breaking news
Mahabubabad District News
-
బేరసారాలు..
సాక్షి, మహబూబాబాద్: మద్యం షాపుల కేటాయింపు కోసం జరిగిన లాటరీలో షాపు దక్కినవారు షాపు ఎలా నడపాలని ఆలోచిస్తుండగా.. షాపు దక్కని మద్యం వ్యాపారులు లాటరీలో షాపులు వచ్చిన వారికి గుడ్ విల్ ఇచ్చి షాపు తీసుకునేందుకు బేరసారాలు కుదుర్చుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం డిమాండ్ ఉన్న షాపులకు రూ.కోట్లు ఇచ్చేందుకు సైతం సై అంటున్నట్లు వినికిడి. అయితే దరఖాస్తులు వేసేటప్పడు అయిన సిండికేటు దారుల్లో కొందరు షాపులుఅమ్మాలని, మరికొందరు అమ్మొద్దని చెప్పడంతో అయోమయం నెలకొంది. సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య గత సీజన్లో మద్యం షాపుకోసం దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సీజన్లో ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అయితే లాటరీలో షాపు రాకపోతే దరఖాస్తు ఫీజు ప్రభుత్వానికే చెందే పద్ధతి ఉండడంతో పెద్ద మద్యం వ్యాపారులు సింగిల్గానే దరఖాస్తులు చేసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఇతర ఉద్యోగస్తులు తమ డబ్బులకు ఎంతో కొంత రక్షణ ఉంటుందని తాము తీసిన డీడీలతో సిండికేట్లుగా మారారు. ఇలా పది దరఖాస్తుల నుంచి మొదలైన సిండికేట్ వంద దరఖాస్తుల వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ సిండికేటులో ఒకటి, రెండుషాపుల వచ్చినవారు ఉన్నారు. అసలే రానివారు కూడా ఉన్నారు. దీంతో ఎక్కువ మంది సిండికేట్గా ఉన్న గ్రూప్లో ఒకటి, రెండు షాపులు వస్తే వాటి నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నారు. కొందరు షాపును అమ్మి డబ్బులు పంచుకుందాని చెబుతుండగా మరికొందరు షాపును నడిపిద్దామని అంటున్నారు. ఇలా ఇరువర్గాల మధ్య సమోధ్య కుదరడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్ విల్ రూపంలో రూ.కోట్లు! జిల్లా వ్యాప్తంగా 61 మద్యం షాపులకు 1,800 దరఖాస్తులు వేశారు. అయితే లాటరీలో షాపులు దక్క ని వారు షాపులు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా.. షాపులు దక్కిన వారిలో కొందరు షాపులు నడిపించలేక పార్ట్నర్ను కలుపుకోవడం.. లేదా గుడ్ విల్ తీసుకొని షాపులు వేరేవారికి అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఇలా జిల్లాలోని ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న ప్రాంతం, ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగే ప్రాంతాల్లోని షాపులకు పెద్ద మొత్తంలో గుడ్ విల్ ఇచ్చి షాపులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మహబూబాబాద్ సర్కిల్లో ఒక షాపును రూ.కోటి కి పైగా గుడ్విల్ ఇచ్చి లాటరీలో షాపు దక్కిన వారి నుంచి ఓ మద్యం వ్యాపారి తీసుకున్నట్లు ప్రచారం. అదే విధంగా మహబూబాబాద్, తొర్రూరు, గూడూ రు ఎక్సైజ్ సర్కిళ్లలో షాపులు తీసుకునేందుకు మ ద్యం వ్యాపారులు పోటీ పడుతున్నారు. అదే విధంగా సిండికేట్లో ఉన్న సభ్యులు కొందరు షాపును నడిపించుకునేందుకు షాపునకు బేరం పెట్టి మిగిలి న సభ్యులకు డబ్బులు ఇచ్చే విధంగా అంగీకారం చేసుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న షాపులకు వేలం వేసిమరీ షాపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా షాపునకు రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కొనుగోలు చేసి చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. లాటరీలో వచ్చినవారే బాధ్యులు.. ఒక వైపు లాటరీలో షాపులు దక్కిన వారు భేరసారాలకు దిగి మరొకరికి షాపు అప్పగించే పనిలో ఉన్నారు. మరో వైపు ఎకై ్సజ్ అధికారులు మాత్రం లాటరీలో షాపు దక్కిన వారే రెండు సంవత్సరాలు షాపు నిర్వహించేందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు, రెంటల్ చెల్లింపులు మొదలైన విషయాలపై ముందుగానే అగ్రిమెంట్ పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. షాపులపై కేసులు అయినా.. ఇతర సమస్యలు వచ్చినా.. లాటరీలో షాపు వచ్చిన వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో లాటరీలో షాపు దక్కించుకున్న వారు నమ్మకస్తులకే షాపును ఇవ్వడం.. లేదా.. ముందుగానే అడ్వాన్స్ డబ్బులు తీసుకొని షాపు అప్పగించడంపై ఆచీ తూచీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. లక్కీ డ్రాలో వైన్స్ వచ్చిన వారికి డిమాండ్ రూ.కోట్లు పలుకుతున్న వైనం సిండికేటుదారుల్లో కుదరని సయోధ్య షాపుల కొనుగోలుపై మద్యం వ్యాపారుల కన్ను -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉపాధ్యాయులకు సూ చించారు. జిల్లా కేంద్రంలోని కేజీవీబీ, శనిగపురం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, డిజిటల్ తరగతులతో ప్రతి సబ్జెక్ట్పై పట్టు సా ధించేందుకు, విద్యార్థి సామర్థ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్నారు. మెనూ పాటిస్టూ నాణ్యమైన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గ ర్భిణులు, బాలింతలకు బలవర్ధమైన ఆహారం అందించాలని, హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్రావు, కేజీబీవీ ఎస్ఓ భవాని, ఉపాధ్యాయులు ఉన్నారు. సొంతింటి కల సహకారానికి కృషి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025గ్రేటర్ మహానగరం జలదిగ్బంధమైన వేళ.. మేమున్నామంటూ కదిలారు పోలీసులు, అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది. జల విలయాన్ని ఛేదిస్తూ వేలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సేవలందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బల్దియా కార్మికులు అయితే ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించారు. దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు దాతలు. మానవత్వంతో కదిలివచ్చిన వీరందరి ‘సేవలకు సలాం’ పలుకుతూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ అర్బన్/వరంగల్క్రైం/హనుమకొండ/కాజీపేట అర్బన్వరంగల్ నగరంలో.. ఇటీవల కురిసిన వర్షానికి న్యూరాయపుర మొత్తం మునిగిపోయింది. కాలనీలోని ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీళ్లు. సమాచారం అందుకున్న హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని స్ట్రెచర్పై పడుకోబెట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఎంజీఎంకు తరలించారు. తనను కాపాడిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.ఈ ఫొటో చూడండి.. హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి చెందిన అలేఖ్య గురువారం రాత్రి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. బుధవారం కురిసిన వర్షానికి ఆమె ఇంటి చుట్టూ వరద. బయటికి వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అలేఖ్యతోపాటు కుటుంబ సభ్యులకు లైఫ్ జాకెట్లు ధరింపజేసి రోప్ సాయంతో ఇంటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బల్దియా డీఆర్ఎఫ్ ● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు ● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు ● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు ప్రకృతి విపత్తుల సమయంలో గ్రేటర్ వరంగల్ మహా నగరాన్ని రక్షించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) మేమున్నామంటోంది. అత్యవసర సమయాల్లో మెరుపు వేగంతో రంగంలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తోంది. తాజా గా మోంథా తుపాను కారణంగా వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. ఈనేపథ్యంలో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం హైదరాబాద్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్, టీజీఎఫ్డీకి సంబంధించిన సుమారు వంద మంది రక్షకులు సేవలందించారు. వరదలో చిక్కుకున్న సుమారు 400 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి శెభాష్ అనిపించుకున్నారు. వరంగల్ నగరంలోని 45 వరద ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఆస్తి, ప్రాణ నష్టం, రవాణా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించి అందరి మన్ననలు పొందాయి. పోలీసుల సేవాభావం.. పలు కాలనీల్లో వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ భవన్లో ఓ వివాహ వేడుక కోసం వచ్చిన సుమారు 150 మంది వరదలో చిక్కుకున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. కాపువాడ, గోకుల్నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాల్పూర్ భగత్సింగ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఒకదశలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ నేరుగా రంగంలోకి దిగి ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. విద్యార్థినులకు ఆపన్నహస్తం..రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. వరద పోటెత్తినా.. విద్యుత్ పునరుద్ధరణవర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.సల్లగా బతకమని ఆశీర్వదించింది.. సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది. – వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్ గర్భిణిని ఒడ్డుకు చేర్చాం.. 28వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో గర్భిణి వరదల్లో చిక్కుకుందని తెలియడంతో డీఎఫ్ఓ శంకర్ లింగం ఆదేశాలతో ముందుకు సాగాం. అదే సమయంలో ఏసీపీ శుభం ప్రకాశ్, మట్టెవాడ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో బయటకు తీసుకొచ్చి ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చాం – సీహెచ్.అశోక్, డీఆర్ఎఫ్అటు ట్రాఫిక్, ఇటు రెస్క్యూ.. వర్షం కురుస్తున్నంతసేపు సమస్య తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తక్షణ సేవలందించాం. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నాం. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. – పునాటి నరసింహారావు, ఏసీపీ, హనుమకొండ -
మధ్యవర్తిత్వాన్ని వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : కుటుంబం, సమాజంలో తలెత్తే వివాదాలను సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మా నుకోటలో సకల జన కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రం ఏర్పాటు చేయగా.. శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కమ్యూనిటీ సామాజిక మధ్యవర్తులచే సకల జన కమ్యూని టీ మీడియేషన్ కేంద్రం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ కేంద్రంలోని సేవలు అన్ని పూర్తిగా ఉచితమేనని చెప్పారు. నేటి సంక్లిష్ట సమాజంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవుకే ఎన్నో కేసులు దాఖలవుతున్నాయని, దానివల్ల బంధాలు దెబ్బ తింటున్నాయన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో శిక్షణ పొందిన వలంటీర్లు చురుకై న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు, శిక్షణ పొందిన మీడియేటర్లు శంతన్ రామరాజు, పిట్టల బుచ్చిరామారావు, సుతారపు వెంకటనారాయణ, ఎడ్ల శ్రీనివాస్, వాంకుడోత్ భద్రమ్మ పాల్గొన్నారు. 15న ప్రత్యేక లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఆయా కోర్టుల్లోని న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, డీఎస్పీ తిరుపతిరావు, పీపీ గణేష్ ఆనంద్, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ పాల్గొన్నారు. జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సకలజన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభం -
విధుల్లో అలసత్వం వహించొద్దు
నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధుల్లో అలసత్వం వహించినా.. సమయ పాలన పాటించకపోయినా చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై ఆస్పత్రి వైద్యులతో శనివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నర్సులు కాలక్షేపం చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీలో సెల్ఫోన్ ఉపయోగించరాదని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టి సారించాలని తెలిపారు. అమానవీయ సంఘటనలు పునరావృతం అయితే సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఆర్ఎంఓపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇద్దరిపై వేటు.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బతికుండగానే మార్చురీలో పెట్టిన సంఘటనలో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బతికుండగానే మార్చురిలో పెట్టారని, సిబ్బంది అలత్వం వీడి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అంకితభావంతో పనిచేయాలి మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. మోంథా తుపానుతో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఏఓ విజయనిర్మల, ఏడీఏ శ్రీనిసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వివిధ మండలాల ఏఓలు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మురళీనాయక్ బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటనపై స్పందన ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు -
బడికి పోతే బతికేటోడివి బిడ్డో..
సంగెం : మరో రెండ్రోజుల్లో హాస్టల్కు వెళ్తాడనుకుంటే అంతలోనే తుపాన్తో నానిన గోడ కూలి బాలుడు మృత్యువాత పడిన విషాద ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మౌ నిక, సాంబరాజు దంపతులకు కూతురు దివ్యశ్రీ, కుమారుడు నవదీప్ (10)లు సంతానం. పేద కు టుంబానికి చెందిన సాంబరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నవదీప్ కొ మ్మాలలోని ఏలోహీమ్ ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల జనగామలోని తె లంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నవదీప్కు సీటు వచ్చింది. సోమవారం గురుకుల హాస్టల్కు పంపిస్తామని స్కూల్కు పంపించకుండా వారం రోజులుగా ఇంటి వద్దనే ఉండనిచ్చారు. శని వారం నవదీప్ ఇంటి సమీపంలోని దుకాణానికి తినుబండరాలు కొనుక్కొనేందుకు ఒక్కడే వెళ్తున్నాడు. అయితే ఇటీవల వర్షాలు, తుపాన్ కారణంగా నాని బలహీనపడిన బన్న రమేశ్కు చెందిన బా త్రూం గోడ ఒక్కసారిగా కూలి నవదీప్ భుజాలు, తలపై పడింది. దీంతో నవదీప్ తల పగిలి చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. హుటాహుటిన ఎంజీఎంకు తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు తెలిపారు. కాగా బడికి వెళ్తే బతికేవాడివి కొడుకా అంటూ నవదీప్ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరుల గుండెలను పిండేశాయి. బాలుడి తాత లచ్చయ్య ఫిర్యాదు మేర కు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. ● బాత్రూం గోడ కూలి బాలుడి మృతి ● చింతలపల్లిలో విషాద ఘటన -
అతివేగానికి నిండు ప్రాణం బలి
మరిపెడ రూరల్ : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. శుభకార్యంలో క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో 25 మంది యువకులు వెళ్తుండగా అతివేగంతో ఆ వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్పురం శివారు పత్తి మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని లచ్చతండా, సీరోలు మండలం ఉప్పరగూడెం గ్రామాలకు చెందిన 25 మంది యువకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి క్యాటరింగ్ చేసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారి మలుపు వద్ద అతివేగంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఉప్పరగూడెం గ్రామ పరిధిలోని తండాకు చెందిన మాలోత్ పవన్ (20), మాలోత్ సందీప్, బానోత్ ఈశ్వర్, మరిపెడ మండలం లచ్చతండాకు చెందిన గుగులోత్ లక్ష్మణ్ (డ్రైవర్), గుగులోత్ కుమార్తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మహబూబాబాద్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాలోత్ పవన్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి మానసిక దివ్యాంగుడు కాగా కుటుంబ పోషణ నిమిత్తం పవన్ వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటున్నాడు. కానీ శనివారం మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనికి వెళ్తుండగా ఘటన జరిగి పవన్ మృత్యువాత పడ్డాడని బంధువులు రోదిస్తూ తెలిపారు. అదుపు తప్పి బొలెరో వాహనం బోల్తా చికిత్స పొందుతూ యువకుడి మృతి, 9 మందికి తీవ్ర గాయాలు బుర్హాన్పురం శివారులో ఘటన -
ప్రమాద స్థలం పరిశీలన
ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని శనివారం అధికారులు పరిశీలించారు. వరంగల్ కమిషనరేట్ రోడ్డు సేఫ్టీ వింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రవాణా శాఖ డీటీఓ రమేశ్ రాథోడ్, సీఐ పులి రమేశ్, నేషనల్ హైవే ఏఈ ప్రశాంత్ ఉన్నారు. అధికారులు ప్రమాదం జరిగిన కారణాలను సమీక్షించి, రహదారి పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా కాంట్రాక్టర్కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ డ్రైవర్లకు కనబడేలా లైటింగ్ సదుపాయం, రిఫ్లెక్టీవ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముల్కనూర్ ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు. ఉదయం ప్రిపరేషన్.. రాత్రి చోరీలు● అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన యువకుడు హసన్పర్తి : ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలకు సిద్ధమవుతూనే మరో వైపు రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శనివారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్ మాట్లాడారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సెండే అరుణ్కుమార్ మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఓ ఏడాదిపాటు ఇంట్లోనే ఖాళీగా గడిపాడు. 2024లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి హనుమకొండకు వచ్చి అద్దె గది తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతూ బెట్టింగ్కు బానిసై అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గోపాలపురం, భీమారం ఏరియాల్లో తాళాలు వేసి ఉన్న 10 ఇళ్లలో రాత్రి వేళ చోరీలకు పాల్పడ్డాడు. పెగడపల్లి డబ్బాల వద్ద గుర్తు తెలియని వాహనంపై పారిపోతుండగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది నిందితుడిని పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.56,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎస్సై శ్రీకాంత్, నవీన్కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్, సీసీఎస్ సిబ్బంది మధు, చందును పోలీస్ ఇన్స్పెక్టర్ అభినందించారు. -
క్రీడల సక్సెస్లో పీఈటీలే కీలకం
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాపోటీల నిర్వహణ సక్సెస్ కావాలంటే వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నిర్వహిస్తున్న అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్, జూడో పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని అన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్ మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు అండర్–14,17,19 బాలబాలికల విభాగంలో జిమ్నాస్టిక్స్ పోటీలు, అండర్–17 బాలబాలికల విభాగంలో జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, ఎ.ప్రభాకర్రెడ్డి, డి.కుమార్, సీహెచ్ పెద్దిరాజు, సురేష్బాబు, వి.రాణి, ఎస్.శ్రీలత, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సుభాష్, రవీంద్రప్రసాద్, సురేష్, దేవేందర్, కిషన్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 3, 4 తేదీల్లో ఎస్జీఎఫ్ క్రీడలు హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈ నెల 3, 4 తేదీల్లో అండర్–19 బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీన క్రికెట్, నెట్బాల్, సాఫ్ట్బాల్, లాన్టెన్నీస్, క్యారం, సెపక్తక్రా, స్కాష్, స్కేటింగ్, 4వ తేదీన ఖోఖో ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఉదయం 9గంటలకు జేఎన్ స్టేడియం వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
కార్యదర్శి లేక చెల్లింపులు పెండింగ్
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి చెల్లింపులు నాలుగు రోజులుగా పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. వ్యవసాయ మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వరంగల్ మార్కెట్కు రెగ్యులర్ ఉన్నత శ్రేణి కార్యదర్శి లేక ఏడాది కావొస్తున్నా నియామకం చేపట్టలేదు. నర్సంపేట కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మార్కెట్ పాలకవర్గం లేక అస్తవ్యస్తంగా తయారు కావడంతో ఆయన అక్టోబర్ 4వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో మరో మార్కెట్ కార్యదర్శికి గాని స్థానిక గ్రేడ్–2 కార్యదర్శుల్లో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. పక్క జిల్లాలోని ఓ మార్కెట్కు చెందిన కార్యదర్శి వరంగల్కు వచ్చేందుకు పైరవీలు చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఇన్చార్జ్ బాధ్యతల విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనుగోళ్లు చేసిన పత్తిని మార్కెట్ కార్యదర్శి ధ్రువీకరిస్తేనే సీసీఐ అందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. కార్యదర్శికి మళ్లీ 10రోజుల వరకు సెలవు పొడిగించినట్లు తెలిసింది. మార్కెట్ కార్యదర్శి లేకపోవడంతో వరంగల్, నర్సంపేట మార్కెట్ల పరిధిలోని ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు నిలిచిపోయాయి. నెల రాగానే ఈఎంఐలు, ఇతరత్రా చెల్లింపులు చేయాలంటే జీ తాల రాలేదని, కార్యదర్శి లేనందున జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు, పింఛన్దారులు వాపోతున్నారు. అలాగే సుమారు రూ.కోటి వరకు పత్తి రైతులకు సీసీఐ చెల్లించాల్సి ఉంటుందని, వేతనాలు, పింఛన్లు కలిపి సుమారు మరో రూ.2కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ప్రభుత్వం వెంటనే ఈవిషయంపై చర్యలు తీసుకుని మార్కెట్కు ఉన్నత శ్రేణి కార్యదర్శిని నియమించాలని వ్యాపారులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోని అధికార పార్టీ నాయకులు పత్తి రైతులకు సుమారు రూ.కోటి బకాయిలు వేతనాలు, పింఛన్ల కోసం ఎదురుచూపులు -
పురాతన వస్తువులు.. వరదపాలు
హన్మకొండ కల్చరల్ : చరిత్రకు అర్థం చెప్పడానికి, సంరక్షించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గతం గురించి లోతైన అధ్యయనానికి ఉపయోగపడే వెలకట్టలేని అపురూపమైన పురాతన వస్తువులు, కళాఖండాలు వరదపాలయ్యాయి. మూడ్రోజుల క్రితం మహానగరాన్ని ముంచెత్తిన వరదలో వరంగల్ హంటర్రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞానపీఠం వరదనీటితో ముంపునకు గురైంది. పీఠం గ్రౌండ్ఫ్లోర్లోని మ్యూజియం మునిగి పోవడంతో 30ఏళ్ల నుంచి సేకరించిన పురాతన వస్తువులు, కళాఖండాలు నీటిలో మునిగిపోవడంతో వాటిని సేకరించిన పీఠం సిబ్బంది ఆవేదన చెందారు. అరుదైన జానపదులు, గిరిజనులు ఉపయోగించిన పురాతన చారిత్రక వస్తువులు, కళాఖండాలు, పూర్వకాలంలో ఉపయోగించిన లోహ, చెక్క సంబంధించిన వంట, ఇంటి సామగ్రి, పనిముట్లు తదితర విలువైన వస్తువులు రెండ్రోజుల పాటు నీటిలో ఉండటంతో పనికి రాకుండా పోయాయి. 2023 జూన్, జూలైలో వచ్చిన అధిక వర్షాల వల్ల ఏర్పడిన వరదలతో పీఠంలోని మ్యూజియం మునిగిపోయింది. దీంతో సగం పైగా వస్తువులు తడిసిపోయాయి.. సిబ్బంది చొరవతో మిగిలిన వస్తువులను శుభ్రపరిచి క్రమపద్ధతిలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం మూడ్రోజుల నుంచి ముంపునకు గురికావడంతో పరిశోధకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గుర్తించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి సేకరించిన వస్తువులు పనికి రాకుండాపోవడం బాధాకరమని గిరిజన విజ్ఞానపీఠం అధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న పేర్కొన్నారు. పీఠానికి కళాభరణంగా ఉండే మ్యూజియాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.● ముంపునకు గురైన మ్యూజియం ● నీట మునిగిన జానపద గిరిజన విజ్ఞానపీఠం -
కంపెనీ పనులు త్వరగా పూర్తి చేయాలి
గీసుకొండ : యంగ్వన్ కంపెనీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తిని పెంచాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దక్షిణ కొరియా యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈఓ కిహాక్సంగ్ పేర్కొన్నారు. శనివారం గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పనులను ఆ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కంపెనీలో టీషర్టులు, ట్రాక్సూట్లు, జర్కిన్లు, క్రీడా దుస్తులు, బూట్లు తదితర వస్తువులు తయారు చేయడానికి ఆరు షెడ్లను నిర్మిస్తున్నారని చెప్పారు. యూనిట్–1లో చేపట్టిన ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయన మధ్యాహ్నం 12:30 గంటలు తిరుగు పయనమయ్యారు. కంపెనీ వైస్ చైర్మన్ మిన్షుక్, డైరెక్టర్లు షాహజాన్, సుభ్యసాచి చౌదరి, దిలీప్, ఇండియా హెడ్, డైరెక్టర్ శ్రీకాంత్ ఎస్ భూమిడిపాటి, ఫైనాన్స్ హెడ్ ఆశిష్ అగర్వాల్, హెచ్ఆర్ సురేశ్, అడ్మిన్ మేనేజర్ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, మొగసాని సంపత్ తదితరులు ఉన్నారు. ఉత్పత్తి పెంచి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలి యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సంగ్ -
మిన్నంటిన రోదనలు..
ఎంజీఎం/ కురవి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారితోపాటు చికిత్స పొందుతున్న వా రిని చూసి గుండెలవిసేలా రోదించారు. హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి పెళ్లి వాహన్నాన్ని (బొలెరో) బోర్వెల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే, రెడ్డబోయిన కళమ్మ(55), శ్రీనాథ్ (7) ఎంజీఎంలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మిగతా 20 మందిలో 10మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని ఎంజీఎం తీసుకొచ్చారు. ఇందులో వృద్ధురాలు అనసూర్య, చిన్నారులు శివకుమా ర్, అక్షిత, సంజన, మారుతి చికిత్స పొందుతున్నా రు. మరో ఐదుగురు క్షతగాత్రులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. దీంతో బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో తమ వారిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపించా రు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుటుంబం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతితో కురవి లో మూడు రోజుల క్రితం వివాహం జరిపించారు. వధూవరులను తీసుకొని కుటుంబీకులు, బంధువులు బొలెరోలో తిరుగు ప్రయాణమయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కొందరు వాహనం దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ వ్యాన్.. బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో స్వప్న అక్కడిక్కడే మృతి చెందగా, కళమ్మ, శ్రీనాథ్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురు క్షతగ్రాతులు ఎంజీఎంలో, మరో ఐదుగురు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయం చేయాలని ధర్నా.. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్షతగాత్రుల బంధుమిత్రులు ఎంజీఎం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్కు ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతర ఎమ్మెల్యే.. వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్నారేతో కలిసి పోస్టుమార్టం గది ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.రోడ్డు ప్రమాద మృతులకు ఎంజీఎంలో పోస్టుమార్టం చికిత్స పొందుతున్న ఐదుగురు గుండెలవిసేలా రోదించిన బాధితులు న్యాయం చేయాలని ఆందోళన పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్, డోర్నకల్ ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్..వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
టీజీ ఎన్పీడీసీఎల్కు రూ.10 కోట్ల నష్టం
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో టీజీ ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని నీట మునిగిన గోపాల్పూర్, యాదవనగర్ సబ్ స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎక్కడ విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పని చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 పునరుద్ధరించామని, నీట మునిగిన 8 సబ్ స్టేషన్లలో 6 పునరుద్ధరించా మని, మిగతా 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ వి ద్యుత్ సరఫరా అందించామని వివరించారు. 33 కే వీ ఫీడర్లు 44 ప్రభావితం కాగా 44 పునరుద్ధరించా మని,11 కేవీ ఫీడర్లు 116ల్లో సమస్యలు తలెత్తగా పరిష్కరించామన్నారు. 428 స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తరచూ నీట మునిగే సబ్ స్టేషన్లను మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం హనుమకొండ 100 ఫీట్ రోడ్లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్ కాపు వాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ డి.ఈ సాంబరెడ్డి, ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ దర్శన్ కుమార్, ఎ.డి.ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంలోనూ వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
మహబూబాబాద్ రూరల్ : పోక్సో కేసులో నేరం రుజువుకావడంతో ఓ యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి టి.దేవా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2018 నవంబర్ 1వతేదీన రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో అప్పటి ఏఎస్సై వెంకటాద్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా విచారణ అధికారులుగా అప్పటి ఎస్సై బి.సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐలు లింగయ్య, వెంకటరత్నం విచారణ అధికారులుగా వ్యవహరించారు. అప్పటి రూరల్ సీఐ జె.వెంకటరత్నం.. బాలిక కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట్రాం తండాకు చెందిన భూక్య శ్రీనును అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ నరేశ్ కుమార్ విచారణ అనంతరం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్షులను ప్రస్తుత డీఎస్పీ ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ పి.సర్వయ్య, కోర్టు లైజనింగ్ అధికారి, ఎస్సై జీనత్ బ్రీఫింగ్ ఇవ్వగా ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారులు అశోక్ రెడ్డి, దేవా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ.. శ్రీనుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పనికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. ● మొక్కజొన్న మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతి ● ఏనుగల్లు శివారులో ఘటన పర్వతగిరి: పనికి వెళ్లొస్తూ ఇద్దరు కూలీలు తిరిగిరాని లోకాలకు చేరారు. మొక్కజొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు మాల్య తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయితండాకు చెందిన బానోత్ రాములు(57), బానోత్ హర్లా(48)తోపాటు మరికొంతమంది కూలీలు మొక్కజొన్న మిషన్లో పని చేయడానికి ఏనుగల్లు వెళ్లారు. పని పూర్తయిన అనంతరం అదే ట్రాక్టర్(నెంబర్ ప్లేట్ లేని)కు అమర్చిన మొక్క జొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్పై రాములు, హర్లా కూర్చున్నారు. ఈ క్రమంలో మాల్యాతండాకు చేరుకోగా ట్రాక్టర్కు ఉన్న బోల్డ్ ఊడడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన హర్లా అక్కడికక్కడే మృతి చెందాడు. రాములును హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రాములు కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, తెలుగు సినీ దర్శకుడు వంగ సందీప్రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు భద్రకాళి శేషు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావులు.. దర్శకుడు సందీప్రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సాయంత్రం దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. -
రేపు ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్
విద్యారణ్యపురి : ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ప్రత్యేక ప్రతిభా పరీక్ష సాట్ క్యూ ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష ఇంటర్మీడియట్లో చేరబోయే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రం హనుమకొండలోని ఎస్ఆర్ ఎడ్యుసెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. సిలబస్ ఇలా ఉంటుందన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10వ తరగతి స్థాయిలో మొత్తం 75 ప్రశ్నలు, ప్రతీ సబ్జెక్టుకు 25 మార్కులు ఉంటాయన్నారు. ఐఐటీ –జేఈఈ అండ్ నీట్లో కోచింగ్లో ప్రవేశం పొందే అర్హత ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షతో తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఉత్తమ స్కాలర్షిప్ అవకాశాలను పొందుతారన్నారు. పరీక్ష నమోదు కోసం విద్యార్థులు సమీపంలోని ఎస్ఆర్ బ్రాంచ్ లేదా 9642117378, 9154989356, 8886287456, 9154854700, 9642117330, 9642117830, 99642114698 నంబర్లలో సంప్రదించొచ్చని ఆయన తెలిపారు. -
విజిలెన్స్ అధికారులకు సహకరించాలి
హన్మకొండ: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబర్ 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో వివిధ ప్రభుత్వ శాఖల విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, పౌరులు తమ బాధ్యతగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సహకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు ఉదయం 6గంటలకు హనుమకొండ జేఎన్ఎస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొలని పిలుపునిచ్చారు. అనంతరం అధికా రులతో ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్స్పెక్టర్లు బి.అనిల్కుమార్, కిశోర్, ట్రాన్స్ కోఇన్స్పెక్టర్ ఎం.డి.షాదుల్లా, ఏఓ ఎ.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎ.గౌతం, తహసీల్దార్లు లక్ష్మణ్, భాస్కర్, ఇంజనీర్లు విద్య, శ్రీనివాస్ నాయక్, మల్సూర్, యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ ఆఫీసర్ కార్తీక్, టీజీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్కో, కేటీపీఎస్, సివిల్ సప్లై, జీడబ్ల్యూఎంసీ, అటవీ శాఖ, డీసీసీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు -
గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
జఫర్గఢ్: రెండు రోజుల క్రితం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోయినాచలం గ్రామ శివారులోని బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడెపల్లికి చెందిన బరిగెల శివకుమార్ (ప్రేమికులు) బుధవారం రాత్రి బైక్పై జఫర్గఢ్ మండలం కోనాయిచలం వస్తుండగా మార్గమధ్యలో బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో పడ్డారు. చెట్టు కొమ్మల సాయంతో శివకుమార్ ప్రాణంతో బయటపడగా శ్రావ్య వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఉదయం శ్రావ్య మృతదేహం నీటిపై తేలింది. గమనించిన పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలి వద్ద కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. -
రైతుల సంక్షేమమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతులు పండించిన పత్తి పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. మహబూబాబాద్ మున్సి పాలిటీ పరిధి బేతోలు గ్రామ శివారు సాయి శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ వద్ద సీసీఐ పత్తి కొనుగొళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, సరైన మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందన్నారు. ఏఎ ంసీ చైర్మన్ సుధాకర్, డైరెక్టర్లు వెంకన్న, మల్ల య్య, డీఎంఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, వీరభద్రం, లక్ష్మీనారాయణ, రామరాజు, నరసింహారావు, గిరిధర్ గుప్తా, శ్రీనివాస్, యా కన్న, పాషా, దిలీప్ పాల్గొన్నారు. కేసముద్రంలో.. కేసముద్రం: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మురళీనాయక్ అ న్నారు. శుక్రవారం కేసముద్రం మార్కెట్లో సీసీ ఐ కొనుగోళ్లను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం మార్కెట్లో ధాన్యం ఆరబోత యంత్రాన్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభా య్పటేల్ జయంతి సందర్భంగా చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్పనపల్లి గ్రామంలో వరద బాధితులకు ఐదు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, నాగేశ్వర్రావు,అమరలింగేశ్వరరావు ఉన్నారు.● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ● పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
ఆక్రమణలపై ఉక్కుపాదం
● ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు ● వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం● చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే తరచూ నగరం ముంపు ● పది మంది స్వార్థం.. వేల ఇళ్ల మునకకు కారణం.. ● స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేయండి.. ● అధికారులకు సీఎం దిశానిర్దేశం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే ● ముంపు కాలనీల వాసులకు పరామర్శ ● హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని, చెరువులు, నాలాల ఆక్రమణలు కూడా ముంపునకు కారణాలని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణనష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సూచించారు. చెరువులు, నాలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మోంథా తుపాను వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ హాల్లో ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలి సి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జరిగిన నష్టం అంచనాపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై నిర్ధిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చూడాలి.. ఆక్రమణలు తొలగించాలి.. వరంగల్ నగరం ముంపుపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో–ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాలు, గ్రేటర్ వరంగల్లో నష్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు కలెక్టర్లు స్నేహ శబ రీష్, డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లు వివరించారు. సమీక్షలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు కావ్య, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, రాష్ట్రస్థాయి అధికారులు, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్కుమార్ సింగ్, రిజ్వాన్ బాషా అధికారులు పాల్గొన్నారు. -
యువత పటేల్ను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్ : యువత సర్దార్ వల్ల భాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ నిర్వహించారు. విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనగా.. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శప్రాయుడని, ఐకమత్యంతో ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించారన్నారు. అనంతరం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభా య్ పటేల్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, మెరుగైన సమాజం కోసం ఆయన చూపిన మార్గాన్ని అ నుసరించాలన్నారు. కాగా మానుకోట టౌన్ పోలీ స్స్టేషన్ నుంచి ప్రారంభమైన రన్ ఎన్టీఆర్ స్టేడి యం వద్ద ముగిసింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎస్పీలు తిరుపతిరావు, శ్రీనివాసరావు, విజయప్రతాప్, మో హన్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య ఉన్నారు. -
15 గంటల ఆలస్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్
డోర్నకల్: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ 15 గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో గత బుధవారం డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నీట మునగడంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్ నుంచి వెనుకకు వెళ్లి నడికుడి మీదుగా ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు ఆదిలాబాద్కు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో గురువారం సాయంత్రం 3.19 గంటలకు రైలు డోర్నకల్కు రావాల్సి ఉండగా సుమారు 15 గంటల ఆలస్యంగా శుక్రవారం ఉదయం 6.30లకు చేరుకుంది. రైతులు పంటలు నమోదు చేసుకోవాలిబయ్యారం: వానాకాలంలో వరిసాగు చేసిన రైతులు ధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఏఈఓ ద్వారా పంటలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల సూచించారు. మండలంలోని గంధంపల్లి–కొత్తపేట సమీపంలోని వరి పొలాలను శుక్రవారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ రాజు, ఏఈఓలు నాగరాజు, అఖిల్, రైతులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని 22 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల బోధన కోసం ఉపాధ్యాయ, ఆయా పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పి.దక్షిణామూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పోస్టుకు కనీస ఉత్తీర్ణత కలిగి ఉండాలని, టీచర్ పోస్టుకు ఇంటర్, టీటీసీ అర్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. ఆయాకు నెలకు రూ.6 వేలు, టీచర్కు రూ. 8 వేల వేతనం అందిస్తామన్నారు. ఈ వేతనం పాఠశాలలు కొనసాగిన పది నెలలు మాత్రమే ఉంటుందన్నారు. దరఖాస్తులు నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మండల, విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంతొర్రూరు: కార్మికుల హక్కులు కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువస్తోందని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ భిక్షపతితో కలిసి విశ్వేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలన్నారు. ఏఐటీయూసీ 9 దశాబ్దాలుగా కార్మికుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి బందు మహేందర్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల ప్రభాకర్, నాయకులు ఘనపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్, వెంకన్న, వీరన్న, చంద్రయ్య పాల్గొన్నారు. -
వరద నష్టం రూ.200కోట్లు
సాక్షి, మహబూబాబాద్: మోంథా తుపానుతో జిల్లా అతలాకుతలమైంది. చేతికొచ్చిన పంటలు నీట ము నిగాయి. చెరువులు, కాల్వలు తెగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఈ నష్టం రూ.200కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే కొండంత నష్టం జరిగితే ప్రభుత్వ అధికారులు మాత్రం తక్కు వ అంచనాలు వేస్తున్నారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తెగిన చెరువులు, రోడ్లు.. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 159 చెరువులు కుంటలు తెగిపోయాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండేలా చేశారు. మరికొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోలేదు. మోంథా తుపానుతో జిల్లాలోని చిన్ననాగారం, మునిగలవీడు, బలపాల ప్రాంతంలో కాల్వలు తెగిపోయాయి. కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలోని బర్లవానిచెరువు, పెరుమాండ్ల సంకీస రెడ్డి చెరువు, ఉయ్యాలవాడ ఊర చెరువు తెగిపోయాయి. డోర్నకల్ మండలం రావిగూడెం కొత్తకుంట, కురవి మండలం నేరడ పెద్ద చెరువు, మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలోని పెద్ద సముద్రం చెరువులకు గండ్లుపడ్డాయి. ఇలా జిల్లాలో మొత్తం 11 చెరువులు, కాల్వలు వర్షంతో దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతు చేసేందుకు రూ. 12.3లక్షలు, శాశ్వత పనులు చేసేందుకు 63.5లక్షల ఖర్చు అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనాలు వేశారు. అదే విధంగా జిల్లాలో ఇప్పటికే ఆర్అండ్బీ రోడ్లు గుంతల మయంగా ఉన్నాయి. గత ఏడాది నుంచి వీటిని మరమ్మతులు చేసిన వారు లేరు. ప్యాచ్ వర్క్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో పనులు చేసినా.. అవి ౖపైపెనే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నిచోట్ల ఇంకా ప్రవాహం తగ్గకపోవడం, ఇంకా అంచనాలు వేయలేదు. దెబ్బతిన్న పంటలు.. వానాకాలం సీజన్లో 3,59,774 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా 2.10లక్షల ఎకరాల్లో వరి, 64వేల ఎకరాల్లో మొక్కజొన్న, 82వేల ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇందులో మోంథా తుపానుతో సుమారు లక్ష ఎకరాలకుపైగా పంట నష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబు తున్నారు. కానీ, అధికారులు మాత్రం 10,422 మంది రైతులు సాగు చేసిన 16,617 ఎకరాల వరి, 35మంది రైతుల 65 ఎకరాల మొక్కజొన్న, 4,807 మంది రైతుల 8,782 ఎకరాల పత్తి, 350 మంది రైతులు సాగుచేసిన 565 ఎకరాల్లో మిర్చి.. మొత్తంగా 15,614 మంది రైతులు సాగుచేసిన 26,029 ఎకరాల్లో మాత్రమే పంటలు నీట మునిగాయని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఈ నష్టం ఎక్కువగా ఉందని మొత్తం రూ.150కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. నీట మునిగిన పంటలు తెగిన చెరువులు, రోడ్లు అంచనాలు తయారు చేస్తున్న అధికారులు -
వరద ప్రభావిత బాధితులకు సీఎం పరామర్శ, భరోసా..
ఏరియల్ సర్వే తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు రోడ్డుమార్గాన మొదట సమ్మయ్య నగర్కు చేరుకున్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారిన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్లో వరద ముంపు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. -
వర్షార్పణం..
సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్:మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలగా.. పత్తి, పసుపు, మిరప పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు వాగుల ఉధృతితో పరివాహక పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందే సమ యంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరద నీటిలోనే పొలాలు.. జిల్లాలో చాలాచోట్ల వరి పంటలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన పంటలు అధిక వర్షాలు, వాగుల ఉధృతికి పూర్తిగా కోల్పోయి అప్పుల పాలయ్యామని, ప్రస్తుతం వరి పంట చేతికి అందివచ్చే సమయానికి తుపాను నిండా ముంచిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. 15,614 మంది రైతులు.. 26,029 ఎకరాల్లో పంటలకు నష్టం.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 10,422 మంది రైతులకు చెందిన 16,617 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అలాగే 4,807 మంది రైతులకు సంబంధించి 8,782 ఎకరాల్లో పత్తి, 350మంది రైతులకు చెందిన 565 ఎకరాల మిర్చి, 35మంది రైతుల మొక్కజొన్న 65 ఎకరాలు ముంపునకు గురైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మొత్తంగా 15,614 మంది రైతులకు సంబంధించిన అన్ని రకాల పంటలు 26,029 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు వాటిల్లిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.జిల్లాలో ముంపునకు గురైన పంటలు(ఎకరాలలో) మోంథా తుపాను తాకిడికి దెబ్బతిన్న పంటలు నేలవాలిన వరి, మొక్కజొన్న.. నీట మునిగిన పత్తి, మిరప చేలు 26,029 ఎకరాల్లో నష్టంమండలం వరి మిర్చి పత్తి బయ్యారం 2,488 – 192 గంగారం 180 – – గార్ల 550 30 100 గూడూరు 980 80 190 ఇనుగుర్తి 600 30 – కేసముద్రం 1,240 95 – కొత్తగూడ 1,380 – – మహబూబాబాద్ 860 40 100 నెల్లికుదురు 950 100 – చిన్నగూడూరు 210 – 250 దంతాలపల్లి 1,050 – 1,300 డోర్నకల్ 1,135 190 1,430 కురవి 800 – 950 మరిపెడ 500 – 1,550 నర్సింహులపేట 418 – 950 పెద్దవంగర 1,546 – 100 సీరోలు 950 – 850 తొర్రూరు 780 – 820 -
కంబాలపల్లిలో యువకుడు..
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు వరద ఉధృతిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు జంపన్నవాగు వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) వ్యవసాయం చేసుకుంటూ భార్య స్వరూప, ఇద్దరి కూతుళ్లను పోషించుకుంటున్నాడు. బుధవారం గ్రామంలో తమ బంధువు దశదిన కర్మలు జరిగాయి. ఈకార్యక్రమానికి బయ్యారం మండలం గురిమిళ్లకు చెందిన తన మేనత్త సూరబోయిన మల్లమ్మ హాజరైంది. కార్యక్రమం అనంతరం ఆమెను బైక్పై రెడ్యాల నుంచి గురిమిళ్లకు తీసుకెళ్లాడు. రాత్రి గురిమిళ్ల నుంచి రెడ్యాలకు బయలుదేరాడు. ఈ సమయంలో చిన్నవాగు కల్వర్టుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరదను గమనించకుండా వెళ్లి గల్లంతయ్యాడు. దీనిపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టగా చిన్న వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు
నెహ్రూసెంటర్: ఆర్టీసీ, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు ఉద్యమాల్లో ముందుండి కార్మికుల పక్షాన పోరాడిన వామపక్ష నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. పోరాట కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరై వామపక్ష నాయకులు గురువారం అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తమపై అక్రమంగా కేసులు పెట్టినా ప్రజలు, కార్మికుల పక్షాన పోరాటాలు సాగిస్తామని తెలిపారు. స్వల్ప మెజారిటీతో నెగ్గిన బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, రైతులు, కార్మికులే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి వామపక్ష నాయకులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో అజయ్సారథిరెడ్డి, తమ్మెర విశ్వేశ్వర్రావు, నల్లు సుధాకర్రెడ్డి, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, హెచ్లింగ్యా, చొప్పరి శేఖర్, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, రాజమౌళి, అల్వాల వీరయ్య, నాగయ్య, ఉపేందర్, మఽధు, సాయిలు ఉన్నారు. -
నివేదికలు అందజేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: తుపాను ప్రభావంపై ప్రతీ రెండు గంటలకు ఒకసారి నివేదికలు అందజేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో తుపాను ప్రభావం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి సంబంఽధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వా గులు, చెరువుల్లో నీటి మట్టాలను గమనిస్తూ వివరాల ను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకార్మికులు వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమల శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్చేంజ్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (డీఐసీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ టీ ఫ్రైడ్ స్కీంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
స్తంభించిన జనజీవనం
● జలదిగ్బంధంలో మానుకోట ● రాకపోకలకు అంతరాయంమహబూబాబాద్,/మహబూబాబాద్ అర్బన్: భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మోంథా తుపానుతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో మానుకోట నుంచి పలు నగరాలు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మానుకోట నుంచి నర్సంపేట, వరంగల్, కేసముద్రం, ఖమ్మం, తొర్రూరుకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగస్తులు పలు గ్రామాలకు వెళ్లలేకపోయారు. కాగా, మానుకోటలోని పలు కాలనీలు జలదిగ్బంధం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నిలిచిన రాకపోకలు.. భారీ వర్షంతో మానుకోట నుంచి నర్సంపేట వరంగల్, గూడూరు, కొత్తగూడకు, మానుకోట నుంచి కేసముద్రం, మానుకోట నుంచి నెల్లికుదురు, తొర్రూరుకు రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకలు జాతీయ రహదారిపై నుంచి పొంగిపొర్లడంతో పాటు చెరువులు మత్తళ్లు దూకడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్నేరువాగు పొంగడంతో మానుకోట–గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్ల వాగు ఉధృతితో మానుకోట–కేసముద్రం మధ్య పోలీసులు కొంతసమయం రాకపోకలను నిలిపివేశారు. అనంతరం వాహనాలను దగ్గర ఉండి జాగ్రత్తగా పంపించారు. జిల్లా కేంద్రం కురవి రోడ్డులోని బంధం చెరువులో నీటిమట్టం పెరిగి, ఆ చెరువు పక్కనే ఉన్న రోడ్డు కొంతభాగం కొట్టుకుపోయింది. అయితే రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు. రెండోరోజు అప్రమత్తం.. వర్షాల నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఇటు రెవెన్యూ, అటు పోలీస్ అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం 5 గంటల నుంచి వాగుల వద్ద బందోబస్తు నిర్వహించారు. మున్నేరువారు వద్ద టౌన్ సీఐ మహేందర్రెడ్డి, రాళ్లవాగు సమీపంలో పోలీస్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు. -
ఎక్కడి బస్సులు అక్కడే..
నెహ్రూసెంటర్: భారీ వర్షంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగడంతో ఆర్టీసీ బస్సులు గురువారం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్ డిపో నుంచి ప్రధానంగా ఖమ్మం, ఇల్లెందు, సూర్యాపేట, నర్సంపేట, హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్, తొర్రూరు ప్రాంతాలకు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందుతున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు ఉప్పొంగడంతో నర్సంపేట–వరంగల్, కేసముద్రం–వరంగల్, కురవి–ఖమ్మం, మహబూబాబాద్–తొర్రూరు రూట్లలో పూర్తిగా బస్సులను నిలిపివేశారు. మానుకోట– సూర్యాపేట, మానుకోట–ఇల్లెందు, మానుకోట–భద్రాచలం రూట్లలో బస్సులను నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తుపాను వల్ల వాగులు, వంకలు పొంగడం, బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు 2కే రన్ మహబూబాబాద్ రూరల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:45 గంటలకు 2కే రన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అండర్ బ్రిడ్జి, ఎఫ్ఆర్ఓ సెంటర్, వివేకానంద సెంటర్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద 2కే రన్ ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు. దేశ ఐక్యత, సమగ్రతకు గుర్తుగా జరుపుకునే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికా రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని దేశ ఏకతా స్ఫూర్తిని మరింత బలపరచాలని కోరారు. విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలి గూడూరు: ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విద్యుత్ అంతరాయాలను గుర్తించి వెంటనే పునరుద్ధరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. మోంథా తుపాను ప్రభావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. గురువారం విద్యుత్ పునరుద్ధరణ పనులను సీఎండీ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఈ పి. విజయేదర్రెడ్డి, డివిజన్ ఇంజనీర్ హీరాలాల్, ఏడీఈ కె.కవిత, సబ్ ఇంజనీర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజును రద్దు చేయాలి మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు రూ.125ను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిగా రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్, ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వీరునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ దక్షిణామూర్తికి పదో తరగతి పరీక్షల ఫీజును రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్, వీరునాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులే చదువుతున్నారని, రూ.125 చెల్లించకపోతే కుల, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని రావాలని అధికారులు చెబుతున్నారని, వాటికి రూ. 500 నుంచి రూ.1000 ఖర్చు అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో ఫీజును రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శివనాయక్, జిల్లా అధ్యక్షులు భధ్రునాయక్, మద్దెల వీరస్వామి, జిల్లా నాయకులు శ్రీనివాస్, పర్వతాలు, యాకోబు నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
7 గంటలపాటు రైళ్ల నిలిపివేత
కాజీపేట రూరల్ : హసన్పర్తి–వరంగల్ మధ్య రెండు రైల్వే లైన్లలో గురువారం ఏడు గంటలపాటు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్ను వరద ముంచెత్తడంతో ముప్పు పొంచి ఉందనే సమాచారం గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు రైల్వే అధికారులకు వచ్చింది. దీంతో బ్రిడ్జి ట్రాక్ వద్ద డేంజర్ లెవెల్ క్రాసింగ్ జోన్గా ప్రకటించి ఉదయం 6:45 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు రైళ్ల రాకపోలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జి వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో గూడ్స్ రైలును పంపించి ట్రాక్ను సరిచేసి సర్వీస్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంతో వయా వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే న్యూఢిల్లీ రైళ్లు అప్అండ్డౌన్లో రెండు లైన్లలో యథావిధిగా ప్రయాణిస్తున్నాయని అధికారులు తెలిపారు. డోర్నకల్ రైల్వే లైన్ క్లియర్తో.. డోర్నకల్ జంక్షన్లో ట్రాక్ సమస్య బుధవారం రా త్రి వరకు క్లియర్ కావడంతో కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మా ర్గాల్లో ప్రయాణించే రైళ్లు నిర్ణీత సమయం కన్నా ఆ లస్యంతో యథావిధిగా నడుస్తున్నాయని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన, రద్దు చేసిన రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని వారు పే ర్కొన్నారు. కాగా, వర్షానికి జలమయమైన రైల్వే డీజిల్కాలనీని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) గోపాలకృష్ణణ్ పరిశీలించారు. కోచ్ఫ్యాక్టరీ యూనిట్లోకి వరదనీరు.. కాజీపేట శివారులో నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్లోకి వరద నీరు చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వరద భారీగా చేరడంతో రైల్వే యూనిట్లో సికింద్రాబాద్ వైపు గల 300 అడుగుల పొడవు వరకు ప్రహరీ నే లమట్టమై కొట్టుకుపోయినట్లు రైల్వే అధికారులు గు రువారం తెలిపారు. అలాగే, వివిధ నిర్మాణాల్లోకి వ రద చేరడంతో మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వడ్డేపల్లి బ్రిడ్జి వద్ద ట్రాక్ను తాకిన వరద నీరు -
టీజీ ఎన్పీడీసీఎల్కు తీరని నష్టం..
హన్మకొండ: మోంథా తుపానుతో టీజీ ఎన్పీడీసీఎల్కు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు కూలడంతోపాటు కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. వరద ఉ ధృతికి సబ్స్టేషన్లు , డిస్ట్రిబ్యూషన్ ట్రా న్స్ఫార్మర్లులు నీటమునిగాయి. సంస్థ పరిధిలో 428 స్తంభాలు దెబ్బతినగా 88 స్తంభాలను పునరుద్ధరించారు. 218 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినగా 78 పునరుద్ధరించారు. 8 సబ్స్టేషన్ల్లో వరద నీరు చేరింది. 172 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 342 స్తంభాలు దెబ్బతినగా 75 పునరుద్ధరించారు. 205 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా 68 పునరుద్ధరించారు. 8 సబ్స్టేషన్లు నీట మునిగాయి. 162 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివరాలు సర్కిల్ దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగిన స్తంభాలు సబ్స్టేషన్లు హనుమకొండ 164 100 2 వరంగల్ 76 86 5 జనగామ 16 01 –– మహబూబాబాద్ 71 18 1 జేఎస్ భూపాలపల్లి 15 –– –– దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నీటమునిగిన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు -
వాగులో దంపతుల గల్లంతు..
ఎల్కతుర్తి: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగు దాటుతుండగా దంపతులు బుధవారం రాత్రి గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్, కల్పన దంపతులు బైక్పై అత్తగారి ఇల్లు అక్కన్నపేటకు వెళ్తున్నారు. మల్లారం దగ్గర రోడ్డు దెబ్బతినడంతో మోత్కులపల్లి వైపునకు వెళ్తున్నారు. ఇక్కడ వాగు దాటే ప్రయత్నంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చెరువు దగ్గర బైక్ కనిపించడంతో నంబర్ ద్వారా దంపతులను గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వాగు, చెరువు పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
శివనగర్లో యువకుడు..
ఖిలా వరంగల్/గీసుకొండ: ఓ యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జి ల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్ మనుగొండ గట్టుకింది పల్లెకు చెందిన పులి అనిల్ (35) తన భార్య మమతతో కలిసి బుధవారం బైక్పై రైల్వేగేట్ ప్రాంతంలో జరిగిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. వర్షం భారీగా కురుస్తుండడంతో భార్యను బస్సులో పంపించి బైక్ ఇంటికి బయలుదేడు. ఈక్రమంలో శివనగర్ మైసయ్యనగర్ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న భారీ వరదలో బైక్తో సహా కొట్టుకుపోయాడు. రాత్రి అ యినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య మమత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళన చెందిన మమత వెంటనే వరంగల్ శివనగర్లోని మైసయ్యనగర్కు చేరుకుంది. అప్పటికి వరద ప్రవహం తగ్గడంతో డ్రైనేజీ లో బైక్ లభించింది. కా నీ అనిల్ ఆచూకీ లభించలేదు. దీంతో కార్పొరేటర్లు దిడ్డికుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్ ఆ ధ్వర్యంలో గాలింపు చ ర్యలు చేపట్టగా 35వ డివిజన్ నేతాజీ స్కూల్ స మీపం డ్రెయినేజీలో అనిల్ మృతదేహం లభించింది. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గురువారం తెలిపారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
తొర్రూరు రూరల్: రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణవేణి తెలిపారు. మండలంలోని నాంచారిమడూరు, వెలికట్ట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. డీఎం కృష్టవేణి మాట్లాడుతూ.. అకాల వర్షాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. -
ఉత్సాహంగా ఉత్కర్ష్..
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష్ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం సాంస్కృతిక కార్యక్రమాలతో వైద్య విద్యార్థులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, క్లాసికల్ డ్యాన్స్లు, నాటికలతో ఆకట్టుకున్నారు. అనంతరం క్రీడలు, సోషల్ మీడియా పోటీల్లో విజేతలు, రన్నరప్లకు బహుమతులు అందించారు. కాగా, ఈఎన్టీ స్పెషలిస్టు, కేఎంసీ మాజీ ప్రిన్సిపాల్ రమేశ్ తన నృత్య ప్రదర్శనతో విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమానికి డీఎంఈ నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా విశిష్ట అతిథులుగా ఉస్మానియా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాధిపతి మధుసూదన్, హనుమంతరావు, ప్రముఖ వైద్య నిపుణుడు నర్సింహారెడ్డి, డెర్మటాలజీ విభాగాధిపతి మధుబాబు, ప్రొఫెసర్లు కాత్యాయినీ, పుల్లయ్య, రాంకుమార్రెడ్డి, కూరపాటి రమేశ్ పాల్గొన్నారు. కేఎంసీలో సాంస్కృతిక కార్యక్రమాలు -
‘మోంథా’తో మరోసారి ఉలిక్కిపడ్డాం..
మరిపెడ రూరల్: ‘మోంథా’ తుపానుతో మరోసారి ఉలిక్కిపడ్డామని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలోని సీతారాంతండా ముంపు నిర్వాసితులు తెలిపారు. గతేడాది సీఎం రేవంత్రెడ్డి వచ్చి తమకు మరో చోట పునరావాసం కింద ఇళ్లు నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలలోని పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు బ్రిడ్జి సమీపంలో మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ముంపు ప్రాంతమైన సీతారాంతండాలో ఉంటే ఎప్పటికై నా తమ ప్రాణాలు వాగులో కలిసిపోతాయని బోరుమన్నారు. గతేడాది జూన్లో వచ్చిన వరదలకు ముంపుకు గురై సర్వం కోల్పోయామన్నారు. దాతల సహకారంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మళ్లీ తుపాన్ వరదలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. గతేడాది ఆకేరు వాగు వరదకు గురైన తమ తండాను సీఎం రేవంత్రెడ్డి సందర్శించి తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించార న్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించిన తమకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై వీరభద్రరావు, అదనపు ఎస్సై కోటేశ్వర్రావు, ఎంపీఓ సోమ్లానాయక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు. సీతారాంతండా ముంపు నిర్వాసితులు ప్రభుత్వ హామీ మేరకు మరో చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ 365 జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో -
ఆక్రమణలపై విచారణ జరుపుతాం
● ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ డోర్నకల్: డోర్నకల్లో చెరువులు, కుంటల ఆక్రమణపై విచారణ జరుపుతామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, అంబేడ్కర్నగర్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం విప్ రాంచంద్రునాయక్ మాట్లాడారు. ఆక్రమణల వల్లే వరదలు వచ్చిన సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమినర్ నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్యాదవ్, పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్చంద్జైన్, నాయకులు మాదా శ్రీనివాస్, ఎస్. వెంకటేశ్వర్లు, తాళ్లూరి హనుమంతరావు, శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉసురు తీసిన వరద..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘మోంథా’ తుపాను పలువురి ఉసురు తీసింది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం ఏకధాటిగా భీకరంగా కురిసింది. దీంతో ప్రమాదశాత్తు వరద నీటిలో పడి కొందరు మృతి చెందగా, మరికొందరు ప్రవాహంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకొందరు రోజంత కురిసిన వానకు ఇంటి గోడలు నాని కూలి మీదపడడంతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. –సాక్షి నెట్వర్క్ వరంగల్: నగరంలోని 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద నీటిలో పడి అడప కృష్ణమూర్తి (65) మృతి చెందాడు. బంధువుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుండడంతో అధికారులు శుభం గార్డెన్స్లో సహాయక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఎస్ఆర్నగర్ వాసులంతా వెళ్లగా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బంధువులు వచ్చి చూడగా కృష్ణమూర్తి నీటిలో పడి మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు కాలనీ వాసులు తెలిపారు. గోడ కూలి గాజులగట్టులో వృద్ధురాలు .. గూడూరు: వర్షానికి గోడ కూలి మీదపడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోల రామక్క(80) బుధవారం రాత్రి ఇంట్లో గోడ పక్కన మంచంలో నిద్రిస్తోంది. ఈ సమయంలో వర్షం కురిసి గోడ నానింది. దీంతో గోడ శిథిలాలు ఒక్కసారిగా నిద్రిస్తున్న రామక్కపై పడడంతో మృతి చెందింది. ఈఘటనపై కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. గిరిధర్రెడ్డి తెలిపారు. కొండపర్తిలో మరో వృద్ధురాలు.. ఐనవోలు: భారీ వర్షంతో ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దల సూరమ్మ(58) ఒంటరి జీవనం గడుపుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఇంటి(పెంకుటిల్లు) గోడలు తడిశాయి. గురువారం తెల్లవారుజామున మంచంపై నిద్రిస్తున్న సూరమ్మపై పడడంతో ఆమె మృతిచెందింది. కాగా, శిథిలాల కింద ఉన్న సూరమ్మ మృతదేహాన్ని స్థానికులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరులో వ్యక్తి .. ఆత్మకూరు: భారీ వర్షంతో ఓ వ్యక్తి అస్వస్థకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దివ్యాంగుడు నాగెల్లి ఆనందం(60)బుధవారం రాత్రంతా వర్షం కురుస్తుండడంతో ఇంటికి వెళ్లకుండా బస్టాండ్ సమీపంలో తలదాచుకున్నాడు.ఈ క్రమంలో చలికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన బంధువులు గురువారం చికిత్స నిమిత్తం అంబులెన్స్ను పిలిపించగా అప్పటికే మృతిచెందాడు. కొత్తపల్లిలోకల్వర్టులో పడి వ్యక్తి.. ఎల్కతుర్తి: మొంథా తుపాను ప్రభావంతో బుధవారం కురిసిన వర్షంతో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58)కాల్వ లో పడి దర్మరణం చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నాగేంద్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా వర్షం ఉధృతి పెరిగింది. కల్వర్టు నీటితో నిండిపోవడంతో దారి కనిపించక అందులోనే పడి మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
శ్రమించిన పోలీస్
● ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ ● సురక్షిత ప్రాంతాలకు వరద బాధితులు వరంగల్ క్రైం: మోంథా తుపాను సృష్టించిన విధ్వంసానికి గ్రేటర్ పరిధి ట్రైసీటీలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పోలీసులు అందిస్తున్న సేవలతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. హనుమకొండ పోలీసులు రాయపుర ప్రాంతంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు బాధితులకు టిఫిన్లు, వాటర్ బాటిళ్లు అందించారు. ములుగు రోడ్డులోని గాయత్రి కళాశాలలో చిక్కుకుపోయిన విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధుడిని స్ట్రెచర్ మీద తీసుకొచ్చి 108లో ఎంజీఎంకు తరలించారు. -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు బీఏ, బీకాం, బీబీఏ,బీఎస్సీ , బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సిటీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య గురువారం తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వరకు గడువు ముగియగా మళ్లీ ఆ గడువు పొడిగించారు. ‘ఓపెన్’ ఫలితాలు విడుదలవిద్యారణ్యపురి: ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాల వారీగా ఫలితాలు ఇలా.. ● హనుమకొండ జిల్లాలో టెన్త్లో 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54మంది ఉత్తీర్ణత( 77.14శాతం), ఇంటర్లో 226మందికి 144మంది ఉత్తీర్ణత (63.72శాతం) సాఽధించారు. ● వరంగల్ జిల్లాలో టెన్త్లో 263 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 82 మంది (3 1.18శాతం), ఇంటర్లో 232 మందికి 107 మంది ఉత్తీర్ణత (46.12శాతం)సాధించారు. ● మహబూబాబాద్ జిల్లాలో టెన్త్లో 95మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75మంది ఉత్తీర్ణత (78.95శాతం), ఇంటర్లో 98మందికి 70 మంది ఉత్తీర్ణత (71.43శాతం) సాధించారు. ● జనగామ జిల్లాలో టెన్త్లో 59మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 48మంది (81.36శాతం), ఇంటర్లో 96మందికి 57మంది ఉత్తీర్ణత (59.38శాతం) సాఽధించారు. ● ములుగు జిల్లాలో టెన్త్లో 120మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 105మంది (87.50శాతం ఉత్తీర్ణత), ఇంటర్లో 287మందికి 201మంది ఉత్తీర్ణత (70.03శాతం) సాధించారు. ● జయశంకర్భూపాలపల్లి జిల్లాలోటెన్త్లో 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39మంది ఉత్తీర్ణత (65శాతం) సాధించారు. ఇంటర్లో 76మంది విద్యార్థులకు 54 మంది ఉత్తీర్ణత 71.05శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈఫలితాలను తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు నవంబర్ 4నుంచి 12 తేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. -
వరదలో ప్రేమజంట గల్లంతు
జఫర్గఢ్ : బైక్పై వస్తున్న ప్రేమజంట వరద ఉధృతిలో పడింది. కొట్టుకుపోతున్న క్రమంలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణంతో బయటపడగా యువతి గల్లంతు అయ్యింది. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోనాయిచలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క అలీసాబ్, పూర్ణ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్లోని కోళ్ల ఫామ్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ఫామ్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బరిగేల శివకుమార్ పనిచేస్తున్నాడు. అలీసాబ్, పూర్ణ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య వరంగల్లోని ఓ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ ఇదే కళాశాల వద్ద హాస్టల్లోనే ఉంటోంది. అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తున్న క్రమంలో శివకుమార్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో శ్రావ్య.. శివకుమార్ను కలిసేందుకు బుధవారం హైదరాబాద్ వెళ్లింది. కాగా, శ్రావ్యను తిరిగి వరంగల్లోని హాస్టల్లో చేర్చేందుకు సాయంత్రం బైక్పై ఇద్దరు బయలుదేరి జఫర్గఢ్ మండలం కోనాయిచలం వైపు వస్తున్నారు. అప్పటికే బోల్లమత్తడి కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా బైక్తో సహా కొట్టుకుపోతుండగా శివకుమార్ చెట్టుకొమ్మల సాయంతో బయటపడ్డాడు. శ్రావ్య గల్లంతు అయ్యింది. గురువారం గల్లంతైన శ్రావ్య ఆచూకీ కోసం వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామారావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. -
ముందస్తుగా అప్రమత్తం చేయాలి
● ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి ● వీసీలో సీఎం రేవంత్రెడ్డిమహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, లోలెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందస్తుగానే అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి గురువారం సీఎం రేవంత్రెడ్డి ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, కొండా సురేఖ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి తుపాను ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండలస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రైల్వే కాలనీలోకి వరద నీరు...
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి పోటెత్తిన వరద దిగువ ప్రాంతంలోని రైల్వే క్వార్టర్స్లోకి చేరడంతో రైల్వే ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రైల్వే స్టేషన్ మీదుగా వరదనీరు రైల్వే పార్కు నుంచి పక్కన ఉన్న క్వార్టర్స్లోకి చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద చేరడంతో ఫర్నిచర్తో పాటు సామగ్రి నీట మునిగింది. వృద్ధులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. అధికారుల సమీక్ష... భారీ వర్షాలపై కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి సమీక్షించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ రైలు ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులతో మా ట్లాడారు. అంబేడ్కర్నగర్లో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆశలపై నీళ్లు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో భారీ వర్షం వల్ల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,15,723 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 50 శాతానికిపైగా పంటలకు నష్టం వాటిల్లింది. 62,751 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. అధిక మొత్తంలో మొక్కజొన్న కంకులను కోసి విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరబోసుకున్నారు. వర్షంతో మక్కలు తడిసి ముద్దయ్యాయి. 70నుంచి 80శాతం వరకు నష్టం వాటిల్లింది. 86,224 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ప్రస్తుతం కోత దశలో 60 శాతానికిపైగా నష్టం జరిగింది. 38,289 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా పూత 40శాతం వరకు రాలిపోయినట్లు రైతులు పేర్కొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
మహబూబాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థలో ఉన్న భవనాలతో ప్రమాదం పొంచి ఉంది. నిజాం కాలం నాటి భవనాల్లోనే ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండగా అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యాలయాల నూతన భవనాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం.. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. ఆ భవనం వెనుకభాగం చాలా వరకు కూలిపోయింది. భవనం స్లాబ్ పెచ్చులూడిపోతున్నాయి. దీంతో భవనం ఎప్పడు కూలిపోతుందోనని బిక్కుబిక్కూమంటూ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కార్యాలయాలు.. నిజాంకాలం నాటి భవనంలోనే ఇరిగేషన్ శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఆ భవనంలో చాలా గదులు కూలిపోయాయి. మిగిలిన గదుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ కార్యాలయం కూడా నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. అలాగే కంకరబోడ్ ప్రాంతంలో బీఎస్ ఎన్ఎల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి పిచ్చి మొక్కలు ఏపుగాపెరిగి పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే మున్సిపాలిటీ క్వార్టర్స్ చాలా వరకు కూలిపోగా.. కొన్ని గదులు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నా యి. అలాగే ఆఫీసర్ క్లబ్ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇదిలా ఉండగా శిథిలావస్థ ఇళ్లలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గత ంలోనూఆ ఇళ్ల యజమానులకు నోటీస్లు ఇచ్చారు. తుపానుతో శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయించాలని ఆదేశాలు నిజాంకాలం నాటి భవనాల్లోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు బిక్కుబిక్కుమంటూవిధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ప్రతిపాదనలకే పరిమితమైన నూతన భవనాలు -
అతలాకుతలం..
జిల్లాను ముంచెత్తిన మోంథా తుపానుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. మోంథా తుపా ను ప్రభావంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో పత్తి పంటలు దెబ్బతిన్నగా, వరి, మొక్కజొన్న పంటలు నేలవా లాయి. రోడ్లు, కల్లాల్లో ఆరబోయిన ధాన్యం, మక్కలు తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరు మున్నీ రుగా విలపించారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందుల పడ్డారు. డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టా లపై వర్షపు నీరు నిలవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అప్రమత్తం.. జిల్లాలో బుధవారం ఉదయం 5 గంటల నుంచే వాన మొదలైంది. ఈమేరకు కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈమేరకు ఎక్కడికక్కడే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రోడ్లపై, వాగులు, ఇతర జలాశయాల వద్ద విధులు నిర్వర్తించారు. కాగా వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పొంగిన వాగులు, వంకలు.. చెరువుల మత్తళ్లు భారీ వర్షానికి జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాకాల, వట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై నుంచి ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిజాం చెరువు, బంధం చెరువు, రాబంధు చెరువు, జనాల చెరువు, కంబాల చెరువు, ఈదులపూసపల్లి చెరువు మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లాలో మహబూబాబాద్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలో పలు శివారు కాలనీలు నీట మునిగాయి. సైడ్ డ్రెయినేజీల నుంచి రోడ్లపైకి మురుగు నీరు ప్రవహించింది. అదేవిధంగా జిల్లా కేంద్రం ధర్మన్న కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం జలమయమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపునీరు జలమయమైన ఇళ్లు.. ప్రజల ఇబ్బందులు దెబ్బతిన్న పత్తి, నేలవాలిన వరి, మొక్కజొన్న పంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు అలుగుపోస్తున్న పలు చెరువులు..పోలీసుల బందోబస్తు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు -
నాలుగేళ్లకే నూరేళ్లు
రేగొండ: నాలుగేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండాయి. కూలర్ వైరే యమపాశమైంది. అప్పటి వరకు ఆడుకున్న చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రామన్నగూడెం తండాలో కరెంట్ షాక్తో చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ వీరు–ప్రియాంక దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉదయం పనినిమిత్తం వారు పరకాలకు వెళ్లారు. కాగా, ఇంటి వద్ద అమ్మమ్మ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్ వైరు తగలడంతో కుమార్తె అంజలి (4) షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి తండ్రి వీరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండు బైక్లు ఢీ.. దుగ్గొండి: రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గిర్నిబావి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పీజీతండా గ్రామానికి చెందిన నునావత్ రాజేందర్(35) భార్య రజితతో కలిసి బైక్పై బుధవారం ఉదయం గురిజాలలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామం వస్తుండగా గిర్నిబావి సమీపంలోని వినాయక ఇండస్ట్రీస్ వద్ద అదే మిల్లులో డ్రైవర్గా పనిచేస్తున్న బాబు మిల్లులోకి వెళ్లడానికి బైక్ రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజేందర్ బైక్ బాబు వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రజిత, బాబుకు గాయాలయ్యాయి. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్రెడ్డి తెలిపారు.● కరెంట్ షాక్తో చిన్నారి మృతి ● రామన్నగూడెంలో విషాదఛాయలు యువకుడి మృతి.. ఇద్దరికి గాయాలు -
స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి అనుమతి
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏ ర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి ప రిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 28న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్పోర్ట్స్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, శాట్ వీసీ ఎండి సోనీబాలదేవితో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 14వ తేదీలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కాగా, జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కడియ శ్రీహరి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీచర్ల శిక్షణ వాయిదావిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లు, నూతనంగా నియామకమైన ఎస్జీటీల శిక్షణ తేదీల్లో మా ర్పులు చేశారు. ఈనెల 30 నుంచి జరగాల్సిన శిక్షణను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్ బుధవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఆరు జిల్లాల డీఈఓలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ శిక్షణ నవంబర్ 6, 7 తేదీల్లో జీహెచ్ఎంలు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లకు, 10, 11 తేదీల్లో ఎస్జీటీలు, లాంగ్వేజెస్ స్కూల్అసిస్టెంట్లకు కలిపి మొత్తం 725 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని జెడ్పీహెచ్ఎస్, మడికొండ జెడ్పీహెచ్ఎస్, హనుమకొండ లష్కర్బజార్ గర్ల్స్ హైస్కూల్, ప్రాక్టీసింగ్ ప్రభుత్వ హైస్కూల్లో శిక్షణ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. కేయూ క్యాంపస్: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30న నిర్వహించనున్న ఎల్ఎల్బీ మూడేళ్ల నాలుగో సెమిస్టర్, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ బుధవారం తెలిపారు. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 30 జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ను వాయిదా వేసినట్లు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. భారీవర్షాల కారణంగా వాయిదా వేశామని, మళ్లీ నిర్వహించే తేదీ త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. తప్పిపోయిన బాలుడి అప్పగింత గీసుకొండ: తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెంది న ధారవేణి శివన్న 15 ఏళ్ల కుమారుడు హర్షిత్ మంగళవారం తప్పిపోయి తిరుగుతుండగా ధర్మారానికి చెందిన నవయుగ యూత్ సభ్యులు పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్.. ఆ బాలుడిని బుధవారం తండ్రి శివన్నకు అప్పగించారు. దీంతో బాలుడి తండ్రి.. పోలీసులతో పాలు నవయుగ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
వర్షంలో చిక్కుకున్న పెళ్లి బృందం
హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్: పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు ఒక్కసారిగా ముంచెత్తిన వర్షంలో చిక్కుకున్న ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన వారి పెళ్లిని అంబేడ్కర్ భవన్లో చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. వివాహానికి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సుమారు 500 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వివాహం ఘనంగా పూర్తి అయ్యింది. వివాహ అనంతరంలో విందులో పాల్గొన్నారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ భవన్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో 250 మంది వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్, ఆర్ఐ దశరథరామిరెడ్డి కలిసి రెండు ట్రాక్టర్లలో పెళ్లి బృందాన్ని సురక్షితంగా తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు. దీంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుని తహసీల్దార్, ఇన్స్పెక్టర్, ఆర్ఐకి కృతజ్ఞతలు తెలిపింది. ట్రాక్టర్లలో సురక్షితంగా తరలించిన అధికారులు -
మానుకోటలో నిలిచిన కృష్ణా ఎక్స్ప్రెస్ ..
మహబూబాబాద్ రూరల్ : మోంథా తుపాన్ ప్రభావంతో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు మూడున్నర గంటలపాటు నిలిచింది. ఉదయం 11.05 గంటలకు మానుకోటకు చేరుకుని నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు, రైల్వే అధికారుల సూచన మేరకు ఆర్యవైశ్యులు, కిరాణా వర్తక సంఘం, మార్వాడీ యువమంచ్, సత్యసాయి సేవా ట్రస్టు, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సీఆర్ఐ పంప్స్, శ్రీవాసవి సేవా ట్రస్టు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థల ప్రతినిధులు, సెల్ షాపుల నిర్వాహకులు, తహసీల్దార్ రాజేశ్వరరావు.. ప్రయాణికులకు సేవలు అందించారు. వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్లు, తదితర అల్పాహారం పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డోర్నకల్ వైపునకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో మధ్యాహ్నం 3.32 గంటలకు రైలును అధికారులు తిరిగి కాజీపేటకు పంపించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఎస్బీ సీఐ నరేందర్, ఆర్ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, ఎస్సైలు ప్రశాంత్ బాబు, అలీం హుస్సేన్, అశోక్, దీపిక, తదితరులు పాల్గొన్నారు. -
గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్..
కురవి: మోంథా తుపాన్తో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లో నిలిచింది. దీంతో మధ్యాహ్నం వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై జయకుమార్, కానిస్టేబుళ్లు కాశీరాం, భద్రు, అశోక్.. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, అరటిపండ్లు అందజేశారు. కాగా, ప్రయాణికులకు గార్లబయ్యారం సీఐ రవికుమార్, బయ్యారం రెండో ఎస్సై మహబూబీతోపాటు బయ్యారం మండల కేంద్రానికి చెందిన యువకులు రూ.50వేల విలువైన అరటి పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, టిఫిన్లు అందజేశారు. -
చెట్టు కూలి మీదపడి మరిపెడ వాసి మృతి
● చందుపట్ల సమీపంలో ఘటనమరిపెడ రూరల్: మోంథా తుపాన్ బీభత్సానికి చెట్టు కూలి మీదపడడంతో మరిపెడ వాసి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతన మండలం చందుపట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన కోట లక్ష్మీనారాయణ (50) 30 ఏళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం మరిపెడ మండలం తానంచర్లకు వలస వచ్చి మెడికల్ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం బైక్పై మద్దిరాలకు వెళ్లి తిరిగి తానంచర్లకు వస్తున్నాడు. మార్గ మధ్యలో చందుపట్ల సమీపంలో భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు చెట్టు కూలి బైక్ పై పడడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. -
తుపాన్ ఎఫెక్ట్.. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, నిలిపివేత
కాజీపేట రూరల్ : మోంథా తుపాన్ ఎఫెక్ట్ బుధవారం కాజీపేట, వరంగల్ మీదుగా న్యూఢిల్లీ, విజయవాడ, సికింద్రాబాద్ రూట్లో ప్రయాణించే పలు రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పైకి వర్షం నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తలెత్తాయని అధికారులు తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దుతో క్రమబద్ధీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ–విజయవాడ మధ్య వయా వరంగల్ మీదుగా వెళ్లే టాటానగర్, షాలిమార్, కోణార్క్, షిర్టీ, కృష్ణా, గోల్కొండతోపాటు పలు రైళ్లను వయా కాజీపేట జంక్షన్ మీదుగా పగిడిపల్లి, నడికుడ మీదుగా దారి మళ్లించారు. షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను మహబూబాబాద్ నుంచి వెనక్కి తీసుకొచ్చి వయా కాజీపేట మీదుగా దారి మళ్లించారు. అదేవిధంగా షిర్డీ–కాకినాడ ఎక్స్ప్రెస్ను వరంగల్కు రాకుండా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ను వయా నడికుడ మీదుగా తిరుపతి దారి మళ్లించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, రైల్వే ట్రాక్, యార్డులోకి వర్షం నీరు చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందనే సమాచారం మేరకు సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణన్ ప్రత్యేక రైలులో డోర్నకల్ వెళ్లారు. రద్దయిన రైళ్లు.. సికింద్రాబాద్– విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ను, సికింద్రాబాద్ –కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధవారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి రైళ్ల రద్దు.. విజయవాడ–సికింద్రాబాద్ (12713) శాతవాహన ఎక్స్ప్రెస్ను గురువారం రద్దు చేసినట్లు రైల్వే అ ధి కారులు తెలిపారు. కాజీపేట–విజయవాడ పుష్ పు ల్, శాతవాహన, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాజీపేటలో హెల్ప్డెస్క్.. కాజీపేట జంక్షన్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా టీటీఈలు, కమర్షియల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు రైళ్ల సమాచారం అందించారు. 0870–2576430 నంబర్లో రైళ్ల సమాచారం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. -
జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి అన్నారు. బుధవారం మేడారంలో విద్యుత్ పనులపై ములుగు, ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని ఇంజనీర్లు, అసిస్టెంట్లు ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. జాతరలో విద్యుత్ ఏర్పాట్ల కోసం కావాల్సిన మెన్, మెటీరియల్ను సమకూర్చుకొని నాణ్యమైన విద్యుత్ అందించి సంస్థకు పేరు తీసుకురావాలన్నారు. మహాజాతర పనులను పస్రా సబ్ స్టేషన్ నుంచి మొదలు.. నార్లాపూర్, కొత్తూరు, తాడ్వాయి, మేడారం న్యూ సబ్ స్టేషన్ మెయిన్ అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్న వాగు పరిసరాలను పరిశీలించి అవసరమైన విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్ ) మధుసూదన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్రావు, జీసీఎం రాజు చౌహాన్, ఎస్ఈ మల్చూర్నాయక్, డీఈ పులుసం నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
డోర్నకల్ రైల్వే స్టేషన్..జలదిగ్బంధం
ఇబ్బందులు పడిన ప్రయాణికులు.. వరద ప్రభావంతో గోల్కొండ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్లకు ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గార్ల మండలానికి చెందిన ఓ గర్భిణి డోర్నకల్ స్టేషన్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుండగా డోర్నకల్ సీఐ చంద్రమౌళి చొరవతో ప్రైవేట్ వాహనంలో ఖమ్మం తరలించారు. డోర్నకల్: డోర్నకల్ రైల్వే రైల్వే స్టేషన్ జల దిగ్బంధమైంది. బుధవారం తెల్లవారుజామున చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షంగా మారడంతో వరదతో డోర్నకల్ రైల్వే స్టేషన్ జలదిగ్బంధమైంది. కాకతీయ, సింగరేణి, శాతవాహన్ ఎక్స్ప్రెస్ రైళళ్లు వెళ్లిపోయిన తర్వాత ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరంగల్ వైపునకు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే వరదనీరు ట్రాక్ మీదుగా ప్రవహిస్తుండడతో అధికారులు రైలును నిలిపారు. నిమిషాల్లోనే వరదనీరు భారీగా ప్రవహించడంతో ట్రాక్ మునిగింది. గార్ల వైపు నుంచి వస్తున్న గూడ్స్ను హోం సిగ్నల్ వద్ద నిలిపారు. మధ్యాహ్నం వరకు వరద పెరగగా రైళ్ల రాకపోకలను నిలిపారు. రైల్వే స్టేషన్లోకి వరద భారీగా రావడంతో ట్రాక్లు నీట మునగగా, స్టేషన్ యార్డు చెరువును తలపించింది. కుంటల ఆక్రమణే కారణమా? డోర్నకల్ రైల్వే స్టేషన్కు ఎగువ ప్రాంతంలో ఉన్న కొర్లకుంటతో పాటు అంబేడ్కర్నగర్ సమీపంలోని కుంటల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో గార్ల మండలంలోని పలు కుంటల నుంచి వచ్చే వరద డోర్నకల్ రైల్వే స్టేషన్ను ముంచెత్తింది. డోర్నకల్ పరిధిలోని కుంటలను ఆక్రమించి వెంచర్లను ఏర్పాటు చేయడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సౌత్జోన్ కబడ్డీ టోర్నమెంట్కు కేయూ ఉమెన్స్ జట్టు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఈనెల 29 నుంచి నుంచి నవంబర్ 2వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో సీహెచ్.వైష్ణవి (తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల, వరంగల్), డి.సునీత (టీజీటీడబ్ల్యూఆర్డీసీ, మహబూబాబాద్), యు.సంజన (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట), బి.భార్గవి (ఎంజేపీటీ బీసీ, ఖమ్మం), ఎస్.అక్షర (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శిరీష (వీఐపీఎస్, బొల్లికుంట), జె.జ్యోతి (ఎంజేపీటీడబ్ల్యూ ఆర్డీసీ, స్టేషన్ఘన్పూర్), బి.విద్యశ్రీ (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ, కొత్తగూడెం), జి.కావ్యశ్రీ (టీజీడబ్లూ ఆర్డీసీ, ఖమ్మం), బి.దివ్య (ఎల్బీ కళాశాల, వరంగల్), పి.శారద (యూసీపీఈ, ఖమ్మం), వై.అనిత (వీసీపీఈ, బొల్లికుంట), జి. హారిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఎస్.అఖిల (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ , దమ్మన్నపేట) ఉన్నారు. జట్టుకు కోచ్గా వరంగల్ కిట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మేనేజర్గా వాగ్డేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.అజయ్ వ్యవహరిస్తున్నారని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. -
మాటలే.. చేతల్లేవు
హన్మకొండ: సీఎం రేవంత్ మాటల్లో ఉన్న వాగ్ధాటి చేతల్లో లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమ్మించడం రేవంత్ నైజమని, వంచించడం, ద్రోహం చేయడం ఆయన రక్తంలో ఉందని తూర్పారబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ద్రోహం చేసిన చరిత్ర దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని విమర్శించారు. దేవునివి కానప్పడు ఎందుకు హామీలు గుప్పించావని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీయాలని సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ పరువు తీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రిలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ నాయకులు దాస్యం విజయ్భాస్కర్, చింతం సదానందం, పులి రజినీకాంత్, శోభన్, సోదా కిరణ్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న, బొంగు అశోక్ యాదవ్, బండి రజినీ కుమార్, రాజు, చాగంటి రమేశ్, వీరు పాల్గొన్నారు. వంచించడం సీఎం రేవంత్ రక్తంలో ఉంది శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
జాతర పనుల్లో నాణ్యత పాటించాలి
● సీఎం ముఖ్యకార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సీఎం ముఖ్యకార్యదర్శి కె.ఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. బుధవారం మేడారంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్నాయక్తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదేవతల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జాతర సమయానికి ముందుగా పనులన్నీ పూర్తి చేయాలని, ఈ పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ అభివృద్ధి పనులను నమూనా మ్యాప్ ద్వారా అధికారులు వివరించారు. అంతకు ముందు శ్రీనివాసరాజు.. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పూజారులు అమ్మవార్ల శేష వస్త్రం కండువాతో శ్రీనివాసరాజును సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు సిద్ధబో యిన మునీందర్, కాక సారయ్య, కొక్కెర కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవారికే లక్కు..
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో మద్యం షాపులను దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు సమర్పించగా.. కొత్తవారినే లక్కు వరించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై లక్కీడ్రా తీసి ఎంపికై న వారి పేర్లు ప్రకటించారు. కాగా, 2025–2027వరకు నూతనంగా వైన్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. ఈమేరకు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. వీడియో చిత్రీకరణ మధ్య.. వీడియో చిత్రీకరిస్తూ డ్రా తీసి పేర్లు పిలవడంతో పాటు వచ్చిన నంబర్ను దరఖాస్తుదారులకు చూపి ంచారు. దుకాణాలు దక్కించుకున్న వారు వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరోవంతు చెల్లించి లైసెన్స్లు పొందారు. జిల్లాలో 61 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా.. దరఖాస్తుదారులతో ఏబీ గార్డెన్స్ ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపించింది. లాటరీ తీసే సమయంలో ప్రతీ ఒక్కరు టెన్షన్ పడుతూ కనిపించారు. ఏమవుతుందో ఏమో అన్న ఉత్కంఠ అందరిలో కనిపించింది. కాగా డ్రా ప్రక్రియ రెండు గంటల్లోనే ముగియడం విశేషం. ఒక పక్క సంతోషం.. మరోపక్క నిరాశ రెండేళ్ల పాటు వైన్షాపుల నిర్వహణకు లైసెన్స్ పొందినవారు సంతోషంలో మునిగిపోగా... అదృష్టం వరించనివారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. కాగా డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ అధికారి బి.కిరణ్ ఆధ్వరర్యంలో డ్రా నిర్వహించగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, వరంగల్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సీఐలు చిరంజీవి, భిక్షపతి, అశోక్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగేశ్వర్ రావు, ఎస్సైలు రవికుమార్, అశోక్ కుమార్, మౌనిక, రాజేశ్వరి, రవళిరెడ్డి, శంకర్, డీటీఎఫ్ ఎస్సై కిరీటి, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఒకే దరఖాస్తుతో.. జిల్లా పరిధిలో మద్యం షాపుల ఏర్పాటు కోసం కొందరు మొదటిసారిగా దరఖాస్తు చేశారు. కాగా, మానుకోట మండలం వేమునూరు గ్రామానికి చెందిన నలమాస రాంబాబు గెజిట్ సీరియల్ నంబర్–2కు, జిల్లా కేంద్రానికి చెందిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గెజిట్ సీరియల్ నంబర్–4కు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు సమర్పించగా వారిద్దరిని అదృష్టం వరించింది. అదే విధంగా జిల్లా కేంద్రానికి చెందిన గోట్ల వెంకటేశ్వర్లుయాదవ్ గెజిట్ సీరియల్ నంబర్–31కి, ఆయన కుమారుడు రాకేశ్ యాదవ్ గెజిట్ సీరియల్ నంబర్–12కు దరఖాస్తు చేయగా తండ్రీకొడుకులను అదృష్టం వరించింది. ఇకపోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఎన్.శ్రీవాణి గెజిట్ సీరియల్ నంబర్లు 15, 17, 21కు దరఖాస్తు చేయగా ఆమెకు మూడు షాపులు దక్కాయి. కొత్తవారే అధికం... పాత వ్యాపారుల్లో కొంతమందికే షాపులు దక్కగా ఈ ఏడాది మద్యం వ్యాపారంతో సంబంధంలేని కొత్త వ్యక్తులు తెరమీదకు వచ్చారు. చాలా చోట్ల గ్రూపులుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. వీరికి దీటుగా పాత వ్యాపారులు సైతం వందల సంఖ్యలో దరఖాస్తులు చేసినప్పటికీ లాటరీలో వారికి సింగిల్ డిజిట్ దుకాణాలకు మించి రాలేదు. ప్రయత్నాలు ముమ్మరం.. మద్యం వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కొంతమంది వ్యాపారులకు షాపులు రాలేదు. కాగా, కొత్తగా షాపులు దక్కించుకున్న వారికి భారీగా ఆఫర్లు ఇచ్చి షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొత్తగా షాపులు దక్కించుకున్న వారితో బేరసారాలు నడుపుతున్నట్లు సమాచారం. లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు పాత వ్యాపారుల్లో కొంతమందికే దక్కిన వైన్షాపులు ఒక్క దరఖాస్తుతోనే వరించిన అదృష్టం తండ్రీకొడుకులకు రెండు షాపులు రెండు గంటల్లోనే ముగిసిన డ్రా ప్రక్రియ భారీ బందోబస్తు.. మద్యం షాపుల డ్రా సందర్భంగా దరఖాస్తుదారులు, వారి బంధువులు, స్నేహితులతో ఏబీ ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వారి వాహనాలతో చుట్టూ పక్కల ప్రాంతాలు నిండిపోయాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివ, సూరయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. కాగా, లక్కీ డ్రా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
దంతాలపల్లి : అప్పుల బాధతో ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మండలకేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్లకు చెందిన గడ్డం ఉప్పలయ్య(48) బతుకుదెరువు నిమిత్తం సుమారు పదేళ్ల క్రితం దంతాలపల్లికి వలస వచ్చాడు. మండల కేంద్రంలో ఎలక్ట్రికల్, శానిటరీ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు సుమారు రూ. 75 లక్షల వరకు ఫైనాన్స్లో అప్పు చేశాడు. అయితే కొంతకాలంగా షాపు సరిగా నడవకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కూతురు అంబిక, కుమారుడు శ్రీరామ్ ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. నెల్లికుదురు : పని చేయాలని తల్లి మందలించిందనే కారణంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు నంద్య తండాలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ పవన్ కల్యాణ్ (21) గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేసేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం తన తండ్రి మృతిచెందినప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. కొద్దిరోజులుగా పనులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో పనులకు వెళ్లాలని తల్లి కమిలి మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన పవన్కల్యాణ్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి కమిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. విషజ్వరంతో వివాహిత మృతి బయ్యారం: విషజ్వరంతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండలంలోని జగ్గుతండాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన చల్ల రమాదేవి(30)కి వారం రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందింది. మృతురాలికి భర్త మహేశ్, కుమారుడు ఉన్నారు.గుండెపోటుతో భక్తుడు.. ● సోమేశ్వరాలయంలో ఘటన పాలకుర్తి టౌన్/పెద్దవంగర: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆలయ అధికారులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి సోమారెడ్డి(72) కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్వరాలయానికి వచ్చాడు. ఆలయ గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేశాడు. అనంతరం పక్కన ఉన్న లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మహా మండపంలోకి రాగానే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబీలు, భక్తులు, ఆలయ అధికారులు, ఎస్సై వపన్కుమార్.. సోమారెడ్డికి సీపీఆర్ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సోమారెడ్డికి గతంలో గుండె ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగిందని కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, సోమారెడ్డి రైతుబంధు పెద్దవంగర మండల కన్వీనర్గా పని చేశాడు. -
జాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న జాతర అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై ఎస్పీ శబరీశ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. జాతర పనుల పురోగతిపై ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతోందని, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్కల్లా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనులతోపాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి, సీఐ దయాకర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరంగల్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని దృఢంగా నమ్మిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాల పంపిణీ, ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులు మార్కెట్కు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలన్నారు. పత్తిని అమ్ముకునే రైతులు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని ఆయా మిల్లుల్లో కేటాయించిన తేదీల్లో విక్రయించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్ను సంప్రదించాలన్నారు. అనంతరం మార్కెట్లోని అపరాల యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సీసీఐ జీఎం మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీ నీరజ, కాటన్ కొనుగోలు అధికారి కృష్ణారెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, గ్రేడ్ –2 కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాలి..ఖిలా వరంగల్ : వరంగల్ శివనగర్లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన మెట్ల బావిని మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ, లైటింగ్, అభివృద్ధి పనులు చేపట్టారు. సోమవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మెట్ల బావిని పునఃప్రారంభించి మాట్లాడారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధిని మంత్రి సురేఖ బావిలోకి దిగి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, గోపాల నవీన్రాజు, శామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి
● మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మహబూబాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ వ్యాపారులను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడొద్దన్నారు. జూట్ బ్యాగులు వినియోగించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, వ్యాపారులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న బైక్..
● డిగ్రీ విద్యార్థి దుర్మరణం ● మరో యువకుడి పరిస్థితి విషమం ● నెల్లుట్ల బ్రిడ్జి వద్ద ఘటన లింగాలఘణపురం: బైక్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన సోమవారం జనగామ – సూర్యాపేట రోడ్డులోని నెల్లుట్ల బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన రాగి సంజయ్ (19), లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన బూడిద ప్రసాద్ స్నేహితులు. ఇందులో సంజయ్ జనగామలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు బైక్పై నవాబుపేట నుంచి జనగామ వైపునకు వస్తూ నెల్లుట్ల బిడ్రి వద్ద లారీని ఎదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో సంజయ్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రసాద్ను 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతీరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. ఈ బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ క్రీడాంశాలలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు యోగా, కరాటే, టగ్ఆఫ్వార్, తంగ్తా, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నిస్, మాల్కమ్, గట్కా క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ గోపాల్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కాకా మాధవరావు, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
జంపన్న వాగు బావుల్లో పూడికతీత ప్రారంభం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జంపన్నవాగులోని ఇన్ఫిల్టరేషన్ బావుల్లో ఇరిగేషన్శాఖ అధికారులు సోమవారం పూడితీత పనులు ప్రారంభించారు. జాతర సమయంలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాగులోని బావుల నుంచి నీటి సరఫరా చేస్తారు. ఏటా వర్షాలకు జంపన్నవాగు వరద ఉధృతికి బావులు ఇసుక, చెత్తతో నిండిపోతుంటాయి. దీంతో ప్రతీ మహాజాతరలో కార్మికులతో బావుల్లో పూడిక తీయిస్తుంటారు. ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచన మేరకు డ్రెడ్జింగ్ మోటారు సాయంతో బావుల్లో పూడిక తీత పనులకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డ్రైడ్జింగ్ మోటార్లు బావుల్లో ఏర్పాటు చేసి ఈఈ నారాయణ, డీఈ సదయ్య, కాంట్రాక్టర్ సురేందర్రెడ్డి ట్రయల్ రన్ చేశారు. ప్రయోగం విజయవంతమైతే మోటార్లతోనే పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. వారి వెంట ఏఈలు ప్రశాంత్, రాజా ఉన్నారు. డ్రెడ్జింగ్ మోటార్లతో ట్రయల్ రన్ -
కౌమార బాలికలకు సాధికారత కల్పించాలి
కాజీపేట రూరల్ : కౌమార బాలికలకు సమాజంలో సాధికారత కల్పించి ప్రోత్సాహించాలని సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని దేవి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస కేంద్రంలో ఏడు జిల్లాలకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కౌమర బాలికల సంఘాల తయారీలో భాగంగా సోమవారం స్నేహ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాత్యాయని దేవి మాట్లాడుతూ.. బాలికలకు విద్య, మార్గదర్శకత్వం, ఉపాధిని కొనసాగించేలా చేయాలన్నారు. యూనిసెఫ్ విభాగం నుంచి మురళి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, సెర్ప్ హెచ్డీ విభాగం నుంచి లింగయ్య గౌడ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు ఆర్డీఓలు సరిత, 7జిల్లాల డీపీఎంలు, ఏపీఎంలు మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అధిక కౌమార జనాభా ఉన్న దేశమని, వారి అవసరాలు, ఆలోచనలు, ప్రస్తుత సామాజిక మాధ్యమం ఇంటర్నెట్, సమాచార ఏఐ యుగం, డ్రగ్స్ మద్యం, వ్యసనాలు, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ తదితర విషయాలపై పనిచేసి వారి సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, కొమురంభీమ్, ఆసిఫాబాద్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనిదేవి -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో గార్డెన్, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రెయినేజీలను ఏర్పా టు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం సుబ్రహ్మణ్యంతోపాటు హంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణచైతన్య వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, జోగులాంబ దేవాలయం కన్జర్వేటర్ అసిస్టెంట్ మల్లేశం, వరంగల్ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ అజిత్ పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వే యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యే క పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణ వ్ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8గంటలకు మహాహారతి శోభాయమానంగా నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. కోట సందర్శన..ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం కేంద్ర పురావస్తుశాఖ మాన్యుమెంట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, అధికారులు సందర్శించారు. భవిష్యత్తుల చేపట్టనున్న నిర్మాణాల శైలిని డైరెక్టర్కు అధికారులు వివరించారు. ఆయనవెంట టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం ఆలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు -
శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారం
హన్మకొండ కల్చరల్ : కవి, న్యాయవాది డాక్టర్ నమిలికొండ బాలకిషన్రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నబారా పురస్కారం–2025ను కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అందుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీరాజరాజనరేంద్రంద్ర భాషానిలయంలో కవి బిల్ల మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నబారా సొసైటీ అధ్యక్షుడు నమిలికొండ పాంచాలరాయ్ అతిథులతో కలిసి శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, గన్నమరాజు గిరిజమనోహర బాబు, వీఆర్ విద్యార్థి చంద్, వల్లంపట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మానుకోట రూపురేఖలు మారుతాయి
● సీఎం ఆశీస్సులతో రూ 59.62 కోట్లు ● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్మహబూబాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఆశీస్సులతో మానుకోట మున్సిపాలిటీకి రూ 59.62 కోట్లు విడుదల అయ్యాయని, ఆ నిధులతో పట్టణ రూపురేఖ లు మారుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. నిధులు విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే, నాయకులు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. విడుదలైన నిధులతో ఇండోర్ స్టేడియం పార్క్లో రోడ్లు, డ్రైయినేజీలు లాంటి పనులు చేపడుతామన్నారు. ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. మానుకోటలో నీటి సమస్య పరిష్కారానికి రూ.20 కోట్లతో పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఘనపురపు అంజయ్య, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు,, ఖలీల్, ఎడ్ల రమేశ్, లక్ష్మీనారాయణ, రామగోని రాజు, గిరిధర్గుప్తా, నాళ్ల నర్సింహారావు, పోతురాజు, దేవరం ప్రకాశ్రెడ్డి, బి.రాజు, నీరుటి సురేశ్, ఆకుల శ్రీను, ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పారా అథ్లెట్ దీప్తికి గౌరవం..
● హైదరాబాద్లోని ఓ ప్లైఓవర్ పిల్లర్పై ఆమె రన్నింగ్ చిత్రం పర్వతగిరి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లైఓవర్ పిల్లర్పై సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి గౌరవార్థం ఆమె రన్నింగ్ చిత్రం వేశారు. దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్లో కాంస్య పతకంతోపాటు అర్జున అవార్డు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 400మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. దీంతో దీప్తి ప్రతిభకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మామునూరు పీఎస్లో ఇద్దరు సస్పెన్షన్వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలోని మామునూ రు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పర్యవేక్షణ అధికారులు మౌనం వహించ డం, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలీస్ స్టేషన్ పాలన అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో మామునూరు ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కు పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేసి ఒక్కరోజు కాకముందే అదే పీఎస్లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్పై సీపీ సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో చర్చనీయాంశమైంది. పది రోజుల క్రితం వాహనాల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను పీఎస్ లో విచారిస్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు హెడ్ కాని స్టేబుల్ ఎండీ యూసుఫ్, కానిస్టేబుల్ శ్రీనివాస్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిందితులు పరారైనట్లు నిర్ధారించి సీపీకి నివేదికలు ఇచ్చా రు. దీంతో ఆయన ఆ ఇద్దరి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పీఎస్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే మరికొంత మంది అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉంది. 29 వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ,బీకాం, బీబీఏ, బీఎస్సీ బీ ఒకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్) మొదటి, మూడు , ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్లో నిర్వహించనున్నారు. ఈమేరకు రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు ఇస్తూ కేయూ పరీక్షలనియంత్రణాధికారి సోమవారం ఫీజు రీ–నోటిఫికేషన్ జారీచేశారు. ఆయా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుములేకుండా ఈనెల27వతేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. -
సమాజ సేవ.. ఎన్ఎస్ఎస్ తోవ!
తొర్రూరు: సమాజ సేవలో భాగస్వాములవుతూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలను జాగృతం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఓటు ప్రాధాన్యం, మద్యపాన నిర్మూలన వంటి అంశాల్లో గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించి విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తున్నారు. తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, కొత్తగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలల ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు క్యాంపులో పాల్గొని పల్లె వాసుల్లో స్పూర్తిని నింపారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ బాలికల గురుకులం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో తొర్రూరులో క్యాంపు కొనసాగుతోంది. కదులుతూ.. కదిలిస్తూ.. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ కేయూ కో ఆర్డినేటర్ ఈసం నారాయణ, జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడు రోజుల శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ● బహిరంగ మలమూత్రవిసర్జన నిర్మూలించి మరుగుదొడ్లు నిర్మించుకునేలా స్థానికులకు అవగాహన కల్పించారు. ● గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రపరిచి పరిసరాల శుభ్రతపై స్థానికులను చైతన్యపరిచారు. ● వయోజన విద్య, అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేశారు. ● పర్యావరణ విశిష్టతను తెలియజేస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతున్నారు. ● గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ● వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేయడంతో పాటు శ్రామికుల శ్రమ శక్తి విలువ ప్రాధాన్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ● విద్య ప్రాముఖ్యం. మద్యపాన నిర్మూలన, అనర్థాలు, పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించారు. ● ప్రభుత్వ పథకాల ప్రయోజనంపై సమావేశాలు నిర్వహించారు. ● డ్రైవర్స్ డే సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ● బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. ● డ్రగ్స్ వినియోగంతో తలెత్తే పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. శిబిరాలతో విద్యార్థుల్లో ఉత్సాహం గ్రామాల్లో ఆయా అంశాలపై అవగాహన జిల్లాలో ఆదర్శంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నా టి వరుణ్రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏజెన్సీలు, బ్రేక్ డౌన్ టీంలు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఔత్సాహికులు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు తీసుకోవా లన్నారు. సమావేశంలో డైరెక్టర్లు మోహన్రా వు, మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, డీఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
‘ఇందిరమ్మ’ బిల్లు రాకపాయె!
సాక్షి, మహబూబాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే పలువురికి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త ఇల్లు మంజూరు కావడంతో.. ఉన్న ఇళ్లు కూల్చివేశామని, ప్రస్తుతం బిల్లులు రాకపోవడంతో తిప్పలు పడుతున్నామని, అధికారులు స్పందించి చెల్లించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. సర్వేలో తప్పులు.. లబ్ధిదారుల తిప్పలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ద్వారా పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే నిర్వహించారు. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి శిథిలావస్థలో ఇల్లు ఉన్నవారు, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు, ఇల్లు, స్థలం రెండూ లేని వారుగా మూడు విభాగాలుగా గుర్తించారు. అయితే అందులో సర్వేకోసం వచ్చిన వారు తప్పులుగా నమోదు చేశారు. ఇంటి పేరు, ఆధార్ నంబర్, పేర్లు, భర్త, తండ్రి పేర్లు తప్పుగా నమోదు చేశారు. ఇలాంటి తప్పులను చూడకుండా, వాటిని సరిచేయకుండానే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఆర్భాటంగా నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇల్లు నిర్మాణం మొదలైన తర్వాత ఫొటో క్యాప్చర్ కాకపోవడం, ఇతర తప్పులతో బిల్లులు రావడం లేదు. లబ్ధిదారుల ప్రదక్షిణలు.. అధికారులు చెప్పినట్లు తూచ తప్పకుండా ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు బిల్లులు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ నంబర్, ఇంటిపేరు, తండ్రి, భర్త పేర్లు ఇలా తప్పులు ఉంటే.. ముందుగా ఎంపీడీఓ లాగిన్లో సరిచేస్తారని అక్కడికి పంపించారు. అక్కడ కాకపోతే కలెక్టర్ కార్యాలయంలోని హౌసింగ్ అధికారుల వద్దకు రావడం.. అక్కడ కూడా సరి చేయకపోవడంతో ఎక్కడికి వెళ్తే తమ సమస్యకు పరిష్కారం అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తమతో పాటు ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి బిల్లులు వచ్చాయని, తమకెందుకు బిల్లులు రావడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఈమేరకు ఒక అధికారి కలెక్టర్ లాగిన్లో ఆగిందని, మరొకరు ఎండీ వద్ద ఆగిందని చెబుతూ తమ చేతిలో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో తప్పులతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సతమతం ఇళ్లు నిర్మిస్తున్నా.. అందని బిల్లులు తప్పులు సవరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు పెండింగ్లో 1,300 ఇళ్ల బిల్లులు ఇందిరమ్మ ఇళ్లకోసం ముందుగా చేపట్టిన పైలెట్ పంచాయతీల్లో 602, ఐటీడీఏ ద్వారా 11,00, రెండో విడత 8,949 ఇళ్లు.. మొత్తం 10,651 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో 9,931 ఇళ్లకు కలెక్టర్ పునఃపరిశీలించి మంజూరీ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 8,047 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 6,670 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 2,581 ఇళ్లు గోడల వరకు, 561 ఇళ్ల స్లాబ్లు వేశారు. వీరిలో వారి వారి నిర్మాణం స్థాయిని బట్టి మొత్తం 9,812 బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు 8,512 బిల్లులు చెల్లించగా.. 1,300 మంది ఇళ్ల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
‘అన్వేషిక’లో పరమేశ్వర్..
కాళోజీ సెంటర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రయోగపూర్వకంగా శాసీ్త్రయ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీఈఆర్టీ ఆరు నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు ల్యాబ్ మాన్యువల్ అయిన అన్వేషిక ప్రయోగదర్శిని అనే పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో ప్రయోగ అంశాలు, కృత్యాలను పొందుపరిచారు. వీటిని ఎలా చేయాలి? కావాల్సిన పరికరాలు ఏమిటి? అందులో ఉన్న శాసీ్త్రయ సూత్రం ఏమిటి? ఫలితాలు, నిర్ధారణ వంటి అంశాలను పొందుపరుస్తూ విపులంగా ప్రతీ కృత్యానికి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ప్రయోగదర్శిని రూపకల్పనలో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర ఉపాధ్యాయులు (విషయ నిపుణులు) పాల్గొన్నారు. ఇందులో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం జెడ్పీ హైస్కూల్ జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు చిప్ప పరమేశ్వర్ 8వ తరగతి ప్రయోగదర్శినిని రూపొందించారు. కాగా, ఇటీవల పాఠశాలలకు ఈ ప్రయోగదర్శిని పుస్తకాలను అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రయోగపాఠాలు అమలు చేసేలా నిపుణులతో రూపొందించిన ప్రయోగదర్శిని పుస్తకంలో ఉన్న విశేషాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు సంవత్సర నుంచి తెలుసుకుంటున్నారు. ఇవి రూపొందించిన విషయ నిపుణుల బృందంలో వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పరమేశ్వర్ ఉండడం జిల్లా విద్యాశాఖకు గర్వకారణం. పరమేశ్వర్కు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి వరంగల్విద్యార్థులు, టీచర్లకు ఉపయోగపడేలా ఉభయతారకంగా ఈ అన్వేషిక ప్రయోగదర్శిని ఉంటుంది. ఈ పుస్తకం రూపకల్పనలో పాల్గొనడం వృత్తి జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది. 8వ తరగతికి సంబంధించిన కృత్యాలు, ప్రయోగాలకు సంబంధించిన ప్రయోగ పద్ధతి, పరికరాలు, శాసీ్త్రయ సూత్రం, ఫలితాలు, తదితర అంశాలు రాశా. 18 సంవత్సరాల నా బోధన అనుభవంలో తరగతి గదిలో ప్రయోగాల్లో నేను చేసిన కృత్యాలు, ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ల్యాబ్ మాన్యువల్ను రచించా. పుస్తక రచనలో పాల్గొనే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. – చిప్ప పరమేశ్వర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు● విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉభయతారకంగా అన్వేషిక బుక్ పుస్తక రూపకల్పనలో జిల్లా టీచర్ పాల్గొనడం గర్వకారణం : డీఈఓ -
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మహబూబాబాద్: తుపాన్ ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండానే వెంటనే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం చేసే విధంగా లేకపోతే వివరాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 104 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. తూకంలో మోసాలు చేస్తే చర్యలు తీసుకుంటాం గూడూరు: వ్యాపారులు, దళారులు తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల జిల్లా అధికారి శ్రీలత హెచ్చరించారు. మండల కేంద్రంలోని శ్రీరామ వేబ్రిడ్జి తూకంలో తక్కువగా చూపుతుందనే పలువురు వ్యాపారులు, రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వే బ్రిడ్జిపై లారీతో తూకం పరిశీలించగా, 30 టన్నులకు సుమారు 6 క్వింటాళ్ల 50 కిలోలు తక్కువగా చూపుతుందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ వే బ్రిడ్జి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, సరిచూసుకోవాలని అన్నారు. వే బ్రిడ్జిలే కాకుండా కిరాణా, ఇతర షాపుల వద్ద తూకాల్లో తేడాలను గుర్తించి వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎంసీ కార్యదర్శిగా సుజన్బాబు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) గా వి.సుజన్బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శిగా సుజన్ బాబు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయనను మార్కెటింగ్శాఖ ఉన్నత అధికారులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీబీని ముందస్తుగా గుర్తించాలి నెహ్రూ సెంటర్: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నయం చేయవచ్చని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. టీబీ నిర్ధారణ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మానుకోటను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయ్కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్ కేడీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడాపోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల పురుషుల రెండో దఫా క్రీడాపోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి రిజిస్ట్రార్ వి. రామచంద్రం, స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లోనూ రాణించాలన్నారు. వివిధ క్రీడల్లో విజేతలు వీరే.. ఐదు విభాగాల్లో క్రీడాపోటీలు జరిగాయి. ఇందులో ఖోఖోలో కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ మొదటి బహుమతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ద్వితీయ బహుమతి, బాల్బ్యాడ్మింటన్లో బొల్లికుంట వీసీపీఈ మొదటి బహుమతి, మణుగూరులోని టీజీటీఆర్డీసీ రెండో బహుమతి, హ్యాండ్బాల్లో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ ద్వితీయ బహుమతి, సాఫ్ట్బాల్లో హనుమకొండలోని యూ ఏఎస్సీ కాలేజీ ప్రథమ బహుమతి, మంచిర్యాలలోని ఎంఐఎంఎస్ కళాశాల రెండో బహుమతి సాధించింది. క్రాస్కంట్రీ పోటీల్లో హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకాలేజీ ప్రథమ బహుమతి, ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కాలేజీ ద్వితీ య బహుమతి సాధించింది. ఓవరాల్ చాంపియన్గా హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. కార్యక్రమంలోయూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమారస్వామి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న, సెక్రటరీ సునీల్రెడ్డి, డాక్టర్ ఆశీర్వాదం, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ముగిసిన అంతర్ కళాశాలల క్రీడాపోటీలు బహుమతులు ప్రదానం చేసిన రిజిస్ట్రార్ -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
బడిలో బురద!
ఆ పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన సెంటర్ నుంచి పాఠశాల గేటు వరకు ఉన్న రోడ్డు వెంట ఉన్న బురదలో నడవాల్సిందే.. ఇక పాఠశాల గేటు వద్ద నుంచి తరగతి గదుల వరకూ బురదే.. ప్రాంగణం మొత్తం ఏపుగా పెరిగిన గడ్డి.. ఇదీ గూడూరు మండల కేంద్రంలో 102 మంది బాలికలతో కొనసాగుతోన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా దారంతా బురదమయంగా మారుతుండడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను పరిష్కరించేవారే లేరా.. అని విద్యార్థినులు ఆవేదనగా అడుగుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తీర్చాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. – గూడూరు -
వేయిస్తంభాల గుడిలో నాగుల చవితి పూజలు
హన్మకొండ కల్చరల్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శనివారం వేయిస్తంభాల దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత పూజలు, మూలగణపతికి ఆరాధన, రుద్రేశ్వరుడికి మహాన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని నాగేంద్రస్వామి శిలలు, పుట్ట కు నీళ్లు, నవరసాలు, పాలతో అభిషేకం చేశారు. పుట్టలో పాలు, పండ్లు, చిమ్మిరి, చలిమిడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజల్లో హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు, హిమబిందు దంపతులు, రమేశ్కుమార్, సూర్యప్రభ దంపతులు పాల్గొని నాగేంద్రస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ నాగుపాములను పూజించడం అతిప్రాచీన సంస్కృతని, సంతానం, సౌభాగ్యానికి చిహ్నమన్నారు. -
గొర్రెల మందపై చిరుత దాడి
● రెండు జీవాలు మృత్యువాత కాటారం: మహాముత్తారం మండలంలో చిరుత పులి బీభత్సం సృష్టించింది. శని వారం తెల్లవారుజామున గొర్రెల మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. బాధితుడు, అట వీశాఖ అధికారు కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం పర్లపల్లి సమీపంలో మేడిపల్లి రామయ్య అనే వ్యక్తి తన గొర్రెల మందను ఉంచి ఇంటికి వెళ్లాడు. గమనించిన చిరుతపులి మందపై దాడికి పాల్పడి రెండు జీవాలను చంపింది. ఒక గొర్రె రక్తం తాగిన చిరుత.. మరో జీవాన్ని చెట్టుపైకి తీసుకెళ్లింది. ఉదయం మంద వద్దకు వచ్చిన రామయ్య.. తన గొర్రెలపై ఏదో జంతువు దాడి చేసినట్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎఫ్ఆర్ఓ స్వాతి, సిబ్బంది పాదముద్రలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దాడికి పాల్పడింది చిరుతపులి అని నిర్ధారణకు వచ్చారు. వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కాగా, చిరుతపులి దాడితో అటవీ గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమించిన యువతి దక్కదని యువకుడి ఆత్మహత్య నర్సంపేట రూరల్: ప్రేమించిన యువతి దక్కదని మనస్తాపం తో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం చెన్నారావుపేట మండలం ధర్మతండాలో వెలుగులోకి వచ్చింది. తండావాసులు, పోలీసు కథనం ప్రకారం.. తండాకు చెందిన బోడ మోహన్ కుమారుడు మహేశ్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ తండాకు చెందిన ఓ యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన మహేశ్ సదరు యువతి తనకు దక్కదని మదనపడ్డాడు. ప్రేమ విషయం తెలియడంతో తల్లిదండ్రులు కూడా ఆ యువకుడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్.. ఈనెల 23న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబీకులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. -
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన
హన్మకొండ: ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీజీ ఎన్పీడీసీఎల్ దృష్టి సారించింది. ఈ మేరకు అధికారులు అనువైన స్థలాల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 80కి తగ్గకుండా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా స్థల పరిశీలన చేస్తున్నారు. శనివారం టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీఈ పి.మల్లికార్జున్, ఏఈ మధులిక, లైన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రాజు, లైన్మెన్ సతీశ్ సర్వే చేశారు. ఇప్పటి వరకు 46 స్థలాలను గుర్తించారు. ఇందులో ప్రభుత్వ స్థలాలు 19, పబ్లిక్ రంగ సంస్థలు 6, ప్రైవేట్ స్థలాలు 21 గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్హాన్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు రాయితీ అందిస్తుంది. హనుమకొండ జిల్లాలో 80కి తగ్గకుండా ఏర్పాటు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారుల సర్వే -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
జస్టిస్ గవాయ్ దళితుడైనందునే ఈ వివక్ష..
హన్మకొండ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్పై దాడికి యత్నం జరిగితే ఇప్పటి వరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. శనివారం హనుమకొండలోని హోట ల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడి యత్నం ఘటనలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘ టన జరిగి 19 రోజులైనా ఇంకా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం దళితుడు అయినందు నే కేసు నమోదు చేయడం లేదన్నారు. ఈ స్థానంలో ఇతరులుంటే ఎప్పుడో కేసు నమోదు చేసే వారన్నా రు. ఢిల్లీ పోలీసులు,జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసును స్వీకరించలేదన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఓ రౌడీషీటర్ ఎన్కౌంటర్లో చనిపోతే తెలంగాణ మానవ హక్కు ల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో సుమోటో కేసులు నమోదైన అంశాలను వివరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, జిల్లా ఇన్చార్జ్ సోమన్న, నాయకులు శ్రీనివాస్, వెంకటస్వామి, శివ, నారా యణ, మంద వర్ధన్ , రాజేశ్, అనిల్ పాల్గొన్నారు. ఆయనపై దాడికి యత్నం జరిగితే కేసు ఎందుకు నమోదు చేయలేదు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ -
బైక్ను ఢీకొన్న లారీ..
● యువకుడి దుర్మరణం ● మైలారంలో ఘటన రాయపర్తి: బైక్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని మైలారంలో చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెర్కవేడుకు చెందిన అంగిరేకుల శివ(26) బైక్పై మైలారం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మైలారంలో ఓ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, శివ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
‘డ్వాక్రా’ సంఘాల్లో గందరగోళం
మహబూబాబాద్: కొన్ని డ్వాక్రా గ్రూపుల లీడర్లు, ఆర్పీలు సభ్యులకు తెలియకుండా రుణం డబ్బులు డ్రా చేశారు. దీంతో ఆయా సంఘాల సభ్యులు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతోపాటు మెప్మా కార్యాలయంలో వినతులు అందచేశారు. బ్యాంక్ సిబ్బంది సహకారాలతోనే డబ్బులు కాజేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పరిష్కారం చేయకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు చేసినట్లు సమాచారం. 2,701 డ్వాక్రాగ్రూపు సంఘాలు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) పరిధిలో మానుకోట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీ ఉన్నాయి. కాగా, కేసముద్రం మున్సిపాలిటీగా మారినా ఆన్లైన్లో సమాచారం నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 339 డ్వాక్రా గ్రూపులు 3,092 మంది సభ్యులు ఉన్నారు. మానుకోట మున్సిపాలిటీలో 1,620 గ్రూపులు 15,617 మంది సభ్యులు, మరిపెడ పరిధిలో 331 సంఘాలు, 3,273 మంది సభ్యులు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 411 సంఘాలు 4,044 మంది సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రతీ గ్రూపులో అధ్యక్షురాలు, కార్యదర్శితోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. రుణాల మంజూరు పత్రాల తయారీ ఇతరత్రా మెప్మా కార్యాలయంలోనే జరుగుతాయి. 98 మంది ఆర్పీలు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 98 మంది రిసోర్స్ పర్సన్లు, ఒక ఆర్పీ పరిధిలో 18 నుంచి 25 సంఘాలు ఉంటాయి. సంఘాలతో సమావేశాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పించడం వీరి పని. కానీ, కొంతమంది ఆర్పీలు కాసులకు కక్కుర్తిపడి కొన్ని సంఘాల లీడర్లతో కుమ్మక్కై కొంతమంది బ్యాంక్ సిబ్బంది సహకారంతో డబ్బులు డ్రా చేస్తున్నారు. గ్రూపు పేరున ఆర్పీ బి.జయ, లీడర్లు కలిసి రుణం డబ్బులు డ్రా చేసి రూ.పది లక్షలు కాజేశారని ఈ ఏడాది ఆగస్టులో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఎంపీఎస్ డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో ఐదుగురు మెప్మా కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తమ సంతకాలు పోర్జరీ చేసి రుణం కాజేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెప్మా అధికారుల విచారణలో.. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారని తేలింది. దీంతో రూ.10 లక్షలు రికవరీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. 2024 నవంబర్ 21న జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమహాలక్ష్మి గ్రూపు సభ్యులు కూడా రుణం విషయంలో అన్యాయం జరిగిందని బ్యాంక్ అధికారులు తప్పు చేశారని ఆందోళన చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కూడా పలు సంఘాల సభ్యులు తమకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రికవరీ చేస్తున్నాంబ్యాంక్ అధికారుల తప్పిదంతోనే రుణం మంజూరైంది. మెప్మా నుంచి ఎంసీపీ డాక్యుమెంట్లు ఇతరత్రా లేకుండానే రుణం ఇచ్చారు. గ్రూపు రుణం మంజూరు కాగా.. కొంతమంది రుణం వద్దని చెప్పడంతో మిగిలిన వారు, ఆర్పీ కలిసి రుణం డబ్బులు తీసుకున్నారు. కేవలం వారి టార్గెట్ కోసమే రుణం డబ్బులు ఇచ్చారు. – విజయ, మెప్మా పీడీ సభ్యులకు తెలియకుండానే రుణం నగదు డ్రా ఆర్పీల నిర్వాకంతో దందా కొంత మంది బ్యాంక్ సిబ్బంది తప్పిదాలతోనే..? న్యాయం చేయాలని మహిళల వేడుకోలు -
మహిళా పీజీ కళాశాలలో రచ్చ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్యకు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుశ్రీకి మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం శనివారం తారస్థాయికి చేరింది. ప్రిన్సిపాల్ సౌజన్య తనపై దౌర్జన్యం, దాడి చేశారని మధుశ్రీ తాజాగా వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసింది. సౌజన్య కూడా మధుశ్రీపై పలు ఆరోణలు చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరి వివాదాన్ని పరిష్కరించేందుకు రిజిస్ట్రార్ రామచంద్రం నలుగురు ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీని నియమించారు. వివిధ ఖర్చుల బిల్లుల వ్యవహారం.. యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా సెప్టెంబర్లో గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏడాదిపాటు కంప్యూటర్ సైన్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధుశ్రీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. మొదటినుంచి వీరిమధ్య సయోధ్య లేదు. మధుశ్రీ ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలంలో అలుమ్ని సమావేశం పేరిట వసూలు చేసిన డబ్బులు, ఖర్చుల విషయంపై సౌజన్య ప్రశ్నించడం, వివిధ బిల్లుల విషయంలోనూ అడగటంతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విద్యుత్శాఖ డిపార్ట్మెంటల్ పరంగా యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలను పరీక్ష కేంద్రంగా వినియోగించుకున్నారని, ఇందుకు వారు రూ.20వేల వరకు ఇస్తారని, ఆ డబ్బులు దేనికి వినియోగించారని ఈనెల 24న ప్రిన్సిపాల్ సౌజన్య కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధుశ్రీని అడిగినట్లు తెలిసింది. దీంతోపాటు పలు విషయాలపై ప్రిన్సిపాల్ అభ్యంతరాలు తెలుపుతుండడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. విచారణ కమిటీ చైర్పర్సన్గా జ్యోతి.. వీరిద్దరి వివాదంపై ఈనెల 24న వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. కమిటీ చైర్పర్సన్గా ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, సభ్యులుగా ప్రొఫెసర్లు మనోహర్, శ్రీలత, నర్సింహాచా రి, మెంబర్ కన్వీనర్గా శ్రీలతను నియమించారు. విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రిన్సిపాల్ సౌజన్య వర్సెస్ మధుశ్రీ తనపై దాడి చేశారని మధుశ్రీ.. వీసీ, రిజిస్ట్రార్కు ఫిర్యాదు మధుశ్రీ హయాంలో జరిగిన వ్యవహారాలను వీసీకి వివరించిన సౌజన్య నలుగురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ నియామకం మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు మధుశ్రీకి కంప్యూటర్ ల్యాబ్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఈనెల 24న ప్రిన్సిపాల్ సౌజన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకునేందుకు మధుశ్రీ నిరాకరించారు. ప్రిన్సిపాల్ స్వయంగా స్టాఫ్రూమ్కు వెళ్లి మధుశ్రీ బ్యాగ్పై ఆర్డర్ కాపీని పెట్టగా, తిరిగి ఆ కాపీని చుట్టి తనమీదకి విసిరిందని, దుర్బాషలాడిందని ప్రిన్సిపాల్ సౌజన్య అంటున్నారు. స్టాఫ్రూమ్నుంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తుండటంతో ప్రిన్సిపాల్ సౌజన్య అమెవద్దకు వెళ్లి ఎందుకు అరుస్తున్నావ్ లోనికి రావాలని మధుశ్రీ చేయి పట్టుకొని లాగగా, ఆమె చేయికి గాయమైనట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో మధుశ్రీ ఈనెల 24 వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సౌజన్య కొద్దిరోజుల క్రితమే వీసీ ప్రతాప్రెడ్డిని కలిసి గతంలో మధుశ్రీ ప్రిన్సిపాల్గా పనిచేసిన సమయంలో వివిధ బిల్లుల వ్యవహారాలను వీసీకి తెలియజేసినట్లు సమాచారం. -
కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణకు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ సంబంధిత అధికారులంతా సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గన్నీ బ్యాగులు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 242 కేంద్రాలను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణం విషయంలో రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓ గణేష్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎమ్మెల్యే మురళీనాయక్ కేసముద్రం: అధికారులు, ఆయా శాఖల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ హెచ్చరించారు. కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు అధికారులు ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటికన్నె గ్రామంలో ఇంకుడుగుంత నిర్మాణం పనులను ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగొద్దని పీఆర్ ఏఈని హెచ్చరించారు. పీఆర్ శాఖ నుంకి మంజూరైన 10 రోడ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్లాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొందరు కా ర్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం పలువురికి కల్యా ణలక్ష్మి చెక్కులు అందజేశారు. అదేవిధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ద్వారా ధన్నసరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మక్కల కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహముద్పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. తమకు భోజనం సక్రమంగా పెట్టడంలేదని విద్యార్థినులు ఎమ్మెల్యే తెలి యజేయగా.. నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలోని సమస్యలపై, ఇక్కడి టీచర్ల తీరుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆ యన కోరారు. అమీనాపురం భూనీలా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. కేసముద్రం మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓలు క్రాంతి, పార్థసారథి, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, నాగేశ్వర్రావు, రావుల మురళి, వెంకన్న, దస్రూనా యక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు పక్కాగా అమలుచేయాలి
● జెడ్పీ సీఈఓ పురుషోత్తంతొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అధికారులకు సూచించారు డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధిహామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడారు. గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, అర్హులకు పథకాలు అందిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని, అధికారులు నిత్యం గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచందర్ రెడ్డి, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
బైబై టెక్నోజియాన్..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25 వేడుకలు శనివా రం ముగిశాయి. రెండు రోజుల పాటు సీ రాకెట్, మిలిటరీ మ్యాన్ నమూనా, ఏరోప్లేన్, రోబోటిక్స్ క్లబ్ సర్వీంగ్ రోబో, నియాన్ క్రికెట్, పెడస్టల్ బ్రిడ్జి వంటి 40కి పైగా ఈవెంట్లతో టెక్నోజియాన్ అలరించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా టెక్నోజియాన్–25 నిలిచింది. ఈ ఫెస్ట్లో వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు నిట్ టెక్నోజియాన్ టీం ఆన్లైన్లో రూ.2 లక్షల బహుమతులు ప్రదానం చేసింది. చివరి రోజువిద్యార్థులు ప్రదర్శించిన పలు ఈవెంట్లు ఆకట్టుకున్నాయి. ప్రణాళికతోనే విజయం.. ప్రణాళిక విద్యనభ్యసిస్తేనే విజయం సాధ్యమని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత తెలిపారు. నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండురోజుల టెక్నోజియాన్–25 వేడుకల్లో భాగంగా శనివారం నిట్ అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఎక్స్పర్ట్ టాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సివిల్స్ సాధనకు ప్రత్యేక సమయం కేటాయించండంతో పాటు ప్రతీ రోజు అధ్యయనం చేసి అంశాలపై పరీక్ష రాయడం, గతంలో సివిల్స్లో వచ్చిన ప్రశ్నలను చ దవడం, రాయడం ద్వారా చదువుకున్న అంశాలపై పట్టు సాధించొచ్చన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తాచాటుతున్న నిట్ విద్యార్థులు సివిల్స్పై దృష్టి సారించాలన్నారు. నిట్లో ముగిసిన సాంకేతిక మహోత్సవ వేడుకలు విజేతలకు ఆన్లైన్లో రూ.2 లక్షల బహుమతుల ప్రదానం -
దొంగ అరెస్ట్
పర్వతగిరి: పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేసిన దొంగను పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఎస్సై బోగం ప్రవీణ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యానాయక్ కాలనీకి చెందిన రాపోలు శ్రీనివాస్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులను టార్గెట్ చేశాడు. తన క్రెడిట్కార్డు బిల్లు పెండింగ్లో ఉందని, వెంటనే కడితే తిరిగి మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తానని నమ్మించి రూ.50వేలనుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వకుండా పారిపోయేవాడు. ఇలా పర్వతగిరి, నెక్కొండ, వర్ధన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లోని పెట్రోల్ బంకులు, మినీ ఏటీఎంలలో దాదాపు రూ.6లక్షల వరకు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలన్నీ ఒప్పుకోగా అతడి నుంచి రూ.3లక్షల నగదు, ఆరు గ్రాముల బంగారం, బ్లూ కలర్ యాక్టీవా స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. శ్రీనివాస్ను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పర్వతగిరి ఎస్సై బోగం ప్రవీణ్, సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, నర్సింగ్రావుపల్లికి చెందిన బండారి వినోద్ (22) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తుండేవాడు. ఓ హల్దీ ఫంక్షన్కు సంబంధించిన ఫొటోలు తీసేందుకు టీఎస్27ఎఫ్ 3270 స్కూటీపై బొంగ్లూర్ నుంచి ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు వెళ్తున్నాడు. రావిర్యాల శివారులోని కళాంజలి సమీపంలో ఇండస్వాలీ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పైనుంచి కింద పడిన వినోద్ను రోడ్డుపై కొద్దిదూరం లాక్కెళ్లింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈసమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
● ఆలయాల్లో నాగదేవతలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలుమహబూబాబాద్ రూరల్: నాగుల చవితిని పురస్కరించుకుని భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పంచామృత అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్వతీరామలింగేశ్వరస్వామి దేవాల యం, ముత్యాలమ్మ దేవాలయం, ఏ క్యాబిన్ రోడ్డులోని నాగేంద్రుడిపుట్ట వద్ద, వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయం, వేణుగోపాలస్వామివారి దేవాల యం, వేంకటేశ్వర బజార్లోని స్వయంభూ పార్వ తీ రామలింగేశ్వరసహిత వేంకటేశ్వరస్వామి దేవాల యం, భక్త మార్కండేయ శివాలయం, శిఖారుఖానగడ్డ ముత్యాలమ్మ దేవాలయం, నర్సంపేట రోడ్డులోని మహాగాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, మహబూబాబాద్: ఈ చిత్రంలో పిల్లలకు షూ పంపిణీ చేస్తున్న దంపతుల పేరు యాళ్ల మురళీధర్రెడ్డి, సాధనారెడ్డి. వీరిది మహబూబాబాద్ పట్టణం. కుమార్తె ఆన్సారెడ్డి పుట్టిన రోజు వేడుకను పట్టణంలోని రాంచంద్రాపురం కాలనీలోని దైవ కృప అనాథాశ్రమంలోని చిన్నారులు, వృద్ధుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి.. ఆడిపాడి.. తెచ్చిన రకరకాల వంటకాలను వారితోనే కలిసి తిని తీపి జ్ఞాపకాలతో తిరిగి వచ్చారు. ఖిలా వరంగల్: ఈ చిత్రంలో అనాథ పిల్లలకు నోట్బుక్స్ అందిస్తున్నది రావికంటి అశోక్, శ్రీదేవి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వారి జన్మదిన వేడుకలను ప్రతీ ఏడాది అనాథ పిల్లల నడుమ నిర్వహిస్తున్నారు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి నడుమ గడుపుతున్నారు. ఏటా హనుమకొండలోని ఒయాసిస్ చారిటబుల్ ట్రస్ట్లోని అనాథ పిల్లలకు రాఖీలు కట్టి, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసి వేడుకలు జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పేరిట దందా!
చిన్నగూడూరు: మండల కేంద్రం శివారు ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లోడ్తో ట్రాక్టర్లు మండల కేంద్రం ప్రధాన వీధుల గుండా వెళ్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వీధుల గుండా నిత్యం పాఠశాలల విద్యార్థులు, రైతులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడంతో ఇసుక ట్రాక్టర్ల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.అక్రమంగా ఇసుక రవాణా -
విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలి
చిన్నగూడూరు: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్, ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు నమోదు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. పాఠశాలల్లో తరగతి గదులు, వంటగదులు, స్టోర్ రూంలను పరిశీలించి వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, పాఠ్యాంశాలలోని పలు అంశాలపై విద్యార్థులను ప్రశ్నలను అడిగారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు నమోదు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉగ్గంపల్లి పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ యాకయ్య, ఎస్ఓ లలిత, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.కలెక్టర్ అద్వైత్మార్ సింగ్ మహబూబాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించి.. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సి అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంతో పాటు అంకితభావంతో పని చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ దక్షిణామూర్తి పాల్గొన్నారు. -
తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని మోసం..
వరంగల్ క్రైం : తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని బాధితులకు మాయమాటలు చెప్పి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. గురువారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి అరెస్టు చూపి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన రామిడి సంపత్రెడ్డి 2021లో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని పలువురికి మాయమాటలు చెప్పి వారినుంచి సుమారు రూ.కోటి వసూలు చేశాడు. అనంతరం ఎలాంటి భూములు చూపెట్టకుండా వాయిదా వేస్తూ మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ జనవరిలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సంవత్సర కాలంగా పరారీలో ఉన్న సంపత్రెడ్డిని గురువారం హనుమకొండ బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా తాను బాధితుల నుంచి తీసుకున్న రూ.కోటితో ఆన్లైన్ గేమ్ ఆడానని, అంతా పోగొట్టుకున్నానని తెలిపాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్ -
సేవా దృక్పథంతో పనిచేయాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్ : పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవా దృక్పథంతో పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, పెండింగ్లో ఉన్న కేసులు, మహిళా భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణా, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజా, శాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతీ అధికారి నుంచి వారి పరిధిలోని కేసుల వివరాలు తెలుసుకొని, దర్యాప్తు వేగవంతం చేయాలని, న్యాయం జరిగేలా ప్రతీ కేసును శాసీ్త్రయ ఆధారాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల జిల్లాలో రైతుల కోసం నిర్వహించిన యూరియా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన పోలీసు అధికారులను మెమొంటో, శాలువాలు కప్పి ప్రత్యేకంగా అభినందించారు. కోర్టు డ్యూటీలో అద్భుతంగా పనిచేసిన సీడీఓలకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, మోహన్, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు, వివిధ యూనిట్ల ఇన్చార్జ్ అధికారులు పాల్గొన్నారు. -
వరంగల్లో అద్భుత శిల్ప కళాసంపద
హన్మకొండ: వరంగల్ అద్భుత శిల్ప కళా సంపదకు నిలయమని ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా అన్నారు. కాకతీయుల శిల్ప కళా సంపదను వీక్షించడానికి ఈఆర్సీ చైర్మన్ల దంపతులు వరంగల్ చేరుకున్నారు. వీరికి హనుమకొండ న క్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా దంపతులు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామివారికి పూజారులు మహా రుద్రాభిషేకం జరిపించి ఆశీర్వచనం అందించారు. కాకతీయుల శిల్ప కళాసంపదను చూసి అబ్బురపడ్డారు. అనంతరం ఇరువురు చైర్మన్లు మా ట్లాడుతూ కాకతీయుల వంశానికి చెందిన వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించుకోవడం సంతో షంగా ఉందన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి ప్రధాన అర్చకుడు శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. అనంతరం ఖిలావరంగల్ కోటలోని కాకతీ య కీర్తితోరణాలు, ఏకశిల గుట్ట, గుండుచెరువు, ఖుష్ మహల్ ను సందర్శించారు. పర్యాటక శాఖ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్య కిరణ్.. ఖిలా వరంగల్ చరి త్రను వివరించారు. కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీ.ఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, భాస్కర్, ఎ.డి.ఈ మల్లికార్జున్ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈఆర్సీ చైర్మన్లు -
మహిళలు స్వశక్తితో ఎదగాలి..
న్యూశాయంపేట: ఆధునిక టెక్నాలజీ యుగంలో మహిళలు సరికొత్త ఆలోచనలతో స్వశక్తితో ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ అన్నారు. మైనారిటీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షుడు అనీస్ సిద్ధిఖీ అధ్యక్షతన గురువారం హనుమకొండ ములుగురోడ్డు మైనారిటీ కమ్యూనిటీ హాల్లో ఇటీవల కరాటే పోటీల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థిని మహ్మద్ ఆసియా సన్మానంతో పాటు ఎంఐఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు 8వ బ్యాచ్లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అభివృద్ధి సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. మైనారిటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనురాగ్ హెల్ఫింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి, హనుమకొండ(జి1) ప్రిన్సిపాల్ నీరజ, అడ్వకేట్ డాక్టర్ వలీఉల్లా ఖాద్రీ, ఫోరం సభ్యులు సయ్యద్ అక్బర్, మాషూఖ్ రబ్బానీ, ఎం.ఎ. నయీం, ఆలంఖాన్, అజ్మద్ అలీ, ఖుస్రూ ఆలం, ఎంఐఎఫ్ మహిళా వింగ్ సభ్యులు నుస్రత్, నాజ్నీన్, తస్లిం, నజ్మా, జేబా తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ -
కోటలో సదర్ సంబురం..
ఖిలా వరంగల్: చారిత్రక మధ్యకోట ఖుష్మహాల్ ప్రాంగణం సదర్తో సందడిగా మారింది. సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో హైదరాబాద్కు చెందిన మధుయాదవ్ హరియాణా నుంచి తీసుకొచ్చిన దున్న పోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతకు ముందు దున్న పోతులను రాజసం ఉట్టిపడేలా అలంకరించి డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఖుష్మహాల్ ప్రాంగణానికి తీసుకొచ్చారు. దున్నపోతులకు ఎదిరేగిన యాదవ మహిళలు మంగళహారతులు పట్టి ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు చేసి యాదవ వీధి నుంచి శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా సభవేదికగాకు తీసుకొచ్చి ప్రతిష్ఠించి వేడుకలు కొనసాగించారు. ‘కుడా’ మాజీ చైర్మన్ సుందర్ రాజ్యాదవ్ సదర్ ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దున్నల పూజించే గొప్ప సంస్కృతి యాదవులకే దక్కిందన్నారు. కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేనబోయిన రవియాదవ్, గౌరవ అధ్యక్షుడు బైరబోయిన దామోదర్యాదవ్, ప్రధాన కార్యదర్శి కై లాష్ యాదవ్, యాదవ మహాసభ జిల్లా చైర్మన్ దొంగల చెన్న మల్లు యాదవ్, పృథ్వీ రాజు, మూగల కుమార్, కార్పొరేటర్ ఉమ, నాయకులు బొల్లబోయిన కిశోర్, బనక సిద్దిరాజ్ యాదవ్, సదర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. రాజసం ఉట్టిపడేలా హరియాణా దున్నపోతుల అలంకరణ మధ్యకోట పురవీధుల్లో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు -
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ను వినియోగించుకోవాలి
● మ్యూచువల్ ఫండ్ ఎండీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే ఝావరంగల్ చౌరస్తా : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వినియోగ థీమ్ను అనుసరించి ఈనెల 31న ఓపెన్–ఎండ్ స్కీమ్ను ఎల్ఐసీ కంజప్షన్ ఫండ్ను ప్రారంభిస్తోందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే ఝా తెలిపారు. గురువారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నూతన స్కీం అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 14న ముగుస్తుందన్నారు. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం 15 ఈక్విటీ, 9 డెట్, 6 హైబ్రిడ్, 1 సొల్యూషన్ ఓరిఝెంటెడ్, 41 విభిన్న పథకాలు అందిస్తుందన్నారు. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతినిధులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం షాపులకు 1,800 దరఖాస్తులు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు 1,800 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 26న దరఖాస్తుల స్వీకరణ మొదలై ఈనెల 18వరకు గడువు ఇచ్చారు. అప్పటి వరకు 1,648 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ నెల 23వరకు గడువు పెంచగా.. 1,800 దరఖాస్తులు రావడంతో రూ.54 కోట్ల ఆదాయం సమకూరింది. ఈనెల 27న లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించనున్నారు. పెరిగిన లైసెన్స్ ఫీజు.. మద్యం షాపుల ఏర్పాటు కోసం లైసెన్స్ ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో గతం కంటే తక్కువగా 1,800 దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికంగా రూ.54 కోట్ల ఆదాయం సమకూరింది. 2023–25 వార్షిక సంవత్సరంలో 59 వైన్ షాపులకు 2,589 దరఖాస్తులు రాగా, రూ.51.78 కోట్ల ఆదాయం సమకూరింది. 27న లక్కీ డ్రా.. 2025–27 కాలపరిమితికి సంబంఽధించి ప్రారంభంలో మందకొడిగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో గతంలో 59 వైన్షాపులు ఉండగా, ప్రస్తుతం రెండు నూతన షాపులు ఏర్పాటు చేయనుండడంతో సంఖ్య 61కి చేరినప్పటికీ.. గతంలో కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ ఆదాయం పెరిగింది. కా గా, జిల్లాలోని మానుకోటఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 667, తొర్రూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 769, గూడూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 364 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 27న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి ఎంపికై న దరఖాస్తుదారులకు మద్యం షాపులను కేటాయించనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు. గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు, పెరిగిన ఆదాయం ఈ నెల 27న లక్కీ డ్రా -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
హసన్పర్తి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. బీఎస్సీ(అగ్రికల్చర్)లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సర విద్యార్థులకు గురువారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. వ్యవసాయ విద్యనభ్యసించిన విద్యార్థులు దేశాభివృద్ధికి వెన్నెముకలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రయాణంలో ప్రావీణ్యం,నైతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ప్రయోగిక జ్ఞానంపై దృష్టి సారించాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, ప్రస్థానం, విద్యా విజయాలు, అంతర్జాతీయ ర్యాంకుల గురించి వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ భూపాల్రాజ్, డాక్టర్ మోహనకీర్తి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి -
ప్రైవేట్ స్కూల్లో మరో విద్యార్థి మృతి
నయీంనగర్: హనుమకొండ నయీంనగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. యాజమాన్యమే కొట్టి చంపిందని మృతుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. నెలరోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ విద్యార్థి చనిపోవడం, తాజాగా మరో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బానోత్ రమేశ్, సుజాత దంపతుల ఏకై క కుమారుడు సుజిత్ ప్రేమ్(9) క్లాస్ రూమ్లో కిందపడడంతో యాజమాన్యం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. డాక్టర్లు పరీక్షించి విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని స్కూల్ యాజమాన్యమే కొట్టి చంపిందని, ఆరోగ్యంగా ఉన్న బాలుడు ఎలా చనిపోతాడని అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. పాఠశాలలోని పూలకుండీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. క్యాంపస్లో ఎలాంటి వసతులు లేకుండా 2,600 మంది విద్యార్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని, గత నెల ఇదే స్కూల్లో మరణించిన విద్యార్థి తండ్రి ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారుల పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుందని కన్నీటిపర్యంతమయ్యారు. స్కూల్లో అర్హత లేని పీఈటీని నియమించి మహిళలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీ, పాఠశాల యాజమాన్యంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో చనిపోయిన ఓ విద్యార్థి మృతుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన వరుస ఘటనలతో పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం -
టెండర్ల దందా!
కూరగాయల మార్కెట్లోవరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో వేలం(టెండర్)దందా జరుగుతోందనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. మా ర్కెట్లో వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ, మార్కెట్లో మృతి చెందిన వ్యాపారులు, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సా యం అందిస్తామన్న పేరుతో 20 సంవత్సరా లుగా వేలం(టెండర్) నిర్వహిస్తున్నారు. అయితే ఆ వేలంలో వచ్చిన ఆదాయాన్ని బాధితులకు అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన వేలలో రూ.6.80లక్షలు సమకూరినప్పటికీ నేటికీ ఆర్థిక సాయం అందించకపోవడంతో పలువురు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోని కమీషన్ వ్యాపారులు ‘ది వరంగల్ సిటీ వెజిటబుల్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్’ పేరుతో 2005 ఆగస్టులో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ చేయించిన కార్యవర్గం కనీసం పాన్కార్డు తీయకపోవడంతో బ్యాంకు అకౌంట్ తీసే అవకాశం కోల్పోయారు. దీంతో అసోసియేషన్ ఆదాయవ్యయాలు మొత్తం కార్యవర్గంలోని ఒకరిద్దరి చేతుల్లోనే జరిగాయి. మార్కెట్లో 2005నుంచి 2023 సంవత్సరం వరకు పెట్టిన టెండర్లతో సుమారు రూ.కోటిన్నర వరకు నిధులు సమకూరినట్లు వ్యాపారుల్లో చర్చ జరిగింది. దీనిపై కమీషన్ వర్తక సంఘం నాయకులు ఎప్పటికప్పుడు లెక్కలు చూస్తున్నామని చెప్ప డం.. వారికి రాజకీయంగా అండ ఉండడంతో మిగతా వ్యాపారులు నోరుమెదపలేకపోయారు. లెక్కలు కొంత మందికి తెలియడంతో మిగతా వ్యాపారులు ఇందులో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. గడిచిన 20ఏళ్లలో రెండు, మూడు కమిటీలు మారినప్పటికీ లెక్కలు ఏనాడు వర్తకసంఘంలోని సభ్యులకు చెప్పిన దాఖలాలు లేవు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో వ్యాపారులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. చివరకు లెక్కలపై ఆరోపణలు తీవ్రం కావడంతో 2024జూలైలో కమీషన్ వ్యాపారుల సంఘం కార్యవర్గాన్ని రద్ద చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి కొత్తగా ఎన్నికలు పెడతామని ప్రకటించినా పలుమార్లు వాయిదా పడ్డాయి. దీనికి మారిన రాజకీయ సమీకరణలు సైతం కారణమని పలువురు పేర్కొంటున్నారు. తూర్పు ముఖ్య నేత మారడంతో అప్పుడు ఉన్న నాయకులు కొంత కాలం వేచి చూసి మార్గం సుగమం చేసుకున్నారు. చివరకు తాజాగా రద్దయిన కమిటీలో ఉన్న వారితోనే మళ్లీ ఇటీవల నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. ప్రజాస్వామ్య పద్ధతిలో అసోసియేషన్ ఎన్నికలు జరపాలని మెజార్టీ వ్యాపారులు డిమాండ్ చేసినా అధికార పార్టీ నాయకుల అండతో పాత కమిటీ మళ్లీ కొత్తగా పురుడుపోసుకుంది.కూరగాయల మార్కెట్లో వినాయకచవితి నిర్వహణతో పాటు మార్కెట్లో వ్యాపారం, హమాలీ పనులు చేస్తూ మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని వేలం (టెండర్) పెట్టి వచ్చిన ఆదాయానికి 20 ఏళ్లుగా లెక్కలు చూపకపోవడంతో వ్యాపారులు ఆరోపణలు చేయడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడం కలెక్టర్ దృష్టికి వచ్చింది. నిధుల వ్యయంపై స్పష్టత లేకపోవడం గమనించిన అప్పటి కలెక్టర్ ప్రావీణ్య టెండర్ మార్కెట్లో పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి టెండర్ జోలికి పోని వ్యాపారులు.. కొత్త కమిటీ రావడంతో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం పేరుతో ఆగస్టు 26న వేలం (టెండర్)పెట్టారు. కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా వేలం పెట్టొద్దని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు.గతంలో సమకూరిన నిధులెక్కడ సంఘానికి అకౌంట్ లేదు.. లెక్కలు లేవు? టెండర్ పెట్టొద్దనే కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తాజాగా టెండర్ పెట్టినా నేటికీ అందని ఆర్థిక సాయం మరోసారి పెట్టేందుకు పావులు కదుపుతున్న నాయకులురెండు నెలలైనా సాయం ఏది?వేలం(టెండర్)తో వచ్చిన ఆదాయాన్ని మార్కెట్లో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం రెండు నెలలైనా అందించలేదు. వచ్చిన ఆదాయంలో ఎంత మందికి ఎంతెంత అందిస్తారనే విషయం ఇప్పటి వరకూ గోప్యంగానే ఉంది. ఆర్థిక సాయం అందజేత విషయంపై వర్తక సంఘం బాధ్యులను అడిగితే మంత్రి సమయం తీసుకుని ఆర్థిక సాయం చెక్కులు బాధితులకు అందజేస్తారు అనే సమాధానం వస్తోంది. సంఘానికి బ్యాంకు అకౌంట్ లేకుండా చెక్కులు ఎలా ఇస్తారో వేచి చూడాల్సిందే. మళ్లీ త్వరలోనే మరోసారి వేలం (టెండర్)నిర్వహించేందుకు వర్తకసంఘం నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. -
గొల్లపల్లి ఇకలేరు..
నర్మెట : కాంగ్రెస్ సీని యర్ నాయకుడు, కొమురవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి కు మార స్వామి (72) గుండెపోటుతో మృతి చెందా రు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం డయాలసిస్కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో కారులోనే తుదిశ్వాస విడిచారు. కాగా, కమ్యూనిస్టు భావజాలంతో 1971లో రాజకీయాల్లోకి వచ్చిన కుమారస్వామి 1978లో ఉపసర్పంచ్గా, మూడు పర్యాయాలు సర్పంచ్గా (1995, 2001, 2009) నర్మెట పీఏసీఎస్ డైరెక్టర్గా (2004), కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్గా (2011–13) పార్టీకి, ప్రజలకు సుదీర్ఘకాలం సేవలందించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫరీదుల యాదయ్య, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ఇమ్మడి శ్రీనివాస్, తేజావత్ గోవర్ధన్, రామిని శివరాజ్గుప్తా, పలుపార్టీల నాయకులు.. గొల్లపల్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జంగా రాఘవరెడ్డి.. గొల్లపల్లి పాడె మోసి కన్నీరు పెట్టుకున్నారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్తో ఆర్ట్స్కాలేజీ ఎంఓయూ కేయూ క్యాంపస్ : ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్మాణ్ ఆర్గనైజేషన్తో హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీ ఎంఓయూ కుదుర్చుకుందని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి తెలిపారు. ఈఎంఓయూతో ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ విద్యార్థులకు ఇన్ఫోసిస్, మైక్రోసాప్ట్తోపాటు పలు కంపెనీలతో శిక్షణపొందే అవకాశం ఉంటుందన్నారు.కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ మేనేజర్ నరేశ్, కళాశాల ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ ఎల్.జితేందర్, అధ్యాపకులు అజ్మీరా రాజేశ్, డాక్టర్ భిక్షపతి, తదతదిరులు పాల్గొన్నారు.● గుండెపోటుతో కొమురవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కుమారస్వామి మృతి ● నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు కొమ్మూరి, జంగా -
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● అనంతారం మోడల్ స్కూల్లో అంతర్గత గొడవలు ● డీఈఓ, కలెక్టర్కు ఫిర్యాదుమహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూళ్లలో విద్యాబోధన జరుగుతుండడంతో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారాయి. గత విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు సీట్లు సాధించారు. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల మధ్య సమన్వయ లోపంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఉపాధ్యాయుల మధ్య అంతర్గత గొడవల వల్ల డీఈఓ, కలెక్టర్కు విద్యార్థులతో ఫిర్యాదు చేయిస్తూ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పత్తి కొనుగోళ్లకు సిద్ధం చేయాలి
మహబూబాబాద్: కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు అన్ని సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ఆదేశించా రు. సాక్షి దినపత్రికలో ‘కొనుగోళ్లు ఆలస్యం..’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో 84,718 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని, 6,14,000 క్వింటాళ్ల పత్తి దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి పంట కొనుగోలుకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ప్రకటించిందని, పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. సమావేశంలో డీఏఓ విజయనిర్మల, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అనిల్కుమార్ -
కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు
● సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుజాత తొర్రూరు: కుష్టు వ్యాధిని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, స్పర్శ లేని మచ్చలు గుర్తిస్తే చికిత్స తీసుకోవాలని హైదరాబాద్లోని ప్రభుత్వ కుష్టు చికిత్స, శిక్షణా కేంద్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుజాత తెలిపారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. లెప్రసీ క్లినిక్ వైద్యులు సుజాత, సుష్మలు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి నందనాదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సుజాత మాట్లాడారు. గ్రామాల్లో లెప్రసీ సర్వే నిర్వహించి బాధితులకు వైద్య సాయం అందించాలన్నారు. శరీరంలో ఉన్న మచ్చలను గుర్తించి లెప్రసీ మందులు అందించాలన్నారు. కుష్టు వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు. వైద్యులు మీరాజ్, మానస, సీహెచ్ఓ విద్యాసాగర్, డీపీఎంఓలు వనాకర్రెడ్డి, విజయ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. క్షుణ్ణంగా పరిశీలించాలి.. దంతాలపల్లి: ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ సుజాత అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి పీహెచ్సీ సిబ్బంది, దంతాలపల్లి పీహెచ్సీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర లెప్రసీ బృందం సభ్యురాలు సుష్మా, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ విజయకుమార్, డీపీఎం వనాకర్ రెడ్డి, వైద్యురాలు కవిత, సీహెచ్ఓలు విద్యాసాగర్, సంజీవరావు, రెండు పీహెచ్సీల సూపర్వేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్టీరింగ్పైనే ఆగిన శ్వాస..
దేవరుప్పుల: గుండెకు స్టంట్లు పడ్డాయి.. డ్రైవింగ్ చేయొద్దని వైద్యులు చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా డ్రైవింగ్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. అదే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో స్టీరింగ్పైనే ఒరిగిపోయాడు. ఈ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన చిట్టిమెళ్ల వెంకన్న (50) డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేశాడు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను అధిగమించే క్రమంలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇప్పటికే మూడు పర్యాయాలు గుండెపోటుకు గురవగా స్టంట్లు వేశారు. అయినా కుటుంబ పోషణ కోసం ఎంత కష్టమైనా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. బుధవారం రాత్రి డీసీఎంలో పత్తి లోడ్తో జనగామకు చేరుకున్నాడు. తిరుగు ప్రయాణంలో సూర్యాపేట రహదారిలో దేవరుప్పుల మండల కార్యాలయాల వద్దకు రాగానే చాతిలో నొప్పిరావడంతో వెంకన్న డీసీఎంను రోడ్డు పక్కకు నిలిపాడు. ఇంజన్ ఆఫ్ చేయకుండానే తన సీట్లోనే విగతజీవిగా మారాడు. గురువారం తెల్లవారుజామున ఇదే రహదారిలో వాకర్స్ వెళ్లే క్రమంలో డీసీఎం ఇంజన్ రన్నింగ్లో ఉండడం, డ్రైవర్ అచేతన స్థితిలో కనిపించడంతో అనుమానం వచ్చి కదలించే ప్రయత్నం చేయడంతో చలనం రాలేదు. దీంతో డీసీఎంపై ఉన్న ఫోన్ నంబర్తో కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంకన్న భార్య భాగ్యలక్ష్మి , కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. డ్రైవర్ వెంకన్న సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన వాహనం నిలపడం వల్ల తెల్లవారుజామున వాహనాల రద్దీతో ప్రమాదాలు తప్పాయని స్థానికులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్కుమార్ తెలిపారు. స్టంట్లు పడినా జీవన మనుగడ కోసం వీడని వృత్తి ముందు చూపుతో రహదారిపై తప్పిన ప్రమాదం -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీస్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–బరౌని మధ్య రెండు ప్రత్యేక వీక్లీ రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఈ నెల 25వ తేదీన చర్లపల్లి–బరౌని (07093) బరౌని ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన బరౌని–చర్లపల్లి( 07094) బరౌని ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ ప్రత్యేక వీక్లీ రైళ్ల సర్వీస్లకు జనగామ, కాజీపేట, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, చాందా పోస్టు, గోండియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, జర్సుగూడ, రుర్కెలా, రాంచీ, మురి, బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, చిత్తరంజన్, మధుపూర్, జషిది రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. నేటి నుంచి ఇంటర్ కాలేజీయెట్ టోర్నమెంట్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 24నుంచి 26వ తేదీ వరకు ఇంటర్ కాలేజీయెట్ టోర్నమెంట్ (పురుషుల.. రెండోదశ) నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తెలిపారు. విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణంలో నిర్వహించే ఈ టోర్నమెంట్ను వీసీ కె. ప్రతాప్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. హ్యాండ్బాల్, సాఫ్ట్బాల్, బాల్బ్యాడ్మింటన్, ఖోఖో, క్రాస్కంట్రీ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రైవేట్ టీచర్కు దేహశుద్ధి.. ● విద్యార్థినులకు అసభ్యకర మెస్సేజ్లుభూపాలపల్లి అర్బన్: విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడి(పీఈటీ)కి తల్లిదండ్రులు, ఏబీవీపీ, భజరంగ్దళ్ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏబీవీపీ, భజరంగ్దళ్ కార్యకర్తల కథనం ప్రకారం.. బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్(బిట్స్) పాఠశాల పీఈటీ బానోత్ మోహన్ బాలికలకు సోషల్మీడియాలో అసభ్యకర మెస్సేజ్లు చేస్తున్నాడు. ఈ విషయం పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ఏబీవీపీ, భజరంగ్దళ్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఎదుటే సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఉపాధ్యాయులపై తీరుపై విద్యార్థినులతో మాట్లాడి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. మోహన్తో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా బాలికల పట్ల అసభ్యకరంగా వ్యహరించడం, చనువుగా ఉంటూ సెల్ఫోన్లో వారి ఫొటోలు తీసుకున్నట్లు తెలిపారు. బాలికలకు ఇన్స్టాగ్రాంలో వచ్చిన మెస్సేజ్లు, ఫోన్లో మాట్లాడిన రికార్డులను పాఠశాల యాజమాన్యం, భూపాలపల్లి పీఎస్లో అందించారు. విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. -
నిఘా వైఫల్యం?
తొర్రూరు: జిల్లాలోని కొన్ని ఔషధ దుకాణాల్లో విచ్చలవిడిగా మత్తు మందుల విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా తొర్రూరులోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు మత్తు కలిగించే టాబ్లెట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నల్లగొండకు చెందిన ముఠాకు మందులు విక్రయించగా వారు ఎక్కువ ధరకు అమ్మకాలు చేశారు. సమాచారం అందుకున్న నల్ల గొండ పోలీసులు తొర్రూరుకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దందా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల చీటీలు లేకుండా నిషేధిత, వాడకూడని మందులను అమ్ముతున్నారు. అధికశాతం దుకాణాల్లో మత్తు పదార్థాలు, గర్భవిచ్ఛిత్తి మాత్రలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిఘా కొరవడింది. నిబంధనలకు నీళ్లు.. మత్తు మందులకు సంబంధించి విక్రయాలు జిల్లా వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. జిల్లాలో 1000కి పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. రోజూ రూ.లక్షల్లో వ్యాపారం సాగుతోంది. నిద్రమాత్రలు, మత్తును కలిగించే దగ్గు టానిక్లు, ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఇచ్చే సీరియస్ యాంటీ బయోటిక్స్ మందులు విక్రయించాలంటే వైద్యుల ప్రిస్కిప్షన్ చీటీ ఉండాల్సిందే. ‘పారాసెటమాల్, డైసైక్లోమైన్, ట్రామాడల్ సమ్మిళిత ఔషధాన్ని తీవ్రమైన నొప్పి నివారణకు వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ‘ట్రామాడల్’ అనే ఔషధం ‘ఓపియాయిడ్స్’ అనే మాదక ద్రవ్యాల జాబితాకు చెందింది. మెదడులోని ‘నోర్పైన్ఫ్రైన్’, ‘సెరోటోనిన్’పై పని చేసి, నొప్పిని తెలియనివ్వదు. కొందరు దీన్ని మత్తు కోసం ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లు గుర్తించారు. దుకాణాల నిర్వాహకులు ఈ నిబంధన పట్టించుకోవడం లేదు. అన్ని దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండాలి. చాలా దుకాణాల్లో వారిని నియమించుకోవడం లేదు. దుకాణాల నిర్వాహకులే మందులు విక్రయిస్తున్నారు. పెద్ద మెడికల్ షాపుల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన, నైపుణ్యం లేని వాళ్లతో పని చేయించుకుంటున్నారు. మందులపై అవగాహన లేకపోవడంతో దుష్ఫలితాలు వస్తున్నాయి. మత్తు ఇచ్చే డ్రగ్స్కు విద్యార్థులు, యువకులు బానిసలవుతున్నారు. దీనికి అధికారులు అడ్డుకట్ట వేయకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎటువంటి వైద్య పరీక్షలు, డాక్టర్ సలహా లేకుండా మందులు విక్రయించవద్దు. మెడికల్ షాపు నిర్వాహకులు నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించేందుకు నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండాలి. మత్తు కలిగించే ఔషధాలు డాక్టర్ సలహా లేకుండా వాడడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఫార్మసిస్టు లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు. – పగిడిపాటి సుగుణాకర్రాజు, తొర్రూరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్యాంటీ డిప్రెషన్: డయాజెపమ్, నైట్రాజెపమ్, మెలటోనిన్, మిర్టాజపిన్, నార్ట్రిప్టిలైన్, ట్రాజడోన్, జలప్లొన్, జోల్పిడెమ్, జోపిక్లోన్ నొప్పి నివారణ మాత్రలు: బుప్రెనొర్పిన్, ట్రామాడల్, టిడిజెసిక్, స్పాస్మో ప్రొక్సివోన్ అలర్జీ, జలుబు మాత్రలు: ఫెనిరమైన్, క్లోర్ఫెనిరమైన్ మెలేట్, సిట్రజిన్, హైడ్రోక్సిజిన్ డిప్రెషన్, దగ్గు, నొప్పి ఔషధాల అమ్మకాలు వైద్యుల చీటీ లేకుండానే విక్రయిస్తున్న దుకాణదారులు తొర్రూరులో మెడికల్ షాపు నిర్వాహకుడి అరెస్టు -
భిక్షాటన పేరుతో సాధువుల మోసం
స్టేషన్ఘన్పూర్: భిక్షాటనకు వచ్చి వ్యాపారులను మోసం చేసేందుకు యత్నించిన దొంగ సాధువులను స్థానిక వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో బుధవారం జరిగింది. వ్యాపారుల కథనం ప్రకారం.. శాంతిపూజలు చేస్తాం, తాయత్తులు అందిస్తాం అంటూ ఓ నలుగురు దొంగబాబాలు సాధువుల వేషధారణలో స్థానిక రైల్వేగేటు సమీపాన ఉన్న పలు షాపుల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయుమాత బ్యాంగిల్ స్టోర్లోకి వెళ్లిన ఓ దొంగ సాధువు షాపు యజమానురాలు తారాదేవిని మాటల్లోకి దించాడు. మీకు శాంతి పూజ చేస్తానని మొదట రూ.500 ఇవ్వమని అడిగాడు. మాట్లాడుతూ ఆమైపె ఒక పౌడర్ చల్లాడు. అనంతరం ఆమె ఆ దొంగస్వామి చెప్పినట్లు వింటూ మరో రూ.500 నోటు, అనంతరం మరో రూ.500 ఇస్తుండడాన్ని గమనించిన షాపు యజమానురాలి తమ్ముడు వెంటనే చుట్టుపక్కల వ్యాపారులకు సమాచారం అందించాడు. అందరూ ఒక్కసారి వచ్చి ఏమిటి సంగతని అడుగుడుతుండగా వెంటనే అక్కడి నుంచి ఉడాయించిన సదరు బాబా రోడ్డుపై ఆపి ఉన్న కారులోకి ఎక్కాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారులు కారును అడ్డగించారు. కారులో దొంగ సాధువుతో పాటు మరోముగ్గురు సాధువేషధారణలో ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారిని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ విషయమై పోలీసులకు సంప్రదించగా ఇలాంటి దొంగ సాధువులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, మూఢ విశ్వాసాలతో మోసపోవద్దని సూచించారు. కాగా దొంగ సాధువుల నుంచి రూ.1,500 నగదును తిరిగి బాధితురాలికి అప్పగించారు. పోలీసులకు అప్పగించిన వ్యాపారులు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఘటన -
‘కపాస్ కిసాన్’పై అవగాహన కల్పించాలి
వరంగల్: కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్పై పత్తి రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా పత్తి ప్రొక్యూర్మెంట్ ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మిన్బాషా అన్నారు. బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వెంకటరెడ్డితో కలిసి ఏనుమాముల మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి యార్డులో రైతులు తీసుకొచ్చిన పత్తిలో నాణ్యత, తేమ శాతం ఎంత వరకు వస్తున్న విషయాన్ని యార్డు సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నారు. వెంకటసాయి ట్రేడర్స్ అడ్తికి తీసుకొచ్చిన హనుమకొండ జిల్లా నడికూడకు చెందిన పత్తి రైతు వెంకటేశ్వర్లుతో మాట్లాడుతూ కనీస మద్దతు ధర పొందడానికి, కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు ముందే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ధారణ అయిన తదుపరి విక్రయానికి తీసుకురావాలన్నారు. అనంతరం కొత్తపేటలోని శ్రీరాజ్ కాటన్ ఇండస్ట్రీన్ మిల్లును పరిశీలించి, మిల్లు యాజమానికి కపాస్ కిసాన్ యాప్కు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు రైతులకు కనబడేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీడీఎం వి.పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, డీఏఓలు అనురాధ, రవీందర్సింగ్, డీహెచ్ఎస్ఓలు అనసూయ, శ్రీనివాసరావు, డీసీఓ సంజీవరెడ్డి, డీఆర్డీఓలు రాంరెడ్డి, శ్రీను, గ్రేడ్ 2 కార్యదర్శి జి.అంజిత్రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, జిన్నింగ్ మిల్లుల యజమానులు కె.నాగభూషణం, చింతలపల్లి వీరారావు, తదితరులు పాల్గొన్నారు. 27 తర్వాతే... ఇటీవల కురిసిన వర్షాలతో మార్కెట్కు వచ్చే పత్తిలో తేమ అధికంగా ఉండడంతో 27వ తేదీ తర్వాతే దశల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీఐ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మార్కెట్కు వస్తున్న పత్తిలో తేమ శాతం సుమారు 18కి పైగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. తేమ 12శాతం కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా పత్తి ప్రొక్యూర్మెంట్ ప్రత్యేకాధికారి యాస్మిన్ బాషా ఏనుమాముల మార్కెట్ పత్తియార్డు, జిన్నింగ్ మిల్లు పరిశీలన -
విద్యుదాఘాతంతో సామిల్ డిపో దగ్ధం
పరకాల: మండలంలోని కామారెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో బాలాజీ సామిల్ టింబర్ డిపో దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున మిల్లు నుంచి మంటలు రావడాన్ని గమనించిన గ్రామస్తులు డిపో యాజమాని తాండ రమేశ్కు సమాచారం అందించారు. దీంతో రమేశ్.. పరకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వాహనంతో చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్చారు. అప్పటికే మిల్లులోని మిషన్లు, కలప పూర్తి గా దగ్ధమై రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రమేశ్ పేర్కొన్నాడు. కాగా, బాలాజీ సామిల్ టింబర్ డిపోను మాజీ ఎంపీపీ మధుసూదన్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు సందర్శించి బాధితుడు రమేశ్ను పరామర్శించారు. రూ. 15లక్షల మేర ఆస్తి నష్టం -
మీ వాహనానికి బీమా ఉందా?
ఖిలా వరంగల్ : రోడ్డుపై వాహనం తిరగాలంటే కచ్చితంగా బీమా ఉండాల్సిందే.. కానీ, ఇటీవలి నివేదికల ప్రకారం చూస్తే.. అధిక శాతం వాహనాలకు ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలకు బీమా పాలసీ ఉండడమే లేదు. వాహనం విడుదలైన మొదటిసారి తీసుకుంటున్నారు. తర్వాత బీమా రెన్యువల్ చేయడం మర్చిపోతున్నారు. కాగా, బీమా లేకుండా రోడ్డు పైకి వచ్చే వాహనాలకు జరిమానాలు విధించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే ఆర్టీఏ, పోలీస్ అధికారులు ఇది పక్కాగా అమలు చేస్తున్నా, ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నాయి. ఈనేపథ్యంలో మీ వాహనానికి బీమా ఉందా లేదా ఒకసారి పరిశీలించండి. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మోటారు వాహనాల వినియోగం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోటారు వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రమాదాలూ అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఈసందర్భాల్లో వాహనం దెబ్బతినడం, వాహనదారుడికి గాయాలు కావడం, కొన్నిసార్లు మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. దీంతోపాటు ప్రమాదంలో ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు మోటారు వాహన బీమా కూడా ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనానికి కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పని సరి. ఇది లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడం నేరం. లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్, బీమా, ఇతర అవసరమైన పత్రాలు లేకుండా వాహనం రోడ్డుపైకి తీసుకురావొద్దు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5లక్షలకు పైగా వాహనాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల సంఖ్య మొత్తం 5లక్షలకు పైగా ఉండగా.. వరంగల్ జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వాహనాలు మొత్తం 2.32లక్షలు ఉన్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలు 1,79,877 కాగా 25,697 కార్లు ఉన్నాయి. అగ్రగామిగా ఉన్న బైక్లు, ఆటోలు రోడ్డు ఎక్కితే తప్పని సరిగా వాహన బీమా, ధ్రువీకరణ పత్రాలు వెంట ఉండేలా చూసుకోవాలని ఆర్టీఏ అధికారులు పదేపదే చెబుతున్నారు. థర్డ్పార్టీ బీమాతో రక్షణ.. వాహనం ద్వారా మూడో పక్షానికి (థర్డ్పార్టీ.. వాహనం, వాహనాన్ని నడిపే వ్యక్తి కాకుండా ఇతరులు) ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేది థర్డ్పార్టీ ఇన్సూరెన్స్. దీనిని లయబిలిటీ ఓన్లీ పాలసీగానూ పిలుస్తారు. విస్తృత బీమా ప్ర యోజనాన్ని కల్పించేది సమగ్ర ద్విచక్రవాహన బీ మా. ప్రమాదం, చోరీ, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, తదితర వాటి వల్ల నష్టానికి పరిహారం ఇవ్వడంతోపాటు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది. సమగ్ర బీమా పాలసీకి కొన్ని అనుబంధ పాలసీలనూ జోడించుకునే అవకాశం ఉంది. వీటిని రైడర్లుగా పిలుస్తారు. సున్నా తరుగుదల.. ద్విచక్రవాహన బీమా పాలసీలో ముఖ్యమైన రైడర్లలో ఇదొక్కటి. ప్రమాదంలో దెబ్బతిన్న భాగాల విలువకు సమాన మొత్తాన్ని అందుకుంటారు. ఈ యాడ్– అన్లేక పోతే ప్రతీ భాగంపై తరుగుదల లెక్కించి, ఆమేరకు బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని చేతి నుంచి భరించాల్సి వస్తుంది. ఇంజిన్కు రక్షణ .. ఇంజిన్ అంతర్గత భాగాలు దెబ్బతిన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. వరదల్లో వాహనం చిక్కుకున్నప్పుడు ఇంజిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అనుబంధ పాలసీ ఉపయోగపడుతుంది. టైర్లకు నష్టం వాటిల్లినప్పుడు టైర్ ప్రొటెక్ట్ పాలసీ సైతం అందుబాటులో ఉంటుంది. వాహనం ఆగితే సాయం.. ప్రమాదం లేదా వాహనం మరమ్మతుకు గురవడం లాంటి సందర్భాల్లో వాహనం రోడ్డుపైనే ఆగిపోతుంది. అలాంటప్పుడు సాయం చేసేందుకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ రైడర్ ఉపయోగపడుతుంది. నట్లు, బోల్టులకూ.. వాహనం పాడైన సందర్భంలో నట్లు, బోల్టులు, ఇంజిన్ ఆయిల్ లాంటి వాటి కోసం చేసిన ఖర్చులనూ తిరిగి పొందేందుకు కన్జ్యూబుల్ యాడ్– ఆన్ పాలసీ తీసుకోవచ్చు. థర్డ్పార్టీ పాలసీతోనే రక్షణ పత్రాలు లేకుండా రోడ్డుపైకి చేరితే నేరం వాహనానికి ఇన్సూరెన్స్ తప్పని సరివాహనం వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలివాహనం ఎంత సురక్షితంగా నడిపినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలకు ఆర్థికంగా సన్నద్ధం కావడం ముఖ్యం.అదే సమయంలో చట్టపరమైన బాధ్యతనూ నెరవేర్చడంలోనూ బీమా పాలసీ తోడ్పడుతుంది. అందుకే మీ వాహనానికి ఎప్పుడూ సమగ్ర బీమా పాలసీ ఉండేలా చూసుకోండి. రోడ్డు మీద ధీమాగా ప్రయాణించండి. వాహనం వెంట ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. సురేశ్రెడ్డి, డీటీసీ వరంగల్, హనుమకొండ -
పాల బిల్లు తీసుకురావడానికి వెళ్తూ..మృత్యుఒడికి
బచ్చన్నపేట : పాల బిల్లు తీసుకురావడానికి వెళ్తూ ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన ఈదులకంటి రమేశ్రెడ్డి గ్రామంలో జెర్సీ పాల డెయిరీని నిర్వహిస్తున్నాడు. ప్రతీ రోజు గ్రామంలో పలువురు పాల ఉత్పత్తి దారుల వద్ద పాలు కొనుగోలు చేస్తాడు. ఈ క్రమంలో బుధవారం పాల బిల్లు కోసం వెళ్తూ అదే గ్రామానికి చెందిన నల్ల వసంత, చంద్రారెడ్డి దంపతుల కుమారుడు నల్ల రాజేందర్రెడ్డి (23)ని బైక్పై తీసుకుని వెళ్లాడు. బచ్చన్నపేట నుంచి ఆలేరు వైపునకు వెళ్తుండగా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సమీపంలో ఓ ఫంక్షన్ హాల్ మలుపు వద్ద ఎదురుగా బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న రాజేందర్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైక్ నడుపుతున్న రమేశ్రెడ్డికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. మృతుడు ప్రస్తుతం ఘట్కేసర్లో బీఫార్మసీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎదురెదురుగా ఢీకొన్న బైక్, లారీ.. యువకుడి దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు -
కేయూకు పూర్వవైభవం తీసుకొద్దాం
● వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: పూర్వ విద్యార్థుల, ప్రభుత్వ సహకారంతో కాకతీయ యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకొద్దామని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పరిపాలన భవనం సెనేట్హాల్లో నిర్వహించిన తెలంగాణ సైన్స్కాంగ్రెస్ సక్సెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఏడాది ఆగస్టు 19 నుంచి 21వ తేదీవరకు తెలంగాణ సైన్స్కాంగ్రెస్ను విజయవంతంగా నిర్వహించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సైన్స్కాంగ్రెస్ విజయవంతంలో ప్రతీ ఒక్కరి కృషి ఉందన్నారు. విశ్వవిద్యాలయం బ్లాక్ గ్రాంట్ రూ. 145 కోట్లకు చేరిందన్నారు. అలాగే, రూ. 50కోట్ల గ్రాంట్ సాధించగలిగామన్నారు. రూసా నిధులతో 37 వ్యక్తిగత ప్రాజెక్టులు, 5 రీసెర్చ్ సెంటర్లను 23 రీసెర్చ్ ఫెల్లోస్తో వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. కేయూలోని కేహబ్ హైదరాబాద్లోని టీహబ్తో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులకు త్వరలోనే ముఖహాజరు గుర్తింపు హాజరును తీసుకురానున్నామన్నారు. తెలంగాణ సైన్స్కాంగ్రెస్ లోకల్ ఆర్గనైజింగ్సెక్రటరీ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, తెలంగాణ అకాడమీ సైన్స్ బాధ్యులు ఎస్ఎం రెడ్డి, సంజీవరెడ్డి సైన్స్కాంగ్రెస్ నిర్వహణలో అనుభవాలను పంచుకున్నారు. అనంతరం తెలంగాణ సైన్స్కాంగ్రెస్ సంగ్రహణ వివరణ పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం పాల్గొన్నారు. తెలంగాణ సైన్స్కాంగ్రెస్ విజయవంతం కావడానికి ప్రధాన భూమిక పోషించిన వివిధ కళాశాలల కమిటీలు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. కాకతీయ యూనివర్సిటీలో రూసా నిధులు రూ. 3కోట్ల 50లక్షల వ్యయంతో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ నిర్మాణానికి బుధవారం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి.. రిజిస్ట్రార్ వి. రామచంద్రంతో కలిసి శంకుస్థాపన చేశారు. క్యాంటీన్ పక్కన స్థలంలో ఈ భవనం నిర్మిస్తున్నారు. రూసా నిధుల ద్వారా సైన్స్ ప్రాజెక్టులు ఇప్పటికే ఆచార్యులకు కేటాయించారు. ఆ భవన నిర్మాణం పూర్తయ్యాక పరిశోధనలకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసి వినియోగంలోనికి తీసుకురానున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం, కేయూఅభివృద్ది అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్లాల్, సుదర్శన్, రమ, చిర్రరాజు, సుకుమారి, ఆచార్యులు నవీన్, రూసా నోడల్ ఆఫీసర్ మల్లికార్జున్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ.. రాళ్ల పాలు!
తొర్రూరు: టన్నుల కొద్దీ బరువు.. త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లు బండ రాళ్లు.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోని ఆ వాహనాలు దారి మధ్యలో దూసుకెళ్తుంటే.. వాటి ముందు, వెనుక ఉన్న ప్ర యాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. లారీల నుంచి రాళ్లు తమ మీద పడతాయేమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న లారీలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కళ్లముందే అజాగ్రత్తగా, ప్రమాదకరంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రవాణా, పోలీసు, మైనింగ్ శాఖలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో ఇలా... జిల్లాలో 167 బ్లాక్, కలర్ గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో 53 క్వారీల్లో గ్రానైట్ తీస్తున్నారు. నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం, ఇనుగుర్తి, గూడూరు మండలాల్లో ఉన్నాయి. వీటి నుంచి అధికంగా ఖమ్మంలోని గ్రానైట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఆర్డర్ల ఆధారంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి 45 నుంచి 55 టన్నులు, ట్రాక్టర్లో 5 టన్నుల రాయిని తరలించేందుకు గనులు, భూగర్భ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఇష్టారాజ్యంగా తరలింపు... అధిక లోడుతో పాటు ఒక నిర్ధిష్టమైన ఆకారంలో గ్రానైట్ను తరలించడం లేదు. క్వారీల నుంచి పరిశ్రమలకు తరలించే సమయంలో రాళ్ల ఎత్తుపల్లాలు సరిగా ఉండేలా కటింగ్ చేసి పంపించాలి. నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఎవరూ పట్టించుకోరని రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. సామర్థ్యాన్ని మించి రవాణా చేయడం వల్ల ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, నర్సింహులపేట, కేసముద్రం, గూడూ రు ప్రాంతాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. రహదారులు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులున్నాయి. ● ప్రస్తుతం పరిమితికి మించి 7–8 మెట్రిక్ టన్నుల రాళ్లను రవాణా చేస్తున్నారు. ● అనుభవం లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. ● పగలు రాత్రి తేడా లేకుండా, జనసంచారం, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే రహదారుల్లో భారీ వాహనాలు దూసుకెళ్తున్నాయి. ● చాలా వాహనాలు కండీషన్లో ఉండడం లేదు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారు. 2023 ఏప్రిల్లో తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో గ్రానైట్ లారీ ఢీకొని ఖమ్మంకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 2022 డిసెంబర్ 30న కురవి మండలం అయ్యంగారిపల్లిలో గ్రానైట్ లారీ నుంచి బండ జారి ఆటోపై పడి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 17న తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివారు జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ ఢీకొని 12 గొర్రెలు మృతి చెందాయి. ఈ నెల 21న తొర్రూరు బస్టాండ్ సమీపంలో గ్రానైట్ లారీ డివైడర్ను ఢీకొట్టగా డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్ల వారు జామున జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనలు పాటించని నిర్వాహకులు ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపులేని అధికారులు -
ప్రీ పీహెచ్డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఎస్.నర్సింహచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు. -
కార్తీకమాసం పూజలు ప్రారంభం
● నెలరోజుల పాటు ఆకాశ దీపాలు, దీపం పూజలు మహబూబాబాద్ రూరల్:శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ‘కార్తీక మాసం’ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. దేవాలయాల అర్చకుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఆకాశదీప పూజలు ప్రారంభించారు. దేవాలయాల్లో నెలరోజుల పాటు పూజలు జరగనున్నాయి. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం శివాలయాల్లో కార్తీక మాస అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, సాయంత్రం 6 గంటలకు ‘ఆకాశదీపం’ పూజలతో అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. వీరభద్రుడి సన్నధిలో.. కురవి:మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారికి బుధవారం కార్తీక మాసోత్సవ పూజలను అర్చకులు, వేదపండితులు ప్రారంభించారు. ఈ పూజలు నవంబర్ 20వ తేదీ వరకు నెలరోజులపాటు కొనసాగుతాయని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి తెలిపారు. కార్తీక మాసంలో నెలరోజులపాటు గోత్రనామార్చన చేయించుకోదలచిన భక్తులు రూ.1,116 చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈనెల 25న నాగులచవితి, శ్రీ సుబ్రహ్మణ్యాస్వామి వారికి ప్రత్యేక అభిషేకం ఉందని వివరించారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి దీపోత్సవం, సాయంత్రం జ్వాలాతోరణం ఉంటుందన్నారు. నవంబర్ 18న లక్ష బిల్వార్చన, రుద్ర, ఛండీ హోమాలు ఉంటాయని తెలిపారు. బయ్యారం: ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యవసాయశాఖ ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. బయ్యారంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ధాన్యం సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యంలో తేమ 17శాతం కంటే పెరగకుండా, ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలతో పాటు టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సన్మానం.. మండలంలో యూరియా పంపిణీలో భాగస్వాములైన పలు శాఖల అధికారులను మండల ప్రత్యేకాధికారి, ఏడీఏ శ్రీనివాసరావు సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఏఓ రాజు, గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సైలు తిరుపతి, మహబూబీ, ఐకేపీ ఏపీఎం తిరుమలసింగ్ తదితరులు పాల్గొన్నారు. మామునూరు: అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటా లియన్ ఆవరణలో పరిపాలన విభాగం అధి కారుల ఆధ్వర్యంలో ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్రెడ్డి హాజరై ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం పలు రకాల ఆయుధాలను ప్రదర్శించారు. విద్యార్థులకు అధునాతన ఆయుధాలు, వాటి పనితీరు, చట్టాలు, కేసులు, రికార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు. -
కొనుగోళ్లు ఆలస్యం..
సాక్షి, మహబూబాబాద్: కష్టాలకోర్చి పత్తి పండిస్తే ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. పత్తి తీసిన రైతులు ఇంట్లో ఆరబోస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తే అమ్ముదామని ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల ఇంటికి పత్తి.. గత పదిహేను రోజులుగా జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వానాకాలం జిల్లాలో మొత్తం అన్ని పంటలు కలిపి 3,59,775 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 84,858 ఎకరాల్లో పత్తి పంట వేశారు. అయితే కలిసి రాని కాలంతో పత్తి దిగుబడి సగానికి పడిపోయింది. వేల ఎకరాలు ఎర్రబారడంతో దున్ని మొక్కజొన్న వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎకరాకు సగటున 7.25 క్వింటాళ్ల దిగబడి వస్తందని, ఈ లెక్కన మొత్తం 6,14,561 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇందులో ఇప్పటికే రైతులు రెండు లక్షల క్వింటాళ్లకు పైగా తీసి ఆరబోసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. మరింత జాప్యం.. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22 నుంచి సీసీఐ కొనుగోళ్ల ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అదేశించినా.. జిల్లా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. రైతులు మోసపోకుండా ఉండేందుకు ఈ ఏడాది నుంచే రైతులే స్లాట్ బుకింగ్ చేసుకొని అమ్ముకునే విధంగా కొత్తయాప్ను రూపొందించారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని మరిపెడ, పడమటిగూడెం, పెద్దవంగర, మహబూబాబాద్, తొర్రూరు ప్రాంతంలో రెండు చొప్పున మొత్తం ఆరు జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే స్లాట్ బుకింగ్లో భాగంగా రైతుల ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకంలోని విస్తీర్ణం వివరాలతోపాటు వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ సందర్భంగా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారనే అంశాలు పొందుపర్చాలి. అయితే దీనిని జిన్నింగ్ మిల్లుల యజమానులు యాప్ ఇన్స్టాల్ చేసుకొని, వ్యవసాయశాఖ వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోలేదు. పత్తి కొనేందుకు ఏర్పాట్లు ప్రారంభించలేదు.సీసీఐ కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు, చిల్లర వ్యాపారులు ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించారు. సీసీఐ ద్వారా 8 నుంచి 12శాతం వరకు ఉన్న పత్తిని క్వింటాకు రూ.8,111 పెట్టి కొనుగోలు చేస్తారు. అదే ప్రైవేట్ వ్యాపారులు రకరకాల సాకులు చెప్పి తూకంలో మోసం చేసి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ. 6వేల వరకు ధర పెట్టి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు త్వరగా ప్రారంభిస్తే ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి గురికాకుండా రైతులను కాపాడవచ్చని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. కొత్త నిబంధనలతో కొనుగోళ్లలో జాప్యం ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయని జిన్నింగ్ మిల్లులు ఆలస్యం చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు పండుగ -
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
మహబూబాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అదనపు కలెక్టర్ అనిల్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నెలలు గడుస్తున్నా నేటికీ బకాయిలుు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, నిరంజన్రెడ్డి, మోహనాచారి, వెంకటేశ్వర్లు, వెంకన్న, ఇమామ్, రమేశ్బాబు, దర్గయ్య, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలు పెంచేవిధంగా ఉపాధ్యాయులు బోధించాలని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ, గుమ్ముడూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరుకావాలని, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. నాణ్యమైన భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీసి పోటీ పరీక్షల్లో పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు రాంజీనాయక్, బాలాజీ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో.. అనంతరం మోడల్ స్కూల్లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో డీఈఓ దక్షిణామూర్తి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ విజయ కుమారి, ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య, రిసోర్స్ పర్సన్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.డీఈఓ దక్షిణామూర్తి -
ఏజెన్సీ మండలాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
కొత్తగూడ: కొత్తగూడ, గంగారం మండలాల సమగ్రాభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పంచాయతీరాజ్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మండల కేంద్రంలో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పాకాల నుంచి కొత్తగూడ, గంగారం మండలాల్లో రెండు పంటలకు సాగు నీరు అందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని కొందరు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని వా రు, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులు అవుతారని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పొగుళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తిమ్మాపూర్లో సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. కొమురం భీం పోరాటమే స్ఫూర్తి.. గిరిజనులు స్వేచ్ఛగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారంటే కొమురం భీం లాంటి యోధుల పోరాటాల ఫలితమేనని మంత్రి సీతక్క అన్నారు. కొమురం భీం జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ కుల సంఘాల నాయకులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.మంత్రి ధనసరి సీతక్క -
మార్కెట్.. మక్కలమయం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బుధవారం అధికంగా మక్కలు వచ్చాయి. కాగా 12,112 బస్తాల (7,267 క్వింటాళ్ల) మక్కల క్రయవిక్రయాలు జరిగాయి. గరిష్ట ధర క్వింటాకు రూ.2,031, కనిష్ట ధర రూ.2,016 పలికిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. నేడు కొనుగోళ్లు బంద్.. వ్యవసాయ మార్కెట్ షెడ్లు మక్కలతో నిండి ఉన్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ అన్నారు. మక్కలు అధికంగా రావడం, అదే విధంగా వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు గురువారం మక్కల కొనుగోళ్లు బంద్ చేస్తున్నామన్నారు. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. 25న దడువాయి, హమాలీ, కూలీల సమావేశం.. వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న దడువాయిలు, హమాలీలు, చాటావాలాలు, ఇతర కూలీల సమావేశం ఈనెల 25న నిర్వహిస్తున్నామని మార్కెట్ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల, రైతు సంఘాల నాయకులు, హమాలీలు, చాటవాలాలు, కూలీలు, ముఠా సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. 28 నుంచి పత్తి కొనుగోళ్లు.. వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. రైతులు తమ పత్తిని తేమ, చెత్తా చెదారం లేకుండా శుభ్రపరిచి, గుడ్డి పత్తి, మంచిపత్తి వేర్వేరుగా బస్తాల్లో తీసుకుని వచ్చి మంచి ధరను పొందాలని ఆయన కోరారు. 7,267 క్వింటాళ్ల్ల విక్రయం నేడు మక్కల కొనుగోళ్లు బంద్ -
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
● నెలరోజుల పాటు శివ, కేశవ ఆలయాల్లో పూజలుమహబూబాబాద్ రూరల్: శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పట్టణంలోని శ్రీఉమాచంద్రమౌళీశ్వరాలయం, పార్వతి రామలింగేశ్వరాలయం, భక్తమార్కండేయ శివాలయం, వేంకటేశ్వరబజార్లోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నెలరోజులపాటు కార్తీక మాస పూజలు జరుగనున్నాయి. అదే విధంగా సీతారామ చంద్రస్వామి వారి దేవాలయం, శ్రీవేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కూడా కార్తీక మాస పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో శివుడికి భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని ఆయా దేవాలయాల అర్చకులు రంగావఝుల సుధాకరశాసీ్త్ర, అన్నావఝుల యుగంధర్ శర్మ, ఎంవీ కృష్ణప్రసాద్, సత్యంగౌతం మహారాజ్ జీ తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శివాలయాల్లో కార్తీక మాస అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక మాస ప్రారంభం సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీఆకాశదీపశ్రీ పూజలతో భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ శనివారం నాగుల చవితి పండగ ఉంటుందన్నారు. ఆ రోజున పుట్టల్లో పాలు పోయడం, సుబ్రమణ్యేశ్వరస్వామికి అభిషేకాలు చేయడం శుభసూచకమని తెలిపారు. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో లఘున్యాసపూర్వక, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి భక్తులు పూజలు నిర్వహించడం ద్వారా వారికి ఉన్న రాహు, కేతు, కుజ దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. -
ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ విద్యు త్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కోకన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ కోరారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డికి డిమాండ్ల నోటీసు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23, 667 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. ఎని మిది సంవత్సరాలుగా ఆర్టిజన్లకు ప్రయోజనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాంత్, జి.అనంత రెడ్డి, మహేందర్ గౌడ్, బి.శ్రీనివాస్, కలకోట అశోక్, చింతలపూడి సతీశ్ కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ వినతి -
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతోన్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఆసక్తి గల పౌల్ట్రీ ఫాం యజమానుల నుంచి టెండర్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. http:// tendertelangana.gov.in వెబ్సైట్లో టెండర్ పాసెసింగ్ ఫీజు రూ.10,000 చెల్లించాలని తెలిపారు. టెండర్ ఫీజు సదరు వ్యక్తులకు తిరిగి చెల్లించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. Dist.SCDevelopmentOfficer, మహబూబాబాద్ పేరు మీద డీ.డీ. చెల్లించాలని, http://tender.telangana.gov.in వెబ్సైట్లో టెండరును దాఖలు చేయాలని తెలిపారు. అగ్మార్క్ నియమాల ప్రకారం గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. 21–10–2025న నిర్వహించే ప్రీ బిడ్ సమావేశం 23వ తేదీన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 93901 15539, 91822 04529 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ సిటిజన్ సర్వేలో పాల్గొనాలి మహబూబాబాద్: తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని జిల్లా పౌరసంబంధాల అధికారి రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ సర్వేలో కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని విలువైన సమాచా రాన్ని అందించినట్లు తెలిపారు. స్వతంత్ర భారత్గా ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వే చేపట్టిందని తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ సర్వేలో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రధానంగా యువత ఈ సర్వేలో పాల్గొని దేశం, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్కు సూచనలు సలహాలు అందించాలని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి వెల్నెస్ సెంటర్ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని విద్యార్థులకు, అధ్యాపకులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యానికి వెల్నెస్ సెంటర్ తోడ్పడుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్, బెంగుళూరు హార్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను మంగళవారం బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వెల్నెస్ సెంటర్ను వినియోగించుకోవాలని ఈసందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ అండ్ ప్లేస్మెంట్స్ బాధ్యులు మహ్మద్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని తొర్రూరు బాలికలు –1 గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (1), జూనియర్ లెక్చరర్ జువాలజీ (1), డోర్నకల్ గురుకుల పాఠశాల బాలికలు –1లో టీజీటీ మ్యాథ్స్ (1) పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులు ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మహబూబాబాద్లోని పాత కలెక్టరేట్ కార్యాలయం రోడ్డు, నూర్ మసీదు కాంప్లెక్స్ వద్ద ఏజెన్సీ కార్యాలయంలో లేదా, 90521 74603 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు స్వామి వారి కల్యాణం రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (బుధవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
రెండేళ్ల పాపపై కుక్క దాడి
గార్ల: రెండేళ్ల పాపపై కుక్క దాడి చేసి తల, ముఖంపై తీవ్రంగా గాయపర్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సరిహద్దుతండాకు చెందిన రెండేళ్ల భూక్యా హేమశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వీధికుక్క పాపను కిందపడేసి తల, ముఖంపై తీవ్రంగా గాయపర్చింది. పాపను కు టుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగారు. వైద్యసిబ్బంది ప్రథమచికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హనుమకొండలో ఏడుగురికి గాయాలు.. హన్మకొండ: వరంగల్ మహానగరపాలక సంస్థ 57వ డివిజన్ హనుమకొండ గాంధీనగర్ వాసులపై దీపావళి రోజు సోమవారం రాత్రి వీధికుక్కల గుంపు దాడి చేసింది. మొత్తంగా ఏడుగురికి గాయాలయ్యాయి. వారు ఎంజీఎంలో చికిత్స పొందారు. కుక్కలు కరిచిన విషయాన్ని గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరుకు వెంకట రాజిరెడ్డి స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూపరాణిలు.. మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం బల్దియా సిబ్బంది కుక్కలను పట్టుకెళ్లారు. కొన్ని వలకు చిక్కకుండా తప్పించుకున్నాయని కాలనీ వాసులు తెలిపారు. మంగళవారం బాధితులను గాంధీనగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరామర్శించారు. కట్య్రాలలో బాలికకు.. వర్ధన్నపేట: వీధి కుక్కల దాడిలో ఓ బాలికకు గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండలంలోని కట్య్రాలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక కట్ట వాగ్దేవి తన ఇంటి ఎదుట ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలిక వెంట పడి దాడికి పాల్పడగా గాయపడింది. కాగా, ఈ ఘటనను స్థానికులు చూసి కుక్కలను తరమడంతో బాలిక ప్రాణం దక్కింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాలికను వెంటనే వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. బాలికకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, రోజురోజుకూ గ్రామంలో వీధి కుక్కల బెడద పెరుగుతోందని, దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తల, ముఖంపై తీవ్రగాయాలు -
జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?
ఎస్ఎస్తాడ్వాయి: అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తిచేయడంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులపై మంత్రులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా మేడారాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ విస్తరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం పనులు సాగుతున్నాయనే తప్ప తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి పనులు ఇంకా ప్రారంభం కాని పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి హడావుడిగా పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరి కోతలపై ఆధారపడి ఏర్పాట్లు! పనులకు అవసరమైన భూములు ఇప్పటికే వరిసాగులో ఉండటంతో తాత్కాలికంగా వసతులు, తాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు జీఐ షీట్స్ మరుగుదొడ్ల నిర్మాణం వంటి కీలక పనులకు ఆటంకం కలగనుంది. పనుల కోసం అవసరమైన భూముల్లో సాగు చేసిన వరిపంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ పనులు పూర్తయితేనే ముందుకు సాగే పరిస్థితి ఉంది. ఈసారి భారీ వరదల కారణంగా మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లోని వరినాట్లు వేయడం ఆలస్యమైంది. మహాజాతర వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో జరగనుండడంతో సంక్రాంతి పండుగ నాటికి కూడా వరి కోతలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వరి కోతలు పూర్తయినా భూములు పదునుగా ఉంటే పార్కింగ్ స్థలాల ఏర్పాట్ల పనులకు ఆటంకం ఎదురుకానుంది. అనంతరం మిగిలే సమయంలో అన్ని పనులను పూర్తి చేయడం సవాల్గా మారనుంది. తాగునీటి ఏర్పాట్లు కీలకం మేడారం జాతరలో తాగునీటి ఏర్పాట్లు కీలకం కానుంది. వరి కోతలు పూర్తయ్యే వరకు తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, మొదలయ్యే స్ధితిలో కూడా లేవు. తాగునీటి పనుల ఏర్పాట్లకు అవకాశం అధికారులు ఊసేలేదు. అంతేకాకుండా తాగునీటి పైపులైన్లు కూడా రైతుల భూముల్లో నుంచి ఏర్పాటు చేసి బ్యాటరీ ఆప్ ట్యాబ్లకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. ఈపనులు కూడా వరి కోతలు అయిన తర్వాతే మొదలు కానున్నాయి. మరుగుదొడ్ల పనుల ఊసేలేదు.. జాతరలో భక్తుల సౌకర్యార్థం కోసం వేల సంఖ్యలో తాత్కాలికంగా జీఐ షీట్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల పనులకు గత కొద్ది రోజుల క్రితం టెండర్లు కూడా పూర్తయ్యాయి. వరి సాగులో ఉండటంతో మరుగుదొడ్ల ఏర్పాట్ల పనులు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ వైంజక్షన్, చిలకలగుట్ట, కొంగల మడుగు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలి. లేదంటే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు అసౌకర్యానికి గురికాక తప్పదు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి..మేడారం మహాజాతర సమయం దగ్గర పడుతోంది. అమ్మవార్ల గద్దెల విస్తరణ పునర్నిర్మాణం పనులు మాత్రమే మొదలయ్యాయి. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల పనులు ప్రారంభం కాలేదు. ఈసారి జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనాలకు తగినట్లుగా అభివృద్ధి పనులు చేయాలి. భక్తులు అసౌకర్యాలకు గురికాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి, మేడారం సమీపిస్తున్న మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణం పనులు మినహా మొదలు కాని జాతర పనులు మంత్రులు ఆదేశించినా మారని అధికారులు తీరు -
జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం
ఖిలా వరంగల్ : వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటోస్టాండ్ వద్ద సోమవారం అర్ధరాత్రి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసమైంది. మద్యం మత్తులో సంచరిస్తున్న ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం పూలే విగ్రహం ధ్వంసమైన విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి, స్థానికులు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సిబ్బందితో కలిసి వారు ఘటనాస్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి, తర్వాత సమీపంలోని రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసి వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఉర్సు కరీమాబాద్ వెంకటేశ్వర స్కూల్ లేన్కు చెందిన రాహుల్ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, మద్యం మత్తులోనే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. నల్ల కండువాలతో నిరసన ధ్వంసమైన జ్యోతిబా పూలే విగ్రహాన్ని పలు సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పరిశీలించి ఘటనను తీవ్రంగా ఖండించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పూలే విగ్రహ కమిటీ ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ నల్లకండువాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ వన్నాల వెంకటరమణ, బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, పూలే, అంబేడ్కర్ వాదులు ధ్వంసమైన విగ్రహాన్ని సందర్శించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్, వర్కింగ్ చైర్మన్ దొడ్డపల్లి రఘుపతి, సభ్యులు కురుమిళ్ల శ్రీనివాస్గౌడ్, చాగంటి రమేశ్, సమ్మయ్య, పూజారి విజయ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి ధ్వంసమైన చోటే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఘటనా స్థలిని సందర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యం మత్తులో యువకుడి ఘాతుకం ఘటనాస్థలిని సందర్శించిన పలు సంఘాల ప్రతినిధులు -
కోతులతో పరేషాన్
● ఇళ్లు, పంటల ధ్వంసం ● బెంబేలెత్తుతున్న జనంకురవి: కురవి, సీరోలు మండలాల్లోని అనేక గ్రామాల్లో కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందలాది కోతులు(వానరాలు) నానా విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రజలు కొత్తరకం సమస్యతో సతమతమవుతున్నారు. కోతులను పట్టించాలనే డిమాండ్ ఊరూర పెరుగుతోంది. కోతులతో ఇళ్లల్లో ఉండలేని దుస్థితి నెలకొంది. కురవి మండల కేంద్రంలో వీరన్న సన్నిధి, సంత ఉండడంతో కోతులు విపరీతంగా ఉన్నాయి. వందలాది కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు కరవడం వల్ల అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. జనం ఇళ్లలో వంటలు వండుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఏటేటా కోతులు పెరిగిపోతుండడంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజలకు తోడు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి చేతికొచ్చిన పత్తి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రోజంతా పొలాలు, చేలల్లో రైతులు కాపాలా ఉన్నా పంటలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు కోతులను పట్టించాలని ఊరూర డిమాండ్ ఎక్కువ అవుతోంది. కోతులను పట్టిస్తేనే బతికే అవకాశం ఉందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఊరూర కోతులను పట్టిస్తేనే ఎన్నికల్లో ఓట్లేసే పరిస్థితికి రాబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ● జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా పోలీసు ఫ్లాగ్ డేమహబూబాబాద్ రూరల్ : ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్తూపానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలవేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడుతుందన్నారు. పోలీసు అమరుల ప్రాణత్యాగాల వల్ల నేడు ప్రజలంతా సంతోషంగా ఉండగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరేలా చేయడం, వారి కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపడం పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, గండ్రతి మోహన్, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయప్రతాప్, సీఐలు, ఆర్ఐలు ఎస్సైలు, డీపీఓ అధికారులు పాల్గొన్నారు. -
జంపన్నవాగులో సాయిగౌతమ్ మృతదేహం లభ్యం
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం జంపన్నవాగులో ఓ బాలుడి మృతదేహం ఈనెల 20న లభ్యమైంది. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు ఎస్సీ కాలనీకి చెందిన దానూరి సాయిగౌతమ్(17)గా పోలీసులు గుర్తించారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దానూరి సాయిగౌతమ్తోపాటు మరికొంతమంది కలిసి ఈనెల 12న అమ్మవార్ల దర్శనం కోసం మేడారం వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వంటావార్పు చేసుకుని స్నానాల కోసం ఊరట్టం కాజ్వే వద్ద జంపన్నవాగులోకి దిగారు. సాయిగౌతమ్ వాగు అవతలివైపు ఒడ్డుకు వెళ్లాడు. మిగతా వాళ్లు అటువైపు ఎందుకు వెళ్తున్నావంటూ అడగా మలవిసర్జనకు వెళ్లొస్తానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా ఆచూకీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఈనెల 19న మేడారానికి వచ్చి గౌతమ్ ఆచూకీ కోసం వెతుకులాడుతున్న క్రమంలో 20న ఊరట్టం కాజ్వే వద్ద జంపన్నవాగులో సాయిగౌతమ్ మృతదేహం తేలింది. రెస్క్యూటీం బయటకు తీశారు. ప్రమాదవశాత్తు సాయిగౌతమ్ వాగులో పడి మృతి చెందినట్లు సోదరుడు సాయిగణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మృతుడిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
నాణ్యతపై నజర్
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలోని పల్లెల్లోనే సంపద సృష్టించాలి. ఇందుకోసం కులవృత్తులను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే చేపపిల్లలను కొనుగోలు చేసి మత్స్యపారిశ్రామిక సంఘాల సమక్షంలో చెరువుల్లో విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈ పంపిణీలో పలు అవకతవకలు జరిగినట్లు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పిల్లలు నాసిరకంగా ఉన్నాయని.. లెక్కల్లో తేడా ఉందని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చేపపిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో గత అనుభవాలను తలచుకుంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన చేపపిల్లలను చెరువుల్లో వదిలి తమ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంపిణీకి అధికారుల కసరత్తు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తొందరగానే కురిశాయి. చెరువుల్లో నీరు చేరగానే చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, టెండర్ల ప్రక్రియతో ఆలస్యం అయింది. మత్స్యకారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని చేపపిల్లల పంపిణీకి కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,357 చెరువులు చేపపిల్లలు వదిలేందుకు అనువైనవిగా గుర్తించారు. 35–40, 80–100 సైజు మొత్తం 8,386.24 లక్షల చేపపిల్లలు, రొయ్యలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించారు. దీంతో జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల సమయం తీసుకొని చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో ఆరోపణలు గతంలో ఉత్పత్తి చేసే కేంద్రాలు లేకపోయినా.. కొందరు కాంట్రాక్టర్లు వేరే హేచరీలను చూపించి కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం కాకుండా నాసిరకం పిల్లలు పంపిణీ చేశారని, దీంతో పలు చెరువుల్లో ఆరు, ఏడు నెలలు గడిచినా.. చేపలు 500 గ్రాముల సైజుకు కూడా రాలేదనే ఆరోపణలు మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చేపపిల్లలను చెరువుల్లో విడిచే సమయంలో తక్కువ పిల్లలు పోసి లెక్కలు ఎక్కువ చూపించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అయితే వీటిని పరిశీలించాల్సిన అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం, ముడుపులు తీసుకొని చూసీ చూడనట్లు ఉన్నారనే ఆరోపణలు కూడా మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. నాసిరకం చేపపిల్లలు.. లెక్కల్లో తేడాలు.. ఎదగని పిల్లలతో మత్స్యకారుల ఇబ్బందులు గత అనుభవాలతో మత్స్యకారుల ఆందోళన ప్రస్తుతం చేపపిల్లల ఉచిత పంపిణీకి కసరత్తుజిల్లా చెరువులు చేపపిల్లలు నిధులు (లక్షల్లో) (రూ.లక్షల్లో) మహబూబాబాద్ 1,233 421.68 492.38 జనగామ 732 272.72 319.42 జేఎస్ భూపాలపల్లి 837 276.47 276.50 ములుగు 470 157.55 172.42 వరంగల్ 703 190.06 193.08 హనుమకొండ 810 220.55 227.52 మొత్తం 4,785 1539.03 1681.32నాణ్యత పరిశీలించాలి ఆగస్టు నెలలో చేపపిల్లలు చెరువుల్లో పోస్తే వర్షం నీరు, పొలాల నుంచి వచ్చే మురుగు నీరు చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదల ఉంటుంది. కానీ ఇప్పుడు ఆలస్యం అయింది. అయినా పిల్లల నాణ్యతను పరిశీలించి చెరువుల్లో పోయాలి. – కొత్తూరు రమేష్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చీఫ్ ప్రమోటర్లెక్కలు సరిగ్గా చూడాలిగతంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేపపిల్లలు నాసిరకంతోపాటు లెక్కల్లో కూడా తేడాలు వచ్చాయి. తక్కువ చేపపిల్లలు పోసి ఎక్కువ లెక్కలు చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఈసారి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లెక్కల్లో తేడా రాకుండా చూడాలి. – సింగాని అశోక్, మత్స్య పారిశ్రామిక సంఘం, మహబూబాబాద్ -
కిరాణా షాపులో చోరీ
● రూ.1.80లక్షల విలువైన వస్తువుల అపహరణకేసముద్రం: మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ కిరాణం షాపు(హోల్సేల్)లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.1.80 లక్ష విలువైన వస్తువులను అపహరించిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చో టుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. కేసముద్రం మున్సిపాలిటీ మార్కెట్ రోడ్డులోని మాచాముండా కిరాణం షాపు(హోల్సేల్)కు సోమవారం రాత్రి ఎప్పటిలాగే తాళం వేసి వ్యాపారులు వెళ్లిపోయారు. అర్థరాత్రి దాటాక గుర్తు తెలి యని వ్యక్తులు షాపు వెనుక నుంచి తాళం పగులగొట్టుకుని లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత షాపు ముందు డోర్ వేసిన తాళాన్ని పగులగొట్టారు. మొ త్తంగా రూ.లక్ష విలువైన సిగరేట్ కాటన్లు, డెస్క్ లో ఉన్న చిల్లర డబ్బులను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం షాపు యజమాని దేవాశీ పే రాజా రాం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ముగ్గురు వ్యక్తులుగా ఆ పుటేజ్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడే ముందు కొన్ని సీసీ కెమెరాలను ఆ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాగా వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు. -
టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ
హన్మకొండ: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కన్వీనర్లుగా శ్రీకాంత్, డి.రవీందర్రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం తెలిపారు. కోకన్వీనర్గా జి.అనంతరెడ్డి, కో చైర్మన్గా టి.తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్గా మహేందర్ గౌడ్, కోశాధికారి అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్కుమార్ ఎన్నికయ్యారని వివరించారు. కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. అక్టోబర్ 23, 28వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) వీక్లీ ఎక్స్ప్రెస్, అక్టోబర్ 24, 29వ తే దీల్లో దానాపూర్–చర్లపల్లి (07092) వీక్లీ ఎక్స్ప్రెస్, అక్టోబర్ 26వ తేదీన చర్లపల్లి–దానా పూర్ (07049) వీక్లీ ఎక్స్ప్రెస్, అక్టోబర్ 27వ తేదీన దానాపూర్–చర్లపల్లి (07050) వీక్లీ ఎక్స్ప్రెస్లు కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, త్రిటైర్ ఏసీ, స్లీపర్క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో వెళ్లే ఈ ఎక్స్ప్రెస్ రైళ్లకు చర్లపల్లి–దానాపూర్ మధ్య కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, జబల్పూర్, కాట్ని, మహియర్, సంత, ప్రయాగ్రాజ్ చోకి, పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. అడవి బర్రె దాడిలో మేకల కాపరి మృతికొత్తగూడ: అడవి బర్రె దాడిలో మేకల కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18వ తేదీన కార్లాయి గ్రామానికి చెందిన కల్తి గోవిందు(50) మేకలు మేపేందుకు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం మేకలు మాత్రమే ఇంటికి వచ్చాయి. దీంతో గోవిందు కోసం బంధువులు అటవీ ప్రాంతంలో వెతకగా మంగళవారం ఉదయం గోవిందు మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గోవిందు మృతదేహానికి సమీపంలో అడవి బర్రె పిల్ల పాము కాటుతో మృతిచెంది ఉంది. గోవిందు కడుపు పగిలి పేగులు బయటకు వచ్చి ఉన్నాయి. తన పిల్లకు ప్రమాదం జరిగిందనే కోపంతో అడవి బర్రె దాడి చేసి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించారు. కారు, బైక్ ఢీ.. ● యువతి దుర్మరణం ● మల్కపల్లి వద్ద ఘటన కన్నాయిగూడెం: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని సర్వాయి జీపీ పరిధి మల్కపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. మండలంలోని సర్వాయి జీపీ పరిధి చిట్యాల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని బొచ్చక సింధూజ(17) దుస్తులు కొనుగోలు చేయడానికి గ్రామస్తుడు మడె కృష్ణారావు బైక్పై ఏటూరునాగారం వెళ్తోంది. ఈ సమయంలో ఇదే మండలం ముప్పనపల్లికి చెందిన నామని మురళి కారులో చిట్యాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్కపల్లి వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న సింధూజకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉత్సాహంగా ‘దీపావళి’ బతుకమ్మ
హసన్పర్తి : మండలంలోని సీతంపేట గ్రామంలో దీపావళి బతుకమ్మ వేడుకలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన నేతకాని కులస్తులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతకాని కులస్తులు ఇక్కడి వస్తారు. ఉత్సవాలను పురస్కరించుకని తొలిరోజు చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టిని సేకరించారు. ఆ మట్టిని ఇంటికి తీసుకొచ్చి జోడెద్దుల రూపం(దేవతామూర్తుల ప్రతిమలు) తయారు చేశారు. గారెలతో వాటిని అందంగా అలంకరించారు. బుధవారం పురుషులు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. జోడెద్దుల ప్రతిమలతో భారీ ప్రదర్శనగా వెళ్లి వాటిని స్థానిక చెరువులో నిమజ్జనం చేయడం ఇక్కడి నేతకాని కులస్తుల సంప్రదాయం. రేపు బతుకమ్మ వేడుకలు గురువారం దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు బతుకమ్మలతో భారీ ప్రదర్శగా వెళ్తారు. పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకుని మహిళలను అనుసరిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎంపీఓ కరుణాకర్రెడ్డి తెలిపారు. నేడు కేదారేశ్వర వ్రతం రేపు బతుకమ్మ నిమజ్జనం -
ప్రజాచైతన్యానికి ‘వల్లంపట్ల’ కృషి
విద్యారణ్యపురి: వల్లంపట్ల నాగేశ్వర్రావు తన జీవి త కాలమంతా కవిగా, కళాకారుడిగా, సామాజిక స్పృహ.. హేతువాద దృక్పథంతో ప్రజాచైతన్యం కోసం విశేషంగా కృషిచేస్తున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ కొని యాడారు. సోమవారం హనుమకొండలోని టీచర్స్కాలనీ ఫేజ్–1లో వల్లంపట్ల నాగేశ్వర్రావు 70 వ సంతాల జన్మదిన వేడుకల చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘వల్లంపట్ల సప్తతి నవ సమాజ జాగృతి’ అనే శీర్షికన సంవత్సరం పాటు జరుగనున్న చైతన్య కార్యక్రమాల పోస్టర్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకు వల్లంపట్ల రూపొందించిన సాహిత్యం కళారూపాలు ప్రాచుర్యం పొందాయన్నారు. కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడు బన్నఅయిలయ్య మాట్లాడుతూ అర్ధశతాబ్ద కాలంగా వల్లంపట్ల సృజించిన సాహిత్యం పేరెన్నికగన్నది అన్నారు. నవతరం నిర్మాణం కోసం తనవంతు కృషిని అలాగే కొనసాగిస్తానని వల్లంపట్ల నాగేశ్వర్రావు తెలిపారు. ప్రగతి మిత్ర అధ్యక్షుడు రాంరెడ్డి, టీచర్స్ కాలనీ కమిటీ బాధ్యులు డోలిరాజలింగం, సత్యనారాయణ, ఇమ్మడి పుల్లయ్య, రతన్సింగ్, హరినాథరావు, కవులు, రచయితలు కృష్ణమాచారి, పురుషోత్తం, మహేందర్, శంకర్రావు, వల్స పైడి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ -
వైభవంగా దీపావళి వేడుకలు
● మహాలక్ష్మీదేవి నమోస్తుతే.. ● భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు ● బాణసంచాతో చిన్నారుల సంబురాలుమహబూబాబాద్ రూరల్: దీపావళి పండుగను సోమ, మంగళవారాల్లో జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఈ సందర్భంగా దీపం పూజలు, శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారి పూజలు, కేదారేశ్వర వ్రతాలను వైభవంగా ఆచరించారు. సిరులను కురిపించే శ్రీలక్ష్మీదేవి అమ్మవారు సుఖసంతోషాలు కలుగజేయాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో పసుపు కుంకుమలు చల్లి, నూతన కరెన్సీ నోట్లు, పలు రకాల పిండి వంటలు నైవేధ్యగా సమర్పించి పూజలు నిర్వహించారు. మార్వాడిల ఇళ్లలో సర్వాంగ సుందరంగా దీపాలంకరణలు చేశారు. పూజల అనంతరం టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను సంబురంగా జరుపుకున్నారు. దుకాణాలు, ఇళ్ల ఎదుట కొబ్బరి, అరటి, విద్యుత్ దీపాలతో అలంకరణలు ఏర్పాటుచేశారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
● మనస్తాపంతో భర్త ఆత్మహత్య గణపురం: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని నగరంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగ నరేశ్(35)కు జిల్లా కేంద్రంలోని భాస్కర్గడ్డకు చెందిన భాగ్యలక్ష్మితో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరుగడంతో భాగ్యలక్ష్మి తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 19న భార్యను తన ఇంటికి తీసుకురావడానికి నరేశ్ తన అత్తగారింటికి వెళ్లాడు. ఈక్రమంలో ఆమె నిరాకరించడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ ఘటనపై మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం బస్వరాజుపల్లి సమీపంలోని ఓ కుంటలో చేపల పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు నరేశ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రేఖ అశోక్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం
మామునూరు: శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి, పోలీసు శిక్షణ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కె. రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరులోని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్, పోలీసు శిక్షణ కళాశాలలో వేర్వేరుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపాల వద్ద సిబ్బందితో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రక్షణలో అసువులు బాసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధినిర్వహణలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను నేటి పోలీసులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తీవ్రవాదుల దుశ్చర్యలతో దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, విజయ్, భిక్షపతి, సోమాని, ఏఓ కల్పనారెడ్డి, ఆర్ఐ చంద్రశేఖర్, మహేశ్, నవీన్, డాక్టర్ సుధీర్, పీఆర్ఓ రామాచారి, టీజీఎస్పీఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్రావు, ఆర్ఐలు విజయ్, కార్తీక్, రవి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి , పీటీసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రమేశ్ -
ఇబ్బందులకు గురిచేయడం సరికాదు..
వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సాక్షి జర్నలిస్టులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదు – పర్శిక సతీశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్: జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాక ముందే వానాకాలం (ఖరీఫ్) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగానే కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ పూర్తి చేసి అన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 242 కేంద్రాలు.. జిల్లాలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 59 కేంద్రాలు, పీఏసీఎస్ 168, జీసీసీ 13, మెప్మా ఆధ్వర్యంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పాత పద్ధతి ప్రకారమే ముందుగా ఏఈఓ తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతనే కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంక్ఖాతా పుస్తకం జిరాక్స్లను కేంద్రాల నిర్వాహకులకు అందజేయాలి. వారు వివరాలను నమోద్ చేస్తారు. కామన్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,389 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సన్నధాన్యానికి అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ను ప్రభుత్వం అందజేస్తుంది. సేకరణ లక్ష్యం.. జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, టెంట్, విద్యుత్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగొద్దని కలెక్టర్ హెచ్చరించిన నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ పూర్తి.. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17న ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ట్యాబ్లలో నమోదు ఆలస్యం కావొద్దని, కాంటాలు, తరలింపు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ అద్వైత్కుమర్ ఈనెల 15,16 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండడంతో కేంద్రాల విషయంలో ఎలాంటి పొరపాటు జరగొద్దని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. యూరియా కొరతతోనే రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో కొనుగోలు విషయంలో సమస్య రావొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణకు త్వరలోనే ఏర్పాట్లు కొనుగోళ్లపై కలెక్టర్ పలుమార్లు సమీక్షలు నిర్వాహకులు, ఆపరేటర్లకు శిక్షణ పూర్తి 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంఅందుబాటులో 28లక్షల గన్నీ బ్యాగులు.. జిల్లాలో 28 లక్షల గన్నీ బ్యాగులు, 10,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో 62 మిల్లులు ఉండగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన వారికి మాత్రమే ధాన్యం తరలిస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంకా మిల్లుల కేటాయింపు జరగలేదు. ప్రధానంగా ట్యాబ్లలో నమోదు, కాంటాలు, ధాన్యం తరలింపు, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కాకముందే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. -
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్లో 1,577, వరంగల్ రూరల్లో 910, జనగామలో 950, మహబూబాబాద్లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. జిల్లాల వారీగా 2023–25, 2025–27 సంవత్సరాల్లో దరఖాస్తులు, ఆదాయం వివరాలు జిల్లా వైన్స్ 2023–25 ఆదాయం 2025–27 ఆదాయం దరఖాస్తులు (రూ.కోట్లలో) దరఖాస్తులు (రూ.కోట్లలో) వరంగల్ అర్బన్ 67 5,859 117 3,012 90.3 వరంగల్ రూరల్ 57 2,938 58 1,826 54.7 జనగామ 50 2,492 49 1,587 47.6 మహబూబాబాద్ 61 2,589 51 1,672 50 .1 భూపాలపల్లి 59 2,161 43 1,657 49.7 మొత్తం 294 16,039 318 9,754 292.4ఉమ్మడి జిల్లాలో తగ్గిన వైన్స్ దరఖాస్తుల ఆదాయం 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వందరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే.. వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది.


