిన్నం చేయడమే మహిళల జనాభా తగ్గుదలకు కారణమని విమర్శలు వస్తున్నాయి. విచారణ జరుగుతోంది.. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, భ్రూణహత్యలకు చేయడం చట్టరీత్య నేరం. ఎక్కడ జరిగినా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. మహబూబాబాద్లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవిరాథోడ్, జిల్లా వైద్యాధికారి కఠినంగా శిక్షించాలి జిల్లాలో వరుసగా భ్రూణహత్యల సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో పురుషుల జనాభాతో పోలిస్తే సీ్త్ర జనాభా తక్కువగా ఉంది. ఇందుకు కారణం లింగనిర్ధారణ, అబార్షన్లు. ఈ పాపపు పనికి ఒడిగడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. – నాగవాణి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భ్రూణహత్యల కేంద్రంగా మానుకోట గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికే.. వరుస సంఘటనలతో బట్టబయలు మొక్కుబడిగా అధికారుల తనిఖీలు కిందికి దిగజారిన మహిళల నిష్పత్తిమహిళల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ.. ప్రమాదకరంగా మారిందని జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గడంపై నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ సీరియస్గా పరిగణించింది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ప లు ఆస్పత్రులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ల నడుస్తున్నాయ ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంత జరిగినా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడాహుడీ చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరిపాటిగా మారుతుంది. ఇక్కడ వణుకుజణుకు లేకుండా భ్రూణ హత్యలు చేస్తున్న విషయం ప్రచారం కావడంతో వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చి గు ట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
ట్రాలీ అడుగును అరలుగా మార్చి..
సాక్షి, వరంగల్ : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అడవి అన్నవరం గ్రామం నుంచి హైదరాబాద్కు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో అరలుగా(చిన్నపాటి గదుల్లా) తయారుచేసి అందులో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లని తరలిస్తున్న నలుగురు నిందితులను వరంగల్ యాంటి నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1908 ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ కె.సైదులు, ఇన్స్పెక్టర్ రవీందర్ నేతృత్వంలో 17 మంది సభ్యుల బృందం వరంగల్ ఉర్సుగుట్ట జంక్షన్లో నిఘా పెట్టి ముందు ఎస్కార్ట్గా వస్తున్న స్విఫ్ట్ కారుతో పాటు గంజాయితో వస్తున్న ట్రాక్టర్ను ఆపారు. తనిఖీ చేస్తే రూ.1,05,38,000ల విలువ చేసే 210 కిలోల 760 గ్రాములు (105 ప్యాకెట్లు) దొరికాయి. నలుగురు నిందితుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ములుగురోడ్డులోని వరంగల్ యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కె.సైదులు మీడియాకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రూ.పది వేలకు ఆశపడి.. 400 కిలోమీటర్లకు పైగా నడిపి.. ఏపీలోని అడవి అన్నవరానికి చెందిన తల్లిబాబు, నర్సీపట్నానికి చెందిన గోవిందమ్మ గంజాయి రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన గుగులోత్ భాస్కర్, కంబాలపల్లి గ్రామం పూరి తండాకు చెందిన కొర్ర వినోద్ కుమార్కు తల్లిబాబుతో పరిచయం ఏర్పడింది. అప్పటికే నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగేడు గ్రామానికి చెందిన కేతావత్ రాము నాయక్కు గుగులోతు భాస్కర్ పరిచయం ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు ప్లాన్ వేశారు. ఇందుకోసం రాము నాయక్ నెలన్నర క్రితం రూ1.60 లక్షలకు ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. కిలో గంజాయి రూ.3,500లకు తల్లిబాబు, గోవిందమ్మ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్లోని శ్రీకాంత్కు కిలోకు రూ.పదివేల చొప్పున అమ్మేందుకు ట్రాక్టర్ ట్రాలీ కింది భాగాన అరలుగా తయారుచేసి 105 ప్యాకెట్లను అమర్చి మూడ్రోజుల క్రితం అన్నవరం నుంచి బయలుదేరాడు. అయితే ఈ లోడ్ను హైదరాబాద్కు చేరవేస్తే రూ.10వేలు ఇస్తామని చెప్పడంతో అనకాపల్లి జిల్లా నీతవరం వలసంపేటకు చెందిన విరోధుల శీను ట్రాక్టర్ డ్రైవర్గా ఒప్పుకున్నాడు. సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించిన ట్రాక్టర్లో ఏమీ లేకపోవడంతో ఎక్కడా చెక్ పోస్టుల వద్ద పోలీసులకు అనుమానం రాలేదు. ఈ ట్రాక్టర్కు ముందు భాస్కర్ స్నేహితుడి కారు పై లటింగ్ ఉపయోగించారు. టోల్ ఫ్రీ నంబర్ 190 8కు సమాచారం రావడంతో అప్రమత్తమైన వరంగల్ నార్కొటిక్ పోలీసులు ఉర్సుగుట్ట జంక్షన్ వద్ద భాస్కర్, రాము, వినోద్ కుమార్, విరోధుల శ్రీను ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్సైలు శ్రీ కాంత్, రాజు, మొగిలి, హెడ్ కానిస్టేబుళ్లు రంగ య్య, నిరంజన్, సోమలింగం, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఏ.రా జు, కె.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, ఎం.రాజేష్, పి.విజ య్, రహీం, కుమారస్వామి, సంపత్, సతీష్, సునీ ల్లను డీఎస్పీ సైదులు అభినందించారు. అయితే ఈ మీడియా సమావేశానికి ప్రధాన నిందితుడు భాస్కర్ను తీసుకొస్తుండగా పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటనే అతడిని లోపలికి తీసుకెళ్లారు. 400 కిలోమీటర్లు.. 105 గంజాయి ప్యాకెట్లు 210 కిలోల 760 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు -
అప్పు అడిగినందుకు అంతమొందించారు
గూడూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జి.సూర్యప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీసు స్టేషన్లో శుక్రవారం మండలంలోని గుండెంగ శివారు పంతుల్య తండాకు చెందిన తేజావత్ భద్రు హత్య కేసు వివరాలను సీఐ వివరించారు. పంతుల్యతండాకు చెందిన భద్రు మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య నీల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం తండా సమీపంలోని వ్యవసాయ బావిలో భద్రు శవమై కనిపించగా, పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. కానీ అంతకు ముందే పంతుల్యా తండాకు చెందిన తేజావత్ వీరేందర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తనతో పాటు మరో ముగ్గురు తేజావత్ భద్రును చంపినట్లు నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వెంటనే విచారణ చేపట్టగా, భద్రు వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్న వీరేందర్ డబ్బులు అడుగుతున్నాడనే కోపంతో అదే తండాకు చెందిన తేజావత్ సురేష్కు చెప్పుకున్నాడు. గతంలో భద్రుపై కోపంతో ఉన్న సురేష్, వీరేందర్తో కలిసి పథకం పన్నారు. ఈక్రమంలో అదే తండాకు చెందిన తేజావత్ కిషన్, బాదావత్ ఈర్య వారికి సహకరించగా, మద్యం తాగిఉన్న భద్రు మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపామని, అనంతరం సమీపంలోని వ్యవసాయ బావిలో వేశామని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం హత్యకు పాల్పడిన తేజావత్ వీరేందర్, తేజావత్ కిషన్, తేజావత్ సురేష్, బాదావత్ ఈర్యలను రిమాండ్కు తరలించినట్లు సీఐ సూర్యప్రకాశ్ తెలిపారు. గూడూ రు ఎస్సై గిరిధర్రెడ్డి, కొత్తగూడ ఎస్సై కుషకుమార్, ట్రెయినీ ఎస్సై కోటేశ్వర్రావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. భద్రు హత్య కేసులో నిందితుల అరెస్ట్ -
సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించినట్లు శుక్రవారం స్థానిక రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి–పాట్నా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. పొడిగించిన రైళ్ల వివరాలు.. జూన్ 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి గురువారం కాజీపేట జంక్షన్కు 1:25గంటలకు చేరుకొని వెళ్తుంది. అలాగే చర్లపల్లి–పాట్నా (07256) వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం కాజీపేట జంక్షన్కు 23:00 గంటలకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళ, గురువారాల్లో కాజీపేట జంక్షన్కు 23:10 గంటలకు చేరుకొని వెళ్తుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. -
రైతులు ధైర్యంగా ఉండండి..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. లారీలు సమయానికి రాక కల్లాలోనే వరి ధాన్యం ఉంటుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎస్ఓ శ్రీనాథ్, డీఎం సివిల్ సప్లై అధికారి రాములు, డీసీఓ వాల్యానాయక్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు సన్న వడ్లను దింపుకునేలా చూడాలని కోరారు. లారీల కొరత లేకుండా చూసి, ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఆదేశించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రైతు ర్యాలీకి అనుమతిని పరిశీలించండి
● వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న రైతు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణ కోసం తెలంగాణ రైతు సంఘం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని వరంగల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. శాంతియుత ర్యాలీ, సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతు సంఘం నాయకుడు మోర్తాల చందర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ‘ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్లోని కార్మిక మైదానంనుంచి సాయి కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో 800 మంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆజంజాహీ మిల్లు మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిపై పలుమార్లు దరఖాస్తు చేసినా పోలీసులు ఎలాంటి నిర్ణయమూ చెప్పలేదు. అందుకే విధిలేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’ అని చెప్పారు. మరోవైపు కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) ఉంటే తప్ప ర్యాలీకి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కలెక్టర్ నుంచి ఎన్ఓసీ సమర్పించిన తర్వాత మే 17న సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని అనుమతిని పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. చట్టప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయండి నయీంనగర్ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాకలో జరుగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్, కల్వర్టు పనులను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అలాగే వరంగల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను, పరిసరాలను పరిశీలించి వర్షాకాలం సమీపిస్తుండటంతో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ముగ్గురిపై గృహ హింస కేసు మహబూబాబాద్ రూరల్: ఓ వివాహితను అదనపు కట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై గృహహింస చట్టం కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీటీఆర్ నగర్ కాలనీ చెందిన దుంప స్వప్నకు ఖమ్మం జిల్లా కేంద్రం శివారులోని మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన వంశీతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సమయంలో రూ.3లక్షలు కట్నంగా ఇచ్చారు. డబ్బులు సరిపోవటం లేదంటూ మరో రూ.5లక్షలు తేవాలంటూ స్వప్నను వంశీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలో ఆమె భర్త వంశీ, అత్తమామలు వెంకన్న అలివేలుపై చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్ కేసు నమోదు చేశారు. -
నిర్వాహకుల ఇష్టారాజ్యం!
డబ్బు, పరపతి ఉన్నవారికి కొనుగోలు కేంద్రాల్లో అందలం సాక్షి, మహబూబాబాద్: రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనీ, పరపతి ఉన్నవారికే అనుకూలంగా మారాయి. కేంద్రాల నిర్వాహకులు పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయడం.. వారికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అమాయక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. పలు కొనుగోలు కేంద్రాల్లో.. జిల్లాలోని పలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్య ంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తా 40.70 కేజీల తూకం వేయాలి. కానీ 41.50కేజీల తూకం పెడుతున్నారు. అయితే ప్రత్యక్షంగా చూసిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా రైతులు మిల్లులకు తీసుకెళ్లిన ధాన్యం తూకంలో కూడా తేడా వచ్చిందని, తక్కువ తూకం వేసి మోసం చేశారని రైతులు ఆందోళనకు దిగిన సంఘటనలు ఉన్నాయి. వీటితోపాటు, పలువురు నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మ కై ్క కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేకున్నా తెచ్చినట్లు తక్పట్టీలు ఇచ్చి, మిల్లుకు తరలించినట్లు రికార్డులు చేసిన సంఘటనలు బయటపడ్డాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వరుస క్రమంలో కాంటాలు పెట్టించాలి. అదే క్రమంలో లారీల్లో లోడు వేయించాలి. కానీ కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్థానిక రాజకీయ నాయకులు, డబ్బులు ఆశచూపిన వారి ధాన్యం ముందుగా కాంటాలు పెట్టి లారీల్లో లోడు వేసి పంపించారని కొన్ని సెంటర్ల వద్ద రైతులు నిర్వాహకులను నిలదీసిన సంఘటనలు ఉన్నాయి. అమాయక రైతులు రోజుల తరబడి నిరీక్షణ వర్షంతో తడిసిన ధాన్యం, మళ్లీ ఆరబెట్టాలంటున్న అధికారులు పలు కేంద్రాల్లో అక్రమాలు -
రసాయన ఎరువుల వినియోగంతో భూసారానికి ముప్పు
● జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల గార్ల: రసాయన ఎరువులు, పురుగుమందులు అ ధికంగా వినియోగించడంతో భూసారం దెబ్బ తిని, నేలలు చౌడుబారి పంటల్లో దిగుబడులు తగ్గుతా యని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల సూ చించారు. శుక్రవారం గార్లలోని రైతువేదిక భవనంలో జరిగిన రైతు సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రియ ఎరువులు, జీలుగ సాగుతో భూసారం పెరగడంతో పాటు, భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ సదస్సులో మల్యాల శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, కిషోర్కుమార్, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ కావటి రామారావు, రాజు, ఏఈఓలు పాల్గొన్నారు. -
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీలతో కలిసి పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించి జిల్లాలో (152) మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, టౌన్ సిఐలు దేవేందర్, సర్వయ్య, ఏఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తికావాలి మహబూబాబాద్ రూరల్/కురవి:ఽ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, కురవి, సీరోలు మండలాల్లోని కురవి, కొత్తూరు(సీ), అయ్యగారిపల్లి, నేరడ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా రావాల్సిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్లోడ్ అయిన లారీలను అవసరం ఉన్న చోటకు వెంటనే పంపించాలన్నారు. హమాలీలను సిద్ధంగా ఉంచాలని, లారీ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సంబంధిత క్లస్టర్ సిబ్బంది సమన్వయంతో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు విజయ, పున్నం చందర్, చంద్రశేఖర్ ఉన్నారు. -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. ఇలా కాళేశ్వరానికి వచ్చిన వారిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. – మరిన్ని ఫొటోలు, వివరాలు10లోu -
మానుకోటలో అబార్షన్
ముగ్గురిపై కేసు నమోదు నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన అబార్షన్ ఘటనపై ‘గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్కు యత్నం’ అనే శీర్షికన ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైద్యఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ ఆదేశాల మేరకు అబార్షన్ ఘటనపై విచారణ ముమ్మరం చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవిరాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. సదరు మహిళా అబార్షన్కు కారణమైన కాంతి మోమోరియల్ ఆస్పత్రి నిర్వాహక వైద్యులు రామకృష్ణనాయక్, మహిళను అబార్షన్ కోసం తీసుకువచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు గణేష్, ఆమెకు స్కానింగ్ నిర్వహించిన నెక్కొండకు చెందిన యూఎస్జీ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా హాస్టల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు అర్హులైన బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారిణి ఓలేటి జ్యోతి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 13వ తేదీ వరకు పలు క్రీడా అంశాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్, జూన్ 10, 11 తేదీల్లో ఓయూ క్యాంపస్లో సైక్లింగ్, వెల్డ్రోమ్, హనుమకొండలో అథ్లెటిక్, జిమ్నాస్టిక్ ఎంపిక ఉంటుందన్నారు. స్టడీ సర్టిఫికెట్లు, కుల ఆదాయం, నివాసం, 5 పాస్ ఫొటోలతో ఆయా జిల్లాల్లో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని, అండర్ 14 నుంచి అండర్ 16 వరకు వయస్సుల వారీగా ఎంపికలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. నేటి నుంచి కేసముద్రంలో 17 రైళ్లకు హాల్టింగ్కేసముద్రం: కేసముద్రం రైల్వేస్టేషన్లో నేటి (శనివారం) నుంచి 17 రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాజీపేట–కొండపల్లి రైల్వే సెక్షన్ల మధ్య జరుగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా చేపట్టిన నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్తో మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్టింగ్ తొలగించి, కేసముద్రంలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈనెల 24 (శనివారం) నుండి 26వ తేదీ వరకు మణుగూరు–సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (12746), మచిలీపట్నం–బీదర్ (12749), కాకినాడ పోర్ట్–లింగంపల్లి (12737), గూడూరు–సికింద్రాబాద్ (12709), తిరుపతి–సికింద్రాబాద్ (12763), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), విశాఖపట్నం– మహబూబ్నగర్ (12861), తాంబరం–హైదరాబాద్ (12759), భువనేశ్వర్–ముంబాయి సీఎస్టీ (11020), షాలీమార్–హైదరాబాద్ (18045), ఈనెల 26న కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ(17206), 27న బెంగళూరు–లాల్ఖాన్(05073), కోయంబత్తూర్–ధన్బాద్ (03680), మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ (17208), 24న తిరుపతి–కరీంనగర్ (12761), ఈనెల 26, 27వ తేదీల్లో నర్సాపూర్–నాగర్సోల్ (12787), 25 నుంచి 27 వరకు చైన్నె సెంట్రల్– అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ (12656)లకు హాల్టింగ్ కల్పించనున్నట్లు తెలిపారు. ఎంబీఏ పరీక్షల పరిశీలన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్లోని కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంటు విభాగం పరీక్షకేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయనవెంట కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు. -
జవాన్కు ఘనసన్మానం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్లో పాల్గొని వచ్చిన జవాన్ షేక్ అజహర్ను ఎస్పీ సుధీ ర్ రాంనాథ్ కేకన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ జవాన్ కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జవాన్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్లో పాల్గొనడం జిల్లా వాసిగా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, టౌన్ సీఐ దేవేందర్, ఏఆర్ ఆర్ఐ భాస్కర్, మరిపెడ ఎస్సై సతీష్, జవాన్ అజహర్ తల్లిదండ్రులు ఖాసీం, యాకూబ్ బీ, నాగుల మీరా, సోనీ తదితరులు పాల్గొన్నారు. -
ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు
పాలకుర్తి: ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిందనే కారణంతో పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2017లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీరెడ్డి స్వదేశంలో భూమి ఎలా కొనుగోలు చేస్తుందంటూ వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన దామోదర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 1న హైకోర్టులో జడ్జి సీవీ భాస్కర్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జూన్ 19 లోపు వివరణ ఇవ్వాలని ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్రెడ్డి దంపతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు రెవెన్యూ అధికారుల వివరణ కోరింది. గుర్తూరులో కొనుగోలు చేసిన 75 ఎకరాల భూమిలో ఝాన్సీరెడ్డి దంపతులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి పనులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చానీయాంశంగా మారింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి.. ఝాన్సీరెడ్డికి కోడలు కావడం గమనార్హం. పుష్కరాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిభూపాలపల్లి రూరల్: పుష్కరాలకు వెళ్తున్న మహిళను బొగ్గు టిప్పర్(లారీ) ఢీకొట్టడంతో మృతిచెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మహాముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన జిల్లాల రాజమ్మ (65) కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లేందుకు మీనాజీపేట నుంచి బంధువుల కారులో భూపాలపల్లికి చేరుకొని అంబేడ్కర్ సెంటర్లో దిగింది. అక్కడనుంచి బస్టాండ్ వైపునకు సిగ్నల్ క్రాస్ చేస్తున్న క్రమంలో తాడిచెర్ల నుంచి జెన్కోకు బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్.. రాజమ్మను ఢీకొని నడుము భాగంపైనుంచి వెళ్లింది. దీంతో అపస్మారకస్థితిలో ఉన్న రాజమ్మను స్థానికులు 108 ద్వారా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రాజమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి (వరుసకు) కుమారుడు రాంచంద్రం ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. -
అన్నారం బరాజ్ను పరిశీలించిన ఈఎన్సీ జనరల్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బరాజ్ను ఇరిగేషన్శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్కుమార్ గురువారం పరిశీలించారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదిక ప్రకారం బరాజ్లో కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, డౌస్ సీమ్, అప్ సీమ్లో పేరుకుపోయిన ఇసుకను తొలిగించి పరీక్షలు ప్రారంబించాలని ఆదేశించారు. ఓఅండ్ఎం నిర్వహణ పూర్తయిన నేపథ్యంలో బరాజ్ను పూర్తిస్థాయిలో పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట సీఈ సుధాకర్రెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ యాదగిరి, ఇంజనీర్లు ఉన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు..
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కర స్నానానికి వస్తూ ఇద్దరు భక్తులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. జయశంకర్భూపాలపల్లి కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో కమలాపూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి 353(సి)పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు భక్తులతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మిగిలినవారు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కుమ్మరిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన గుంటుక నరసింహ, ఆయన భార్య సంధ్య, అక్క శ్రీరాముల శోభ, చెల్లి పాల రజిత(28), శోభ కుమారుడు విష్ణు(21), కుటుంబ సభ్యులు మణెమ్మ, వివన్, శాన్విత, విశృత్, మోక్షిత్లు ఆటోలో కాళేశ్వరం పుష్కర స్నానం కోసం బయల్దేరారు. అదేసమయంలో హైదరాబాద్కు చెందిన ఐదుగురు భక్తులు పుష్కర స్నానం చేసి కారులో తిరుగుప్రయాణమయ్యారు. మేడిపల్లి అటవీ ప్రాంతంలో కమలాపూర్ క్రాస్ సమీపంలో కారు డ్రైవర్ విశ్వాంత్ అతివేగంతో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటో ఎగిరిపడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదకొండు మందికి గాయాలపాలయ్యారు. వీరిలో పాల రజిత, శ్రీరాముల విష్ణులకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా రజిత, విష్ణు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి సైతం తీవ్రగాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు అభినవ్, గీతారాథోడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలుముకున్న విషాదఛాయలు.. చిట్యాల: మేడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల మండలం కుమ్మరిపల్లికి చెందిన పాల రజిత, శ్రీరాముల విష్ణు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుంటకు సమ్మయ్య చిన్న కూతురు రజితకు వివాహం కాగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పుష్కర స్నానానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలనే ఆశతో రజిత బుధవారం గ్రామానికి వచ్చింది. అదే విధంగా సమ్మయ్య పెద్ద కూతురు శోభ కుమారుడైన శ్రీరాముల విష్ణు హనుమకొండలో బీ.టెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఇలా ప్రమాదంలో మృతిచెందారు. పుష్కరాలకు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరి మృతి, తొమ్మిది మందికి గాయాలు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఘటన -
అధిక సంఖ్యలో అర్జీలు.. క్షేత్రస్థాయి పరిశీలన..
భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సదస్సుల్లో అర్జీలు అధికసంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి వరంగల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈనెల 5 నుంచి 18 తేదీల వరకు సదస్సులు నిర్వహించారు. ఈఆరు మండలాల్లోని గ్రామాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు సాదాబైనామా, అసైన్ట్, వారసత్వ మార్పిడిలను ఎక్కువగా అడిగారు. భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, భూ హద్దుల సమస్య, పేర్లు సరిచేయడం, సర్వే నంబర్ల మిస్సింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. 19,655 అర్జీల్లో 8,339 సాదాబైనామా, 3,416 అసైన్డ్, 1,331 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడాల సవరణ కోసం 910 మంది అర్జీ పెట్టుకోగా.. మిగిలిన 5,659 దరఖాస్తులు వివిధ అంశాలపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేసిన అధికారులు, ఆవివరాలను భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా ఆరు మండలాల్లో 21 ప్రత్యేక బృందాలను నియమించగా.. వారు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్, రెవెన్యూ బందాలు భూములను పరిశీలించేందుకు వెళ్తున్నారు. పట్టాదారు పా సుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి, వెంటనే సరిచేస్తారు. ఈ భూసమస్యలను రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లలో సవరణ చేస్తారు. ఆరు మండలాల ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటి వారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు.జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా..హనుమకొండ 2,898వరంగల్ 3,197జేఎస్ భూపాలపల్లి 7,111జనగామ 1,068ములుగు 4,555మహబూబాబాద్ 826సాక్షిప్రతినిధి, వరంగల్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం(ఎం) (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్రిపోర్ట్’.పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి..● హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి.● వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు.● మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పదిరోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా సాదా బైనామా, భూ విస్తీర్ణంలో తేడా, అసైన్డ్ భూముల సమస్య, వారసత్వ మార్పిడిలో తేడాలు, ఇలా మొత్తం 826 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధికారులు రైతుల వద్దకు వెళ్లి పరిశీలించే పనిలో ఉన్నారు. సరైన అధారాలు చూపిస్తే జూన్ చివర వరకు సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.● జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.● ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.● జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు. -
ఆర్మీ జవాన్కు ఘన స్వాగతం
మహబూబాబాద్ రూరల్: ఆపరేషన్ సిందూర్లో విధులు నిర్వర్తించిన ఆర్మీ జవాన్ అజహర్కు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి ఘనస్వాగతం పలికారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అజహర్ను పూలమాలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్లో బయ్యారం మండలానికి చెందిన ఆర్మీ జవాన్ అజహర్ పాల్గొన్నారు. అక్కడ విధులు నిర్వర్తించి తన స్వగ్రామానికి చేరుకునేందుకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్కు ఆయన రాగా టౌన్ సీఐ దేవేందర్ ఘనస్వాగతం పలికి ఇంటికి సాగనంపారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, బాలల సంరక్షణ అధికారి నరేష్, నాగుల్ మీరా, పాండునాయక్, సోని తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కు చెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు
ఖిలా వరంగల్: ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్గా పునఃప్రారంభించారు. ఈసందర్భంగా వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ అధ్యక్షతన ప్రారంభోత్సవ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరై మాట్లాడారు. అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో స్టేషన్లు అభివృద్ధి చెందాయన్నారు. రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు జరుగుతున్నాయని, కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక హుంగులతో రానున్న 30 సంవత్సరాల్లో రైల్వేలను ఆధునికీకరించే విధానంలో వృద్దులు, దివ్యాంగులకు టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్స్, ఎస్కలేటర్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ కోసం భూమిని కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కళావైభవం ఉట్టిపడేలా స్టేషన్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వేస్టేషన్ను తీర్చిద్దిదడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లకు మాత్రమే కాకుండా అన్ని స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయాలని కోరారు. రూ.425 కోట్లతో చర్లపల్లి నిర్మాణం : ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సమపాళ్లలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.425 కోట్ల వ్యయంతో చర్లపల్లి టర్మినల్ను అత్యాధునిక హంగులతో నిర్మించినట్లు తెలిపారు. కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించాలి: ఎంపీ కడియం కావ్య కాకతీయుల కళలు ప్రతిభింబించేలా వరంగల్ రైల్వేస్టేషన్ నిర్మించడం అభినందనీయమన్నారు. అమృత్ భారత్ పథకం కింద కాజీపేట రైల్వేస్టేషన్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో ప్రారంభించుకుంటామన్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ప్రకటించాలని, రైల్వేశాఖ ద్వారా బస్స్టేషన్ నిర్మించాలని కోరారు. 103 స్టేషన్లు దేశానికి అంకితం: ఎంపీ డీకే అరుణ అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను మౌలిక సదుపాయాలు, సకల సౌకర్యాలు కల్పించి ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించుకొని దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. భద్రకాళి అమ్మవారి గీతం, సిందూర్ ప్రత్యేక గీతానికి సైనిక దుస్తుల్లో కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్గా పునఃప్రారంభించగా.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైల్వే అధికారులు ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, యశస్విని రెడ్డి, కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, ప్రేమేందర్రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్రావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, స్థానిక కార్పొరేటర్ చింతకాల అనిల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను వర్చువల్గా పునఃప్రారంభించిన ప్రధాని మోదీ హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం స్టేషన్ల ఆధునికీకరణ అభినందనీయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్రంలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించి ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అదే విధంగానే వరంగల్ నగరం అభివృద్ధి సాధించాలని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలుపుతున్న కాజీపేట జంక్షన్ను డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం తాత్సారం వీడి వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో శాంతి చర్చల కమిటీ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో జైసింగ్ రాథోడ్ అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మధ్య భారతదేశంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధంలో సామాన్య ప్రజలు, అమాయక ఆదివాసీలు చనిపోతున్నారన్నారు. రాజ్యం తరఫున పోలీసులు సైతం మరణించి మధ్య భారతమంతా నెత్తురోడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మారణహోమాన్ని గమనించిన శాంతి చర్చల కమిటీ చేసిన అభ్యర్థన మేరకు మావోయిస్టు పార్టీ కాల్పులు విరమణ చేసి శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిందన్నారు. కేంద్రం స్పందించకుండా దాడులను మరింత పెంచి సామాన్యులను సైతం చంపేస్తోందని, కాల్పుల విరమణ స్థితిలో ఉన్నవాళ్లను చుట్టుముట్టి చంపడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికై నా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం శాంతి చర్చల కమిటీ రాష్ట్ర సభ్యుడు సోమ రామ్మూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, చుంచు రాజేందర్, అనిక్ సిద్ధికి, చిల్ల రాజేంద్రప్రసాద్, బొట్ల భిక్షపతి, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయవాదులు అబ్దుల్ నబీ, పండుగ శ్రీనివాస్, ఆదినారాయణ, దొమ్మటి ప్రవీణ్ కుమార్, కొండ్ర నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్ర కుమార్ -
పుష్కర స్నానం.. పులకించిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు రోజురోజుకూ భారీగా తరలివస్తున్నారు. బుధవారం ఏడోరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కాళేశ్వరానికి తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించి, నదీమాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కాళేశ్వరాలయంలో కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఏడోరోజు లక్షకుపైగా... హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి రహదారి మీదుగా, పెద్దపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలివచ్చాయి. సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన గుండా మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. ఆరో రోజు తగ్గిన భక్తులు.. ఏడో రోజు రెట్టింపు సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. ప్రముఖుల పూజలు.. సరస్వతీనది పుష్కరాల్లో ప్రముఖులు స్నానం ఆచరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, రామగుండం సీపీ అంబర్కిశోర్ఝా, ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు పుష్కర స్నానం చేసి కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ దంపతులు కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. వర్షంతో ఇబ్బందులు.. రెండు రోజులుగా ఉక్కపోత, ఎండ తీవ్రతతో తల్ల డిల్లిన భక్తులకు బుధవారం సాయంత్రం గంట పాటు కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరో వైపు పుష్కరఘాట్లో పార్కింగ్ స్థలాలు బురదమయంగా మారాయి. గాలి దుమారానికి బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ అల్వాల్కు చెందిన ఉజ్వల్పై రేకు లేచి పడడంతో తీవ్రగాయమైంది. రక్తస్రావం కాగా వెంటనే అంబులెన్స్ ద్వారా మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ వివిధ రాష్ట్రాల నుంచి భారీగా రాక ఎమ్మెల్యేలు వినోద్, అనిరుధ్రెడ్డి, సీపీ అంబర్కిశోర్ఝా, ఎస్పీ శ్రీనివాసరావు పుణ్యస్నానాలు ఏడో రోజు లక్షకుపైగా తరలొచ్చిన జనం వర్షంతో చల్లబడిన వాతావరణం -
విత్తన చట్ట నియమాలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: వ్యాపారులు విత్తన చట్ట నియమ, నిబంధనలు పాటించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో డీఏఓ విజయనిర్మల ఆధ్వర్యంలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో కూడిన విత్తన టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని, అందుకే సీజన్ ప్రారంభానికి ముందు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. విత్తన వ్యాపారులు అన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని, నిల్వ, విక్రయ కేంద్రాల్లో రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. సమావేశంలో ఏఓ టెక్నికల్ జి.విజ్ఞాన్, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఎం మార్క్ఫెడ్ శ్యామ్, ఏడీఏలు విజయ్ చంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
విద్యుత్ షాక్తో వృద్ధురాలి మృతి
● ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘటన ● 13 రోజుల్లో మనుమరాలి పెళ్లి.. అంతలోనే విషాదం హసన్పర్తి: మనుమరాలి పెళ్లికి ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో విద్యుత్షాక్కు గురై ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హసన్పర్తి మండలం జయగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జయగిరికి చెందిన లింగాల నర్సమ్మ(60)కు ఇద్దరు కుమారులు మధు, చంద్రశేఖర్ సంతానం. మధు ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ.. ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందాడు. మధుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. మధు మృతి తర్వాత అతడి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం రాంపూర్ వెళ్లింది. వచ్చే నెల 4న మధు చిన్న కూతురు పెళ్లి జరుగనుంది. జయగిరిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఇంటిని ముస్తాబు చేయడానికి ప్రవీణ్ జయగిరి వచ్చాడు. బుధవారం నానమ్మ నర్సమ్మతో కలిసి ప్రవీణ్ ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో దండెంపై దుస్తులు ఆరేస్తున్న క్రమంలో నర్సమ్మ విద్యుత్ షాక్కు గురైంది. గమనించిన ప్రవీణ్ ఆమెను రక్షించడానికి యత్నించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు తెలిపారు. పిడుగుపాటుకు ఇద్దరి మృతి● మహబూబాబాద్ జిల్లాలో ఘటన కొత్తగూడ/గూడూరు: పిడుగుపాటుకు మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఓ గొర్రెలకాపరి, ఓ యువకుడు ఉన్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం ఓటాయికి చెందిన ఏశబోయిన చేరాలు(50) గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. రోజువారీగా గొర్రెలను మేపేందుకు బుధవారం కూడా గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా గొర్రెలను తోలుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో చేరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం సారయ్య కుమారుడు ప్రవీణ్కుమార్ (30) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లిన ప్రవీణ్.. వర్షం వస్తుండడంతో రోడ్డు పక్కన చెట్టు కింద నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
ఇస్రో నోడల్ సెంటర్ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత
కేయూ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఇస్రో –ఐఆర్ఎస్) డెహ్రడూన్ వరంగల్ పాంతీయ కోఆర్డినేటర్లుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజిక్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జితేందర్, డాక్టర్ అలేటి సరిత నియమితులయ్యా రు. ఈ మేరకు ఇస్రో నుంచి సమాచారం అందిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి బుధవారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత హ నుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఇస్రో ఈ కోర్సెస్కు సంబంధించి నోడల్ సెంటర్గా ఉందన్నారు. విద్యార్థులు ఈ కోర్సెస్ అవకాశాన్ని విని యోగించుకోవాలన్నారు. కాగా, డాక్టర్ జితేందర్, డాక్టర్ సరితను ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు. పీజీ సెమిస్టర్ల ఫలితాలు విడుదలవిద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (అటానమస్)లో ఈఏడాది ఏప్రిల్లో నిర్వహించిన పీజీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ల పరీక్షల్లో మొత్తం 85 శాతం, మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారని చంద్రమౌళి తెలిపారు. విద్యార్థినులు తమ ఫలితాలను సంబంధిత కాలేజీ వెబ్సైట్లోగాని లేదా కళాశాలలోని పరీక్షల విభాగంలో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు కె. శ్రీనివాస్, పి. రాజిరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్ బాబు, వివిధ విభాగాల అఽధిపతులు పాల్గొన్నారు. -
పుష్కరిణీ.. ప్రణామం!
ఆకాశం అక్షింతలేసినట్లుగా చిరు చినుకులు.. నిశ్శబ్దంగా నది పరుగులు.. కాళేశ్వరం వైపు భక్తుల అడుగులు. వెరసి త్రివేణి సంగమం భక్త జన సందోహమైంది. ఏడో రోజు బుధవారం సైతం భక్తుల ప్రవాహం కొనసాగింది. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అంతర్వాహిని సరస్వతి నదికి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్షమందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు.– మరిన్ని వివరాలు, ఫొటోలు 8లోuఏడో రోజు కాళేశ్వరానికి తరలివచ్చిన భక్తజనం సరస్వతి ఘాట్లో స్నానాలు, ముక్తీశ్వరుడి దర్శనం -
‘ఎల్సీ’ నిర్లక్ష్యంపై సీఎండీ అసహనం
హన్మకొండ : ఎల్సీ యాప్ వినియోగంలో నిర్లక్ష్యంపై విద్యుత్ ఇంజనీర్లు, ఆపరేటర్లపై టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈ, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఎల్సీ యాప్ నిర్వహణ, డ్యాష్బోర్డులో పారామీటర్ల నమో దు, విద్యుత్ అంతరాయాలపై సమీక్షించారు. విద్యుత్ ప్రమాదాలు తగ్గించేందుకు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రవేశ పెట్టిన ఎల్సీ యాప్పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా డ్యాష్ బోర్డులో ఎవరు ఏ పని చేస్తున్నారో నమోదు చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇక నుంచి అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, జీఎం శ్రీనివాస్, ఎస్ఈ లు, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు. డ్యాష్ బోర్డులో వివరాల నమోదులో అలసత్వంౖపై సీరియస్ -
భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
తరిగొప్పుల: తాము కొనుగోలు చేసిన భూమిని అమ్మకందారుడు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని దంపతులు శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం శివారు ఎన్యానాయక్తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లికి చెందిన జంగ రవి తరిగొప్పుల మండలం ఎన్యానాయక్తండాకు చెందిన ముడావత్ సంపత్నాయక్ వద్ద 2 సంవత్సరాల క్రితం 2 గుంటల భూమిని గుంటకు రూ.3.30 లక్షల చొప్పున కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సంపత్నాయక్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దీంతో రవి పెద్దమనుషులను ఆశ్రయించగా 2 గుంటలకు బదులు మరోచోట 8 గుంటల భూమి ఇవ్వాలని రెండు రోజుల క్రితం తీర్మానం చేశారు. సంపత్నాయక్ మరోచోట 8 గుంటల భూమికి హద్దులు చూపించగా ఆ భూమిని రవి మంగళవారం ట్రాక్టర్తో దున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ బుధవారం ఉదయం రవి తన భార్య, బిడ్డతో సంపత్నాయక్ ఇంటికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆ దంపతులను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలుకు కసరత్తు
● మొదటి విడతలో 1,235 మంది రైతుల ఎంపిక ● బోర్లు, పంపుసెట్, సౌర విద్యుత్ కల్పన ● భూ అనుకూలతను బట్టి పంటల సాగు ● కసరత్తు ప్రారంభించిన జిల్లా అధికారులు సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు పోడు భూము ల హక్కులను సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గిరిజన రైతులు భూములు సాగుచేసి లాభాల పంటలు పండించాలంటే నీటి వనరు కల్పన ప్రధానం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాస పథకం అమలు చేసేందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత 1235మంది రైతులకు.. ప్రభుత్వం ఇందిర గిరి జలవికాస పథకాన్ని ఐదు విడతలుగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడత 1235 మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులను ఎంపిక చేయనున్నారు. గతంలో 214 కుటుంబాలకు గిరి వికాసం పథకం పేరుతో సాగునీటి వసతి కల్పించారు. ఆ తర్వాత కొత్తగా గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్, కురవి మండలాల పరిధిలో 164 గ్రామ పంచాయతీలు, 340 అవాస ప్రాంతాలకు చెందిన 24,181 కుటుంబాలకు 67,730 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం నీటి వనరులు ఉన్న భూములు, గిరి వికాసం లబ్ధిదారులు పోను మిగిలిన వారిని ఐదు భాగాలుగా విభజిస్తారు. ఈ వానాకాలం సీజన్ వరకు మొదటి విడతగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి భూములకు సాగునీరు అందించనున్నారు. కమిటీల ద్వారా ఎంపిక.. లబ్ధిదారుల ఎంపిక కోసం మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందులో మండల అభివృద్ధి అధికారి, భూగర్భజల అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి, గిరిజనాభివృద్ధిశాఖ అధికారి ఉంటారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మెట్ ప్రకారం గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను పరిశీలించి భూమిలో బోరు పడే ప్రాంతాలను గుర్తిస్తారు. విద్యుత్ సరఫరా కోసం యూనిట్కు రూ. 6లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో సోలార్ ఉత్పత్తి పరికరాలను అమర్చుతారు. బోరుబావిలో మోటారు బిగిస్తారు. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత భూముల స్వభాన్ని భట్టి జామ, బాంబో, ఆయిల్పామ్ తదితర తోటల పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తారు. వందశాతం సబ్సిడీతో డ్రిప్, ఇతర పరికరాలు అందజేస్తారు. కసరత్తు ప్రారంభించాం ఇందిర సౌర గిరి జల వికాస పథకం అమలుకోసం కసరత్తు ప్రారంభించాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గిరిజన ప్రాంతాల్లోని మండల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. మండల కమిటీల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నాం. ప్రక్రియ వేగవంతంగా చేపట్టి గిరిజన భూములను సస్యశ్యామలం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – దేశిరాం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి సౌర విద్యుత్తో అదనపు ఆదాయం ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా గిరిజనుల భూముల్లో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా కరెంట్ సరఫరా జరుగుతుంది. ఈ విద్యుత్తో పంపుసెట్లు నడిపించుకోగా మిగులు విద్యుత్ను.. ఉత్పత్తి సంస్థకు అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా మిగులు విద్యుత్ ద్వారా గిరిజన రైతులకు నెలకు రూ. 5వేల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
కంటి పరీక్షలు నిర్వహించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్ల లందరికీ ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆర్బీఎస్కే కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఎనిమి యా ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఆర్బీఎస్కే బృందాలు గిరిజన వెల్ఫేర్, కస్తూర్బా, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెచ్ఈఓ రామకృష్ణ, డాక్టర్ కుమార్, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నర్సింహస్వామి బుధవారం తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్కు యత్నం● డీఎంహెచ్ఓకు సమాచారం.. అప్పటికే చేజారిన పరిస్థితి ● జీజీహెచ్కు తరలించి అబార్షన్ నెహ్రూసెంటర్: జిల్లాలోని ఓ మండలానికి చెందిన గర్భిణి పక్క జిల్లాలో స్కానింగ్ చేసుకోగా.. ఆడపిల్ల అని తేలినట్లు సమాచారం. కాగా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెనె జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి చేజారి పోవడంతో బుధవారం అబార్షన్ జరిగింది. ఈ ఘటనపై డీఎంహెచ్ఓ రవిరాథోడ్ను వివరణ కోరగా.. తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి సదరు మహిళను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించామని.. అక్కడ అబార్షన్ జరిగిందని తెలిపారు. అబార్షన్ విషయమై భార్యభర్తలను విచారించి కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. చికిత్స అందించిన ప్రైవేట్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశామని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తొర్రూరు: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అంకితభావంతో కృషి చేస్తున్నారని ఎస్పీ సుఽధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. డివిజన్ కేంద్రంలో ఆధునికీకరించిన స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని బుధవారం ఎస్పీ ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రశంసపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అసాంఘిక శక్తులపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్స్టేషన్లలో వెయిటింగ్ హాల్, ప్రత్యేక కౌంటర్లు, సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలతో సంబంధాలు మెరుగుపర్చేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్, డీఎస్పీలు తిరుపతి, శ్రీనివాస్, మోహన్, సీఐలు టి.గణేష్, రాజు, చంద్రమోహన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘భరోసా’ సేవలు అభినందనీయం
మహబూబాబాద్ రూరల్: భరోసా సెంటర్ సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ఏర్పా టు చేసి మూడేళ్లు పూర్తయింది. ఈమేరకు సెంటర్లో మంగళవారం ఎస్పీ కేక్ కట్ చేసి మాట్లాడారు. భరోసా సెంటర్లో బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా భరోసా సెంటర్ తరఫున నలుగురు బాధితులకు తక్షణ సహాయం కింద రూ.30వేలు అందజేశారు. డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ సీఐ చంద్రమౌళి, టౌన్, రూరల్ సీఐలు దేవేందర్, సర్వయ్య, రూరల్ ఎస్సై దీపిక, భరోసా సెంటర్ ఎస్సై ఝాన్సీ, షీ టీం ఎస్సై సునంద, డీడబ్ల్యూఓ ధనమ్మ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, భరోసాసెంటర్, సఖి, షీ టీమ్ సిబ్బంది ఉన్నారు. ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ శిక్షణ తరగతులను సందర్శించి మాట్లాడారు. ప్రతీరరోజు క్రమం తప్పకుండా సయమానికి ఉపాధ్యాయులు శిక్షణకు హాజరు కావాలన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఉపాధ్యాయులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, సైన్స్ అధికారి అప్పారావు, క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూం ఏర్పాటు
మహబూబాబాద్: ధాన్యం రైతుల సౌకర్యార్థం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రైతులు టోల్ ఫ్రీ 7995050789 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. సమస్యలను తమ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. లేబర్కోడ్లు రద్దు చేసే వరకు పోరాటాలు● కార్మిక సంఘాల నేతల పిలుపు నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్లు రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వరిపెల్లి వె వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి, ఎస్కె.మదార్ మాట్లాడారు. కార్మిక హక్కుల రక్షణ, చట్టాల అమలు, కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంఘటిత, అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆకుల రాజు, అల్వాల వీరయ్య, సమ్మెట రాజమౌళి, దార స్నేహబిందు, హలావత్ లింగన్న, లక్ష్మయ్య, సురేష్, బిల్లకంటి సూర్యం, భాస్కర్రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలిమహబూబాబాద్: మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి మేనేజర్ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆకుల రాజు మాట్లాడుతూ.. కార్మికులంతా దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికా రుల నిర్లక్ష్యంతోనే వేతనాలు విడుదల కావడం లేదన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26లోపు వేతనాలు చెల్లించాలని, లేని యెడల 27నుంచి కార్మికులు పనులు నిలిపివేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, తోట శ్రీనివాస్, కాంపెల్లి శ్రీనివాస్, శ్రీను, విజయ్, పుష్పరాజ్, చిరంజీవి, వీరన్న, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రేషపల్లి నవీన్ రమణ, విజయ్, మధుసూదన్, నాగేశ్వర్రావు, శ్రీను పాల్గొన్నారు. -
లండన్లో చదువుకున్నా.. మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృదద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజి, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేష్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
‘గిరి జలవికాసం’ అమలుకు చర్యలు
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జలవికాసం పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ విశాల్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ గిరిజల వికాసం పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులను మండలస్థాయి కమిటీ ద్వారా గుర్తించి భూగర్భజల సర్వేను నిర్వహించాలన్నారు. బోరు బావులు నిర్మించి సోలార్ సిస్టం ద్వా రా మోటార్లను వినియోగంలోకి తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో ట్రైబల్ వెల్ఫేర్, అటవీశాఖ, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి ఆసక్తి గల ట్రైబల్ రైతులకు పథకం ఆవశ్యకతను వివరించాలన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వ జీఓ ప్రకారం గిరిజన రైతులను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలిడిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో మంగళవారం జిల్లా పెట్టుబడుల ప్రోగ్రాం కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58మంది ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీ రాయితీ మంజూరు చేసినట్లు చెప్పారు. యువతకు ప్రైవేట్ ఇండస్ట్రీయల్లో ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎంశ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వస్తున్న రోగులు, ప్రజ లకు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ సూ చించారు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రోగులకు నిరంతర వైద్య సేవలు అందించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సదరం క్యాంపుల నిర్వహణకు ఆస్పత్రిలో అనువైన ప్రదేశంలో సేవలు అందించేలా బ్లాక్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మానసిక, కంటి, చెవి, ముక్కు, దంత, వినికిడి విభాగాలకు సంబంధించిన పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీఈ, ఏఈ, శంకర్ ఉన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం
● మానుకోట రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు ● ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● పనులు త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ ఎల్సీ గేటు సమీపంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులతో పాటు మానుకోట రైల్వే స్టేషన్ పరిధిలో చేపడుతున్న ఆధునికీకరణ పనుల్లో జాప్యం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల అవస్థలు.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫారం వైపున కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకుండానే రైల్వే మూడోలైన్ పనులు మొ దలుపెట్టారు. రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్న బుకింగ్ కౌంటర్ను కూల్చివేసి రైల్వే లైన్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. అనంతరం చేపట్టిన పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాగా ప్ర యాణికులు వచ్చి, వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయలేదు. దీంతో రైళ్లు వచ్చి వెళ్లేటప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే లైన్ సైడ్ వాల్ ఒక ప్రాంతంలో కొంత మేరకు తొలగించి వదిలివేయడంతో ప్రయాణికులు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఒకేసారి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రయాణికుల రద్దీ వల్ల ఆ దారిగుండా వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికుల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల్లో పురోగతి పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అధికారి పరిశీలన.. రైల్వే అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల కూడా పనుల్లో పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. ఇటీవల రైల్వేశాఖ నిర్మాణ పనుల విభాగం డిప్యూటీ సీఈ రామారావు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావుతో కలిసి రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈపీసీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ నెల 23నుంచి 30వ తేదీ వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ఉన్నందువల్ల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మూడో లైన్ నిర్మాణ పనుల పురోగతి పెంచాలన్నారు.గేటు మూసివేతతో ఇబ్బందులు.. రైల్వే ఎల్సీ–80 నంబర్ గేటు వద్ద మూడో లైన్ నిర్మాణ పనుల కోసం పలుమార్లు ఆ గేటును మూపివేశారు. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టుల వద్ద బ్రిడ్జిల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైల్వే ఎల్సీ 80 నంబర్ గేటు వద్ద కేబుల్ వైర్లు తెగిపోవడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. -
మా భూమిలో ఆస్పత్రి నిర్మించొద్దు
మహబూబాబాద్: తాము కొనుగోలు చేసి భూమిలో అర్బన్ పీహెచ్సీ భవన నిర్మాణం చేపట్టడం సబబు కాదని బాధితులు చుక్కల పద్మ, కోడెల లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రం శివారు డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో అర్బన్ పీహెచ్సీ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా.. మంగళవారం వారిద్దరూ ఆ స్థలం వద్ద పెట్రోలు బాటిల్తో ఆందోళన చేశారు. ఈసందర్భంగా పద్మ, లక్ష్మి మాట్లాడుతూ.. తాము లక్షలు పెట్టి కొనుగోలు చేసిన 800గజాల భూమిలో పీహెచ్సీ భవన నిర్మాణ పనులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పనులు నిలిపి వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్సై విజయ్ అక్కడికి చేరుకుని.. వివరాలు తెలుసుకుని పనులు నిలిపివేయించడంతో బాధితులు ఆందోళన విరమించారు. సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని వస్తే అఽధికారులతో మాట్లాడుతామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెట్రోలు బాటిల్తో బాధితుల ఆందోళన -
గోదావరి తీరం.. భక్తప్రవాహం
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ కొనసాగింపు.. ● ఆరో రోజు స్వల్పంగా తగ్గిన భక్తులు ● ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్లో బారులుదీరిన భక్తజనం● హైకోర్టు జడ్జి, ఎస్ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ డీజీ పుష్కర స్నానం, దర్శనం ● 50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఆరో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్లు, సింగరేణి, గజ ఈతగాళ్లును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే వాకీటాకీలతో మాట్లాడుతూ పరిశీలించారు. టెంట్సిటీ, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ చల్లించి పరిస్థితిని చూశారు. పుష్కర ఘాట్ గోదావరిలో బోటు ద్వారా భద్రతను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో అదనంగా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేట్టాలని ఆదేశించారు. అష్టమితో తగ్గిన రద్దీ.. మంగళవారం అష్టమి సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఉదయం 10గంటల వరకు భక్తుల రద్దీ లేదు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలొచ్చాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లతో నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. రోడ్లు శుభ్రం.. ఆదిముక్తీశ్వరస్వామి నుంచి వీఐపీ ఘాట్ వెళ్లే మార్గంలో వర్షం పడితే రోడ్లపై దిగబడకుండా గ్రావెల్ చిప్స్ వేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. గోదావరితీరం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చురుగ్గా చేపట్టారు. 50వేల మంది స్నానాలు.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. మంగళవారం 50వేల మంది వరకు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. పలువురు భక్తులు అక్కడక్కడ వడదెబ్బకు గురయ్యారు. వారిని కాళేశ్వరం పీహెచ్సీకి తరలించి వైద్యసేవలందించారు. కొంత మందిని ఇతర పట్టణాలకు తరలించి వైద్యసేవలందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మజ్జిగ ప్యాకెట్లు అందజేత.. భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు, దక్షిణ ద్వారాల ద్వారా క్యూలైన్లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రత్యేకాధికారిగా మనోహర్ను నియమించారు. ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ చేపట్టారు. సరస్వతీనది పుష్కరాలకు ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.నదీహారతి ప్రత్యక్ష ప్రసారం.. సరస్వతి ఘాట్లో కాశీపండితులతో ఏర్పాటు చేసిన నవరత్నమాల హారతికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. రాత్రి 7.30 గంటలకు 45 నిమిషాల పాటు జరిగే ఈకార్యక్రమాన్ని పుష్కరాలు పూర్తయ్యే వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాశీ పండితులు ఏడుగురితో తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకూ పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. రాత్రి 9 వరకు కూడా వరకు భక్తులు ఆయా పరిసరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రముఖుల పూజలు.. -
ఇన్చార్జ్ సీఎండీలతో ఇబ్బందులు
● టీఎస్ఈఈయూ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హన్మకొండ: టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోలో ఇన్చార్జ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అపాయింట్మెంట్ ఇప్పించాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమం నుంచి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడానని, నాలుగైదు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పి.మహేందర్ రెడ్డి, నీలం ఐలేశ్, సురేశ్ కుమార్ను ఎమ్మె ల్యే నాయిని, ఇనుగాల శ్రీధర్, నాయకులు సన్మానించారు. పీసీసీ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్ రావు, టీఎస్ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కొండూరి శ్రీనివాస్, భూపాల్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మాధవ రావు, చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, సదయ్య, శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో పురోగతిలో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్ల పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ లేకుండా ప్రతీ నెల ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రీ మాన్సూన్ తనిఖీలు అన్ని ఫీడర్లలో చేపట్టాలని, తద్వారా అంతరాయాలు తగ్గుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ చేసే సమయంలో అంతరాయం లేకుండా వేరే సబ్ స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకట రమణ, జీఎంలు వేణు బాబు, దేవేందర్, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆ దిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు మంగళవారం ఉదయం కేయూలోని పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసుల చొరవతో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ విద్యార్థులతో చర్చించారు. త్వరగా పరీక్షలు జరిగితే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. టైంటేబుల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటల నుంచి యథావిధిగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేయూ పరిధిలో 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. వీరి వెంట పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, ఆర్ట్స్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ జ్యోతి ఉన్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 22వ తేదీన జూనియర్స్ బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆధార్, స్కూల్ బోనోఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్లతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు రూ.300 ఎంట్రీ ఫీజుతో ఉదయం 7గంటలకు హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్ నందు హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24వ తేదీన మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ● ఉదయం కేయూలో విద్యార్థుల ధర్నా ● మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఎగ్జామ్స్ -
వడదెబ్బతో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కాటారం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన జీపీ పారిశుద్ధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్(35) ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కరాల విధులు నిర్వర్తించాడు. పనులు చేస్తూ ఆదివారం ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు కాళేశ్వరంలోని వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. అయితే పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. -
కన్యాదానం చేసిన 48 గంటల్లోనే నవవధువు తండ్రి మృతి
బయ్యారం: బిడ్డకు వేదమంత్రాల నడుమ కన్యాదానం చేసిన తండ్రి 48 గంటల వ్యవధిలో కాలంచేసి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన జంగిలి సతీష్(46)– శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వివాహం కొన్నేళ్ల క్రితం జరగగా, చిన్నకుమార్తె అక్షయ వివాహం ఆదివారం నిర్వహించారు. పెళ్లి పూర్తయిన తర్వాత రెండురోజులుగా సతీష్ స్థానికంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో వాంతులు, విరోచనాలవుతున్నాయి. స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కమిషనరేట్లో ఏసీపీల బదిలీ
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏసీపీ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్కుమార్.. డీజీపీ ఆఫీస్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్రెడ్డి బదిలీపై వచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా పనిచేసిన పి.ప్రశాంత్రెడ్డిని కాజీపేట ఏసీపీగా, మామునూరు ఏసీపీగా పనిచేస్తున్న బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ బదిలీపై వచ్చారు. రాచకొండ ‘షీ’ టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీగా పనిచేస్తున్న కొత్త దేవేందర్రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఇప్పటికే బదిలీ అయిన స్థానాల్లో పలువురు ఏసీపీలు రిపోర్టు చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన కిరణ్కుమార్ సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పి.ప్రశాంత్రెడ్డి కాజీపేట ఏసీపీగా, నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వెలువడిన ఉత్తర్వుల్లో సీసీఎస్ ఏసీపీగా పి.సదయ్య బదిలీ అయినట్లు ఉండడం గందరగోళానికి తావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలీఉల్లాఖాద్రీ కేయూ క్యాంపస్: అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా వరంగల్కు చెందిన డాక్టర్ వలీ ఉల్లాఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతిలో నాలుగురోజులుగా నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో వలీఉల్లాఖాద్రీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వలీఉల్లాఖాద్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. కేయూ వేదికగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా దేశం వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వలీఉల్లాఖాద్రీ కేయూలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు. -
పకడ్బందీ చర్యలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అ ద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధా న్యం, రైస్ మిల్లులకు తరలింపు, మద్దతు ధర చెల్లించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. లారీలు, గోనె సంచుల సమాచారంపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అధికారులు ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలి చిన్నగూడూరు: ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిన్నగూడూరు, విస్సంపల్లి, ఉగ్గంపల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిల్లో తనిఖీలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహబూబ్ అలీ, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన -
పుష్కర ఏర్పాట్లు భేష్..
● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లు భేష్గా ఉన్నాయని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్తో కలిసి విప్ కుటుంబ సమేతంగా సోమవారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఏర్పాట్లు పరిశీలించి కలెక్టర్, అధికారులను అభినందించారు. విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కాళేశ్వర ముక్తీశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు. -
పార్టీలో కోవర్టులకు స్థానంలేదు
తొర్రూరు రూరల్: కాంగ్రెస్ పార్టీలో కోవర్టులకు స్థానం లేదని, నిజమైన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాంచారీమడూరు గ్రామ శివారులోని రెడ్డి గార్డెన్లో తొర్రూరు మండల, పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని పార్టీ జిల్లా పరిశీలకురాలు రవళిరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝూన్సీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధ్యాన్యత ఇస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి అన్ని స్థానాలు గెలవడానికి కృషి చేయాలన్నారు. అనంతరం పరిశీలకురాలు రవళిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అందరూ పోటీ చేయాలని, పార్టీ కోసం నిజాయితీగా పని చేసే నాయకులు, కార్యకర్తలకు మాత్రమే కులాల వారీ గా అవకాశాలు కల్పిస్తుందన్నారు. పార్టీ పదవుల నిచామకాల్లో ఎలాంటి పైరవీలు, ఒత్తిడి ఉండదని, పార్టీ కోసం నిరంతరం పని చేసే వారికే అవకాశం దక్కుతుందన్నారు. పార్టీ బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు హమ్యానాయక్, సుంచు సంతోష్, సోమరాజశేఖర్, మండల, గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు. కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో వేచి చూశారు.– వివరాలు, మరిన్ని ఫొటోలు 8లోu -
నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు
నెహ్రూసెంటర్: ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీతో పాటు అనుమతులను రద్దు చేస్తామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రి భవనాల్లో ఫైర్సేఫ్టీ అనుమతులు తీసుకోవాలని, బయో మెడికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు నుంచి సర్టిఫికెట్లు విధిగా తీసుకోవాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లో అనుమతి పొందిన రేడియోలాజిస్టులు, గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులకు స్కానింగ్లు చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు అందించే వైద్య సేవలకు సంబంధించిన రుసుము వివరాలను ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి సారంగం, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్ఈఓ లోక్య, ఎల్డీ కంప్యూటర్ అరుణ్, మనోహర్, సీసీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
త్వరలో జిల్లాకు క్రికెట్ స్టేడియం
● ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ● అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు షురూ వరంగల్ స్పోర్ట్స్: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణ అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని, త్వరలోనే స్టేడియం ఏర్పాటు ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డిపురంలో సోమవారం అంతర్జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో బీజంపడిన క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఇప్పుడు ఆచరణలోకి రానుందని, అందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తానుకూడా ముందుండి నిర్మాణం జరిగేలా చొరవచూపుతానని భరోసా కల్పించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్డిపురంతో పాటు మొగిలిచర్ల గ్రౌండ్లో జనగామ, ములుగు, వంగాలపల్లి మైదానంలో వరంగల్, మహబూబాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు కొనసాగాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు సదాశివ్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. -
అనుమానిస్తున్నాడని.. కడతేర్చారు
● వ్యక్తి హత్య కేసులో అత్తామామ, భార్య అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను అనుమానిస్తున్నాడని భర్తను అత్తామామ, భార్య కలిసి కడతేర్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో చోటుచేసుకుంది. ఈ హత్య కేసు వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు సోమవారం రూరల్ పీఎస్లో వెల్లడించారు. తండాకు చెందిన బానోత్ వీరన్న కూతురు మౌనికను తొమ్మిది సంవత్సరాల క్రితం బల్హార్ష ప్రాంతానికి చెందిన లకావత్ బాలకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉండగా, 5 సంవత్సరాల నుంచి దంపతులు హైదరాబాద్లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మౌనిక వివాహేతర సంబంధ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇదే విషయమై ఈ నెల 17వ తేదీన బాల, అతడి అన్న లకావత్ బావుసింగ్ ధర్మారం తండాకు వెళ్లి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. అంతలోనే భార్య మౌనిక, మామ వీరన్న, అత్త కై ల కలిసి బాల, బావుసింగ్ కళ్లలో కారం చల్లారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. కొద్ది సమయం తర్వాత బాల తన అత్తగారింటికి వెళ్లి తమను చంపాలని చూస్తారా అని గొడవ పెట్టుకున్నాడు. ఆ వెంటనే అతడి భార్య మౌనిక, అత్త కై ల కొట్టగా మామ వీరన్న కత్తితో చాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాలను 108లో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అదే రాత్రి 10 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనలో అత్తామామ వీరన్న, కై ల, భార్య మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
● సరస్వతీ నది పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం ● ఐదో రోజు 80వేల మంది పుణ్యస్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. భక్తులతో పుష్కరిణి నిండిపోయింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. తగ్గిన రద్దీ పుష్కరాలకు భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి.. మంథని, కాటారం మీదుగా.. అలాగే మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. శని, ఆదివా రాల్లో రెండేసి లక్షల చొప్పున భక్తులు రాగా.. సోమవారం 80వేల మంది పుణ్యస్నానాలు ఆచరించిన ట్లు అధికారులు అంచనా వేశారు. నదీహారతికి రద్దీ సరస్వతీ ఘాట్లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నా రు. తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నాక జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నాసిక్ పీఠాధిపతి పూజలు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందా సరస్వతీ మహారాజ్ ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతీనది లో పుష్కర స్నానం.. విశేష పూజలు నిర్వహించా రు. అనంతరం రాజగోపురం వద్ద అర్చకులు, అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకుని పూజలు చేశారు. -
ప్రముఖుల పుష్కర స్నానం..
కాటారం/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా సోమవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, హైకోర్టు జడ్జి నందికొండ నర్సింగరావు దంపతులు, త్రయంబకేశ్వర్ నాసిక్కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామి సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతి మాతను దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జడ్జి దంపతులను కలెక్టర్ రాహుల్శర్మ, భూపాలపల్లి న్యాయమూర్తి అఖిల మర్యాదపూర్వకంగా కలిసి సరస్వతీమాత చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామికి సరస్వతీమాత విగ్రహం బహూకరించారు. శివుడి ప్రతిమ సెట్టింగ్కు మంటలు కాటారం: పుష్కరాల్లో భాగంగా సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్కు సోమవారం మంటలు అంటుకున్నాయి. థర్మకోల్తో తయారు చేసిన శివుడి ప్రతిమ సెట్టింగ్ వద్ద భక్తులు పుష్కర స్నానం అనంతరం దీపాలు వెలిగిస్తున్నారు. ఈ క్రమంలో దీపాలు ప్రతిమ కింద గల థర్మకోల్ స్టాండ్కు అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులు నీళ్లతో మంటలు ఆర్పారు. భక్తులు దీపాలు వెలిగించకుండా చర్యలు చేపట్టారు. -
పుష్కర విధుల్లో అతివలు..
కాటారం/మల్హర్ : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు.. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీపడుతూ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానంలో నిలుస్తున్నారు. ఉద్యోగాలు పొందిన అనంతరం విధి నిర్వహణలో పురుషులతో సరిసమానంగా ముందుకెళ్తున్నారు. ఎంతకష్టమైనా ఉన్నతాధికారులు కేటాయించిన విధులు సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో పలు కేడర్లకు చెందిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది పుష్కరాల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు.. సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా పోలీస్, వైద్యారోగ్య, మహిళా, శిశు సంక్షేమశాఖల పరిధిలో సుమారు 300 మంది మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. ఇందులో పోలీస్శాఖలో సుమారు 80 మంది మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లు, వైద్యారోగ్య శాఖలో 30 మంది మహిళా వైద్యులు, 120 మంది ఏఎన్ఎం, ఆశాకార్యకర్తలు, మహిళా, శిశ ుసంక్షేమ శాఖకు సంబంధించి సుమారు 70 మంది మహిళా ఉద్యోగులు, సిబ్బంది భక్తులకు తమ శాఖల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రధాన ఆలయం, త్రివేణి సంఘమం, సరస్వతి పుష్కరఘాట్ వద్ద విధులు నిర్వర్తిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పలువురు మహిళా ఉద్యోగులు ‘సాక్షి’ పలకరించగా తమ అనుభూతులను పంచుకున్నారు. పురుషులకు దీటుగా మహిళా ఉద్యోగుల సేవలు అధికంగా పోలీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖలు భక్తిభావంతో పన్నెండు రోజుల పాటు విధుల నిర్వహణ -
తూకాల్లో మిల్లర్ల మోసం.. రైతుల ఆందోళన
నర్సింహులపేట: మిల్లర్లు ధాన్యం తూకాల్లో మోసం చేయడంతో రైతులు ఆందోళన చేసిన ఘటన మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని గోపతండా సమీపంలోని వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు పెద్దనాగా రం శ్రీశ్రీబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద ఉన్న వేబ్రిడ్జిపై తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వేసిన తూకానికి సుమారు క్వింటాకు 3కిలోల చొప్పున పెద్దనాగారం శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లులోని వేబ్రిడ్జిలో తక్కువ రావడం గమనించిన రైతులు దంతాలపల్లిలోని వేబ్రిడ్జిలో తూకం వేశారు. అక్కడ ఐకేపీలో వేసిన తూకానికి సమానంగా వచ్చింది. దీంతో శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రెండు మిల్లుల యజమానులు ఒకటై తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈక్రమంలో వందలాది ట్రాక్టర్లు, లారీలు మిల్లు వద్ద నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తూనికలు, కొలతల జిల్లా అధికారి విజయ్కుమార్ సంఘటన స్థలానికి వచ్చి మిల్లుల యజమానులు, రైతులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
మరిపెడ: ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్ అన్నారు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మరిపెడలో గత యాసంగి సీజన్ కంటే ప్రస్తుతం అధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 75శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు తెలిపారు. కలెక్టర్ నిత్యం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేకాధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్కుమార్, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలి
మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓ రమేశ్ లాల్ హట్కర్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా ల ఉపాధ్యాయులు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులాల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ముస్లిం విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మైనార్టీ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు ఉచితంగా అందిస్తారని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు మహేశ్, రాజశేఖర్, ఇమాముద్దీన్ పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ మదార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డీఓలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9నుంచి 12గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కరెంట్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో పని చేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తీసుకెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్, ఇతర సాంకేతిక గాడ్జెట్స్ను ఎవరు తీసుకురాకుండా చూసే బాధ్యత సీఎస్, డీఓలదే అన్నారు. విద్యార్థులు హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రాజకుమారి, కుమార్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమ జీవి నల్లెల రాజయ్య
విద్యారణ్యపురి: ఉద్యమ జీవి నల్లెల రాజయ్య చిరస్మరణీయుడని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. ఆదివారం హ నుమకొండ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన ‘ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకాన్ని ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. సి. చంద్ర ప్రధాన సంపాదకుడిగా, అనిశెట్టి రజిత, డాక్టర్ కెబి. చంద్రభాను, బిల్ల మహేందర్, పిట్ట సాంబయ్య, రౌతు అజయ్కుమార్ సంపాదకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో వ్యాసాల సంపుటి(పుస్తకం)ని రూపొందించారు. కేయూ రిటైర్డ్ ఆచార్యుడు బన్నఅయిలయ్య,ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి, టీపీఎఫ్ కన్వీనర్ రమాదేవి మాట్లాడారు. కవి కోడం కుమారస్వామి పుస్తకాన్ని సమీక్షించారు. వ రంగల్ రచయితల సంఘం కార్యదర్శి దండ్రె రాజ మౌళి, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు భిక్షపతి, తిరుపతయ్య, సాంబయ్య, ఉదయ్సింగ్, మెట్టురవీ ందర్, జిడి. సారయ్య, మార్కశంకర్నారాయణ, కె. శంకర్రావు, వి. దిలీప్, బండారు సుజాత, బోనగిరి రాములు, ఎ. విద్యాదేవి, రాజేంద్రప్రసాద్, కుటుంబీకులు సుగుణ, వెన్నెల, సూర్య పాల్గొన్నారు.● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ -
హామీల అమలులో కేంద్రం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల పదో మహాసభలకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనుధర్మ శాస్త్ర అమలుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, మర్రి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, సంతోశ్, రాజ్కుమార్, బొంత మల్లయ్య, నిమ్మల మనోహర్, ఉట్కూరి ప్రణీత్, విజయ్, రాజనర్సు, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో అనాథ వృద్ధుడి మృతి ● అంత్యక్రియల కోసం వాట్సాప్ గ్రూప్లో పోస్టు ● గంటలో రూ. 51 వేలు జమ చేసిన గ్రామస్తులు రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన అనాథ వృద్ధుడు ఒడ్డూరి మల్ల య్య (75) వడదెబ్బతో మృతి చెందాడు. మల్లయ్య గతంలో గ్రామంలోని జెంగిడి బర్రెలకు (పాడి గేదెలు) కాపరిగా పని చేసేవాడు. కాలక్రమేణా పాడిగేదెలు తగ్గిపోవడంతో జీవనోపాధి కరువైంది. దీంతో పశువుల ఆస్పత్రి సమీపంలో డేరా వేసుకుని ఒంటరి జీవితం గడుపుతూ గ్రామస్తులు అన్నం పెడితే కడుపునింపుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. మృతుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేయాలని తాజా మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్ ఆ గ్రామ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయగా గ్రామస్తులు వెనువెంటనే స్పందించారు. దాదాపు గంటలో రూ. 51 వేలు జమ చేశారు. ఆ డబ్బుతో మల్లయ్య దహన సంస్కారాలు పూర్తి చేసి దాతృత్వం చాటారు. -
నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాక
ప్రముఖుల పుష్కర స్నానం.. కాటారం/కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. హైకోర్టు జడ్జి సుధా దంపతులు, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, జెన్కో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాధ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. సరస్వతి(వీఐపీ)ఘాట్లో పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం చేరుకుని స్వామి వారికి, సరస్వతీమాతా, శుభానందాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జి సుధాకు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే స్వాగతం పలికి మొక్కను బహూకరించారు.నిఘా నీడలో కాళేశ్వరం భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా పోలీసులు ముందస్తు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దులో కాళేశ్వరం ఉండడంతో అంతర్రాష్ట్ర వంతెన నుంచి మొదలు.. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్, ప్రధాన రహదారుల్లో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిత్యం పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకై తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎండవేడితో భక్తుల అస్వస్థత భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో ఎండ వేడితో భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. పుష్కరాలో భాగంగా నాలుగో రోజు ఆదివారం 8 మంది భక్తులు ఎండవేడికి అస్వస్థతకు గురికాగా 108లో కాళేశ్వరం పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో ఆదివారం 156 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 30 మంది భక్తులను అడ్మిట్ చేసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా సుమారు 4వేల మంది భక్తులకు వైద్య సేవలు అందించామని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు.కలెక్టర్ జాయ్ రైడ్.. భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ చేసి సరస్వతీనది పుష్కర సదుపాయాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ సీపీ గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి హెలికాప్టర్లో పుష్కర పరిసరాలు పరిశీలించారు. పుష్కర ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, పారిశుద్ధ్య చర్యలు, టెంట్ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు పక్కల అడవులు, తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భూపాలపల్లి: సరస్వతీనది పుష్కరాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం రోడ్డు మార్గాన కాళేశ్వరం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 12 గంటలకు తిరిగి కరీంనగర్కు వెళ్లనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా సోమవారం కాళేశ్వరం రానున్నట్లు సమాచారం. -
పెరిగిన లిక్కర్ ధరలు
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం ప్రియులపై ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వం క్వార్టర్ సీసాపై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచింది. రెండు నెలల క్రితమే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా లిక్కర్ ధరలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. నెలకు రూ.2.50 కోట్ల మేర భారం.. ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ ధరల పెంపు నిర్ణయం వల్ల జిల్లాలోని మద్యం ప్రియులపై నెలకు రూ.2.50 కోట్ల మేరకు భారం పడనునట్లు అంచనా. జిల్లా పరిధిలో 59 వైన్ షాపులు, 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో నెలకు అన్ని రకాల మద్యం బాటిళ్లు 56,700 మేరకు విక్రయం జరుగుతున్నాయి. తద్వారా నెలకు రూ.55 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోంది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరలతో నెలకు రూ.2.50 కోట్ల మేరకు మద్యం ప్రియులపై భారం పడుతుందని అంచనా. నెలకు రూ.2.50 కోట్ల మేర భారం -
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
మహబూబాబాద్ అర్బన్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం, నెహ్రూసెంటర్, రైల్వేస్టేషన్ మదర్థెరిస్సా సెంటర్, చేపల మార్కెట్ మీదుగా స్వామి వివేకానంద సెంటర్ వరకు భారత్ సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు హాజరై మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ బేస్లను ధ్వంసం చేసిందని కొనియాడారు. ప్రధాని మోదీ వ్యూహంతో వ్యవహరించి పాకిస్తాన్లోని టెరర్రిస్టులను భారత్ సైన్యంతో హతం చేశారన్నారు. తిరంగా యాత్రలో పాల్గొన్న జిల్లా మాజీ సైనికులకు, ఆర్మీ, నేవీ సైనికులకు, యువకులు, మహిళలు, వ్యాపారవేత్తలకు, న్యాయవాదులు, వైద్య బృదాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్మీ, నేవి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడు తూ.. సైన్యం పిలిస్తే భారత్ తరఫున తాము యు ద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణా లను సైతం లెక్కచేయమని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా మాజీ అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు శ్యామ్సుందర్శర్మ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గడ్డం అశోక్, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి రాంబాబునాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు సంపత్, ఓర్సు పద్మ, సరోజ, రాధపటేల్, మహేష్గౌడ్, సందీప్, నరేశ్, మదన్లాల్, అశోక్, మాజీ సైనికులు నర్సింహరావు, కేశవరావు, విజయ్గణేష్, రాజేశ్వర్, రాఘవరెడ్డి, ఐలయ్య తదితరులు ఉన్నారు. -
రక్తహీనతతో అనేక సమస్యలు
మా వద్దకు వచ్చే టీనేజ్ బాలికల్లో మానసిక ఒత్తిడితో పాటు, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారే అధికంగా ఉంటున్నారు. ఆడవారికి హిమోగ్లోబిన్ 12 నుండి 13 గ్రాముల వరకు ఉండాలి. కానీ కొందరిలో 6 గ్రాములు, 7 గ్రాములు కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఋతుస్రావం సమస్య తలెత్తుతుంది. జ్వరం, కాళ్లు, చేతులు గుంజడం, నీరసం, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇందుకు ప్రధాన కారణం సమతుల ఆహారం తీసుకోకపోవడమే. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, బెల్లం, కర్జురా, అంజీర, పల్లీలు, నువ్వులు, పండ్లు, తాజా కూగాయలు తీసుకోవాలి. లేకపోతే రక్తహీనత వస్తుంది. టీనేజీలో మొదలైన సమస్యలు పెద్దయ్యాక మరింత జఠిలమవుతాయి. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. – పాల్వాయి సౌజన్య, గైనకాలజిస్టు -
24న రైతు చర్చా వేదిక
భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్లో నేషనల్ హ్యుమన్రైట్స్ (ఎన్హెచ్ఆర్సీ) ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన రైతు చర్చా వేదిక నిర్వహించనున్నట్లు ఎన్హెచ్ఆర్సీ ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు ఐలవేణి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఐలవేణి శ్రీనివాస్తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చర్చా వేదికకు విశిష్ట అతిథిగా సీబీఐ జాయింట్ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రానున్నారని తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధించిన అధికారులు, మేధావులు కూడా పాల్గొంటారని చెప్పారు. ముగిసిన నెట్బాల్ పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 8వ సబ్ జూనియర్ బాల బాలికల నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికా క్రీడాకారులు హాజరయ్యారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5 పోటీలు ఈనెల 17న ముగియగా.. చివరగా మిక్స్డ్ డబుల్స్ పోటీలతో ముగింపు పలికారు. మిక్స్డ్ డబుల్స్లో మహబూబ్నగర్(విన్నర్), కామారెడ్డి(రన్నర్), థర్డ్ ప్లేస్లో వరంగల్/నాగర్ కర్నూల్ సంయుక్త విజేతలుగా నిలువగా, మూడు కేటగిరీల్లో విజయం సాధించిన టీంలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. -
అన్నదానం.. మహాప్రసాదం
భోజన సౌకర్యం బాగుంది..సరస్వతీనది పుష్కరాలకు రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చాం. అన్నదాన సత్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. చాలా రుచిగా, శుభ్రంగా ఉంది. – అనురాధ, భక్తురాలు, మంచిర్యాలకాటారం /మల్హర్: అన్నం పరబ్రహ్మ సర్వూపం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే సేవాభావంతో పలువురు ప్రముఖ దైవక్షేత్రాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే మాదిరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో ముక్తీశ్వరాలయ సమీపంలో దాదాపు 8 చోట్ల అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి భక్తుల కడుపునింపుతున్నారు. ఒక్క పూటకు నాలుగు నుంచి ఆరు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానాలు చేస్తున్నారు. ప్రతీ రోజు టిఫిన్, అన్నదానం.. సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య, బ్రహ్మణ, ఈశ్వరకుమారి, వాసవీ క్లబ్, ఇతరాత్ర ట్రస్ట్ల ద్వారా ఏర్పాటు చేసిన అన్నప్రసాద సత్రాల ద్వారా భక్తులకు ప్రతీ రోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఏదో ఉచిత భోజనం అందిస్తున్నామనే కాకుండా నిర్వాహకులు నాణ్యతతో కూడిన రుచికర భోజనం అందిస్తున్నారు. ఉదయం పలు రకాల అల్పాహారంతోపాటు భోజనంలో రెండు రకాల కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్లు, పచ్చడి పెడుతున్నారు. రుచికరం, పరిశుభ్రంగా ఉండడంతో భక్తులు సత్రాల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.సేవలు అభినందనీయం.. పుష్కరాలకు పిల్లలతో కలిసి చాలా దూరం నుంచి వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదాన సత్రాల్లో భోజనం లభించింది. సమయానికి మా ఆకలి తీరింది. అన్నదానం నిర్వాహకుల సేవలు అభినందనీయం. – శ్రీనివాస్, భక్తుడు, కరీంనగర్ పుష్కరాల భక్తులకు పలు ట్రస్ట్ల నిత్యాన్నదానం పన్నెండు రోజుల పాటు ఉచితంగా టిఫిన్, భోజనం భక్తుల ఆకలి తీరుస్తున్న సత్రాలు -
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాలన
కాటారం/కాళేశ్వరం: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ముక్తీశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి వేర్వేగా శనివారం పుష్కర స్నానం ఆచరించి సరస్వతి అమ్మవారు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు భారీగా నిర్వహించడానికి ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మక్కాన్సింగ్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల నిర్వహణ భేష్ ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల -
ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన కలెక్టర్ రాహుల్, ఎస్పీ కిరణ్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మూడో రోజు కాళేశ్వరానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో కాళేశ్వరం బయలుదేరగా మహదేవపూర్ – కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈక్రమంలో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ బైక్పై తిరుగుతూ వాహనాలను పంపించి రూట్ క్లియర్ చేశారు. కాగా, శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని వారు అప్రమత్తం చేశారు. -
పితృ దేవతలకు పిండ ప్రదానాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల్లో భక్తులు పుష్కర స్నానం, ప్రత్యేక పూజలతో పాటు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి ఒక్కో నదికి వచ్చే పుష్కరంలో పితృదేవతలకు సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రాశి బృహస్పతి (గురువు)లో ప్రవేశించడంతో ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరం వస్తుంది. ఇలా 12 నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే సకల రోగపీడలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా, తమ కుటుంబంలో కాలం చేసిన పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి కలిగి మోక్షం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది మిథునరాశి బృహస్పతిలో ప్రవేశించడంతో కాళేశ్వరంలో అంతర్వాహినిగా కొనసాగుతున్న సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించడంతో పాటు పురోహితుల సమక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేసి నదిలో సంకల్పాలు చేస్తున్నారు. ప్రతీ పుష్కరంలో నది తీరాన ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు పితృదేవతలు మచ్చ రూపంలో కొలువై ఉంటారని పురోహితులు, వేద బ్రహ్మణులు చెబుతున్నారు. ప్రతీ నది పుష్కరంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు. సరస్వతి నది పుష్కరాల్లో సమర్పణ పుష్కరాల్లో పెద్దలకు సమర్పిస్తే మోక్షం వారి ఆత్మలు శాంతిస్తాయని భక్తుల నమ్మకం -
నేటి నుంచి జాయ్రైడ్స్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జాయ్రైడ్స్కు ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద భక్తులు విహంగ వీక్షణం చేయడానికి ఏవియేషన్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాత్రధామ్.ఓఆర్జీ యాప్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, జాయ్రైడ్స్, టెంట్సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్లో పొందుపర్చినట్లు వివరించారు. జాయ్రైడ్స్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ.4,500తో 6 – 7 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టనున్నారు. కన్నెపల్లి హెలిపాడ్ వద్ద హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. టెంట్సిటీకి ఒక రోజుకు రూ.3వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఎడ్ల బండ్లకు పెరిగిన గిరాకీభూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద ఎడ్ల బండ్లకు గిరాకీ పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దాంతో బురద రోడ్లపై వాహనాలు ముందుకు సాగక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కార్లు, వాహనాలను దూరంగా పార్కింగ్ చేసి కాలినడకన వెళ్లలేక ఎడ్ల బండ్లను ఆశ్రయించారు. ఎడ్లబండ్ల యజమానులు ఒక్కరికి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. -
రైల్వే లోకోపైలెట్ల గైర్హాజరుతో పది రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా ప్రయాణిస్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు, పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లను లోకోపైలెట్ల గైర్హాజరుతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. లోకో పైలెట్లు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాస్తున్నందున ప్యాసింజర్ రైళ్లను నడిపించే వారి కొరత ఏర్పడిందని, దాంతో పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను సికింద్రాబాద్ అధికారులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పలు రైళ్ల రద్దుతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పుష్ పుల్ ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్ రై ళ్లలో వెళ్లలేక సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. రద్దయిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట – బల్లార్షా (17035) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు బల్లార్షా – కాజీపేట (17036) వెళ్లే ఎక్స్ప్రెస్, కాజీపేట – సిర్పూర్ కాగజ్నగర్ (17003) వెళ్లే ఎక్స్ప్రెస్, బల్లార్షా – కాజీపేట (17004) వెళ్లే ఎక్స్ప్రెస్లు. నిలిచిన పుష్పుల్ ట్రైన్స్ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్ – వరంగల్ (67761) వెళ్లే పుష్పుల్, వరంగల్ – సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సికింద్రాబాద్ – కా జీపేట (67763) పుష్పుల్, కాజీపేట – సికింద్రాబాద్ (67764) పుష్పుల్, డోర్నకల్ – కాజీపేట (67766) పుష్పుల్, కాజీపేట డోర్నకల్ (67765) పుష్పుల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. క్రైం ఏసీపీగా కిరణ్కుమార్ బాధ్యతల స్వీకరణ రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైం విభాగం నూతన ఏసీపీగా కిరణ్కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిరణ్కుమార్ను అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. -
డిప్యూటీ సీఎం కాలసర్ప పూజలు
హోరాహోరీగా నెట్బాల్ పోటీలుకాటారం/కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సోదరుడు మల్లు ప్రసాద్తో కలిసి శనివారం తమ పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు, స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ పురోహితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య డిప్యూటీ సీఎం దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. -
పిట్టల్లా రాలుతున్నారు..
– వివరాలు 8లోuసాక్షి, మహబూబాబాద్: భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిప్పులు కురిపించే ఎండలో తప్పని పరిస్థితిలో పనిచేస్తూ వడదెబ్బకు గురై జిల్లా వ్యాప్తంగా రైతులు, కూలీలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే జిల్లాలో పదిమందికి పైగా వడదెబ్బతో మృతి చెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నా.. వైద్యారోగ్యశాఖ, మున్సిపాలిటీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సహాయక చర్యలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించకపోవడంతోనే మృతుల సంఖ్య పెరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిమందికి పైగా మృతి జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో అస్వస్థతకు గురై రెండునెలల్లోనే పదిమందికి పైగా మృతి చెందారు. ఏప్రిల్ 15వ తేదీనన కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన బాసాని మల్లమ్మ, గార్ల మండలం జీవంజిపల్లి గ్రామానికి చెందిన బాదంపూడి సులోచన వడదెబ్బతో మృతి చెందారు. 21వ తేదీన తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రేమలత, 22వ తేదీన నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న ఎండలో ధాన్యం ఆరబోసే పనిచేస్తుండగా.. ఎండదెబ్బ తగిలి మృతి చెందాడు. 28వ తేదీన మహబూబాబాద్ పట్టణంలో పనికోసం వచ్చిన బీహర్ కూలీ తులసి మిశ్ర వడదెబ్బతో మృతి చెందారు. 29వ తేదీన బయ్యారం మండలం కస్తూరినగర్కు చెందిన కేలోత్ రంగ్య ఎండలో పనిచేస్తూ కుప్పకూపోగా.. చికిత్స అందించే లోపే మృతి చెందారు. మే 6వ తేదీన గార్ల మండలం అంబేడ్కర్ నగర్కు చెందిన అక్కి పార్వతి వడదెబ్బతో మృతి చెందారు. నర్సింహులపేట మండల కేంద్రం ఫీల్డ్ అసిస్టెంట్ తూడి మానిక్యం ఈనెల 11వ తేదీన ఉపాధి కూలీలతో పనిచేయిస్తూ వడదెబ్బతగిలి అస్వస్థతకు గురికాగా.. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 12వ తేదీన పెద్దవంగర మండలం పోచంపల్లి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన గంట్ల శివారు సమ్మిద్ కుంట తండాకు చెందిన గుగులోత్ కిషన్ వడదెబ్బతో మరణించారు. 14న గార్ల మండలం కొత్త పోచారం గ్రామానికి చెందిన గజ్జి యాకమ్మ ఉపాధి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందారు. దీంతోపాటు వడదెబ్బకు గురై అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతు న్నవారు సైతం అనేకమంది ఉన్నారు. కానరాని సహాయక చర్యలు వేసవి ఎండల నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో వసతులు లేకపోవడం, వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించకపోవడంతోనే అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఉపాధి హామీ పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలి. కానీ, జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో వసతులు లేవు. దీంతోపాటు కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతం తగ్గడంకోసం ఆరబోస్తున్న రైతులు రోజలు తరబడి ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరికొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు, తరలింపు ఆలస్యం కావడం వంటి కారణాలతో రైతులు రోజల తరబడి ఆయా కేంద్రాల్లో ఎండలోనే ఉంటూ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతజరుగుతున్నా.. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం, ప్రధాన కూడళ్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, చలి వేంద్రాల ఏర్పాటు వంటి సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీల్లో..)జిల్లాలో పెరుగుతున్న వడదెబ్బ మరణాలు ఇప్పటికే పది మందికి పైగా మృతి నిప్పులు కురిసే ఎండలో తప్పని పని ఉపాధి పని ప్రదేశాల్లో సౌకర్యాల లేమి తేదీన కనిష్టం గరిష్టం 10 25 40 11 27 39 12 25 40 13 25 38 14 25 37 15 26 40 16 23 35 17 28 42 -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధి త అధికారులతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించి న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 22 నుంచి 28వ తేదీవరకు పరీక్షలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ద్వితీయ సంవత్స రం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయన్నారు. జిల్లాలోని 14 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్స రం విద్యార్థులు 2,539 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,594 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. డీఐఈఓ మదార్, విద్యుత్శాఖ ఎస్ఈ నరేష్, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు. యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలి రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత బ్యాంకర్లకు పంపాలని, అన్ని దరఖాస్తులు బ్యాంకర్లు, ఎంపీడీఓలతో పరిశీలన చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించి హర్డ్ కాపీలను అందచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, అధికారులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి నెల్లికుదురు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలను తరలించే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని మధనతుర్తి, ఎర్రబెల్లిగూడెం, నెల్లికుదురు గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. వరిధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలీన్లు అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎర్రబెల్లిగూడెం సబ్సెంటర్ను సందర్శించి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండతీవ్రత, వడగాల్పులపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిచారు. మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ రాజు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
ధాన్యం తరలింపు వేగంగా చేపట్టాలి
డోర్నకల్/కురవి: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వల తరలింపు ప్రక్రియ వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల ఆదేశించారు. సీరోలు మండల కేంద్రంతోపాటు ఉప్పరిగూడెం, మన్నెగూడెం గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన లారీలు, గోనె సంచుల వివరాలను అందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన లారీలు, గోనె సంచుల లెక్కలను తెలుసుకున్నారు. అవసరముంటే గోనె సంచులు, లారీలకు ఇండెంట్ ఇవ్వాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీరోలు వ్యవసాయ అధికారి ఛాయారాజ్, ఏఏఓ ఎర్ర కర్ణ పాల్గొన్నారు. సీరోలు ఇన్చార్జ్ తహసీల్దారు కృష్ణవేణి తదితరులు ఉన్నారు. పామాయిల్ చెట్ల నరికివేత డోర్నకల్: సీరోలు మండలం మన్నెగూడెం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలోని 80 చెట్లను గుర్తు తె లియని వ్యక్తులు నరికివేశారు. డోర్నకల్ ఎస్సై వంశీధర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఖ మ్మంకు శ్రీరామినేని వెంకటేశ్వర్లు మన్నెగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తన ఐదెకరాల భూమిలో ఆయిల్పామ్ సాగు చేశాడు. మన్నెగూడేనికి చెందిన శ్యామల వెంకటేశ్వర్లును పాలేరుగా నియమించాడు. ఈక్రమంలో శుక్రవారం గుర్తు తెలి యని వ్యక్తులు తోటలోని 80చెట్లను నరికేయడంతో పాలేరు.. యజమానికి తెలియజేశాడు. రూ.12 లక్ష ల నష్టం వాటిల్లిందని, వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొనుగోలు కేంద్రంలో గోల్మాల్మరిపెడ రూరల్: మండలం రాంపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనజ్యోతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ట్రక్ షీట్లు పొందారని సెంటర్ నిర్వాహకులు సుధగాని నీలమ్మ, కంసాని జ్యోతి, పట్ల బాలమ్మ శుక్రవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ డీఆర్డీఓ జయశ్రీ శనివారం రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టారు. ఈక్రమంలో రాంపెల్లి రవి 284 బస్తాలు, రాంపెల్లి బుచ్చిరాములు 158, రాంపెల్లి కపిల్ 40, బొమ్మగాని రవి 295, దోమల సత్తెయ్య 233, దోమల సోమయ్య 292, రాంపెల్లి కార్తీక్ కపిల్ 108 మొత్తం 1410 బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండానే ట్రక్ షీట్లు ఇచ్చినట్లు తేల్చారు. కొనుగోలు కేంద్రంలోని ఎంట్రీ బుక్ పరిశీలించగా ఆరోపించబడిన రైతులకు సంబంధించి ధాన్యం ఎంట్రీ కాలేదని నిర్దారించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఆరోపణ ఎదుర్కొంటున్నరైతులు మాత్రం తాము కష్టపడి ధాన్యం పండించామని, కేంద్రంలో చోటు లేకపోవడంతో తమ కల్లంలోనే ఆరబెట్టికున్నామని, అనంతరం ప్రైవేట్ వాహనాల ద్వారా అబ్బాయిపాలెం సాయి శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్కు తరలించినట్లు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆరోపణ ఎందుర్కొంటున్న రైతుల అకౌంట్లో డబ్బులు జమకాకుండా అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. హాయి హాయిగా.. ఎండ తీవ్రత, ఉక్కపోతతో మనుషులు కూలర్లు, ఏసీలతో ఉపశమనం పొందుతున్నారు. కానీ, జంతువులు ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నాయి. ఈక్రమంలో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఓ శునకం మానుకోట మున్సిపల్ పరిధిలోని జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటికుండిలో మునిగి ఇలా హాయిని పొందుతుంది. – నెహ్రూసెంటర్ -
రక్తపోటుపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: పీహెచ్సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామాల్లో రక్తపోటు(బీపీ)పై ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవి రాథోడ్ తెలిపారు. ప్రపంచ రక్తపోటు(బీపీ) నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ మందులు వాడడం ద్వారా ని యంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. రక్తపోటు తనిఖీలు, ప్రాముఖ్యత, చికిత్స నివారణపై క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వివరించాలన్నా రు. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, యోగా వంటివాటితో రక్తపోటను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, సుధీర్రెడ్డి, లక్ష్మీనారాయణ, సారంగం, విజయ్కుమార్, మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుభాయి, హెచ్ఈఓ వెంకటేశ్వర్రాజు, శారద, గీత, పురుషోత్తం, రామకృష్ణ, కేఎల్ఎన్ స్వామి, లోక్య, డీపీఓ నీలోహన, నీలిమాశ్వేత, అశోక్, అరుణ్, మనోహర్, సౌమిత, వసంత, త్రివేణి, సీహెచ్ఓ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. వడదెబ్బపై జాగ్రత్తలు పాటించాలి పెద్దవంగర: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టిస్తే మిమ్మల్ని మీరు రక్షించు కోవచ్చని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. శనివారం మండల కేంద్రంతోపాటు ఉప్పరగూడెంలో వైద్యసిబ్బంది చేపట్టిన వాక్సినేషన్ పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీజీ, ఓపీవీ, పంటా వంటి వాక్సిన్లు క్రమం తప్పకుండా అందించాలని అదేశించారు. ఎంఎల్హెచ్పీలు మహిపాల్, మహేష్, ఏఎన్ఎంలు హరిత, నాగజ్యోతి, ఆశాలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
రూ.2.8 లక్షల సైబర్ లూటీ
డోర్నకల్: సైబర్ వలలో పడి ఓ యువతి రూ.2.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డోర్నకల్ సీఐ బి.రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్రాయితండాకు చెందిన గుగులోత్ మౌనిక ఏప్రిల్ 8న ఇన్స్ర్ట్రాగామ్లో లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది. లోన్యాప్ ప్రతినిధి రూ.10 లక్షల లోన్ మంజూరు చేస్తామని మొదట రూ.11 వేల పంపాలని కోరగా మౌనిక పంపింది. తర్వత మరో రూ.20వేలు పంపమని కోరడంతో మళ్లీ పంపించింది. లోన్ యాప్ ప్రతినిధి వారం రోజులపాటు మౌనికకు మాయమాటలు చెబుతూ రూ.2.8 లక్షలు లూటీ చేశాడు. అనంతరం యాప్ ప్రతినిధి స్పందించకపోవడంతో మౌనిక డోర్నకల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మౌనిక ఖాతా నుంచి బదిలీ అయిన డబ్బులో రూ.7 వేలను హోల్డ్లో పెట్టారు. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. రుణం ఇప్పిస్తామని మోసం.. మహబూబాబాద్ రూరల్ : రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రకటనను నమ్మిన ఓ యువకుడు డబ్బులు బదిలీ చేయగా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ ఎస్సై దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన ఆకుల యుగంధర్ ఫేస్ బుక్ ఖాతాకు జనవరిలో ధని యాప్ పేరిట రుణం ఇస్తామని సమాచారం వచ్చింది. దీంతో యుగంధర్ అవతలి వ్యక్తులు పంపించిన లింక్ ఓపెన్ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తులు కోరినవిధంగా రూ.3వేలు, రూ.11,300, రూ.8,800, రూ.13,500 విడతల వారీగా పంపించాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మాసానికి గురైనట్లు గ్రహించి 1930లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మామ
కేసముద్రం: కుటుంబ కలహాల కారణంగా ఓ అల్లుడిని కత్తితో పొడిచి మామ హత్య చేసిన ఘటన మండలంలోని ధర్మారంతండా జీపీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లూనావత్ బాల(35) హైదరాబాద్లోని లింగంపల్లిలో వాటర్ టాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేసముద్రం మండలం ధర్మారంతండా జీపీకి చెందిన బానోత్ వీరన్న, కై లా దంపతుల కుమార్తె మౌనికతో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో హైదరాబాద్లో భార్యభర్తల మధ్య గొడవలు కాగా 3 రోజుల క్రితం మౌనిక తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను తీసుకెళ్లేందుకు బాల శనివారం ధర్మారంతండాకు వచ్చాడు. మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మామ వీరన్న క్షణికావేశంలో కత్తితో అల్లుడి ఛాతిపై పొడిచాడు. బాలను స్థానికులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజ్ పరీశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వీఐపీల సేవలో అధికార గణం
● సామాన్య భక్తులను పట్టించుకోని వైనం ● ఇబ్బందులు పడిన దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు భూపాలపల్లి/కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో సరస్వతి ఘాట్, కాళేశ్వరాలయంలో పోలీసులు, జిల్లా అధికారులు వీఐపీల సేవలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సాధారణ భక్తుల వాహనాలను పుష్కర ఘాట్కు కిలోమీటర్ దూరంలో గల పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఘాట్ వద్దకు వెళ్లాలి. అయితే ఇదే రహదారిపై ఒక్కో వీఐపీని రెండు, మూడు ఎస్కార్ట్ వాహనాలతో తీసుకెళ్తుండడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చే యకపోవడంతో వారు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇది లా ఉండగా పుష్కర ఘాట్ తీరంలో తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తుల గొంతెండింది. విషయం తెలు సుకున్న కలెక్టర్ రాహుల్ శర్మ మ ధ్యాహ్నం ట్రాలీల ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేయించారు. ఆలయంలో గంటల తరబడి సామాన్య భక్తులు క్యూ లెన్లలో ని రీక్షించాల్సి వచ్చినా అధికారులు చూడలేదు. స్థానిక పోలీసు, దేవాదాయశాఖ అధికారులు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తున్న వారు... పోలీసులు, ప్రభు త్వ అధికారుల కుటుంబీకులను ప్రత్యేకంగా ఆలయం లోపలికి పంపించడంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఉత్సవ కమిటీ ఉన్నా ఏ అధికారం లేకపోవడంతో వారు ఉత్సవ విగ్రహాలుగా మారారని పలువురు పేర్కొన్నారు. -
పుష్కర స్నానంతో పొరపాట్లు పరిసమాప్తం
కాళేశ్వరం: పుష్కర స్నానంతో సకల సౌకర్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని, ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగి ఉంటే పరిసమాప్తమవుతాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం కాళేశ్వరంలో కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం పుష్కర పుణ్యస్నానం ఆచరించారు. సరస్వతిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు ఏకశిల సరస్వ తీమాత విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ భద్రత, పా రిశుద్ధ్యం, స్నానాల ఘాట్ల వద్ద అధికారులు నిబద్ధ త, నిష్టతో ఏర్పాట్లు చేశారని వివరించారు. పుష్కర స్నానాలకు ప్రతీరోజు ఒక పీఠాధిపతి వచ్చి స్నానం ఆచరించి ముక్తేశ్వర దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనా రాయణరావు, రాజ్ఠాకూర్, కలెక్టర్ రాహుల్శర్మ, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావ్ ఉన్నారు. కాగా, రాత్రి హోటల్ హరితలో బస చేశారు. శనివారం ఉదయం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాళేశ్వరంలో పుష్కరస్నానం -
వైద్య సేవలు విస్తృతం..
భూపాలపల్లి అర్బన్: సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పది వైద్య శిబిరాల్లో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానిక పీహెచ్సీలో పది పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. శుక్రవారం 200 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 12 మందిని అడ్మిట్ చేసుకున్నారు. భూపాలపల్లికి చెందిన నందకిశోర్ కాళేశ్వరంలో తేలు కాటుకు గురికాగా 108లో పీహెచ్సీకి చేరుకోగా చికిత్స అందించారు. ఇద్దరికి ఫిట్స్ రావడంలో ప్రాథమిక చికిత్స అందించి భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పలువురు భక్తులు, పారిశుద్ధ్య కార్మికులు వడదెబ్బకు గురైనట్లు డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలు షురూ..
● రాత్రి 10 గంటల వరకు కొనసాగిన లీగ్ మ్యాచ్లు ● 25 జిల్లాల నుంచి 620 మంది క్రీడాకారుల రాకజనగామ: జిల్లా కేంద్రం బతుకమ్మకుంటలో 8వ సబ్ జూనియర్స్ స్టేట్ లెవల్ నెట్బాల్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ రొడ్రిక్స్ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యాన అండర్–16 పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికల క్రీడాకారులు వచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు రెండు షిఫ్టుల వారీగా ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు 45 మ్యాచ్లు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో సుమారు 45 మ్యాచ్లు ఆడారు. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న టీంలు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంటాయి. అక్కడ ప్రతిభ కనబరిచిన జిల్లాలు సెమీఫైనల్, ఫైనల్లో తలపడనున్నాయి. నేడు(శనివారం) రాత్రి 10 గంటల వరకు సెమీఫైనల్ పోటీలను ముగించాలి.. సాధ్యం కాని పరిస్థితుల్లో 18న మిగిలిన మ్యాచ్లు పూర్తి చేసి సాయంత్రం ఫైనల్ పోటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటూనే.. ఆసక్తి ఉన్న ఆటల్లో తర్ఫీదు తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. -
ఖైదీల పనితీరు ప్రోత్సహించేందుకు స్టాల్ ఏర్పాటు
● జెళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా కాళేశ్వరం : ఖైదీల పనితీరు ప్రోత్సహించడంలో భాగంగా సరస్వతీనది పుష్కరాల్లో వారితో తయారు చేయించిన వివిధ ఉత్పత్తులతో కాళేశ్వరంలో స్టాల్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జైళ్ల శాఖ ఖైదీలకు వివిధ ఉత్పత్తి రంగాల్లో శిక్షణ కల్పిస్తూ వారితో నాణ్యమైన వస్తువులు తయారు చేయించి ఉపాధి కల్పిస్తోందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, కలెక్టర్ రాహుల్ శర్మ, వరంగల్ సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి టి.కళాసాగర్, ఉప పర్యవేక్షణాధికారులు పి.వెంటేశ్వరస్వామి, జైలర్ పి.పూర్ణచందర్, పరకాల సబ్ జైలు పర్యవేక్షణాధికారి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. మహాభాగ్యం
కాటారం: పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలను భక్తులు మహాభాగ్యంగా భావిస్తున్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. పిల్లలు మొదలు.. పెద్దలు, వృద్ధుల వరకు త్రివేణి సంఘమంలో పరమ పవిత్ర పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు. గతంలో ఇదే చోట జరిగిన గోదావరి, ప్రాణహిత పుష్కరాలకు సైతం వచ్చి పుష్కర స్నానం ఆచరించిన భక్తులు కొందరు ఉండగా.. మొదటి సారి పుష్కర స్నానం ఆచరించిన వారు సైతం ఉన్నారు. అత్యంత పవిత్రంగా భావించే పుష్కర స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ పుష్కర స్నానమని పలువురు పురోహితులు, పెద్దలు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో అంతర్వాహిణిగా ఉన్న సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల 15న ప్రారంభం కాగా 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు సరస్వతి ఘాట్లో పుష్కర స్నానం ఆలయంలో ప్రత్యేక పూజలు -
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
స్టేషన్ఘన్పూర్: రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి మండలంలోని ఛాగల్లు శివారు శివారెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్లకు చెందిన రాయరాకుల సతీశ్(42) ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గన్మన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్పై హనుమకొండ నుంచి జనగామ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఛాగల్లు శివారులో శివారెడ్డిపల్లి వద్ద జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.● శివారెడ్డిపల్లి వద్ద ఘటన ● మృతుడు మాజీ మంత్రి దయాకర్రావు గన్మన్ -
రైతులు ఉక్కిరి బిక్కిరి!
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025– IIలోuసాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: యాసంగి ధాన్యం అంచనాకు మించి దిగుబడి వ చ్చింది. ఇదే రీతిలో కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అంచనాకు మించి ధాన్యం కేంద్రాలకు రావడంతో ఒక వైపు కాంటాలు ఆలస్యం.. మరోవైపు గన్నీ సంచులు, లారీల కొరతతో పాటు జిల్లాలోని మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. ఈక్రమంలో వారాల తరబడి కేంద్రాల్లోనే రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. దీనికి తోడు సాయంత్రం అయితే ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంచనాలు తారుమారు.. గత యాసంగిలో సివిల్ సప్లయీస్ అధికారులు వేసిన అంచనాల్లో మూడోవంతు ధాన్యం కూడా రాలేదు. ఇదే పరిస్థితి ఉంటుందని ఈ సారి అధికారులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. యాసంగిలో 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్ అమ్మకాలు, ఇతర అవసరాలకు రైతులు నిల్వ ఉంచడం పోనూ.. కొనుగోలు కేంద్రాలకు 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అయితే సన్న ధాన్యానికి క్వింటాకు బోనస్తో కలుపకొని రూ. 2,820 చెల్లించడంతో అందరు కొనుగోలు కేంద్రాలకే రావడం మొదలు పెట్టారు. దీనికి తోడు దిగుబడి అంచనా కూడా పెరడగంతో ఇప్పటికే 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 30వేల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం కేంద్రాల్లో ఉంది. ఇంకా రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తూనే ఉంది. తీరని లారీల కొరత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే పలుచోట్ల ధాన్యం కొనకుండా ఉండడంతో ఒకేసారి రైతుల నుంచి ఒత్తిడి పెరిగింది. పెద్ద మొత్తంలో ధాన్యం రావడం, కాంటాలు పెట్టిన ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు సరిపడా లారీలను అధికారులు సమకూర్చలేకపోతున్నారు. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం కేంద్రాల్లోనే వారాల తరబడి ఉంచాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఆరు ఐదు రూట్లలో లారీలు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లారీలు పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎగుమతి చేసిన ధాన్యం ఆధారంగా 80శాతం డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదని పలువురు లారీ కాంట్రాక్టర్లు లారీలు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దీంతో సరిపడా లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిండిన మిల్లులు జిల్లాలో 193 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేకునే మిల్లులు నిండిపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 63 రైస్ మిల్లులు ఉండగా ఇందులో సీఎంఆర్ పెట్టడం లేదని 16 మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు. ప్రభుత్వం పెట్టిన 10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధనలతో మరికొన్ని మిల్లులు వెనకడుగు వేశాయి. కాగా, వీటన్నిటికి అంగీకరించిన 40 మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయగా.. ఇప్పటికే వానాకాలం ధాన్యం నిల్వ ఉండడం, యాసంగి ధాన్యం రావడంతో మిల్లులు నిండిపోయాయి. జిల్లా సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు ఈవిషయం తెలుపగా వరంగల్ జిల్లాలోని మిల్లులకు పంపించాలని చెప్పారు. అయితే అక్కడ కూడా ఎక్కువ మొత్తంలో ధాన్యం రావడంతో మాకొద్దు మీ ధాన్యం అని వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు అంటున్నట్లు తెలిసింది. దీంతో ధాన్యం ఎగుమతి చేయడం కూడా అధికారులకు సవాల్గానే మారింది. 250 బస్తాల ధాన్యం తడిసింది మా 250 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు పెట్టి మూడు రోజులైంది. లారీలు రాకపోవడం వల్ల నాలాంటి ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లా రీలు రాకపోవడంతో అకాల వర్షం వల్ల ధా న్యం బస్తాలు తడిసిపోయాయి. ఇంకా ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రంలో ఉండాలి, ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు భరించాలి. – బానోత్ మీట్యా, ఇస్లావత్తండా జీపీ ధాన్యం కొన్నారు... తరలించలేదు.. సింగారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో మా వద్ద నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేశారు. కానీ బస్తాలు నింపి ఉంచి కాంటాలుపెట్టి మిల్లులకు తరలించకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిసింది. ఇప్పుడు మిల్లర్లు ఈ బస్తాలు తీసుకోమని చెబితే మా పరిస్థితి ఏమిటో అర్థం కాడంలేదు. – బానోత్ జేతా, కేశ్యతండా, వీఎస్.లక్ష్మిపురం జీపీ అకాల వర్షం.. తడిసిన ధాన్యం కురవి/మరిపెడ రూరల్/ నర్సింహులపేట/ పెద్దవంగర/దంతాలపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు చెట్లు కూలిపోయాయి, ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కురవి మండల కేంద్రంతోపాటు నేరడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కాంటా అయిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోయింది. నేరడ గ్రామానికి వెళ్లే మార్గంలో పెద్ద వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. యువకులు రోడ్డుపై పడిన చెట్టును తొలగించారు. సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో ధాన్యం తడిసిపోయింది. నర్సింహులపేట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. అలాగే మరిపెడ మండలంలోని తండధర్మారం గ్రామానికి చెందిన రైతు ధరంసోత్ మంగీలాల్కు చెందిన 90 ధాన్యం బస్తాలు తడిసిపోగా ఆరబెట్టుకున్నాడు. పెద్దవంగర మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన బస్తాలు తడిసిపోయాయి. శుక్రవారం బస్తాలను ఉల్టావేసి ఆరబెట్టుకున్నారు. అధికారులు తహసీల్దార్ మహేందర్, ఏఓ స్వామి నాయక్, ఏఈఓలు కేంద్రాలను సందర్శించారు. కాంటా పెట్టి నిల్వ ఉన్న బస్తాలను లారీల ద్వారా పంపించే పక్రియను వేగవంతంగా చేట్టారు. అలాగే దంతాలపల్లి మండలంలోనూ అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. న్యూస్రీల్కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలు సరిపడా గన్నీ సంచులు, లారీలు లేక ఇబ్బందులు ఇప్పటికే నిండిపోయిన రైస్ మిల్లులు మాకొద్దు ధాన్యం అంటున్న వరంగల్ అధికారులు రైతులను వెంటాడుతున్న అకాల వర్షాలు -
నేడు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించనున్నట్లు ఏఓ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించే కార్యక్రమంలో కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి మహబూబాబాద్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సర్సింహస్వామి అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ.. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి హార్డ్కాపీలు రాకపోతే వెంటనే తెప్పించుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి వెరిఫికేషన్ నివేదికలు త్వరగా తీసుకుని టార్గెట్లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస రావు, ఎల్డీఎం సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు బయ్యారం: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడిన వారికే పదవులు వస్తాయని టీపీసీసీ జిల్లా పరిశీలకులు కూచన రవళిరెడ్డి, పొట్ల నాగేశ్వరరావు అన్నారు. సంస్థాగత కమిటీల ఏర్పాటులో భాగంగా శుక్రవారం స్థానిక సీతారామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ పెద్దల సూచనల మేరకు నిజమైన పార్టీ శ్రేణులకే పదవులు వస్తాయని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఇ ల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముసలయ్య, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రామునాయ క్ తదితరులు పాల్గొన్నారు. 108 ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నెహ్రూసెంటర్: ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నియమితులయ్యారు. జిల్లాలోని 108 (అత్యవసర సేవలు), 102 (అమ్మ ఒడి), 1962 (పశు సంచార) సేవలను పర్యవేక్షణ చేయనున్నారు. మహబూబాబాద్ ప్రోగ్రాం మేనేజర్గా పని చేసిన భూమ నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో వరంగల్లో మేనేజర్గా పని చేస్తున్న శివకుమార్ విధుల్లో చేరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు గార్ల: ఆస్పత్రి అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కో రం కనకయ్య అన్నారు. శుక్రవారం గార్ల సీహెచ్సీని తనిఖీ చేశారు. తొలుత వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. నలుగురు డాక్టర్లలో ఒక్కరే విధులకు హాజరుకావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డాక్టర్లకు లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటే.. కొంతమంది వారంలో ఒకరోజు కూడా హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నుంచే కొంతమంది డాక్టర్లకు ఎమ్మెల్యే ఫోన్ చేయగా వారు పొంతన లేని సమాధానం చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వచ్చే రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ను పిలిచి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యుల గైర్హాజరు విషయాన్ని వైద్యశాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గాప్రసాద్, మాజీ ఎంపీపీ వెంకట్లాల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, డాక్టర్లు హనుమంతరావు, రాజ్కుమార్ జాదవ్ పాల్గొన్నారు. -
డెంగీ నివారణకు కృషి చేద్దాం●
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన డెంగీ వ్యాఽధి నివారణకు ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తున్నారని, వాటి నివారణను ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దొమల నివారణ పద్ధతులు పాటించాలని తెలిపారు. ఏటా డెంగీ కేసులు పెరుగుతూ రోగులు చనిపోతున్నారని, వ్యాధికి కచ్చితమైన ఔషధం లేనందున నివారణ ఒక్కటే మార్గమన్నారు. కార్యక్రంమలో ప్రోగ్రాం అధికారులు సుధీర్రెడ్డి, శ్రవణ్, జీజీహెచ్ ఆర్ఎంఓలు జగదీశ్వర్, హర్షవర్ధన్, జిల్లా డిప్యూటీ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీహెచ్ఎన్ఓ సక్కుభాయి, హెచ్ఈలు కేవీ రాజు, పురుషోత్తం, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, శ్రీరామ్, రామకృష్ణ, కేఎల్ఎన్ స్వామి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహించొద్దు గూడూరు: చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండలంలోని భూపతిపేట చెక్పోస్టును శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ వ్యాపారాలపై కూడా నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్రెడ్డి, కొత్తగూడ, గంగారం ఎస్సైలు కుషకుమార్, రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గత సీజన్తో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలు పెరిగిందన్నారు. జిల్లాలో 1.16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దానిలో 1,03,000 మెట్రిక్టన్నులు మిల్లులకు తరలించినట్లు చెప్పారు. వీసీలోజిల్లా నుంచి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఉన్నారు. వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలతో పాటు, పసుపు, కుంకుమ, చీర, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు. నిండిన పార్కింగ్ స్థలాలు, చలువ పందిళ్లు.. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్, ఇప్పలబోరు వైపు పార్కింగ్లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్స్థలాలనుంచి సరస్వతి ఘాట్, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది. వీఐపీల రాక.. రెండో రోజు శుక్రవారం సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జ్ జడ్జి పట్టాభిరాం వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట..వీకెండ్స్లో పెరగనున్న భక్తుల తాకిడి..శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు. రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ కిటకిటలాడిన సరస్వతి ఘాట్, దేవస్థానం పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీఐపీలుపుష్కరాల మరిన్ని వార్తలు, ఫొటోలు – IIలోu -
బస్టాండ్ బహుదూరం..
కాటారం : సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రధాన ఆలయం, సరస్వతీ(వీఐపీ) ఘాట్, మెయిన్ ఘాట్కు చాలా దూరంలో ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు, భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయానికి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్కు అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్సులు నడుపుతుండడంతో భక్తులు అక్కడే దిగి అక్కడే ఎక్కాల్సి వస్తోంది. పుష్కర స్నానానికి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాల్లో, ఉచిత బస్సుల్లో వెళ్తున్నా తిరుగు ప్రయాణంలో మాత్రం ఆలయం నుంచి తాత్కాలిక బస్టాండ్ వరకు నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. -
పుష్కర భక్తులకు రోజూ అన్నదానం
వరంగల్ చౌరస్తా : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులకు రోజూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్ బాబు తెలిపారు. గురువారం వరంగల్ రామన్నపేట ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 రోజులపాటు కొనసాగే పుష్కరాలకు లక్షలాది మంది ఆర్యవైశ్యులు హాజరై పుష్కర స్నానం చేసి స్వామివారి సేవలో తరిస్తారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యే ఆర్యవైశ్యుల కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సత్రం అధ్యక్షుడు సోమ రామయ్య, ఉపాధ్యక్షుడు గోరంటల యాదగిరి, ప్రతినిధులు యిరుకుళ్ల రమేశ్, ఐతా గోపినాథ్, గుముడవెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ నిర్వహణ అధ్వానం!
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాల సందర్భంగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన పుష్కరాలకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారుజాము వరకు తరలొచ్చారు. కాగా, నదిలో స్నానాలు చేసిన భక్తులు నేరుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం, పోలీసు అధికారులతో ఇబ్బందులు పడ్డారు. పోలీసులు, దేవస్థానం అధికారుల కుటుంబాలు, బంధువులు, స్నేహితుల కోసం దర్శనాలకు వీఐపీ దర్శనాలు చేయించడానికి తీసుకెళ్తున్నారని గుర్తుతెలియని ఎండోమెంట్శాఖ అధికారులు ప్రధాన మండపానికి వెళ్లే గ్రిల్కు తాళం వేసి దాచిపెట్టారు. దీంతో పోలీసుల, ఇతర అధికారుల కుటుంబాలు రావడంతో దేవస్థాన ఉద్యోగులు తాళం వేసి దొరకడం లేదని తెలుపడంతో ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండున్నర గంటల అనంతరం తాళం చెవి దొరకడంతో సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో అసహానానికి గురయ్యారు.దేవాదాయశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని భక్తులు ఆరోపించారు. మిగతా 11రోజులు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని నివాసంలో సీఎంను కలిసిన వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరుపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. తహసీల్దార్ల బదిలీ మహబూబాబాద్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ నవీన్మిట్టల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ తహసీల్దార్ భగవాన్రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. తహసీల్దార్లు సైదులు, శ్వేత, నారాయణమూర్తిని ఖమ్మం జిల్లాకు, తహసీల్దార్ రమాదేవిని ములుగు జిల్లాకు బదిలీ చేశారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు సీహెచ్.నరేశ్, వివేక్, ఇమ్మానీయల్, నాగభవాని, పూర్ణచందర్, రమేశ్బాబును మహబూబా బాద్కు జిల్లాకు బదిలీ చేశారు. కాగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు మండలాలు కేటాయించనున్నారు. నేరప్రవృత్తిని విడనాడాలి తొర్రూరు: రౌడీ షీటర్లు నేరప్రవృత్తిని విడనాడాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ అ న్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ.. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే రౌడీషీట్ తొలగిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. సీఐ గణేశ్, ఎస్సైలు ఉపేందర్, రమేష్బాబు, రాజు, సురేశ్ పాల్గొన్నారు. -
కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు : సీఎం రేవంత్రెడ్డి
మంత్రి శ్రీధర్బాబు కోరినట్లుగా కాళేశ్వరం శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబును, అధికారులను అభినందించారు. మంత్రులు ఏమన్నారంటే.. ● మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫు ష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. ● రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. ● రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కర స్నానాలను భక్తులు ఆచరించాలని సూచించారు. – మరిన్ని పుష్కర వార్తలు, ఫొటోలు 8లోu -
ముహూర్తం ప్రకారం 5.44 గంటలకు..
జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలను వేదపండితులు శాస్త్రోకంగా గణపతిపూజతో ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున 5.44గంటలకు కాళేశ్వరంలోని సరస్వతిఘాటుకు చేరుకొని ముహూర్తం ప్రకారం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందసరస్వతిస్వామి ముందుగా పుష్కరునికి ఆహ్వాన పూజ చేశారు. పండితులు సరస్వతిమాతకు పూలు, పండ్లు, పాలు, చీరసారెతో నైవేద్యం సమర్పించారు. మాధవా నందసరస్వతిస్వామి పుష్కరినిలో స్నానం ఆచరించి ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్జేసీ రామకృష్ణారావు, ఈఓ మహేశ పుష్కర ప్రారంభ స్నానాలు ఆచరించారు. అనంతరం వేదపండితులు ఐదు కలశాలలో గోదావరి జలాలను తీసుకుచ్చి శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
కురవి: మండలంలోని బలపాల గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈ విజయ్ అన్నారు. గురువారం బలపాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, బంచరాయి, ఎస్సీ కాలనీలను సందర్శించి అక్కడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బంచరాయిలో విద్యుత్ వైర్లు అపహరణకు గురికాగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మిడిల్ పోల్స్, కొత్త ట్రాన్స్ఫార్మర్, పాఠశాలలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యుత్ వైర్లు చోరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వరకు స్తంభాలు ఏర్పాటు, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగిస్తామని తెలిపారు. ఏఈఈ శారద, లైన్మన్ కపిల్, గణేశ్, ఉప్పయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, పాఠశాల హెచ్ఎం సునీత, ప్రసాద్, మదన్, మోహన్, వెంకటేశ్వర్లు, నరేశ్,మంగయ్య, రాంకోటి, ఈదయ్య, రమేశ్, వీరభద్రం, వెంకటేశ్, శ్రీను, ఆనందం పాల్గొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
దంతాలపల్లి: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. భూముల విషయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దరఖాస్తుదారుల ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని, సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, తహసీల్దార్ సునీల్కుమార్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని వంతడపల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా చేపట్టాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
కాకతీయుల గడ్డపై మెరిసిన ప్రపంచ సుందరీమణులు
రవిని తలపించే మోము.. తారల వెలుగులు నిండిన కనులు.. నుదుటిపై బొట్టు.. తలనిండా మల్లె, కనకాంబర పూలు, నెలవంక కట్టగా నెమలంచు చీర.. కన్నెపిల్లలు చుట్టగా కలువ రేకుల చీర.. ఆరు మూరల చీర కట్టిన అరిందలు.. ఓరుగల్లులో విహరించారు. ఫ్యాన్సీ దుస్తులు వదిలేసి పదహారణాల తెలుగమ్మాయిల్లా మారి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధ్ధులను చేశారు. రెడ్కార్పెట్పై హొయలొలుకుతూ చిరునవ్వులతో తమ అందాలను ఆరబోశారు. ● తెలుగింటి ఆడపడుచుల్లా ముస్తాబు ● ఫ్యాన్సీ డ్రెస్లు వదిలి అంచుల చీరలు, పట్టుపరికిణీలు కట్టిన భామలు ● హైదరాబాద్ నుంచి నేరుగా హరిత కాకతీయకు.. ● వేయిస్తంభాలు, రామప్ప ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు ● అందరికీ అభివాదం చేస్తూ ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ● సుందరీమణులకు ప్రత్యేక బహుమతుల అందజేతసాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్/హన్మకొండ చౌరస్తా/వెంకటాపురం(ఎం) : మిస్ వరల్డ్–2025 పోటీదారులు బుధవారం వరంగల్ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా హనుమకొండకు చేరుకున్న వారు హరిత కాకతీయలో దిగారు. హోటల్ వద్ద వారికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, సీపీ సన్ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. హోటల్లో సుమారు గంటకుపైగా గడిపిన వారు వేయిస్తంభాల ఆలయానికి వెళ్లే ముందు చీర కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిల్లా తయారయ్యారు. సుందరీమణుల రాకతో చారిత్రక ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. ముందుగా తూర్పు ద్వారం వద్ద గల ఆలయ విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఏకశిలాశాసనాన్ని టూరిజం గైడ్ సూర్యకిరణ్ క్లుప్తంగా వివరించారు. చారిత్రక ఆలయాన్ని చూసి మురిసిపోయారు.నందీశ్వరుడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీల్లో పాదాలను శుభ్రం చేసుకున్నారు. నందీశ్వరుడి వద్ద ఫొటోలు దిగిన సుందరీమణులకు కల్యాణమంటపం విశిష్టతను గైడ్ వివరించారు. మంటపం వద్ద మరోసారి ఫొటోషూట్తో సందడి చేసి, ఆలయం చుట్టూ ప్ర దక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ సుందరీమణులకు సన్నాయి మేళాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో రుద్రేశ్వరుడికి అభిషేకం చేసిన అనంతరం పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఖిలావరంగల్కు బయలుదేరి వెళ్లారు. కోట చారిత్రక అందాలకు ఫిదా విశ్వసుందరి పోటీదారులు ఖిలావరంగల్ కోటకు రాత్రి 7.20గంటలకు చేరుకొని కాకతీయ కళా వైభవాన్ని తెలుసుకొని మంత్రముగ్ధులయ్యారు. కోటలో ఏర్పాటు చేసిన ఫ్లియా మార్కెట్ను సందర్శించి చేనేత కలంకారి దర్రీస్, జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, పసుపు, హ్యాండ్ బ్యాగులు, బంగారు వర్ణంలో మెరిసిన హ్యాండ్ క్రాఫ్ట్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించడంతో ఆసక్తిగా విన్నారు. కాకతీయుల నాలుగు కీర్తితోరణాల నడు మ నళ్ల రాతిలోని శిల్ప కళ సంపదను అందాల భా మలు మరింత ఆసక్తిగా తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. టీజీ టీడీసీ ఆధ్వర్యంలో 45 నిమిషాల నిడివిగల సౌండ్ అండ్ లైటింగ్ షోను ఇంగ్లిష్లో ప్రదర్శించగా... ఆసక్తిగా వీక్షించారు. అంతకుముందు కాకతీయుల తోరణం ఎదుట గ్రూపు ఫొటో దిగారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలో పేరిణి నృత్య కళాకారుడు గంజల రంజిత్ శిష్య బృందం ప్రదర్శించిన శివతాండవం ఆకట్టుకుంది. చివరగా సుందరీమణులకు చేనేత కలంకారి దర్రీస్, చపాట మిర్చి, పాకాల, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూపొందించిన సావనీర్తో కూడిన బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామప్ప అందాలు వీక్షించి.. రామప్ప సరస్సుకట్టపై ఉన్న హరితహోటల్ వద్దకు సాయంత్రం 4:30 గంటలకు చేరుకున్న మిస్వరల్డ్ పోటీదారులు సంప్రదాయ దుస్తులు ధరించారు. 5:50గంటలకు రామప్ప ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న వారికి కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు స్వాగతం పలికారు. కలెక్టర్ దివాకర టీఎస్తో పాటు అధికార యంత్రాంగం వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆలయానికి చేరుకున్న తరువాత రెండు బృందాలుగా విడిపోయారు. 18 మంది, 15 మంది వేర్వేరుగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను ప్రొఫెసర్ పాండురంగారావుతో పాటు టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేష్ వారికి వివరించగా శిల్పకళ సంపదను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. ముఖ్య అతి థిగా వచ్చిన మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆల య ఆవరణలో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం గార్డెన్లో పేరిణి నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆసక్తిగా తిలకించారు. -
జిల్లా పాఠ్యపుస్తకాల గోదాం సందర్శన
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్లోని జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలను ఆయన పరిశీలించారు. జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ చీకటి వెంకట్రాంనర్సయ్యకు పలు అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 20నుంచి జిల్లాలోని వివిధ మండలాలకు పుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 2,21,880 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులునెహ్రూసెంటర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు మహబూబాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ నుంచి కాళేశ్వరానికి పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 210గా బస్సు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పవిత్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన కోరారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలిడోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ మీదుగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్యూసీసీ సభ్యుడు లక్ష్మణ్నాయక్ కోరారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో బుధవారం దక్షిణ మధ్యరైల్వే డివిజనల్ మేనేజర్ అరుణ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, ముఖ్యంగా కాజీపేట–విజయవాడ(337–338) ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.కురవిలో చెక్ పోస్టు ఏర్పాటుకురవి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి–365పై పెట్రోల్ బంక్ వద్ద కురవి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం రాత్రి మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ప్రారంభించారు. జూన్ 6న బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ఉండేందుకు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై గండ్రాతి సతీశ్, పీఎస్సై కృష్ణారెడ్డి, ఏఎస్సై వెంకన్న, సిబ్బంది జానిమియా, కాశీరాం, హరిబాబు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని బుధవారం సందర్శించి మాట్లాడారు. శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకుని విద్యార్థులకు ఉత్తమ బోధన చేపట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు పాఠశాలలకు సరి గా హాజరుకాకపోవడంతో గణితం, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో నైపుణ్యత సాధించలేకపోతున్నారని అన్నారు. అన్ని సబ్జెక్టులపై విద్యార్థులు మక్కువ చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల్లో చదవడం, రాయడం పెంపొందించాలన్నారు. ఆర్జేడీ సత్యనారాయణ, డీఈఓ రవీందర్రెడ్డి, ఏసీ జీఈ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, చంద్రశేఖర్ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,22,641 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఈమేరకు అధికారులు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలా ఉండగా రైతులు వేసవి దుక్కులను దున్నుతున్నారు. అదనపు చర్యలు.. జిల్లా వ్యవసాయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు విత్తనాలు, ఎరువుల సరఫరా, రైతులకు సాంకేతిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాగా జిల్లాకు 11వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కేటాయించగా.. పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయ పరిశోధన కేంద్రాల వద్ద 50శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను పొందవచ్చు. దుక్కులు పొతం.. జిల్లాలో మెట్టప్రాంతాల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న అధికంగా పండిస్తారు. అలాగే కంది, బొబ్బెర, నువ్వులు, పెసర, మినుములు, వేరుశనగ, పసుపు పంటలు కూడా సాగు చేస్తారు. ఈమేరకు ప్రస్తుతం రైతులు వేసవి దుక్కులు దున్ని పంట వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువుల అవసరం (మెట్రిక్ టన్నుల్లో) యూరియా : 54,198.975డీఏపీ : 10,526.993ఎంఓపీ : 5,119.540ఎస్ఎస్పీ : 1,390.493కాంప్లెక్స్ : 34,762.331నేడు ఐడీఓసీలో సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం వానాకాలం సాగు సన్నద్ధతపై సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని రకాల విత్తన వ్యాపారులు హాజరుకావాలి. ఈ సమావేశంలో విత్తనాల సరఫరా, నాణ్యత, రైతులకు సకాలంలో అధికారుల అందుబాటు తదితర అంశాలపై చర్చిస్తారు. – విజయనిర్మల, డీఏఓ పంటల సాగు వివరాలు(ఎకరాల్లో) వానాకాలంలో 4,22,641 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు వేసవి దుక్కులు దున్నుతున్న రైతులు కావాల్సిన విత్తనాలు వరి : 44,256 క్వింటాళ్లు పత్తి : 1,69,708 (ప్రతీ ప్యాకెట్ 475 గ్రాములు) మొక్కజొన్న : 4,669 క్వింటాళ్లు మిరప : 522.49 క్వింటాళ్లు కంది : 30 క్వింటాళ్లు పెసర : 182.2 క్వింటాళ్లు మినుములు : 40 కిలోలు వేరుశనగ : 21 క్వింటాళ్లు పసుపు : 2,315 క్వింటాళ్లు నువ్వులు : 1.04 క్వింటాళ్లు -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ వెలుగులు, వేదిక – వివరాలు 8లోuజయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేటినుంచి (గురువారం) ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు సరస్వతి ఘాట్లో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొననున్నారు. – కాళేశ్వరం ● నేటినుంచి 26వ తేదీ వరకు నిర్వహణ ● సరస్వతిఘాట్లో పుణ్య స్నానం ఆచరించనున్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం -
కాంగ్రెస్లో కమిటీల సందడి
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీలో కమిటీల సందడి మొదలైంది. గత అనుభవాల నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించగా.. ఇందుకోసం జిల్లాకు ని యమించిన పరిశీలకులు పొట్ల నాగేశ్వర్రావు, రవళిరెడ్డి వారం రోజులుగా జిల్లాలో పర్యటించి కమి టీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. వారం రోజులుగా.. జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ వారం రోజులుగా సాగుతోంది. జిల్లా పరిశీలకులు పొట్ల నాగేశ్వర్రావు, రవళిరెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మినహా 14 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో కమిటీల నియామకం కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇలా ఆయా మండలాల్లో గ్రామ, మండల అధ్యక్షులు, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. గాడ్ ఫాదర్స్ను నమ్ముకొని.. పదవులకోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు ఎవరికి వారుగా తమకే పదవి వస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు, ఇల్లెందు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు, అదే విధంగా ఎంపీ పోరిక బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరులు కూడా పదవులకోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు మేం కేవలం దరఖాస్తు చేసే వరకే.. అంతా మా నాయకులు చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పలు మండలాల్లో రసాభాసగా మారింది. నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో పాత కార్యకర్తలను కాకుండా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు పీసీసీ వరకు వెళ్లాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి పకడ్బందీగా నియామక ప్రక్రియ ఉంటుందని జిల్లాకు వచ్చిన పరిశీలకులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సమక్షంలో నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే పరిశీలకులు చెప్పిన విధంగా పార్టీకోసం కష్టపడిన వారికి పట్టం కడుతారా.. పైరవీలతో వచ్చిన నాయకులకు పట్టం కడుతారా అనేది జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. గ్రామ, మండల, బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు కసరత్తు 14 మండలాలు, ఐదు పట్టణాల్లో దరఖాస్తుల స్వీకరణ పోటీ పడి దరఖాస్తు చేసిన ఆశావహులు -
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో పాల్గొనేందుకు గురువారం సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వర పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, సీఎం భద్రతా అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. బుధవారం కాళేశ్వరంలోని ఈఓ కార్యాలయంలో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ ద్వారా గురువా రం సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారని తెలిపారు. సీఎం ప్రయాణించే మార్గంలో పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ కంట్రోల్, ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఎస్హెచ్జీ హ్యాండ్లూమ్ స్టాళ్లు.. కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల (ఎస్హెచ్జీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ ఉత్పత్తుల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ స్టాళ్ల పర్యవేక్షణకు డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేకాధికారులుగా నియమించారు. టెక్స్టైల్, హ్యాండ్లూమ్ స్టాళ్లలో పట్టు చీరలు, నూలు వస్త్రాలు, డిజైన్ దుస్తులు, చేనేత వస్త్రాలతోపాటు ప్రత్యేక కలెక్షన్ వస్త్రాలు ప్రదర్శిస్తారని అధికారులు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు తక్కువ ధరల్లో, నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని, ఈ స్టాళ్ల ఏర్పాటుతో ఎస్హెచ్జీలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేడు ప్రారంభ కానున్నాయి. గురువారం నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. కాగా, రాత్రి సమయం సందర్భంగా (నేడు) గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. ఈ పూజలో మెదక్ రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందాసరస్వతి పాల్గొననున్నారు. పీఠాధిపతితో మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, దేవస్థానం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తజనం తరలిరానుందని అధికారులు అంచనా. 12 రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కర శోభ నెలకొననుంది. ఉత్తరాఖండ్లోని మానస నది, ఆలహాబాద్లోని గంగా, యమున, అంతర్వాహిణి సరస్వతి, తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదులకు పుష్కరాలు జరుగుతాయి. ఏర్పాట్లు ఇలా.. సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక దృష్టితో పనులు ముమ్మరం చేశారు. అంతర్గత సీసీ రోడ్లు, ప్రసాదశాల కౌంటర్లు, పుష్కరఘాట్ విస్తరణ, రెండు ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శాశ్వత మరుగుదొడ్లు, కల్యాణ కట్ట, మెయిన్ ఘాట్ నుంచి సరస్వతీఘాట్కు గ్రావెల్రోడ్డు, గోదావరిలో మట్టిరోడ్డు, వీఐపీ ఘాట్ నుంచి పలుగుల రోడ్డు మట్టిరోడ్డు, చలువ పందిళ్లు, సరస్వతీమాత విగ్రహం, హారతి స్టేజీపై ఏడు గద్దెలు, జ్ఞానదీపం, తాత్కాలికంగా డెకరేషన్స్, టెంట్సిటీ, డార్మెటరీ హౌస్లు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. మిషన్భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం కొత్త బస్టాండ్, వాసవీ సత్రం, అంతర్రాష్ట్ర వంతెన సమీపం, హరితహోటల్ సమీపం, వీఐపీఘాట్, ఇబ్బలబోరు వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్హౌస్లో సాలహారంతో ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు కాశీ పండితులతో హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.సరస్వతీమాత విగ్రహం వెనుక ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమనేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహణ నేటి ఉదయం 5.44 గంటలకు ముహూర్తం ఖరారు ప్రారంభ పూజలో పాల్గొనున్న పీఠాధిపతి మాధవానందాసరస్వతి, మంత్రి శ్రీధర్బాబు పుష్కర స్నానాలకు సరస్వతీఘాట్, మెయిన్ ఘాట్ టెంట్సిటీ, హారతి స్టేజ్ ఏర్పాటు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంనేడు కాళేశ్వరానికి సీఎం రాక సాక్షి ప్రతినిధి వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరానికి రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి దంపతులు గురువారం రానున్నారు. ఆయన హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరుతారు. 5గంటలకు కాళేశ్వరం చేరుకొని వీఐపీ ఘాటులోని టెంట్ సిటికి వప్తారు. 5.25గంటలకు సరస్వతిమాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 6గంటలకు సరస్వతినదిలో సీఎం దంపతులు సంకల్ప పుష్కరస్నానం చేస్తారు. 6.05గంటలకు శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. 6.30గంటలకు అర్చకులతో ఆశీర్వచనం చేస్తారు. 6.40గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సరస్వతి నవ రత్నమాల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటల తరువాత రోడ్డు మార్గం గుండా భూపాలపల్లికి చేరుకుంటారని సీఎం కార్యాలయంనుంచి షెడ్యూల్ ఖరారు చేశారు. -
పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు (గురువారం) సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీమాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత త్రివేణి సంగమంలో మొదటిసారి కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పెద్ద ఎత్తున సరస్వతీనది పుష్కరాలు నిర్వహిస్తున్నామని, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ -
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మకాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం దేవస్థానంలోని కల్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు రోజూ సుమారు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ అధికారి తమకు కేటాయించిన లోకేషన్లలో మందస్తు పర్యటించి ఏర్పాట్లు పరిశీలించాలని తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఘాట్ల వద్ద 50 మంది గజ ఈతగాళ్లు నాటు పడవలతో పహారా కాస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విధులు కేటాయించిన అధికారులు ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, తదితరులు పాల్గొన్నారు. -
ప్లస్ టు ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయకేతనం
విద్యారణ్యపురి: ప్లస్ టు (సీబీఎస్ఈ ఇంటర్) పరీ క్షల ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదా రెడ్డి, మఽధుకర్రెడ్డి, సంతోశ్రెడ్డి తెలిపారు. జి. సా యిహర్షిణి 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. ఆర్. స్వస్తికా 478 మార్కులు, సీహె చ్. అన్సికా 477 మార్కులతో జాతీయ స్థాయిలో ‘ఎస్ఆర్’ కీర్తి ప్రతిష్ట నిలిపారని తెలిపారు. అలాగే, కె. అంజనాసంతోషి 475 మార్కులు, ఎ. అమూల్య 472 మార్కులు, వి.ప్రత్యూన్నారెడ్డి 470 మార్కులు సాధించారని వారు తెలిపారు. భవిష్యత్తులో మరింత అత్యుత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో విజయభేరి..
విద్యారణ్యపురి: సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాల్లో ‘ఎస్ఆర్’ స్కూల్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ౖ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల చెర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్రెడ్డి మంగళవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఎం. రిషి 500 మార్కులకుగాను 498 మార్కులు సాధించారని వారు పేర్కొన్నారు. వి. వివేకానందారెడ్డి 487 మార్కులు, కె జశ్వంత్ 487 మార్కులు, బి హృశికేశ్మూర్తికి 485 మార్కులు, ఎ. సాయి కశ్యప్ 484 మార్కులు, పి.అభిలాశ్రెడ్డి 481మార్కులు, కెకె.సాహిత్య 480మార్కులు సాఽధించారని తెలిపారు. పటిష్ట విద్యాప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృంద విద్యాబోధనతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఎస్ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్పై శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు. -
నేటినుంచి కేయూ డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు నేటి నుంచి (ఈనెల 14నుంచి) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మంగళవారం తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46, ఖమ్మం జిల్లాలో 25, ఆదిలాబాద్ జిల్లాలో 47.. మొత్తం 118 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 125 మంది అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 79,224మంది విద్యార్థులు, ఖమ్మం జిల్లాలో44,793 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 77,221మంది.. మొత్తం 2,01,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 10 మంది ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. టైంటేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు హాల్టికెట్లను సంబంఽధిత కేయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన సమయానికి ముందే ఆయా కేంద్రాలకు ఆన్లైన్లోనే ప్రశ్నాపత్రాలు పంపిస్తారు. డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేయాల్సింటుంది. పరీక్షలు రాయనున్న 2,01,238 మంది విద్యార్థులు 118 కేంద్రాలు ఏర్పాటు 125మంది అబ్జర్వర్లు, 10 మంది ఫ్లయింగ్స్క్వాడ్ల నియామకం -
9 రోజుల బాబుకు ఊపిరి పోశారు..
కమలాపూర్: వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. అలాంటి ఘటనే ఇది. ఊపిరాడక, కదలిక లేని 9 రోజుల బాబుకు వైద్యులు, సిబ్బంది ఊపిరి పోసి కాపాడారు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ సా మాజిక ఆరో గ్య కేంద్రంలో చోటు చేసుకుంది. కమలాపూర్కు చెందిన రాపెల్లి సంధ్యారాణి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 9 రోజుల క్రితం ప్రసవించి బాబుకు జన్మనిచ్చింది. అవగాహనారాహిత్యంతో బాబుకు సబ్బుతో స్నా నం చేయించడంతో ముక్కులోకి సబ్బు నీళ్లు వెళ్లి ఊపిరాడక, కదలిక లేకుండా పోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా డాక్టర్ వరుణ్ మా ధవ్ ఆధ్వర్యంలో నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న, అనిత, కల్యాణి కలిసి బాబు ముక్కులో పైపు వేసి ఆస్పిరేషన్ ద్వారా సబ్బు నీళ్లు బయటకు తీయడంతో బా బులో కదలిక వచ్చి ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాడు. అనంతరం బాబుకు పిల్లల వైద్యుడితో మెరుగైన వైద్యం ఇప్పించాలని సూచించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. దీంతో సదరు కుటుంబీకులు బాబుకు ఊపిరి పోసిన వైద్యుడు, నర్సింగ్ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఆస్పత్రి వైద్యుల ఘనత -
‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’
నయీంనగర్: సీబీఎస్ఈ –2025 టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయదుందుభి మోగించారు. సిద్దామూర్తి జ్ఞానతేజారెడ్డి 487 మార్కులు, గంజి ఉదయ్ నిక్షిత్, లడే శ్రీవిద్య 481 , ఎస్.నందిత 479, భవ్యాంశ్ అగర్వాల్ 476, భూక్యా శ్రీ కృష్ణ కౌషిక్ 473, ఎం. సునైన రీతుల్ 472 , కె.మీనాక్షి 471 మార్కులు సాధించారు. హంటర్రోడ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్లలో విద్యార్థులు అధిక మార్కులు సాధించారు. పాఠశాల గత చరిత్రను ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఉత్తమ స్థానం నిలబెట్టుకుంది. ఈ విజయపరంపర కొనసాగించి న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లి దండ్రులకు విద్యాసంస్థల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలిపారు. -
హరిత హోటల్ వద్ద భారీ భద్రత
వరంగల్ క్రైం : ప్రపంచ సుందరీమణుల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలో వారు బస చేసే హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా హరిత హోటల్ను పూర్తి నిఘా నీడలో ఉంచనున్నట్లు తెలిపారు. అండర్–25 క్రికెట్ జిల్లా జట్ల ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15, 16వ తేదీల్లో అండర్–25 జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ మైదానంలో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల స్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఆరు జిల్లాల క్రికెట్ జట్ల ఎంపిక కోసం నిర్వహించే ఈ పోటీల్లో 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల క్రీడాకారులు, ఆగస్టు 31, 2000 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, మీసేవ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, యూనిఫాంతో వంగపల్లి గ్రౌండ్ వద్ద ఉదయం 10గంటల కల్లా హాజరు కావాలన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఆరు జిల్లాల జట్లు ఎంపిక చేసి ఈనెల 19వ తేదీన అంతర్జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో కూడిన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు జూన్ మొదటి వారం నుంచి హైదరాబాద్ కేంద్రంగా జరిగే లీగ్ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. వివరాలకు 98495 70979 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. వడదెబ్బతో జీపీ కార్మికుడి మృతి హసన్పర్తి: వడదెబ్బతో ఓ గ్రామ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. ఈఘటన హసన్పర్తి మండలం సీతానాగారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేందర్ గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులకు హాజరైన రాజేందర్ వడదెబ్బతో అస్వస్థకు గురై అదే రోజు రాత్రి మృతి చెందాడు. కాగా, రాజేందర్ మృతదేహాన్ని కారోబార్, బిల్కలెక్టర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానందం, కార్యదర్శి వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రజనీకుమార్ సందర్శించి నివాళులర్పించారు. కోటలో ఏర్పాట్ల పరిశీలన.. ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోటలోని శిల్పాల ప్రాంగణాన్ని మంగళవారం రాత్రి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, పర్యాటక శాఖ రాష్ట్ర అధికారి నాథన్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతంగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు. తె లంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేక స్వాగతం పలకనున్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ నందిరామ్ నాయక్, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది
బయ్యారం: తెలంగాణలో కాంగ్రెస్ పాలిత ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని లక్ష్మీనర్సింహాపురం, రామచంద్రాపురం, కొమ్మవరం గ్రామాల్లో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు మంగళవారం లక్ష్మీనర్సింహాపురంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలపై రూపాయి భారం వేయకుండా వేల కోట్లతో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే బయ్యారం మండలంలో మూడు, టేకులపల్లి మండలంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో ఇల్లందు నియోజకవర్గానికి మరో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున రూ.22, 500 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, గిరిజన ప్రాంతంలో అదనంగా మరికొన్ని ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు బయ్యారం పెద్ద చెరువు, తులారాం ప్రాజెక్టులపై దృష్టి.. మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టుల అభివృద్ధిపై దృష్టిసారిస్తానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయకట్టులోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గంధంపల్లి–కొత్తపేటలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్, ఇల్లందు, మహబూబాబాద్, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, డాక్టర్ మురళీనాయక్, రాందాస్, కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, ఎస్పీ సుధీర్రాంనాఽథ్కేకన్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, విద్యుత్శాఖ సీఈ రాజుచౌహాన్, ఎస్ఈ నరేశ్, డీఈ విజయ్, ఏఈ సుమన్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు బయ్యారం, తులారాం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలంలో మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన -
పుష్కరాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు
● రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో భక్తుల భద్రత, అత్యవసర సేవల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్, సరస్వతీమాతా విగ్రహం, భక్తులు పుష్కర స్నానాలు చేసే త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం, బందోబస్తు ప్రణాళిక తదితర రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు కాళేశ్వరంలో జాతీయ, రాష్ట్ర విపత్తులు దళ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ఒక టీం (34 మంది), ఎస్డీఆర్ఎఫ్ రెండు టీంల (66 మంది) సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి తక్షణమే సేవలు అందించేందుకు ఈ బలగాలను వివిధ ఘాట్ల వద్ద సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. భక్తులు భద్రతా నిబంధనలను పాటిస్తూ, అధికారుల సూచనల ప్రకారం పుష్కర స్నానాలు చేయాలని సూచించారు. భక్తులు ప్రమాద హెచ్చరికల సూచికలు దాటి నదిలోకి వెళ్లకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీకి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి కెవి. సతీశ్ కుమార్, తెలంగాణ రీజియన్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెండ్ దామోదర్ సింగ్,కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, దేవస్థానం ఈఓ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025
– 8లోuపున్నమి వెలుగుల్లో రామప్పసుందరీమణుల రాక సందర్భంగా రామప్ప ఆలయం జిగేల్మంటోంది. విదేశీ వనితలు భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేశారు. ప్రత్యేక విద్యుత్దీపాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గార్డెన్లో స్టేజీ నిర్మించారు. సరస్సు కట్టపై ఉన్న హరి త కాటేజీలను ముస్తాబు చేశా రు. వెయ్యి మంది సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి మంగళవారం రాత్రి నుంచే పోలీసులు విధుల్లో చేరారు. పర్యాటకులకు బుధవారం రామప్ప సందర్శనకు అనుమతి లేదు.● వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన ● రామప్పలో సందడి చేయనున్న అందాలభామలు ● అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా.. 3వేల మందికి పైగా పోలీసులు ● మూడంచెల భద్రత.. సీనియర్ అధికారుల పర్యవేక్షణ● 4గంటలకు రామప్పకు చేరుకుంటారు. 4:40 గంటలకు రామప్ప సరస్సు అందాల వద్ద ఫొటో సెషన్లో పాల్గొంటారు. ● 4:55 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. 5 గంటలకు రామప్ప ఎంట్రెన్స్ గేట్ వద్ద కొమ్ముకోయ నృత్యంతో కళాకారులు వారికి స్వాగతం పలుకుతారు. ● 5:10 నుంచి 6 గంటల వరకు సంప్రదాయ దుస్తుల్లో రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని శిల్పకళాసంపదను తిలకిస్తారు. ● 6.10 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రామప్ప గార్డెన్లో అలేఖ్య శాసీ్త్రయ నృత్యం, పేరిణి ప్రదర్శన వీక్షించిన అనంతరం ప్రముఖులు అతిథులను సన్మానిస్తారు. ● రాత్రి 7.20 గంటలకు ఇంటర్ప్రిటిషన్ సెంటర్కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిన్నర్ చేసి 8:15 గంటలకు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ● హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరుతారు. ● ఒక బృందం హనుమకొండలోని హరిత కాకతీయకు సాయంత్రం 4.35 గంటలకు చేరుకుంటుంది. ● సుమారు గంటపాటు హోటల్లోనే గడిపి సాయంత్రం 5.45 గంటలకు వేయిస్తంభాల గుడికి చేరుకుంటారు. ఏయే దేశాల సుందరీమణులంటే.. ప్రపంచంలోని 19 దేశాలకు చెందిన సుందరీమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి, 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నట్లు సమాచారం. వారిలో అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, కెనడా, చీలి, కొలంబో, ఈక్వెడార్, ఈ సాల్వడార్, గౌతమాల, మెక్సికో, పనామా, పరాగ్వే, పెరు, యునైటెడ్ స్టేట్స్, వెనిజులా, హైతీ, హోందురాస్, నికరగ్వా, సురినామే తదితర దేశాల సుందరీమణులు ఉన్నారు. ● 40 నిమిషాలు పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● సాయంత్రం 6.25 వరంగల్ కోటకు చేరుకుంటారు. 7.30 గంటలకు వరకు అక్కడే పేరిణి శివతాండవం, ఇతర సంప్రదాయ నృత్యాలను తిలకించి తిరిగి హరిత హోటల్కు చేరుకుంటారు. ● 8 గంటల నుంచి 9 గంటల వరకు పర్యాటక శాఖ విందులో పాల్గొని 9.15 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతారు. డిన్నర్లో ఇవే.. సుందరీమణులకు హనుమకొండ నక్కలగుట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయ ముస్తాబైంది. హోటల్కు చేరుకున్న బృందానికి స్వాగత పలకరింపుగా నారింజ జ్యూస్ అందిస్తారు. స్టాటర్గా ప్రెలూడే ప్లేట్–స్టార్టర్ ట్రియో, గోల్డెన్ కోస్ట్ ఫిష్ బైట్స్ లేదా చీజ్ అండ్ హెర్బ్ మిలాంజ్ క్రాక్వెట్స్, సీసర్స్ గార్డెన్, మెయిన్ ఆఫెయిర్– సిగ్నేచర్ ప్లేట్స్గా నాన్ వెజిటేరియన్గా హర్బ్ గ్రిల్డ్ చికెన్ సుప్రీం, వెజిటేరియన్గా గ్రిల్డ్ కాటేజ్ చీస్ స్టీక్, మెడిటెర్రానీన్ వెజిటబుల్ గ్రాటిన్, టస్కాన్ పెన్న అర్రాబిటా, గోల్డెన్ చిప్స్, స్వీట్ ఇప్రెషన్గా చాక్లెట్ మౌసెస్, సాఫ్రాన్ ఫిర్ని, సీసన్స్ బౌంటి అందిస్తారు. న్యూస్రీల్అందాల భామలకు ఆహ్వానంరామప్ప ఆలయంలో ఇలా..4.35 గంటలకు వరంగల్కు.. -
ప్రశాంతంగా పాలీసెట్
– వివరాలు 8లోuమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పాలీసెట్–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఎం. రాంప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 897మంది బాలురకు 844 మంది హాజరై 53 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 761మంది బాలికలకు 710 మంది హాజరై 51 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 1,554మంది విద్యార్థులు హాజరై 104మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షలకు సహకరించిన పోలీస్, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. -
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
మహబూబాబాద్: జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయిల్పామ్ సాగు పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో ప్రతీ నెల స్థిరమైన ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లాలో 8,000 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసిన ట్లు తెలిపారు. పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, ఉ ద్యానశాఖ జిల్లా అఽధికారి మరియన్న ఉన్నారు.పీహెచ్సీ ఆకస్మిక తనిఖీమరిపెడ: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. గర్భిణులు పీహెచ్సీలోనే ప్రసవం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతీ బుధ, శనివారాల్లో పిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి గుగులోతు రవికుమార్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వనాకర్రెడ్డి, విద్యాసాగర్, మంగమ్మ, సుదర్శన్, లక్ష్మి, మాధవి, పద్మ, స్వర్ణ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలిమహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరై సద్వి నియోగం చేసుకోవాలని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అనంతారం మో డల్ స్కూల్, హోలిఏంజిల్స్ ఏకశిల హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రా రంభమయ్యాయి. డీఈఓ హాజరై మాట్లాడు తూ.. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ సమ్మెట సతీష్గౌడ్ పాల్గొన్నారు.గొంతులో మాంసం బొక్క ఇరుక్కుని ఒకరి మృతిమరిపెడ: భోజనం చేస్తుండగా మాంసం బొక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మరిపెడ పట్టణ శివారు కొత్తతండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు బండతండాకు చెందిన జాటోతు లక్ష్మణ్(68) తన బావమరిది అయిన కొత్తతండాకు చెందిన అజ్మీరా ఠాగూర్ ఇంట్లో దుర్గమ్మ పండుగకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం మాంసం తింటున్న సమయంలో బొక్క గొంతులో అడ్డుపడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.సమయపాలన పాటించాలిగూడూరు: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఐటీడీఏ ఏటూరునాగా రం పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండలంలోని తీగలవేణి పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఎండాకాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన మందులు నిల్వ చేసుకోవాలన్నారు. ఓపీ, ఇతర రికార్డులను పరిశీలించారు. డాక్టర్ రాంబాబు, సూపర్వైజర్ శానుబేగం, ఫార్మసిస్టు అమల, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేయిస్తా
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఐ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న దీక్షశిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 17న బ్రిడ్జి నిర్మాణం నిధుల విడుదలపై డిప్యూటీ సీఎంను కలుస్తామన్నారు. అప్పటి వరకు దీక్షను విరమింపజేయాలని నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను ముగించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, నాయకులు అజయ్సారథి, శ్రీనివాస్, కుమార్, వెంకన్న, లక్ష్మి, జనార్దన్, లోకేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు. ముస్తాబైన నగరం.. వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో జిగేల్మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో వేయిస్తంభాల గుడి -
పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం..
హన్మకొండ/కాళేశ్వరం: ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతీనది పుష్కరా లకు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికా రులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ప్రతీ రోజు 140 బస్సులకు తగ్గకుండా నడిపేందుకు ప్రణాళిక సి ద్ధం చేశారు. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి 40 బస్సులు, వరంగల్ బస్ స్టేషన్ నుంచి 25, జనగామ, పరకాల, నర్సంపేట బస్ స్టేషన్ నుంచి 10 చొప్పున, భూపాలపల్లి నుంచి 20, తొర్రూరు, మహబూబాబాద్ బస్ స్టేషన్ నుంచి 5 చొప్పున, హైదరాబాద్ నుంచి 15 ప్రత్యే క బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందించారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడుపనున్నారు. ఏసీ బస్సులకు హైదరా బాద్ నుంచి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ నెల 13 నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. సరస్వతీనది పుష్కరాలు జరిగే కాళేశ్వరంలో నాలుగు ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొత్తం 9 పాయింట్లు ఉంటాయి. 9 పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు బయలుదేరుతాయి. కాళేశ్వరంలో ఇద్దరు అధికారులు, 10 మంది సూపర్ వైజర్లు, 20 మంది వలంటీర్లు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, సరస్వతీనది పుష్కరాలకు చార్జీలు ఖరారు చేశారు. సాధారణ చార్జీలతో చూసుకుంటే ఒకటిన్నర రెట్లు చార్జీలు పెంచారు.రూట్ల వారీగా ప్రత్యేక బస్సుల చార్జీల వివరాలు ఇలా.. రూట్ బస్సు సర్వీస్ పెద్దలకు పిల్లలకు (రూ.) (రూ.) హనుమకొండ – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 250 140 ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ 260 150 డీలక్స్ 290 160 ఎలక్ట్రిక్ డీలక్స్ 310 180 సూపర్ లగ్జరీ 330 190 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ 350 210 రాజధాని 420 330 గరుడ (+) 500 380 నర్సంపేట – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 330 180 మహబూబాబాద్ – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 400 220 తొర్రూరు – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 360 190 జనగామ – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 390 220 భూపాలపల్లి –కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 120 70 సూపర్ లగ్జరీ 160 100 పరకాల – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 190 110 హైదరాబాద్ – కాళేశ్వరం ఎక్స్ప్రెస్ 570 320 డీలక్స్ 670 370 సూపర్ లగ్జరీ 760 420 రాజధాని 960 740 గరుడ (+) 1130 870ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ సేవలు సద్వి నియోగం చేసుకోవాలి. భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. భద్రతతో కూడిన సౌకర్యవంత ప్రయాణం అందిస్తాం. అవసరమైతే బస్సుల సంఖ్య పెంచుతాం. అధికారుల నిరంతర పర్యవేక్షణలో సురక్షితంగా, క్షేమంగా భక్తులను చేరవేస్తాం. డి.విజయభాను, రీజినల్ మేనేజర్, వరంగల్ ●ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు రోజుకు 140 ట్రిప్పులు.. భక్తుల సంఖ్య పెరిగితే మరిన్ని అదనపు సర్వీసులు ఏసీ బస్సులకు హైదరాబాద్ నుంచి రిజర్వేషన్ సౌకర్యం చార్జీలు ఖరారు చేసిన అధికారులు -
యథావిధిగా డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ తదితర కోర్సులు 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి(బుధవారం) నిర్వహించనున్నారు. అలాగే, బ్యాక్లాగ్ డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వెల్లడించిన టైం టేబుల్ ప్రకారం పరీక్షలు ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు అయితే సోమవారం రాత్రి వరకు విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లు జారీ చేయలేదు. నేడు (మంగళవారం) హాల్ టికెట్లు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు యాజమాన్యాలు ఓకే.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ పరీక్షలకు సహకరించబోమని ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకుండా మొండికేశాయి. దీంతో రెండుసార్లు డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. ఫీజులు చెల్లించేందుకు 138 ప్రైవేట్ కాలేజీలు ముందుకు రాకపోవడంతో వాటి పేర్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) వెబ్సైట్ నుంచి అధికారులు తొలగించారు. అయితే కొన్ని కాలేజీలు పరీక్షల ఫీజులు చెల్లించాయి. సోమవారం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు హైదరాబాద్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ను కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని కోరారని సమాచారం. అయితే తప్పనిసరిగా ఈనెల 14నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతాయని ఫీజులు చెల్లించి పరీక్షలు నిర్వహణకు సహకరించాలని కూడా ఆదేశించారని సమాచారం. దీంతో ఆయా యాజమాన్యాలు ఇక పరీక్షల నిర్వహణకు ఓకే చెప్పాయి. మొదటి రెండు పరీక్షలు చివరికి నిర్వహించండి! పరీక్షల నిర్వహణకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో హాల్టికెట్ల జారీ, సిట్టింగ్ అరెంజ్మెంట్ ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు జరిగే రెండు పరీక్షలు చివరికి నిర్వహించాలని మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం నిర్వహించాలని ప్రైవేట్ యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు.నేడు హాల్ టికెట్ల జారీ ఫీజులు చెల్లించని మరికొన్ని కాలేజీలు ఫీజు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే ఎగ్జామ్స్ ఒక్కరోజులో ఫీజుల చెల్లింపు దోస్త్ నుంచి పేర్లు తొలగించిన డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కొందరు ఇటీవల పరీక్షల ఫీజులు చెల్లించగా ఎక్కువ సంఖ్యలో కాలేజీలు సోమవారం ఆన్లైన్లో ఫీజు చెల్లించి పరీక్షల విభాగానికి వాట్సాప్లో వివరాలు పంపారు. మరిన్ని కాలేజీలు ఇంకా పరీక్షల ఫీజులు చెల్లించలేదు. మంగళవారం వారు కూడా ఫీజులు చెల్లిస్తారని భావిస్తున్నారు. చెల్లించకపోతే ఆయా కాలేజీల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోమని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
కాశీపండితులతో నవహారతులకు సిద్ధం
పీఠాధిపతులకు ప్రత్యేక విడిది.. కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే పీఠాధిపతుల కోసం దేవాదాయశాఖ ప్రత్యేకంగా విడిది ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని త్రివేణి గెస్ట్హౌస్ను కాకినాడకు చెందిన శిల్పులు సాలహారం సిమెంట్తో అందంగా ముస్తాబు చేశారు. 15 నుంచి 26 వరకు పదుల సంఖ్యలో రోజుకు ఒకరు తరలొచ్చి స్నానం ఆచరించనున్నారు.ప్రమాద హెచ్చరిక జెండాలు ఏర్పాటు కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో లక్షలాదిగా పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలొచ్చే భక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో కొంత లోతు వరకు ఎరుపు జెండాలు, బెలూన్స్ ఏర్పాటు చేశారు. మోకాలు లోతు నీటిలో స్నానాలు ఆచరించనున్నారు.‘బాహుబలి’ సెట్టింగ్స్! కాళేశ్వరం: పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు పులకించేలా బాహుబలి మాదిరి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాలకు నమస్కరిస్తున్న సింహాల బొమ్మలు ఏర్పాటు చేశారు. ఘాట్లో తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు.దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం కాళేశ్వరం: పుణ్యస్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సరస్వతీఘాట్ వద్ద గదులు నిర్మిస్తున్నారు. 24 వరకు గదులు నిర్మించారు. మెయిన్ఘాట్లో 12 గదులు నిర్మించారు. కాళేశ్వరం: కాళేశ్వరంలో మే15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల్లో తొలిసారి కాశీపండితులతో నవహారతులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు గద్దెలు సరస్వతీమాత విగ్రహం ఎదుట నిర్మాణం చేశారు. ఏడుగురు పండితులు తొమ్మిది హారతులు 12 రోజుల పాటు ఇవ్వనున్నారు. కాశీ నుంచి పండితులు అశుతోశ్ పాండే, అభిషేక్ పాండే, నితీశ్కుమార్ పాండే, సమంత్ తివారీ, కౌశల్ తివారీ, దీపక్పాండే, అంకిత్పాండే, శివమ్ మిశ్రా ప్రత్యేక విమానంలో రానున్నారు. -
పుష్కరాలకు పటిష్ట భద్రత
● ఎస్పీ కిరణ్ ఖరే కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ మేరకు సోమవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్లతోపాటు పోలీసు భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. మూడు షిఫ్టుల్లో 3,500 పోలీసుల విధులు.. పుష్కరాల సందర్భంగా మల్టీజోన్ –1 నుంచి సుమారు 3,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారని ఎస్పీ తెలిపారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. 14 పార్కింగ్ స్థలాలు,7 హోల్డింగ్ పాయింట్స్ పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల్లో మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక మహిళా పోలీసు విభాగంతో పాటు, ‘షీ’ టీమ్స్ పనిచేస్తాయని తెలిపారు. వాహనాల మళ్లింపు ఇలా.. పుష్కరాల వచ్చే భక్తుల వాహనాలను నిర్దేశించిన స్థలాల్లో పార్క్ చేసేలా పలు మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం చేరుకోవాలని, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు మంథని, గంగారం క్రాస్, పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం రావాలని, అలాగే, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం చేరుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్లు నడపనున్నారని తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, రెస్క్యూ టీంలు, పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బోనాల కిషన్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు రామ్మోహన్ రెడ్డి, సంపత్ రావు, నారాయణ నాయక్, మహదేవపూర్ సీఐలు రామచందర్ రావు, నాగార్జున రావు, నరేశ్, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పౌర రక్షణ వలంటీర్లుగా నమోదుకు అవకాశం
న్యూశాయంపేట : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్ పౌర రక్షణ వలంటీర్లుగా పనిచేయడానికి యువత నుంచి పేర్ల నమోదుకు ఆహ్వానిస్తున్నట్లు మై భారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా యువజన సంక్షేమాధికారి సీహెచ్.అన్వేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో పౌర బాధ్యత, క్రమశిక్షణ భావం పెంపొందించడమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో శిక్షణ ఇచ్చి పనిచేయడానికి సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఆసక్తి గల యువత మై భారత్ పోర్టల్ mybharat.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9491383832 నంబర్లో సంప్రదించాలన్నారు. వడదెబ్బతో వృద్ధురాలి మృతి లింగాలఘణపురం : మండలంలోని వడిచర్లకు చెందిన గండి పోషఎల్లమ్మ (68)వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. ఆదివారం కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న పోషఎల్లమ్మ గ్రామంలో ఎండలో తిరిగింది. వివాహానికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆలస్యంగా ఇంటికి రావడంతో నిద్రపోతుందని భావించి వారు కూడా నిద్రపోయారు. ఉదయం లేచి చూడగా తీవ్ర జ్వరంతో కనిపించగా గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందింది. రాయపర్తిలో వృద్ధుడు.. రాయపర్తి: వడదెబ్బతో మండల కేంద్రంలోని అంబేడ్కర్నగర్ కాలనీకి చెందిన కంతుల ఉప్పలయ్య(75) మృతి చెందాడు. సోమవారం ఎండవేడిమికి అస్వస్థతకు గురికావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి .. చిన్నగూడూరు: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని జయ్యారం పెద్ద చెరువులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ సైదులు(55) చేపలు పట్టే క్రమంలో చెరువులో ఉన్న నాచు, వల కాళ్లకు చుట్టుకుంది. గమనించి సహ జాలర్లు సైదులును కాపాడే యత్నం చేస్తుండగానే నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. 60 కిలోల ఎండు గంజాయి స్వాధీనం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 15 లక్షల విలువైన 60 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద సోమవారం వివరాలు వెల్లడించారు. పలు రైళ్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా కురవి గేట్ రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్ల పొదలమాటున రెండు ప్లాస్టిక్ సంచుల్లో ఎండు గంజాయి లభ్యమైందన్నారు. ఘటనాస్థలిలో ఎవరూలేరని, గంజాయి సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఎకై ్సజ్ సీఐలు నాగేశ్వరరావు, నీరజ, ఎస్సైలు చంద్రశేఖర్, అశోక్, కిరీటి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మధు, కానిస్టేబుళ్లు రాజు, శ్రీను, శేఖర్, ఇబ్రహీం, భవా ని, నర్సింహరావు, రవి, సుమన్ పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి..?
హన్మకొండ చౌరస్తా : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన మహేందర్రావు కడుపునొప్పితో బాధపడుతూ ఆదివారం హనుమకొండలోని బంధన్ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. రాత్రి వరకు బాగానే ఉన్నాడని చెప్పిన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం, సోమవారం ఉదయం మహేందర్రావు చనిపోయినట్లు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులైన వైద్యులు చికిత్స చేయకుండా ఫార్మాడీ, బీఎంఎంస్ వైద్యులు చికిత్స చేయడంతోనే మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొందరి మధ్యవర్తిత్వంతో మృతుడు కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లిస్తామన్న హామీతో గొడవ సద్దుమణిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బంధన్ ఆస్పత్రి వద్ద జరుగుతున్న ఆందోళనను గుర్తించిన డీఎంహెచ్ఓ అప్పయ్య ఆస్పత్రిని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేస్షీట్స్ను హనుమకొండ పోలీసులు తీసుకెళ్లడంతో పూర్తి చికిత్స వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, వైద్యసేవల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ