Mahabubabad District News
-
వర్షాలు వచ్చేనాటికి మరమ్మతులు చేయాలి
మా గ్రామంలోని పెద్ద చెరువు, పక్కన ఉన్న రావిరాల పెద్ద చెరువు కట్టలు పూర్తిగా తెగిపోయి. ఇప్పటికి రెండు పంటలు లాస్ అయ్యాం. చెరువు కట్ట కింద వందల మంది రైతులు వేల ఎకరాల్లో సాగు ఆగమైపోయింది. ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. తెగిపోయిన చెరువులను తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు ఇంకిపోయి చెరువు కిందే కాకుండా చుట్టుపక్కల కూడా పంటలు పండే పరిస్థితి లేదు. – రాపాక వీరభద్రయ్య, రైతు, సీతారాంపురం -
వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: లక్ష్మీనృసింహుడి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మహోదయ నగర్ కాలనీలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం స్వామివారు, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోతురాజు రాజు, బూర వెంకన్న, భక్తులు పాల్గొన్నారు. అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లుఅదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మహబూబాబాద్: ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, రవాణా జరుగుతోందని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట లారీలను సిద్ధంగా ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంటా వేసి ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదేశాలు జారీ చేస్తూ, పర్యవేక్షిస్తున్నామన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలినెహ్రూసెంటర్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి రవి, బిల్లకంటి సూర్యం ఆదివారం అన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కార్మిక ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ పూజలు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ ఈఓ ఎస్.మహేష్ స్వామివారి శేషవస్త్రాలతో వారిని సన్మానించగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు. -
జీజీహెచ్లో శిశువు మృతి
నెహ్రూసెంటర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం నవజాత శిశువు మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాకు చెందిన నూనావత్ భువనేశ్వరికి పురిటినొప్పులు రాగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు.. భువనేశ్వరికి స్కానింగ్ చేసి శిశువు కడుపులోనే మృతి చెందినట్లు చెప్పారు. నార్మల్ డెలివరీ చేసి శిశువును బయటకు తీసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కాగా, మూడు రోజుల క్రితం ఆస్పత్రికి వస్తే బాగానే ఉన్నారని వైద్యులు చెప్పారని, ఇప్పుడు శిశువు ఎందుకు మృతి చెందాడని వైద్యులను నిలదీశారు. ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్ను వివరణ కోరగా జన్యుపరమైన కారణాలతో శిశువు కడుపులోనే మృతి చెందాడని, వైద్యుల నిర్లక్ష్యమేమి లేదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలి
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏటివద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి ప్రారంభించారు. ఈ దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 40ఏళ్లుగా పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని రాంపురం, మద్దివంచ పంచాయతీల ప్రజలు ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేపట్టినా పాలకులు, అధికారుల్లో చలనం రావడం లేదన్నారు. పాకాల ఏటిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతీఏటా వర్షాకాలంలో సుమారు 20 గ్రామాల ప్రజలు వరద ఉధృతితో మండల కేంద్రానికి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, టీజేఎస్, టీవీవీ పార్టీల నాయకులు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు. దీక్షలో నాయకులు జంపాల వెంకన్న, రాగం రమేశ్, జనార్దన్, మాగం లోకేష్, రమేశ్, నాగేష్, వీరన్న, వెంకటేష్ పాల్గొన్నారు. -
మెరిసిన రైతు బిడ్డ..
● స్టేట్ 404వ ర్యాంకు సాధించిన స్వాతి నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఎప్సెట్ ఫలితాల్లో రైతు బిడ్డ మెరిసింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర స్వాతి 97.26 మార్కులు సాధించి స్టేట్ 404 ర్యాంకర్గా నిలిచింది. గ్రామానికి చెందిన బొమ్మెర ఉప్పలయ్య, సారమ్మ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. తమకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. స్వాతి 10వ తరగతి కల్లెడలోని ఆర్డీఎఫ్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ కల్లెడలోని వీఏపీవి కళాశాలలో చదివింది. కాగా, డాక్టర్ కావడమే తన లక్ష్యమని స్వాతి తెలిపింది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు స్వాతిని అభినందించారు. -
పూర్వం గుహలో సరస్వతి అమ్మవారు..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధదేవాలయం శ్రీసరస్వతి అమ్మవారు పూర్వం సొరంగలోని ఓ గుహలో ప్రతిష్ట చేసి ఉండేదని పురాణాల ద్వారా తెలిసింది. సొరంగ మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవారట. ఆ కాలంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో సూర్యరశ్మి, నూనె దీపాల వెలుగుల్లో వెళ్లి దర్శించుకునేవారు. ఆ అమ్మవారి విగ్రహం భిన్నమై, ఆలయం శిథిలావస్థకు చేరింది. శృంగేరి పీఠాధిపతులు, శారదపీఠాధిపతులు దక్షిణ భారతదేశం పర్యటనలో కాళేశ్వరం మీదుగా వచ్చినప్పుడు గ్రామస్తుల ద్వారా తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1976 తర్వాత జీర్ణోద్దరణ జరిగిన అనంతరం అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు చొరవతో దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతీ వసంత పంచమి రోజు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, దేశంలో సరస్వతి ఆలయాలు కాళేశ్వరంలోని మహాసరస్వతి, బాసరలోని జ్ఞానసరస్వతి, కాశ్మీర్లోని బాలసరస్వతి విశిష్టత కలిగినవి. ఈ క్రమంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. ఆదివారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ(వీఐపీ)ఘాట్ సరస్వతీమాతా విగ్రహం, జ్ఞానదీపం, నదిలో భక్తుల స్నానమాచరించే ప్రదేశం, టెంట్ సిటీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టెంట్సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, మీరే జవాబు చెప్పాలన్నారు. గ్రామం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేయాలన్నారు. 12 రోజులు పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిండ ప్రదాన భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్లడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతోపాటు క్వియర్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నది వద్ద 50 మంది గజఈతగాళ్లను అందుబాటులో ఉంచి, నాటుపడవలను సిద్ధంగా ఉంచాలన్నారు. మొదటిసారి కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాశాఖ నుంచి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని, అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్, రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మహదేవపూర్ నుంచి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు సూచించారు. రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా గుంతలు ఉండొద్దని ఆర్అండ్బీ, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కాంట్రాక్టర్లును హెచ్చరించారు. ప్రత్యేకాధికారులు స్థానికంగా ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. నిమిషం కూడా కరెంట్ కట్ కావొద్దని, కాటారం, బీరసాగర్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకోవాలన్నారు. భక్తులకు ప్రతీ రోజు అన్నదానం చేయాలని స్పష్టం చేశారు. పుష్కరాలు దగ్గర పడుతున్న సమయంలో ఎందుకు స్లాబు వేశారని, పని ఎలా అయిపోతుంది చెప్పండంటూ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. స్లాబ్ చేయకుండా ఉండాల్సిందని భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మ యాంక్ సింగ్, ఈఓ మహేశ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నదిలో బోట్లు తిప్పేందుకు అవకాశం ఇవ్వాలి.. కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో త్రివేణి సంగమంలో బోట్లు తిప్పేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబును స్థానిక గంగ పుత్రులు వేడుకున్నారు. మంత్రి ఆదివారం కాళేశ్వరానికి రాగా తమ జీవనోపాధి గురించి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేకు గంగ పుత్రులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి వెంట సింగరేణి సీఎండీ బలరామ్నాయక్, ఇతర అధికారులు ఉన్నారు. గ్రామం మొత్తం విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
‘శివాని’ విద్యార్థుల సత్తా
విద్యారణ్యపురి: టీజీఎప్సెట్ ఫలితాల్లో శివాని జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారని ఆ కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపాళ్లు సురేందర్రెడ్డి వి. చంద్రమోహన్ తెలిపారు. డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేశ్, ఎ. మురళీధర్.వి సురేశ్, ఎస్. సంతోశ్ రెడ్డి ఆదివారం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.అరికిల్ల నిస్సీ 1,309వ ర్యాంకు, ఆరె హాసిని 1,352వ ర్యాంకు, మార్గం హారిక 1,852వ ర్యాంకు, కోరె ఓం చందర్ 2,592వ ర్యాంకు, పాడి శ్రీవాణి 2,785వ ర్యాంకు, గుగులోత్ తరుణ్ 3,299వ ర్యాంకు, గుగులోత్ రమేశ్ 3,988వ ర్యాంకు, సల్మా4,527వ ర్యాంకు, మారం లక్ష్మణ్ 4,533వ ర్యాంకు, తమ్మడబోయిన అభిరామ్ 5,678వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. -
టీజీఎప్సెట్లో ‘షైన్’ విజయకేతనం
హన్మకొండ: టీజీఎప్సెట్–2025 ఫలితాల్లో షైన్ విజయకేతం ఎగురవేసింది. రాష్ట్ర స్థాయిలో 181, 277, 1279 ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగల రమ, మూగల రమేశ్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి జే.ఈ.ఈ. మెయిన్స్, నీట్, ఈఏపీసీఈటీలో అత్యుత్తమ శిక్షణ వరంగల్లో అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకడమిక్ ప్రోగ్రామింగ్, ప్రణాళిక ద్వారా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. టీజీఎప్సెట్ అగ్రికల్చర్ కేటగిరీలో డి.ఇందు 181 ర్యాంకు సాధించిందని తెలిపారు. కె.సహస్ర 277, బి.సంధ్య 2,227, ఎం.రమ్య 2,963, ఇ.సాహితీ 4,879, ఇంజనీరింగ్ కేటగిరీలో పి.శ్రీ మహేశ్ 1,279, ఎం.వరుణ్ 3,153, సి.హెచ్.సరిసహస్ర 4,133, కె.కస్తూరి 5,741, కె.చాణక్య 5,962, కె.విష్ణు 6,915, జి.నిగమ 7,009, ఎస్.శ్రీచైతన్య 8,162, ఎం.సుశాంత్ 8,795 ర్యాంకు సాధించారని వివరించారు. వీరితో పాటు అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు సాధించారని చైర్మన్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమములో షైన్ విద్యా సంస్థల కళాశాలల ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంధ్య, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మళ్లీ సాయంత్రం బడులు
హసన్పర్తి: సంపూర్ణ అక్షరాస్యత కోసం ప్ర భుత్వం మళ్లీ సాయంత్రం బడులు ప్రారంభించనుంది. సామాజిక చైతన్య కేంద్రాల పేరిట ఈ కార్యక్రమాన్ని ని ర్వహించనుంది. గతంలో వయోజన కేంద్రాల ద్వారా సాయంత్రం బ డులు నిర్వహించారు. గ్రామంలో 19 ఏళ్ల పైబడి ఉండి చదువు రాని వారు ఈ కేంద్రాలకు వచ్చి చదువుకునేవారు. ఇందుకు ప్రత్యేక వలంటీర్లను నియమించారు. 20 ఏళ్ల క్రితం ఈ కేంద్రాలు రద్దయ్యాయి. సామాజిక చైతన్య కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్య కేంద్రాల స్థానంలో సామాజిక చై తన్య కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు మార్గదర్శకాలు జా రీ చేసింది. మండల స్థాయిలో ఎంఈఓ కన్వీనర్గా, ఇందిరా క్రాంతి పథం ఏపీఓ కోకన్వీనర్గా వ్యవహరించనన్నారు. గ్రామస్థాయిలో ప్రఽ దానోపాధ్యాయుడు కన్వీనర్గా, పీఏసీఎస్ చైర్మన్ కోకన్వీనర్గా, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, విశ్రాంత ఉపాధ్యాయుడు, స్వచ్ఛంద సంస్థ సభ్యుడి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈనెల 12 తర్వాత అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ‘ఉల్లాస్’ యాప్లో.. చదువురాని వయోజనులను గుర్తించి వారి పేర్లను ఉల్లాస్ యాప్లో నమోదు చేయనున్నట్లుఽ అధికారులు వెల్లడించారు. దీంతో గ్రామాల్లో ఎంతమంది నిర్లక్ష్యరాస్యులు ఉన్నారో స్పష్టం కానుంది. నేడు గ్రామస్థాయి సమావేశాలు.. ఈనెల 12న గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. జూన్ 1 నుంచి ప్రారంభం సామాజిక చైతన్య కేంద్రాలు జూన్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ఎంఈఓ రాజిరెడ్డి తెలిపారు. చదువు చెప్పడానికి ముందుకు వచ్చేయ వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించే దిశలో కృషి చేయాలని కోరారు. సామాజిక చైతన్య కేంద్రాల ద్వారా విద్యా బోధన జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం నేడు గ్రామస్థాయి సమావేశాలు -
టీజీఎప్సెట్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: టీజీఎప్సెట్– 2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో వి.నాగసిద్ధార్థ 32వ ర్యాంకు సాధించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో మేధాకార్తీక్ 234వ ర్యాంకు, జోగు అఽభిరామ్ 471వ ర్యాంకు, బీపీసీ విభాగంలో ఎం. వినయ్ 149వ ర్యాంకు, ఎండి. అబ్దుల్లా మొహీనుద్దీన్ 162వ ర్యాంకు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వివరించారు. కె. అంజనాసంతోషి 178 ర్యాంకు, పి.సాయిదివ్యాన్ 183వ ర్యాంకు, కె.సాయికిరణ్ 200వ ర్యాంకు, జి. సాయిహర్షిణి 268వ ర్యాంకు, వై. స్నేహితారెడ్డి 390వ ర్యాంకు, కె. ఏంజెల్ 412వ ర్యాంకు, వి. ప్రత్యున్నారెడ్డి, 475వ ర్యాంకు, తోట ప్రణయా 496వ ర్యాంకు, మహ్మద్షాహిద్ రెహాన్ 513వ ర్యాంకు, చల్లా అన్సికా 539వ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరిస్తూ తమ విద్యాసంస్థల విద్యార్థులకు సృజనాత్మకతతోకూడిన విద్యనందిస్తున్నామని వారు తెలిపారు. -
తరుణ్కు 325 ర్యాంకు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం అయోధ్య జీపీ పరిధిలోని భజన తండాకు చెందిన గుగులోత్ నెహ్రూ, సత్తి దంపతుల పెద్ద కుమారుడు తరుణ్ టీజీ ఎప్సెట్ ఫలితాల్లో 325 ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ హయత్నగర్ ప్రాంతంలోని ఓ కళాశాలలో 2024 మార్చిలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన తరుణ్.. కూకట్పల్లిలోని ఓ కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం విడుదలైన ఎప్సెట్ ఫ లితాల్లో 325 ర్యాంకు సాధించి సహ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ పేర్కొన్నాడు. ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం కరీంనగర్: కరీంనగర్లోని విట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విపెమెంట్ ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూంను ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, సూపర్ ఫర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా అవుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోశ్ పాల్గొన్నారు. ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తాం హసన్పర్తి: కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి ఉపాధి కల్పిస్తామని ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్రావు అన్నారు. అల్లాడి క్లౌడ్ సొల్యూషన్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించిన ఐదుగురు విద్యార్థినులకు ఆదివారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో వివిధ కంపెనీలను ఆహ్వానించి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఈఏడాది 234 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వివరించారు. వారిని తిరుమల్రావు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్, ఎస్వీఎస్ విద్యాసంస్థ ల డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ● ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్రావు -
నిరంతరం విద్యుత్ కాంతులు
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విద్యుత్ కాంతులు నిరంతరాయంగా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అఽధికారులు, సిబ్బంది రాత్రిపగలు శ్రమిస్తున్నారు. ఎస్ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్, కాళేశ్వరం లైన్ఇన్స్పెక్టర్ సదానందం నిరంతరం అందుబాటులో ఉంటూ పనులు త్వరితగతిన చేయిస్తున్నారు. రూ.కోటిన్నరతో కాళేశ్వరంలో మొత్తం 500 వరకు స్తంభాలు, రూ.2 కోట్లతో సబ్స్టేషన్లో రెండు ఎంవీఐ ట్రాన్స్ఫార్మర్లు, 100 కేవీఏ, 25కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20 వరకు అమర్చారు. దీంతో కాళేశ్వరం అంతటా 24 గంటల త్రీఫేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రోజుకు 50 మంది సిబ్బంది పనులు చేస్తుండగా, పుష్కరాల సందర్భంగా 80 వరకు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
‘రెజోనెన్స్’ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: టీజీఎప్సెట్–2025 ఫలితాల్లో రెజోనెన్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తమ విద్యార్థులు రావుల ఇక్షవర్ 265వ ర్యాంకు, ఎ.సాయి రోహన్ 467, ఎ.నాగసాయి 806 ర్యాంకు సాధించారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. 272 మంది విద్యార్థులు 10,000 కంటే తక్కువ ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ కోసం తమ విద్యాసంస్థ కృషి చేస్తోందన్నారు. తమ అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల అవిశ్రాంత కృషి, వారి తల్లిదండ్రుల నిరంతర సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజలు హక్కుల కోసం పోరాడాలి
నయీంనగర్: తమ జీవనవిధానానికి భంగం కలిగినప్పు డు ప్రజలు హక్కుల కోసం పోరాడాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా 3వ మహాసభ పి.రమేశ్ చందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఆదివాసీల సహజ జీవనవిధానాన్ని బలవంతంగా మార్చుకోవాలని వారిపై దాడులు, అక్రమ అరెస్ట్లు చేయడం వారికి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాయడమేనన్నారు. ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న అణిచివేతను ప్రశ్నించడమే పౌర హక్కుల సంఘం ప్రధాన లక్ష్మం, కర్తవ్యమన్నారు. ఆపరేషన్ కగార్ను నిలిపి శాంతి చర్చలు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్.పాణి, హైకోర్టు అడ్వకేట్ వి.రఘునాథ్, గుంటి రవి, టీపీఎఫ్ నాయకురాలు బి.రమాదేవి , తదితరులు పాల్గొన్నారు. తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడి మృతి నెల్లికుదురు: తాటిచెట్టుపైనుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ గౌడ్ (48) రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు గీసిన అనంతరం కిందికి దిగుతున్నాడు. ఈ క్రమంలో జారి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి సమాచారం అందించగా కుటుంబ సభ్యులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెందాడు. ప్రభాకర్గౌడ్కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యకురవి: కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కురవి మండలం గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. పీఎస్సై కృష్ణారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్కు చెందిన గుంజె లక్ష్మ ణ్(34)కు కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామానికి చెందిన కల్పనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. లక్ష్మణ్ నెల రోజుల క్రితం గుండ్రాతిమడుగు(విలేజీ)కు వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగి రైల్వే ట్రాక్ పక్కన ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పడుకుని ఉన్నాడు. ఆదివారం ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చిన కొందరు రైతులు లక్ష్మణ్ పడుకుని ఉన్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. వారు ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. మృతుడి తమ్ముడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని లక్ష్మణ్ కుటుంబీకులు కరీంనగర్ తరలించారు. అమ్మమ్మతాతయ్య మందలించారని గొల్లపల్లిలో మరో యువకుడు.. నెక్కొండ: అమ్మమ్మతాతయ్య అకారణంగా మందలించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని గొల్లపల్లిలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టు అజయ్ (21) తల్లి చిన్నతనంలో మృతి చెందింది. దీంతో అజయ్ని అమ్మమ్మతాతయ్య పెంచిపెద్ద చేశారు. అజయ్ తాపీ మేసీ్త్ర పని చేస్తుండగా ఈ నెల 10న సాయంత్రం ఇంటి వచ్చాడు. ఎక్కడకి వెళ్లావని, కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావాలని మందలించారు. దీంతో తనను చిన్న విషయాలకే అకారణంగా మందలిస్తున్నారని, స్వేచ్ఛ లేదని అజయ్ మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పుష్కరఘాట్ పులకించేలా..
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలకు పుష్కరఘాట్ వద్ద పనులు చకచకా జరుగుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీమాత విగ్రహానికి డెకరేషన్ చేస్తున్నారు. పుష్కరఘాట్ పొడువునా భారీగా సెట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. శివుడి విగ్రహం, దాని ఎదుట నంది విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. కాశీపండితులతో ఏడు హారతులు ఇచ్చే సభాస్థలి వద్ద ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన కేంఎంకే గ్లోబల్ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ పనులు చేపడుతుంది. దీంతో పుష్కరఘాట్ పులకించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. -
28 మందిపై రౌడీషీట్ ఎత్తివేత
● ప్రకటించిన డీఎస్పీ తిరుపతిరావుమహబూబాబాద్ రూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగిఉంటే వారిపైఉన్న రౌడీషీట్ తొలగిస్తామని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన 28 మందిపై రౌడీషీట్ తొలగించారు. సబ్ డివిజన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగినవారిపై రౌడీషీట్ తొలగింపు మేళా శనివారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవి తం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రౌడీషీట్ తొలిగించినవారు భవి ష్యత్లో ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని తెలిపా రు. అలాగే ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారమందించే బాధ్యతాయుత పౌరులుగా పోలీసులకు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో టౌన్, డోర్నకల్, బయ్యా రం సీఐలు దేవేందర్, రాజేష్, రవి, ఎస్సైలు సతీష్, తిరుపతి, దీపిక, మురళీధర్ రాజు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గూడూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో అంబేడ్కర్ కమిటీ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ కన్వీనర్ కత్తి స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేద వర్గాలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అవసరమైన అంశాలను అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులతోనే తనకు నేడు జాతీయ ఎస్టీ కమిషన్లో సభ్యుడిగా అవకాశం వచ్చిందన్నారు. గూడూరు మండలాన్ని డీ లిమిటేషన్లో డివిజన్ కేంద్రంగా మారేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా తనతో అభివృద్ధి పనులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కమిటీ, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పింగిళి శ్రీనివాస్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వీరస్వామి, వాంకుడోతు కొమ్మాలు, డాక్టర్ ఏపూరు రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్నాయక్, రాధ, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ -
వివాహ వేడుకకు వెళ్లొస్తూ.. అనంతలోకాలకు
బచ్చన్నపేట : స్నేహితుడి అ న్న వివాహ వేడుకకు వెళ్లొస్తూ ఓ విద్యార్థి అనంతలోకాల కు చేరాడు. కారు అదుపు తప్పడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి కి గాయాలయ్యాయి. ఈ ఘ టన శుక్రవారం రాత్రి మండలంలోని బచ్చన్నపేట– ఆలేరు రోడ్డులోని పది మోటల బావి వద్ద జరి గింది. కుటుంబీకులు, ఎస్సై అబ్దుల్ హమీద్ కథ నం ప్రకారం.. మండలంలోని పోచన్నపేటకు చెందిన పేరిణి ఉమ, దేవేందర్ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ (19) హైదరాబాద్ ఘట్కేసర్లోని సాంస్కృతి ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం గ్రామా నికి చెందిన తన స్నేహితుడి అన్న వివాహం ఉండగా స్నేహితులు దేవరాయ శ్రీకాంత్, తమ్మిడి అఖిల్తో కలిసి కారులో బచ్చన్నపేట (వివాహం జరిగిన ప్రాంతం) కు బయలుదేరాడు. వివాహ వేడుక అ నంతరం బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కారును అజాగ్రత్తగా నడపడంతో మండలంలోని పది మోటల బావి వద్ద అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీ కాంత్, అఖిల్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి గౌతమ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు అదుపు తప్పి విద్యార్థి దుర్మరణం బచ్చన్నపేట, ఆలేరు రోడ్డులో ఘటన -
వడదెబ్బతో ఎఫ్ఏ మృతి
నర్సింహులపేట: వడదెబ్బతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసు కుంది. నర్సింహులపేటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తూ డి మాణిక్యం(52) శుక్రవారం పెద్దగుట్ట, చిత్తుకుంటలో జరిగిన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సమయంలో ఎండ వేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కూలీలు స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
రామప్పలో రెండున్నర గంటల పర్యటన
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఈ నెల 14న 35 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. 14న సాయంత్రం 5.15 గంటలకు ఆలయానికి మిస్ వరల్డ్ టీం బస్సులో చేరుకుంటుంది. 5.20 గంటలకు రామప్పలో ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పూజాసామగ్రి కొనుగోలు చేస్తారు. 5.25 గంటలకు ఆలయం వద్ద గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. 5.30 గంటలకు పూజారులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానిస్తారు. 5.35 నుంచి 6:25 గంటల వరకు రామలింగేశ్వరస్వామివారిని దర్శించుకుని ఆలయ శిల్పకళ సంపదను తిలకిస్తారు. ఆలయ విశిష్టత గురించి వారికి టూరిజం గైడ్లు వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6.33 గంటలకు అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, రాత్రి 7.08 గంటలకు పేరిణి నృత్య ప్రదర్శన, 7.25 గంటలకు మిస్వరల్డ్ టీం కంటెస్టెంట్లకు ప్రముఖులతో సత్కారం ఉంటుంది. 7.35 గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం, 7.42 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ముగుస్తాయి. రామప్పలో రెండున్నర గంటల పాటు పర్యటించిన అనంతరం సుందరీమణులు డిన్నర్ చేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, మిస్వరల్డ్ కంటెస్టెంట్లు హిందూ సంప్రదాయ దుస్తుల్లో రామప్పను సందర్శించనున్నట్లు సమాచారం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు -
పనులు శరవేగంగా చేపట్టాలి
● కలెక్టర్ రాహుల్శర్మ కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల పనులు శరవేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఈమేరకు శనివారం ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఘాట్, సరస్వతి మాతావిగ్రహం, జ్ఞాన దీపం, స్టాళ్లు, పుష్కర స్నానాలు ఆచరించే నది ప్రాంతం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు సమయం తక్కువగా ఉందని, పనులు శరవేగంగా చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లును ఆదేశించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన కొర్ర ధర్మ (55) శుక్రవారం భవన నిర్మాణ పని నిమిత్తం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. శనివారం ఉదయం పని నిమిత్తం జగ్జీవన్ రామ్ కాలనీ ప్రాంతం మీదుగా నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో నర్సంపేట అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన బిట్స్ కళాశాల బస్సు జగ్జీవన్ రామ్ కాలనీ సమీపంలో వెనుకకు వస్తోంది. ఈ క్రమంలో ధర్మ నడిచి వచ్చే విషయాన్ని బస్సు డ్రైవర్ మల్లెపాక ఐలయ్య గుర్తించలేదు. దీంతో బస్సు ఢీకొని ధర్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అవుట్ పోస్ట్ కానిస్టేబు ల్ మధు టౌన్ పోలీసులకు సమాచారం అందజే యగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్, హెడ్ కానిస్టేబు ల్ దామోదర్ ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. -
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్రెడ్డి.. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్కు బయలు దేరాడు. 2005లో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్కు ఎంపికై న వెంకట్రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభాగంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి తనలోని సంతోషం.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతం..
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షి యల్ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 32 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సిండగా అందులో 6,360 మంది (84.08శాతం) హాజరుకాగా 1,204మంది గైర్హాజరయ్యారని టీజీఆర్జేసీ సెట్ హనుమకొండ జిల్లా కోఆర్డి నేటర్ కె. ఇందుమతి తెలిపారు. ఎంపీసీ గ్రూప్నకు 4,708 మంది విద్యార్థులకుగాను 3,986 మంది, బీపీసీ గ్రూప్నకు 2,668 మందికిగాను 2,237మంది, ఎంఈసీ గ్రూప్నకు 188 మందికిగాను 137మంది హాజరయ్యారని తెలిపారు. ఆక్స్ఫర్డ్ పరీక్ష కేంద్రాన్ని టీజీఆర్జేసీసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి, జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ భువనేశ్వరి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఆ పరీక్ష కేంద్రం మార్పుతో ఇబ్బందులు టీజీఆర్జేసీసెట్కు హనుమకొండలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కిషన్పురలో చైతన్యహైస్కూల్లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆ పరీక్ష కేంద్రం పేరుమీదే హాల్టికెట్లు జారీ అయ్యాయి. అయితే ఆ పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు హనుమకొండలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో పరీక్ష కేంద్రంగా మార్పుచేశారు. ఇది తెలియని కొందరు విద్యార్థులు చైతన్య హైస్కూల్ వద్దకు వచ్చారు. ఇక్కడ కాదు ఆక్స్ఫర్డ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వెళ్లాలని తెలపడంతో ఆయా వారు కొంత ఇబ్బందులు పడ్డారు. కాగా, అనివార్య పరిస్థితుల్లోనే ఆ పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశామని టీజీఆర్జేసీ సెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి తెలిపారు. 84.08 శాతం మంది విద్యార్థుల హాజరు -
ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ దాకా..
కాళేశ్వరం : కాళేశ్వరం.. గతంలో కాకులు దూరని కారడవి. దండకారణ్యం కావడంతో గతంలో ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావు. ఈక్రమంలో 1982లో జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. అప్పుడు ఆర్టీసీ బస్సులు దిక్కు. ప్రైవేట్ వాహనాలు కూడా అంతంతే. భక్తుల సంఖ్య కూడా తక్కువే. 2013లో జరిగిన సరస్వతీపుష్కరాల వరకు కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తరలివచ్చేవారు. ఈ సమయంలో బస్టాండ్ నుంచి గోదావరి ఘాట్ వరకు వెళ్లాలంటే ఎడ్ల బండ్లే దిక్కు. లేదంటే కాలినడకనే శరణ్యం. ఈ క్రమంలో 2016 డిసెంబర్లో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి నిధులు రూ.250 కోట్ల వ్యయంతో గోదావరిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రవాణా పెరిగింది. దీనికితోడు మంచిర్యాల జిల్లా రాపన్పల్లి, సిరొంచ మధ్య రూ.170 కోట్ల వ్యయంతో ప్రాణహిత నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో మరో అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో రవాణా మరింత పెరిగి కాళేశ్వరాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు రయ్రయ్ మంటూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నెల15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక దృష్టితో జాయ్రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కన్నెపల్లిలో మూడు, సీఎం తరహా వీవీఐపీల కోసం ఘాట్ సమీపంలో ఒకటి హెలిపాడ్లు సిద్ధం చేశారు. దీంతో ఎడ్లబండ్లపై తిరిగిన భక్తులు ఈసారి జాయ్రైడ్స్తో (హెలికాప్టర్) ఎంజాయ్ చేయనున్నారు. కాలినడక, ఎడ్లబండ్లు, ఆటోలు, కార్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు ప్రస్తుతం హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టనున్నారు. అంతర్రాష్ట్ర వంతెనలతో కాళేశ్వరానికి పెరిగిన రవాణా -
డిగ్రీ ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి కేసముద్రం: డిగ్రీ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భుక్యారాంతండా జీపీ శివారు అవుసలితండాలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం..తండాకు చెందిన జాటోత్ వాల్యా, సువాలి దంపతుల చిన్నకుమారుడు మోహన్(22) వరంగల్లోని ఓ కాలేజీలో డిగ్రీ(ఎంపీసీఎస్) చదివాడు. ఈ క్రమంలో వార్షిక పరీక్షలు రాయగా, ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఫెయిల్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న ఇంటికి వచ్చిన మోహన్ తమ వ్యవసాయ భూమి వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యథావిధిగా కేయూ డిగ్రీ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆది లాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ , బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ శనివారం తెలిపారు. పరీక్షలు వాయిదాపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. ఇటీవల ప్రకటించిన డిగ్రీ కోర్సుల ఆయా సెమిస్టర్ల పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరగనున్నాయన్నారు. కాగా, ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజులు చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈనెల 12వతేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేశామని, ఇక వాయిదావేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు హాల్టికెట్లు జారీచేస్తామని పేర్కొన్నారు. -
పనులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
రాయపర్తి: మహిళా కూలీలతో వస్తున్న ఓ ఆటోను బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కూలీ మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మండలంలోని కొలన్పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రవణ్కుమార్ కథనం ప్రకారం.. రాయపర్తి మండలంలోని కొలన్పల్లి శివారు జయరాంతండా(కె) గ్రామానికి చెందిన లావుడ్య బిచ్చాని(45), లావుడ్య చావ్లి, లావుడ్య బికీ, లావుడ్య సువాలి కూలీ పనుల నిమిత్తం పాలకుర్తి వెళ్లారు. పనులు పూర్తయిన అనంతరం గ్రామానికి వస్తున్న క్రమంలో కొలన్పల్లి శివారులో బొలెరో ఎదురుగా ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బిచ్చాని మృతి చెందింది. ముగ్గురు క్షతగాత్రులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారు. ఆటోను ఢీకొన్న బొలెరో.. మహిళా కూలీ మృతి ముగ్గురికి గాయాలు -
అమ్మ భయపడితే.. నచ్చజెప్పా..
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకాశ్మీర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్లో రాపిడ్యాక్షన్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్నాను. – ఎడ్ల ఝాన్సీ, మానుకోట -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
– 10లోuదేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు ● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవంఎవరెస్టు కన్నా ఎత్తయినవి ఆమె ఊహా శిఖరాలు. సిందూరంకన్నా ఎరుపెక్కినవి ఆమె హృదయ జ్వాలలు. తనువును మోస్తున్న నేలకు, ఊపిరిలూదిన గాలికీ.. స్వేచ్ఛావాయువుల్నిచ్చిన భరత భూమికి సేవ చేయాలన్నదే ఆ తల్లుల సంకల్పం. అందుకనుగుణంగా వారి బిడ్డల్ని తీర్చిదిద్దారు. నిలువెల్లా దేశభక్తిని నూరిపోశారు. దేశసేవ కోసం సైన్యంలోకి పంపించిన ఓరుగల్లు మాతృమూర్తులే ఒక సైన్యం. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా దేశ సేవకు బిడ్డలను పంపిన పలువురు తల్లులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి .. స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది. ఆశయానికి ‘అమ్మ’ అండ.. జనగామ: ‘నేను సైనికున్నవుతా.. దేశ శుత్రువులను కాల్చి చంపేస్తా’ అంటూ చదువుకునే రోజుల నుంచి దేశ భక్తి కలిగిన జనగామ పట్టణానికి చెందిన మాదాసు అన్నపూర్ణ, ఎల్లయ్య దంపతుల కుమారుడు శ్రీనాథ్ సైన్యంలో చేరి చిన్న నాటి కోర్కెను తీర్చుకున్నాడు. కొడుకు ఆశయానికి తల్లి అండగా నిలిచి కొండంత భరోసా ఇచ్చింది. 13 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరి మెటాలజికల్(వాతావరణ శాఖ) కేటగిరి ఎయిర్ ఫోర్స్ వింగ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన సియాచిన్లో మొదట బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సిందూర్–2 యుద్ధంలో సేవలు అందిస్తున్నాడు. ఆడపిల్లల నుదిటి బొట్టు తుడిచేసిన ఉగ్రమూకలను తుదముట్టించే విధుల్లో తన కొడుకు భాగస్వామిగా ఉండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నామని తల్లి అన్నపూర్ణ గర్వంగా చెబుతున్నారు.న్యూస్రీల్ -
వారసులు తిరగబడుతున్నారని ఆందోళన
హసన్పర్తి: ‘20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశాం. పట్టాదారులు వచ్చి రి జిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన వా రు లేరు. వారి వారసులు మాత్రం భూ మి అమ్మలేదని తిరుగబడుతున్నారు’ అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు శనివారం బాధితులు కేయూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం శివారు సర్వే నంబర్ 520, 521, 522, 523, 524లో 20 ఏళ్ల క్రితం పట్టాదారులు ఓ వెంచర్ చేశారు. అందులో ఆయా ప్రాంతాలకు చెందిన కింది స్థాయి ఉద్యోగులు, చిరువ్యాపారులు 75 ప్లాట్లు కొనుగోలు చేశారు. 51 ప్లాట్లను పట్టాదారుల నుంచి ఖరీదు చేయగా, మరో 24 ప్లాట్లు జీపీఏ పొందిన వడ్డేపల్లికి చెందిన పాండురాల శ్రీదేవి, పాండురాల సంపత్కుమార్, జూలైవాడకు చెందిన బూర జంపయ్యల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ప్లాటుదారులు మోకాపైకి రాలేదు. ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్ల వద్దకు వెళ్తే పట్టాదారుల వారుసులు బొక్క కిరణ్, కట్టెపోగుల కుమార్, సంగాల రమేశ్, సంగాల శంకర్, రేనుకుంట్ల సురేశ్, నమిండ్ల జోసెఫ్, డాక్టర్కుమార్, నమిండ్ల థామస్, నమిండ్ల రామస్వామి, ఉదయ్, నమిండ్ల సురేశ్, సందెల రజనీకాంత్ అసలు భూమినే విక్రయించలేదని తిరుగబడుతున్నారని చెప్పారు. వారితో పాటు జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన శ్రీదేవి, సంపత్, బూర జంపయ్య కూడా పట్టాదారులకు సహకరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ల వద్దకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఖరీదు చేసిన డాక్యుమెంట్లను ప్రదర్శించారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే.. ‘పైసా.. పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. కూతుళ్ల పెళ్లిళ్లకు పనికొస్తాయమని భావించాం. ఇప్పుడున్న ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయి. న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలే శరణ్యం’ అని బాధితులు తెలిపారు. -
పొట్టకూటి కోసం వచ్చి మృత్యుఒడికి..
వర్ధన్నపేట : పిడుగుపాటుకు ఓ బిహార్ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కోనాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్కు చెందిన బిట్టువిండ్(31) హమాలీగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ సమయంలో బిట్టువిండ్ వర్షం పడుతుండగా చెట్టుకిందికి వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత సమీపంలో పిడుగు పడడంతో బిట్టువిండ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బిట్టువిండ్ కొంతకాలంగా వర్ధన్నపేటలోని ఓ రైస్మిల్లులో హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా, బిట్టువిండ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. మృతుడి బంధువులకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు. పిడుగుపాటుకు విద్యార్థికి అస్వస్థత వర్ధన్నపేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి కుప్పలు చేస్తున్న క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర తండాకు చెందిన మాడావత్ వెంకన్న కుమారుడు గణేశ్ అస్వస్థతకు గురయ్యాడు. గణేశ్ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అస్వస్థతకు గురైన గణేశ్ను కుటుంబీకులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు బిహార్ యువకుడి మృతి కోనాపురంలో ఘటన -
పుష్కరాలకు పోలీసు సైన్యం..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో విధులు నిర్వర్తించేందుకు పోలీసు సైన్యం రెడీ అయ్యింది. ఎస్పీ కిరణ్ఖరే ఆధ్వర్యంలో 1,678 మంది సిబ్బంది పుష్కర విధుల్లో పాల్గొననున్నారు. వివిధ ప్రదేశాల్లో 12 రోజుల పాటు భద్రత నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీనది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.25కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. తరలిరానున్న ప్రముఖులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీ స్గఢ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా 12 రోజుల పాటు రోజుకు 50 నుంచి 60వేల వరకు భక్తులు తరలిరానున్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి 15న పుష్కరాల ప్రారంభానికి రానుండడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పీఠాధిపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్తలు రానున్నారు. వీరందరితో పాటు సామాన్య భక్తజనానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల విధుల్లో పాల్గొనే పోలీసుల వివరాలు .. డీఎస్పీలు 24, సీఐలు 60, ఎస్సైలు 196, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు 214, కానిస్టేబుళ్లు 442, హోంగార్డులు, 280, మహిళ హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 100, మహిళా హోంగార్డులు 16, ఇతర రోప్పార్టీలు, బాంబ్స్క్వాడ్లు, డాగ్స్క్వాడ్లు ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. విధులు ఇలా.. కాళేశ్వరాలయం, పలుగుల ఎక్స్, గంగారం ఎక్స్, వీఐపీ ఘాట్, మెయిన్ఘాట్, నాలుగు పార్కింగ్ స్థలాలు, వంతెన చెక్పోస్టు, ఇప్పలబోరు జంక్షన్, పోలీసుస్టేషన్, తదితర ప్రాంతాల్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. విధుల్లో 1,678 మంది సిబ్బంది వివిధ ప్రదేశాల్లో 12 రోజుల పాటు భద్రత -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపో యి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతా రు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అందాలభామలను అబ్బురపర్చేలా ప్రదర్శనలు రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
13న డిప్యూటీ సీఎం పర్యటన
బయ్యారం: డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఈ నెల 13వ తేదీన మండలంలో పర్యటించనున్నట్లు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనక య్య తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలను శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. మండలంలోని మూడు గ్రామా ల్లో రూ.8.69 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నా రు. స్పాట్ కౌన్సెలింగ్మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్టినేటర్ గిరిజ నశాఖ కార్యాలయం ఆర్సీఓ టి.హరిసింగ్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీన ములుగు జిల్లాలో ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్లో బాలురకు, ఈ నెల 16 తేదీ న ఏటూరునాగారం న్యూఆర్జేసీలో బాలికల కు ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయం, నివాసం ఒరిజిల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్తో కౌన్సిలింగ్కు హాజరుకావాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్ల్లో అవకాశం ఉందని, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ధాన్యాన్ని కాంటాలు వేసి త్వరగా తరలించాలి● లారీని అడ్డుకుని రైతుల ఆందోళన దంతాలపల్లి: కొనుగోలు కేంద్రాల్లోని తమ ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అన్నదాతలు కోరుతున్నారు. మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీలో ధాన్యం కాంటాలు నిర్వహించి తరలించకుండా రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు శని వారం గొడవకు దిగారు. తండావాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మహిళా సంఘం ఆధ్వర్యంలో తండాలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ రైతులకు ధాన్యం కాంటాలు పెట్టకుండా.. బస్తాలు తరలించకుండా ఎవరు కాసులిస్తే వారి ధాన్యం కాంటాలు నిర్వహించి దాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తండాకు చెందిన మాలోత్ మోహన్ 135 బస్తాలు, గుగులోత్ వెంకన్న 190 బస్తాలు కాంటాలు నిర్వహించి కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉంచారు. నిర్వాహకులకు చెందిన నర్సింహులపే ట మండలం నాగారం గ్రామానికి చెందిన రై తు ధాన్యం కాంటాలు నిర్వహించి శనివారం వెంటనే లారీలో మిల్లుకు తరలించే ప్రయత్నం చేయగా.. తండావాసులు అడ్డుకున్నారు. ధాన్యంపై కప్పేందుకు ప్రభుత్వం ఇచ్చి న పట్టా(పరదాలు)ను సైతం నిర్వాహకులు తమ కు ఇవ్వకుండా వారి ఇళ్లలోనే దాచి ఉంచా రని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతుల ను సముదాయించారు. పోలీస్ల జోక్యంతో శాంతించిన రైతులు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. 9 నెలల తర్వాత కుటుంబం చెంతకు..ఖమ్మం అర్బన్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తికి సపర్యలు చేసి కోలుకున్నాక ఆచూకీ తెలుసుకోవడంతో తొమ్మిది నెలల అనంతరం కుటుంబం చెంతకు చేరాడు. మతిస్థిమితం లేని వ్యక్తి ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద పడిఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ బాధ్యులు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. చికిత్స అనంతరం కోలుకున్న సదరు వ్యక్తి తనది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చెట్లముప్పారం అని తన పేరు కాలేరు ప్రవీణ్ అని చెప్పడంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అంబులెన్స్లో శనివారం స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే, ఆయన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం వరంగల్కు వెళ్లగా బాబాయ్ వీరేశంకు అప్పగించారు. గత వర్షాకాలంలో ప్రవీణ్ ఇంటి నుంచి తప్పిపోయాడని, మళ్లీ రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. -
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..
ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్గౌడ్కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్గౌడ్ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
మహబూబాబాద్: ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. టీబీ నివారణకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ప్రతినెలా షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని వసతి గృహల్లో సెలవుల అనంతరం విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదికలు అందచేయాలన్నారు. వేసవి, అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు వ్యాధులబారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ భూక్య రవి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
అటవీశాఖ తరఫున అందమైన వెదురు బొమ్మలు
ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనకు ఈ నెల 14వ తేదీన రానున్న 35 మంది అందాల తారలను ఆకర్షించేలా జిల్లా అటవీశాఖ తరఫున ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈమేరకు జంగాలపల్లి గ్రామంలోని 30 మంది మేదరులకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు శిక్షకుల సమక్షంలో వెదురు బొమ్మల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు వారు చేసిన వెదరుబొంగు గ్లాసులు, డేగ, ఎడ్లబండిపై రైతు దంపతులు, చిలుకలు, విసనకర్ర, తాబేలు, పిచ్చుకలు, పింఛం వదిలిన నెమలి వంటి బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ బొమ్మలను అందాలతారలకు జ్ఞాపికలుగా అందించాలా.. వచ్చేవారంతా చూసేందుకు స్టాల్ ఏర్పాటు చేయాలా? అనే విషయంపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆబొమ్మలకు సుందరీ మణులు ఆకర్షితులైతే వీటికి ఉచిత ప్రచారం జరగడంతోపాటు జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాకు రెండుసార్లు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అటవీశాఖ ఈ బొమ్మలను అందించగా ఆయన మంత్రముగ్ధుడయ్యారు. మంత్రి సీతక్క.. అధికారులను అభినందించారు. ఈ కోణంలో రామప్పకు వచ్చే సుందరీమణులను ఈ బొమ్మలు ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. 20 రోజులపాటు మేదరులకు ప్రత్యేక శిక్షణ ఇప్పటికే పూర్తికావొచ్చిన తయారీ రామప్పలో స్టాల్ ఏర్పాటుకు ప్రణాళిక -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాలను ఇచ్చేలా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా? స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా? అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు -
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి
తొర్రూరు: రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ తెలిపారు. రాజీ మార్గంలో కేసుల పరిష్కారంపై శుక్రవారం డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ నెల 19 వరకు చెక్ బౌన్స్ కేసులపై కక్షిదారులతో చర్చిస్తామన్నారు. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు ముకుందారావు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ప్రతినిధులు మధుసూదన్, ఐలోని, ఏజీపీ లింగాల శ్రీనివాస్ పాల్గొన్నారు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ -
ప్రతీ ఏడాది మొదటిస్థానంలో ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : పది ఫలితాల్లో ప్రతీ ఏడాది జిల్లా మొదటిస్థానంలో ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ ఆకాంక్షించారు. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిల్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో డీఈఓ రవీందర్ రెడ్డి, ఎంఈఓలతో శుక్రవారం ఎమ్మెల్యే మురళీనాయక్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 99.29 శాతంతో జిల్లాను మొదటి స్థానంలో నిలపడంతో అధికారులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫలితాలు వెలువడే విధంగా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యలో పెంచేలా విద్యార్థులను తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో సదుపాయాల విషయంలో సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
గార్ల: రాజీవ్ యువ వికాసం అర్హుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ జి.దేశీరాంనాయక్ మండల అధికారులను ఆదేశించారు. శుక్రవారం గార్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? సిబిల్ స్కోర్ కోసం బ్యాంకుకు ఎన్ని దరఖాస్తులు పంపారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కమిటీ అర్హులను గుర్తించి జాబితాను జిల్లా కమిటీకి పంపించాలని సూచించారు. జిల్లా కమిటీ జాబితాను స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి పథకానికి ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీడీ వెంట సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఎంపీఓ కవిత, ఎస్సీఆర్పీలు ఎం.బుచ్చానాయక్, బి.భద్రునాయక్ పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతంమహబూబాబాద్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశామని యాసంగి 2024–25కు గాను ఈనె నెల 8 వరకు 75,384,981 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు డీసీఎస్ఓ ప్రేమ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 62,941,826 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. యుద్ధానికి బయల్దేరిన జవాన్ బయ్యారం: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సెలవులపై స్వగ్రామానికి వచ్చిన జవాన్ శుక్రవారం ఉద్యోగ స్థానానికి బయల్దేరాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బయ్యారానికి చెందిన షేక్ అజహర్ ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్లో పాల్గొని నాలుగు రోజుల క్రితం సెలవుపై స్వస్థలానికి వచ్చాడు. ఉదంపూర్ సెక్టార్లో ప్రస్తుతం ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. శాస్త్రోక్తంగా గరుడాదివాసం మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఎస్సై టీవీఆర్ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరికి బస్సులు వేయండి
● ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో ప్రజల వినతి నెహ్రూసెంటర్: ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆర్టీసీ డీఎం ఎం.శివప్రసాద్తో మాట్లాడిన ప్రజలు మా ఊరికి బస్సు వేయండంటూ కోరారు. ఈసందర్భంగా డీఎం మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి 15 మంది ఫోన్ చేసి కొత్త బస్సు సర్వీసులు, అదనపు ట్రిప్పులు నడపాలని కోరినట్లు తెలిపారు. మహబూబాబాద్, మరిపెడ మీదుగా హైదరాబాద్, మహబూబాబాద్ నుంచి వంతడపల బస్సు సర్వీసు నడిపించాలని కోరినట్లు డీఎం తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచి నడిపించేందుకు చర్యలు చేపడుతామన్నారు. -
గిరిజన సాహసకుడి విజయం
● మిజోరంలోని ఫాంగ్పుయ్ పర్వతం అధిరోహించిన యశ్వంత్ మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన గిరిజన యువ మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతం చేశాడు. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలోని ఎత్తైన పర్వతం ఇసో (2,994 మీటర్లు)ను అధిరోహించి రికార్డు సొంతం చేసుకోగా, తాజాగా 2,157 మీటర్ల ఎత్తైన ఫాంగ్ పుయ్ (బ్లూ మౌంటైన్) పర్వతాన్ని యశ్వంత్ అధిరోహించి శుక్రవారం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు పర్వతాలను మౌంటైనర్ యశ్వంత్ అధిరోహించి గిరిజన పిన్న వయస్సు సాహసకుడిగా ప్రసిద్ధికెక్కాడు. జాతీయ మిషన్ ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ మిషన్ కింద భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లోని అతి ఎత్తైన పర్వతాలను సులువుగా అధిరోహించాడు. శిఖరాగ్ర సమావేశం నుంచి డ్రగ్స్కు నో చెప్పండి, బెట్టింగ్ యాప్లకు నో చెప్పండి, జీవితానికి అవునని చెప్పిండి అంటూ భారతదేశ యువతకు మౌంటైనర్ యశ్వంత్ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తూ ఫాంగ్ పుయ్ పర్వతంపై తివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. యశ్వంత్ తన ధైర్యసాహసాలతో ఇప్పటికే 28 రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన పర్వతాలు అధిరోహించాడు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కిలిమంజారో, ఎల్బస్, మౌంట్ కోస్కియుస్కో తదితర పర్వతాలను చుట్టేసి దేశఖ్యాతిని ప్రపంచానికి చా టాడు. చివరికి ప్రపంచంలోని ఏడు శిఖరాగ్ర సమావేశాలను పూర్తి చేయడంతో పాటు భారతదేశ యువతకు ప్రపంచ స్థాయికి ప్రాతి నిధ్యం వహించడమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు యశ్వంత్ వివరించాడు. కానిస్టేబుళ్లకు సీపీ అభినందనవరంగల్ క్రైం: అత్యధికసార్లు రక్తదానం చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్ కన్నె రాజు, కేయూ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అభినందించారు. వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సుబేదారి రెడ్క్రాస్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కన్నె రాజు 37వ సారి, రవీందర్ 18వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేయగా.. వారిని సీపీ సన్ప్రీత్సింగ్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. 14 కిలోల గంజాయి పట్టివేతకాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో 14.7 కిలోల ఎండు గంజాయిని శుక్రవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ వేముల చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షహనావాస్ కాశీం ఆదేశం మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజన్రావు పర్యవేక్షణలో రైల్వే జంక్షన్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన ముందస్తు సమాచారం ఆధారంగా రైళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం జంక్షన్లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆగి తనిఖీ చేయగా.. రూ.90 వే లు విలువైన గంజాయి లభించగా కేసు నమోదు చే శారు. ఎస్సై తిరుపతి, ఖలీల్, లాలయ్య, కోటిలింగం, ఆయుర్, రషీద్ పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం
మరిపెడ: రెండు బైక్లు ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం శివారులో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం బాబోజీగూడెం గ్రామ శివారు వెంకురాం తండాకు చెందిన భూక్య సంతోష్ (30), భోజ్యతండాకు చెందిన గుగులోతు కార్తీక్ (35) స్నేహితులిద్దరు కలిసి గురువారం రాత్రి తండా నుంచి మరిపెడ మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. బావోజీగూడెం శివారు వాగోడ్డుతండాకు చెందిన అజ్మీర సుధీర్ మరో ద్విచక్రహనంపై వారు వెళ్తున్న దారిలో వెళ్తున్నాడు. మరిపెడ మున్సిపాలిటీ సమీపంలోని 365జాతీయ రహదారిపై అతివేగం కారణంగా ఆ రెండు బైక్లు పరస్పరం ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. సుధీర్కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అజ్మీరా లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతిభను వెలికితీసేందుకే వేసవి శిబిరాలు
పెద్దవంగర: విద్యార్థుల్లో దాగిఉన్న క్రీడాప్రతిభను వెలికితీసేందుకే వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వేసవి శిక్షణ శిబిరాల పరిశీలన రాష్ట్ర బృందం జాయింట్ డైరెక్టర్ రాజీవ్, జీఈసీఓ శిరీష అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీఈఓ రవీందర్రెడ్డితో కలిసి పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో స్నేహతత్వం చదువుల్లో పోటీ పెరుగుతోందని తెలిపారు. సబ్జెక్టుల్లో భయం పోయి చదువుపై ఆసక్తి పెరుగుతోందన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ప్రభుత్వ పాఠశాల్లోనే కొనసాగుతున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా చదువుతోపాటు ఆట, పాటల్లో శిక్షణ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, శ్రీధర్, కరుణాకర్, రమేష్, పీఈటీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాల పరిశీలన బృందం జేడీ రాజీవ్ -
పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం తగదు
హన్మకొండ అర్బన్: సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలు చేయ డాన్ని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సాక్షి పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్ వర్ధెల్లి లింగయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, రాష్ట్ర నాయకులు వల్లాల వెంకటరమణ, గాడిపెల్లి మధు, వేణుమాధవ్, యూనియన్ ప్రతినిఽధి తోట సుధాకర్, టీయూడబ్ల్యూజే –143 హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధాకర్, అర్షం రాజ్కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు పిన్నా శివకుమార్, అబ్బు వెంకట్రెడ్డి, అల్లం రాజేష్ వర్మ, సదానందం, ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్టు సంఘాల నుంచి తిరుపతి, గొట్టె వెంకట్, సంపెట వెంకటేశ్వర్లు, వరప్రసాద్, ఐజేయూ – టీయూడబ్ల్యూజే జిల్లా నాయకుడు ఊటుకూరు సాయిరాం, సీనియర్ జర్నలిస్టులు అల్వాల సదాశివుడు, కోలా కృష్ణకుమార్ రెడ్డి, అహ్మద్, బత్తిని రాజేందర్, రమేష్, నరేందర్, వెంకటస్వామి, సుధాకర్, నాగరాజు, రమేష్, అనిల్, రాజిరెడ్డి, శ్రీనివాస్, డెస్క్ జర్నలిస్టులు మహేష్, ఓంకార్, రవికుమార్, అశోక్, రాజు, రమేష్, దాసరి బాబు, రాంచందర్ రావు, రామాచారి, శ్రావణ్, శ్రీనివాస్, మధుసూదన్, పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన -
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
వరంగల్ స్పోర్ట్స్: మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, బాల్యం నుంచే ఏదో ఒక క్రీడను ఎంచుకుని అందులో రాణించాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో నెలరోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని కేఎంసీ మైదానంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రత్యేక శిక్షణ శిబిరాల ద్వారా సరికొత్త మెళకువలు నేర్చుకోవాలని క్రీడాకారులకు చెప్పారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా కేఎంసీ మైదానం.. ఎంతో మంది జాతీయస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూసీఏ ఉపాధ్యక్షులు సదాశివ, రాము, కార్యవర్గ సభ్యుడు అభినవ్ వినయ్, కోచ్ గోవింద్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం -
‘కాళేశ్వరం’ అప్పుడు.. ఇప్పుడు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం 1975కు పూర్వం శిధిలావస్థలో ఉండేది. అప్పటి వరకు కీకర దండకారణ్యం కావడంతో కాకులు దూరని కారడవిగా ఉండే ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు ప్రత్యేక చొరవ తీసుకొని జీర్ణోద్దరణ కమిటీ వేసి పనులు ప్రారంభించారు. కమిటీలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, అప్పటి కలెక్టర్ ఇతరులు సభ్యులుగా ఉన్నారు. రోడ్డు, రవాణా, విద్యుత్, కనీస అవసర సదుపాయాలు కల్పించారు. 1982లో శృంగేరి శారద పీఠాధిపతులు విద్యాతీర్థమహాస్వామి, భారతీతీర్ధస్వామి చేతుల మీదుగా కుంభాభిషేకం చేసి జీర్ణోద్దరణ జరిపారు. తర్వాత దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అనేక మార్పులు సంతరించుకున్నాయి. నాడు పదుల సంఖ్యలో వచ్చే భక్తులు.. ప్రస్తుతం వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం దేవాలయం వార్షికాదాయం రూ.6 కోట్లకు చేరింది. రోడ్డు, రవాణా, అంతర్రాష్ట్ర వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. దేవస్థానం దేశవ్యాప్తంగా కీర్తి పొందుతూ ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి సీఎం కేసీఆర్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో రూ.25కోట్ల వరకు నిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక దృిష్టితో నిధులు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. ఈనెల 15 నుంచి 26 వరకు సరస్వతీనది పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. త్రివేణి సంఘమైన(గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీనది) కాళేశ్వరంలో 12ఏళ్లకోసారి ఒక్కో నదికి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. -
పుష్కరాలకు వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 15నుంచి 26వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం తివ్రేణి సంగమం వద్ద నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపుల్లో వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు. తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు కాళేశ్వరం పీహెచ్సీలో తాత్కాలికంగా 10 పడకలను ఏర్పాటు చేసి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్, పల్స్మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్ నర్సులను నియమించనున్నారు. పీహెచ్సీలకు ఇబ్బంది కలగకుండా.. కాళేశ్వరంలో ఏర్పాటు చేసి వైద్య శిబిరాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజులపాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారులు, సిబ్బంది కేటాయించారు. ఆర్బీఎస్కే, పల్లెదవాఖాలు, పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవిని నియమించారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రెండు మానిటరింగ్ టీమ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలుకాళేశ్వరం పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలను సంప్రదించాలి. ఎక్కువసేపు ఎండలో తిరగొద్దు. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. రోజూ ఒక్కో క్యాంపులో 2వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. – మధుసూదన్, డీఎంహెచ్ఓకాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు ఒక్కో శిబిరంలో 10 పడకలు 36 మంది వైద్యులు, 450 మంది సిబ్బంది రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు10 చోట్ల క్యాంపులు కాళేశ్వరంలో 11 రోజులపాటు మూడు షిఫ్టులో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్ –1, పార్కింగ్–2, పార్కింగ్ –3, హరిత హోటల్, గోదావరి మెయిన్ ఘాట్, వీఐపీ ఘాట్, హెలిపాడ్ దగ్గరలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఉన్న పీహెచ్సీలో 10 పడకలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో డాక్టర్(ఎంఎల్హెచ్పీ), హెల్త్ సూపర్వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్ఎం, ఆశ వర్కర్లను నియమించారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహాదేవపూర్లోని సీహెచ్సీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
చిన్నారులతో మండుటెండల్లో పనులు
కొత్తగూడ: చిన్న పిల్లలు అనే దయ లేదు.. కూలీ డబ్బులు మిగులుతాయని కక్కుర్తిపడి ఓ తునికాకు కాంట్రాక్టర్.. చిన్నారులకు రూ.20 ఇస్తానని ఆశ చూపి మండుటెండలో కల్లంలో పనులు చేయించడం మండలంలో చర్చనీయాశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూనుగొండ్ల యూనిట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మండలంలోని దుర్గారం గ్రామంలో తునికాకు సేకరిస్తున్నాడు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి కట్టలు తడిశాయి. వాటిని దులుపుకుంటూ తిప్పి పెట్టాల్సి ఉంటుంది. అందుకు పెద్దవారిని పనికి పిలిస్తే ఒకరికి కూలీ రూ.400 ఇవ్వాల్సి వస్తుంది. అది మిగిల్చుకోవాలనే కక్కుర్తితో స్థానికంగా కనిపించిన చిన్నారులకు రూ.20 ఇస్తానని చెప్పి మండుటెండలో పనులు చేయించాడు. చిన్నారులు పనులు చేస్తుంటే సదరు కాంట్రాక్టర్ కింద పనిచేసే గుమస్తా.. చెట్టు నీడన ఉండి త్వరగా పని చేయండి అంటూ.. హుకుం జారీ చేయడంతో చిన్నారులు మండుటెండలో కట్టలను మార్చారు. ఈవిషయం కాస్త సోషల్ మీడియాలో రావడంతో ఆదివాసీ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు మండి పడుతున్నాయి. ఎండ తీవ్రతకు చిన్నారులకు ఏదైనా జరగరానికి జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
సుందరీమణుల రాకకు సుందరంగా..
ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోట సుందరంగా ముస్తాబవుతోంది. శుక్రవారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుగుల్లో శిల్పకళా సంపద మరింత అందంగా, ఆకర్షణీయంగా కనివిందు చేస్తోంది. ఈ సందర్భంగా కాకతీయుల రాజధాని మధ్యకోటలో జరుగుతున్న పనులను కుడా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. శిల్పాల ప్రాంగణం, కోట రోడ్డుకు ఇరువైపులా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాల వెలుగుల్లో శిల్పకళా వైభవాన్ని సుందరీమణుల వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రాత్రి శిల్పాల ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు అజిత్రావు, భీమ్రావు, బల్దియా అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ అజయ్, గైడ్ దేనబోయిన రవియాదవ్, డీఈ మల్లికార్జున్, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు
మహబూబాబాద్ రూరల్ : దేశ వ్యాప్తంగా నెలకొ న్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, సరిహద్దు జిల్లాలో మావోయిస్టుల అలజడుల నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టపరిచేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను గుర్తించి విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక బలగాలతో నిఘా చర్యలను ముమ్మరం చేసి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. గ్రామస్థాయిలో పోలీస్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖ పక్షాన ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 నంబరుకి లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
చెరువుల మరమ్మతులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్: జిల్లాలో గత వానాకాలం భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో గురువారం ఇరిగేషన్శాఖ డీ ఎస్ఈ వసంత్కుమార్, డీఈలు రమేశ్, చిట్టిబాబు ను రవీందర్రావు కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కొన్ని చెరువుల కట్టలు తెగిపోయాయని, వాటితో ప్రమాదం పొంచి ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కూడా జిల్లాలో పర్యటించి కొన్ని చెరువులను సందర్శించినా అధికారులు ఆ పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. చెరువుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళ్లి మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, నాయకులు ఎడ్ల వేణుమాధవ్, జేరిపోతుల వెంకన్న, కన్నా, కర్పూరపు గోపి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
ఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కల్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్క్వార్టర్స్కు తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ప్రత్యేక బందోబస్తుతో హెడ్క్వార్టర్స్కు మృతదేహాల తరలింపు -
ధాన్యం రవాణాలో జాప్యం చేయొద్దు
కేసముద్రం: కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం చేయకుండా ధాన్యాన్ని రవాణా చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. గురువారం మండలంలోని తాళ్లపూసపల్లి, కల్వల, మహముద్పట్నం, కోరుకొండపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, రవాణా విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ నిర్వాహకులు, సిబ్బంది, హమాలీలు, రైతులకు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వేగవంతంగా రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎర్రయ్య, ఏఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడి అమానుషం
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి విజయవాడలోని నివాస గృహంపై ఏపీ పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం మహబూబాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టు సంఘాల నాయకులు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్తో పాటు ఎల్హెచ్పీఎస్, సేవాలాల్ సేన, కేవీపీఎస్, మా అసోసియేషన్, వికలాంగ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి ముత్యాలమ్మ సెంటర్ మీదుగా అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు చేసిన దాడులు అమానుషమన్నారు. ఏపీ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. నిజాలను నిర్భయంగా రాసే పత్రికల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే మేధావులు, ప్రజాస్వామిక వాదులు సహించబోరని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, బానోత్ లింగ్యానాయక్, సీపీఎం నాయకులు సమ్మెట రాజమౌళి, దుడ్డెల రాంమూర్తి, మంద శంకర్, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, కాంగ్రెస్ నాయకులు గుగులోతు రాములునాయక్, ఇనుగుర్తి సుధాకర్, పద్మం ప్రవీణ్కుమార్, అంజాద్, శ్రీను, జన్నారపు విక్రమ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు హెచ్.లింగ్యా, గుజ్జు దేవేందర్, బీఆర్ఎస్ నాయకుడు మందుల రఘు, ఎల్హెచ్పీఎస్ నాయకులు గుగులోత్ భీమనాయక్, మంగీలాల్, సేవాలాల్ సేన నాయకుడు ధరావత్ వెంకన్ననాయక్, జర్నలిస్టు సంఘం నాయకులు సీహెచ్.ఉదయ్ధీర్, పద్మం మహేశ్, ఆకుల నవీన్, పసుపులేటి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, విద్యార్థి సంఘాల నాయకులు గుగులోత్ సూర్యప్రకాశ్, కేలోత్ సాయికుమార్, ఇరుగు మనోజ్కుమార్, పాషా, శంకర్, ఫజల్, దాసరి సారయ్య, శివవర్మ, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం, అర్రం రమేశ్చందర్, బోనగిరి శ్రీనివాస్, ఇరుకుల్ల కిరణ్కుమార్, జిల్లెలమూడి మురళిమోహన్, చింతకుంట్ల యాకాంబ్రం తదితరులు పాల్గొన్నారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు, పార్టీల నాయకులు, కుల సంఘాలు మహబూబాబాద్ పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ అంబేడ్కర్ సెంటర్లో నిరసన -
నేడు‘డయల్ యువర్ డీఎం’
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి ● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్: కూరగాయాల మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు ఇలా అన్ని ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండాలని మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. ల్ మార్కెట్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈ సీహెచ్ఉపేందర్, నాయకులు ఎడ్ల రమేశ్, ఖలీలు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన కేసముద్రం: ఇనుగుర్తి మండలంలోని పాతతండాజీపీలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం పరిశీలించారు. పనులను త్వరిగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్ పాల్గొన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి పెద్దవంగర: ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్కుమార్, డీపీఎం నళినినారాయణ అన్నారు. గురువారం మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధాన్యం తరలింపునకు మండలంలో 120 లారీలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అధైర్య పడొద్దని ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్, ఏఓ స్వామి నాయక్, ఏపీఎం రమణాచారి, పీఏసీఎస్ సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి నాలుగు కోర్సులు కేసముద్రం: కేసముద్రం పట్టణ కేంద్రంలో ఇటీవల మంజూరైన పాలిటెక్నిక్ కాలేజీలో నాలుగు కోర్సులను ప్రవేశపెడుతూ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అండ్ మిషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఎంబీడెడ్ సిస్టం కోర్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా పాలిటెక్నిక్ కాలేజీని మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కాగా 2025–26 విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కాలేజీలో నాలుగు కోర్సుల్లో విద్యాబోధన జరగనుంది. -
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలి
నెహ్రూసెంటర్: తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జీజీహెచ్ నుంచి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ రవిరాధోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో 167 మంచి చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని ఇది ఒక జన్యుసంబంధిత వ్యాధి అన్నారు. వ్యాధితో బాధపడేవారు, కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నెలల వయస్సులోనే వ్యాధి లక్షణాలను మనం గుర్తించవచ్చన్నారు. వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు వివాహం చేసుకోవాలకుంటే తప్పనిసరిగా తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు సారంగం, సుధీర్రెడ్డి, శ్రవణ్, రవీందర్, అనిత, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
నేటి నుంచి వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాలో ఆరు వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి (శుక్రవారం) నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక పాలకవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాన్ని హెచ్సీఏ ఆమోదించినట్లు తెలిపారు. గ్రామీణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధే ధ్యేయంగా అన్ని క్రికెట్ సెంటర్లలో ఉదయం, సాయంత్రం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–14, 16, 19, 23 బాలబాలికల విభాగాల్లో శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శిబిరాల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఆరు సెంటర్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్క్యాంపుల వివరాలు: కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్: కోచ్ తోట రాము 99665 59414 మహబూబాబాద్, కాంక్రీట్ గ్రౌండ్ అజయసారథి 98664 79666 భూపాలపల్లి, సింగరేణి స్టేడియం శ్రీనివాస్ 88978 05683 పరకాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభినవ్వినయ్ 96662 06662 ములుగు, తంగేడు గ్రౌండ్ సందీప్నేత్ర 90301 30727 జనగామ, సెజ్ పాఠశాల గ్రౌండ్ దిలీప్రెడ్డి 99590 00003 -
జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కై లాస్యాదవ్
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన బైరబోయిన కై లాస్యాదవ్ ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో హైదరాబాద్ నాంపల్లిలో జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికలు నిర్వహించగా, అంతర్జాతీయ క్రీడాపోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఫలితాలను నిలిపివేశారు. కాగా, గురువారం తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల నూతన కమిటీ జాబితాను జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ అలహాబాద్ రిటైర్డ్ జడ్జి ఫంకజ్ నఖ్వీ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురికి పదవులు దక్కాయి. రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా డి.సంతోశ్, బి.సాయిరాం యాదవ్, టెక్నికల్ కమిటీ చైర్మన్గా సీహెచ్.రాము, టెక్నికల్ కమిటీ సెక్రటరీగా నాగరాజు ఎన్నికయ్యారు. వారంతా నాలుగేళ్లపాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. టీజీఆర్జేసీ ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తివిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం ఈ నెల 10న నిర్వహించనున్న టీజీఆర్జేసీ సెట్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆ సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ కె.ఇందుమతి గురువారం తెలిపారు. హనుమకొండలో 32 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 7,564 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్టికెట్లు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, కిషన్పురలో చైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రం అని హాల్టికెట్లు జారీ అయిన అభ్యర్థులకు హనుమకొండలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ సెంటర్కు మార్చారని, గమనించాలని ఆమె కోరారు. ● సెట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఇందుమతి -
ఇసుక లారీ వేగానికి ఓ ప్రాణం బలి
కాటారం: ఇసుక లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడకు చెందిన రాజలింగు(58) కాటారం మండల కేంద్రంలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇసుక లారీ ఢీ కొని మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్ష్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడకు చెందిన తుల్సెగారి రాజలింగు బయ్యారం సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన బంధువుల వివాహానికి ద్వి చక్రవాహనంపై వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం బైక్పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. చింతకాని క్రాస్ సమీపంలోకి రాగానే భూపాలపల్లి వైపుగా వస్తున్న ఇసుక లారీ వేగనియంత్రణకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించబోయి రాంగ్రూట్లో వచ్చి రాజలింగు బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాజలింగు కాలు ఎముకలు లారీ ముందు భాగంలో చిక్కుకొని తెగిపోవడంతోపాటు ఆయన రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్రగాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయబోమని రాజలింగు కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనకు దిగే ప్రయత్నం చేశారు. గంటపాటు ఎస్సై బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై గీతారాథోడ్ తెలిపారు. మృతుడిది మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామం -
పైఎత్తు వేద్దామా..
ఎత్తుకుసంతోషంగా ఉంది..పదిహేను రోజులుగా చెస్ నేర్చుకుంటున్నా. మొదటి రోజు ఏనుగు, గుర్రం, ఒంటె, సైనికులు అంటూ సార్ చెబుతుంటే ఏం అర్థం కాలేదు. నాలుగైదు రోజుల తర్వాత నుంచి కొద్దిగా ఆడడం వస్తోంది. ఇప్పుడు ఆడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి రోజు మూడు గంటల శిక్షణ, ఆ తర్వాత ఇంటికెల్లాక ప్రాక్టీస్ చేస్తున్నా. – శాన్విక , రెండో తరగతి, శ్రీనివాసకాలనీ మూడు గంటల శిక్షణవేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11గంటల వరకు శిక్షణ అందిస్తున్నాం. చెస్ అర్థం కావడానికి కొందరికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది. సులువైన పద్ధతుల్లో చెస్ ఆడడం నేర్పిస్తున్నా.. ఏప్రిల్ 24న ప్రారంభమైన శిబిరం ఈనెల 24న ముగియనుంది. వేసవి శిబిరం అనంతరం కూడా మా అకాడమీలో తరగతులు నిరంతరం కొనసాగుతుంటాయి. ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నాం. వివరాలకు 90595 22986 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు. – కన్నా, అకాడమీ నిర్వాహకుడువేసవిలో చెస్ శిక్షణ తరగతులు ● చిన్నారుల మేధస్సుకు పదును ● ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులువరంగల్ స్పోర్ట్స్: కాస్త సమయం దొరికిందంటే చాలు సెల్ఫోన్తో కాలక్షేపం చేసే పిల్లలే ఎక్కువ.. ప్రస్తుతం వేసవి సెలవులు తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయి. సె లవుల్లో పిల్లలను ఫోన్కు ఎలా దూరంగా ఉంచాలో తెలియక కొందరు తల్లిదండ్రులు తికమక పడుతుండగా.. పిల్లలను ఖాళీగా ఉంచకుండా వారి మేధస్సుకు పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు అమ్మానాన్నలు. చదరంగంలో శిక్షణ అందిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేయడమెలా? అంటూ మెదడుకు పదునుపెట్టిస్తున్నారు. దీంతో పిల్లలు సైతం మరో ఆలోచనలోకి వెళ్లకుండా శ్రద్ధగా చదరంగంలో శిక్షణ పొందుతున్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ స్కూల్లో కన్నా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చదరంగ వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులు చెస్ బోర్డుపై పావులు కదుపుతూ బిజీగా మారిపోయారు. ఈక్రమంలో చదరంగం ఆట తీరు, ఎలా ఆడతారు? చెస్బోర్డు విశేషాలు, శిక్షణ పొందుతున్న చిన్నారుల అభిప్రాయాలతో ‘సాక్షి’ కథనం. మొత్తం 64 గల్లు 17సెంటిమీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పుతో 32 తెలుపు, 32 నలుపు గల్లతో ఆకర్షణీయంగా ఉండే చదరంగ బోర్డు మనిషిలోని మేధస్సును తట్టిలేపుతుందనడంలో అతిశయోక్తి లేదు. చదరంగంలో ఆరితేరారంటే జీవితంలోని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే సామర్థ్యం పొందొచ్చని చెప్చొచ్చు. మానవమేధస్సుకు పదునుపెట్టే ఈ చదరంగం పుట్టినిల్లు భారతదేశం కావడం విశేషం. భారత్లో పుట్టిన చదరంగం ప్రస్తుతం విశ్వక్రీడగా విరాజిల్లుతోంది. ఆట ఇలా... చెస్ అనగానే మనందరికీ తెలిసింది.. సైనికులు, ఏనుగు, ఒంటె, గుర్రం, రాజు, మంత్రి వీటిలో ఒక్కో పావుకు విభిన్న కదలికల రూపం ఉంటుంది. ఇందులో రెండు రుక్ (ఏనుగు)లు, రెండు నైట్ (గుర్రం)లు, రెండు బిషప్ (ఒంటె)లు, ఒక కింగ్ (రాజు), ఒక క్వీన్(మంత్రి), 8 మంది పాన్ (సైనికులు)లు ఉంటారు. పాన్లను ముందుకు కదుపుతూ.. అత్యవసర సమయంలో మిగిలిన పావులను కదుపుతూ ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ఆడాల్సి ఉంటుంది.మూడు విభాగాల్లో.. టోర్నమెంట్లలో 3 నిమిషాల్లోపు ఆడే ఆటను బుల్లెట్గా, 5 నిమిషాల్లోపు ముగించే ఆటను బ్లిడ్జ్గా, 10 నుంచి 15 నిమిషాలకు పైగా ఉండే ఆటను ర్యాపిడ్ వి భాగంగా, 25 నిమిషాలు, ఆపై ఆడే ఆటను క్లాసికల్ గేమ్గా పిలుస్తారు.టైం సరిపోవట్లేదు.. వారం రోజులు చెస్పై అసలు పట్టు దొరకలేదు. అప్పుడు చెస్ అంటేనే భయమేసేది. ఇప్పుడు ఆడుతుంటే అసలు టైమే సరిపోవడం లేదు. ఒకటి రెండు ఆటలు ఆడడానికే రెండు మూడు గంటల సమయం పడుతోంది. సార్ కొత్త టెక్నిక్స్తో ఎలా ఆడాలో చెబుతున్నారు. రోజుకో టెక్నిక్తో చెస్పై మరింత శ్రద్ధ పెరిగింది. – అక్షిత, రాంనగర్ -
లోగో డిజైన్ కమిటీ సభ్యుడిగా నారాయణ
కేయూ క్యాంపస్: ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మక్కసారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను రూపొందించేందుకు ఆ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ లోగో డిజైన్ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. ఆకమిటీలో కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ ఈసం నారాయణను సభ్యుడిగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు యూనివర్సిటీకి పంపగా.. వీసీ ప్రతాప్రెడ్డి ఈసం నారాయణకు అందించి అభినందించారు. లోగో డిజైన్ కమిటీ చైర్మన్గా ట్రైబల్ యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. మరో ఇద్దరు సభ్యులుగా ఇతర యూనివర్సిటీలకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేసిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్రావు ఉన్నారు. ఓరుగల్లు పీఠం పాలనాధికారిగా విజయపాల్రెడ్డికాజీపేట రూరల్: ఓరుగల్లు మేత్రాసనం క్యాథలిక్ పీఠం పాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్)గా పి. విజయపాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన విజయపాల్రెడ్డి 1992లో క్యాథలిక్ గురువుగా పదోన్నతి పొందారు. తర్వాత ఫాతిమా బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్గా, ఫాతిమా లోడి సంస్థ డైరక్టర్గా సేవలందించి ఇక్కడి నుంచి జనగామ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఓరుగల్లు పీఠాధిపతిగా ఉన్న బిఫప్ ఉడమలబాల ఇటీవల పదోన్నతిపై వి శాఖపట్నం ఆర్చీ బిషప్గా వెళ్లడంతో అప్పటి నుంచి ఓరుగల్లు క్యాథలిక్ పీఠానికి బిషప్ లే రు. కొత్త బిషఫ్ ఎంపిక ఆలస్యం అవుతున్న నే పథ్యంలో ఓరుగల్లు క్యాథలిక్ డయాసిస్ కౌన్సి ల్ వారు విజయపాల్రెడ్డిని పాలనాధికారిగా ఎన్నుకున్నట్లు గురువారం వారు తెలిపారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యమామునూరు: ఆర్థిక ఇబ్బందులతో మామునూరుకు చెందిన గూడెం రాజ్కుమార్(24) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్కుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోదరి వివాహానికి మొత్తం ఖర్చు తానే భరిస్తానని తల్లికి మాట ఇచ్చాడు. పెళ్లి తేదీ సమీపిస్తుండడంతో డబ్బులు సర్దుబాటు కాలేదని మనస్తాపం చెంది రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. -
సరస్వతీ పుష్కరాలకు పటిష్ట భద్రత
కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి పుష్కరాల పనుల్ని ఆయన పరిశీలించారు. ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం సీఎం రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై కాళేశ్వరం దేవస్థానం, ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్లు, పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాలకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారని, భక్తులకు ఇబ్బందులు కల్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కాళేశ్వరాలయంలో పూజలు మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి కాళేశ్వరం దేవస్థానానికి రాగా.. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి సన్మానించారు. ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం, భూపాలపల్లి, డీఎస్పీలు రామ్మోహన్రెడ్డి, సంపత్ రావు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, మహాదేవపూర్ సీఐ రామచందర్రావు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి కాళేశ్వరంలో ఎస్పీతో కలిసి ఏర్పాట్ల పరిశీలన -
ముగ్గురిపై పెంపుడు కుక్క దాడి
మహబూబాబాద్ రూరల్: ఏడేళ్ల చిన్నారితో పాటు కాపాడబోయిన బాలిక బంధువులపై పెంపుడు కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన మహబూబాబాద్ మండలం కేవులతండాలో గురువారం చోటుచేసుకుంది. కేవుల తండాకు చెందిన బాదావత్ బిక్యా తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అతడు ఆ కుక్కను ఇంట్లో కట్టేయకుండా వదిలేశాడు. ఇరుగుపొరుగువారు చెప్పినా వినలేదు. ఈక్రమంలో బుధవారం రాత్రి బానోత్ శ్రీకాంత్, అరుణ దంపతుల ఏడేళ్ల కుమార్తె హర్షిత వీపుభాగంలో కుక్క దాడి చేసి గాయపర్చింది. తల్లిదండ్రులు స్థానికంగా వైద్యం అందించారు. ఉదయం చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా మళ్లీ కరిచింది. గమనించిన తండావాసులు, బాలిక బంధువులు బాదావత్ కిషన్, రక్మీ దంపతులు కుక్కను తరిమేసి హర్షిత గాయాల్ని కడుగుతుండగా.. కుక్క మళ్లీ వచ్చి కిషన్, రక్మీ దంపతులను కరిచింది. తీవ్రగాయాలవడంతో స్థానికులు వారిని చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పెంపుడు కుక్క యజమానిపై కేసు పెంపుడు కుక్క దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపర్చిన ఘటనలో కుక్కను పెంచుతున్న బాదావత్ బిక్యాపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపిక గురువారం రాత్రి తెలిపారు. చిన్నారికి తీవ్ర గాయాలు కాపాడబోయిన వారిపైనా.. -
భక్తులకు ఆర్టీసీ విస్తృత సేవలు
కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు. గురువారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తాత్కాలిక బస్స్టేషన్, ఘాట్లను సందర్శించారు. తాత్కాలిక బస్ స్టేషన్ వద్ద గ్రౌండ్ లెవలింగ్, విద్యుత్ పనులు, తాగునీరు, టాయిలెట్ల ఏర్పాట్లు సమీక్షించారు. హనుమకొండ – కాళేశ్వరం, మంచిర్యాల – కాళేశ్వరం, గోదావరిఖని – మంచిర్యాల – కాళేశ్వరం మార్గాల్లో స్పెషల్, రెగ్యులర్ సర్వీసులు నడిపేందుకు ప్లాన్ ఆపరేషన్పై చర్చించారు. ప్రస్తుతం హనుమకొండ, మంచిర్యాల, మంథని, గోదావరిఖని వంటి వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరం వరకు 67 ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా, వారి రవాణా సౌకర్యార్థం 400 బస్ ట్రిప్స్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆయనతో ఆర్ఎం భాను, డీఎం ఇందు తదితరులు ఉన్నారు.● రద్దీ పెరిగితే 400 ట్రిప్పులు తిరిగేలా ప్రణాళికలు ● అన్ని రూట్లలో సర్వీసులు సిద్ధం: కరీంనగర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ -
విద్యార్థులకు వినూత్నంగా బోధించాలి
విద్యారణ్యపురి: విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా వినూత్నంగా విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాపరిశోధన శిఽక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ గాజర్ల రమేశ్ కోరారు. కాజీపేట ఫాతిమా నగర్లోని బాలవికాస్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా స్థాయి రిసోర్స్పర్సన్లకు మూడురోజులుగా శిక్షణ నిర్వహిస్తున్నారు. గురువారం ఆయన ఈశిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. డీఆర్పీలను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలతో ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డుల ద్వారా ఐసీటీని ఉపయోగిస్తూ బోధించడం వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, ఎస్సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డి నేటర్లు ఎల్లయ్య, గణపతి, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు రంగపాణిరెడ్డి, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. టీచర్ల శిక్షణలోఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ -
వడదెబ్బతో ఇద్దరు మృతి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కాంటా వేస్తున్న హమాలీ కార్మికుడు శివరాత్రి శ్రీనివాస్ (35) వడదెబ్బతో మృతి చెందాడు. వర్ధన్నపేట మండలం సాగరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ వరంగల్లోని సుందరయ్యనగర్లో నివాసం ఉంటూ.. మార్కెట్లో హమాలీగా పనిచేస్తున్నాడు. గురువారం శ్రీనివాస్ యథావిధిగా పసుపు యార్డులోని గజేంద్ర అడ్తికి వచ్చిన మిర్చి బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు ప్రథమ చికిత్స చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మార్కెట్లోని అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లుగా కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. శ్రీనివాస్ మృతిపై మార్కెట్ అధికారులు, కార్మికులు, వ్యాపారులు, సుందరయ్యనగర్ వాసులు ప్రగాఢ సంతాపం తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో రైతు..భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలీటీ పరిధి కాసీంపల్లి గ్రామానికి చెందిన రైతు చిత్తారి చిన్నరాజయ్య (68) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. చిన్నరాజయ్య బుధవారం వరి ధాన్యం కోసేందుకు పనికి వెళ్లాడు. సాయంత్రం అస్వస్థకు గురవగా.. కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోనిఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం సాయంత్రం మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎండ తీవ్రత పెరిగిన కారణంగా వడదెబ్బ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆదివారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. -
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం సరస్వతి పుష్కరాల విధులు, పనుల పర్యవేక్షణపై రెవెన్యూ, పంచాయతీరాజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి వస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు ప్రొటోకాల్ విధులు, ఎంపీడీఓలు పారిశుద్ధ్య విధుల పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద రెండు రోజుల్లో మొత్తం పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి పరిశుభ్రం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చూసుకోవాలన్నారు. పుష్కర విధులు కేటాయించిన అధికారులు శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. సమయం తక్కువగా ఉందని పనులు, ఏర్పాట్లు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. సరస్వతీ మాత విగ్రహం ప్రారంభోత్సవం, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు, ఉచిత అన్నదానం.. ఇలా ప్రతీ అంశాన్ని పర్యవేక్షించేందుకు నియమించిన అధికారులు శుక్రవారం నుంచి పటిష్ట పర్యవేక్షణ చేయాలని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో టెలికాన్ఫరెన్స్ -
తండ్రికి సాయం చేస్తూ మృత్యుఒడిలోకి..
డోర్నకల్: ఇంటిపనుల్లో తండ్రికి సాయం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు ట్రాక్టర్కిందపడి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోగుల నర్సయ్య తన ఇంటిలో బాత్రూమ్ నిర్మాణానికి కావాల్సిన సైజురాయిని బుధవారం స్వంత ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చాడు. రాయిని కిందకు దింపేందుకు ట్రాక్టర్ను ఇంటి సమీపంలో ఒంపుగా ఉన్న ప్రాంతంలో నిలిపి టైరుకు అడ్డుగా రాయిపెట్టాడు. తర్వాత ట్రాక్టర్ను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తూ కుమారుడు పోగుల ఉమేష్(17)ను టైరుకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించాలని సూచించాడు. ఉమేష్ రాయిని తొలగిస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా కదిలి టైర్లు ఉమేష్ మీదుగా వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉమేష్ను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమేష్ సెలవులకు ఇంటికి వచ్చి తండ్రికి పనుల్లో సహాయపడుతున్నాడు. కళ్లెదుటే కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉమేష్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి మృతుడి సోదరుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమ తెలిపారు. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి -
చదువుల కోటగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లాను చదువుల కోటగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పదో తరగతిలో ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో సాధించినందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్, డీఈఓ రవీందర్రెడ్డిని ఎమ్మెల్సీ రవీందర్రావు బుధవారం కలెక్టరేట్లో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు దౌలగర్ శంకర్, రఘు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశించినమేర పనులు జరగలేదు..
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లలో ఆశించిన మేర పనులు జరగడం లేదని, మూడు షిప్టుల్లో పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, అధికారులతో కలిసి సరస్వతీనది పుష్కరాల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. వీఐపీ ఘాట్ విస్తరణ, గోదావరి ఘాట్లు, టెంట్సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 86గదుల గెస్ట్హౌస్, హెలిపాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, కాంట్రాక్టర్లకు పలుసూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి విధులు కేటాయించాలన్నారు. మొట్టమొదటి సారి గా జాయ్రైడ్, టెంట్సిటీ ఏర్పాటు చేస్తున్నారని కలెక్టర్ను అభినందించారు. సివిల్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయని, లోపాలు రావొద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని, 24/7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మంత్రి వస్తున్నారని, రూపురేఖలు మారాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. షవర్ పనులు పెండింగ్ ఉన్నాయని, గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. ఫుడ్ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీఐపీ ఘాట్ రోడ్డు బారికేడింగ్ చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేయాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి రోజు 5వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. 15న సీఎం వస్తున్నారని, సరస్వతీమాత విగ్రహం ప్రారంభో త్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 5 సెక్టార్లు, 18 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 12వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేలా పట్టణంలోని ప్రధాన కూడళ్లులో ఎల్ఈడీ స్క్రీ న్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావే శంలో మంత్రులు దిశానిర్దేశం చేశారని తెలిపారు. అన్నిశాఖలు సమన్వయంతో పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, ఈఓ మహేష్, అడిషనల్ ఎస్పీ కిషన్ పాల్గొన్నారు.టెంట్సిటీ పనులు ప్రారంభం పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టెంట్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం రూ.50లక్షల వ్యయంతో హైదరాబాద్కు చెందిన ఆలిఎలిమెంట్ అనే ప్రైవేట్ సంస్థ టెంట్సిటీ పనులను ప్రారంభించింది. టెంట్సిటీ వీఐపీ(సరస్వతి)ఘాట్ సమీపంలో 30 టెంట్సిటీలు నిర్మిస్తున్నారు. 12 రోజులపాటు భక్తులు బస చేయడానికి వేసవి దృష్ట్యా ఏసీలు టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక రోజుకు రూ.3వేల అద్దె తీసుకోనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన మూడు షిప్టుల్లో పనులు చేయాలని సూచనపనులను పరిశీలిస్తున్న దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, కలెక్టర్, ఎస్పీఇంటెలిజెన్స్ ఎస్పీ పరిశీలన కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కరన్ బుధవారం ఆయన వీఐపీ, సాధారణ ఘాట్, పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్లు, ఆలయం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను సన్మానించి, తీర్ధప్రసాదం అందజేశారు. -
మార్పుతోనే పంట సిరులు!
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంసాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, అదివాసీలు అధికంగా ఉన్న మానుకోట జిల్లాలో నూటికి డైబ్బెశాతానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కాగా అతి వృష్టి, అనావృష్టితో పాటు చీడపీడల బెడదతో ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు. ఇటువంటి ప రిస్థితి నుంచి రైతులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘మూస పద్ధ్దతి మారాలి.. ఫలితం పెరగాలి’ అనే ఆలోచనతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వారి సమస్యలు విని, సలహాలు, సూచనలు ఇస్తూ వానాకాలం సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటన జిల్లా వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ అధికారులతోపాటు కృషి విజ్ఞానకేంద్రం మల్యాల వ్యవసాయ శాస్త్రవేత్తలు టీమ్గా ఏర్పడి రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పేరుతో జిల్లా వాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 5నుంచి జూన్13 వరకు అన్ని మండలాలు పర్యటించనున్నారు. ఇందులో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓతోపాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సదరు ఉపాధ్యాయులు రైతుల సమస్యలు, శాస్త్రవేత్తల సూచనలు విని బడిలో విద్యార్థులకు చెప్పాలి. వారి ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలనేది ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రధాన అంశాలు రైతులు నష్టపోవడం, దిగుబడి రాకపోవడం మొదలైన కారణాలకు మూలమైన అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు. వరిలో వెదజల్లే పద్ధతి, పత్తిలో అధిక సాంద్రత పద్ధతి పాటించాలి. యూరియా, ఇతర రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. ఇందుకోసం పచ్చిరొట్ట, జీలుగు, పెసర వంటి పంటలు వేసి కలియదున్నాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం తక్కువ కాల పరిమితి వంగడాలను సాగుచేయాలి. గట్లపై, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లను పెంచాలి. దీని ద్వారా వాతావరణంలోని సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానంగా పంట మార్పిడి పద్ధతి పాటించాలి. రెండు మూడు సంవత్సరాలకోసారి మట్టి పరీక్షలు నిర్వహించాలి. పోషక విలువల అధారంగా ఇతర ఎరువులు వాడాలి. ఎరువులు కొన్నప్పుడు రశీదు పొందాలి.. భద్ర పర్చుకోవాలి. వీటితోపాటు స్థానికంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ●న్యూస్రీల్ నూతన పద్ధతుల్లో పంటల సాగుపై రైతులకు అవగాహన మూస పద్ధతికి స్వస్తి పలకాలని సూచన వానాకాలం సాగుకు ముందు రైతుల సన్నద్ధం -
సొంత విత్తనాలే శ్రేయస్కరం
ఖిలా వరంగల్: ఏడాదంత శ్రమించినా.. పంట దిగుబడి లేకుంటే రైతుల కష్టం వృథా అవుతుంది. పంట దిగుబడి తగ్గడానికి ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే.. మరో ప్రధాన కారణం విత్తనాల ఎంపిక. విత్తనాల వల్ల ఎందరో రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో గత ఏడాది మిరప, పత్తి అంతకుముందు వరి రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పూత, కాత దిగుబడి రాకపోవంతో అనేకమంది రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఈనేపథ్యంలో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు గత రెండు ఏళ్ల నుంచి రైతులు సొంతంగా విత్తనాలను తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కల్తీల బెడద, కొనుగోలు భారం తగ్గించుకునేందుకు ఇంకొందరు మేలైన విత్తనాలను సేకరించుకుంటున్నారు. ఖరీదైన విత్తనాలు కొనుగోలు చేసినప్పుటికీ పంట ఏపుగా పెరుగుతుందే తప్ప దిగుబడి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గత ఏడాది నష్టపోయిన రైతులు చెబుతున్నారు. నకిలీవిత్తనాలతో మిరప, మొక్కజొన్న, పత్తి సాగు చేసి కంపెనీల చుట్టూ పరిహారం కోసం తిరిగినా, గిట్టుబాటు అవడం లేదని వాపోతున్నారు. ఆకర్షనీయంగా సంచులతో విత్తనాలు నింపి ప్రత్యేక ఆఫర్ల పేరిట వ్యాపారులు రైతులకు ఎర చూపి అంటకడుతున్నారు. నష్టపోయిన రైతులను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. విసిగివేసారిన రైతులు కొందరు గత ఏడాది పండించిన పంటలో కొంత భాగాన్ని వేరుగా చేసి నాణ్యమైన విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. దీని వల్ల ఆర్ధిక భారం తగ్గడంతోపాటు కల్తీల బెడద తగ్గనుంది. నకిలీల బారిన పడకుండా రైతుల ముందుచూపు ప్రతి ఏడాది విత్తనాల కొనుగోలుతో ఆర్థిక భారంజాగ్రత్తలు పాటించాలి..విత్తన షాపుల్లో మేలైన విత్తనాలుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగితే మొత్తం పరిహారం రైతు ఖాతాలో జమయ్యేలా చూడాలి. మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలు కొనకుండా సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడం మేలు. ప్రతి ఏడాది సొంత విత్తనాల ఉపయోగించి మేలైన దిగుబడిని సాధిస్తున్నా. – పులి అశోక్, రైతు సూరిపెల్లి ధాన్యాన్ని దాచి ఉంచాను.. గత ఏడాది వరకు విత్తనాలను కొనుగోలు చేశా. ఒక్కోసారి దిగుబడిలో తేడా వచ్చి పెట్టుబడి కూడా రాలేదు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టే మిరప పంటలో విత్తనాల ఎంపిక కీలకమైంది. లేకుంటే నష్టాలు తప్పవు. ఈ ఏడాది మేలైన వరి ధాన్యాన్ని దాచి ఉంచా. వాటితోనే సాగు చేసి అధిక దిగుబడి సాధించేందుకు ప్రయత్నిస్తా. – జగపతి బాబు, రైతు, రాంగోపాల్పురం, వరంగల్ -
మెళకువలు పాటిస్తే అధిక లాభాలు
గూడూరు: రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చని కేవీకే సమన్వయ కర్త మాలతి, డీఏఓ విజయనిర్మల అన్నారు. గూడూరు శివారు వడ్డెరగూడెం రైతు వేదికలో బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు భూమి సారాన్నిబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే పంటలను సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకంతో పంటలు, పొలంతో పాటు రైతులు అనారోగ్యం బారినపడతారని వివరించారు. అదే విధంగా తరచూ పంటల మార్పిడి చేయడంతో భూమి మరింత సారవంతంగా మారుతుందన్నారు. లైసెన్స్ కలిగిన మందుల షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, వాటి రశీదులు భద్రపర్చుకోవాలని కోరారు. రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని, ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ పంటలపై సబ్సిడీ లభిస్తుందని ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి మరియన్న తెలిపారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులందరూ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని విశిష్ట గుర్తింపు కార్డులను పొందాలని అన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, రాంబాబు, ఉపాధ్యాయుడు బి. శ్రీనివాస్, ఏఈఓలు అలెఖ్యరెడ్డి, మనోజ్, మధు, వినయ్, సుస్మిత పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని వంతడపల స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే ధాన్యం కొనగోలు చేసి తరలించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీటీ సుధాకర్నాయక్, సీసీ భీముడు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారానికి కృషి చేయాలి.. దంతాలపల్లి: మండలంలోని పేరుకుపోయిన రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని రామవరం, వేములపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. రైతుల దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ గణేశ్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల తహసీల్దార్లు సునీల్ కుమార్, నాగరాజు, ఆర్ఐ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.. మహబూబాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంచేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, మెప్మా డైరెక్టర్ విజయకుమారి, డీఏఓ విజయనిర్మల, డీవీహెచ్ఓ మరియన్న తదితరులు పాల్గొన్నారు. మరిపెడలో తనిఖీ.. మరిపెడ రూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం, ఎల్లంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ గణేశ్, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు సైదులు, సునీల్రెడ్డి, మరిపెడ పీఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరిరెడ్డి, సీసీ రుక్మిణి, సీఈఓ నరేష్, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
ఏసుక్రీస్తు అందరికీ దేవుడు
● దైవజనుడు పాల్సన్రాజ్ ● ముగిసిన క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలుధర్మసాగర్: సర్వమానవాళి కోసం భూలోకానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రజలందరికీ దేవుడని కరుణా పురం సొసైటీ ఆప్ క్రైస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్రాజ్ అన్నారు. ధర్మసాగర్ మండలం కరుణాపురంలో క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో 20వ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం వార్షికోత్సవ ఐదు రోజుల ప్రార్థన పండుగలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్సన్రాజ్ మాట్లాడుతూ.. 2006లో ప్రారంభమైన క్రీస్తుజ్యోతి ప్రార్థన పండుగలు ప్రతి ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సొసైటీ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాశ్ మాట్లాడుతూ క్రీస్తు జ్యోతి ప్రార్థన పండుగలకు వివిఽ ద రాష్ట్రాల నుంచి 5 రోజుల్లో లక్షకు పైగా తరలివచ్చి దీవెనలు పొందారని తెలిపారు. మందిరం పాస్టర్లు, సేవకులు, వలంటీర్స్, బ్రదర్స్, సిస్టర్స్, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. -
ప్రతి పేదవాడికి అండగా ఉంటాం
వాజేడు/వెంకటాపురం(కె) : ప్రతీ పేదవాడికి అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) ఏజెన్సీ మండలాల్లో ఆయన బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ సబ్ డివిజన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, పాత్రాపురం గ్రామంలో రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దున ఉన్న టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టులో భాగంగా పలు ఇళ్లకు భూమిపూజ చేశారు. వాజేడు మండల కేంద్రంలోని నాగారం గ్రామం నుంచి పాయబాటలు గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఏడ్జెర్లపల్లి నుంచి బొమ్మనపల్లి వరకు రూ.3 కోట్లతో నిర్మించే బీటీ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఎంపీడీఓ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన బర్త్ వెయిటింగ్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్రెడ్డి రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. పది నెలల కాలంలోనే 57, 662 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. భూభారతి చట్టం పేదరైతులకు చుట్టంగా మారిందని అన్నారు. రాజీవ్ యువవికాసం పథకంలో జూన్ 2న రూ.6వేల కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడిన అనంతరం నూతన పథకాలు అమలు చేస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల టేకులగూడెం నుంచే అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామన్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్ భార్య రాంబాయి, కూలి పనులను చేసుకునే ఉయిక అర్జున్ భార్య సావిత్రి మంత్రి పొంగులేటి శ్రీనువాస్రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అందలేదని చెప్పారు. స్పందించిన ఆయన త్వరలోనే వచ్చేలా చూస్తానని తెలిపారు. ఈ సందర్భంగా టేకులగూడెం వద్ద రైతులు మంత్రిని సన్మానించి నాగలిని బహూకరించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ శబరీష్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ కుమార్ ఆధ్వర్యంలో టేకులగూడెం వరకు రహదారి వెంట పోలీసు బలగాలు భద్రతగా ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ఎస్పీ శబరీశ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ, ఆర్డీఓ వెంకటేష్, ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏజెన్సీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కుంభకోణాల కాంగ్రెస్
హన్మకొండ: నిధులు, ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నారని, చివరకు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలనూ వదలడం లేదని దుయ్యబట్టారు. వీరి చేష్టలతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను దోపిడీ చేయడమే ఆదాయ మార్గంగా ఎంచుకున్న కాంగ్రెస్ మొన్న ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్లు, నిన్న పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్లు, నేడు రైతుల పంట కొనుగోలు కేంద్రాల్లో వినియోగించే తేమ శాతం కొలిచే యంత్రం, వేయింగ్ మిషన్, గ్రేడింగ్ మిషన్, టార్పాలిన్ షీట్ల టెండర్ల నిర్వహణలో టీజీ ఆగ్రోస్ దోపిడీకి పాల్పడిందని అన్నారు. తెలంగాణ ఆగ్రోస్ నిర్వహించిన టెంటర్ల తేదీని చెర్మన్ అనుయాయుల కోసం మార్చడమే కాకుండా సమయం దాటిపోయిన తర్వాత సీల్ వేసిన బాక్స్లు ఓపెన్ చేసి టెండర్లు వేయించారని, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో బీఆర్ఎస్ వద్ద ఉన్నాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు 25 ఎక్సెస్తో సమయం దాటిన తర్వాత టెండర్ దాఖలు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నయీముద్దీన్, బండి రజనీకుమార్, శరత్శ్చంద్ర, చాగంటి రమేష్ పాల్గొన్నారు. అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది మంత్రుల గాలి మాటలు.. చేతి వాటం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి -
పెట్రోల్ బాటిల్తో రైతు నిరసన
● ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘటన పెద్దవంగర: కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడంతో ఓ రైతు తన ధాన్యం బస్తాలకు పెట్రోల్ పోస్తానని హెచ్చరిస్తూ నిరసన తెలిపిన ఘటన మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సోమ్లాతండాకు చెందిన గుగులోత్ రవి తాను పండించిన ధాన్యాన్ని మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ఆరబోసిన అనంతరం ఐదు రోజుల క్రితం కాంటా పెట్టారు. అయితే తనకంటే వెనుక కాంటా పెట్టిన ధాన్నాన్ని లారీలో మిల్లుకు తరలించారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షంతో ఆ రైతు బస్తాలు తడిసిపోయాయి. ముడుపులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మిల్లుకు తరలిస్తున్నారనే విషయం ఆ రైతు గ్రహించాడు. దీంతో కలత చెందిన ఆయన కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పెట్రోల్ బాటిల్తో వాగ్వాదానికి దిగాడు. పైసలిస్తేనే లారీలో తరలిస్తారా.. అంటూ పెట్రోల్ పోసి ధాన్యాన్ని కాలుస్తానని హెచ్చరించాడు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందిచండంతో ఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతును శాంతిపజేశారు. -
ప్రజలకు అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అధికారులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరుగుతుందని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలన్నారు. రానున్న వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్షన్ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేయాలని ప్రోగ్రాం అధికారులను ఆదేశించారు. ఫార్మసీ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. మందులు ఇస్తున్నప్పుడు గడువు తేదీని ఫార్మసిస్టులు చూసుకోవాలని, పీహెచ్లలోని టెక్నీషియన్లు అవసరమైన వారికి శాంపిల్స్ తీసి టీహబ్కు పంపించాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు సారంగం, సుధీర్రెడ్డి, నాగేశ్వర్రావు, లక్ష్మీనారాయణ, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల పర్యటన
● ఈనెల 14న రెండు బృందాలుగా 57 మంది రాక ● రామప్ప, వరంగల్కోట, వేయిస్తంభాల ఆలయం సందర్శన ● అప్రమత్తమైన అధికార యంత్రాంగం ● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ● హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఓరుగల్లులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యాన అతిథులను ఆకట్టుకునేలా పర్యాటక ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు మూడంచెల పోలీసు భద్రతతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ట్రైసిటీతో పాటు రామప్పలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను వారి పర్యటన ముగిసే వరకు హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) నుంచి కూడా పర్యవేక్షించేలా అనుసంధానం చేస్తున్నారు. బుధవారం నుంచి ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి. సీసీ కెమెరాల నిఘా.. నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 49 వేల వరకు ఉన్నాయి. అలాగే ‘స్మార్ట్సిటీ’ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 750 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. అయితే వీటికి తోడు సుందరీమణుల పర్యటన నేపథ్యంలో హరిత కాకతీయ, వరంగల్ కోట, వేయిస్తంభాల ఆలయంలతో పాటు కీలక ప్రదేశాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. రామప్ప ఆలయ ప్రాంగణం, బయట సుమారు 50 నుంచి 70 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించే వీలుగా అనుసంధానం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. -
కేయూ స్పోర్ట్స్బోర్డులో అవకతవకలు
● వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డులో అవకతవకలకు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేయూ ఫిజికల్ ఎడ్యూకేషన్ కళాశాలకు చెందిన నలుగురు పరిశోధకులు మహ్మద్ పాషా, పల్లవి, బుచ్చయ్య, అవినాష్ బుధవారం వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రానికి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ, ఓ కాంట్రాక్టు సీనియర్ అసిస్టెంట్ కలిసి ఇష్టానుసారంగా స్పోర్ట్స్ బోర్డు పరిధిలోని పీడీలకు సంబంధంలేకుండా పలు క్రీడల టీమ్లకు ఓ వ్యక్తిని కోచ్ కమ్ మేనేజర్గా పంపారని ఆరోపించారు. 2022 నుంచి 2025 అకాడమిక్ ఇయర్ వరకు స్పోర్ట్స్ బోర్డు టీం లిస్టులు, పీడీల పేర్లు వారికి వినియోగించిన నిధులు సెటిల్మెంట్స్ బిల్సుపై కమిటీవేసి విచారణ చేపట్టి.. చర్యలు తీసుకోవాలని కోరారు. స్పోర్ట్స్ బోర్డు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన వీసీ ప్రతాప్రెడ్డి.. స్పోర్ట్స్ బోర్డుపై కమిటీతో విచారణ చేపడతామని హామీ ఇచ్చారని ఫిజికల్ ఎడ్యూకేషన్ కాలేజీ పరిశోధకుడు మహ్మద్పాషా తెలిపారు. -
మిజోరాం గవర్నర్ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ మిజోరాం గవర్నర్ డాక్టర్ విజయ్కుమార్ సింగ్ను రాజ్భవన్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ మిషన్ ‘హర్ శిఖర్ పర్ తిరంగ’లో భాగంగా యశ్వంత్ మిజోరం వెళ్లాడు. అక్కడ గవర్నర్ను కలువగా.. తన వంతు ప్రోత్సాహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్కు సూచించారు. ఫోన్ పే హ్యాక్ ● రూ.63వేలు మాయం కాటారం: ఫోన్ పే హ్యాక్ అవడం ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల్లో నుంచి రూ.63 వేలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కంకణాల సురేందర్రెడ్డి స్రవంతిలకు చెందిన రెండు మొబైల్స్కు అపరిచిత నంబర్ నుంచి లింకులు వచ్చాయి. వారి కుమార్తె ఆ లింక్లను ఓపెన్ చేయడంతో ఫోన్పే ద్వారా పలుమార్లు ఖాతాలోని డబ్బులు డెబిట్ అయ్యాయి. సురేందర్రెడ్డి ఫోన్పేకు చెందిన ఖాతా నుంచి రూ.33 వేలు, స్రవంతి ఫోన్పేకు చెందిన ఖాతా నుంచి రూ.30 వేలు పలుమార్లు డెబిట్ కావడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి. మెసేజ్లు రావడంతో గమనించిన సురేందర్రెడ్డి ఆందోళనకు గురై చివరకు ఫోన్పే హ్యాక్ అయినట్లు గుర్తించి బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శతాధిక వృద్ధురాలికి జన్మదిన వేడుకలు మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్పురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు జాగాటి వెంకటనర్సమ్మ 100వ జన్మదిన వేడుకలను బంధువుల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కుమారులు వెంకటయ్య, వీరస్వామి, కుమార్తెలు ఉపేంద్ర, సత్తెమ్మ, మనుమలు, మనమరాళ్లు బంధువులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య జనగామ రూరల్: కారుకొనివ్వలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామలోని మరిగడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కూరాకుల కనుకయ్య కుమారుడు కూరాకుల సాయిరాజ్ (22) డ్రైవింగ్ చేసుకునేవాడు. ఈక్రమంలో డ్రైవింగ్ చేయడానికి కారు కొనివ్వమని కొంతకాలంగా తల్లిదండ్రులను కోరాడు. వారు డబ్బులు లేవని నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాజ్ తీవ్ర మనోవేదనకు గురై ఎవరూ లేని సమయంలో తన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిరాజ్ తండ్రి కనకరాజు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నడికూడ: హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పులిగిల్ల గ్రామానికి చెందిన మోకిడి దీపక్ (30)హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ప నిచేస్తున్నాడు. బుధవారం ఉ దయం తన బైక్పై ప్ర యాణిస్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ఈఎంటీ ఆత్మహత్యాయత్నం..? భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 108 ఈఎంటీ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొద్ది రోజులుగా జీవీకే 108 విభాగం పైఅధికారులు వేధింపులతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఈఎంటీ బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే వాహనంలో ఉన్న మాత్రలు మింగినట్లు తెలిసింది. గమనించిన తోటి ఈఎంటీ, పైలెట్లు జీజీహెచ్కు తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. -
ఆశించినమేర పనులు జరగలేదు
మూడు షిప్టుల్లో పుష్కరాల పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు.– 10లోuసమస్యల ఏకరువు.. రైతులు తమ సమస్యలను శాస్త్రవేత్తలకు తెలియజేస్తున్నారు. మట్టి పరీక్షలు తరచూ చేయడం లేదని, వ్యవసాయం చేయాలంటే సబ్సిడీపై యంత్రాలు ఇప్పించాలని కొందరు రైతులు కోరారు. అదేవిధంగా పచ్చిరొట్ట, జీలుగు, పెసర వంటి విత్తనాల సరఫరాలో జాప్యం చేయవద్దని కోరారు. మిర్చిలో పేనుబంక, నల్లతామెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో ఎండుతెగులు నివారణకు మార్గం చూపాలని కోరారు. -
దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా..
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హన్మకొండ కల్చరల్ : విశ్వాబ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతికి, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకా్శ హామీ ఇచ్చారు. బుధవారం హనుమకొండ భద్రకాళి రోడ్లోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం శ్రీగాయత్రిమాత, శివాలయంలో ఉదయం 6గంటల నుంచి సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం అర్చకులు గుటోజు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు చేశారు. తర్వాత దేవాలయంలో వివిధ పుష్పాలతో వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధనపూజ నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, కార్యదర్శి జల్లిపెల్లి పెంటయ్యచారి అధ్యక్షతన జరిగిన పూజ కార్యక్రమంలో బండా ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనసూరి చంద్రమౌళి, వేల్పుల దేవాచారి, పెందోట చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతి విగ్రహ పీఠం సిద్ధం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతినది పుష్కరాలకు సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహ ఏర్పాటుకు మంగళవారం పీఠం సిద్ధం చేశారు. భారీ క్రేన్తో రాతిపీఠాన్ని కాంక్రీటు స్టాండ్పై పెట్టారు. బుధవారం దశమి సందర్భంగా 10 ఫీట్ల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని క్రేన్ సాయంతో పీఠంపైన అమర్చనున్నారు. ఈ విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో రూ.50లక్షల వ్యయంతో నాలుగు వేదమూర్తుల విగ్రహాలను తయారు చేయించారు. సరస్వతినది పుష్కరాల ప్రారంభానికి సీఎంకాళేశ్వరంలో మే 15న సరస్వతినది పుష్కరాల ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నట్లు ఆలయవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఆయనకు హైదరాబాద్లో మంగళవారం ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల15న పుష్కరాల కార్యక్రమాన్ని మెదక్ రంగంపేటకు చెందిన స్వామిజీ మాధవనందసరస్వతి చేతులమీదుగా ప్రారంభిస్తారు. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో సింగరేణికి హాల్టింగ్ పునరుద్ధరణ కాజీపేట రూరల్ : భద్రాచలంరోడ్–బల్లార్షా సింగరేణి ప్యాసింజర్కు కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో యథావిధిగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఇంజనీరింగ్ బ్లాక్ వల్ల గతంలో సింగరేణి ప్యాసింజర్కు కాజీపేట టౌన్ స్టేషన్లో హాల్టింగ్ను ఎత్తివేశారు. రైల్వే బ్లాక్ పనుల అనంతరం సికింద్రాబాద్ రైల్వే అధికారులు సింగరేణి ప్యాసింజర్కు కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో యథావిధిగా హాల్టింగ్తో మంగళవారం నుంచి నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) వెళ్లే సింగరేణి ప్యాసింజర్ కాజీపేట టౌన్కు ప్రతి రోజు ఉదయం 09:08 గంటలకు చేరుతుందని, తిరుగు ప్రయాణంలో సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే సింగరేణి ప్యాసింజర్గా కాజీపేట టౌన్కు ప్రతి రోజు మధ్యాహ్నం 3:25 గంటలకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు కాజీపేట జంక్షన్ మీదుగా విజయవాడ, సికింద్రాబాద్, బల్లార్షా రూట్లో అప్ అండ్ డౌన్ ప్రయాణించే 10 ప్యాసింజర్ రైళ్లను మంగళవారం నుంచి యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కేయూకు కంప్యూటర్ల వితరణ కేయూ క్యాంపస్ : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సామాజిక బాధ్యతగా కాకతీయ యూనివర్సిటీకి మరో 60 కంప్యూటర్లను సోమవారం రాత్రి వితరణ చేసింది. వీటిని మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి కంప్యూటర్ విభాగం అధ్యాపకుడు, కేయూ నెట్వర్క్ డైరెక్టర్ డి.రమేశ్ స్వీకరించారు. కంప్యూటర్లు అందజేయడంతో కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, వి.రామచంద్రం స్వాగతిస్తూ ఆ సంస్థను అభినందంచారు. 15 కంప్యూటర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి, 5 బయోటెక్నాలజీకి, 5 కెమిస్ట్రీకి, 10 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, కేయూ ఇంజనీరింగ్ కాలేజీ (కోఎడ్యుకేషన్కు)కి 5, జువాలజీ–5, జర్నలిజం విభాగానికి రెండు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి–4, హాస్టల్ ఆఫీస్కు మూడు కంప్యూటర్లను అందజేశారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
● భవాని స్వీట్స్ తయారీ కంపెనీకి నోటీసులు ● రూ.3.90 లక్షల విలువైన గడువుతీరిన ముడి దినుసులు సీజ్ గీసుకొండ : గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని భవాని స్వీట్స్, కారా తయారీ కేంద్రంలో (బెల్ బ్రాండ్) రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్వీట్లు తయారు చేసే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, హెయిర్ క్యాప్స్, హ్యాండ్ గ్లవ్స్ వాడకపోవడం, తుప్పు పట్టిన యంత్రాలను ఉపయోగించడం, గోడలు, పై కప్పు బూజుతో ఉండటం, కాలం చెల్లిన బిస్కెట్లు, శనగపప్పును గుర్తించిన బృందం అధికారి వి.జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రానికి నోటీసులు జారీ చేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపిస్తున్నామని, కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. సుమారు రూ.3.90 లక్షల విలువైన గడువు తీరిన, లేబుళ్లు లేని పదార్థాలను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. టాస్క్ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్రెడ్డి, స్వాతి, శ్రీషి, సిబ్బంది పాల్గొన్నారు. కాలంచెల్లిన కూల్డ్రింక్స్ సీజ్ఖిలా వరంగల్: కల్తీ, కాలంచెల్లిన కూల్డ్రింక్స్ ఉత్పత్తులపై టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసినట్లు ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సూచనలతో మంగళవారం సాయంత్రం వరంగల్ శివనగర్లోని కేఎస్ కూల్డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ షాపుపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. కల్తీ, కాలం చెల్లిన రూ.33,568 విలువైన కూల్డ్రింక్స్ను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు ఎండీ ఖలీల్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తికి అప్పగించినట్లు చెప్పారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై వడ్డె దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ వాడొద్దన్నందుకు.. ● ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య ఖిలా వరంగల్ : మొబైల్ వాడొద్దని మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి పెరుకవాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ పెరుకవాడకు చెందిన టింగిల్కార్ నితీషా (18) ఇంటర్ పూర్తి చేసింది. తరుచుగా సెల్ఫోన్ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన నితీషా సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు వికాస్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
సొంతూరిని వీడలేక..
● మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ ఎంజీఎంలో మృతి దుగ్గొండి : సొంత గ్రామాన్ని వీడలేక.. భార్య, బిడ్డల వద్దకు వెళ్లలేక మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసి మూడ్రోజులుగా చికిత్స పొందుతూ ఎంజీఎంలో మంగళవారం మృతి చెందాడు. దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40), రజిత దంపతులకు అమృత, ఐశ్వర్య పిల్లలు ఉన్నారు. వీరిని చదివించేందుకు వరంగల్కు వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని రజిత భర్తను కోరింది. అయితే రవికి ఎంత చెప్పినా వినక పోవడంతో చివరికి రజిత భర్తను వదిలి పిల్లలను తీసుకుని వెళ్లి వరంగల్లో ఉంటుంది. ఇదే విషయంపై ఊరి పెద్దలు రవికి సర్దిచెప్పినా వరంగల్కు వెళ్లక గోపాలపురంలోనే ఉంటానని అన్నాడు. ఈక్రమంలో అటు భార్య, పిల్లల వద్దకు వెళ్లలేక.. ఇటు సొంతూరిని వీడలేక మనస్తాపం చెంది ఈనెల 4న పురుగుల మందు తాగి తన తల్లి కొమురమ్మకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాణంతీసిన.. పంచాయతీ ట్రాక్టర్● ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి కాళేశ్వరం : గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరించే ట్రాక్టర్ను డ్రైవర్ అతివేగంగా..అజాగ్రత్తగా నడపడంతో ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్లడంతో తీవ్ర గాయాలై మృతిచెందిన సంఘటన మండలంలోని పెద్దంపేటలో చోటు చేసుకుంది. మహాదేవ్పూర్ ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దంపేటకు చెందిన జనగామ శ్రావణ్ కుమారుడు శాన్విక్ (2) మంగళవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంతో డ్రైవింగ్ చేయడంతో బాలుడి పైకి దూసుకు వెళ్లగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి శ్రావణ్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ కురుసం రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్కుమార్ పేర్కొన్నారు. -
యథేచ్ఛగా ఇసుక దందా
మంగపేట: మండలంలో అక్రమ ఇసుకదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగపేట– వాడగూడెం సమీపంలోని గోదావరి నదిలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇసుక దందాను పలువురు కొనసాగిస్తున్నారు. వందలాది లారీల్లో నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలను జేబులో నింపుకుంటున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ, మైనింగ్, టీజీఎండీసీ అధికారుల అండతో పంట పొలాల్లోని ఇసుక మేటల తొలగింపు పేరుతో ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అనుమతులు పొందారు. మంగపేట మార్కెట్ యార్డు, వాడగూడెం సమీపంలో 50నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న గోదావరి నదిలో భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతూ వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఏజెన్సీలోని విలువైన సహజ సంపదను స్థానిక గిరిజనేతరుల సహకారంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన గిరిజనేతరులు దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలోకి రోడ్లు వేసి లారీల్లో ఇసుక తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే ప్రభుత్వమే తమకు కొండంత అండగా ఉంది.. అధికార యంత్రాగం సహకరిస్తుంది.. మీరు ఏం చేస్తారో చేసుకోండని చెప్పడం గమనార్హం. గోదావరి సాక్షిగా అక్రమ ఇసుక దందా కళ్లెదుటే సాగుతున్నా ఇటు రెవెన్యూ, అటు ఇరిగేషన్, మైనింగ్, టీజీఎండీసీ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. లోడింగ్ చార్జీ పేరుతో వసూళ్లు ఇసుక దందాను కొనసాగిస్తున్న ఇసుక మాఫియా గురించి అడిగే వారు లేకపోవడంతో క్వారీలకు వచ్చే లారీ యజమానులు, డ్రైవర్ల నుంచి లోడింగ్ చార్జీ పేరుతో ఒక్కో లారీకి రూ. 1,600 వసూలు చేస్తున్నట్లు యజమానులు, డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. క్వారీల్లో అక్రమ ఇసుక దందాను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఎత్తేశారా లేక నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ సార్ ఫోన్ ఎత్తరు మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందాపై స్థానిక తహసీల్దార్ను వివరణ అడిగతే ఇసుక తవ్వకాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని టీజీఎండీసీ పీఓ, మైనింగ్ అధికారులను అడగండి అంటు దాట వేస్తున్నారు. ఏటూరునాగారం టీజీఎండీసీ పీఓ తోట శ్రీధర్ను సంప్రదించేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదు. పట్టించుకోని అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి -
ఏసీబీ వలలో జిల్లా పరిషత్ అధికారులు
ములుగు: ములుగు జిల్లాకేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో రూ. 25వేలు లంచం తీసుకుంటున్న సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్యలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు 2023, జనవరి నుంచి అక్టోబర్ వరకు, 2024 జనవరి నుంచి జూన్ వరకు అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నారు. తిరిగి విధుల్లోకి హాజరైనా పెండింగ్ వేతనం రాలేదు. సుమారు రూ. 3.50లక్షల వేతనం నిలిచిపోయింది. మంజూరుకు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. చివరికి సూపరింటెండెంట్ సుధాకర్ను కలిశాడు. రూ.60 వేలు ఇస్తే పెండింగ్ వేతనం వచ్చేలా చూస్తామని చెప్పడంతో ముందుగా రూ. 25 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ డబ్బులు సర్దుబాటు కాకపోవడంతోపాటు అధికారుల తీరుతో విసిగివేసారి ఎనిమిది రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం ముందుగా జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కలిసి రూ.5 వేలు ఇవ్వబోయాడు. నా డబ్బులు రూ. 5వేలతోపాటు సూపరింటెండెంట్కు ఇవ్వాల్సిన రూ. 20వేలను ఆయనకే ఇవ్వాలని సౌమ్య చెప్పడంతో సూపరింటెండెంట్ సుధాకర్ను కలిసి రూ. 25 వేలు ఇస్తున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని టీం సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీరిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య పేర్కొన్నారు. రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ -
రగిలిన ప్రతీకారం..
కాటారం : భూ వివాదంలో అయిన వారే తన తండ్రిని కిరాతకంగా హతమార్చడంతో ఓ యువకుడు ప్రతీకారం పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయించుకొని సమయం కోసం వేచి చూశాడు. నిందితుల్లో ఇద్దరు మహిళ, ఆమె కుమారుడు రోడ్డుపై కనబడటంతో ఒక్కసారిగా గొడ్డలితో వారిపై దాడికి పాల్పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మారుపాక సారయ్యను ఐదు గుంటల భూ వివాదంలో అతడి తమ్ముడు సమ్మయ్య, మరో తమ్ముడి భార్య మారుపాక లక్ష్మి, ఆమె కుమారుడు కిరణ్, మరో ఇద్దరు గతేడాది డిసెంబర్ 14న కంట్లో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. ఈ కేసులో మారుపాక సమ్మయ్య, లక్ష్మి, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఇటీవల లక్ష్మి, కిరణ్ కండీషన్ బెయిల్పై విడుదల కాగా ప్రతి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది. అందులో భాగంగా లక్ష్మి, ఆమె కుమారుడు కిరణ్ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్కు వస్తుండగా అవకాశం కోసం వేచి ఉన్న మృతుడు సారయ్య చిన్న కుమారుడు మారుపాక అంజి ఒక్కసారిగా లక్ష్మిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న కిరణ్ ప్రాణభయంతో పారిపోయాడు. గమనించిన స్థానికులు అంజిని అడ్డుకోగా అప్పటికే లక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు అంజిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్ష్మి కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై గీతారాథోడ్ పేర్కొన్నారు. తండ్రి హత్య కేసులో నిందితురాలిపై గొడ్డలితో యువకుడి దాడి కాటారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన -
బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ అభినందనలు
హన్మకొండ : బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు నాయకులు కేటీఆర్ను కలిశారు. సభ విజయవంతానికి నాయకులు శ్రమించారని కేటీఆర్ వారిని అభినందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
బోర్డు తిప్పేసిన పరపతి సంఘం
ఖిలా వరంగల్ : నిరుపేదలు కష్టపడి కరుణ పరపతి సంఘంలో నెలవారిగా పొదుపు చేసుకున్నారు. కానీ సంఘం నిర్వాహకుడు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి బోర్డు తిప్పేసి కుటుంబ సమేతంగా పరారయ్యాడు. వరంగల్ 41వ డివిజన్ కాశికుంటలో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలియడంతో బాధితులు నిర్వాహకుడు వెంకటయ్య ఇంటికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించి ఆందోళన చేపట్టారు. మిల్స్కాలనీ పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బాధితుడు పుట్ట మనోహార్ మాట్లాడుతూ.. కాశికుంటలో వెంకటయ్య ఆరేళ్ల క్రితం కరుణ పరపతి సంఘం ఏర్పాటు చేయగా 600 మంది సభ్యులుగా చేరారు. నెలకు వాటాధనం చెల్లిస్తూ వస్తున్నారు. కొంత కాలంగా వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. చివరికి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడని తెలిపారు. వెంకటయ్యపై మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి నిర్వాహకుడి పరార్ సంఘం సభ్యుల ఆందోళన -
కేసముద్రంలో గాలివాన బీభత్సం
మానుకోట మండలం ముడుపుగల్ కొనుగోలు కేంద్రంలో పరదాలు కప్పిన ధాన్యం రాశులు వాన గుబులు..కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుల్లో వాన గుబులు నెలకొంది. రెండు రోజులుగా రాత్రిపూట గాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. దీంతో సాయంత్రం కాగానే కుప్పలు చేయడం మళ్లీ ఉదయం వాటిని ఎండబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. –సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ కేసముద్రం: కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. అదే విధంగా ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అడుగులు తడిశాయి. వర్షసూచన ఉండడంతో మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ముందస్తుగా ధాన్యం రాశులపై టార్పాలిన్లు, పరదాలు కప్పుకున్నారు. అయినప్పటికీ వర్షం కారణంగా అడుగులు తడిశాయి. దీంతో మంగళవారం ఉదయం రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటూ తీవ్ర ఇబ్బ ందులు పడ్డారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో గాలివాన బీభత్సానికి ఇంటిపైకప్పు రేకులు లేచిపడగా, పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మార్కెట్లో తడిసిన ధాన్యం -
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
– 8లోuఉపాధి హామీ పనులతో రైతుల పొలాలకు దారి ● కిలో మీటరుకు రూ. 6లక్షలు కేటాయింపు ● సొంత పొలానికి దారి వేసుకునేందుకు రైతులే కూలీలుగా అవకాశం ● జిల్లాలో 80 కిలోమీటర్ల దారి వేయడమే లక్ష్యంసాక్షి, మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతులకు వరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న పనులకు తోడుగా రైతుల పొలాలు, చెలకలకు ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్డు వే సుకునే అవకాశం కల్పించారు. దీంతో కూలీలకు పని కల్పించడమే కాకుండా పొలాలకు దారిలేక రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగనున్నాయి. ఎక్కువ పనిదినాలే లక్ష్యం ఎంత పని చేస్తే అన్ని నిధులు అన్నట్లు ఉపాధి హామీ పథకంలో ఎంత ఎక్కువ పనిచేసే గ్రామాలకు అంత ఎక్కువ నిధులు వస్తాయి. కూలీల పని దినాల ఆధారంగా 60శాతం కూలి, 40శాతం మెటీరియల్ కాంపౌండ్ కింద కేటాయిస్తారు. అయితే గత ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. దీంతో రూ.18.31కోట్లు వెనక్కి వెళ్లాయి. దీంతో ఈజీఎస్ నిధుల వినియోగంలో మానుకోట జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది ముందు నుంచే నిధుల వినియోగం, కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో 2,20,438 జాబ్ కార్డులు ఉండగా ఇందులో 1,36,814 కార్డులపై యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,28,582 పనిదినాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలరోజుల్లో జంగల్ కటింగ్, రోడ్లు వేయడం, కందకాలు తవ్వడానికి 5,99,178 పనిదినాలు వినియోగించుకున్నారు. మిగిలిన పనులు వేగవంతం చేసేందుకు ఈజీఎస్లోని అన్ని రకాల పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కిలోమీటరుకు రూ.6లక్షలు ఉపాధి పనుల్లో భాగంగా రైతుల పొలాలకు దారి వేస్తుండగా.. కిలోమీటరు పొడవు దారికి రూ. 6లక్షలు కేటాయించారు. ఇందులో 60శాతం వరకు చె ట్లు కొట్టడం, కందకాలు తవ్వడం మొదలైన పనుల నిమిత్తం కూలీలకు రూ.4,45,000 చెల్లిస్తారు. అదే విధంగా గ్రావెల్ పోయడం, మోరీలు వేయడం వంటి మెటీరియల్ పనులకు రూ.1.55,000 కేటా యించారు. ఈ ఏడాది జిల్లాలో మండలానికి ఐదు కిలోమీటర్ల చొప్పున మొత్తం 16 మండలాలకు 80 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ఏపీఓల నుంచి ప్రపోజల్స్ తీసుకున్నారు. ఇందుకుగాను ఈ ఏడాది రైతు పొలాల దారి కోసం మొత్తం రూ.4.80కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో ఇప్పటి వరకు 50వేల పనిదినా లు కల్పించారు. ఈ వేసవిలో మిగిలిన పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పెద్దవంగరలో ఈజీఎస్ పనులతో పొలాలకు దారి వేస్తున్న కూలీలు న్యూస్రీల్ -
ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలి
తొర్రూరు: ప్రజారోగ్య పరిరక్షణకు ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆశకార్యకర్తలు, ఆరోగ్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు, మండల వైద్యాధికారి జ్వలితతో కలిసి డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడారు. ప్రతి మహిళ ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా ఆశకార్యకర్తలు కృషి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు గడువులోగా వైద్యం అందేలా చూడాలన్నారు. బీపీ, షుగర్ బాధితులకు నెలవారి మాత్రలు విధిగా అందించాలని కోరారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వైద్యులు మీరాజ్, మానస, ప్రియాంక, నందన, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
హనుమాన్ దీక్ష.. సర్వ జగద్రక్ష
ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యంకాజీపేటలో కొలువుదీరిన ఆంజనేయస్వామి ● భక్తిశ్రద్ధలతో హనుమాన్ దీక్షలు ● ఈ నెల 22న హనుమాన్ జయంతి కాజీపేట : అత్యంత భక్తిశ్రద్ధలు, కఠోర నియమాలతో చేపట్టే దీక్షల్లో హనుమాన్ దీక్ష ఒకటి. పురాణ కాలాల్లోనూ పలువురు ఈ దీక్షను ఆచరించినట్లుగా ఇతిహాసాలు చెబుతున్నాయి. ట్రైసిటీలో ఒకటిగా పేరొందిన కాజీపేట పట్టణంలో దక్షిణ ముఖంగా వెలిసిన అభయాంజనేయ స్వామి ప్రముఖ క్షేత్రం హనుమాన్ దీక్షలకు ప్రసిద్ధి గాంచింది. సుమారు 40 ఏళ్లుగా భక్తులు ఇక్కడ దీక్షలు తీసుకున్న స్వాములు కొండగట్టు ఆంజనేయుడు, భద్రాచల రామచంద్ర స్వామి దర్శనం కోసం తరలి వెళ్తుంటారు. 41 రోజుల పాటు మండల దీక్షలు, 21 రోజుల అర్ధ మండల దీక్షలు, 16 రోజులు, 11 రోజుల దీక్షలను ఈ ఆలయంలో స్వీకరిస్తారు. శ్రీరాముడు స్వీకరించిన దీక్ష ఇదే.. హనుమద్ దీక్ష గొప్పతనాన్ని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధానార్చకుడు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ వివరించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీత అన్వేషణలో భాగంగా మూడ్రోజులపాటు ఆంజనేయస్వామి దీక్ష చేపట్టినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. ఏటా వైశాఖ మాస కృష్ణపక్ష దశమి పూర్వాభద్ర నక్షత్రం రోజున హనుమాన్ జయంతి నిర్వహిస్తుంటారు. దీన్ని పురస్కరించుకుని భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతున్నారు. ఈ ఏడాది లక్ష తమలపాకుల పూజతో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీక్షలు పూర్తయిన రోజున కపిబంధనోత్సవం నిర్వహిస్తారు. మహా పూర్ణాహుతి (శాంతిహోమం)తో దీక్షలు ముగుస్తాయి.రెండు రకాల దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా పలువురు భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతున్నారు. హనుమాన్ విజయోత్సవ వేడుకలను పురస్కరించుకుని దీక్షలు తీసుకోవడం ప్రారంభమైంది. 41 రోజుల దీక్షలు, 21 రోజుల అర్ధ మండల దీక్షలను చేపట్టిన భక్తులు కఠిన నియమాలను పాటిస్తున్నారు. వేకువజామున నిద్రలేవడం, తల స్నానం చేయడం, భజనలు, పేట తుళ్లి నృత్యాల ద్వారా శారీరక ఆరోగ్యం చేకూరుతుందని దీక్షదారులు చెబుతున్నారు. ఈ నెల 14న కొండగట్టు ఆలయంలో జరిగే మహా పూర్ణాహుతిలో దీక్షదారులు ఇరుముడులు సమర్పించడంతో దీక్షలు పరి సమాప్తమవుతాయి. -
దేశం కోసం పోరాటంలో ముందుండాలి
మహబూబాబాద్ రూరల్ : విజయమో.. వీర స్వర్గమో.. యుద్ధమంటూ వస్తే వెనకడుగు వేయకుండా శత్రువులతో పోరాడేందుకు ముందుండాలని మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి హనుమాన్ దేవాలయంలో జవాన్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని యావత్ ప్రపంచ దేశాలతో పాటు దేశమంతటా నిరసనలతో ఖండిస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే పోరాటంలో తమ పుత్రులు ముందు వరుసలో ఉండాలని జవాన్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. జవాన్లకు ధైర్యం చెబుతూ జరుగబోయే యుద్ధంలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉందని జవాన్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గర్వంతో చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సత్యనారాయణ, మలికంటి సైదమ్మ, వద్దుల జయమ్మ, పబ్బోజు రమాదేవి, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కంబాలపల్లిలో జవాన్ల తల్లిదండ్రుల పూజలు -
సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలి
నెహ్రూసెంటర్: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రిగుట్ట ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాయుధ బలగాలను ఉపసంహరించుకోవా లని, మావోయిస్టులతో తక్షణమే చర్చలు జరిపి ఆపరేషన్ కగార్నునిలిపివేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వామపక్ష పార్టీల నేతలు బి.విజయసారథి, గునిగంటి రాజన్న, సనప పొమ్మన్న, నందగిరి వెంకటేశ్వర్లు, బుర్ర ఆనంద్, కొత్తపల్లి రవి, కంచ వెంకన్న మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ, గిరిజనులపై చేపట్టిన హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే విరమించుకోవా లని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. బి.అజయ్సారథిరెడ్డి, రాజమౌళి, భాస్కర్రెడ్డి, రా మ్మోహన్, కుమార్, రాంమూర్తి, నవీన్ ఉన్నారు. -
వేసవి శిక్షణతో విద్యార్థుల్లో ఆరోగ్య వికాసం
● డీఈఓ రవీందర్రెడ్డి తొర్రూరు: వేసవి శిక్షణతో విద్యార్థుల్లో ఆరోగ్య వికాసం సాధ్యమని డీఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు కొనసాగనున్న వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈఓ ప్రారంభించారు. ఈ నెల 20 వరకు పలు అంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. ఎంఈఓ బుచయ్యతో కలిసి డీఈఓ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడతాయన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు శిబిరం తోడ్ప డుతుందన్నారు. హెచ్ఎం జెల్ల లక్ష్మీనారాయణ, పీడీ ప్రవీణ్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నైపుణ్యం పెంపొందించేందుకే.. తొర్రూరు రూరల్: విద్యార్థుల్లో మరింత నైపుణ్యాన్ని పెంపొందించేందుకే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చెర్లపాలెం, మాటేడు, అమ్మాపురం, అరిపిరాల హైస్కూళ్లలో విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రతీరోజు ఉదయం 8నుంచి 10.30 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఇండోర్ గేమ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్, సైన్స్ ఎక్స్పర్మెంట్స్, డ్రాయింగ్ స్కిల్స్, క్రాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, డ్యాన్స్, వాలీబాల్, షటిల్, క్యారమ్ వంటి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరో సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్రోల్స్ ఇవ్వాల్సింటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి ఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికా రులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్నుంచి తొలగించా రు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం ప రీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. కేయూ పరిధిలో ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్ నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేటు కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
ప్రభుత్వానికి రైతుల గోస పట్టదా?
మహబూబాబాద్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులు గోసపడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారికి ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కాంటాలు పెట్టడం, ధాన్యం తరలింపు చూస్తుంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లతో సెటిల్మెంట్ చేసుకున్నట్లు ఉందని ఆరోపించారు. గన్నీబ్యాగులు అందుబాటులో లేవని, కొనుగోళ్లు, తూకాలు, లారీల్లో తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గోసపడుతుంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జేరిపోతుల వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీఆర్ఎస్ నేతలు బాషికాల అంబరీష, మంగళంపల్లి కన్నా, దౌలాగర్ శంకర్, అంబాల శివ, కర్పూరపు గోపి, మార్నేని కిరణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు -
తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శని, దరిద్రం అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ.. వాస్తవాలు’ అనే కార్యక్రమాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వాటర్బోర్డు కార్పారేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, విద్యాసాగర్రావు, చిన్న య్య, చందర్, మాజీ జెడ్పీచైర్పర్సన్లు శ్రీహర్షిణి, వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ అంతటికీ సాగు, తాగునీరందించారని, అలాంటి ప్రాజెక్టుకు రిపేర్లు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడంలేదని, తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే మంత్రి శ్రీధర్బాబు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కుంగినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రతిసమావేశాల్లో ప్రస్తావిస్తున్నారని, ప్రాజెక్టుపై దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. నీటిరంగ నిపుణులు వి.ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యారేజీలు కూలిపోడమే సీఎం రేవంత్రెడ్డి ఆశయమని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంలో ఎవరికీ అనుమానం లేకున్నా.. తనకుందని అనడంలో కుట్ర దాగి ఉన్నదని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగిపోవడం, భారీ శబ్దం రావడంపై ఇప్పటికీ ఎన్డీఎస్ఏ నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ.. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతంగానికి నీటిని అందించాలన్నారు. అంతకు ముందు గోదావరిని పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్ రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయకుండా నిర్వీర్యం చేస్తుండ్రు శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు -
పద్దెనిమిదేళ్లకు ఎల్లమ్మ జాడ..
● 10న కేరళ టు తెలంగాణకు రాక ● సోషల్ మీడియా ప్రభావంతో నిర్ధారణ దేవరుప్పుల : మతిస్థిమితం కోల్పోయి పద్దెనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన చింత ఎల్లమ్మ ఎట్టకేలకు మరో ఐదు రోజుల్లో స్వగ్రామానికి చేరుకోనుంది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చింత వెంక మ్మ, సోమయ్య కూతురుకు రఘునాథపల్లి కన్నాయిపల్లికి చెందిన వ్యక్తితో వివా హం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తిరిగి వేసారిపోయారు. ఈ క్రమంలో కేరళలోని ఓ క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఆశ్రమంలో ఉంటున్న ఎ ల్లమ్మను నిర్వాహకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎల్ల మ్మ తమదీ దేవరుప్పుల కట్టకాడీ ఇల్ల్లు అని, అత్తగారు కన్నాయిపల్లె అని, ఇద్దరు కొడుకులు ఉన్నారని, ఇద్దరు అమ్మలు ఉన్నారని పేర్కొన్న విషయాలను వీడియో రూపంలో వైరల్ చేశారు. దీంతో ఈ విషయమై అప్పిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్ పులిగిళ్ల సుధాకర్ కేరళలో తనకు పరిచయం ఉన్న క్రైస్తవ మతపెద్దలతో మాట్లాడారు. ఎట్టకేలకు ఎల్లమ్మ మాదిరి తప్పిపోయి అక్కడ ఉంటున్న ఐదుగురు మహిళల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్, ఒకరు తెలంగా ణ వాసీగా ఆశ్రమ నిర్వాహకులు నిర్ధారించుకున్నా రు. ఈ నెల 10వ తేదీన వారి వారి స్వగ్రామాలకు వచ్చి అప్పజెప్పేందుకు వస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు తమ పంటల సాగుతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, పంట మార్పిడి చేసి, పర్యావరణ పరిరక్షణకు చెట్లను పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. యూరియా వాడకాన్ని వీలైనంత తక్కువగా చేపట్టాలని, తద్వారా పెట్టుబడిని తగ్గించుకుని నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి మరియన్న మాట్లాడుతూ వాణిజ్య పంటలతో పాటు ఆయిల్పామ్, కూరగాయల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. మల్యాల కేవీకే శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా పచ్చిరొట్ట పంటల సాగు, మట్టి పరీక్షలు చేయించడం, జీవన ఎరువులు వాడడం, వానాకాలం సాగు చేసే పంటల్లో రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ.రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగు తగ్గించుకుని ఇతర కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ పప్పు, నూనె గింజ పంటల సాగు, వాటి రకాల గురించి తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.మల్లయ్య, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఉద్యాన అధికార శాంతిప్రియ, ఏఈఓలు రంజిత్, సాయిప్రకాష్, పూజిత, పున్నమి, రైతులు పాల్గొన్నారు. డీఏఓ ఎం.విజయనిర్మల, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ ప్రారంభం -
వడదెబ్బతో మహిళ మృతి
గార్ల : వడదెబ్బతో మహిళ మృతిచెందిన సంఘటన సోమవారం గార్లలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్లలోని అంబేద్కర్నగర్కు చెందిన అక్కి పార్వతి (51) రెండ్రోజుల క్రితం మిరప తోటలో కాయలు ఏరేందుకు పనికి వెళ్లింది. ఆదివారం నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తరలించగా, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని డాక్టర్ రాజ్కుమార్జాదవ్, తహసీల్దార్ ఆర్.శారద, ఎస్సై ఎస్కె రియాజ్పాషా సందర్శించి ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరం
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15నుంచి 26వతేదీ వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ పేర్కొన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సబ్ కలెక్టక్ మయాంక్ సింగ్తో కలిసి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సరస్వతీ(వీఐపీ) ఘాట్, సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు, శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. టెంట్ సిటీ నిర్మాణానికి సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడారు. త్వరగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేటినుంచి సరస్వతిమాత విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతుందని తెలిపారు. వీఐపీ ఘాట్ వద్ద తోరణ నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎండోమెంట్ ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. తాగునీరు, భక్తులు దుస్తులు మార్చు గదులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈఓ మహేష్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, డీపీఓ వీరభద్రయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్టీసీ డీఎం ఇందు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, డీటీ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ 10వ తేదీ వరకు పనులు పూర్తిచేయాలి -
కొనుగోలు కేంద్రాల బాట
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి వచ్చింది. సన్న ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లించడం, బహిరంగ మా ర్కెట్లో ఆ ధాన్యం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు పోటీ పడ్డారు. అంచనాకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంచనాలకు మించి ధాన్యం యాసంగిలో 1,36,236 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్ అమ్మకాలు, ఇతర అవసరాలకు రైతుల నిల్వ పోనూ.. కొనుగోలు కేంద్రాలకు 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అయితే సన్న ధాన్యం క్వింటాకు బోనస్తో కలుపుకొని రూ.2,820 చెల్లించడంతో అందరు కొనుగోలు కేంద్రాలకే రావడం మొదలు పెట్టారు. దీనికి తోడు దిగుబడి అంచనా కూడా పెరడగంతో ఇప్పటికే 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని అంచనా.. ఇంకా వస్తూనే ఉందని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో గతంలో రోజుకు వెయ్యి, రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టగా.. ఇప్పుడు ఆరు, ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టి మిల్లులకు పంపించేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు. గన్నీలు, లారీల కొరత కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా రావడంతో అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 44.75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా జిల్లాలో 17లక్షలు కొత్తవి, 8లక్షలు పాత గన్నీ బ్యాగులు సిద్ధం చేశారు. వీటిని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేశారు. అయితే ఇప్పటి వరకు 53వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 14వేల గన్నీబ్యాగుల్లో ధాన్యం కాంటాపెట్టి మిల్లులకు పంపించారు. మిగిలిన 12వేల గన్నీబ్యాగుల్లో సగానికి పైగా ధాన్యం నింపి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నింపేందుకు కొన్ని చోట్ల బస్తాలు లేక వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు ఎనిమిది వేల పాత గన్నీబస్తాల్లో కొన్ని చినిగినవి, రంధ్రాలు పడినవి ఉండటంతో పాత బస్తాల్లో తెచ్చిన ధాన్యాన్ని పలువురు మిల్లర్లు దించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఆరు రూట్లకు లారీల సరఫరాకు టెండర్లు వేశారు. వారు 150కి పైగాలారీలు, డీసీఎంలు పెట్టినా కొనుగోళ్లకు సరిపడా లారీలు అందడం లేదు. దీంతో కాంటాలు పెట్టి మిల్లుకు పంపేందుకు లారీలు రాక వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోంది.జిల్లాలో భారీగా ధాన్యం దిగుబడి బోనస్ ఇవ్వడంతో కొనుగోలు కేంద్రాలకు అధికంగా సన్నధాన్యం రాక అధికారుల అంచనాలకు మించి రైతుల తరలింపు గన్నీ సంచులు, లారీల కొరతతో సతమతం అన్నదాతలకు తప్పని తిప్పలుజిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల వివరాలుసాగు విస్తీర్ణం : 1,36,236 ఎకరాలు దిగుబడి అంచనా : 2,63,577 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం : 1.79 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనా : 1.50 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం : 53 వేల మెట్రిక్ టన్నులు -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్: గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)..ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్ర యత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూని ట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్థ్దకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా,కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరి కొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధి కారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్లో 12,748, మహబూబాబాద్లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. పశుసంవర్థక శాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్పైనా పేచీ..ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో అరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు
● హైకోర్టు జడ్జి జస్టిస్ రాజేశ్వరరావు మహబూబాబాద్ రూరల్ : జీవితంలో సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, వాటి నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఆత్మహత్యలు–నివారణ సదస్సు కరపత్రాలను జిల్లా కేంద్రంలోని అడ్వకేట్స్ కాలనీలో హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవించడానికే జీవితం అని, ఆత్మహత్యలకు పాల్ప డొద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పోలీసుల సహకారంతో ఆత్మహత్యలు–నివారణ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా.. వరంగల్ క్రైం : ఆకస్మికంగా మృతిచెందిన కానిస్టే బుల్ కుటుంబానికి తమవంతు బాధ్యతగా సేకరించిన ఆర్థికసాయాన్ని సోమవారం వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ అందజేశారు. కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బండారి కిరణ్ కుమార్ గతేడాది మరణించాడు. దీంతో తమ మిత్రుడి కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతో 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుళ్లు వరంగల్ కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది రూ.2.50 లక్షల రికరింగ్ డిపాజిట్ పత్రాలతో పాటు రూ.37వేల నగదు ను సీపీ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అదనపు డీసీపీ సురేష్ కుమార్, ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శివ, రాజు పాల్గొన్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు.! ఏటూరునాగారం : మండల కేంద్రంలోని జంపన్నవాగు కరకట్ట సమీపంలో ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన అన్వర్ ఈనెల 2వ తేదీన రాత్రి 10:45లకు తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. గమనించిన సదరు వ్యక్తులు అన్వర్పై దాడి చేసి సెల్ఫోన్ను లాక్కొని వీడియోలు, ఫొటోలు డిలిట్ చేసినట్లు బాధితుడు అన్వర్ తెలిపారు. ఇదే విషయంపై సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్ల డించారు. అసలు గుప్తనిధుల కోసం తవ్వారా? లేదా వారి ఇంటి అవసరాల కోసమా అనేది పోలీసులు విచారణ చేపట్టి తేల్చాల్సి ఉంది. కానీ గ్రామంలో మాత్రం గుప్తనిధుల కోసమే తవ్వినట్లు వినికిడి. అంతేకాకుండా బంగారు బిల్ల లు కూడా దొరికినట్లు పుకార్లు షికార్లయ్యాయి. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా అన్వర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
పురుడు కార్యం.. ప్రాణం తీసింది
● భర్త వేధింపులకు బాలింత ఆత్మహత్య చిట్యాల : భర్త వేధింపులు తట్టుకోలేక మనస్తాపం చెందిన బాలింత ముదిగొండ నిరోషా (26) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముచినిపర్తిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తికి చెందిన కందికొండ నిరోషాను వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన ముదిగొండ ప్రశాంత్తో గతేడాది వివాహం కాగా వీరికి పాప జన్మించింది. ఈక్రమంలో పాపకు 11వ రోజు పురుడు చేయాలని భర్త ప్రశాంత్, అత్త లక్ష్మి గత నెల 30న నిరోషా వద్దకు వచ్చారు. దీంతో ప్రశాంత్ మామ శంకర్ తమ వంశంలో పురుడు చేసేది లేదని చెప్పాడు. అయితే మేమే పురుడు చేసుకుంటామని రూ.లక్ష అదనంగా ఇవ్వమని అల్లుడు అడగ్గా తమ దగ్గర అంత డబ్బులు లేవని చెప్పాడు. దీంతో అల్లుడు, అతడి తల్లి గొడవపడి వెళ్లిపోయారు. ఆదివారం ప్రశాంత్..నిరోషాతో ఫోన్లో ఏం మాట్లాడాడో తెలియదని, మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందు తాగిందని తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వారు చెప్పారు. అల్లుడు ప్రశాంత్, అతడి తల్లి లక్ష్మి, తండ్రి సాంబయ్యల ఒత్తిడి మూలంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తండ్రి శంకర్ సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినింగ్ ఎస్సై హేమ పేర్కొన్నారు. ప్లాట్ విక్రయించేందుకు వెళ్లి.. ● బైక్ను ఢీకొన్న కారు ● చెల్లెలు మృతి, అన్నకు గాయాలు రఘునాథపల్లి : హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో బైక్ను వెనకనుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో చెల్లెలు మృతి చెందగా అన్న గాయపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన మట్టెవాడ విజయ (45) భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తోంది. గ్రామంలోని స్థలాన్ని (ప్లాట్) విక్రయించేందుకు తల్లిగారి గ్రామం కోమల్లకు వెళ్లి సోదరుడు గాదె లింగస్వామితో ద్విచక్రవాహనంపై చాగల్లుకు బయలుదేరింది. అక్కడ పనులు ముగించుకొని తిరిగి సోదరుడి బైక్పై పుట్టింటికి వస్తుండగా గోవర్దనగిరి దర్గా సమీపంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న విజయ ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సోదరుడు లింగస్వామికి గాయాలు కాగా స్థానికులు జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
కేయూ క్యాంపస్ : ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్లోని ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి యూనివర్సిటీ మొదటి గేట్ వరకు శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న భారత్ బచావో బాధ్యుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాంబ్రహ్మం మాట్లాడుతూ దండకారణ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ని ఆపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అపార ఖనిజ సంపద కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను, ఆదివాసీలను లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టిందని ఆరోపించారు. ర్యాలీలో డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, బీఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు శివ, భారత్ బచావో బాధ్యులు వెంగల్ రెడ్డి, రాజా మహ్మద్, సదానందం, అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్క శంకర్ నారాయణ, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పుల శివ, మహేష్, రాజేష్, శివ, సన్నీ పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలి కేయూలో విద్యార్థి సంఘాల ర్యాలీ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వీర బ్రహ్మచారి మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన వినతులు 31, హౌజింగ్ 8, పంచాయతీరాజ్ శాఖ 5, ఇతర శాఖల కు సంబంధించిన వినతులు 30 వచ్చినట్లు అధికా రులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజు, సీపీఓ సుబ్బారావు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, డీడబ్ల్యూఓ ధనమ్మ తదితులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.. రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో ఏపని చేయలేక పోతున్నాను. ఉండడానికి ఇల్లు లేక నా ఇద్దరు కుమారులు, నాభార్య ఇబ్బంది పడుతున్నారు. కేవలం పింఛన్ డబ్బులతోనే జీవిస్తున్నాం. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి ఇచ్చాను. – చెడిపాక లక్ష్మమ్య, దివ్యాంగుడు, చిన్ననాగారం, ఇనుగుర్తి మండలం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంధుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉన్నారు. అర్హత గల వారికి బ్యాక్ లాగ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలి. అంధుల సమస్యలు పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – అంధులు రవికుమార్, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, యాకమ్మ నా ఆస్తి చిన్న కుమారుడు కాజేశాడు నాకు ఇద్దరు కుమారులు ఉండగా నా పేరున ఎకరం భూమి కేటాయించారు. ఆ భూమిని నా చిన్న కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్కు చేసుకుని నాకు అన్యాయం చేశాడు. తులం బంగారం, 20తులాల వెండి ఆభరణాలు కూడా తీసుకుని ఇంటి నుంచి గెంటేశాడు. నాకు న్యాయం చేసి నా భూమి నాకు ిఇప్పించాలి. – అనసూర్య, ఎల్లంపేట గ్రామం, మరిపెడ మండలం ● అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి ప్రజావాణిలో అర్జీల స్వీకరణ -
మూడు రోజులైతే మళ్లీ విధుల్లోకి..
కొత్తగూడ : కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు. ఉగ్రవాదుల చర్యతో సెలవులు రద్దయ్యాయి.. మూడ్రోజులైతే మళ్లీ విధుల్లో చేరేవాడు. ఉన్న రెండ్రోజులు బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళ్లి సంతోషంగా గడపాలనుకున్నాడు.. కాని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. గంగారం మండలం అందుగుల గూడెం గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మద్దెల ప్రకాశ్(32) ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తూ గ్రామస్తులతో కలివిడిగా ఉండేవాడు. గోవిందాపూర్ గ్రామంలో శుభకార్యానికి బంధువుల ఇంటికి ఆదివారం వెళ్లిన అతను రాత్రి తిరిగి వస్తుండగా పెగడపల్లి సమీప మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఎస్సై కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సెలవులపై వచ్చిన జవాన్..రోడ్డు ప్రమాదంలో మృతి అందుగులగూడెంలో విషాదం -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
దంతాలపల్లి: భూభారతి చట్టం అమలులో భాగంగా మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రైతుల సమస్యలు పరిష్కరించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని పెద్దముప్పారం, ఆగపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మా ట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారం కోసం రైతులు ఇచ్చిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ప రిష్కరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ సునీల్కుమార్, ఎంపీడీఓ వివేక్రామ్, ఆర్ఐలు రాజు, నజిముద్దీన్,ఎంపీఓ అప్పర్ పాషా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
మహబూబాబాద్ అర్బన్: బీజేపీలో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టా రు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు మండలాలకు అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించామన్నారు. మరిపెడ మండల అధ్యక్షుడిగా కట్టోజు గంగాధర్, నర్సింహులపేట అధ్యక్షుడిగా సూరబోయిన సతీష్, కురవి మండల అధ్యక్షుడిగా భూక్య కిషన్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా భూక్య సుధాకర్ నాయక్, గండి రమేశ్గౌడ్, మోదుగులగూడెం గ్రామానికి చెందిన కోడి రామకృష్ణను నియమించామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యాంసుందర్ శర్మ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేశ్గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అశోక్, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సోలార్’పై విముఖత
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా..ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 889.7 మెగావాట్లకు సరిపడా 682 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 210.6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 162 మంది రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 177.1 మెగావాట్లకు గాను 141 మందికి లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ ఇచ్చారు. ఇంకా 520 మంది రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై విముఖతతో ఉన్నారు. దరఖాస్తు స్వీకరించడానికి గడువు పొడిగించిన ఆశించిన మేరకు దరఖాస్తులు రాలేదు. అదే విధంగా ఈఎండీ చెల్లించేందుకు దరఖాస్తులు ముందుకు రావడం లేదు. రుణాలపై స్పష్టత ఇవ్వని బ్యాంకర్లు ● ఈఎండీ చెల్లించేందుకు ముందుకురాని రైతులు ● ఉమ్మడి జిల్లాలో 682 దరఖాస్తులు ● ఈఎండీలు చెల్లించినది 162.. ముందుకు రాని వారు 520 మందిహన్మకొండ : భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కానీ ధర.. 12ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. రుణంపై బ్యాంకర్లకు స్పష్టత లేక పోవడం.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతినెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసినప్పటి ఉత్సాహం ఈఎండీ చెల్లించడంలో రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు మూడు సార్లు గడువు పొడిగించింది. ఇప్పుడు ఈఎండీలు చెల్లించడానికి రెండు సార్లు గడువు విధించింది. అయినా ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం ఆశించిన మేర సఫలం కాలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పథకాన్ని రూపొందించారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్కు ఐదు కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్ ప్లాంట్పై అవగాహన లేకనే.. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొన్ని బ్యాంకులకు సోలార్ ప్లాంట్పై అవగాహన లేదన్నారు. కనీసం 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, అదే విధంగా ప్రభుత్వం యూనిట్కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఏటు సరిపోవన్నారు. 12 ఏళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోయారు. దీంతో తాము నష్టపోతున్నట్లు చెబుతున్నారు. లాభదాయకంగా లేదు.. మా నాన్న పేరుపై వ్యవసాయ భూమి ఉంది. పీఎం కుసుం పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని దరఖాస్తు చేశాం. యూనిట్ ధర చూస్తే ఏ మాత్రం లాభదాయకంగా లేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.13 మాత్రమే చెల్లిస్తుండడం ఏ మాత్రం ప్రయోజనం కాదు. ఇతర రాష్ట్రాల్లో యూనిట్కు రూ.4 నుంచి రూ.4.50 వరకు చెల్లిస్తున్నారు. 14, 15 సంవత్సరాల వరకు వచ్చే ఆదాయం వాయిదాలకే వెళ్తుంది. తర్వాతే రైతు చేతికి ఆదాయం వస్తుంది. అప్పటి వరకు పరిస్థితిలు ఎలా ఉంటాయోనని ఈఎండీ చెల్లించలేదు. – పెసరు కార్తీక్ రెడ్డి, సూదనపల్లి, హనుమకొండ జిల్లాల వారీగా వివరాలు.. జిల్లా వచ్చిన ఈఎండీ ఎల్ఓఏ దరఖాస్తులు–మెగావాట్లు చెల్లింపు–మెగావాట్లు జారీ–మెగావాట్లు హనుమకొండ 76 95.2 26 33.2 24 29.2 జేఎస్ భూపాలపల్లి 116 138.8 19 22.8 19 22.8 జనగామ 179 243.2 51 66 41 52 మహబూబాబాద్ 127 177.3 41 57.6 33 43.6 ములుగు 50 70.2 5 5 4 4 వరంగల్ 134 265 20 26 20 25.5 -
విద్యుత్.. కారాదు విపత్తు
హన్మకొండ: విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రధానంగా వర్షాకాలం వచ్చిందంటే తరచూ విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తడిదుస్తులు ఆరేస్తూ.. మోటార్లు ఆన్ చేస్తూ.. మరమ్మతుల సమయంలో కరెంటు తీగలు పట్టుకోవడం.. తెగిన తీగల కారణంగా తరచూ విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తెగిపోయిన విద్యుత్ లైన్లు, టాన్స్ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో భద్రతా చర్యలు పాటించకపోవడమూ ఈప్రమాదాలకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులను అప్రమత్తం చేయడంతోపాటు అవగాహన కల్పించడానికి ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు ‘విద్యుత్ భద్రతా వారోత్సవాలు’ నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణకు పెద్దపీట విద్యుత్ ప్రమాదాల నివారణకు యాజమాన్యం పెద్దపీట వేస్తోంది. జీరో విద్యుత్ ప్రమాదాలు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సర్కిల్లోని డీఈ టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించగా.. వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబ్బందికి అన్ని రకాల రక్షణ పరికరాలు, హెల్మెట్, గ్లోవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, ఓల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించింది. ● హనుమకొండ జిల్లాలో 4,86,266 మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 3,61,540 మంది గృహ విద్యుత్, 67,573 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 74 ఉండగా.. 12,489 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. ● వరంగల్ జిల్లాలో 4,20,925 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా.. అందులో, గృహ విద్యుత్ 2,99,091, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 70,853 ఉన్నాయి. 33/11 కేవీ సబ్స్టేషన్లు 76 ఉండగా.. 12,467 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది.విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సమస్యలు వస్తే సంబంధిత ఏఈ, సిబ్బందికి తెలియజేయాలి. ప్రతి నెలా జారీ చేసే బిల్ కమ్ నోటీస్పై ఏఈ, లైన్మెన్ ఫోన్ నంబర్ ఉంటుంది. విద్యుత్ సమస్యలు వస్తే నిపుణులైన ఎలక్ట్రీషియన్తో సరిచేసుకోవాలి. – పి.మధుసూదన్ రావు, ఎస్ఈ, హనుమకొండ సర్కిల్ ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు పాటించాలి..విద్యుత్ ఉద్యోగులు భద్రతా ప్రమాణాలు పాటించాలి. రక్షణ పరికరాలు వినియోగించాలి. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు అధికారులందరి సమష్టి కృషి అవసరం. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫో న్ చేయాలి. ఈ విషయమై ప్రజలకు విసృ ్తత అవగాహన కల్పిస్తున్నాం. – కె.గౌతంరెడ్డి, ఎస్ఈ, వరంగల్ సర్కిల్ ఆదమరిస్తే ప్రాణాలకే ముప్పు నిరంతరం అప్రమత్తత అవసరం విద్యుత్ సమస్యలు తలెత్తితే సొంతంగా రిపేర్లు చేయొద్దు 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి.. -
ముగిసిన సృజనోత్సవం
విద్యారణ్యపురి: జనవిజాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యాన హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వేసవి సృజనోత్సవం ఆదివారం ముగిసింది. ‘భౌతిక శాస్త్రంలో మెళకవలు’ అనే అంశంపై సుతా రి రమేశ్ అవగాహన కల్పించారు. ఆర్పీ శాగంటి మంజుల విద్యార్థులకు డ్రాయింగ్ నైపుణ్యాలను నేర్పించారు. యోగాచార్యులు డాక్టర్ లింగమూర్తి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. బుచ్చిరాములు మ్యాజిక్ తరగతులను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముగిసిన సృజనోత్సవ వేడుకలు భాగంగా నిర్వహించిన పాటలు, నృత్యం, ఉపన్యాసం, చిత్రలేఖనం, చదరంగ పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చివరగా శాస్త్రవేత్తలలో ముఖాముఖి నిర్వహించారు. వరంగల్ నిట్ విశ్రాంత ఆచార్యులు సీవీ.రామారావు, ప్రొఫెసర్ ఆంజనేయులు, సుమలత, ఎంఈఓ భిక్షపతి, ఉపాధ్యాయులు కిరణ్, లింగమూర్తి, జేవీవీ ప్రధాన కార్యదర్శి రామంచ భిక్షపతి, బాధ్యులు వేణు, వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతానం లేని దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. -
విస్నూరులో నకిలీ గురువు
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో ఓ వ్యక్తి విచిత్ర వేషధారణతో తన అనుచరులతో గ్రామంలో గుర్రంపై చక్కర్లు కొట్టాడు. జనానికి శఠగోపం పెట్టాలని పన్నాగం వేశాడు. మీఊరిని క్షుద్రశక్తులు ఆవహించాయి.. కీడు సోకిందని నమ్మించి జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గ్రామ పెద్దలతో నమ్మబలికి గ్రామంలో ఒక చోట బస చేశాడు. గ్రామంలో పుర వీధుల్లో గుర్రంపై తిరుగుతూ కుటుంబాల్లో సమస్యలున్నాయని బాగు చేస్తానని ప్రజలను నమ్మించాడు. ఒక్కొక్కరు రూ.2 వేలు నుంచి రూ.15 వేలు వరకు నకిలీ దేశగురువుకు ముడుపులు చెల్లించారు. డబ్బులు లేక కొంత మంది 5 క్వింటాళ్ల బియ్యంతోపాటు గొర్రె పిల్లలు అందజేశారు. నకిలీ దేశ గురువు అనుచరులను విస్నూ రు మాజీ ఎంపీటీసీ మాటూరి యాకయ్యతో పాటు గ్రామస్తులు పట్టుకుని ప్రశ్నించారు. వారి ద్విచక్రవానాలను గుర్రాన్ని తరలించే వాహనాన్ని స్వాధీనపర్చుకున్నారు. గ్రామస్తుల నుంచి రూ.1.30 లక్షలు వసూలు చేశామని ఒప్పుకున్నారు. వసూలు చేసిన డబ్బులు చెల్లించే వరకు ఎటూ వెళ్లకూడదని వారిని గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో నకిలీ దేశ గురువు అనుచరులు ఫోన్పే ద్వారా డబ్బులు తిరిగి చెల్లించారు. కాగా.. సూర్యాపేట జిల్లా మండలం పెన్హాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన రాజశేఖర్స్వామి నకిలీ దేశగురువుగా గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మాయమాటలతో రూ. 1.30 లక్షలు వసూలు నిలదీసిన గ్రామస్తులు.. పారిపోయిన మోసగాడు డబ్బులు చెల్లించిన అతడి అనుచరులు -
బీసీ, ఎీస్సీ, ఎస్టీలు చైతన్యవంతులవ్వాలి
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులుకాజీపేట రూరల్: బీసీ, ఎస్సీ, ఎస్టీలు గ్రామస్థాయి నుంచి సామాజికంగా చైతన్యవంతులు కావాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఆదివారం జరిగిన సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సన్నాహక, ఆవిర్భావ సమావేశంలో విశిష్ట అతిథిగా హాజరైన చిరంజీవులు మాట్లాడుతూ.. జేఏసీని బలోపేతం చేసి గ్రామగ్రామాన బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా చైతన్యవంతులైతేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. 1 శాతం లేని వెలమలు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల నుంచి పాలించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి 90 శాతం ఉన్నప్పటికీ అధికారానికి, సంపదకు దూరంగా ఉంటున్నారన్నారు. జేఏసీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ.. జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ సాధిస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నాగం కుమారస్వామి, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణగౌడ్, దాసోజు లలిత, సాయిని నరేందర్, డాక్టర్ కూరపాటి రమేశ్, డాక్టర్ లేఖిని సంపత్, శ్రీనివాస్ ముదిరాజ్, రాసాల వినోద్యాదవ్, పూసల సాయిబాబా, మేకల సుమన్, వడ్డెపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేశారు.. బ్యాండేజ్ క్లాత్ మరిచారు ● కమలాపూర్ సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం..బాలింతకు నొప్పులు ● ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన అండ్రాసి తిరుమల వారం క్రితం ప్రసవం కోసం కమలాపూర్ సీహెచ్సీకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆతర్వాత ఓ బ్యాండేజ్ క్లాత్ బయటకు తీయకుండా వదిలేశారు. దీంతో తిరుమలకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వైద్యుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి ఆ బ్యాండేజ్ క్లాత్ను తొలగించారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వస్తే ఫోన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచిపోయారని బంధువులు చెబుతున్నారు. కాగా.. ప్రభుత్వాస్పత్రులపై నమ్మకంతో వస్తే వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పరిస్థితి విషమించి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాలింత బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. -
కొనుగోలు కేంద్రంలో ధాన్యం మాయం
చిన్నగూడూరు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి రక్షణ లేకుండాపోతోంది. కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు చెందిన 21 బస్తాల ధాన్యం మాయమైంది. ఈఘటన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో జరిగింది. మండలంలోని ఉగ్గంపల్లి శివారు ధూమ్డాతండాకు చెందిన రైతు బానోతు వీరన్న పండించిన వరి ధాన్యాన్ని 20 రోజుల క్రితం చిన్నగూడూరు కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. తేమశాతం వచ్చాక కొనుగోలు నిర్వాహకులు వారం క్రితం 116 బస్తాలకు కాంటా వేసినట్లు తెలిపాడు. కాంటా వేసిన మూడో రోజుకు లారీలో లోడ్ పంపించారు. వే బ్రిడ్జి కాంటా అయిన మరో రెండు రోజులకు 95 బస్తాలకే కాంటా అయినట్లు తన ఫోన్కు ఓటీపీ రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇదేంటని కొనుగోలు కేంద్రం చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ రైతు బోరున విలపించాడు. తనకు న్యాయం చేయాలని ఆదివారం తండావాసులతో కలిసి కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేపట్టాడు. బోరున విలపించిన రైతు పట్టించుకోని నిర్వాహకులు -
వేర్వేరు కారణాలతో నలుగురి మృతి
● లారీ ఢీ.. కబడ్డీ క్రీడాకారుడి దుర్మరణం దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు ఉదయ్కుమార్(23) లారీ ఢీకొని శనివారం రాత్రి మృతి చెందాడు. ఉదయ్ తండ్రి సమ్మయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రాణం పోయే చివరి క్షణాలో లాయర్ కావాలని ఉదయ్ని కోరాడు. తండ్రి కోరిక మేరకు హనుమకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మరోవైపు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఎదిగాడు. మరో ఏడాదైతే లా పట్టా పుచ్చుకునే వాడు. ఈక్రమంలో శనివారం రాత్రి హనుమకొండ హంటర్ రోడ్డులో బైక్పై వెళ్తున్న ఉదయ్కుమార్ను లారీ ఢీకొట్టడంతో ఎగిరి డివైడర్ మీదపడి అతడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి సరోజన రోదనలు మిన్నంటాయి. ఆదివారం ఉదయ్ మృతదేహం స్వగ్రామానికి తీసుకురాగా వందలాది మంది కబడ్డీ క్రీడాకారులు గిర్నిబావి నుంచి నాచినపల్లి వరకు 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్. రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు కక్కెర్ల మల్లికార్జున్, పుప్పాల ఎల్లయ్య ఉదయ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్..రఘునాథపల్లి: హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద శనివారం రఘునాథపల్లి మండలం గోవర్దనగిరి మాజీ సర్పంచ్ ముప్పిడి యాదగిరి (52) మృతి చెందాడు. యాదగిరి తన బైక్పై జనగామలో ఉన్న చెల్లెలి వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. కోమల్ల టోల్ ప్లాజా వద్ద ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపాడు. దీంతో బైక్పై వస్తున్న యాదగిరి టాటా ఏసీ వాహనాన్ని వెనకాల నుంచి ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన యాదగిరిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్కు తరలిస్తు్ండగా మార్గమధ్యలో మరణించాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుమారుడు ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడు..రాయపర్తి: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన నాల్లం యాదగిరి(54) తాటిచెట్టు పైనుంచి పడి శనివారం సాయంత్రం మృతిచెందాడు. యాదగిరి వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కల్లుగీస్తుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా రాత్రి 11:30 గంటలకు మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారుఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరిగిన వివిధ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.వడదెబ్బతో ఉపాధి కూలీ..గూడూరు: వడదెబ్బతో మండలంలోని అప్పరాజ్పల్లికి చెందిన ఉపాధి కూలీ మండల సర్వయ్య (50) ఆదివారం మృతి చెందాడు. సర్వయ్య శనివారం ఉదయం గ్రామ సమీప రోడ్డు పక్కన గుంతలు తవ్వే పనులకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత పొద్దంతా ఎండ వేడితో, కడుపునొప్పితో బాధపడ్డాడు. రాత్రి నిద్రపోయి ఉదయం విగతజీవిగా మారాడు. తన భర్త వడదెబ్బతో చనిపోయాడని భార్య అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అధికారుల నిర్లక్ష్యం..
నెహ్రూసెంటర్: జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్హెచ్ఎం పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చి ఏడాది దాటినా ఫైల్ ముందుకు కదలడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. త్వరగా భర్తీ చేయాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. ఏడాది క్రితం.. ఏడాది క్రితం ఎన్హెచ్ఎంలో 37 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా 1661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల ఎదురుచూపుల అనంతరం గత ఏడాది నవంబర్లో మెరిట్ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించారు. అదేరోజు 14 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన 23 పోస్టులను వాయిదా వేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా నాటి నుంచి ఫైల్ ముందుకు కదలకపోవడంతో అభ్యర్థుల్లో నిరాశ, ఆందోళన పెరిగింది. కాగా వాయిదా వేసిన ఉద్యోగాల భర్తీకి మార్చి 28న ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ఆ రోజు నుంచి ఏప్రిల్ 30వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అయితే భర్తీ ప్రక్రియకు మాత్రం మోక్షం కలగడం లేదు. వాయిదా వేయడంలో ఆంతర్యమేంటి.. కొన్ని పోస్టులను భర్తీ చేసి మిగిలిన పోస్టులు వాయిదా వేయడంలో ఆతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెరిట్ లిస్టు ప్రకటించడం వాయిదా వేయడం పరిపాటిగా మారింది. కాగా కొంత మందిని రిక్రూట్ చేసి తమను ఎందుకు ఎంపిక చేయడంలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎంఎల్హెచ్పీ–10, ఎన్సీడీ స్టాఫ్నర్సు–10, ఎంహెచ్ఎన్ స్టాఫ్నర్సు–02 మొత్తం 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. త్వరలో భర్తీ చేస్తాం.. ఎన్హెచ్ఎం పరిధిలో జరుగుతున్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాల మేరకు భర్తీ చేస్తాం. అభ్యర్థులు ఆందోళణ చెందవద్దు. త్వరలోనే భర్తీకి సంబంధించిన సమాచారం అందజేస్తాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై నీలినీడలు ఏడాదవుతున్నా కదలని ఫైల్ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు -
కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రైతు అవగాహన సదస్సులు మహబూబాబాద్ రూరల్: ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 5నుంచి జూన్ 13వ తేదీ వరకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.మాలతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల ఆదివారం తెలిపారు. ఈమేరకు మొదటి రోజు సోమవారం మహబూబాబాద్ రైతు వేదికలో వివిధ అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. 6న కురవి, 7న గూడూరు. 12న నెల్లికుదురు, 13న సీరోలు మండలం కాంపల్లి, 16న డోర్నకల్, 17న కేసముద్రం, 20న కేసముద్రం మండలం కల్వల, 23న గార్ల, 24న కొత్తగూడ, 27న బయ్యారం, 30న కురవి మండలం మొగిలిచర్ల, 31న గంగారం, జూన్ 3న మరిపెడ, 5న దంతాలపల్లి, 10న ఇనుగుర్తి, 12న నెల్లికుదురు, 13న నర్సింహులపేటలో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.మాలతి, శాస్త్రవేత్తలు ఎన్.కిషోర్ కుమార్, ఈ.రాంబాబు, బి.క్రాంతికుమార్ వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఒకటే టికెట్ కౌంటర్.. ప్రయాణికుల పాట్లు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాం వైపున గల భవనంలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే అందులో ఒక కౌంటర్ ద్వారా మాత్రమే ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్నారు. ఈక్రమంలో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో క్యూలో ఉండడం, టికెట్ తీసుకునేందుకు ఆలస్యమవుతుండంతో రైళ్లు మిస్ అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పలు సందర్భాల్లో టికెట్ లేకుండానే రైళ్లు ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైల్వేశాఖ అధికారులు స్పందించి సీ్త్రలు, పురుషులకు వేర్వేరుగా టికెట్ బుకింగ్ కౌంటర్లు పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సార్వత్రిక సమ్మెకు సహకరించాలి తొర్రూరు: ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాలు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓమ బిక్షపతి, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్కు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు జమ్ముల శ్రీను, శ్రీరాం పుల్లయ్య పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారి విగ్రహం వచ్చేసింది.. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి తమిళనాడులోని మహాబలిపురం నుంచి లారీలో సరస్వతి అమ్మవారి విగ్రహం, నాలుగు వేదమూర్తుల విగ్రహాలు ఆదివారం సాయంత్రం వచ్చాయి. కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం త్రివేణి సంగమ తీరంపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.కోటితో బేస్మెంట్స్టాండ్ నిర్మాణం, విగ్రహ తయారీ పనులు చేపట్టారు. సోమవారం విగ్రహాన్ని కాంక్రీటు బేస్మెంట్ స్టాండ్పై ఇన్స్టాల్ చేయనున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూర వేదమూర్తులను ఆసీనులు చేస్తారు. తరువాత లాన్, ఇతర సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. -
మౌంటైనర్ మరో సాహసం
● మణిపూర్లోని ఇసో పర్వతాన్ని అధిరోహించిన యశ్వంత్ మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన మౌంటైనర్ యశ్వంత్ మరో అరుదైన సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. మణిపూర్ రాష్ట్రంలోని ఎత్తైన పర్వతం ఇసో 2,994 మీటర్ల ఎత్తును ఆదివారం అధిరోహించి మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. యశ్వంత్ ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలు పర్వతాలను అధిరోహించి పిన్న వయస్సు గిరిజన సాహసకుడిగా పేరు తెచ్చుకున్నాడు. జాతీయ మిషన్ ‘హర్ శిఖర్ పర్ తిరంగా’లో మౌంటైనర్ యశ్వంత్.. ఇసో అస్సాం రైఫిల్ 16వ బెటాలియన్కు చెందిన కల్నల్ సందీప్ శర్మ, లెఫ్ట్నెంట్ కల్నల్ సిద్ధార్థ్ తో కలిసి ఇసో పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. యశ్వంత్ ఇప్పటికే కిలిమంజారో, ఎల్బస్, మౌంట్ కోస్కియుస్కో పర్వతాలను చుట్టేసి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటడం గొప్ప విషయం. -
సెలవులపై గందరగోళం!
మహబూబాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు ప్రకటించిన మేనెల సెలవులపై అధికారుల నుంచి స్పష్టత కరువైంది. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గందరగోళానికి గురవుతున్నారు. కాగా, పలు అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్లు వారి పోరాట ఫలితంగానే ప్రభుత్వం మేలో వేసవి సెలవులు ప్రకటించిందని సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేశారు. అయితే డీడబ్ల్యూఓ మాత్రం తమకు ప్రభుత్వ పరంగా సర్క్యులర్ రాలేదని చెబు తున్నారు. దానిపై స్పష్టత లేక కొంతమంది టీచర్లు జిల్లా సంక్షేమశాఖ కార్యాలయానికి ఫోన్ చేసి సెలవులపై ఆరా తీస్తున్నారని సిబ్బంది అంటున్నారు. 1,435 కేంద్రాలు.. జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్ల పరిధిలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్, గార్ల, కురవి మండలాలు, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ, మానుకోట పరిధిలో బయ్యారం, కేసముద్రం, మానుకోట, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాలు ఉన్నాయి. తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్ట్ల పరిధిలో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 3604మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. సొంత భవనాల్లో 339 కేంద్రాలు, అద్దె భవనాల్లో 452, అద్దె లేకుండా (ఫ్రీ రెటెండ్) భవనాల్లో 644 కేంద్రాలు కొనసాగుతున్నాయి. పోషణ లోపంతో 1,490 మంది.. కేంద్రాల్లో ప్రతీ నెల 1నుంచి 5వ తేదీ వరకు వెయింగ్ మిషన్తో పిల్లల బరువు, ఎత్తు కొలవాలి. వివరాలను టీచర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్హెచ్టీఎస్ యాప్(న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ ), కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేయాలి. దీంతో పిల్లల ఆరోగ్య స్థితి తెలుస్తుంది. వారిలో తీవ్ర పోషణలోపం, అతి తీవ్ర లోపం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. కాగా జిల్లాలో గత నెల తీవ్ర పోషణ లోపంతో 1,281 మంది, అతి తీవ్ర పోషణలోపంతో 209 మంది ఉన్నట్లు గుర్తించారు. చికిత్స విధానం ఇలా .. తీవ్ర పోషణ, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను పీహెచ్సీకి తీసుకెళ్లి డాక్టర్కు చూపించి మందులు ఇిప్పిస్తారు. అతి తీవ్రత పోషణ లోపంతో ఇబ్బంది పడితే ఎన్ఆర్బీ(న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్)కు పంపిస్తారు. వరంగల్, ఖమ్మంలో ఒక్కో సెంటర్ చొప్పున ఉన్నాయి. అక్కడ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. పిల్లలతో పాటు వెళ్లే తల్లిదండ్రులకు ఉచిత భోజన వసతి కల్పి స్తారు. తల్లిదండ్రులకు రోజువారీగా ఎంత కూలీ వస్తుందో తెలుసుకుని, ఆ మొత్తం డబ్బులను ఇస్తారని అధికారులు తెలిపారు. గందరగోళం.. సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో పాటు పలు యూనియన్ల ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా కేంద్రాలకు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంపూర్ణ, స్నేహబిందు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లుగా సమావేశాలు నిర్వహించి తెలియజేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ యూనియన్ నాయకులు గత నెల 29న ములుగు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట చేసిన ఆందోళన చేయగా.. మంత్రి సీతక్క స్పందించి సెలవులు ప్రకటించారని టీచర్లు, ఆయాలకు చెప్పారు. దీంతో సెలవులు ప్రకటించారని జిల్లా కేంద్రంలో ఈనెల 1న కొంత మంది కేంద్రాలను తెరువ లేదు. మళ్లీ కార్యాలయానికి ఫోన్ చేయగా సెలవులు ప్రకటించలేదని చెప్పడంతో తర్వాత కేంద్రాలను తెరిచారు. స్పష్టత రాకపోవడంతో పాత పద్ధతిలో నెలలో 15 రోజులు టీచర్, 15 రోజులు ఆయా పని చేయాల్సి వస్తోంది. మూడు సంవత్సరాల లోపు పిల్లలకు టీహెచ్ఆర్.. మూడు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రమే టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్)కింద బాలామృతం, 16 గుడ్లు ఇస్తున్నారు. అయితే వేసవి సెలవులు ప్రకటిస్తే ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా టీహెచ్ఆర్ విధానం ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, ఇతరత్రా సరుకులు ఇవ్వాల్సి ఉంటుంది. సెలవులు ఇచ్చినా అందుబాటులో ఉండాల్సిందే.. వార్షిక సర్వే, ఇంటింటి సందర్శన, ప్రీస్కూల్ పిల్లల నమోదు, డ్రాఅవుట్ అడ్మిషన్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. గర్బిణుల వివరాలు నమోదు తదితర పనులు చేయాల్సిందే. వేసవిలో 15 రోజుల సెలవుల వెసులుబాటు కల్పించినా అందుబాటులో ఉండాల్సిందే. సెలవుల విషయంలో సర్క్యులర్ రాలేదు.. మే నెల వేసవి సెలవుల విషయంలో ప్రభుత్వం నుంచి సర్క్యులర్ రాలేదు. కొంత మంది యూనియన్ నాయకురాళ్లు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని చెబుతున్నారు. కానీ, పాత పద్ధతిలోనే కేంద్రాల నిర్వహణ చేపట్టాలి. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించే పనిలో టీచర్లు నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో వివరాల నమోదు వేగవంతం చేస్తాం. పిల్లల్లో ఆసమస్య లేకుండా చేస్తాం. –ధనమ్మ, డీడబ్ల్యూఓ ● అంగన్వాడీల సెలవులపై క్లారిటీ కరువు సర్క్యులర్ రాలేదంటున్న డీడబ్ల్యూఓ జిల్లాలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు కలెక్టర్ సమీక్ష కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 1న కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ జిల్లా సంక్షేమశాఖ అధికారులతో పిల్లల్లో పోషణ లోపంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కాగా ఈనెల 2 నుంచి టీచర్లు ఆపనిలో నిమగ్నమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో చాలా సీరియస్గా పని చేస్తున్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల ఇబ్బందులు
● పదవీ విరమణ పొంది ఏడాదైనా అందని బెనిఫిట్స్ ● రిటైర్మెంట్ డబ్బులపై పెట్టుకున్న ఆశలు గల్లంతు ● ఇంట్లో ఒత్తిడి పెరగడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ ● తమ డబ్బులు త్వరగా ఇవ్వాలని వేడుకోలు‘జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహం కుదుర్చుకున్నాడు. కట్నం డబ్బుల్లో సంగం పెళ్లి సమయంలో ఇవ్వడం, మిగిలినవి రిటైర్డ్ డబ్బులు రాగానే ఇస్తామని అంగీకారం కుదుర్చుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఆ ఉద్యోగి ఆరు నెలల క్రితంపదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో.. అత్తింటి నుంచి కూతురుకు వేధింపులు మొదలయ్యాయి.’సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణ పొంది ఏడాది గడిచినా తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు 8,094, పదవీ విరమణ పొందిన వారు 2,635 మంది మహబూబాబాద్, గూడూరు, మరిపెడ ట్రెజరీ కార్యాలయాల ద్వారా వేతనాలు, పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో ఏడాది క్రితం పదవీ విరమణ పొందిన వారు 100 మందికి పైగా ఉంటారు. వీరిలో కొందరికి పెన్షన్ వచ్చినా.. ఇతర బెన్ఫిట్స్ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. రూ. 50లక్షలకు పైగా.. ఉద్యోగంలో చేరిన నాటినుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతీ నెల కొంత కటింగ్ పెట్టుకుంటారు. గ్రూపు ఇన్సూరెన్స్, తెలంగాణ రాష్ట్ర గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్(సీవీపీ), గ్రాట్యుటీ మొదలైన వాటి ద్వారా వేతనంలో కొంత డబ్బును పొదుపు చేసుకుంటారు. ప్రభుత్వం కొంత కలిపి రిటైర్మెంట్ తర్వాత సదరు ఉద్యోగికి చెల్లించాలి. వీటితోపాటు ఉద్యోగి సలెండర్ లీవ్స్కు కూడా వెలకట్టి రిటైర్మెంట్ తర్వాత చెల్లించాలి. ఇలా ప్రతీ రిటైర్డ్ ఉద్యోగికి వారిస్థాయిని బట్టి రూ.50లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అంతా తారుమారు.. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బులకోసం వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారు అయ్యిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, నిరుద్యోగులైన కుమారులకు ప్రైవేట్ వ్యాపారం పెట్టించడం, చివరకు భార్యకు బంగారం కొనడం వంటి ఆశలు పెట్టుకున్నారు. అయితే పదవీ విరమణ అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకొని బంధువుల ముందు డబ్బులు ఇస్తామని చెప్పామని, ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో మాట తప్పాల్సి వచ్చిందని ఉద్యోగులు అంటున్నారు. పదవీ విరమణ రోజే డబ్బులు ఇవ్వాలి ఉద్యోగి పనిచేసిన కాలంలో మూల వేతనం నుంచి కటింగ్ పెట్టుకొని దాచుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ను ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే ఇవ్వాలి. అలా కాకుండా జాప్యం చేయడం వల్ల డబ్బులకోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. –సంకా బద్రినారాయణ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ట్రెజరీ ఉద్యోగులు పెన్షనర్లు మహబూబాబాద్ 5,361 1,798 మరిపెడ 1,602 601 గూడూరు 1,131 236 మొత్తం 8,094 2,635 -
మార్కెట్ సంఘానికి రాజకీయ రంగు
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లోని కమీషన్ వ్యాపారస్తుల సంఘం ఏర్పాటుకు రాజకీయ రంగు పులుముకుంది. 2018లో ఏర్పడిన కూరగాయల కమీషన్ వ్యాపారుల సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని వ్యాపారులు డిమాండ్ చేయడంతో 29జూన్ 2024న రద్దు చేస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు జారతీ శ్రీనివాస్ ప్రకటించారు. నెలరోజుల్లో ఏర్పాటు చేసేందుకు ఐదుగురు సభ్యులతో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం లెక్కల పేరుతో ఆర్నెళ్లపాటు వాయిదా వేశారు. 11ఆగస్టు 2024న అడ్హక్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంతో నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు అదే నెల 13న సమావేశం ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలిసిన మార్కెట్లోని ఒక వర్గం అధికార పార్టీ నాయకుని అనుయాయునికి చెప్పి మరోసారి వాయిదా వేయించారు. గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా తాము చెప్పిన వారే అధ్యక్ష, కార్యదర్శులుగా ఉంటారని సదరు నాయకుడు ఆదేశాలు జారీ చేయడంతో ఆవిషయం తెలిసిన వ్యాపారులు వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కమిటీలేక సమస్యలు అపరిష్కృతం మార్కెట్లో కమిటీ లేక పోవడంతో వ్యాపారుల సమస్యలు పేరుకుపోవడంతో నూతన కమిటీని ఎలాగైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. 11 డిసెంబర్ 2024లో వ్యాపారులంతా సమావేశమై అన్ని కమిటీలు రద్దు చేస్తూ నెల రోజుల్లో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈమేరకు మూడు నెలల తర్వాత మార్చి 29న కమీషన్ వ్యాపారులంతా కలిసి చింతల్ బ్రిడ్జి సమీపంలో ఒక హోటల్లో వ్యాపారులు సమావేశమయ్యారు. మార్కెట్లో లైసెన్సులు కలిగిన 91 మందిలో 60 మంది హాజరు కాగా.. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యాపారులు గైర్హాజరయ్యారు. ఈలోగా.. వ్యాపారుల్లో ఉన్న ప్రజాప్రతినిధి సూచన మేరకు మరోసారి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేస్తూ.. ఏప్రిల్ 4న నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇద్దరు సీనియర్ వ్యాపారులను ఎన్నికల అధికారులుగా నియమిస్తూ సమావేశంలో తీర్మానించారు. ఎన్నికల కమిటీ ఏప్రిల్ 2న నామినేషన్లు వేయాలని, 4న ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహిస్తే కమిటీ చేజారి పోతుందని భావించిన వ్యాపారులుగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఈఎన్నికలను సైతం వాయిదా వేయించారు. గత ఎన్నికల్లో బహిరంగంగా ఆరోపణలు చేసిన వారే ఈవ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే మోడల్ మార్కెట్ మారి సందర్భంలో పాట్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు బహిర్గతమవుతాయన్న ఉద్దేశ్యంతోనే కొంత మంది సామాజిక వర్గం పేరుతో కమిటీ అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని చూస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సీల్డ్ కవర్లో కమిటీ.. ఈనెల 6న ఒక ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటవుతుందని, ఈసమావేశానికి అధికార పార్టీకి చెందిన నాయకులు వచ్చి అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు ప్రకటిస్తారని ఆదివారం మార్కెట్లో ప్రచారం జరిగింది. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులకు రాజకీయ రంగు పులమడం సరికాదని కమీషన్ వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఇలానే కమిటీ ఏర్పాటు కావడం వల్ల ఎలాంటి లబ్ధి వ్యాపారులకు చేకూరలేదని అంటున్నారు. అధికార పార్టీ నేతలు వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా కాని పక్షంలో కొత్త సంఘం ఏర్పాటు చేసుకునేందుకు కమీషన్ వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీల్డ్ కవర్లో లక్ష్మీపురం మార్కెట్ అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు వ్యతిరేకిస్తున్న కమీషన్ వ్యాపారులు కొత్త సంఘం ఏర్పాటుకు సిద్ధం? -
కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం
మహబూబాబాద్ రూరల్: కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ పరిశీలకురాలు కూచన రవళిరెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోటలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారని, నాయకులైనా, కార్యకర్తలైనా పార్టీని ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరించకూడదని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని, అప్పుడే సరైన నాయకత్వానికి అవకాశం ఉంటుందన్నారు. సిఫార్సుల ద్వారా, నామినేటెడ్గా పదవులు ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమక్షంలో సమావేశాలు నిర్వహించి అర్హతను బట్టి పదవులు కేటాయించాలని సూచించారు. ఒక నియమావళిని రూపొందించి దానికి అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, టీపీసీసీ పరిశీలకుడు నాగేశ్వర్రావు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీపీసీసీ పరిశీలకురాలు రవళిరెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్ -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
డోర్నకల్: రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మజ్దూర్ యూనియన్ పనిచేస్తోందని ఆ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శనివారం డోర్నకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ కమిటీ సమావేశంలో ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా మజ్దూర్ యూనియన్ పని చేస్తుందన్నారు. అనంతరం బ్రాంచి యూత్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డోర్నకల్ బ్రాంచ్ సెక్రటరీ అంజియాదవ్, చైర్మన్ చరణ్నాయక్, వరంగల్, కాజీపేట బ్రాంచుల సెక్రటరీలు ఆవుల యుగేందర్, రాజేందర్, నాయకులు కిషోర్, భాస్కర్రావు, కరణ్సింగ్, నాగశేషు, రమేష్బాబు, శోభన్ప్రసాద్, వంశీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణమహబూబాబాద్ రూరల్: ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత గుర్రపు సత్యనారాయణ నియామకమయ్యారు. ఈమేరకు సంస్థ సీ ఈఓ కత్తిమండ ప్రతాప్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈనెల 10, 11 తేదీల్లో ఏలూరులో అ త్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సా హితీ సంబురాలు..సాహితీ పట్టాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: వేసవికాలం, రానున్న వర్షాకాలంలో హెల్త్ అసిస్టెంట్లు, ఆరోగ్య కార్యకర్తలు నిబద్ధతతో సమర్థవంతంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గర్భిణుల్లో రక్తహీతనను గుర్తించి ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జీజీహెచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి, గూడూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం, సుధీర్రెడ్డి, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, వైద్యాధికారులు పాల్గొన్నారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలి నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ వైద్యులకు సూచించారు. స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారులు, సిబ్బంది శుక్రవారం సమన్వయంతో ఓ మహిళకు నార్మ ల్ డెలివరీ చేశారు. దీంతో శనివారం పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ ఆరోగ్యంగా ఉన్న తల్లి పాపను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై పలు సూచనలు సలహాలు అందించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి పేదలకు వైద్యం అందించాలన్నారు. ఎండకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రూ.6 కోట్లకు ఐపీ దాఖలు ఖమ్మం లీగల్: జిల్లా కేంద్రానికి చెందిన మ షాట్టి నాగేశ్వరరావు రూ.6,37,21,858కు గా ను దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. మహబూబాబాద్తో పాటు ఖమ్మం జిల్లా పరి ధిలో ధాన్యం వ్యాపారం చేసిన ఆయన పలువు రి వద్ద అప్పులు తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ న్యాయవాది ఎం.జె.ప్రవీణ్ కుమార్ ద్వారా ఖమ్మం సీనియ ర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, పిటిషన్లో 30 మందిని ప్రతివాదులుగా చేర్చాడు. -
డిస్నీల్యాండ్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
దామెర: విద్యార్థుల బంగారు భవిష్యత్కు డిస్నీల్యాండ్ పాఠశాల బాటలు వేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కాగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను శనివారం అభినందించింది. పాఠశాలకు చెందిన తుత్తురు హర్షిణి, బానోతు శ్రీమాన్ 569 మార్కులు సాధించారు మద్దూరి శ్రీకాంత్ 560 మార్కులు, 47 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ముఖ్యసలహాదారులు దయ్యాల మల్లయ్య, సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు శోభారాణి, రాకేశ్భాను, దినేష్చందర్ ఉన్నారు. 9 ప్యాసింజర్ రైళ్లు రద్దు ● మే 3 నుంచి 5వ తేదీ వరకు.. కాజీపేట రూరల్: కాజీపేట నుంచి వెళ్లే పలు ప్యాసింజర్ రైళ్లను శనివారం నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్స్ లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డుల డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నందున సిబ్బంది కొరత వల్ల పలు రూట్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు బల్లార్షా– కాజీపేట (17036) వెళ్లే సింగరేణి ప్యాసింజర్, కాజీపేట–సిర్పూర్ కాగజ్నగర్ (17003) వెళ్లే ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) వెళ్లే ప్యాసింజర్, సికింద్రాబాద్–వరంగల్ (67761) వెళ్లే పుష్పుల్, వరంగల్–సికింద్రాబాద్ (67762) వెళ్లే పుష్పుల్, సికింద్రాబాద్–కాజీపేట (67763) వెళ్లే పుష్పుల్, కాజీపేట–సికింద్రాబాద్ (67764) వెళ్లే పుష్పుల్, కాజీపేట–డోర్నకల్ (67765) వెళ్లే పుష్పుల్, డోర్నకల్–కాజీపేట (67766) వెళ్లే పుష్పుల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
దోస్త్ రిజిస్ట్రేషన్ షురూ
మహబూబాబాద్ అర్బన్: డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం దోస్త్ 2025 ఫేజ్ 1 అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మణ్ నాయక్ తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ రిజిస్ట్రేషన్ కరపత్రాలను అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫేజ్ 1 అడ్మిషన్ ప్రక్రియ మే 3 నుంచి 21 వరకు కొనసాగుతుందని, విద్యార్థులు రూ.200 చెల్లించి దోస్త్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని, మొదటి విడత సీట్ అలాట్మెంట్ మే 29న జరుగుతుందని, సీట్ పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6 వరకు దోస్త్ పోర్టల్లో సీట్ నిర్ధారించుకోవాలన్నారు. ఫేస్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 30న మొదలవుతుందన్నారు. సలహాలు సూచనలకు దోస్త్ కోఆర్డినేటర్ వి. సాంబశివరావు (9440343941), రామన్న (9908883319) సంప్రదించవచ్చన్నారు. -
మద్యం..చోద్యం!
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025– IIలోuసాక్షి, మహబూబాబాద్/ మహబూబాద్ అర్బన్/ మహబూబాబాద్ రూరల్/ నెహ్రూసెంటర్: మందుబాబులకు ఎంజాయ్మెంట్.. మహబూబాబాద్ పట్టణ ప్రజలకు పనిష్మెంట్గా మారింది. మందుతాగేందుకు వైన్స్, పర్మిట్ రూములు, బార్లు ఉన్నా.. కొందరు ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాలు, మరికొందరు రోడ్డు మీదనే మద్యం తాగడం ఫ్యాషన్గా మారింది. విచ్చలవిడిగా మద్యం తాగి అటువైపుగా వచ్చిన విద్యార్థులను, మహిళలను ఇబ్బంది పెడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పట్టణంలో పలు ప్రాంతాలను ‘సాక్షి’విజిట్ చేసింది. ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ● మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లెందు బైపాస్ మిల్లుల వెనకాల ఖాళీ స్థలం, నందినగర్ వెంచర్, రాంచంద్రాపురం కాలనీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతం, నందనా గార్డెన్, మిషన్ భగీరథ ట్యాంకు, చెరువు కట్ట, మహర్షి స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో గుంపులుగుంపులుగా కూర్చొని మందు సేవించడం కంట పడింది. అటువైపు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, భయంభయంగా వెళ్తున్నామని మహిళలకు చెబుతున్నారు. ● వివేకానంద సెంటర్, బస్టాండ్, నర్సంపేట బైపాస్రోడ్డులోనే అత్యధికంగా వైన్స్ ఉన్నాయి. షాపుల్లో మద్యం తీసుకొని పక్కనే రోడ్డుమీద ఉండి మద్యం సేవిస్తున్నారు. దీంతో వెంకట్రామ టాకీస్సందు, బతుకమ్మ ఘాట్, హన్మంతుడిగడ్డ, బెస్త బజార్ వైపు వెళ్లే మహిళలను, విద్యార్థినులను చూసి సూటిపోటీ మాటలనడంతో రాత్రి అయితే అటు వైపు వెళ్లడం లేదు. అదేవిధంగా లేడీస్ టైలర్లు ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే ఉండటంతో.. అక్కడికి వచ్చిన మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని మహిళలకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● మూడుకోట్ల సెంటర్లోని వైన్స్ వద్ద నుంచి మందు తీసుకొని పక్కనే ఉన్న గల్లీలోకి వెళ్లి మద్యం తాగుతూ అటువైపుగా వెళ్తున్న మహిళలను కామెంట్ చేస్తున్నారని, ఖాళీ సీసాలు విసిరి వేయడం, ఇళ్ల ముందు బాటిల్స్ పెట్టడం, రాత్రి వరకు గొడవలు పెట్టుకుంటున్నారని మహిళల చెబుతున్నారు. ఏమైనా అంటే గొడవలకు దిగడం, బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ● ఫాతిమా స్కూల్ ముందు గ్రౌండ్, బాబునాయక్ తండాకు వెళ్లేదారి దారిలో ఉన్న ఖాళీ స్థలాలు సాయంత్రం అయితే చాలు బార్లను తలపించే విధంగా గుంపులుగుంపులుగా ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. గుండ్ల బోడు తండా ముందు వెంచర్లో మద్యం సేవించి రోడ్డుమీద ఉన్న కూరగాయల షాపుల్లోకి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని, దీంతో సాయంత్రం అయితే అటుగా రావాలంటే భయపడుతున్నారని, కూరగాయల గిరాకీ తగ్గిందని మహిళలు చెబుతున్నాను.న్యూస్రీల్వాళ్లకు ఎంజాయ్మెంట్.. వీళ్లకు పనిష్మెంట్ బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల హల్చల్ ప్రధాన రహదారుల వెంబడి తిష్టా అటువైపుగా వెళ్లాలంటే భయపడుతున్న మహిళలు ‘సాక్షి’ విజిట్లో తేలిన నిజాలు -
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
కొత్తగూడ: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని బత్తులపల్లిలో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలు వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్నా వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిందన్నారు. బీజేపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణననే కాపీ కొట్టిందన్నారు. అంతకుముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రేమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఈ చౌహన్, ఎస్ఈ నరేష్, డీఈలు విజయ్, సునీత, ఈడీఈలు కవిత, అయిలయ్య, ప్రణయ్, నాయకులు వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి, ఇర్ప రాజేశ్వర్, మొగిళి, రూప్సింగ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో మూతపడిన ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ను గురుకుల పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని నేతకాని కుల సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గంగారంలో.. గంగారం: గంగారం మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం 33/11కేవీ పనులకు మంత్రి సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలోని పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. గిరిజన ప్రాంతంలో లోఓల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంత్రి సీతక్క బత్తులపల్లిలో సబ్స్టేషన్కు శంకుస్థాపన -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
సాక్షిప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు జిల్లాలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటలకు చేరుకుని సాయంత్రం 6.30 గంటల వరకు.. ఆరున్నర గంటల పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కలిసి కీలక ప్రాజెక్టుల పరిశీలన, సమీక్ష చేశారు. మొదట హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌజ్కు చేరుకున్న మంత్రులు అక్కడ నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి.. ధర్మసాగర్ రిజర్వాయర్కు వెళ్లి పెండింగ్ పనులపై ఆరా తీశారు. అనంతరం భద్రకాళి చెరువును సందర్శించి పూడికతీత పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అక్కడి నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్కు కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ సమస్యలపై ఏకరువు... ఉమ్మడి వరంగల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల ముందు జిల్లా మంత్రి ధనసరి సీతక్క సహా పలువురు ఎమ్మెల్యేలు కావాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలను ఏకరువు పెట్టారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో అధికంగా ఉన్న గిరిజన గ్రామాల పరిధిలో వాగులు ఉన్నందున చెక్ డ్యామ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి కాలువల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ రామచంద్రనాయక్, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, కె.ఆర్.నాగరాజు, సత్యనారాయణ రావు, మురళీ నాయక్ మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లోని సాగునీటి కాలువలు, చెరువులు, వాగులు, సాగునీటి ఇబ్బందులు తీర్చాలని కోరారు. రెండు సీజన్లలో 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఉమ్మడి రాష్ట్రం రికార్డు బ్రేక్: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటిపారుదల శాఖ అభివద్ధి పనుల పురోగతి, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లాకు వచ్చాం. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ను కూడా సందర్శించాం. దేశంలో ఏ రాష్ట్రంలో పండని వరి పంట తెలంగాణలో వానాకాలం, యాసంగిలో 280 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఎఫ్సీఐకి ధాన్యం విక్రయించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ము ందు వరుసలో ఉంది. రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖను బలోపేతం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు సూచించిన విధంగా సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. అసంపూర్తి పనులు పూర్తి..నియోజకవర్గాల వారీగా పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, ఆగివున్న పనులన్నింటిని పూర్తి చేసి పంటకు నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు అధికారులతో సమీక్షించాం. భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. 50% పనులు పూర్తి చేసినందుకు రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు అభినందనలు. ఇది అధికారుల పనితీరు చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, అద్వైత్ కుమార్ సింగ్, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, సాగునీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘పల్లా’ వర్సెస్ నాయిని, నాగరాజు మంత్రులు ఉత్తమ్, పొంగులేటిల పర్యటన సందర్భంగా హసన్పర్తి మండలం దేవన్నపేట వద్ద ఇరిగేషన్ శాఖ అంతర్గత సమీక్షలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతర్గత సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది వీడియో చిత్రీకరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా.. ‘నా వ్యక్తిగత సిబ్బందితో వీడియో తీయించుకుంటే తప్పేంటి’ అని పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించడంపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో మంత్రులు మౌనం వహించారు.ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డి పర్యటన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, సుందరీకరణ పనులపై దృష్టి దేవాదుల పంపుహౌస్, రిజర్వాయర్లపై రివ్యూ... హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలపై సమీక్ష -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వేదికపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే శ్రీహరి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డిల పర్యటన ● దేవాదుల పంపుహౌస్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష– IIలోu -
అమ్మవారికి సూర్యప్రభ, హంసవాహన సేవలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఆలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం 5గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఉదయం సూర్యప్రభవాహనంపై, సాయంత్రం హంసవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ జిల్లా సగర(ఉప్పర) సంక్షేమ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీత కమలాకర్రావు, గుజ్జూరి అరుణ్కుమార్, వడ్లకొండ కుమారస్వామి, కొల్లూరి మధుకర్, సీత దుర్గాప్రసాద్, నలుబోలు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి దినసరి కూలీ మృతి
హసన్పర్తి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వంగపహాడ్కు చెందిన మహ్మద్ అజీజ్ (38) దినసరి కూలీ. స్థానిక బాబోయిన చెరువు వద్దకు శనివారం వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డున పడిన కుటుంబం అజీజ్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. అజీజ్ భార్య కూడా అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందింది. తండ్రి మృతదేహం వద్ద ఇద్దరు కూతుళ్లు బోరున విలపించడంతో అక్కడికి వచ్చిన వారు చలించిపోయారు. అంత్యక్రియలకు కూడా వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. రోడ్డున పడిన కుటుంబం అనాథలైన ఇద్దరు కూతుళ్లు -
రెండు కుటుంబాల్లో విషాదం
వరంగల్: రెండు కుటుంబాలకు చెందిన ఓ బాలుడు, బాలిక మృతిచెందడంతో వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ నుంచి రెండు కుటుంబాలకు చెందిన వారు శనివారం హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు సమీపంలోని రంగనాయకసాగర్లో ఈత కొట్టేందుకు దిగినట్లు తెలిసింది. మెహ్రాజ్(13), అర్భాజ్(15) చెరువులో కొంతలోతుకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందినట్లు తెలిసింది. మునిగిపోయిన వారిలో మెహ్రాజ్ మృతదేహాన్ని పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెలికితీయగా అర్భాజ్ మృతదేహం కోసం గజఈతగాళ్లతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. వివరాల కోసం ఎల్బీనగర్లోని ఏజాజ్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చౌర్బౌళిలో కిరాయి ఉంటున్న ఏజాజ్ రెండు నెలల క్రితమే ఈప్రాంతానికి అద్దెకు వచ్చారని వారి వివరాలు తెలియవని పక్కనే కిరాయికి ఉన్నవారు తెలిపారు. కాగా బాలిక మెహ్రాజ్ తండ్రి యాకుబ్బాబా బిల్డర్ అని, అర్బాజ్ తండ్రి క్యాబ్, ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంతేజార్గంజ్ పోలీసులను సంప్రదించే ప్రయత్నం చేయగా.. స్పందించలేదు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లో నగరవాసుల మృతి -
ప్రజల స్నేహితులుగా పోలీసులు●
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: పోలీసులంటే ప్రజల స్నేహితులుగా ఉండేవిధంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ అని, ప్రతీ పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీసు అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారన్నారు. ఇందులో ఎటువంటి మధ్యవర్తులు, సిఫార్సుదారులు, ఇతర ప్రభావాలు అవసరంలేదన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వయంగా చెప్పగలిగితే త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే మన పరిసరాలు మన బాధ్యతలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రాలిన ఆకులు, చెత్తచెదారం, పనికిరాని పేపర్లు, పరిసరాలను శుభ్రపరిచారు. -
ఘనంగా మేడే వేడుకలు
నెహ్రూసెంటర్: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం కార్మికులు ఎర్రజెండాలతో ర్యాలీలు తీశారు. జిల్లా కేంద్రంలో సీపీఐ–ఏఐటీయూసీ, సీపీఎం–సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా భారీ ర్యాలీలు తీశారు. మేడే స్ఫూర్తితో కార్మికుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి విజ యసారథి, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్సారథిరెడ్డి, నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదు ల శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కోటం రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్న పు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, సమ్మెట రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్ల సర్వీస్లు
● మే, జూన్లో నడిపించనున్న రైల్వే.. కాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికా రులు కాజీపేట జంక్షన్ నుంచి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రయాణికులు, భక్తుల కోసం వేసవిని పురస్కరించుకొని ప్రత్యేక రైళ్ల సర్వీస్లను ప్రవేశపెట్టి నడిపించనున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు కాజీపేట–తిరుపతి (07253) వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24వ తేదీల్లో కాజీపేట నుంచి 13:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 09:40 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుపతి–కాజీపేట (07254)వెళ్లే ఎక్స్ప్రెస్ మే 6, 13, 20, 27, జూన్ 4, 11, 18, 25వ తేదీల్లో ప్రతి బుధవారం తిరుపతిలో 12:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు కాజీపేటకు 08:00 గంటలకు చేరుతుంది. ఈ సర్వీస్లకు జనగా మ, భువనగిరి, చర్లపల్లి, సనత్నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడెమ్, సులేహలి వెస్ట్, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, కడప, రాజ్పేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ అవకాశం కల్పించారు. కేయూలో యథావిధిగా హాస్టల్స్, మెస్లు కేయూ క్యాంపస్: అలుమనాక్ ప్రకారం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు మే 1 నుంచి అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం తమకు పోటీ పరీక్షలున్నాయని యఽథావిధిగా హాస్టళ్లు, మెస్లను కొనసాగించాలని ఇటీవల ఆందోళన చేశారు. దీంతో హాస్టల్స్, మెస్లను యధావిధిగా కొనసాగిస్తున్నారు. గురువారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపా ల్, వివిధ విభాగాల అధిపతులతో అకాడమిక్ కమిటీహాల్లో సమావేశం నిర్వహించారు. పీజీ కోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం హాస్ట ళ్లు, మెస్లను కొనసాగిస్తున్నందున వారికి నా ల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెలలో నిర్వహించా లనే అంశం చర్చకు వచ్చిందని సమాచారం. కానీ, జూన్ 6వ తేదీ నుంచి పీజీ కోర్సుల నాల్గ వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ ప్రకటించారు. ఈనెల 2న కేయూ వీసీ ప్రతాప్రెడ్డి వచ్చాక సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. సెలవులు ఇ చ్చినప్పటికీ హాస్టల్, మెస్ సదుపాయం కల్పించాలని సుమారు 149మంది పీజీ కోర్సుల ఫస్టియర్ విద్యార్థులు సంబంధిత అధికారులను కోరారు. వారికి కూడా అవకాశం ఇచ్చినట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, లా కళాశాల విద్యార్థుల హాస్టళ్ల మెస్లను మూసివేసినట్లు డైరెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా బీఈ డీ, ఎంఈడీ కోర్సుల విద్యార్థులకు హాస్టళ్లలో, మెస్ సదుపాయం యధావిధిగా కొనసాగనుంది. -
సమ్మక్కసాగర్ @ డెడ్ స్టోరేజ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దేవాదుల ఇన్టెక్ వెల్ పంపింగ్కు జీవనాధారంగా పిలువబడే జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉండడంతో పంపింగ్కు అంతరాయం ఏర్పతుందనే చర్చ సాగుతుంది. పంపింగ్ నిలిచిపోతే దేవాదులకు దిగువన ఉన్న భీమ్ఘనపూర్, గొల్లబుద్ధారం వంటి రిజర్వాయర్లకు నీటి కష్టాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం సాగు నీటి అవసరం తగ్గినా.. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు ముందుచూపుతో బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తగ్గిన నీటి నిల్వలు.. సమ్మక్క సాగర్ బ్యారేజీ జలాశయంలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గి డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.76 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 83 మీటర్లు కాగా ప్రస్తుతం 72.30మీటర్లు ఉన్నాయి. బ్యారేజీలోకి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. బ్యారేజీలోని 59 గేట్లలో 58 గేట్లను క్లోజ్ చేసి ఒక గేటు నుంచి 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత కొంత కాలంగా పూర్తి గేట్లను మూసి నిల్వ చేసిన నీటిని దిగువ ప్రాంతాల తాగు నీటి అవసరాల నిమిత్తం వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. దిగువ ప్రాంతాలకు తప్పని తిప్పలు.. దేవాదుల ఇన్టెక్ వెల్కు దిగువన ఉన్న గొల్ల బుద్ధారం, భీమ్ ఘనపూర్, మొదలగు జలాశయాలకు నీటి ఇబ్బందులు తప్పేలా లేవు. దేవాదుల పంపింగ్ నిలిచిపోతే దిగువన ఉన్న జలాశయాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే ఆ జలాశయాల నీటిపై తాగు నీటికి ఆధారపడే ప్రాంతాలకు నీటి అవసరాలు తీర్చడానికి అధికారుల వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కనబడడం లేదు. నిలిచిపోనున్న దేవాదుల పంపింగ్..జలాశయానికి తగ్గుతున్న ఇన్ఫ్లో బ్యారేజీలో తేలిన ఇసుక మేటలు మున్ముందు తప్పని నీటి కష్టాలు ఇన్టెక్ వెల్ నుంచి ఒక మోటారు ద్వారా పంపింగ్తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం గ్రామ పరిధిలోని దేవాదుల ఎత్తిపోతల పంపింగ్ కొద్ది రోజుల్లో పూర్తిగా నిలిచిపోయే పరిస్థితికి నెలకొంది. ఇన్ఫ్లో లేకపోవడంతో గోదావరిలో నీటినిల్వలు తగ్గుతున్నాయి. దేవాదుల వద్ద 71.00మీటర్ల నీటి మట్టం వరకు పంపింగ్ చేసే అవకాశం ఉండగా.. ప్రస్తుతం 71.75 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దేవాదుల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉండగా.. ఏప్రిల్లో 5,6 మోటార్ల ద్వారా పంపింగ్ చేసిన అధికారులు నీటి నిల్వలు తగ్గడంతో ఒక మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. వీటితోపాటు సమ్మక్క బ్యారేజీలోని ఒక గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అంటే రోజులో 547 క్యూసెక్కుల నీరు గోదావరిలో తగ్గిపోతుంది. కానీ, ఎగువ నుంచి బ్యారేజీలోకి 100 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. ఎగువ నుంచి నీరు రావడం లేదుగోదావరిలోకి ఎగువ నుంచి నీరు రాకపోవడంతో బ్యారేజీలో నీరు తగ్గిపోతుంది. దేవాదుల వద్ద పంపింగ్కు సరిపడా నీరు అందకపోవడంతో ప్రస్తుతం ఫేజ్ 2లో ఒక మోటారు ద్వారా మాత్రమే పంపింగ్ చేస్తున్నాం. గోదావరిలోకి నీరు చేరితే మరో కొన్ని మోటార్లు ఆన్ చేసి పంపింగ్ చేస్తాం. బ్యారేజీ దిగువన గోదావరికి ఉన్న మిషన్ భగీరథ పంపింగ్ కొనసాగించడం కోసం బ్యారేజీలో ఒక గేటును ఎత్తి నీటిని వదులుతున్నాం. – శరత్ బాబు, దేవాదుల డీఈఈ -
కోర్టు ఆదేశాలు బేఖాతర్
హన్మకొండ : సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై విద్యుత్ కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7,114 ఉద్యోగాల భర్తీకి 2006, జూన్ 8న ఒకసారి.. 2006 అక్టోబర్ 20న మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. పలువురు అర్హత పరీక్షకు హాజరై ఉద్యోగానికి అర్హత సాధించారు. ఏడాదిపాటు ప్రొబేషనరీ పీరియడ్తో మొదటి సారి 2007లో దాదాపు 1,564 మందిని కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లుగా, కోర్టుకు వెళ్లిన తర్వాత 2011లో దాదాపు 875 మందిని నియమించారు. నియామక ప్రక్రియలో కేవలం వయస్సును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని భర్తీ చేపట్టడంతో అప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా, ఇతర ఉద్యోగాలు చాలా రోజులుగా చేస్తున్న వారు నష్టపోయారు. దీంతో నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా మెరిట్ను పరిగణలోకి తీసుకోలేదని, నోటిఫికేషన్ ముందు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎక్కువ పనిదినాలు నిర్వహించి, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన తమను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ద్విసభ్య ధర్మాసనం 2009 నవంబర్ 10న అర్హత కలిగి ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు క్లాజ్–6 (4)(సీ) ప్రకారం 2007, 2011లో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు 2011 ఆగస్టు 2న ఉద్యోగాలు ఇచ్చిన వీరికి సర్వీస్ బెనిఫిట్స్ మాత్రం కల్పించలేదు. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అమలు చేయలేదని ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు అభ్యర్థులకు సర్వీస్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని తీర్పు ఇచ్చారు. అప్పటి ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు సీనియారిటీ జాబితా తయారు చేయాలని మెమో జారీ చేశారు. 2007, 2011లో నియామకమైన అభ్యర్థులందరితో సీనియారిటీ జాబితాను రూపొందించారు. కాంట్రా క్ట్ పద్ధతిలో పని చేసినప్పుడు తక్కువ పనిదినాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయగా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు 2019 ఫిబ్రవరి 25న తీర్పు ఇస్తూ 2009లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆదేశించగా, అభ్యర్థులు ఎన్పీడీసీఎల్ యాజమాన్యానికి వినతి పత్రం అందించారు. నాటి నుంచి నేటి వరకు సీఎండీలు మారుతున్న తమకు మాత్రం న్యాయం జరుగడం లేదని 2011లో ఉద్యోగాలు పొందిన సీజేఎల్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు 2011 నుంచి జీతం ఇవ్వాల్సి ఉండగా 2016 నుంచి మాత్రమే జీతం చెల్లిస్తున్నారని తెలిపారు. ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మ్యాన్ డేస్ను కాకుండా పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవవడంతో మ్యాన్డేస్ (పని దినాలు) ఎక్కువగా ఉన్న వారు సీనియారిటీని కోల్పోతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పట్టించుకోని టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం సీజేఎల్ఎంలకు దక్కని ప్రయోజనాలు -
‘నీట్’ను పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు 513 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతారన్నారు. అబ్జర్వర్లతో పాటు 46 మంది ఇన్విజిలేటర్లు అందుబాటులో ఉంటారన్నారు. సీసీ కెమెరాల పనితీరు సరిచూసుకోవాలని, నూతన కెమెరాలను అమర్చాలని, విద్యుత్ అంతరాయం లేకుండా, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు గంటముందు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతిరావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఈఓ రవీందర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జాక్విన్, తహసీల్దార్ భగవాన్రెడ్డి, కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేష్, మెడికల్, ఫైర్, విద్యుత్శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.డీఈఓకు సన్మానంమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మానుకోట జిల్లా మొదటి స్థానం సాధించడంతో విద్యాశాఖ టీఎన్జీఓఎస్ ఉద్యోగ సంఘం నాయకులు డీఈఓ రవీందర్రెడ్డి, ఏసీజీఈ మందుల శ్రీరాములును గురువారం జిల్లా కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.గణేశ్, ఎండి.ముజాహిద్, ఆఫీస్ సూపరింటెండెంట్లు ఎ.ఉమామహేశ్వర్, కె.జ్యోతి, శ్రీనివాస్, ఉద్యోగులు సమద్అహ్మద్, శ్రీనివాస్, శ్రీకాంత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.విద్యానైపుణ్యాలు పెంపొందించుకోవాలిమహబూబాబాద్ రూరల్: విద్యార్థులు విద్యానైపుణ్యాలు పెంపొందించుకోవాలని విద్యాశాఖ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి ప్రత్యేక తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఈనెల 31 తేదీ వరకు నెల రోజుల పాటు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వేసవి ప్రత్యేక తరగతులు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారని, ఈ అవకాశాన్ని బ్రాహ్మణపల్లి, కొమ్ముగూడెం, జిల్లెల్లగూడెం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలతో, పాటు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ధారావత్ భద్రు, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్య ప్రకాశ్, బొమ్మెర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, బానోత్ శంకర్, గిద్దె శృతి, గ్రామస్తులు పాషా, అప్రోజ్, శ్రీనివాస్, ముఖేశ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.కార్మిక చట్టాలపై అవగాహననెహ్రూసెంటర్: కార్మిక చట్టాలు, హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం మే డే సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ న్యాయ సహాయ న్యాయవాది దాసరి నాగేశ్వర్రావు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు బి.విజయసారథి, అజయ్సారథిరెడ్డి, న్యాయవాదులు భూక్య మోహన్నాయక్, కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.