breaking news
Mahabubabad District News
-
మహాజాతరకు కేంద్ర మంత్రులకు ఆహ్వానం
ఎస్ఎస్తాడ్వాయి: 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క– సారలమ్మ మహజాతరకు కేంద్ర మంత్రులు జువల్ ఓరం, కిషన్రెడ్డిని బీజేపీ జిల్లా నా యకులు ఆహ్వానించారు. గురువారం ఆదిలా బాద్ ఎంపీ గోడం నాగేశ్ ఆధ్వర్యంలో బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, నాయకులు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం మంత్రులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భరతపురం నరేశ్, పోదెం రవీందర్, సంతోష్ కుమార్ ఉన్నారు.బైక్ను ఢీకొన్న బొలెరో ● యువకుడి మృతి, మరొకరి పరిస్థితి విషమం కాటారం: కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్డు కొండంపేట క్రాస్ వద్ద బొలెరో.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న యువకుడు మృతి చెందగా మరొ కరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేటకు చెందిన శనిగరం రాఘవ, వలెంకుంటకు చెందిన మంతెన గణేశ్(20) గురువారం బైక్పై గంగారం ఎక్స్ రోడ్డు వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో మంథని వైపునకు వెళ్తున్న బొలెరో కొండంపేట క్రాస్ దాటుతున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న రాఘవ, గణేశ్ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గణేశ్ చికిత్స పొందుతూ మృతి చెందగా రాఘవ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలి ● రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ మహబూబాబాద్ రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే రక్షక దళం విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కొనసాగించేలా కృషి చేయాలని రైల్వే రక్షక దళం అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సుభాష్ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేష న్ పరిధిలోని రైల్వే రక్షక దళం ఔట్ పోస్టు వి భాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే భద్రతాపరమైన విషయాలపై అధికారులు, సి బ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిధిలో చో రీలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తనిఖీల్లో కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, మానుకోట ఆర్పీఎఫ్ ఎస్సై సుభాని, సిబ్బంది ప ద్మ, జయపా ల్, శ్రీను, క న్న,శిరీష పా ల్గొన్నారు. -
కంకవనాలు కనుమరుగు
ఎస్ఎస్తాడ్వాయి: మహాజాతర ఏర్పాట్ల పేరుతో మేడారం అటవీ ప్రాంతంలోని కంకవనాలు కనుమరుగువుతున్నాయి. భక్తుల సౌకర్యాల పేరుతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా విలువైన కంకవనాలను నరికివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మేడారం ఆర్టీసీ బస్టాండ్లో తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తున్న గదులకు స్థానికంగా లభించే కంక బొంగులను వినియోగిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటవీ సంపదకు నష్టం.. జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా అటవీ సంపదను నాశనం చేయడం ఎంత వరకు సమంజసమనే పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు బయట ప్రాంతాల నుంచి కంక బొంగులను కొనుగోలు చేసి తీసుకొచ్చి గదుల ఏర్పాటుకు వినియోగించాల్సి ఉంది. కానీ, అక్రమంగా వెదురు బొంగులను గదులకు వినియోగిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్లో అడవుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, కంక చెట్లు నరికి వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంకవనాలకు ప్రాధాన్యం.. కంక చెట్లు మేడారం అటవీ ప్రాంతానికి జీవనాడీగా భావిస్తారు. కంక చెట్లు నేల తేమను నిలుపుకోవడంలో, వర్షపు నీటి నిల్వలో, వన్యప్రాణులకు ఆశ్రయంగా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల్లో కంక వనాలకు ప్రత్యేక ఉంది. అలాగే, సమ్మక్క– సారలమ్మ పూజా కార్యక్రమాల్లో వీటికి విశిష్టత ఉంది. సమ్మక్క–సారలమ్మను గద్దెలపై పూజారులు వెదురు బొంగులతో తయారు చేసిన బుట్టలో తీసుకురావడంతోపాటు తల్లుల గద్దెలపై కూడా కంకవనాలను పూజారులు ప్రతిష్ఠిస్తారు. ప్రతీ జాతరకు ఇదే తంతు.. ప్రతీ ఏటా జాతర సమయంలో కంక వనాలను అక్రమంగా నరికివేస్తున్నారు. కాంట్రాక్టర్లు కొంత కొనుగోలు చేసిన వెదురు బొంగులను మేడారానికి తీసుకొచ్చి వినియోగించి, మిగిలింది మేడారం అటవీ ప్రాంతంలోని బొంగులను నరికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా అటవీ అనుమతి లేకుండా వినియోగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.చర్యలు తీసుకుంటాం..ఆర్టీసీ బస్టాండ్లోని తడకలు, వె దురు బొంగులతో ఏర్పాటు చేస్తు న్న గదులను పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన వెదురు బొంగులకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నాం. మూడు రోజులు ఎన్నికల విధులకు వెళ్లాం. ఈ సమయంలో అటవీ నుంచి కంక బొంగులను తీసుకొచ్చి వినియోగించినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – సాగర్రెడ్డి, సెక్షన్ ఆఫీసర్మేడారంలో వెదురు చెట్ల నరికివేత ఆర్టీసీ బస్టాండ్లో తడకల గదులకు వినియోగం పట్టించుకోని అటవీశాఖ అధికారులు -
రూ.49.34కోట్ల మద్యం విక్రయాలు
మహబూబాబాద్ రూరల్: మూడు విడతల్లో కొనసాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రూ.49.34 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా అన్ని పార్టీలు జీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు ఇచ్చారు. ఇందులో అధికంగా మద్యం బాటిళ్లు ఓటర్లకు పంపిణీ చేశారు. కాగా ఈనెల 1నుంచి 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 47,363 లిక్కర్ బాక్సులు, 48,684 బీర్ల బాక్సులు మొత్తంగా రూ.49.34 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికలవేళ...పెరిగిన మద్యం విక్రయాలు.. సాధారణంగా జిల్లాలో ప్రతీనెల సుమారు రూ.50 నుంచి రూ.55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నెలరోజుల పాటు జరగాల్సిన మద్యం విక్రయాలు కేవలం 15రోజుల వ్యవధిలోనే రూ.49.34 కోట్ల మేరకు జరిగినట్లు తెలిసింది. -
రెబల్స్..దారెటు!
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తుండగానే ముగిసిపోయాయి. నిన్నటి వరకు తమ మద్దతుదారులను గెలిపించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు రెబల్ సర్పంచ్లను ఏం చేద్దామని తర్జనభర్జన పడుతున్నారు. ఒక వైపు మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అని రెబల్ సర్పంచ్లు చెబుతుండగా.. పార్టీ ఓటమికి కారణం వారే.. వారితోపాటు, వారికి మద్దతు తెలిపిన నాయకులను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన వారు అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. 34 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల గెలుపు.. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ మద్దతు తెలిపిన వారు కాకుండా.. మద్దతు తెలుపలేదని విభేదించి పోటీలో నిలబడి గెలిచిన వారు మొత్తం 34మంది ఉన్నారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండలం నుంచి ముగ్గురు, దంతాలపల్లి నుంచి నలుగురు, నర్సింహులపేట నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూబాబాద్ మండలంలో ముగ్గురు, కేసముద్రం నుంచి ఒకరు, గూడూరు నుంచి ముగ్గురు, నెల్లికుదురు నుంచి ఒకరు.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబల్గా నిలబడి గెలిచారు. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో నలుగురు, గార్ల మండలంలో నలుగురు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ రెబల్గా నిలబడి గెలిచారు. మాదీ కాంగ్రెస్ పార్టీ అంటున్న రెబల్స్.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాం. పార్టీ మద్దతు ఇవ్వలేదు. కానీ పోటీ చేసి గెలిచినం. అంతే కానీ కాంగ్రెస్ పార్టీని విడిచి పోలేదని రెబల్ సర్పంచ్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ పెద్దలను, ఎమ్మెల్యేలను కలిసి తాము పార్టీలోనే ఉన్నామని చెప్పారు. వారితోపాటు మద్దతు తెలిపిన నాయకులు కూడా గెలిచిన సర్పంచ్లు కాంగ్రెస్లోనే ఉన్నారని, గ్రామస్థాయిలో వారి బలాన్ని మనమే అంచనా వేయకుండా మద్దతు తెలుపలేదని నాయకులకు చెబుతున్నారు. కాంగ్రెస్లో నూతన సర్పంచ్ల లొల్లి పార్టీలోకి రానివ్వొద్దు అంటున్న ఓడిన అభ్యర్థులు మాది కాంగ్రెస్ పార్టీనే అంటున్న రెబల్ సర్పంచ్లు నాయకులకు తలనొప్పిగా వ్యవహారం రెబల్స్కు బీఆర్ఎస్ గాలంకాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం రెబల్ సర్పంచ్లపైమండిపడుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకు పనిచేశాం. లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాం.. పార్టీలోనే రెబల్గా నిలబడి ఓట్లు చీల్చారు. ఇప్పుడు వారిని పార్టీలోకి తీసుకుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెబల్ సర్పంచ్లతో పాటు వారికి మద్దతుగా ఉన్న నా యకులు, కార్యకర్తలను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి లో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు సంకట స్థితి లో పడ్డారు. గెలిచిన వారినిపార్టీలోకి రానివ్వకుంటే పార్టీ రెండుగా చీలిపోతుందని, ఈ ప్రభావం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. ఒక వేళ వారిని పార్టీలో కి తీసుకుంటే.. పార్టీకోసం నిలబడి డబ్బులు ఖర్చుచేసిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై గ్రామ స్థాయిలో మాట్లాడుకొని గెలిచిన వారు.. ఓడిన వారిని తీసుకొచ్చి పార్టీలో చేరాలని, భేషజాలకు పోకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉన్న పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లను బీఆర్ఎస్ తమ పార్టీలోకి రావాలని గాలం వేస్తున్నారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని అనుచరుల ద్వారా కబురు పెడుతున్నట్లు ప్రచారం. -
ప్రజాభద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలి
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఎస్పీ శబరీష్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసు అధికారులకు ప్రశంసపత్రాలు, సిబ్బందికి ఎస్పీ గురువారం రివార్డులు అందజేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తికా వడంతో పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పిటిషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, నివారణాత్మక పోలీసింగ్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంశాలపై సమీక్షించి, సైబర్ నేరాలు, పోక్సో కేసులు, మాదక ద్రవ్యాలు, మద్యం అక్రమ రవాణా, ట్రాఫిక్, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అలాగే సీసీ టీవీ సర్వైలెన్స్, సీసీటీఎన్ఎస్ వంటి ఆధునిక సాంకేతికత వినియోగం, మద్యం మత్తులో వాహనాల నడపడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ఉల్లంఘనలు, నంబర్ ప్లేట్లులేని వాహనాలు, డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఆస్తి నేరాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, జూదం, ఆర్థిక మోసాలు, భూవివాదాలు, చట్ట వ్యవస్థ సమస్యలు, రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ అంశాల్లో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ప్రవర్తన, క్రమశిక్షణ, బాధ్యతతో పాటు దర్యాప్తు ప్రక్రియలు, కోర్టు మానిటరింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. -
జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
రేగొండ: జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజుకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఈక్రమంలో అతడు తరచుగా తల్లి హైమావతి, భార్యతో గొడవపడుతుండేవాడు. 2024 జనవరి 4వ తేదీన అర్ధరాత్రి తల్లితో గొడవపడి రోకలిబండతో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటిపక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ జనవరి 14న మృతిచెందింది. ఈ ఘటనపై అప్పటి ఎస్సై శ్రీకాంత్రెడ్డి కేసు నమోదు చేయగా అప్పటి చిట్యాల సీఐ వేణుచందర్.. నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనంతరం సీఐ మల్లేశ్యాదవ్ చార్జ్షీట్ దాఖలు చేశారు. గురువారం కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడు రాజుకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రమేశ్బాబు తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన గణపురం సీఐ కరుణాకర్రావు, రేగొండ ఎస్సై రాజేశ్ను భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ అభినందించారు. 108 ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ హన్మకొండ అర్బన్ : 108, 102 సర్వీస్ల ఉమ్మ డి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా పాటి శివకుమార్ బాధ్యతల స్వీకరించారు. ఇంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయనను రాష్ట్ర అధికారులు జిల్లాకు బదిలీ చేశారు. త్వరలో జరగనున్న మేడారం జాతర నేపథ్యంలో ప్రాధాన్యతను గుర్తించి ఆయనను ఇక్కడికి బదిలీ చేసినట్లు సమాచారం. వరంగల్లో పనిచేసిన సమయంలో మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల్లో చేరిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
మా చిట్టి డబ్బులు ఇప్పించండి
కాజీపేట అర్బన్: మా చిట్టి డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చిట్స్ బాధితులు పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్ఫండ్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. తొలుత కనకదుర్గ చిట్ఫండ్ బాధితుల్లోని 37 గ్రూపుల్లో 25 మందికి 3 కోట్ల రూపాయల ఎఫ్డీలను జాయింట్ అకౌంట్ జిల్లా రిజిస్ట్రార్, కనకదుర్గ చిట్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి అందజేసిన విషయం విదితమే. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ, శుభనందిని చిట్స్ బాధితులు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం చేరుకుని ఫిర్యాదులు అందించారు. తాము పూర్తిగా చిట్టి డబ్బులు చెల్లించాం.. డబ్బులు ఇప్పించండి అంటూ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను వేడుకున్నారు. డీఐజీకి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదుల వెల్లువ -
తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ
హసన్పర్తి : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఈమేరకు బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఎస్ పరిధి లోని సప్తగిరి–6 కాలనీకి చెందిన సిద్దంశెట్టి నిఖిల్ దంపతులు బ్యాంకు ఉద్యోగులు. బుధవారం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చే సరికి తలుపు ధ్వంసం చేసి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. మరో ఘటనలో పక్కనే ఉన్న పరిమళ కాలనీ–22లోని రమేశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో చోరీ జరిగింది. బుధవారం తుది దశ ఎన్నికల సందర్భంగా రమేశ్ విధులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో దొంగలు బీరువాను ధ్వంసం చేసి 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలాలకు చేరుకుని జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు. 13 తులాల బంగారు ఆభరణాలు మాయం కేయూ పీఎస్ పరిధిలో ఘటన -
21న జిల్లా స్థాయి చదరంగ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: కమల్ కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ సమీపంలో గల టీటీడీ కల్యాణ మండపంలో అండర్ –07, 09, 11, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు పురస్కారంతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్ ఇతర పూర్తి వివరాలకు 9676056744 , 9154570257 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. నేటి నుంచి టెమ్రిస్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు న్యూశాయంపేట : తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ(టెమ్రిస్) ఆధ్వర్యంలో నేటి(శుక్రవారం) నుంచి మూడో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయని గురుకులాల ఆర్ఎల్సీ, క్రీడా పోటీల రీజినల్ కన్వీనర్ డాక్టర్ జంగా సతీశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధి ఆరు జిల్లాలలోని బాల, బాలికల గురుకులాల క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలురకు వరంగల్ రంగశాయిపేటలోని వరంగల్(బీ1) గురుకులంలో, బాలికలకు శంభునిపేట దూపకుంటరోడ్లోని వరంగల్(జీ2) గురుకులంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కేయూలో లాన్ టెన్నిస్ ఎంపికలు కేయూ క్యాంపస్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వివిధ కళాశాలలకు చెందిన క్రీడాకారులకు గురువారం లాన్ టెన్నిస్ ఎంపికలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు 30 మంది హాజరయ్యారు. ఇందులో ఐదుగురు మెన్, మరో ఐదుగురు ఉమెన్స్ మొత్తం 10 మందిని ఎంపిక చేశామని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వీరు సౌత్జోన్ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. కేయూలో అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు ● నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహణ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఈనెల 19 , 20వ తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో షార్ట్రన్స్, మిడిల్ రన్స్, లాంగ్రన్స్ 400, 4 ్ఠ400 మీటర్ల రిలే పరుగు పందెం పోటీలు నిర్వహించబోతున్నారు.లాంగ్ జంప్, హైజంప్, హ్యామర్త్రో, షార్ట్పుట్, జావెలిన్త్రో విభాగాల్లో పురుషుల, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడాపోటీలను వీసీ కె. ప్రతాప్రెడ్డి ప్రారంభిస్తారని కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కుమారస్వామి గురువారం తెలిపారు. ఈనెల 20 ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీకాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. -
పొలం దున్నుతుండగా తిరగబడిన ట్రాక్టర్..
నెల్లికుదురు: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన హెచ్. యాకయ్య (45) వివాహ అనంతరం అత్తగారి గ్రామం మండలంలోని శ్రీరామగిరిలో స్థిరపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మండలంలోని బంజరకు చెందిన ఓ రైతు తన ట్రాక్టర్ డ్రైవర్ రాకపోవడంలో ఒక్క రోజు (యాక్టింగ్ డ్రైవర్గా) డ్రైవర్గా పిలువగా యాకయ్య వెళ్లి పొలం దున్నుతున్నాడు. ఈ సమయంలో ట్రాక్టర్ దిగబడగా బయటకు తీస్తున్న క్రమంలో తిరగబడి యాకయ్య మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలికి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. ఒక్క రోజు పనికి పోకుంటే బతికెటోడివి బిడ్డో అంటూ బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై ఎస్సై చిర్ర రమేశ్ బాబును వివరణ కోరగా యాకయ్య మృతిపై ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. అక్కడికక్కడే డ్రైవర్ మృతి బంజర గ్రామంలో ఘటన -
ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
నెహ్రూసెంటర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. శీతా కాలం సందర్భంగా జిల్లాలోని అన్ని వసతి గృహాలను అధికారులు తనిఖీ చేయాలని సూచించా రు. పిల్లలకు సరిపడా దుప్పట్లు, మానసిక ,ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఉపాధ్యాయులు ప్రత్యేక డిజిటల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్, డీఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్రాజు, ఏడీ ఎస్ఎల్ఆర్ నరసింహామూర్తి, డీఏఓ విజయనిర్మల, సవిల్సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఎస్ఓ రమేష్, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ రాళ్లపై గ్రైండింగ్తో ఇబ్బందులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయిపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో ఆ రాళ్లపై గీతలు, ఎత్తువంపులు తొలగించడానికి గ్రైండింగ్ పనులు చేస్తుండడంతో దుమ్ము ఎగిసిపడుతోంది. గ్రైండింగ్ పనులతో గురువారం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడ్డారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి స్ప్రే చేయకుండా గ్రైండింగ్ చేపట్టడమే కారణమని భక్తులు అంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ పనులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో శ్వాసకోశ సమస్యలు కూడా వ్యాపిస్తాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుమ్ము రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత యాసంగి సీజన్లో ఎరువులు పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. హైదరాబాద్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. ఈ స ందర్భంగా గోపి మాట్లాడుతూ.. ఇకపై రైతులు యూరియా కోసం సమయం కేటాయించాల్సిన అవసరంలేదన్నారు. రైతులు పంటల కోసం వినియోగిస్తున్న యూరియా ఎంత మేరకు అవసరం, ఆ కోటాను రైతులు వారి ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి అవసరమైన మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, సాంకేతిక వ్యవసాయ సహాయ సంచాలకుడు మురళి, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి రాంజీ, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. యాప్ ద్వారా యూరియా సరఫరా చేయాలి కురవి: ఎరువుల డీలర్లు యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేయాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. గురువారం కురవి రైతువేదికలో యూరియా బుకింగ్ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాప్లో బుక్ చేసిన రైతులకు యూరియా సరఫరా చేయకపోతే సదరు డీలర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యాప్ ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతులు దీనిపై అవగాహన పెంచుకుని యూరియా బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గుంటక నర్సింహరావు, ఏఈఓలు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. పంట మార్పిడితో రెట్టింపు ఆదాయం బయ్యారం: పంట మార్పిడి వల్ల రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖాధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం బయ్యారంలో ఆయన పర్యటించి సాగు చేసిన పచ్చిరొట్ట పంటను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్, ఉద్యాన, మల్బరీ, కూరగాయలు, మునగ వంటి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించడం వల్ల మెరుగైన ఆదాయం వస్తుందన్నారు. పచ్చిరొట్ట పంటను సాగు చేయడం వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయన్నారు. రేపు కేయూలో అవగాహన సదస్సు కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి నిర్మల గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అని తారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనో హర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామి డాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ మేఘనరావు తెలిపారు. పుణ్యస్నానాలు.. మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
అర్హతలేని వైద్యులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అబార్షన్ల కోసం అర్హత లేని వైద్యులను సంప్రదించి ప్రాణాలను పోగొట్టుకోవద్దని, ఎంటీపీ చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో అవకాశం కల్పించిందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం–1994పై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, బాలికలపై వివక్షత, ఎంటీపీ చట్టంపై ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హత లేకుండా అబార్షన్లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, స్కానింగ్ సెంటర్లు నియామకాలకు లోబడి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే 104, 1098, 100 డయల్ చేసి తెలియజేవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్ శశిజోత్స్న, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగదీశ్వర్, రాజుంద్రప్రసాద్, ప్రోగ్రాం అధికారి సారంగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, డాక్టర్ సుధీర్రెడ్డి, నాగేశ్వర్రావు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్రవణ్, ప్రత్యూష, డెమో ప్రసాద్, సీడీపీఓ శిరీష, వసుంధర, రాజు, లోక్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం కరపత్రాలు ఆవిష్కరించారు. -
కుష్ఠును తరిమేద్దాం..
● లెప్రసీ కట్టడికి వైద్యారోగ్యశాఖ చర్యలు ● ప్రారంభమైన ఇంటింటి సర్వేనెహ్రూసెంటర్: ప్రమాదకరమైన కుష్ఠువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నివారణే ధ్యేయంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో 886 బృందాలతో ఇంటింటి లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,28,374 ఇళ్ల సర్వేలో భాగంగా పరీక్షలు చేపట్టి కుష్ఠువ్యాధి అనుమానితులును గుర్తించనున్నారు. కాగా జిల్లాలో ప్రస్తుతం 70కుష్ఠు కేసులు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు.. చర్మంపై మచ్చలు, మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మచ్చలు ఎరువు లేదా రాగి, గోధుమ రంగులో ఉండడంతో పాటు మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ ఉండదు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా చికిత్స తీసుకుని నివారించ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రెండేళ్ల వయసు పైబడిన వారికి వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాఽధి కట్టడికి.. కుష్ఠు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇంటింటికీ వైద్యారోగ్యశాఖ సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఆశకార్యకర్తలు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. జిల్లాలో సర్వే నిర్వహించి ప్రతీ ఒక్కరిని పరీక్షించి వ్యాధి వ్యాప్తి కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్సను అందించనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే..కుష్ఠు వ్యాధి నివారణకు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగు మచ్చలు ఉన్నట్లయితే, అనుమానితులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నివారణకు ప్రజలు అవగాహన పెంచుకుని ముందుకు రావాలి. వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి, నివారణ చర్యలు తీసుకుంటున్నాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ సర్వే చేయాల్సిన రోజులు 14 సర్వే బృందాలు 886 విజిట్ చేయాల్సిన ఇళ్లు 2,28,374 ప్రస్తుతం కేసుల సంఖ్య 70 -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 21న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని వివరించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షాలిని షాకెల్లి, జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్, జూనియర్ సివిల్ జడ్జిలు, స్వాతి మురారి, ధీరజ్ కుమార్ దామెర, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, డీస్పీలు తిరుపతిరావు, కృష్ణ కిషోర్, జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్సైలు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
భద్రతానైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
హన్మకొండ: రోడ్డు భద్రతా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. గురువారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో అద్దె బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత– సురక్షిత డ్రైవింగ్ –నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని సూచించారు. బస్సు నడుపడంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ తన వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి డ్రైవర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ మాట్లాడవద్దని కోరారు. ప్రతి డ్రైవర్ సరైన పోషకాహారం తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలను నివారించడానికి చాకచక్యంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. శిక్షణలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భా నుకిరణ్, వరంగల్ రీజియన్లోని అన్ని డిపోల ను ంచి ఎంపిక చేసిన అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ విద్యార్థులకు సూచించారు. 69వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే పోటీలకు డీఈఓ గిరిరాజ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన ప్రతి ఆటను ఓ మెట్టుగా మలుచుకుని విజయం వైపు పయనించాలని సూచించారు. విశిష్ట అతిథి, యువజన కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి మాట్లాడుతు బాక్సింగ్ ఆత్మరక్షణకే కాకుండా సమాజంలో బాక్సర్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, రెఫరీలు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులకు భోజన, ఇతర వసతులు కల్పించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని గుణలో జరగనున్న ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, కార్యదర్శి మల్లారెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి మంచాల స్వామిచరణ్, భూపాలపల్లి డీవైఎస్ఓ చిర్ర రఘు, ఆర్మీ రిటైర్డ్ అధికారి శీలం నరేంద్రదేవ్, కోచ్లు ప్రభుదాస్, శ్యాంసన్, శ్రీకాంత్, రెఫరీలు వేణు, కుమార్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్గౌడ్ హనుమకొండలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరు -
ఓట్లచోరీతో మూడోసారి అధికారంలోకి..
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్మహబూబాబాద్ అర్బన్ : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓట్ల చోరీతో మూడోసారి అధికారంలోకి వచ్చారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ, ఐటీ కేసులు బనాయించిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే మురళీనాయక్, కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలు.. రాహుల్గాంధీ, సోనియా గాంధీపై కక్షపూరితంగా కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని, మోదీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిచేసుకోవాలన్నారు. లేనిపక్షంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా డీఎస్పీ తిరుపతిరావు, టౌన్, రూరల్ సీఐలు మహేందర్రెడ్డి, సర్వయ్య అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డీఎస్పీ చొరవతో ఎమ్మెల్యే, నాయకులు ధర్నాను విరమించుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, నాయకులు అంజయ్య, శంతన్రామరాజు, అరేంపుల విజయమ్మ, బండారు వెంకన్న, మహేందర్రెడ్డి, కొమ్మలు,వెంకన్న, సప్పిడి రంజిత్, శ్యామ్, విజయ, నాగమణి పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో మేము సైతం..
గుట్టలు దిగి.. వాగులు దాటి క్రమం తప్పకుండా ఓటేస్తున్న పెనుగోలు గిరిజనులువాజేడు: పెనుగోలు.. ఇది పచ్చని అడవి మధ్యలోని ఎత్తైన గుట్టలపై నున్న ఆదివాసీ కుగ్రామం. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జీపీ పరిధిలో ఉన్న ఈ గూడేనికి రాకపోకలు సాగించాలంటే ఎన్నో వ్యయప్రసాలకు ఓర్చుకుని 3 గుట్టలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. అలాగే మూడు వాగులు దాటాలి. 15 కిలో మీటర్లు నడచి రావాలి. ఇక్కడ 10 కుటుంబాలు, 38 మంది జనాభా ఉన్నారు. 25 మంది ఓటర్లు ఉన్నారు. అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నా ఇక్కడి ఆదివాసీలు ఓటు హక్కు వినియోగంలో మైదాన ప్రాంత ప్రజల కంటే చైతన్యవంతులు. ఉన్నత విద్యావంతులతోపాటు రహదారి సౌకర్యం ఉన్న ప్రాంతాల ప్రజలు ఓటు వేయడానికి బద్దకంగా ఉంటున్న ఈ రోజుల్లో పెనుగోలు గిరిజనులు మాత్రం రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీరి బతుకులు మాత్రం మారడం లేదు. ప్రస్తుత జీపీ ఎన్నికల్లోనూ తమ ఓటు వినియోగించుకున్నారు. కొంగాల జీపీ పరిధిలో 18 మంది, నాగారం జీపీ పరిధిలో ఆరుగురు తమ ఓటు హక్కును ఉపయోగించుకోగా బొగ్గుల లక్ష్మికి ఓటు లేకుండా పోయింది. ఓట్ల కోసమే మమ్ములను వాడుకుంటున్నారు.. ఆయా జీపీల పరిధిలో ఓటు వేసిన అనంతరం పలువురు పెనుగోలు వాసులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకున్నామన్నారు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలని గుట్టలు దిగొచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. కేవలం తమను ఓట్ల కోసం వాడుకుంటూ ఎన్నికల తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసం మాత్రమే తమను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి సౌకర్యాలు లేవని తమ గోడువెల్లబోసుకున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి.. పెనుగోలు గ్రామానికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు. రాళ్ల దారిలో వాగులు, వంకలు దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిందే. సమీపంలోని పాల వా గు, నల్ల వాగుల నుంచి నీటిని తెచ్చుకుని తాగాల్సి పరిస్థితి. ఇక్కడి వారికి ఏ రోగం, నొప్పి వచ్చినా వైద్యం అందదు. గుట్టల పైనున్న ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రారు. కేవలం ఒక ఏఎన్ఎం మాత్రం వచ్చి వెళ్తుంది. దీంతో జ్వర మొచ్చినా, నొప్పి వచ్చినా రోగులు కిందికి రావాలి. వైద్యం కోసం వాజేడు, వెంకటాపురం(కె), భద్రాచలం, వరంగల్లోని వైద్య శాలలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రోగులను ఆస్పత్రికి తీసుకురావాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలపై పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. అలాగే, గుట్టలపై ఉన్న 10 కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లతోపాటు, రెండు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని కోరారు. అయినా మారని బతుకులు ఫలితంగా గుట్టలపై దుర్భర జీవనం గడుపుతున్న గిరిజనులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ -
ఓటెత్తిన పల్లె..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగిన పోలింగ్కు ఓటర్లు బారులుదీరారు. ఓటర్లు పట్టణాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు తరలొచ్చి ఓట్లు వేయడంతో సందడి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లను స్థానికులు, సర్పంచ్ అభ్యర్థులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఎన్నికల విధుల్లో ఎంపీడీఓకు అస్వస్థత.. మృతి వెంకటాపురం(కె) : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్(58) అస్వస్థతకు గురయ్యారు. బు ధవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు సమయంలో ఆరో గ్య సమస్య తలెత్తడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.తగ్గిన ఓటింగ్.. ● 2019 కన్నా తక్కువ పోలింగ్ .. హన్మకొండ అర్బన్: జిల్లాలో 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పు డు 7 మండలాల్లోని మొత్తం 130 జీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఒంటిమామిడిపల్లి మినహా మిగతా 129 జీపీలకు మూడు విడతల్లో నిర్వహించారు. తర్వాత మండలాలు మారడంతో ప్రస్తుతం 12 మండలాల పరిధిలో జీపీ ఎన్నికలు జరిగాయి. మొత్తం రెండు ఎన్నికలు పోల్చిస్తే అప్పుడే జిల్లాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో ఐనవోలు మండలంలో 90 శాతం పోలింగ్ నమోదైంది.గత, ప్రస్తుత పోలింగ్ వివరాలు ఫేజ్ 2019 పోలింగ్ 2025 పోలింగ్ శాతం శాతంమొదటి 89.02 83.95 రెండు 86.83 87.34 మూడు 88.80 86.44 -
కాళేశ్వరం సర్పంచ్కి 1,010ఓట్ల మెజారిటీ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెంగని అశోక్పై 1,010 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. బుధవారం మూడో విడతలో ఎన్నికలు జరగగా..2,700 ఓటర్లు ఉండగా 2,315 ఓట్లు పోలయ్యాయి. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. అందులో మోహన్రెడ్డికి 1,497 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మెంగని అశోక్కు 487 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సంతోష్ 156, బీజేపీ బలపర్చిన మరో అభ్యర్థికి 56 ఓట్లు వచ్చాయి. మిగతావి నోటా, చెల్లని ఓట్లు ఉన్నాయి. దీంతో ప్రత్యర్థి అశోక్పై మోహన్రెడి 1,010ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన భార్య వెన్నపురెడ్డి వసంత గతంలో సర్పంచ్గా, మహదేవపూర్ ఎంపీపీగా పదవులు నిర్వర్తించారు. -
అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
● తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయిశ్రీ వరంగల్ క్రైం: అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ తెలిపారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ, వరంగల్ కమిషనరేట్ సైబర్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై ప్రజలతోపాటు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్లు, పెట్టుబడి మోసాలు, మ్యాట్రిమోని, ట్రేడింగ్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారో, అలాగే వారి బారిన పడకుండా తీసుకోవాల్సి న జాగ్రత్తలు వివరించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అదేవిధంగా http://www.cybercrime.govin వెబ్ సైట్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ వరంగల్ విభాగం డీఎస్పీ గిరికుమార్, ఇన్స్పెక్టర్లు యాసిన్,అశోక్ కుమార్, కళాశాల ప్రిన్స్పాల్ ప్రకాశ్, ఎస్సైలు చరణ్ కుమార్, శివ కుమార్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో స్నేహభావం
● రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్ స్టేషన్ఘన్పూర్: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్ అన్నారు. ఫాదర్ కొలంబో స్మారకార్థం బుధవారం స్టేషన్ ఘన్పూర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రెవరెండ్ ఫాదర్ థామస్కిరణ్, సీనియర్ క్రీడాకారుడు విద్యాసాగర్, మాజీ ఎంపీటీసీ దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా థామస్కిరణ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటమిలు సహమజని, అందరూ స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కాగా, బోనగిరి విద్యాసాగర్ మాట్లాడుతూ తన తండ్రి ఎల్లయ్య జ్ఞాపకార్థం విజేతలకు బహుమతులు అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బొల్లు వాసు, చింత ప్రణయ్, మారెపల్లి ప్రసాద్, సీనియర్ క్రీడాకారులు అంబటి కిషన్రాజ్, పెసరు సారయ్య, గజ్జెల్లి రాజు, మాతంగి కుమార్, ఆరోగ్యం, ఆకారపు అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు. -
దూరభారమైనా.. తరలొచ్చి
నాడు భర్త.. నేడు భార్య ● సర్పంచ్లుగా దంపతులు..చదువుతోపాటు జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రజలను ఓటు స్వగ్రామం రప్పించింది. దూరభారమైనా ఎంతో మంది రాష్ట్రాలు దాటొచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకున్నారు. గుజరాత్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి తరలొచ్చి బుధవారం జరిగిన మూడో విడత జీపీ ఎన్నికల్లో ఓటేసి పల్లె ప్రగతిలో భాగస్వాములయ్యారు. ఓటు విలువను చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. నర్సంపేట: మాది చెన్నారావుపేట మండలం పాత మగ్ధుంపురం. నేను గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారుల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న. తెలంగాణలో జీపీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ నుంచి స్వగ్రామం వచ్చా. బుధవారం తొలిసారి ఓటు వేశా. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. –వేములపల్లి మోహిత్శ్రీరామ్, మగ్ధుంపురంఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని 10వ వార్డు సభ్యురాలిగా కూతురుపై తల్లి గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కూతురు తిక్క శ్యామల బరిలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా తల్లి ఇలపొంగు కొంరమ్మ బరిలో నిలిచారు. చివరకు ఉత్కంఠగా వెలువడిన ఫలితాల్లో 2 ఓట్ల మెజార్టీతో కూతురు శ్యామలపై తల్లి కొంరమ్మ విజయం సాధించింది. ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పాపని రూపాదేవిపై 349 ఓట్లతో గెలుపొందారు. కాగా, మహేశ్వరి భర్త పర్వతగిరి రాజు గత పర్యాయం సర్పంచ్గా పనిచేశారు. దీంతో అప్పుడు భర్త.. ఇప్పుడు భార్యను సర్పంచ్ పదవి వరించింది. మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ శివారు రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో రేఖ్యతండా గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో ప్రస్తుతం సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు రిజ్వర్ చేశారు. దీంతో మనోహర్ భార్య పార్వతి బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ కల్యాణిపై 29 ఓట్లతో గెలుపొందారు. -
ఓటు వేసిన మాజీ మంత్రి
కురవి: మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు పెద్ద తండా గ్రామంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేసిన అనంతరం స్కూల్ ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసినట్లు సింబల్ చూపించారు. పోలింగ్ సరళి పరిశీలనమరిపెడ రూరల్: మండలంలోని గాలివారిగూడెం పాఠశాలలో ఎన్నికల పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిల్ వత్సల్ టొప్పో పరిశీలించారు. అలాగే మండలంలోని ఎల్లంపేట, అబ్బాయిపాలెంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మధుకర్ బాబు సందర్శించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోల ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూర్ ఆర్డీఓ గణేశ్, మరిపెడ మండల ప్రత్యేక అధికారి కిరణ్కుమార్, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలికి ఆర్డీఓ అభినందనమరిపెడ రూరల్: వీల్ చైర్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న మండలంలోని చిల్లంచర్ల గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పాకాల లక్ష్మీబాయమ్మ (107)ను తొర్రూరు ఆర్డీఓ గణేష్ అభినందించారు. నేటి తరానికి ఆమె ఆదర్శమని కొనియాడారు. ఆర్మీ మాజీ జవాన్ ఓటమిమరిపెడ రూరల్: మండలంలోని ఎడ్జెర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆర్మీ మాజీ జవాన్ భూక్య వీరన్న ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ మద్దుతుతో సర్పంచ్గా పోటీ చేసిన వీరన్న తన సమీప కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు బాదావత్ లక్ష్మీపతిపై ఓడిపోయారు. -
కాంగ్రెస్దే పైచెయ్యి
మంత్రి సీతక్క ఇలాకాలో క్లీన్స్వీప్తుది పోరులోసాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే.. మూడో విడతలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడ మండలంలో ఒకటి, గంగారం మండలంలో మూడు మినహా మొత్తం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. కురవి, మరిపెడ మండలాల్లో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పరువు దక్కించారు. అదే విధంగా గంగారం మండలంలో కొడిశల మిట్టలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన మద్దతుదారు లక్ష్మియ్య, డోర్నకల్ మండలం వెన్నారం పంచాయతీలో సీపీఎం మద్దతుతో జక్కుల కౌసల్య గెలుపొందారు. పలుచోట్ల గొడవలు జరిగాయి. సీతక్క క్లీన్స్వీప్ రాష్ట్ర సీ్త్ర, శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. కొత్తగూడ మండలంలో 24 పంచాయతీలు ఉండగా.. ఇందులో తన సొంత గ్రామం మోకాళ్లపల్లి ఉన్న మోడ్రాయిగూడెం జీపీతో పాటు ఆరు పంచాయతీలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. మిగిలిన 18 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా దుర్గారం జీపీ మినహా మిగిలిన 17జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. గంగారం మండలంలో 12 పంచాయతీలు ఉండగా మూడు జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో రెండు పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక పంచాయతీ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ మద్దతుదారు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన తొమ్మిది పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరు జీపీలు కాంగ్రెస్, మూడు జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇలా ములుగు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాల్లో 36 పంచాయతీలకు 31జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఫలించని బీఆర్ఎస్ ప్యూహం.. రెండు విడతల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మూడో విడత పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నాయలు రచించిన వ్యూహం ఫలించలేదు. ప్రధానంగా మాజీ మంత్రులు, రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు కై వసం చేసుకునేందుకు కష్టపడ్డారు. అయితే మరిపెడ మండలంలో 13 పంచాయతీలు, కురవి మండలంలో 15 పంచాయతీలు కై వసం చేసుకొని కాస్త మెరుగ్గా ఉండగా.. డోర్నకల్ మండలంలో నాలుగు, సీరోలు మండలంలో మూడు పంచాయతీలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఏం గెలుస్తారులే అనుకున్న గంగారం మండలంలో మూడు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచి మాట దక్కించారు. పలుగ్రామాల్లో నువ్వా.. నేనా.. కొన్ని గ్రామాల్లో గెలుపోటములపై మొదటి రౌండ్ నుంచే అంచనాకు రాగా.. కొన్ని గ్రామాల్లో మాత్రం చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు కౌంటింగ్ జరి గింది. మరిపెడ మండలం రాంపురం, ఎల్లంపేట, కురవి మండలం కురవి, పెద్దతండా, సీరోలు మండలం బీల్యానాయక్ తండలో నువ్వా.. నేనా అన్న ట్లు లెక్కింపు కొనసాగింది. ఇప్పటికే ఈ గ్రామాలు సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉండడంతో చివరి వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పరిస్థితి గమనించి జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్కు మరిపెడ, కురవి మండలాల్లో ఊరటనిచ్చే ఫలితాలు ఫలించని ఆ పార్టీ నాయకుల వ్యూహం పలుచోట్ల గొడవలు, ఉద్రిక్త వాతావరణంలో పోలింగ్ మరిన్ని ఎన్నికల వార్తలు 8లోu మూడో విడత సర్పంచ్లు వీరే 9లోuఅంగన్వాడీపాయె.. ఓడిపోయె.. మరిపెడ రూరల్: మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన నారెడ్డి రాములమ్మ, ఆనేపురం గ్రామానికి చెందిన కవులూరి శిరీష అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. గాలివారిగూడెంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాములమ్మ, ఆనేపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరీష పోటీ చేశారు. కానీ ఇద్దరు తమ సమీప అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఇటు ఉద్యోగాలకు రాజీనామా చేసి.. అటు ఓటమి చెందడంతో వారు అయోమయంలో పడ్డారు. రెబల్ స్టార్లు.. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి విజయం మరిపెడ రూరల్: మరిపెడ మండలం గిరిపురం, వాల్యతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే అనూహ్యంగా ప్రధాన అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన బాదావత్ నీల(గిరిపురం), తేజావత్ నాగ(వాల్యతండా) విజయం సాధించారు. దీంతో పోటీ పడ్డ ఆయా గ్రామాల ప్రధాన అభ్యర్థులు కంగుతిన్నారు. ఇద్దరిని కాదని గెలుపొందిన నీల, నాగాలను ఆయా గ్రామస్తులు అభినందించారు. -
ముగిసిన జీపీ ఎన్నికలు
మహబూబాబాద్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ ప్రక్రియ ఉదయం మందకొడిగా ప్రారంభమై 9గంటల తర్వాత ఓటర్లు బారులుదీరడంతో ఒక్కసారిగా ఊపందుకుంది. కాగా ఆరు మండలాల్లో 88.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 150జీపీలు, 1,138వార్డుల్లో పోలింగ్.. డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆయా మండలాల్లో 169 జీపీలు, 1,412 వార్డులు ఉన్నాయి. 169జీపీల్లో 19 ఏకగ్రీవం కాగా, మిగిలిన 150 జీపీల్లో పోలింగ్ నిర్వహించారు. 1,412 వార్డులకు గాను 272 ఏకగ్రీవం కాగా రెండు వార్డుల్లో సమస్యతో ఎన్నికలు నిలిచిపోగా.. మిగిలిన 1,138 వార్డుల్లో పోలింగ్ జరిగింది. 88.52 శాతం నమోదు.. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఓటర్లు బారులుదీరారు. కాగా నిర్ణీత సమయం వరకు క్యూలో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఆతర్వాత బారులుదీరడంతో ఓటింగ్ శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. డోర్నకల్ టాప్.. డోర్నకల్ మండలంలో 91.11శాతం పోలింగ్ నమోదై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. 90.12శాతంతో సీరోలు రెండో స్థానం, 89.92 శాతంతో మరిపెడ మండలం మూడో స్థానంలో నిలిచింది. కాగా మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. మొదటి విడతలో 86.99 శాతం, రెండో విడతలో 85.05శాతం, మూడో విడతలో 88.52 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. పురుషులదే పైచేయి.. ఆరు మండలాల్లో 1,60,587మంది ఓటర్లు ఉండగా.. వారిలో 78,746 మంది పురుష ఓటర్లు, 81,837 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే 78,746 మంది పురుష ఓటర్లకు 69,986 మంది ఓటు వేయగా 88.88శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మహిళా ఓటర్లు 81,837 మంది ఉండగా.. 72,163ఓటు వేయగా 88.18 శాతంపోలింగ్ నమోదైంది. మహిళల కంటే పురుషులే అధికంగా ఓటు వేశారు. పోలింగ్, కౌంటింగ్ సరళిని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ప్రత్యేక అధికారులు, ఎన్నికల అబ్జర్వర్లు పరిశీలించారు.మండలాల వారీగా ఓటర్లు, పోలింగ్ శాతం మండలం మొత్తం పోలైన ఓట్లు పోలింగ్ ఓటర్లు శాతం డోర్నకల్ 2,9091 2,6506 91.11 గంగారం 7,958 6,763 84.98 కొత్తగూడ 1,9530 1,6289 83.41 కురవి 4,3894 3,8508 87.73 మరిపెడ 4,3551 3,9161 89.92 సీరోలు 1,6563 1,4926 90.12 మొత్తం 1,60,587 1,42,153 88.52 (సరాసరి)మూడో విడత పోలింగ్ ప్రశాంతం 88.52 శాతం ఓటింగ్ నమోదు 1,60,587ఓట్లకు గాను 1,42,153ఓట్లు పోలింగ్ క్యూలో బారులు దీరిన ఓటర్లు ఉదయం మందకొడిగా సాగిన ప్రక్రియ పోలింగ్ సరళిని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
24వరకు పనులు పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులన్నీ ఈ నెల 24వ తేదీ వరకు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ అభివృద్ధి పనులు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల రాతి నిర్మాణాలను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణం, రహదారులు, ఫ్లోరింగ్ సుందరీకరణ, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లోని పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మాట్లాడారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహా జాతరకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు దేవాలయ ప్రాంగణం మహా కళాఖండంగా దర్శనమిస్తుందని తెలిపారు. ప్రతీ భక్తుడికి మధురానుభూతిని కలిగించే విధంగా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వివరించారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ములుగు ఎస్పీ మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా పగలు, రాత్రి విరామం లేకుండా పనులు చేయాలని ఎస్పీ కాంట్రాక్టర్ను ఆదేశించారు. గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులకు విద్యుత్ సౌకర్యం కల్పించి రాత్రి సమయంలో సైతం పనులు చేసే వీలు కల్పించాలన్నారు. జాతరలో బందోబస్తుకు వచ్చే సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తున్న క్యాంపు ప్రదేశాలను ఎస్పీ పరిశీలించారు. జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. -
రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాద బాధితులు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు నుంచి జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ బీమా కంపెనీ అధి కారులు, న్యాయవాదులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఈ నెల 21న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాద బీమా కేసులను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న కేసులను గుర్తించి లోక్ అదాలత్ ద్వా రా పరిష్కరించాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప రిష్కరించినట్లయితే కక్షిదారులకు డబ్బు సత్వరంగా అందడంతో పాటు బీమా కంపెనీ వారికి వడ్డీ లాభం చేకూరుతుందన్నారు. ఇరు పక్షాలు లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. -
నిట్లో వర్క్షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్హాల్ కాంప్లెక్స్లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఎంఎం.గంగేశ్వర్ పాల్గొన్నారు. -
పోరు రసవత్తరం!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు మూడో విడత ఎన్నికల పోలింగ్పై దృష్టిపెట్టారు. ఇదే ఆఖరి మోఖాగా భావించి రెండు పార్టీల నాయకులు తమ మద్దతుదారులను సర్పంచ్లుగా గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడో విడతలో డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, డోర్నకల్, కురవి, సీరోలు, ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 169 జీపీలు ఉండగా 19 పంచాయతీలకు ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్నారు. మిగిలిన పంచాయతీల్లో మూడో విడత పోరు రసవత్తరంగా సాగుతోంది. హస్తగతం కోసం.. గ్రామ పంచాయతీలు ఎక్కువగా గెలుచుకోవడం అంటే చేసిన పనికి మార్కులు వేయించుకోవడం.. మీ బలం ఏంటో తెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ పార్టీ నాయకులు అత్యధికంగా సర్పంచ్ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర సీ్త్ర, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. తన సొంత మండలం కొత్తగూడలో ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా అన్ని స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా గంగారం మండలంలో సీతక్క కోడలు కుసుమాంజలి ప్రచారం చేశారు. కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేయాలని కార్యకర్తలకు చెప్పి ప్రచారం ముమ్మరం చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెన్ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రచారం చేయడం, సభలు పెట్టి కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రులు.. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడానికి మాజీ మంత్రులు డీఎస్. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని మరిపెడ, కురవి, డోర్నకల్, సీరోలు మండలాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. సత్యవతి రాథోడ్ సొంత మండలం కురవితోపాటు ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, స్థానిక నాయకులను కలుపుకొని మంత్రి సీతక్క ఇలాఖాలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచేలా ప్రయత్నం చేస్తున్నారు. నేడు చివరి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ హస్తగతం కోసం మంత్రి, ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల యుద్ధంవిమర్శలు.. ప్రతి విమర్శలు.. పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరడంతో ఇదే ఆఖరి మోఖాగా భావించి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి రెడ్యానాయక్ ప్రస్తుత ఎమ్మెల్యే రాంచంద్రునాయక్పై చేసిన విమర్శలు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారాయి. సూర్యాపేటలో ఎమ్మెల్యే నేరచరిత్ర ఉందని, ఆయన క్యారెక్టర్ మంచిది కాదని మాజీమంత్రి బహిరంగంగా చెప్పి అందరని విస్మయానికి గురిచేశారు. అలాగే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్... మాజీ మంత్రి రెడ్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టడం, వారు చేసిన అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు నియోజకవర్గంలోని ఒక నాయకుడిపై మంత్రి సీతక్క చేసిన విమర్శలకు బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బడే నాగజ్యోతి విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్కను విమర్శించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు నాయకులు చేస్తున్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
అసంక్రమిత వ్యాధులను గుర్తించాలి
నెహ్రూసెంటర్: అసంక్రమిత వ్యాధుల నివారణలో భాగంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 సంవత్సరాలు పైబడిన వారందరినీ వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేయాలని సూచించారు. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా పుట్టిన శిశువులందరికీ సంపూర్ణ టీకాలు అందించాలని సూచించారు. క్షయవ్యాధి నివారణకు తెమడ పరీక్షలు పెంచి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలని తెలి పారు. గర్భిణుల నమోదు చేస్తూ వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సారంగం, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్రావు, సుమన్కల్యాణ్, విజయ్కుమార్, శ్రవణ్, ప్రత్యూష, డెమో ప్రసాద్, డీపీఎంఓ వాల్యా, సీహెచ్ఓ సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు వేయడంతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పిల్లలు స్వచ్ఛందంగా సెలవులు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈమేరకు మంగళవారం సాక్షి దినపత్రికలో ‘పాఠాలు చెప్పేది ఎవరు?’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై డీఈఓ రాజేశ్వర్ స్పందించారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎన్ని కల డ్యూటీలు పడ్డాయి. వారి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించారన్నారు. వారి స్థానంలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎంఈఓల సహకారంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్నారు. గార్లవాసికి ఆహ్వానం గార్ల: విజయవాడలో ఈనెల 27, 28న నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు గార్లకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు మంగళవారం ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మాతృభాష ప్రయోజనాలు, ప్రాముఖ్యతను వివరిస్తూ తెలుగు సాహిత్య, సాంస్కృతిక కళాభివృద్ధిని కాంక్షిస్తూ 27, 28వ తేదీల్లో విజయవాడలో మహాసభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో తెలుగు భాషపై కవిత గానం చేయనున్నట్లు ఐలయ్య తెలిపారు. కార్మిక చట్టాలను పాటించాలి బయ్యారం: ఇటుక బట్టీల్లో కార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్క్రిష్ణ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని నామాలపాడు, కొత్తపేటలోని ఇటుకబట్టీలను ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచికూలీలు బట్టీల్లో పనిచేసేందుకు వస్తున్నారని, వారి భద్రత యజమానులదేనన్నారు. బట్టీలో పనిచేస్తున్న కూలీలతో చట్టవిరుద్ధంగా పనులు చేయించొద్దన్నారు. వైభవంగా మల్లన్న దృష్టి కుంభం ఐనవోలు: జాతరకు ముందు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున దృష్టి కుంభం వైభవంగా జరిగింది. గర్భాలయంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15వరకు సుధావళి వర్ణలేపనం పనులు పూర్తిచేశారు. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టి కుంభం ప్రక్రియను అ ర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఆర్జిత సేవలు, దైవదర్శనాల ను పునరుద్ధరించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుఃసంక్రమణ పూజలు చేశారు. దృష్టి కుంభం ఇలా.. గర్భగుడికి ఎదుట ఉన్న మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నరాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి, కూష్మాండ బలి నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నరాశి, అద్దం, మేకలపై పడే విధంగా కుంభ హారతి ఇచ్చారు. ముగిసిన ప్రధాన ఘట్టం.. దృష్టి కుంభం నిర్వహిస్తే భక్తుల దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని తెలిపారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్గౌడ్, ఈఓ సుధాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్, వేద పారాయణదారులు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భాను ప్ర సాద్, మధు, శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్, పోషయ్య, ధర్మకర్తలు రేణుక,శ్రీనివాస్, మహేందర్, కీమా, ఆనందం పాల్గొన్నారు. -
జీపీ పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని డోర్నకల్, కురవి, సీరోలు, మరిపెడ, గంగారం, కొత్తగూడ మండలాల్లో జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలసత్వం వహించొద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐదుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50మంది ఎస్సైలు, సుమారు వెయ్యి మంది సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వద్ద, 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమనిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిలేదని, బాణసంచా కాల్చడం, డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
● పంచాయతీ ఎన్నికల పరిశీలకుడు మధుకర్ బాబుమరిపెడ రూరల్: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకుడు మధుకర్బాబు అన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా మంగళవారం మండలంలోని పురుషోత్తమాయగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందిర్శంచారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్, పోలింగ్ సెంటర్లను పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు భోజన వసతి, రవాణా, కౌంటింగ్లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్వోలు, ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో ఆర్వోలు, ఆర్ఐ శరత్చంద్ర పాల్గొన్నారు. -
ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పాలన
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య నెహ్రూసెంటర్: దేశంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహా సభను దివిల వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన రిటైర్డ్ ఉద్యోగులను పాలకులు విస్మరిస్తున్నారని, వారికి చెల్లించాల్సిన పెన్షన్ ను సైతం ఎత్తివేసేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని, వాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రతీ ఐదేళ్లకు ఓసారి పే రివి జన్ కమిషన్ వేయాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 70ఏళ్ల నుంచే అదనపు పెన్షన్ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల డీఏ, డీఆర్లను వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నా రు. అదానీ, అంబానీ, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాటుపడుతున్నాయని, హక్కులు, చట్టాల అమలు కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగ అరుణ, తూపురాణి సీతారాం, యాకూబ్, మల్లయ్య, పి.రాజయ్య, డీటీఓ వి.సత్యనారాయణ, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి విడతకు సిద్ధం
నేడు మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్మహబూబాబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఆరు మండలాల్లో చివరి విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు మంగళవారం ప్రతీ మండల కేంద్రంలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. బుధవారం 150 జీపీలు, 1,138 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈమేరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు ఇతరత్రా ఏర్పాటు చేశారు. జిల్లాలోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఆయా మండలాల్లో 169 గ్రామ పంచాయతీలు, 1,412 వార్డులు ఉన్నాయి. కాగా నెల 3నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 9న ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేశారు. 169గ్రామ పంచాయతీల్లో 19 జీపీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 150సర్పంచ్ స్థానాలకు 495 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,412 వార్డులకు గానూ రెండు వార్డుల్లో పలు కారణాలతో నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 272 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,138 వార్డుల్లో 2,857 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చివరి విడతలో 19 జీపీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 150 జీపీల్లో 1,60,587 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 200 ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ఒక ఓపీఓ, 201నుంచి 400మంది ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401నుంచి 650మంది ఓటర్లు ఉన్న కేంద్రానికి ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలకు విధులు కేటాయించారు. మొత్తంగా 1,919 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్కు 1,732 మంది పీఓలు, 1,894మంది ఓపీఓలు, 13మంది జోనల్ ఆఫీసర్లు, 61మంది రూట్ ఆఫీసర్లు, ఒకరు ఏఆర్వో, 202 మందికి ఆర్వో విధులు కేటాయించారు. 38 లొకేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల బయట సహకారంగా పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు విధులు నిర్వర్తిస్తారు. మండలానికి ఒక పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. డోర్నకల్ మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ఎస్లో, గంగారం ఏహెచ్ఎస్ (ఆశ్రమ పాఠశాల), కొత్తగూడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, కురవి ఎంపీడీఓ కార్యాలయం, మరిపెడ సెయింట్ అగస్టీన్ పాఠశాల, సీరోలు మండలానికి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. కురవి, సీరోలు మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. డోర్నకల్లో ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, గంగారం మండలంలో ప్రత్యేక అధికారి వెంకటరమణ, మరిపెడ మండలంలో ప్రత్యేక అధికారి కిరణ్కుమార్ పంపిణీని పరిశీలించారు. బుధవారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహణ 1,732మంది పీఓలు, 1894 మంది ఓపీఓలకు డ్యూటీ 1,919 బ్యాలెట్ బాక్స్లు, 1,60,587మంది ఓటర్లు సామగ్రి పంపిణీని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
జనరల్ స్థానంలో దళిత యువకుడి గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో జనరల్ స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన గాదెపాక విష్ణు విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడిగా (ఎంఏ,బీఈడీ) గ్రామంలోనే ఉంటూ బీఆర్ఎస్లో చురుగ్గా పని చేసేవాడు. అతనికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుండా మరో అభ్యర్థిని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి ఎనగందుల వెంకన్న (కాంగ్రెస్ బలపరిచిన) పై 85 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1,177 ఓట్లకు గాను 1044 పోలైయ్యాయి. అందులో గాదెపాక విష్ణుకు 438 రాగా, ఎనగందుల వెంకన్నకు 353 ఓట్లు వచ్చాయి. గ్రామంలోనే ఉంటూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తులను ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారని నూతనంగా ఎన్నికై న సర్పంచ్ విష్ణు అంటున్నాడు. అదేవిధంగా చీటూరులో ఎస్సీ రిజర్వ్ స్థానంలో బర్ల గణేశ్ కాంగ్రెస్ రెబెల్గా పోటీ చేసి విజయం సాధించారు. -
చిట్స్ బాధితులకు చెక్కులు అందజేత
● 37 మందికి రూ. 3 కోట్ల ఎఫ్డీ విడుదల కాజీపేట అర్బన్ : చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ మంగళవారం వరంగల్ ఆర్వో కార్యాలయంలో చిట్ఫండ్ బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అక్షర, అచల, భవితశ్రీ, శుభనందిని, కనకదుర్గ చిట్ఫండ్ బాధితులకు చిట్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అందజేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ నుంచి ఐదు చిట్స్కు చెందిన 206 మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో కనకదుర్గ చిట్స్కు చెందిన 37 మంది బాధితులకు రూ.3 కోట్ల ఎఫ్డీ(ఫిక్స్డ్ డిపాజిట్)ని రిలీజ్ చేసి ఆ చిట్ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డితో కలిసి చెక్కులు అందజేశామని తెలిపారు. చిట్ఫండ్ కంపెనీల నుంచి చెల్లింపులు రాని బాధితులు ఫిర్యాదు చేస్తే వారి సొమ్ము అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, గత నెల 29వ తేదీన ‘సాక్షి’లో ‘బాధితులకు భరోసా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని చూసి ఫిర్యాదు చేయగా తమకు చెక్కులు అందజేశారని, ఈ ప్రక్రియలో ‘సాక్షి’ కథనం తోడ్పడిందని బాధితులు చెప్పారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిట్స్ సిబ్బంది మహేశ్, తదితరులు పాల్గొన్నారు. వసూళ్లకు పాల్పడిన జర్నలిస్ట్ అరెస్ట్, రిమాండ్ తొర్రూరు: ఎన్నికల అధికారులుగా పేర్కొంటూ బాధితుడి నుంచి వసూళ్లకు పాల్పడిన ఓ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఉపేందర్ మంగళవారం తెలి పారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగుకు చెందిన ఆనంద్ ఈనెల 12వ తేదీన కారులో మద్యం కొనుగోలు చేసి పెద్దవంగర మండలం పోచంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. అతడిని గమనించి ప్లాన్ ప్రకారం తొర్రూరుకు చెందిన ఓ చానల్ యాంకర్ జా టోత్ ఉపేందర్, ఓ పత్రిక విలేకరి చెడుపాక రాజు.. ఆనంద్ను అడ్డగించారు. తాము ఎ న్నికల అధికారులమని చెప్పి బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ. లక్ష ఇస్తేనే కా రును వదిలేస్తామన్నారు. దీంతో బాధితుడు ఆనంద్ బంధువులకు ఫోన్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వగా వారు కారును వదిలేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు ఉపేందర్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాజును మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న మరో విలేకరిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. రామప్పలో విదేశీయులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం నార్వే, అమెరికాకు చెందిన కట్రీస్ ఆర్ మదర్వేల్, రాధవన్, భూపేందర్ కత్రీలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చే శారు. ఆలయ విశిష్టత గు రించి టూరిజం గైడ్ కరుణా నిధి, రామప్ప గైడ్ విజయ్కుమార్ వివరించగా, రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. -
‘కోట’ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ఖిలా వరంగల్: ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చారిత్రక ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి చేస్తామని, ఇందులో భాగంగా రాతికోట చుట్టూ బోటులో పర్యాటకులు షికారు చేసేలా అగర్త చెరువు అభివృద్ధి, ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ రాతికోట ఉత్తర ద్వారం వద్ద ‘కుడా’ ఆధ్వర్యంలో రూ. 2కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘మోటు’ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కట్టడాలను పరిరక్షిస్తూ విశిష్టతను భావితరాలకు అందజేస్తామని, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం 32,37,41 డివిజన్లలో మొత్తం రూ.4కోట్ల 10లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశాయిపేట, దూపకుంటలో లబ్ధిదారులకు త్వరలో 2,200 ఇళ్లు కేటాయించనున్నామని, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని(ఐడీఓసీ) సీఎం చేతుల మీ దుగా ప్రారంభిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ‘కుడా’ అధికా రులు అజిత్రెడ్డి, ఏఈ భరత్, కాంగ్రెస్ నేతలు గోపాల్ నవీన్ రాజ్, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, మడిపల్లి కృష్ణ, బోగి సురేశ్, దామోదర్యాదవ్, సాగర్ల శ్రీనివాస్, గజ్జల శ్యామ్, చందర్, వీరన్న, రాజేశ్, కత్తెరశాల శ్రీధర్ పాల్గొన్నారు. ● వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్తోటలో రూ.50లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 41వ డివిజన్ శంభునిపేట నాగమయ్య దేవాలయం ప్రాంతంలో రూ.1.10 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కరీమాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం 35వ డివిజన్ శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పొరేటర్ ప్రవీణ్తో కలిసి పరిశీలించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ‘తూర్పు’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్సీ సారయ్యపై మంత్రి సురేఖ విమర్శలు ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మమ్ముల్ని ఢీకొనడం ఎవరి చేతకాదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్సీ సారయ్యనుద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. మంత్రి తన నియోజకవర్గంలో తన అనుచరుడు ఒకరు ఎమ్మెల్సీ సారయ్య వర్గంలోకి వెళ్లడంపై స్పందించారు. బలహీనులు బలవంతుల వెనుకపడతారని, తాము బలవంతులం కాబట్టే మమ్ముల్ని ఢీకొనడం చేతక కాక మా వెనుక గోతులు తవ్వుతున్నారని ఘాటుగా విమర్శించారు. వారి అల్ప సంతోషం, ఆనందాన్ని తాము అడ్డుకోబోమని అన్నారు. -
రెమ్యునరేషన్ ఇవ్వాలి
గైడ్లైన్స్ మేరకుకాళేశ్వరం: రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం తమకు రూ.2,500 రెమ్యునరేషన్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మహదేవపూర్ మండల కేంద్రంలో మూడో విడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లకుండా జిల్లాపరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద భోజన విరామం అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి, రెండు విడతల్లో విధులు నిర్వర్తించిన పోలింగ్ సిబ్బందికి రూ.2,500 ఇవ్వకుండా రూ.1,500 ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ప్రస్తుతం మూడో విడతలోనూ అధికారులు అదే విధానాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. రూ.2,500తో పాటు ఒక రోజు ఆన్డ్యూటీ(ఓడీ) ఇవ్వాలని భీష్మించారు. సాయంత్రం వరకూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దనే వేచి ఉన్నారు. ఈ ఘటన తెలుసుకున్న కలెక్టర్ రూ.2 వేలు ఇస్తున్నట్లు తెలపడంతో ఎంపీడీఓ రవీంద్రనాథ్.. పోలింగ్ సిబ్బందికి హామీ ఇచ్చారు. అలాగే, ఓడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొనడంతో పోలింగ్ సిబ్బంది నిరసన విరమించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారికి కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.పోలింగ్ సిబ్బంది డిమాండ్ కేంద్రాలకు వెళ్లకుండా మూడు గంటలు నిరసన దిగొచ్చిన జిల్లా అధికారులు రూ.2వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తరలిన సిబ్బంది -
చలిమంటల్లో పడి వృద్ధుడి మృతి
● లోహితలో ఘటన సంగెం: చలిమంటల్లో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహితలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తునికి రజిత, శివ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరితో పాటు రజిత తల్లిదండ్రులు బొమ్మెర కమల, యాకయ్య(65) కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి యాకయ్య చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డాడు. శరీరం కాలుతుండగా కేకలు వేయడంతో కూతురు రజిత, భార్య కమల వచ్చి చద్దర్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన 108లో ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
పీజీతండా... గ్రాడ్యుయేట్ సర్పంచ్..
● ఆ ఊరిలో అందరూ పీజీలే.. దుగ్గొండి: అది ఓ మారుమూల గిరిజన తండా. గత ప్రభుత్వ కాలంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసే క్రమంలో ప్రత్యేక గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 120 నివాస గృహాలు ఉన్నాయి. 540 జనాభా ఉన్నారు. గ్రామంలో ప్రతీ ఇంటికి ఓ గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఊరి బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆ గ్రామం పీజీతండాగా గుర్తింపు పొందింది. గ్రామ పంచాయతీల గెజిట్లోనూ పీజీతండాగా గుర్తించ బడింది. ఈనెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికలలో డిగ్రీ పూర్తిచేసిన 30 సంవత్సరాల యువకుడు లావుడ్యా చంద్రశేఖర్ పోటీ చేసి గెలుపొందారు. గ్రామంలోని అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అందుకోసమే తాను సర్పంచ్ బరిలో నిలిచానని చంద్రశేఖర్ తెలిపారు. మామ సపాయి.. కోడలు సర్పంచ్ బచ్చన్నపేట : మండలంలోని బోనకొల్లూర్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన చిక్కుడు కల్పన మామ బాలయ్య ఆ గ్రామ సపాయిగా పని చేస్తున్నాడు. గత 35 ఏళ్లుగా బాలయ్య గ్రామ సపాయిగా విధులు నిర్వర్తిస్త్తున్నాడు. మామ సపాయి కావడంతో గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కల్పనకు సులువుగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. బాలయ్య కుటుంబంలోని కోడలును సర్పంచ్గా ఆదరించడంపై ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం
ఎస్ఎస్డ్వాయి: మేడారం మహాజాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో మేడారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భక్తులకు ఏర్పాటు చేస్తున్న తాగునీటి వసతి, వేచి ఉండే ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర కోసం 28 ఎకరాల్లో బస్టాండ్ ఏర్పాటు, క్యూలైన్లు, భక్తులు వేచి ఉండే గదులు, తదితర నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. జనవరి 25 తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. విధుల్లో డ్రైవర్లు కండక్టర్లు, టెక్నికల్ అధికారులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ మేడారం భక్తులకు రవాణా సౌకర్యం, బస్సుల ఏర్పాటు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అంతకు ముందు ఎండీ నాగిరెడ్డి అమ్మవార్లను దర్శించుకోగా పూజారులు ప్రసాదం అందజేశారు. ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్టీసీ ఈడీఎం మునిశేఖర్, ఈడీలు వెంకన్న, సాల్మన్, ఆర్ఎంలు విజయభాను, రవి చంద్ర, డీఎస్పీ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్, పస్రా సీఐ దయాకర్, ఆర్ఐ అడ్మిన్ స్వామి పాల్గొన్నారు. ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మేడారంలో పనుల పరిశీలన అధికారులతో సమీక్ష -
ఓటేసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..
పెద్దవంగర : జీపీ ఎన్నికల్లో స్వగ్రామం వచ్చి ఓటు వేసిన ఓ మహిళ.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వడ్డేకొత్తపల్లిలో విషాదం నింపింది. బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లికి చెందిన శ్రీరామోజు నాగమణి (48) హైదరాబాద్లో కుమారుడు వినోద్, కూతురు పరమేశ్వరితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన రెండో విడత జీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన కుమారుడితో కలిసి స్వగ్రామం వచ్చింది. ఓటు వేసిన అనంతరం బైకుపై తన తల్లిగారి గ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తుంగతుర్తి మండలం గొట్టిపర్తి శివారులో స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో నాగమణి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో కుటుంబంతోపాటు వడ్డేకొత్తపల్లిలో విషాదం అలుముకుంది. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడి మృతిఖమ్మంరూరల్: ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కింద పడిన యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. హనుమకొండలోని ద్వారకాసాయి కాలనీకి చెందిన బండి పూర్ణచందర్(రిజర్వ్ ఇన్స్పెక్టర్) కుమారుడైన హర్షిత్చంద్ర తన స్నేహితుడైన పూదారి మణికంఠతో కలిసి హైదరాబాద్ నుంచి అరకుకు ద్విచక్రవాహనంపై మంగళవారం వెళ్తున్నాడు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లోని మూలమలుపు వద్ద గేదె అడ్డు రావడంతో తప్పించే ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హర్షిత్చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మణికంఠకు గాయాలయ్యాయి. ఘటనపై హర్షిత్ తండ్రి పూర్ణచందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. అదుపు తప్పిన బైక్.. మహిళకు తీవ్రగాయాలు చికిత్స పొందుతూ మృతి -
రెండు నెలలుగా రాని మార్కెట్ ఉద్యోగుల పెన్షన్
వరంగల్: రాష్ట్ర మార్కెటింగ్శాఖ పరిధి వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని సుమారు 1,700 మంది పెన్షనర్లకు ఫైనాన్స్ క్లియరెన్స్ లేని కారణంగా రెండు నెలలుగా పెన్షన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నట్లు సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్లింగం, సాయిరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగపురి సారయ్య, పి.వెంకటేశ్వర్లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గత కొంత కాలంగా ప్రభుత్వ ఫైనాన్స్ శాఖలో తీసుకొచ్చిన కొత్త పాలసీలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు అప్లోడ్ చేసే సమయంలో కార్యదర్శులకు చెందిన ఇతర బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పెన్షన్ చెక్లు అప్లోడ్ చేసేందుకు సిస్టంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడాన్ని గుర్తించిన కొంత మంది మార్కెట్ కార్యదర్శులు తమ బిల్లులను పెన్షన్ చెక్కుల స్థానంలో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈవిషయంలో అన్ని ఆధారాలను సంఘం నాయకులు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు.తాము పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతూ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ల వద్దకు తిరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు నెలులుగా బ్యాంకు లోన్లు, చిట్టీలు, మందులు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతూ దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని, ప్రజాప్రతినిధులు పట్టించుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా 16 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. 2026 జనవరి 9,11వ తేదీల్లో సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07288) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 10, 12వ తేదీల్లో శ్రీకాకుళంరోడ్–సికింద్రాబాద్ (07289) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 10, 12,16,18వ తేదీల్లో సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07290) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 11, 13,17,19వ తేదీల్లో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ (07291) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. జనవరి 13వ తేదీన వికారాబాద్–శ్రీకాకుళంరోడ్ (07294) ఎక్స్ప్రెస్, జనవరి 14వ తేదీన వికారాబాద్–శ్రీకాకుళం రోడ్ (07295), జనవరి 17వ తేదీన సికింద్రాబాద్–శ్రీకాకుళంరోడ్ (07292), జనవరి 18వ తేదీన శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ (07293) ఎక్స్ప్రెస్లు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొట్టవాసల, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. -
ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమిస్తాం
వరంగల్: ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కూల్చి ఏడాది గడిచిన సందర్భంగా కూల్చిన స్థలంలోనే నూతన కార్మిక భవనం నిర్మించాలని, 318 మంది కార్మికులకు మిల్లు స్థలంలోనే 200 గజాల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈధర్నాకు ముందు ఐఎఫ్టీయూ జిల్లా అ ధ్యక్షుడు గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 2026 మార్చి 31 వరకు ప్రభుత్వ పరంగా నూతన భవనం నిర్మించాలని, లేకుంటే ఏప్రిల్ 1వ తేదీన కార్మిక భవన నిర్మాణానికి పునాది తీయాలని తీర్మానించారు. భవన నిర్మాణంతో పాటు మిల్లు కార్మికులకు స్థలం ఇవ్వాలని మరో తీర్మానం చేసిన అఖిలపక్ష నాయకులు గంగుల దయాకర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, నన్నపనేని నరేందర్, నల్గొండ రమేశ్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తన వంతుగా రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రూ.2లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్రకటించారు. ఈధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కార్మిక భవన నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని లేఖతో సందేశం పంపారు. ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, టి.నాగేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, ఐక్యవేదిక బాధ్యులు పరమేశ్వర్, పి.లక్ష్మణ్, కె.కృష్ణ, అకినె వెంకటేశ్వర్లు, సాగర్, ఎన్.ప్రతాప్, జి.రమేశ్, ఎన్.అప్పారావు, జె.కుమారస్వామి, పి.సత్యం, కె.ప్రవీణ్, రమాదేవి, ఈ.శ్రీనివాస్, ఏ.కృష్ణ, ఎస్.రవీందర్, జి.శరత్, గుత్తికొండ రవి, ఎస్.యశోద, హరినారాయణ, డి.కే, బయ్యస్వామి, కె.రాజేందర్, టి.రమేశ్బాబు, ఎం.అశోక్, జి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 318 మంది ఆజంజాహి మిల్లు కార్మికులకు పట్టాలివ్వాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు -
పోలీసుల ఫ్లాగ్మార్చ్
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్ పోలీసులు సోమవారం రాత్రి వేళ ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. స్థానిక సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, గొల్లచర్ల, హూన్యాతండా తదితర గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం చూపుతూ గొడవలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి నెహ్రూసెంటర్: ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు జి.దేవేందర్, కొత్త నాగయ్య అన్నారు. మానుకోట డిపో డ్రైవర్పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటన వెల్లడించారు. ఆర్టీసీ డిపో సెక్యూరిటీ, సిబ్బందిని నియమించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. ‘ముఖ గుర్తింపు’తో సమయపాలన కేయూ క్యాంపస్: ముఖ గుర్తింపు హాజరుతో సమయపాలన అలవడుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి తమ కార్యాలయం, విభాగానికి హాజరును విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం, వ్యవస్థ సీసీటీవి పర్యవేక్షణలోనూ కొనసాగనుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, యూనివర్సిటీ నెట్వర్కింగ్ సెల్ డైరెక్టర్ డి.రమేశ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ పాల్గొన్నారు. ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఎంఓయూ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కోల్కత్తా కేంద్రంగా పని చేస్తున్న అనుదీప్ ఆర్గనైజేషన్తో ఒక సంవత్సర కాలానికి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.జితేందర్ కలిసి అనుదీప్ కోల్కత్తా ఆర్గనైజేషన్ మేనేజర్ అండ్ ట్రైనర్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్వేతతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకురాలు డాక్టర్ అలేటి సరిత పాల్గొన్నారు. నవ్వు పార్టీ మారుకుంటూ వస్తున్నావు.. కురవి: పార్టీలు మారుకుంటూ వస్తున్నావు.. ఇప్పుడు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్గా నిలిచావు అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వాగ్వాదానికి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీరోలు మండలం చింతపల్లిలో రాంచంద్రునాయక్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామ శివారు కొత్త తండాకు దారి సమస్య మాట్లాడేందుకు ఎమ్మెల్యే నడిచి వెళ్లారు. అక్కడ వేచి ఉన్న కొత్త తండా వాసులతో మాట్లాడే సమయంలో రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రంగన్నకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలు మారుకుంటూ వస్తున్నావు అంటూ రెబల్ అభ్యర్థి రంగన్నపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రంగన్న సైతం ఆయనతో వాదనకు దిగాడు. తనను ఎమ్మెల్యే దుర్భాషలాడినట్లు రంగన్న ఆరోపించాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో రంగన్నను దుర్భాషలాడినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
నేటి నుంచి ధనుర్మాసం షురూ..
● నెలరోజులపాటు తిరుప్పావై ప్రవచనాలుమహబూబాబాద్ రూరల్: మార్గశిరమాస శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 15వ తేదీ వరకు నెలరోజులపాటు వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాల కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సేవాకాలం, అర్చన, మంగళ హారతులు, పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామివారి దేవాలయం, శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయం, అనంతాద్రి స్వయంభు శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం, ముడుపుగల్లు గ్రామంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయం (గోవిందక్షేత్రం)లో నెలరోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథ స్వామివారిని ప్రసన్నం చేసుకుందని అర్చకులు తెలిపారు. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి అమ్మవారు ఆచరించిన విధంగా భక్తులంతా కూడా ఆచరించి అమ్మవారు, స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. ముస్తాబైన వేణుగోపాలస్వామి వారి దేవాలయం, శ్రీ గోదాదేవి అమ్మవారు -
వరిసాగుపై మక్కువ
● యాసంగి పంటపై రైతన్నల చూపు ● పెరిగిన భూగర్భ జలాలు, నిండిన చెరువులు, కుంటలపై ఆశలుమహబూబాబాద్ రూరల్ : జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు వరిపంట సాగువైపే అధికంగా మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వానాకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చే రింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి రెండో పంట వరి సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించి, సాగుకు సన్నద్ధమవుతున్నారు. నార్లు పోయడం.. గతంతో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు చేపట్టేందుకు రైతులు యాసంగి పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు వరినార్లు పోశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు పెరిగి వరి సాగు చేస్తే, ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడం, ఎస్సారెస్పీ జలాలు రానుండడంతో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. సాగుపై అంచనా.. జిల్లాలో గత ఏడాది యాసంగిలో 1,49,353 ఎకరాల్లో వరిసాగు చేయగా.. ప్రస్తుతం రైతులు 1,64,124 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే వానాకాలం పంటలు సాగు పూర్తికాగా , యాసంగి పంటల సాగు పనులు మొదలుపెట్టారు. పలుచోట్ల మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. -
ఎన్నికల విజయవంతానికి కృషి చేయాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విజయవంతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ సమావేశ మందిరంలో మూడో విడత ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. మొదటి, రెండో విడత ఎన్నికలను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేశారన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. మూడో విడతలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాలు ఉన్నాయన్నారు. ఆరు మండలాలకు 13మంది జోనల్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, రూట్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ ఇతరత్రా అన్ని సవ్యంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యమబాధలు తొలిగి..ముక్తి పొంది
● అంత్య పుష్కరాల్లో స్నానాలు చేయాలి ● యూపీలోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. అలహాబాద్లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు. ఆయా రాష్ట్రాల నుంచి సుమారు 600మంది సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులతో కలిసి గోదావరి పరిక్రమణ (ప్రదక్షిణ) యాత్రలో భాగంగా కాళేశ్వరం క్షేత్రానికి విచ్చేశారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు. -
ప్రలోభాల హోరు
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పంపకాల జోరు.. ● రేపు తుది విడత ‘పంచాయతీ’ .. ● జిల్లాలో 150 జీపీల్లో ఎన్నికల పోలింగ్ ● ముగిసిన ప్రచారం.. అంతుబట్టని ఓటరు నాడిసాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అఖరి అంకానికి చేరుకుంది. జిల్లాలో మూడో విడతలో కురవి, సీరోలు, మరిపెడ, డోర్నకల్, కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోని 150 గ్రామ పంచాయతీల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. తొలి, మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడినా... మరికొన్ని చోట్ల అనైతిక పొత్తులతో ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుని ‘హస్తం’హవాను చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉండగా, బీజేపీ, రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. కాగా మూడో విడత ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని స్థానాలు దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ముగిసిన ప్రచారం.. జోరుగా పంపకాలు... ఆఖరి విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్కు ఒక్కరోజు గడువే ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈలోగా అత్యధిక ఓట్లను సంపాదించుకునేందుకు మద్యం డబ్బుతోపాటు గిఫ్ట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో అభ్యర్థులు పడ్డారు. ఒక్కో గ్రామంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000లు పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గ్రామాల్లో పోలింగ్కు ముందురోజు ఇంటికి కిలో చికెన్, మద్యం బాటిళ్లను కూడా సరఫరా చేస్తున్నట్లు వైరల్ అవుతోంది. 150 పంచాయతీలకు.. మూడో దశలో మొత్తం 169 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ మద్దతుదారులు 14, బీఆర్ఎస్ 01, సీపీఐ(ఎంఎల్) 01, ఇతరులు 03 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆయా మండలకేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఉదయమే రిపోర్ట్ చేయాలని, తదనంతరం పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. -
ఉద్యోగుల పడిగాపులు
● పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగంలో ఇబ్బందులు కొత్తగూడ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈక్రమంలో ఉద్యోగులు నిసరస తెలిపిన ఘటన సోమవారం మండలంలో జరిగింది. మండల పరిధి 18 గ్రామ పంచాయతీల్లోని ఉద్యోగులకు ఒక్కటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరికి సుమారు 30నిమిషాల సమయం పడడంతో ఉద్యోగులు బారులుదీరి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. క్లస్టర్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈవిషయంపై ఎంపీడీఓ మున్వర్కు వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక్కటే కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఓపికతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. -
ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఓ అసమర్థుడు
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మరిపెడ రూరల్: డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ కార్యకర్తలను సమన్వయం చేసుకోలేని ఓ అసమర్థుడని, ఆయనకు తన కార్యకర్తలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. సోమవారం మరిపెడ మండలం గుర్రప్పతండాలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ గుర్రప్పతండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చి పోటీలో ఉన్న రెబల్ అభ్యర్థిని సమన్వయం చేసుకోలేక అసహనంతో కార్యకర్తలను దొంగలుగా పోల్చడం తగదన్నారు. రెబల్ అభ్యర్థిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే మూలస్తంభాలని, అలాంటి వారిని దొంగలుగా దూషించడం ఏమిటని ప్రశ్నించారు. డోర్నకల్ నియోజకవర్గంపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదన్నారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన గుర్రప్పతండా నుంచే ఎమ్మెల్యే రాజకీయ పతనం మొదలైందన్నారు. ఇక్కడ అడ్రస్లేని ఎమ్మెల్యేను ఎన్నుకుంటే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని, అవగాహన లేని ఎమ్మెల్యేను ఎన్నుకోవడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. -
పరదాల చాటునే ఓటు హక్కు..
కొత్తగూడ: పరదాల చాటునే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాటివారివేంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండే గదులు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో ఆరు వార్డులు, 530 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో మూడు వార్డుల పోలింగ్ పాఠశాలలో, మూడు వార్డుల పోలింగ్ నిర్వహణకు అసంపూర్తి జీపీ భవనంలో ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా, గ్రామ పంచాయతీ భవనం చుట్టూ కిరాయి పరదాలు చుట్టి మూడు గదులుగా ఏర్పాటుచేశారు. ఏర్పాట్లను ఆర్వో శ్రీధర్ పరిశీలించి రెండు చోట్ల పోలింగ్ నిర్వహించడం వల్ల అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. -
పాఠాలు చెప్పేది ఎవరు ?
● ఉపాధ్యాయులకు జీపీ ఎన్నికల డ్యూటీలు ● విద్యార్థులకు విద్యాబోధనలో నిర్లక్ష్యం ● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులుమహబూబాబాద్ అర్బన్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడత పోలింగ్ ముగియగా.. మరోవిడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. కొన్నిచోట్ల ఏకగ్రీవాలు, వేలం పాటలతో సర్పంచ్లు ఖరారు కాగా, మిగిలిన గ్రామాల్లో ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం, ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. కాగా, మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ డ్యూటీ పడడంతో పిల్లలకు పాఠాలు బోధించేవారు లేకపోవడంతో పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 676 ప్రైమరీ స్కూల్స్.. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతంలో ఆయా పాఠశాలలకు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో సెలవులు మంజూరు చేసింది. పోలింగ్ లేని మండలాల పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీ పడ్డాయి. అక్కడ పాఠశాలలు యథావిధిగా కొనసాగాలి. కాగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికల డ్యూటీలు పడడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు కరువయ్యారు. జిల్లాలో 676 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉన్నాయి. ఇందులో సుమారు 1350 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసారి ఉపాధ్యాయులకే కాకుండా సీఆర్పీలకు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీలు పడ్డాయి. దీంతో జిల్లాలో ఏ పాఠశాలకు, ఏ కార్యాలయానికి వెళ్లిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చొరవ తీసుకొని, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు హై స్కూల్ ఉపాధ్యాయులు పంపి పిల్లలకు బోధించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ‘పై ఫొటోలో కనిపిస్తున్నది మానుకోట పట్టణం పత్తిపాకలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఒక మహిళా హెచ్ఎం, ఒక ఉపాధ్యాయురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. సుమా రు 50మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా టీచర్లకు మూడో విడత ఎన్నికల డ్యూటీ పడడంతో పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించాల్సి దుస్థితి నెలకొంది. మండల విద్యాధికారికి సమాచారం అందించగా పిల్లలను చూసుకోవాల్సిందిగా వంట నిర్వాహకులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, ఒకరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తే విద్యార్థులకు పాఠాలు బోధిస్తామని ఉపాధ్యాయురాలు తెలిపారు.’ -
వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈల సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. -
ఇక.. ఇక్కట్లు ఉండవు
మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మే డారం, పరిసరా ప్రాంతాల్లో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప నులు చేపట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతరకు వారం రో జుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈలోపు విద్యుత్ సరఫరా పనులు యు ద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న మే డారం 33/11 కేవీ, సమ్మక్క 33 /11 కేవి సబ్ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లపై భారం పడకుండా నార్లాపూర్ వద్ద కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు గట్టమ్మ దేవాలయం వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతర నాటికి ఈ రెండు సబ్ స్టేషన్లు వినియోగంలోకి రానున్నా యి. వీటి నిర్మాణంతో అంతకు ముందున్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి బ్రేక్డౌన్లు, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరగనుంది. కవర్ కండక్టర్తో విద్యుత్ లైన్.. 11 కేవీ విద్యుత్ లైన్కు కొక్కెలు వేయడం, చెట్ల కొమ్మలు తాకడం, ఇతరత్రా కారణాలతో గతంలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలిగే ది. ఈ సారి ఈ సమస్యను అధిగమించేందుకు 25 కిలో మీటర్ల పొడవునా కవర్ కండక్టర్ ద్వారా 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. 15 కిలో మీటర్లు 33 కేవీ విద్యుత్ లైన్ కవర్ కండక్టర్తో వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు తెగిపడితే ప్రమాదం జరిగే అవకాశముండడంతో లైన్లు తెగి కింద పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోలింగ్ టీమ్లు ఏర్పాటు.. జాతరలో విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా 50 స్థానాల్లో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే పరిష్కరిస్తారు. అదే విధంగా 33 కేవీ లైన్లలో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి స మక్క సబ్స్టేషన్ వరకు పెట్రోలింగ్ టీమ్లను ని యమించనున్నారు. సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఎమ్మార్టీ టీ మ్ను సిద్ధం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జాతర సాగనుంది. విద్యుత్ సబ్ స్టేషన్లపై భారం పడకుండా మేడారం, సమ్మక్క సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అదే విధంగా 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్లో ఏదైనా అవాంతరం ఎదురైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి మేడారం, సమ్మక్క 33/11 కేవీ సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కమలాపూర్ 132/33, ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా 259 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ, ప్రమాదం జరగకుండా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 180 మీటర్ల పొడవున 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో విద్యుత్ లైన్ను వాహనాలు క్రాస్ చేసే సమయంలో లైన్లకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రమాదకారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు టవర్లు నిర్మిస్తున్నారు. వేగంగా ఏర్పాట్లు.. రెండు సబ్స్టేషన్ల ద్వారా సరఫరా సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు నార్లాపూర్, గట్టమ్మ దేవాలయం వద్ద నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం 259 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల్ల ఏర్పాటు అంతరాయాలు లేకుండా కవర్ కండక్టర్తో 11 కేవీ విద్యుత్లైన్ జంపన్న వాగు వద్ద ఆరు టవర్ల నిర్మాణంమేడారం జాతర విద్యుత్ సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర విజయవంతంలో విద్యుత్ శాఖది కీలక పాత్ర. ప్రతీ పనిని నాణ్యతతో చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ -
మారిన ఎన్నికల స్వ‘రూపం’..
భూపాలపల్లి అర్బన్: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. అయితే నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది నాటితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి, రెండు విడతలు పూర్తికాగా బుధవారం మూడో విడత జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల తీరుపై నాటితరం సర్పంచుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.గతంలో ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీద ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. నేను 1988–1993 మధ్య చిట్యాల సర్పంచ్గా పని చేశా. – బుర్ర నర్సయ్య, మాజీ సర్పంచ్, చిట్యాల మాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం. 2001లో గ్రామ సర్పంచ్గా పనిచేశా. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశా. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. నాటి గౌరవం, మర్యాద నేటి తరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. – లావుడ్య దాసునాయక్, మాజీ సర్పంచ్, గొల్లబుద్దారం ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు నాటితరం సర్పంచుల మనోగతం -
ఓటమెరుగని నాయకులు..
● ఆ దంపతులు ఐదుసార్లు సర్పంచ్గా గెలుపు దంతాలపల్లి : ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి సర్పంచ్గా పని చేసి మరోసారి గెలువడం కష్టమే. అలాంటిది ఏకంగా ఐదుసార్లు సర్పంచ్గా గెలుపొంది ప్రజల మన్ననలు పొంది ప్రజానాయకులుగా పేరొందారు కొమ్మినేని రవీందర్, మంజుల దంపతులు. మండలంలోని దాట్లకు చెందిన ఆ దంపతులు 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా వారి కుటుంబం నుంచే కొనసాగుతున్నారు. ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని దాట్ల గ్రామానికి మూడుసార్లు సర్పంచ్గా ఎన్నిక కాగా రెండు పర్యాయాలు రవీందర్, ఒక పర్యాయం మంజుల ఎన్నికయ్యారు. దంతాలపల్లి మండలం ఏర్పడిన అనంతరం దాట్ల సర్పంచ్గా రవీందర్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో 260 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా మంజుల గెలుపొందారు. ఇలా వరుసగా ఐదుసార్లు సర్పంచ్గా ఎన్నికై ఓటమెరగని నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్.. బచ్చన్నపేట : మండలంలోని తమ్మడపల్లి సర్పంచ్గా గెలుపొందిన బేజాడి సిద్ధులు తన కుటుంబం నుంచి నాలుగో సర్పంచ్. 1995లో తన తండ్రి రాములు, 2006లో తన భార్య సునీత, 2013లో సిద్ధులు, ప్రస్తుతం సిద్ధులే గెలుపొంది ఆ కుటుంబంలో నాలుగో సర్పంచ్ అయ్యారు. నాటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు గ్రామస్తులు తమ కుటుంబం పట్ల ఆదరణ, అభిమానం చూపుతున్నారని సిద్ధులు తెలిపారు. భర్త ఉప సర్పంచ్.. భార్య వార్డు సభ్యురాలు కమలాపూర్: కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో భార్యాభర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గ్రా మానికి చెందిన ఆసాల శ్రీ కాంత్ బీఆర్ఎస్ తరఫున 4 వ వార్డు నుంచి, ఆయన భా ర్య మౌనిక 9వ వార్డు నుంచి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడత జీపీ ఎన్నికల అనంతరం శ్రీకాంత్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆసాల శ్రీకాంత్, మౌనిక -
షూటింగ్ బాల్ విజేత వరంగల్ జట్టు
తాండూరు టౌన్: రాష్ట్ర స్థాయి అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రో యా క్షన్) ఖేలో ఇండియా షూటింగ్ బాల్ విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈనెల 13, 14వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ప్ర థమ స్థానంలో వరంగల్, ద్వితీయ, తృతీయ స్థానా ల్లో నల్లగొండ, ఖమ్మం జట్లు నిలిచాయి. విజేతలకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి ఐలయ్య ట్రోఫీలు అందజేశారు. -
నయా ట్రెండ్!
● సర్పంచ్ అభ్యర్థుల ప్రమోషనల్ కాల్స్ ● తనకు ఓటు వేయాలని అభ్యర్థన కాళేశ్వరం: హలో..హలో.. నేను మీ సర్పంచ్ అభ్యర్థిని అంటూ ఫలాన గుర్తుకు ఓటు వేయాలని ఫోన్లో అభ్యర్థిస్తున్నారు. కాటారం సబ్డివిజన్ పరిధిలో మూడో విడత ఎన్నికలకు ఈనెల 17న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమైన ప్రమోషనల్ కాల్స్తో సెల్ఫోన్లు రింగ్..రింగ్..రింగ్మంటూ మోగుతున్నాయి. అభ్యర్థులు వాయిస్తో ప్రమోషనల్ కాల్స్ పల్లెల్లో సందడి చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి తెర పడడంతో కొత్తట్రెండ్తో ప్రచారం మొదలైందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా అభ్యర్థుల కొత్త ట్రెండ్ పల్లెల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. -
నాడు భార్య.. నేడు భర్త
● సర్పంచ్లుగా దంపతులు ఎన్నిక బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.డి ఆజామ్ గెలుపొందారు. 2019లో ఆయన భార్య ఖలీల్బేగమ్ కూడా బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలుపొందింది. ఇప్పుడు అదే గ్రామం జనరల్ అన్రిజర్వ్ అయ్యింది. దీంతో ఆజామ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీపై గెలుపొందారు. రెండు సార్లు సర్పంచ్గా ఆదరించిన గ్రామస్తులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. -
ఓటు వేసేందుకు వచ్చి మృత్యుఒడికి..
● వలిగొండ వద్ద రోడ్డు ప్రమాదం ● పోచారం యువకుడి మృతి వలిగొండ/పెద్దవంగర: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వ గ్రామానికి వచ్చిన ఓ యువకుడు.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు శివారులో చోటు చేసుకుంది. బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబా బా ద్ జిల్లా పెద్దవంగర మండలం పోచారం గ్రామానికి చెందిన కూకట్ల హరీశ్ (25) హైదరాబాద్లో బైక్ మెకానిక్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆది వారం జరిగిన రెండో విడత జీపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం వచ్చాడు. ఓటు వేసిన అనంతరం అదే గ్రామానికి చెందిన కూకట్ల పవన్తో క లిసి బైక్పై హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్ర మంలో అరూరు శివారులో ఎదురుగా వస్తున్న డీసీ ఎం.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హరీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన పవన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హరీశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. పోచారం విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
బయ్యారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ బయ్యారం ఉప సర్పంచ్గా ఎన్నికై న ఎనుగుల ఉమ. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల పోరులో పాల్గొన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు జీవన పోరాటంలో నిమగ్నమైంది. బయ్యారం ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉమ సోమవారం ఉప సర్పంచ్గా ఎన్నికై ంది. ఎన్నిక తర్వాత మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది.సర్పంచ్ బరిలో తోటికోడళ్లు కొడకండ్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొడకండ్ల సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. కొడకండ్ల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు మసురం వెంకటనారాయణ సతీమణి రాధాలక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థిగా, మసురం లక్ష్మీనర్సింహాస్వామి సతీమణి మమత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. కాగా, కొడకండ్ల సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
ప్రిన్సిపాల్ సమ్మయ్యకు షోకాజ్ నోటీస్
● ఆర్డీఓ, తహసీల్దార్ల వద్ద విద్యార్థుల లేఖలు ● కలెక్టర్కు చేరిన ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ నివేదిక ● చర్యలకు రంగం సిద్ధం.. వరంగల్ క్రైం: ఒగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (పరకాల)లో విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ కథనానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ సెక్రటరీకి ని వేదిక సమర్పించారు. సెక్రటరీ ఆదేశాల మేరకు డీ సీఓ ఉమామహేశ్వరి సోమవారం సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యకు, ఆ పాఠశాలలో పనిచేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్కు షోక్జ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వలని పేర్కొన్నారు. విద్యార్థులు ఫిర్యాదులో పెట్టెలో వేసిన ఫిర్యాదు లేఖలను పరకాల ఆర్డీఓ, దామెర తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్న ట్లు సమాచారం. వారు పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకీరి చేయించిన ఘటనతోపాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై విద్యార్థులు లేవనెత్తిన అవినీతి విషయాలపై హనుమకొండ కలెక్టర్కు నివేదిక అందజేసినట్లు తె లిసింది. ఈనెల 12న ‘చిట్టి చేతులు..వెట్టి చాకిరీ’, 13న ‘వెట్టి చాకిరీపై కదిలిన యంత్రాంగం’ అనే శీర్షి కలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. వీ టిపై స్పందించిన అధికారులు చర్యలకు ఆదేశించా రు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జోనల్ అధికారి తన నివేదికలో క్రమ శిక్షణ చర్యలకు సిఫా ర్సు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుని క్యా టరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్ సమ్మ య్య కొంత మంది విద్యార్థులను తనకు వ్యతిరేకంగా చెప్పుతే టీసీలు ఇస్తానంటూ బెదిరించిన విషయానికి సంబంధించిన ఆడియో కూడా వైరలైంది. ఇప్పటికై నా అధికా రులు గతి తప్పిన గు రుకులాన్ని గా డిలో పెట్టాలని త ల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
మాది కొత్తపల్లిగోరి గ్రామం. నేను 1995–2001 సంవత్సరాల మధ్య సర్పంచ్గా పని చేశా. అనంతరం 2001–2006 వరకు మా భార్య కాటం స్వరూప సర్పంచ్గా పని చేశారు. అప్పడు కేవలం ఎన్నికల ఖర్చు రూ.14వేలు మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారికి పెద్దగా ఖర్చులు ఉండేవి కావు. డబ్బుల ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ సేవ చేయడమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నమైంది. – కాటం సదయ్య, కొత్తపల్లిగోరి -
సరదా విషాదమైంది..
ఖిలా వరంగల్ : సరదా విషాదమైంది. సవారీ చేసేందుకు కట్టేసిన గుర్రం వద్దకు వెళ్లిన బాలుడిని గుర్రం తన్నింది. దీంతో బాలుడికి తీవ్రగా గాయాలు కావడంతో కుటుంబీకులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో గుర్రం యజమాని నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని సోమవారం సాయంత్రం ఖిలా వరంగల్ ఏకశి చిల్డ్రన్పార్క్ గేట్ ఎదుట నిర్వహించారు. గుర్రం యజమాని, పార్కు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గుర్రం యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువుల ధర్నా విరమించారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్ ఏసీరెడ్డినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మిర్యాల కృష్ణ కుమారుడు గౌతం(12) ఈనెల 10వ తేదీన ఉదయం బాబాయి రాజేందర్తో కలిసి ఏకశిల చిల్డ్రన్ పార్క్కు వెళ్లాడు. పార్కులో సవారీ చేసేందుకు సోదరుడు మహేశ్తో కలిసి గుర్రం వద్దకు వెళ్లాడు. అంతలోనే గుర్రం వెనుక నుంచి తన్నడంతో గౌతంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గౌతంను రాజేందర్ హుటాహుటిన ఎంజీఎం తరలించారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపించారు. కాగా, శివనగర్లోని ఏసీరెడ్డి నగర్ బాలుడి అంత్యక్రియలు నిర్వహించగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తరలొచ్చి గౌతం మృతదేహం వద్ద నివాళులర్పించారు. సవారీ కోసం గుర్రం వద్దకు వెళ్లిన బాలుడు వెనుక నుంచి తన్నగా తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి ఏకశిల పార్కు ఎదుట బాలుడి బంధువుల ధర్నా -
మానుకోటలో ఉద్రిక్తత..
మహబూబాబాద్ రూరల్ : అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో రెండు గంటలపాటు రాస్తారోకో.. స్తంభించిన రాకపోకలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన -
రామప్పను సందర్శించిన యునెస్కో భారత రాయబారి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పారిస్ నుంచి వచ్చిన యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి.శర్మ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, (ఏఎస్ఐ) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను ఆయన సమీక్షించారు. యునెస్కోకు సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్కు విశాల్ వి.శర్మ చైర్మన్గా వ్యవహరించారు. ఈ కీలక పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు. ఇటీవల ఢిల్లీలోని ఎరక్రోటలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్కు కూడా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే దీపావళిని యునెస్కోకు చెందిన ఐసీహెచ్ జాబితాలో చేర్చారు. 2021లో రాయబారి విశాల్ వి.శర్మ సారథ్యంలోనే రామప్ప ఆలయం కూడా ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ఇన్కోయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చిన ఆయన.. పరిరక్షణ చర్యలను సమీక్షించేందుకు జిల్లాలో పర్యటించారు. ఏఎస్ఐ నుంచి డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ హెచ్.ఆర్. దేశాయ్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజనీర్ కృష్ణ చెతన్య, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రోహిణి పాండే అంబేడ్కర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
చిన్నగూడూరు: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సొంత గ్రామమైన మంచ్యాతండాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంచ్యాతండా రైతువేదికలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఇటీవలే ప్రత్యేక జీపీగా ఏర్పడిన మంచ్యాతండాకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. గార్లలో ఓటు వేసిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్ల: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆదివారం గార్లలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. ఈసందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రీకౌంటింగ్ చేయాలని ఆందోళన బయ్యారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో విడత ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుదారు గుగులోతు శాంతి మూడు ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అత్యల్ప తేడా రావడంతో ప్రత్యర్థి మరోసారి కౌంటింగ్ చేయాలని కోరారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉధ్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి 12 దాటినా ఆందోళన కొనసాగింది. పోలింగ్ అధికారులు సైతం కేంద్రంలోనే ఉన్నారు. పాలడుగు భాస్కర్ -
పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. కాగా ఉదయం చలి తీవ్రతతో మంద కోడిగా ప్రారంభమైన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది. కాగా, జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించిన ఏడు మండలాల్లో 85.05 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా అదనపు కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్తోపాటు ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక అధికారులు పోలింగ్ సరళి, కౌంటింగ్ను పరిశీలించారు. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఉదయం 9గంటల తర్వాత పోలింగ్ ఊపందుకుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. 143 జీపీలు, 1,106 వార్డుల్లో పోలింగ్ జిల్లాలో రెండో విడతలో బయ్యారం, చిన్నగూడూ రు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలు ఉండగా ఈనెల 14(ఆదివారం) పోలింగ్ నిర్వహించారు. ఆయా మండలాల్లో 158 జీపీలు ఉండగా 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 143 జీపీలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,360 వార్డులకు 251 ఏకగ్రీవం కాగా 3 నోవాల్యువుడ్ వార్డులు ఉండగా మిగిలిన 1,106 వార్డుల్లో పోలింగ్ జరిగింది. పురుషులే అధికం.. పోలింగ్ పరంగా చూస్తే పురుష ఓటర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం ఓటర్లలో పురుషులు 97,561 మంది, మహిళా ఓటర్లు 10,1216 ఉన్నారు. కాగా 97,561 మంది పురుషులు 83,479(85.57 శాతం) మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 10,1216 మంది ఉండగా 85,589(84.56 శాతం) మంది పోలింగ్లో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్, లెక్కింపు సరళి పరిశీలన బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. గార్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలల్లో పోలింగ్ సరళిని జనరల్ అబ్జర్వర్ మధుకర్ బాబు, ప్రత్యేక అధిదికారి మరియన్న పరిశీలించారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటింగ్ సరళిని సాధారణ పరిశీలకుడు మధుకర్ బాబు, ప్రత్యేక అధికారి శ్రీమన్నానారాయణ, ఎంపీడీఓ రాధిక, తహసీల్దార్ రమేష్బాబు, చిన్నగూడూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలో పోలింగ్ సరళిని ప్రత్యేక అధికారి బీమ్లా నాయక్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. రెండో విడతలో 85.05 శాతం ఓటింగ్ ఏడు మండలాల్లో నిర్వహణ ఓటు హక్కు వినియోగించుకున్న 1,69,071 మంది ఓటర్లు ఉదయం 9 గంటల వరకు పుంజుకున్న ఓటింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన అదనపు కలెక్టర్ -
రెండో విడత హస్తగతం
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మోస్తరు ఫలితాలతో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.. రెండో విడత విజయపథంలో దూసుకెళ్లారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాలు కై వసం చేసుకున్నారు. అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి, బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు రెబల్స్ షాక్ ఇచ్చారు. అత్యధిక స్థానాలు గెలుచుకొని సత్తాచాటాలని కష్టపడి ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆంతంత మాత్రం ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఓట్లతోపాటు, అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ సాగింది. అత్యధిక స్థానాలు చేతికే.. జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు, 4,110 వార్డులకు గాను రెండో విడత 158 పంచాయతీలు, 1,358 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 15 పంచాయతీలు, 251 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 143 పంచాయతీలు, 1,107 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 115 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 38 పంచాయతీల్లో బీఆర్ఎస్, 05 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించా రు. మొదటి విడత ఐదు పంచాయతీలు గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ రెండో విడతలో ఒక్కస్థానం కూడా గెలవకపోవడం గమనార్హం. 20 పంచాయతీల్లో 19 కాంగ్రెస్ కై వసం గార్ల: మండలంలోని 20 పంచాయతీలకుగాను, 19 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా ఒక్క పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నాడు. మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభీ మోగించడంతో ఆ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒక్క ఓటుతో గెలుపు! బయ్యారం: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఇరువురు అభ్యర్థులు విజయం సాధించారు. 7వ వార్డులో ఎట్టి సరిత, 13 వ వార్డులో పోస్టల్ బ్యాలెట్తో బందెల కళింగరెడ్డి విజయం సాధించారు. అత్యల్ప మెజార్టితో విజయం సాధించడంతో అభ్యర్థులతోపాటు ఆయా వార్డుల ఓటర్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చెల్లైపె అన్న విజయం బయ్యారం: మండలంలోని వెంకటాపురం పంచాయతీ సర్పంచ్ పదవికి అన్న చెల్లె పోటీపడగా ఆదివారం వెల్లడైన ఫలితాల్లో అన్న విజయం సాధించారు. బొర్ర కృష్ణ కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా అతని చెల్లె పొడుగు సుగుణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఆసక్తికర పోటీలో చెల్లైపె అన్న విజయం సాధించారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి రెబల్స్ షాక్ కష్టపడ్డా వేగం పుంజుకోని కారు మేజర్ గ్రామ పంచాయతీల్లో నువ్వా.. నేనా..?కష్టపడ్డా.. పుంజుకోని కారు పార్టీ బలానికి ఆయువు పట్టయిన పంచాయతీల్లో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కష్టపడ్డా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రధానంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, రెడ్యానాయక్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవి త, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఇతర నాయకులు కాంగ్రెస్కు పోటీగా ప్రచా రం చేశారు. అయితే ఇల్లెందు నియోకవర్గంలోని గార్లలో 20 పంచాయతీలు ఉండగా 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. డోర్నకల్ నియోకవర్గంలో కాంగ్రెస్ సగం పంచాయతీలు కూడా గెలవలేదు. మొత్తం 158 స్థానాల్లో కనీసం మూడో వంతు స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వతంత్ర ఏగ్రీవం మొత్తం బయ్యారం 16 08 04 01 29 చిన్నగూడూరు 06 03 00 02 11 గార్ల 17 01 00 02 20 పెద్దవంగర 13 07 00 06 26 దంతాలపల్లి 14 02 00 02 18 నర్సింహులపేట 16 06 00 01 23 తొర్రూరు 21 09 00 01 31 మొత్తం 103 36 04 15 158ఎమ్మెల్యేలకు రెబల్స్ షాక్.. జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించగా.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మాత్రం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలోని యశస్వినిరెడ్డి సొంత గ్రామం చర్లపాలెంతోపాటు, కిష్టాపురం, మడిపల్లి, సోమారం, గుర్తూరు, పత్తేపురం గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. వీరందరు గత కొంతకాలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారు కావడం గమనార్హం. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో కాచనపల్లి, నర్సీతండా, జగ్గుతండా పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. -
ఇక పాఠశాలల్లో తనిఖీలు
● వసతులు, రికార్డుల పరిశీలన ● 34 మంది ఉపాధ్యాయలతో ప్రత్యేక బృందం ● జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలుమహబూబాబాద్ అర్బన్: ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, నాణ్యమైన విద్య, పాఠశాల రికార్డులు, పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. ఈ తనిఖీలు ప్రధానోపాధ్యాయులు, పీఎస్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉపాధ్యాయులు పాఠశాలలను తనిఖీలు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారులకు రిపోర్టు అందజేస్తారు. గతంలో బడి ఎలా ఉండేది, ప్రస్తుతం బడి ఎలా ఉన్నది అనే విషయాన్ని ఆరాతీసి విద్యార్థుల విద్య అభివృద్ధికి దోహదం చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పనితీరు వారి హాజరు, విద్యార్థుల సామర్థ్యం, వారి హాజరు అంశాలను పరిశీలిస్తారు. లోపాలు అవకతవకలు ఉంటే రాష్ట్ర విద్యాశాఖకు నివేదికను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు. ఒక బృందంలో పది మంది ఉపాధ్యాయులు జిల్లా పరిధిలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు 8 మోడల్ స్కూళ్లు, 17 కేజీబీవీలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు సీనియర్ ఉపాధ్యాయులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్పై ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వీరు పనిచేయనున్నారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వీటికి సంబంధించి 15 మంది ఉపాధ్యాయులను నియమించారు. 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఇద్దరు ఎస్జీటీలు, ఒక పీఎస్ హెచ్ఎం ఉంటారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన బృందంలో ఒక స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్ఎం, ఎస్జీటీ ఉంటారు. ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. 102 ఉన్నత పాఠశాలలు ఉండగా, రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏడుగురు ఎస్ఏలు, పీడీ, పీజీ హెచ్ఎం ఉంటారు. మొత్తం 36 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్పై విధులను కేటాయించారు. వీరంతా గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. వారానికోసారి, లేనిపక్షంలో ప్రతీరోజు నివేదికను డీఈఓ కార్యాలయంలో అందజేయనున్నారు. తనిఖీలతో పాఠశాలలో మెరుగు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగు పడేందుకు తనిఖీ బృందాల పరిశీలన ఉపయోగపడుతుంది. తనిఖీ బృందాలు, కేటాయించిన పాఠశాలలను ప్రతీరోజు రెండు చొప్పున తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇస్తారు. ఈ బృందాల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ప్రగతి మెరుగవుతుందని ఆశించవచ్చు. తనిఖీ బృందాల నివేదికలు ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులకు పంపిస్తాం. – రాజేశ్వర్, డీఈఓ -
23 ఏళ్లకే సర్పంచ్..
● తండ్రి బాటలో తనయురాలు టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన సంగి అంజలి తండ్రి బాటలో నడిచి 23 ఏళ్లకే సర్పంచ్గా గెలుపొందారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సంగి రవి, విజయ దంపతుల కూతురు అంజలి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం సన్నద్ధమతున్న తరుణంలో దుబ్యాల సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో తండ్రి బాటలో పయనించి బరిలో నిలిచింది. ఎన్నికల ఫలితాల్లో సర్పంచ్గా విజయం సాధించింది. ఎమ్మెస్సీ పూర్తి చేసి.. సర్పంచ్గా గెలిచి.. మండలంలోని ఎంపేడుకు చెందిన ఇసంపెల్లి పోశాలు, రాధ దంపతుల కూతురు హాసిని ఎమ్మెస్సీ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో బరిలో నిలిచి గెలుపొందింది. 25 సంవత్సరాలకే సర్పంచ్గా విజయ కేతనం ఎగురవేసింది. -
నాడు భర్త.. నేడు భార్య
ఐనవోలు: ఒంటిమామిడిపల్లి సర్పంచ్గా ఆడెపు స్రవంతి 194 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. 2015 నుంచి 2020 వరకు స్రవంతి భర్త దయాకర్ బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా విధులు నిర్వహించారు. 2020 నుంచి 2025 వరకు వివిధ కారణాలతో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల్లో గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. స్వతంత్ర అభ్యర్థిగా స్రవంతి బరిలో నిలువగా బీఆర్ఎస్, బీజేపీ మద్దతు తెలిపారు. ఇరుపార్టీల మద్దతుతో 194 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గీసుకొండ: గీసుకొండ మండలం మచ్చాపూర్లో బోడకుంట్ల ప్రకాశ్, మానస దంపతులు అరుదైన ఘనత సాధించారు. ప్రకాశ్ 2013లో సర్పంచ్గా గెలుపొంది 2018 వరకు కొనసాగారు. ఆ తర్వాత మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికై 2019 నుంచి 2024 వరకు సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ దఫా సర్పంచ్ పదవి మహిళకు రిజర్వ్ అయ్యింది. ఆయన తన భార్య మానసను బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుపగా ఘన విజయం సాధించారు. ప్రత్యర్థికన్నా 328 ఓట్ల మెజార్టీ సాధించారు. -
సాక్షి స్పెల్బీ సెమీఫైనల్కు విశేష స్పందన
కాజీపేట: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి శివారులోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాక్షి స్పెల్బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు అక్షర దోషం లేకుండా పదాలు రాయడం.. వాటిని ఎలా పలకాలో క్లుప్తంగా వివరించడానికి.. కొత్త ఇంగ్లిష్ పదాలు తెలియపరిచేలా ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కేటగిరీల వారీగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు కేటగిరీ 2, 4, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కేటగిరీ 1, 3 విభాగాల్లో పరీక్షలను ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. కేటగిరీ – 1లో 1, 2 తరగతి విద్యార్థులు, కేటగిరీ–2 లో 3, 4, కేటగిరీ – 3లో 5, 6, 7, కేటగిరీ – 4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పరీక్షలు రాశారు. వరంగల్ రీజీయన్ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్యూక్స్ వ్యాపీ ప్రెజెంటింగ్ స్పాన్సర్గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమండ్రి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో సాక్షి వరంగల్ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఈవెంట్స్ మేనేజర్ ఎన్.సుమన్ గుప్తా, ఎడిషన్ ఇన్చార్జ్ లింగయ్య, తాళ్లపద్మావతి విద్యా సంస్థల డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, ప్రిన్సిపాల్ సౌమ్య, సిబ్బందితో పాటు సాక్షి బృందం పాల్గొంది. విద్యార్థులకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది.. స్పెల్ బీ పరీక్షతో విద్యార్థులలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతీ సంవత్సరం స్కూల్లో ఒలంపియాడ్తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్షలు చాలా రాస్తుంటా. అన్నింటికంటే సాక్షి స్పెల్బీ పరీక్ష బాగుంది. విద్యార్థుకు చాలా ఉపయోగపడే పరీక్ష. కె.సాన్వికారెడ్డి, 9వ తరగతి, షైన్ హైస్కూల్ కొత్త పదాలు తెలిశాయి.. నేను స్పెల్బీ సెమీ ఫైనల్ పరీక్ష రాశా. రెండు రౌండ్ల పరీక్షల కంటే సెమీఫైనల్ రౌండ్లో చాలా కొత్త పదాలు నేర్చుకున్నా. బుక్స్లో లేని పదాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఫైనల్ రౌండ్కు కూడా ఎంపికవుతా. – ఎన్.ప్రదీప్ కుమార్, 2వ తరగతి, ఎస్వీఎం సెంట్రల్ పబ్లిక్ స్కూల్, ఖమ్మంవిద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్న సాక్షి స్పెల్ బీ.. ఇంగ్లిష్ను ఇష్టంగా నేర్చుకుంటా. స్పెల్ బీతో విద్యార్థుల మధ్య ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి పోటీ పరీక్షలతో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే అవకాశం సాక్షి కల్పించడం అభినందనీయం. – పి.సాన్వి, 7వ తరగతి, తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్ ఉత్సాహంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు ముగిసిన సెమీఫైనల్ రౌండ్ -
సహజారెడ్డి అంత్యక్రియలు పూర్తి
● అమెరికాలో ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతి స్టేషన్ఘన్పూర్: అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమాన ప్రకారం ఈనెల 5న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన ఉడుముల సహజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామశివారు గుంటూరుపల్లిలో శుక్రవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్రెడ్డి, గోపు మరియశైలజ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారి పెద్ద కుమార్తె సహజారెడ్డి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లింది. అమెరికాలో బర్మింగ్హోమ్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె ఎనిమిది రోజుల క్రితం అగ్నిప్రమాదంలో మృతిచెందింది. కాగా ఆమె మృతదేహాన్ని గుంటూరుపల్లికి శుక్రవారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా విశాఖపట్నం అగ్రపీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి నవోదయం !
ఖిలా వరంగల్: నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు(శనివారం) జరిగే ప్రవేశ పరీక్షకు మొత్తం 28 పరీక్ష కేంద్రాలను 14 బ్లాకులుగా విభజించి ఏర్పాటు చేశారు. 5,648 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 3,207 బాలురు, 2,439 బాలికలు ఉన్నారు. మొత్తం 80 సీట్లు ఉండగా.. పట్టణ(నగర) పరిధిలో 20 సీట్లకు 1,934 మంది, గ్రామీణ ప్రాంత పరిధిలో 60 సీట్లకు 3,714 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సీటు వస్తే నవోదయమే.. మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక్కసారి సీటు లభిస్తే ఆరో తరగతి మొదలు 12వ తరగతి (ప్లస్ టూ) వరకు ఉచితంగా చదువు కొనసాగించవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం మామునూరులోనే ఉంది. ఈ విద్యాలయంలో ఏటా ప్రవేశానికి పోటీ భారీగా ఉంటోంది. శనివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో పాటించాల్సిన మెలకువలను నవోదయ ప్రిన్సిపాల్ పూర్ణిమ వివరించారు.నేడు నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రానికి గంట ముందే అనుమతి పరీక్ష రాసే విద్యార్థులు 5,648 మంది -
‘మంత్రిపై చర్యలు తీసుకోవాలి’
ములుగు రూరల్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో సాయంత్రం 5 గంటలు దాటి న తర్వాత సభలు, సమావేశాలు, మైక్లతో ప్రచారం నిర్వహించకూడదు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత జాకారంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
ఇంటింటా సర్వే
బడిబయట పిల్లల గుర్తింపునకు చర్యలుమహబూబాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబయట పిల్లలను గుర్తించేందుకు సీఆర్పీలు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో 4 మున్సిపాలిటీలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కాగా, ఈ నెల 31వరకు సర్వే పూర్తి చేయనున్నారు. చదువుకు దూరంగా.. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలు, 120 యూపీఎస్, 102 ఉన్నత పాఠశాలలు, 54 ప్రైవేట్ పాఠశాలలు, 16 కస్తూర్బా పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలల్లో సుమారు 60,958 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గిరిజన జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కూలీ పనులకు వెళ్లడం, ఇతర కారణాలతో కొంతమంది పిల్లలు చదువుకు దూరంగా బడిబయట ఉన్నారు. నవంబర్ నెల చివరి వారంలో సర్వే నిర్వహించగా గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో ఈ నెల 18నుంచి ఈ నెల 31వరకు బడిబయట పిల్లలతో పాటు, మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలను సేకరించేందుకు సీఆర్పీలు సర్వే చేపట్టనున్నారు. గతంలో.. గతంలో 6–14 ఏళ్లలోపు పిల్లలను మాత్రమే బడిబయట పిల్లలుగా గుర్తించేవారు. ప్రస్తుతం 14 ఏళ్లలోపు ఉన్నవారితో పాటు 15–19 ఏళ్లలోపు వయసు గల మధ్యలో చదువు మానేసిన వారిని సైతం గుర్తించి వారికి విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది 6 నుంచి 14ఏళ్లలోపు ఉన్న పిల్లలు 242మందిని గుర్తించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. 15 నుంచి 19 ఏళ్లలోపు వారు 99 మందిని గుర్తించిగా అందులో 52 మందితో సార్వత్రిక విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం ఎంత మ ందిని గుర్తిస్తారు.. ఏ మేరకు విద్యాబుద్ధులు అందించేందుకు చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.షెడ్యూల్ వివరాలు.. గ్రామాల్లో బడిబయట పిల్లలను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలో ఈ నెల 31 వరకు నిర్వహించాలి. వచ్చే సంవత్సరం జనవరి 1నుంచి 4వ తేదీ వరకు సీఆర్పీ, ఐఈఆర్పీల సహకారంతో మండల స్థాయిలో మండల ఎంఐఎస్ కోర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు బడిబయట పిల్లల వివరాలను ప్రంబంధు పోర్టల్లో నమోదు చేయాలి. ఈ నెల జనవరి 6 వరకు సర్వే వివరాలను జిల్లాస్థాయిలో పరిశీలించాలి. జిల్లా స్థాయిలో పరిశీలించిన వివరాలను జనవరి 8వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ అధికారి ధ్రువీకరించి రాష్ట్రస్థాయికి పంపించాలి.ఓఎస్సీ సర్వే.. సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి బడిబయట పిల్లలను గుర్తించాలి. 6 నుంచి 14 ఏళ్లు, 15 నుంచి19 ఏళ్లలోపు బడిబయట పిల్లలను గుర్తించాలి. పిల్లలకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించాలి. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చిన వారి పిల్లల వివరాలను సేకరించాలి. డ్రాపౌట్ విద్యార్థులు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో సమాచారం సేకరించాలి. ఇతర రాష్ట్రాల్లో ఉండి సొంత గ్రామాలకు వచ్చిన పిల్లలను గుర్తించాలి. -
రైల్వే మెయింటెనెన్స్ డిపో తరలకుండా చూడాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తరలిపోకుండా చూడాలని కోరుతూ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ కోట్లను శుక్రవారం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి రైల్వే డిపో సాధన కమిటీ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ రైల్వే మెగా ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, కోఆర్డినేటర్ మైస శ్రీనివాసులు, కోకన్వీనర్లు మండల వెంకన్న, మార్నేని వెంకన్న, గుగ్గిళ్ల పీరయ్య, పిల్లి సుధాకర్, గోనె శ్యామ్ రావు, ఘనపురపు అంజయ్య, భూక్య శోభన్ బాబు పాల్గొన్నారు. -
చేతికి రెబల్..
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓబయ్యారం: మండలంలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆర్డీఓ క్రిష్ణవేణి శుక్రవారం పరిశీలించారు. బయ్యారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల ప్రత్యేకాధి కారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక పాల్గొన్నారు. తల్లి వార్డుమెంబర్.. కొడుకు సర్పంచ్కేసముద్రం: మండలంలోని మహముద్పట్నం గ్రామ వార్డుమెంబర్గా తల్లి, సర్పంచ్గా కొడుకు ఎన్నికయ్యారు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఏడుగురు మాత్రమే ఉండగా, సర్పంచ్ స్థానంతో పాటు, మూడు వార్డులు ఎస్టీ రిజర్వు అయ్యాయి. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారే పోటీలో ఉన్నారు. గురువారం గ్రామంలో పోలింగ్ నిర్వహించగా, 3వ వార్డు మెంబర్గా పోటీ చేసిన తల్లి బుచ్చమ్మకు 33 ఓట్లురాగా, ఆమె ప్రత్యర్థికి కూడా 33 ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. దీంతో బుచ్చమ్మ విజయం సాధించింది. బుచ్చమ్మ కొడుకు కట్ల ఎల్లయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీలో నిలిచి గెలుపొందారు. దీంతో ఒకే ఇంట్లో తల్లి వార్డుమెంబర్గా, కొడుకు సర్పంచ్గా విజయం సాధించడం విశేషం. ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి నుంచి అధ్యక్ష మోడల్ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్చందర్రెడ్డి, బందెల మోహన్రావు హాజరయ్యారు. సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఫలితాలను పరిశీలిస్తే అంతా క్లీన్స్వీప్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా.. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల అనుకూల ఫలితాలు వస్తాయని ప్రకటించిన బీఆర్ఎస్ నాయకుల మాటలు నీటి మూటలయ్యాయి. రెండు పార్టీలకు వారు ఊహించినట్లు ఫలితాలు రాలేదనేది తేటతెల్లమైంది. అయితే ఇందుకు కారణాలు కాంగ్రెస్ పార్టీలో రెబల్ బెడదతో ఫలితాలు అనుకూలించలేదని చెబుతుంటే.. బీఆర్ఎస్లో అభ్యర్థులను నిలిపేందుకే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వేగానికి రెబల్ కళ్లెం.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 155 స్థానాలు ఉండగా ఇందులో తొమ్మిది స్థానాలు ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకున్నారు. ఇందులో ఏడుగురు కాంగ్రెస్ మద్దతుదారులు కాగా.. ఒకరు బీఆర్ఎస్, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఆరభంలో ఇంత సాఫీగా ఉండగా.. మిగిలిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి సిద్ధమైన వారి సంఖ్య పెరిగింది. దీంతో కొన్నిచోట్ల మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి సీటు ఇవ్వగా.. మరికొన్నిచోట్ల మాత్రం మధ్యలో వచ్చిన వారు, డబ్బులు ఉన్నవారు, నాయకుల అనుచరులను ఎంపిక చేశారు. దీంతో టికెట్ రానివారు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే ఈ రెబల్ అభ్యర్థులను పోటీ నుంచి వైదొలిగేందుకు ముఖ్యనాయకులు పెద్దగా ప్రయత్నాలు చేయలేదనే విమర్శలువచ్చాయి. దీంతో కొన్నిచోట్ల కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ప్రధాన పోటీదారులు అయ్యారు. మరికొన్నిచోట్ల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడటంతో ఓట్లలో చీలికలు రావడం.. బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థికి అనుకూలించిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో 15 మంది స్వంతంత్ర అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో పదికి పైగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే గెలిచినట్లు చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కారు పార్టీకి ట్రబుల్.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవికోసం పోటీ పడిన బీఆర్ఎస్ అభ్యర్థుల ఉత్సాహం ఈ ఎన్నికల్లో కన్పించలేదు. పార్టీ అధికారంలో లేకపోవడం ఒక కారణం అయితే ..గతంలో గ్రామాభివృద్ధికోసం చేసిన పనులకు ఇప్పటికి బిల్లులు రాక అప్పుల పాలైనవారు ఉన్నారు.దీంతో మళ్లీ పోటీ చేసి మరిన్ని అప్పులు చేయడం ఇష్టం లేక ముందుకు రాలేదు. దీంతో పార్టీ బలం ఎక్కువగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకొని బలమైన అభ్యర్థులను బరిలో దింపారు. కొన్నిచోట్ల నామమాత్రం అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అదే విధంగా కాంగ్రెస్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ వర్గం, ఎంపీ బలరాంనాయక్ వర్గం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వర్గాలకు చెందిన వారు పోటా పోటీగా నామినేషన్ వేసి బరిలో దిగారు. ఇటువంటి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు తెలివిగా ప్రవర్తించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారున్ని నిలబెట్టకుండా ఉండటం.. నిలబెట్టినా.. అది నామ మాత్రం పోటీగా చెప్పి.. ఎంపీ వర్గానికి చెందిన వారికి మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమ మద్దతు దారులు 48 మంది గెలుపొందగా.. మరో 14 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు దారుల గెలుపును ఆపగలిగారనే చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీఆర్ఎస్ నాయకుల్లో ఇప్పటికి సమన్వయం కుదురక పోవడం, ఒకరి వర్గానికి చెందిన వారు బరిలో ఉంటే మరొక వర్గం వారు పెద్దగా పట్టించుకోక పోవడం వంటి సంఘటనలు ఉన్నాయి. దీంతో మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో కారు పార్టీ మద్దతు దారులకు ఫలితాల ట్రబుల్ ఇచ్చిందని రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ● 6 నుంచి 19 ఏళ్లలోపు దివ్యాంగులు, పిల్లల గుర్తింపు ● ఈ నెల 31వరకు గడువు ● బడికి పంపేందుకు ప్రభుత్వం చర్యలు రెబల్గా పోటీచేసి గెలిచిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో తప్పని తిప్పలు నిక్కచ్చిగా ఉన్నచోట్ల నువ్వానేనా అన్నట్లు పోటీ పలుచోట్ల అభ్యర్థులను నిలపని కారు.. కొన్నిచోట్ల నామమాత్రంతొలి విడత సర్పంచ్లు వీరే.. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
తొర్రూరు/పెద్దవంగర: అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయాలపై శుక్రవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులు శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ఖర్చుల వివరాల నమోదుపై ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లో అభ్యర్థులు లెక్కలు సమర్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేసినా, తప్పుడు లెక్కలు చూపినా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక పంచాయతీలో అనుమతి తీసుకున్న వాహనాన్ని మరో గ్రామంలో తిప్పితే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దవంగర ఎంపీడీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్కుమార్, తొర్రూరు ఎంపీఓ పూర్ణచందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారి వెంకటేశ్వర్లు -
ఎన్నికల అధికారి పేరిట వసూళ్ల పర్వం !
● తొర్రూరులో యువకుడి అరెస్టు తొర్రూరు: ఎన్నికల ఫ్లయిగ్ స్క్వాడ్ అధికారి పేరిట వాహనాలు ఆపి వసూళ్లకు పాల్పడిన యువకుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై జి. ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దమంగ్యా తండా శివారు కేశ్యతండాకు చెందిన జాటోతు ఉపేందర్ సింగ్ హైదరాబాద్లో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్గా పని చేస్తున్నాడు. ములుగుకు చెందిన ధరావత్ ఆనంద్ పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో గురువారం తొర్రూరులో మద్యం కొనుగోలు చేసి కారులో వెళ్తున్నాడు. ముందస్తు ప్రణాళిక మేరకు ఉపేందర్తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులు సదరు కారును వెంబడించి మార్గం మధ్యలో అడ్డగించారు. ఎన్నికల అధికారులమని పేర్కొంటూ కారును చెక్ చేసి కేసు నమోదు చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ. లక్ష ఇస్తేనే కారు వదిలేస్తామన్నారు. దీంతో బాధితుడు ఆనంద్ తన బంధువులకు ఫోన్ చేసి వారు అడిగిన మొత్తం సర్దుబాటు చేయగా కారును వదిలేశారు. మోసపోయామని గ్రహించిన బాధితుడు ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని కేశ్యతండాలోని నివాసంలో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.50 వేలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని సైతం త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
కాజీపేట టు పెంబర్తి..
బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్కు ఆదేశాలువిద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల శ్రీలాశ్రీకోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్ ,బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్టింగ్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ములుగు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. ససేమిరా అంటున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు. వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీకాజీపేటలోని ‘లా’కోర్సులో కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాల భవనం ఇదేఇక్కడి నుంచి తరలించొద్దు..కాజీపేటలో కొనసాగుతున్న బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. పెంబర్తికి తరలించొద్దు. నా కూతురు కూడా డిగ్రీ చదువుతోంది. విద్యకుదూరమయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. ములుగు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజీని ములుగు జిల్లాలోనైనా ఏర్పాటు చేయాలి. – కె.రాజు, ఓ విద్యార్థిని తండ్రి, ములుగు జిల్లా దేవగిరి పట్నం -
నాడు భార్య..నేడు భర్త
● చీన్యతండా సర్పంచ్గా హరిచంద్ విజయం కేసముద్రం: ఇనుగుర్తి మండలంలోని చీన్యతండాజీపీ సర్పంచ్గా జాటోత్ హరిచంద్ విజయం సాధించారు. గత జీపీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కాగా, హరిచంద్ తన భార్య అరుణను ఎన్నికల బరిలో నిలపగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి జీపీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు రిజర్వు కాగా, హరిచంద్ పోటీలో నిలిచారు. ఈ మేరకు గురువారం జరిగిన జీపీ ఎన్నికల్లో, హరిచంద్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో అరుణ సర్పంచ్గా గెలుపొందగా, ఇప్పుడు ఆమె భర్త హరిచంద్ సర్పంచ్గా విజయం సాధించారు. జాటోత్ హరిచంద్ అరుణ -
సంతోషం పట్టలేక సొమ్మసిల్లి..
● విజేతగా ప్రకటించగానే స్పృహతప్పిన వార్డు సభ్యురాలు ఏటూరునాగారం: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ 8వార్డు సభ్యురాలు అమీనాబేగం గెలుపొందినట్లు అధికారులు ప్రకటించడంతో సంతోషం పట్టలేక సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్బాబు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పటేల్గూడెంలో 4 ఓట్ల తేడాతో గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని పటేల్గూడెంలో గురువారం జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 4 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పొన్నాల బుచ్చయ్య గెలుపొందారు. పటేల్గూడెంలో 1,347 ఓట్లకు గాను 1,271 ఓట్లు పోలయ్యాయి. అందులో పొన్నాల బుచ్చయ్యకు 610 ఓట్లు రాగా బీఆర్ఎస్ బలపరిచిన కడుదూరి సోమిరెడ్డికి 606 ఓట్లు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కార్తీక్కు 36, చెల్లని ఓట్లు 17, నోటాకు 2 వచ్చాయి. దీంతో బుచ్చయ్యకు సోమిరెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ రావడంతో రెండోసారి కౌంటింగ్ చేశారు. తేడా రాకపోవడంతో అధికారులు గెలిచినట్లు ప్రకటించారు. -
చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ
విచారణకు ఆదేశాలు.. ఒగ్లాపూర్ గురుకులంలో జరిగిన ఘటనలు నా దృష్టికొచ్చాయి. రాష్ట్ర కార్యాలయం పనిచేసే జాయింట్ సెక్రటరీ సాక్రునాయక్ విచారణకు ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శికి అందజేస్తాం. ప్రతీ పాఠశాలలో క్యాట రింగ్ కాంట్రాక్టు వ్యవస్థ ఉంది. పిల్లలతో పనులు చేయించడం తప్పు. కచ్చితంగా చర్యలు ఉంటాయి. –అలివేలు, జోనల్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జోన్సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ (పరకాల) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలో చోటుచేసుకున్న దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఉదయం 5 గంటలకే ఎముకలు కొరికే చలిలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏకంగా పాఠశాల ప్రిన్సిపాల్.. విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించడం.. వంటలు చేయించడం వంటి పనులు చేయించడమే కాకుండా పిల్లలను దూషించిన ఆడియో రికార్డులు వైరలయ్యాయి. బుధవారం ఉదయం పిల్లలతో టిఫిన్ చేయించిన ఓ వీడియో చక్కర్లు కొట్టింది. గురుకులంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్లో ఓ విద్యార్థి పాఠశాలలో జరుగుతున్న దారుణ ఘటనలు కళ్లకు కట్టినట్లు ఫిర్యాదు చేయడంతో పాఠశాలలో జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రిన్సిపాల్ విద్యార్థుల భవిష్యత్కు ఆటంకంగా మారడమే కాకుండా ఇష్టారాజ్యంగా వారిని దూషించడం, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. నిధులు పక్కదారి.. విద్యార్థుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు పక్క దారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల కాస్మోటిక్స్ చార్జిలను పక్కదారి పట్టించడంతో ఉన్నతాధికారులు గుర్తించి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. తాజాగా పాఠశాల కేర్టేకర్తో కుమ్మకై ్క వర్కర్లతో చే యించాల్సిన వంట పనులు, అది కూడా సలసల కాగే నూనెలో చిట్టి చేతులతో బొండా( టిఫిన్ ) వేయించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇతర పనులు చేయడం గమనార్హం. ఉపాధ్యాయులు స్టడీ సమయం విధుల్లో లేకపోవడంతో విద్యార్థులు సినిమాలు చూసిన ఘటనలో ఉపాధ్యాయులను వదిలి.. విద్యార్థులపై తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి. అలాగే, విద్యార్థులను ప్రిన్సిపాల్ కులం పేరుతో దూషించిన ఆడియో సైతం వైరల్గా మారింది. గురుకుల పాఠశాలలో దారుణ ఘటనలు పిల్లలతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్ విద్యార్థుల లేఖలతో వెలుగులోకి నిజాలు .. సోషల్ మీడియాలో వీడియో వైరల్ ‘సాక్షి’ ప్రత్యేక కథనం -
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
మహబూబాబాద్ రూరల్ : భూతగాదా విషయంలో అన్నను చంపిన ఘటనలో మృతుడి తమ్ముడు, అతడి ఇద్దరు కుమారులకు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) తోపాటు ఒక్కొక్కరికి రూ. 21వేల చొప్పున జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పీఎస్ పరిధిలోని కేసముద్రం (విలేజీ)కి చెందిన ఎలగలబోయిన వెంకన్న, అతడి తమ్ముడి కుటుంబానికి మధ్య భూతగాదా వచ్చింది. ఈ క్రమంలో వెంకన్నను అతడి తమ్ముడు ఎలగలబోయిన చంద్ర య్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్ కలిసి 2020, ఆగష్టు 8వ తేదీన తీ వ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు అనిల్ అదే రోజున ఫిర్యాదు చేయగా అప్పటి కేసముద్రం బి.సతీశ్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐ జె.వెంకటరత్నం విచారణ చేయగా అప్పటి రూరల్ సీఐ ఎస్.రవికుమార్ 2021 మార్చి 23న కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో బ్రీఫింగ్ అధికారులుగా అప్పటి కేసముద్రం ఎస్సై జి.మురళీధర్ రాజు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, జీనత్ వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ పక్షాన పీపీలు కొంపెల్లి వెంకటయ్య, చిలుకమారి వెంకటేశ్వర్లు, ఏపీపీ గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా కోర్టు డ్యూటీ అధికారులు నెలకుర్తి అశోక్ రెడ్డి, తేజావత్ దేవ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరం నిరూపణకావడంతో ఎలగలబోయిన చంద్రయ్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్కు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.21 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. భారత్ సుస్థిర గణతంత్ర రాజ్యం ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ● ప్రభుత్వ పింగిళి కళాశాలలో జాతీయ సదస్సు విద్యారణ్యపురి: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన సుస్థిర గణతంత్ర రాజ్యం దిశగా ఎదగాల్సిన అవసరం ఉందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఇండియా–2047 రియలిజింగ్ ది విజన్ ఆఫ్ ది డెవలప్ ఈక్విటబుల్ అండ్ సస్టేయినబుల్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపర్చడానికి ప్రతీ పౌరుడు రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడం అత్యవసరమని సూచించారు. అతిథులు సావనీర్ను ఆవిష్కరించారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి అధ్యక్షత వహించిన సదస్సులో ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్, సదస్సు డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్కుమార్, కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, అకడమిక్ కో– ఆర్డినేటర్ డాక్టర్ అరుణ, అధ్యాపకులు శైలజ, కవిత, సంధ్య, రవికుమార్ పాల్గొన్నారు. -
నాడు జెడ్పీటీసీ.. నేడు సర్పంచ్
● బండాతండా సర్పంచ్గా అరుణశ్రీ అల్వార్ జఫర్గఢ్: 2014 నుంచి 2019 వరకు జఫర్గఢ్ జెడ్పీటీసీగా పని చేసిన బానోత్ అరుణశ్రీ అల్వార్ బండాతండా నుంచి సర్పంచ్గా గెలుపొందారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం అల్వార్బండాతండా (శంకర్తండా) జీపీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన అరుణశ్రీ తన సమీప అభ్యర్థి బానోత్ మంక్తిపై 85 ఓట్లతో విజయం సాధించింది. కాగా, బానోత్ అరుణశ్రీ అత్త తులసీ తాజా మాజీ సర్పంచ్గా పని చేశారు. మళ్లీ ఇదే గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్గా తన కోడలు అరుణశ్రీ విజయం సాధించారు. -
పుట్టెడు దుఃఖంలోనూ మరువని బాధ్యత..
● తండ్రి మృతి చెందినా ఓటు వేసిన నాయకుడు వర్ధన్నపేట: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైందో ఆ నాయకుడు సమాజానికి చాటి చెప్పాడు. తండ్రి చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శ పౌరుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన పసునూరి రాజశేఖర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన తండ్రి ఆదినారాయణ(65) అనారోగ్యంతో మృతి చెందాడు. రాజశేఖర్ తీవ్ర విషాదంలో ఉన్నా మనసు ధైర్యం చేసుకుని తండ్రి మృత దేహం వద్ద నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు ఎంత విలువైందో సమాజానికి చాటి చెప్పాడు. దీనిపై గ్రామస్తులు.. రాజశేఖర్ బాధ్యతను కొనియాడారు. -
ఎన్నికల పరిశీలకుడి సందర్శన
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో జరుగుతున్న జీపీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్ బాబు గురువారం సందర్శించి పరిశీలించారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ ద్వారా జీపీ ఎన్నికలు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ ఉన్నారు. బోణీ కొట్టిన బీజేపీ మహబూబాబాద్ రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ మండలంలో బోణీ కొట్టింది. మండలంలోని నడివాడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పెదగాని గుట్టయ్య, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రాగిపాటి బుచ్చిరెడ్డి, బీజేపీ మద్దతుతో మైదం విజయకుమార్ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 9న ఉదయం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి రాగిపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం జరిగిన జీపీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసిన మైదం విజయకుమార్ 404 ఓట్లు కై వసం చేసుకుని విజయం సాధించారు. పెదగాని గుట్టయ్యకు 306 ఓట్లు రాగా మృతుడు రాగిపాటి బుచ్చిరెడ్డికి 160ఓట్లు వచ్చాయి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అకాడమిక్ అడిట్ పరిశీలకుడు డాక్టర్ బి.రాములు అన్నా రు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం 2022 –23, 2023–24 విద్యాసంవత్సరాల ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కళాశాలకు న్యాక్ గుర్తింపులో భాగంగా ఏ–గ్రేడ్ సాధించేందుకు అధ్యాపకులు అన్ని రకాల రికార్డులను తయారు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బి. లక్ష్మణ్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్కుమార్, మసూద్ఆహ్మద్, రాజశేఖర్, అన్నపూర్ణ, వినోద్, హతీరాం, ఉపేందర్, సుమలత, సాంబశివరావు, కాసీం, సుమన్, వీరు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ‘సీకేఎం’లో అస్తవ్యస్త పాలన ● పూర్తి కాని టెండర్ ప్రక్రియ ● మెరుగు పడని సేవలు ● ఇబ్బందులు పడుతున్న రోగులు ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్ను పరిశీలించిన సమయంలో టెండర్ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. కాగా ఉదయం మందకొడిగా ప్రారంభమై.. 9గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని ఐదు మండలాల్లో 86.99శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 146 జీపీలు, 1072 వార్డుల్లో పోలింగ్.. జిల్లాలోని గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. ఆయా మండలాల్లో 155 గ్రామపంచాయతీలు ఉండగా.. 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 1,338 వార్డులకు 266 ఏకగ్రీవమయ్యాయి. కాగా, మిగిలిన 146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్ జరిగింది. 86.99 శాతం నమోదు.. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఆతర్వాత బారులు దీరడంతో ఓటింగ్శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లదే పైచేయి మొత్తం 1,72,218మంది ఓటర్లు ఉండగా.. వారిలో 84,927 మంది పురుష ఓటర్లు, 87,282 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9మంది ఉన్నారు. మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. 84,927 మంది పురుష ఓటర్లలో 74099 మంది ఓటేశారు. అలాగే 87,282మంది మహిళా ఓటర్లలో 75,712మంది ఓటేశారు. పురుష ఓటర్ల పోలింగ్ 87.25శాతం, మహిళ ఓటర్ల పోలింగ్ 86.744 శాతం నమోదైంది. 86.99 శాతం నమోదు ఐదు మండలాల్లో 1,72,218 ఓట్లకు 1,49,812ఓట్లు పోలింగ్ క్యూలో బారులుదీరిన ఓటర్లు ఉదయం 7నుంచి 9 గంటల వరకు మందకొడిగా ఓటింగ్ 9 తర్వాత పుంజుకున్న వేగం -
సర్పంచ్ అభ్యర్థుల పాట్లు
● కాళ్లు మొక్కి.. మంచంపై తీసుకువచ్చి.. ఓట్లు వేయించిమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని రేగడి తండా, ఉత్తర తండా గ్రామపంచాయతీలో పరిధిలో వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు, నడవలేని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. స్థానికులు, సర్పంచ్ అభ్యర్థుల వారిని మంచాలపై వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించిన అనంతరం మళ్లీ వారిని ఇంటి వద్ద దింపారు. ఆమనగల్ గ్రామంలో జీపీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఓటర్లను కాళ్లు పట్టుకుని మొక్కుతూ తమకు ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. -
మొదటి విడత హస్తగతం
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పోటాపోటీగా సాగింది. గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్లో అన్ని పార్టీల మద్దతుదారులు తమ అనుకూలమైన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయి ంచారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల వార్ వన్సైడ్ కాగా.. మరికొన్ని గ్రామాల్లో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓ ట్లు పడ్డాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. కాగా, గెలిచిన వారు సంబురాలు చేసుకోగా.. ఓడిపోయిన వారిలో కొందరు ఓట్లు వేయలేదని తిట్ల దండకం మొదలుపెట్టారు. నువ్వా.. నేనా.. జిల్లాలోని ఐదు మండలాల్లో పలుచోట్ల పోటాపోటీగా ఓట్లు పడడంతో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబాబాద్ మండలంలోని ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామం సోమ్లాతండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాతకు మెజార్టీ వచ్చింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి భూక్య కౌసల్య రీకౌంటింగ్ కోరగా మరోసారి ఓట్ల లెక్కించి రెబల్ అభ్యర్థినే విజేతగా ప్రకటించారు. జంగిలిగొండ పంచా యతీలో బీఆర్ఎస్ మద్దతుదారు జక్క మమత ముందుగా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారు గుండెల రేణుక రీకౌంటింగ్కు వెళ్లారు. ఓట్ల లెక్కింపు తర్వాత రేణుక గెలిచినట్లు ప్రకటించారు. కంబాలపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు చీరిక వసంత గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి స్వర్ణలత రీకౌంటింగ్కు వెళ్లారు. మళ్లీ ఓట్లు లెక్కించినా వసంతనే గెలిచినట్లు ప్రకటించారు. ముడుపుగల్లులో కాంగ్రెస్ మద్దతుదారు కొత్త హే మంత్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ మద్దతుదారు జేరిపోతుల వెంకన్న రీకౌంటింగ్కు వెళ్లారు. తర్వాత ఓట్లు లెక్కించినా హేమంత్కే మెజార్టీ వచ్చినట్లు ప్రకటించారు. దామరవంచలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. చివరకు కాంగ్రెస్ మద్దతుదారు ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్కు రెబల్ దెబ్బ.. మొదటి విడత పోటీలో కాంగ్రెస్కు ఇంటిపోరు మొదలైంది. దీంతో కొంత మందికి టికెట్ ఇవ్వలేదు. దీనిపై నిరసర తెలుపుతూ పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చే శారు. ఇందులో మహబూబాబాద్ మండలంలో సోమ్లాతండా, దర్గాతండా, సింగారం శివా రు ఇస్లావత్ తండాలో రెబల్ అభ్యర్థులు గెలి చారు. ఇనుగుర్తి మండలంలో ఒకరు, కేసుముద్రంలో ఇద్దరు, నెల్లికుదురు మండలంలో ఇద్దరు రెబల్ అభ్యర్థులు గెలిచారు. గూడూరు మండలంలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల పేరుతో అభ్యర్థులు పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో రెబల్గా పోటీ చేసిన ఐదుగురు గెలిచారు.పార్టీల వారీగా మద్దతు దారులు గెలుపొందిన అభ్యర్థుల వివరాలు అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామంలో హస్తం హవా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఊరిలో కాంగ్రెస్ ఓటమి నువ్వా నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు రీ కౌంటింగ్తో బయటపడ్డ హజార్యాతండా సర్పంచ్ఎన్నికల మరిన్ని వార్తలుమండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఏకగ్రీవం మొత్తం మహబూబాబాద్ 23 11 01 04 02 41 కేసముద్రం 13 11 00 02 03 29 నెల్లికుదురు 17 09 02 02 01 31 గూడూరు 21 12 02 05 01 41 ఇనుగుర్తి 06 04 00 01 02 13 మొత్తం 80 47 05 14 09 155 -
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
కేసముద్రం: మండలంలోని పెనుగొండ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శబరీష్ సందర్శించి, పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గూడూరులో.. గూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ శబరీష్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్రెడ్డి మండల వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ ఎస్సై గిరిధర్రెడ్డి ద్వారా మండల వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలన్నీ గస్తీ తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా, సంబురాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సైకి సూచించారు. -
గుర్తుల కేటాయింపు ఉల్టా పల్టా..
కొత్తగూడ: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను అధికారులు ఉల్టా పల్టా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒకటో అభ్యర్థికి ఉంగరం, రెండో అభ్యర్థికి కత్తెర, మూడో అభ్యర్థికి బ్యాట్ కేటాయించాల్సి ఉంది. కాగా, అధికారులు ఒకటో అభ్యర్థికి బ్యాట్, రెండో అభ్యర్థికి ఉంగరం, మూడో అభ్యర్థికి కత్తెర కేటాయిస్తూ నోటీసు బోర్డులో అంటించారు. దీంతో వరుస నంబర్లలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ ఓటమికి అధికారులు కేటాయించిన గుర్తులే కారణం అని, కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మడగూడెం గ్రామపంచాయతీలో గుర్తు మార్పు వల్ల రీ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఈవిషయమై ఎంపీడీఓ మున్వర్ను వివరణ కోరగా గుర్తుల కేటాయింపులో ఎలాంటి సమస్య లేదని.. నోటీసు బోర్డులో తప్పుగా రాశారన్నారు. దాన్ని సరి చేసినట్లు వివరణ ఇచ్చారు. అధికారులు కేటాయించిన గుర్తులునిర్దేశించిన గుర్తుల కేటాయింపు విధానం -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
● ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! ● కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్గా భూక్య శోభన్ బాబు
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్గా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్ బాబును నియమిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేజీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 26 మందిని నేషనల్ కోఆర్డినేటర్లను నియమించగా, అందులో శోభన్ బాబుకు అవకాశం కల్పించారు. శోభన్ బాబు ప్రాథమిక విద్యను ఇనుగుర్తిలో చదివి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, బెంగుళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణ కార్యక్రమం, ట్రైబల్ హబ్ ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జార్ఖండ్ ఇన్చార్జ్ కొప్పుల రాజు, విక్రాంత్ భూరియా, తదితరులకు శోభన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలిములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతితో కలిసి ప్రశాంత జీవితం గడపాలని జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ ఆకాక్షించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఇద్దరు మహిళా సభ్యులు ఎస్పీ ఎదుట ఎస్పీ కార్యాలయంలో బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ఆర్థిక సాయం చెక్కులను లొంగిపోయిన సభ్యులు ఒయం రామే, మడకం మల్లి లకు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ కమిటీ ఆకాశ్ టీంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. పోరు కన్న – ఊరు మిన్న అవగాహన కార్యక్రమ ప్రభావంతో మావోయిజాన్ని వీడి జీవసీవన స్రవంతిలోకి మావోయిస్టులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వదకు జిల్లాలో 87 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్టీ శివం ఉపాధ్యాయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి
కేయూ క్యాంపస్: పౌరులందరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి పట్టాభి రామారావు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ (ఎన్జీఓ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం లేకుండా మానవ హక్కులు లేవని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణ కీలకమని పేర్కొన్నారు. ఏపీ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ 2014 తర్వాత దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు విచ్చలవిడిగా పరిశ్రమలు నెలకొల్పి పర్యావరణానికి విఘాతం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ ఆచార్య.. ఆ కాలంలో బ్రిటిష్వారిని ఎదిరించి పత్రికలను నడిపి జైలుకు వెళ్లి నిర్బంధ జీవితం గడిపారని గుర్తుచేశారు. ఎన్హెచ్ఆర్సీ (ఎన్జీఓ) జాతీయ చైర్మన్ ఐలినేని శ్రీనివాస్రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మానవ సేవలకు, నిరుపేదల సమస్యల పరిష్కారానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. సదస్సులో ఏపీ రాష్ట్ర చైర్మన్ సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారం, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర యాదవ్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు బాబుయాదవ్, చీఫ్ అడ్వయిజర్ రాజేశ్వర్రావు, ఎన్హెచ్ఆర్సీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, జిల్లా అధ్యక్షురాలు తులసి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డేగల శ్రీనివాస్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, డాక్టర్ బామిరెడ్డి నరసింహ తిరుపతి మాట్లాడారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి పట్టాభి రామారావు కేయూలో జాతీయ సదస్సు -
పోలింగ్ టు కౌంటింగ్
జనగామ/సంగెం : ఉమ్మడి వరంగల్జ ఇల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకుని పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పో లింగ్నుంచి లెక్కింపు, విజేతల ప్రకటన వరకు పాటించాల్సి న నియమ నిబంధనల మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. పోలింగ్ ఏజెంట్ల కూర్చునే విధానం కేంద్రంలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు కూర్చునే విధానంపై అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్ల ముఖాలను గుర్తుపట్టే విధంగా, పోలింగ్ ఏజెంట్ల వెసులుబాటును బట్టి పోలింగ్ అధికారుల వెనుక కూర్చోబెట్టాలి. ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో అధికారుల ఎదురుగా సీట్లు ఏర్పాటు చేయవచ్చని ఎన్నికల నిబంధనల్లో స్పష్టం చేశారు. స్టేషన్లో ఏజెంట్లకు తిరగడాటానికి అనుమతి ఉండదని, నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ● ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒంటి గంట వరకు ఆవరణలో ఉన్న ఓటర్లతో ఓటింగ్ నిర్వహిస్తారు. భోజనం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ● ఓటింగ్ హాల్లో లోపల ఉన్న ప్రతీవ్యక్తి చట్టపరంగా ఓటింగ్ రహస్యాన్ని కాపాడి, అందుకు సహకరించాలి. ఉల్లంఘించిన వారికి అధికారులు 3 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ● పోలింగ్ బాక్స్లోని వార్డు సభ్యుల తెలుపు, సర్పంచ్ గులాబీ రంగు బ్యాలెట్లను బయటకు తీసి వేర్వేరుగా ఉంచుతారు. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తైన తర్వాత సర్పంచ్ బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు. ● బ్యాలెట్ అకౌంట్ నమోదు, లెక్కించిన పత్రాల సంఖ్య, జారీ చేసిన పత్రాల మధ్య వ్యత్యాసముంటే ప్రత్యేకంగా నమోదు చేయాల్సి ఉంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే బ్యాలెట్ పత్రాలు, సంబంధిత రికార్డులను రిటర్నింగ్ అధికారి సీల్తో పాటు అభ్యర్థుల ఏజెంట్ల సీల్ వేసి భద్రపర్చాలి. ● ఫలితాలు సమానంగా వచ్చిప్పుడు లాటరీ ద్వారా తుది తీర్పు వెల్లడిస్తారు. ● అనంతరం గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అధికారులు అందజేస్తారు. ఎన్నికల వాయిదా, రద్దు జనగామ: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ బూత్ను గుంపులుగా కొంతమంది ఆక్రమించడం, అక్కడ జరిగిన పోలింగ్ ఫలితాన్ని నమ్మదగిన విధంగా నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడడం, లేదా ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆక్రమించి లెక్కింపు ప్రక్రియలో అలజడిగా మార్చిన క్రమంలో రిటర్నింగ్ అధికారి వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు నివేదిక అందించాలి. నివేదిక పరిశీలించిన సదరు కమిషనర్.. పరిస్థితులను బేరీజు వేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఓటింగ్ చెల్లనిదిగా ప్రకటించి, కొత్త తేదీని నిర్ణయించి రీపోలింగ్ ఆదేశాలు జారీ చేస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనలు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి. రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఫలితాల అనంతరం ఆయన నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం, స్థలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నుకోవాలి. నిర్ణయించిన రోజు సమావేశం ఏదైనా కారణాలతో జరగకుంటే మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిపై ఉంటుంది. సమావేశ ప్రారంభ సమయం నుంచి గంటలోపు సర్పంచ్తో కలిపి మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైనప్పుడే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సమావేశానికి రిటర్నింగ్ అధికారి అధ్యక్షత వహించి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్గా ఎన్నికై న వ్యక్తి పేరును గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారి నోటీసు విడుదల చేస్తారు. ఆ నోటీసు ప్రతిని ఎన్నికై న అభ్యర్థికి కూడా అందజేస్తారు. డిపాజిట్ గల్లంతు అంటే? ఎన్నికల్లో అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయిందని వార్తలు మనం వింటుంటాం. అసలు డిపాజిట్ దక్కడం అంటే ఏమిటో తెలుసుకుందాం. పోటీలో ఉన్న అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో 16 శాతం లేదా అంతకుమించి ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా సాధిస్తేనే అభ్యర్థికి డిపాజిట్ దక్కినట్లు. ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఓట్లు పోలైతే ఒక అభ్యర్థి 160 లేదా అంతకుమించి ఓట్లు సాధించాలి. ఒకవేళ దానికన్నా తక్కువ ఓట్లు సాధిస్తే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు పేర్కొంటారు. డిపాజిట్ దక్కిన అభ్యర్థికి నామినేషన్ సమయంలో జమచేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల డబ్బులు ఎన్నికల కమిషన్ ఖాతాలోకి వెళ్తాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎన్నికలు నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ సాయంత్రమే లెక్కింపు.. విజేతల ప్రకటన -
వదిన – మరిది మధ్య సవాల్
ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంకోతులను పట్టిస్తాం.. ఓట్లు కొట్టేస్తాంకురవి: మండలంలోని కంచర్లగూడెం గ్రామ సర్పంచ్ స్థానానికి వదిన – మరిది మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మూడ్ రజిత పోటీ చేస్తుండగా, ఆమె సమీప బంధువు (మరిది) బానోత్ రమేష్.. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ పడుతున్నారు. వారిద్దరు దగ్గరి బంధువులు కావడంతో వారిలో ఎవరికి ఓటు వేయాలో అర్థంకాని విచిత్ర పరిస్థితి నెలకొంది. కాగా, రజిత గతంలో అదే గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు.బానోత్ రమేష్ మూడ్ రజితగోమాతకు దండం పెట్టి.. ఆశీర్వాదం పొందికురవి: మండలంలోని తట్టుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రంగమ్మ.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు బుధవారం గోమాతకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట మండలంలో ఇల్లంద పోలింగ్ కేంద్రాన్ని ఎకో ఫ్రెండ్లీ కేంద్రంగా అందంగా, ఆహ్లాదకరంగా ఎన్నికల అధికారులు తీర్చిదిద్దారు. – వర్ధన్నపేటకొత్తగూడ: కోతుల బెడదను అరికడుతామని, తమకే ఓట్లు వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని పొగుళ్లపల్లిలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ముందుగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి కోతులు పట్టే బోన్లు తెప్పించాడు. అందుకు ధీటుగా కాంగ్రెస్ బలరుస్తున్న అభ్యర్థి.. కోతులను పట్టే వ్యక్తులనే దింపాడు. -
వరంగల్ రీజియన్ను అగ్రస్థానంలో నిలపాలి
హన్మకొండ: రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ను అన్ని ఫార్మాట్లలో అగ్రభాగంలో నిలపాలని అధికారులు, ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ –1 డిపోలో వరంగల్ రీజియన్ స్థాయి ప్రగతిచక్రం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. కేఎంపీఎల్, ఆదాయం తీసుకురావడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులను ఆర్ఎం విజయ భాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భాను కిరణ్, మహేష్ ప్రదానం చేశారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ వరంగల్ రీజియన్ రూ.8 కోట్ల లాభాల్లో ఉందని పేర్కొన్నారు. డ్రైవర్లందరు 6 కేఎంపీఎల్ సాధించి ఇంధన పొదుపులో, జీరో ఆక్సిడెంట్లో వరంగల్ రీజియన్ను అగ్రస్థానం నిలపాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్లోని 9 డిపోలకు చెందిన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం తీసుకొచ్చిన ఏడుగురు ఉద్యోగులు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి ప్రగతి చక్ర అవార్డులు అందించారు. రెండో త్రైమాసికంలో ఇంధన పొదుపులో 10 మందికి, అధిక ఆదాయం సాధించిన ఏడుగురు కండక్టర్లు, ముగ్గురు టిమ్ డ్రైవర్లు, ఐదుగురు హైర్ బస్ డ్రైవర్లు, ఉత్తమ మెకానిక్లుగా ఇద్దరికి, ఒక్క శ్రామిక్కు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్, హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.8 కోట్ల లాభాల్లో ముందు వరుసలో టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
రైతు సంఘం నిర్మాణానికి కలిసి రావాలి
వరంగల్ చౌరస్తా: బలమైన రైతు సంఘం నిర్మాణానికి కమ్యూనిస్టులు కలిసి రావాలని జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అనుభవ్ దాస్ శాస్త్రి పిలుపునిచ్చారు. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని ఓ హోటల్లో రెండురోజులుగా జరుగుతున్న సభలు బుధవారం ముగిశాయి. అఖిల భారత రైతు సమాఖ్య నాయకుడు డాక్టర్ సత్నాంసింగ్ అజ్నాల అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనుభవ్ దాస్ మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం దెబ్బతీస్తున్న నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బలమైన రైతు సంఘం నిర్మాణం కోసం ఏఐకేఎఫ్ – జేకేఎస్ సంయుక్తంగా ఏకీకరణ ఆలిండియా మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకే రైతు విధానం ఉండాలని, ఒకరికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల ఇతర భూమి ఉండేలా ల్యాండ్ సీలింగ్ చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 400 నదులు ఉన్నాయని, వాటిని అనుసంధానం చేయడం వల్ల పంటలకు నీటి కొరత ఉండదని చెప్పారు. జీడీపీలో సుమారు 21 నుంచి 26 శాతం వ్యవసాయరంగం భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బడ్జెట్లో కనీసం 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తూమాటి శివయ్య, కాటం నాగభూషణం, అజాత్ సింగ్, రమేష్ ఠాకూర్, కులదీప్ సింగ్, భూప్ నారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మే 12, 13, 14వ తేదీల్లో కిసాన్ మహా సభలు జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అనుభవ్ దాస్ శాస్త్రి -
చట్టాలను ఉల్లంఘించొద్దు
మహబూబాబాద్ రూరల్ : చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన వందరోజుల ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ క్యాంపెయిన్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లోనే బాల్యవివాహాలను నిరోధిస్తూ చట్టం వచ్చినప్పటికీ అది నేటికీ పూర్తిగా అమలుకు నోచుకోవట్లేదన్నారు. కొన్ని అలవాట్లు చట్టాలుగా మారుతాయని, మరికొన్ని అలవాట్లు సమాజానికి హానికరమైతే వాటిని నిషేధిస్తూ చట్టాలు వస్తాయని, అటువంటి వాటిలో బాల్య వివాహ నిషేధ చట్టం ఒకటని వివరించారు. జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టటానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వందరోజుల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఉచిత న్యాయ సేవల టోల్ ఫ్రీ నంబర్ 15100, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098, గడపగడపకూ అవగాహన, ప్రత్యేక శిక్షణ తరగతులు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని, న్యాయ సేవా సంస్థ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను జిల్లా జడ్జి ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతి మురారి, ఏ.కృష్ణతేజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చందర్, జిల్లా సంక్షేమ అధికారిని సబిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు, ప్రజలు పాల్గొన్నారు.న్యాయపరమైన రక్షణ రాజ్యాంగ హక్కుమహబూబాబాద్ రూరల్: ప్రతీ వ్యక్తికి జీవించే హక్కు, సమానత్వం, న్యాయపరమైన రక్షణ వంటి మౌలిక హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ సబ్ జైలులో బుధవారం ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జైళ్లలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటు, పారాలీగల్ వలంటీర్ల నియామకం ద్వారా ఖైదీలకు న్యాయసహాయం అందుతుందని వివరించారు. అండర్ ట్రయల్ ఖైదీల వివిధ సమస్యలు, కేసులు ఆలస్యం అవుతున్న అంశాలు, బెయిల్ అవకాశాలు, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా విడుదలకు అర్హత వంటి విషయాలను వివరించారు. న్యాయవాది లేకపోయినా ఖైదీలకు వెంటనే ఉచిత న్యాయవాది నియామకానికి దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేశారు. జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు న్యాయ, మానసిక, సామాజిక సహాయాన్ని అందించడానికి నల్సా రూపొందించిన స్పృహ అనే నూతన పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. షరతులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి గార్ల: కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తేమశాతం అధికంగా ఉందని కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. తాలు ఉందని లేనిపోని షరతులు పెట్టి మిల్లర్లు తరుగు తీస్తే ఊరుకునేది లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అలువాల సత్యవతి, ఇమ్మడి గోవింద్, పెద్దవెంకటేశ్వర్లు, ఈశ్వర్లింగం పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ శబరీష్ కేసముద్రం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీపీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆయన సందర్శించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకుబాటిళ్లు, ఆయుధాలు, పెన్నుల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు. ఓటర్లు క్యూ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజున ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు తమ ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి
సాక్షి, మహబూబాబాద్: పుట్టిన ఊరికి సర్పంచ్గా ఎన్నికై తే ఆ కిక్కే వేరు. బరిలో నిలిచి నువ్వా నేనా.. అని చివరి వరకు పోరాటం చేసి గెలవడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి.. మెప్పించి.. ఏకగ్రీవం కావడం అంటే ఆషామాషీ కాదు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులు, మరి కొన్నిచోట్ల నాయకుల సహకారంతో జిల్లాలో 43గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇప్పుడు సంతోష పడడం కాదు.. ముందుంది అసలైన కర్తవ్యం.. ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని చర్చ జరుగుతోంది. ఊరికి మాటిచ్చి.. గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అభ్యర్థులు, నాయకులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికోసం పోటీలో ఉన్నవారందరూ డబ్బుల ఖర్చుపెట్టేందుకు పోటీ పడ్డారు. ఇందులో అత్యధికంగా డబ్బులు ఇస్తామని చెప్పిన వారికి సర్పంచ్ పదవి అప్పగించారు. అదే విధంగా గ్రామాల్లోని కోతుల బెడద తీర్చడం, తండాలు, ఆదివాసీ గూడేలు, గ్రామాల్లో దేవాలయాలు కట్టించడం, అభవృద్ధి పనులు చేయించేందుకు అంగీకార పత్రాలు, బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. మరికొన్ని చోట్ల పోటీ పడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల్లో ఒక పార్టీకి సర్పంచ్, మరొక పార్టీకి ఉప సర్పంచ్ పదవి ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోని పోటీ పడిన వారికి వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, ఇతర పదవులు ఇస్తామని బుజ్జగించారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే చివరి వరకు పోటీలో ఉన్నవారిలో కొందరిని ఆర్థికంగా ఆశచూసి నామినేషన్ ఉసంహరించుకునేలా చేయాల్సి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. ఇలా ఊరికి, పోటీలో నిలిచి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్లపై ఉంటుంది.43 పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం.. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేయడం మొదలుకొని ఉపసంహరణ వరకు గ్రామాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నారు. జిల్లాలో 482 పంచాయతీలు, 4,110 వార్డులు ఉన్నాయి. ఇందులో మొదటి విడత 155జీపీలు, 1,338 వార్డులు ఉండగా.. ఇందులో 9పంచాయతీలు, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 158 పంచాయతీలు, 1,360 వార్డులకు గాను 15సర్పంచ్లు, 251వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడో విడతలో 169 గ్రామ పంచాయతీలు, 1,412 వార్డులు ఉండగా.. 19 పంచాయతీల సర్పంచ్లు, 272 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇలా మూడు విడతల్లో 43మంది సర్పంచ్లను, 768 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో 43 గ్రామ పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం పలుచోట్ల అభ్యర్థుల నానా తంటాలు డబ్బుల పంపిణీ, పనులపై హామీలు ముందుంది అసలు కర్తవ్యం -
యాక్షన్ ప్లాన్ రెడీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకుగాను 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగి పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు గాను 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకుగాను 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు గాను 4,550లు, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500లు, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు గాను 1,500 ఎకరాలకే ఈ సారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్లో యాసంగి పంటలకు సాగు నీరు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్ -
నేడే తొలి పోరు
146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్ మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈమేరకు బుధవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. గురువారం ఐదు మండలాల్లోని 146 గ్రామ పంచాయతీలు, 1,072 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. అందు కోసం పోలింగ్ కేంద్రాల్లో సామగ్రితో పాటు సిబ్బందికి విధులు కేటాయించారు. మొదటి విడతలో ఐదు మండలాలు.. మొదటి విడతలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 155 గ్రామ పంచాయతీలు, 1,338 వార్డులు ఉన్నాయి. కాగా, గత నెల 27నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 3న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 9జీపీలు, 266 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది, 1,072 వార్డుల్లో 2,391 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా మండలాల్లో 1,78,951 మంది ఓటర్లు ఉండగా.. 88,240 మంది పురుష ఓటర్లు, 90,701 మంది మహిళా ఓటర్లు, 10మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ.. మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మానుకోట మండలానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. 12 కౌంటర్లు ఏర్పాటు చేసి పీఓలకు, ఓపీఓలకు సామగ్రితో పాటు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. పంపిణీని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీంచారు. ఇనుగుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో, నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల, గూడూరు, కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయాల్లో సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తంగా 1,753 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి పీఓ, ఓపీఓలు 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్కు ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 201నుంచి 400మంది ఓటర్లు ఉంటే ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401నుంచి 650మంది ఓటర్లు ఉండే బూత్కు ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలను కేటాయించారు. వారితో పాటు 20 శాతం అదనపు సిబ్బందితో పాటు సామగ్రి కేటాయించారు. మొదటి విడతలో 1,621పీఓలు, 1,853 మంది ఓపీలను కేటాయించారు. వారితో పాటు సహాయంగా కేంద్రాల బయట కార్యదర్శులు, కారోబార్లు ఉంటారని తెలిపారు. 10 మంది మైక్రోఅబ్జర్వర్లు.. ఎన్నికల పోలింగ్ దృష్ట్యా 10మంది మైక్రో అబ్జర్వర్లు, వారితో పాటు ఆరుగురు రిజర్వు మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 122 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఐదు మండలాల్లో 49మంది రూట్ ఆఫీసర్లు, 15మంది జోనల్ అధికారులను కేటాయించారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహణ ఐదు మండలాలకు సామగ్రి పంపిణీ పూర్తి 1,621మంది పీఓలు, 1,853మంది ఏపీఓలకు విధులు 10 మంది మైక్రో అబ్జర్వర్లు.. 1,753బ్యాలెట్ బాక్స్లు సిద్ధం పంపిణీని పరిశీలించిన కలెక్టర్ ఉదయమే షురూగురువారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. వాహనాలను పంపిస్తున్న పోలీసులు -
ప్రైవేట్ ఆస్పత్రులపై ఆరా..
● అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం ● కొనసాగుతున్న అధికారుల విచారణ నెహ్రూసెంటర్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అబార్షన్ల సంఘటనలపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. అలాగే పలు ఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి దోషులను శిక్షించే పనిలో ఉన్నట్లు సమాచారం. వరుస సంఘటనపై రాష్ట్ర, జిల్లా అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తనిఖీలతోనే సరి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు, రోగులు మృత్యువాత పడడం, ఆందోళనలు పరిపాటిగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా సమాచారంతో ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు చేసిన సంఘటలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ పలుచోట్ల వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం తనిఖీలతోనే సరిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హతలేని వైద్యులు సైతం బోర్డులపై ఎండీలుగా రాసుకొని వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్లాట్ ఫాం నిర్మాణానికి కృషి
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికుల అవసరాల మేరకు మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో నాల్గో నంబర్ ప్లాట్ ఫాం మంజూరు జరిగేలా కృషి చేస్తానని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె రైలు ప్రయాణంలో తన చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫాం నిర్మాణం ప్రాముఖ్యతను ఆమె దృష్టికి తీసుకెళ్లగా రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు అయ్యేలా చూస్తానన్నారు. -
లెక్క తేలింది..
మహబూబాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. ప్రక్రియ ఆలస్యం కావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 169 సర్పంచ్ స్థానాలకు గాను 19జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 150 సర్పంచ్ స్థానాలకు 516 మంది బరిలో ఉన్నారు. 1,412 వార్డులకు గాను రెండు వార్డుల్లో నామినేషన్ల సమస్యతో ఎన్నికలు వాయిదా పడగా.. 272 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో.. జిల్లాలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో మూడో విడత జీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 169 జీపీలు, 1,412 వార్డులు ఉన్నాయి. ఈమేరకు ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తి చేశారు. కాగా ఈనెల 9న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. 17న పోలింగ్.. మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్ ఈనెల 17వ తేదీన ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు, అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. మూడో విడత జీపీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి 19 జీపీలు, 272 వార్డులు ఏకగ్రీవం 150సర్పంచ్ స్థానాల్లో 516 మంది అభ్యర్థుల పోటీ 1,138 వార్డులకు 2,869 మంది అభ్యర్థులు ఈనెల 17న పోలింగ్ -
ఏకగ్రీవ సర్పంచ్లు వీరే..
కురవి: జిల్లాలోని కురవి, సీరోలు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. సీరోలు మండలంలోని బీల్యాతండా, వస్రాంతండా, బూరు గుచెట్టు తండాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు వాంకుడోత్ ఆశా, బానోత్ కల్యాణి, బానోత్ శివ, కురవి మండలం బంజరతండాలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి బానోత్ రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మడగూడెం సర్పంచ్ ఏకగ్రీవం.. గంగారం: మండలంలోని మడగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈసం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవానికి కృషి చేసిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. మరిపెడ మండలంలో.. మరిపెడ రూరల్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మంగళవారం అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోగా.. మండలంలోని పర్కజలతండా (నేతావత్తండా) సర్పంచ్గా బానోతు కొండయ్య, ఉపసర్పంచ్గా గుగులోతు రాము, చింతలగడ్డతండా సర్పంచ్గా ఆంగోతు రజితరవీందర్, అజ్మీరతండా సర్పంచ్గా అజ్మీరా రవి, ఉపసర్పంచ్గా భూక్య కిషన్, ధరావత్తండా సర్పంచ్గా ధరావత్ తేజానాయక్, అమృనాయక్తండా సర్పంచ్గా ధరావత్ పద్మరూప్లాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో రెండు గ్రామ పంచాయతీలకు ఇద్దరు ఉపసర్పంచ్లు ఎన్నిక కాగా, మరో మూడు పంచాయతీలకు ఉపసర్పంచ్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సర్పంచ్లు ఎన్నిక కాగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అలాగే ఎలమంచిలితండాలో సర్పంచ్ అభ్యర్థి బానోత్ భద్రునాయక్, 6వార్డులు ఏకగ్రీవం కాగా, మరో రెండు వార్డుల్లో పోటీ నెలకొంది. ఆరు జీపీలు.. కొత్తగూడ: మండలంలో ఆరు గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా, బీఆర్ఎస్ మద్దతుదారులు ఉప సర్పంచ్లుగా తీర్మానం చేసుకుని మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించకున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కుంజ భిక్షపతి(కోనాపురం), ఆలూరి కిరణ్(సాదిరెడ్డిపల్లి), మాలోతు లక్ష్మి(రేణ్యతండా), వాసం నర్సమ్మ(ఎంచగూడెం), వంక రాములు (మొండ్రాయిగూడెం), పెనక సిరివెన్నెల(కార్లాయి)కు ఆయా క్లస్టర్ ఎన్నికల అధికారులు కలెక్టర్ అనుమతి రాగానే ఎంపిక పత్రాలు అందజేస్తామని తెలిపారు. -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మహబూబాబాద్: మొదటి విడత జీపీ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె మొదటి విడత ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 11న నిర్వహించే మొదటి ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటరు స్లిప్లు సమాచారం కోసమే అని, గుర్తింపు పత్రంగా పరిగణించొద్దన్నారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారే ఓటు వేయాలన్నారు. ఓటర్లు గుర్తింపు కోసం ఎపిక్ కార్డు (ఓటరు ఐడీ ), లేదా ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం.. ఇందులో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఏజెంట్ల ఎదుట మాక్పోలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ఐదు మండలాలు ఉన్నాయని, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీసీలో జిల్లా నుంచి ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్ బాబు, శ్రీనివాస్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రచారం కాదు.. పరీక్ష!
● ఓటు కావాలంటే బురదలో దిగాల్సిందే ● ఉదయం, సాయంత్రం పొలంబాట ● సర్పంచ్ అభ్యర్థుల వినూత్న ప్రచారంజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్ర చారం ఊళ్లలో కాదు.. పొలాల్లో దూసుకుపోతోంది. ఓటు అడగాలంటే బురదలో అడుగేయాలన్న ని బంధనలను అభ్యర్థులు అక్షరాలా అనుసరిస్తున్నా రు. రైతు తెల్లవారుజామున పొలాల్లోకి దిగితే, నేతలు వెంటపడి మట్టిలో మునిగిపోతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓ టు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వానాకా లం వరి కోతలు, పత్తి సేకరణ, అమ్మకాలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యోదయానికి ముందే రైతులు పనిముట్లు భుజాన వేసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సాయంత్రం వరకూ మట్టితో మమేకమైపోతున్నారు. దీంతో అభ్యర్థులకు మెజార్టీ ఓటర్లు దొరకడం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో గంట నుంచి రెండు గంటలపాటు పొలం గట్లకు కేటాయిస్తున్నారు. ఓటరు ఇంట్లో లేడా.. పొలంలో ఉన్నాడా.. అయితే మన ప్రచారం కూడా అక్కడికే అనే ఫార్ములాతో అభ్యర్థులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉదయం పది గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ఆ తర్వాత పొలం బాట పడుతున్నారు. బురదలో మునిగిన పొలం అంచుల్లో అభ్యర్థుల ప్రచార హడావుడి కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు రైతులతోపాటు బురదలోకి దిగుతూ.. గట్లను చదును చేయడం, నీటి కాల్వలు వదలడం వంటి పనులు చేస్తున్నారు. అన్నయ్య.. తాతా.. ఇదే మా గుర్తు, ఇదే మా మాట అంటూ చేతిలో బ్యాలెట్ పత్రం నమూనా పట్టుకుని బురదలో నిల్చున్న దృశ్యాలు ఈ ఎన్నికల్లో సాధారణం అయ్యాయి. రాజకీయాలు ఈసారి నిజంగానే మట్టిలో పుట్టి, మట్టిలోనే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నా అసలు హడావుడి పొలాల్లోనే కనిపిస్తోంది. రైతు పనుల్లో మునిగిపోయిన వేళ అభ్యర్థులు సైతం అతడి వెంటే నడుస్తున్నాడు. పొలంలో పనిచేస్తే ఓటు అన్నట్లు ఈసారి సర్పంచ్ అభ్యర్థుల ప్రచార శైలి రోజుకో కొత్త మలుపు తిరుతోంది. -
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్పోలింగ్ ఆకట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ బూత్వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా క్యూలో నిల్చోవడం, వారితో ఓటు వేయించడం.. ఓటేశాక బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో ఎలా వేయాలో.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. –వాజేడునీ ఓటు నాకే..సాధారణంగా ఎన్నికల్లో తాము గెలవడానికి అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తుంటారు. జనగామ జిల్లా చౌడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కర్ల పద్మ భార్గవరాంరెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ముక్క ఉమ మంగళవారం ప్రచారంలో ఎదురుపడ్డారు. ఒకరికి ఒకరు ఓటు వేయాలని చేతులు కలుపుతూ అభ్యర్థించడం చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ముసిముసిగా నవ్వుకున్నారు. – జనగామ రూరల్చికెన్ రెడీ ..మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. కొందరు అభ్యర్థులు ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ చికెన్ సెంటర్లో మాంసం ప్యాకింగ్ చేయిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మహబూబాబాద్ -
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు. సెల్టవర్ ఎక్కి రైతు ఆందోళనకేసముద్రం: కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తన ధాన్యాన్ని తరలించడం లేదంటూ ఓ రైతు సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని మహమూద్పట్నంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన రైతు ఎశబోయిన మురళి ఇదే గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తన ధాన్యం తీసుకొచ్చాడు. కాంటా పూర్తయినా తరలించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సమీపంలో గల సెల్టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని ఆ రైతుకు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. కాగా, సదరు రైతు తీసుకొచ్చిన ధాన్యానికి కాంటా వేశామని, తరలించేందుకు డీసీఎం కూడా వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. -
ఎవ్రీడే 90 ఎంఎల్..!
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డోర్ డెలివరీ -
అండర్–16 అంతర్ జిల్లాల విజేత వరంగల్
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన అండర్–16 అంతర్ జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి, మొగిలిచర్లలోని క్రీడా మైదానాల్లో ఐదు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఎంపిక పోటీలు నిర్వహించారు. వంగాలపల్లి మైదానంలో వరంగల్, ములుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరంగల్ విజయం సాధించి ఇంట్రాడిస్ట్రిక్ట్ చాంపియన్గా నిలిచింది. ఐదు జిల్లా జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 20 మందితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాబబుల్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘురామ్, నిజాముద్దీన్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ్వినయ్, ఆవాల వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
చిన్నగూడూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని టీఓటీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మంచ్యాతండా రైతువేదికలో రిటర్నింగ్ అధికారులకు ఆయన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ సుజాత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలు సింగారం, వీఎస్.లక్ష్మీపురంలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సైలు సతీష్, జయకుమార్, రూరల్ ఎస్సైలు దీపిక, రవికిరణ్, పోలీసు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని నేరడలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్ నిర్వహణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థినులతో హిందీపాఠం చదవించారు. పదో తరగతిలో అందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని ఎస్ఓకు సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.విజయకుమారి, ఎస్ఓ సరస్వతి తదితరలు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి దంతాలపల్లి: ఎన్నికల వేళ రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు డీఎస్పీ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్కుమార్, ఎంపీడీఓ విజయ, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం మహబూబాబాద్: మాజీ సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విజయ దివస్ కార్యక్రమం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగి దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నా రు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, సలీం, ఆసిఫ్, కిరణ్, అమీర్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబె ల్ ప్రైజ్డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి సుజాతతో కలిసి రిజి స్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్డే ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక,కవిత, మహేందర్ ఉన్నారు. విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్.. లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్లాల్, మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్హాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఇస్తారి తెలిపారు. -
రెండు వాడల మధ్య పోటీ!
హసన్పర్తి: మండలంలోని గంటూరుపల్లి గ్రామపంచాయతీలో అవతలి వాడ, ఇవతలి వాడల మధ్య పోటీ ఉంది. ఆయా వాడల్లో ఓట్లు మాత్రం పార్టీలకతీతంగా వేయడం ఆనవాయితీగా వస్తోంది. గంటూరుపల్లిలో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఇవతలి వాడలో 398 ఓట్లు, అవతలి వాడలో 304 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ చల్లా రాకేశ్రెడ్డి, అవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ సుంకరి రమాదేవి, కందుల ప్రశాంత్రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాకేశ్రెడ్డి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సుంకరి రమాదేవి, కుమారస్వామి అధికార పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు.కాగా, గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈవతలి వాడ, అవతలి వాడల నుంచి ఒక్కొక్కరే పోటీలో ఉండే వారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరి చొప్పున బరిలో నిలిచారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. -
తట్టెడు మట్టి పోయలేదు..
● శిలాఫలకానికి పూలు చల్లి నిరసన తెలిపిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కురవి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన సముదాయానికి వేసిన శంకుస్థాపన శిలాఫలకానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా సంవత్సరీకం కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ శిలాఫలాకానికి పూలుచల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యంగ్ ఇండియా సమీకృత గురుకుల సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తి అయినప్పటికీ తట్టెడుమట్టి పోయలేదని, ఒక ఇటుక పేర్చలేదని విమర్శించారు. అగ్రిమెంట్, పరిపాలన అనుమతులు కాలేదన్నారు. ఇది ప్రజాపాలన కాదని, దివాళాకోరు పాలన అని మండిపడ్డారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ కార్యాలయాల నిర్మాణాలపై లేదన్నారు. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి వదిలేశారని, ఇదే రోడ్డుపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ వెళ్తున్నారని ఇది కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ గ్లోబల్సమ్మిట్ ప్లాఫ్ అయిందని తెలిపారు. సమ్మిట్ స్టేజ్ మాత్రం కాంగ్రెస్ నాయకులతో నిండిందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ హాయంలో సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారని తెలిపారు. చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యేను చూస్తున్నామని, బండిమీద తిరుగుతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్రవి, బోడశ్రీను, బాదె నాగయ్య, నూతక్కి నర్సింహరావు, బాదావత్ రాజులక్ష్మి, కల్లెపు శ్రీను, గుగులోత్ నెహ్రూనాయక్ పాల్గొన్నారు. -
ముగిసిన ప్రచారం
● మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచారానికి తెర ● గ్రామాల్లో ప్రలోభాల ఎర ● నేటిరాత్రి అన్ని పార్టీలకు కీలకంఅన్ని పార్టీలకు కీలకం.. మొదటి విడత గ్రామ పంచాతీ ఎన్నికల ఫలితాల ప్రభావం మిగిలిన పంచాయతీలపై పడే అవకాశం ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మొదటి విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో జరగనుండడంతో.. అక్కడి ప్రజాప్రతినిధులకు తమ మద్దతుదారులను గెలిపించడం సవాల్గా మారింది. ఇందుకోసం ఎమ్మెల్యే మురళీ నాయక్, సీనియర్ నాయకులు భరత్ చందర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తమ మద్దతుదారుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రలోభాల పర్వం.. -
వ్యక్తి హత్య కేసులో నలుగురి అరెస్ట్
పలిమెల : మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు మహాదేవ్పూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పలిమెల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివారలు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల పంకెన గ్రామానికి చెందిన చిలుమలు రాజయ్య, చిలుముల సంతోశ్.. తమ తల్లి తరచూ అనారోగ్యం కావడానికి అదే గ్రామానికి చెందిన సోదరి బక్కయ్య కారణమని భావించారు. బక్కయ్య మంత్రాలు చేయడంతోనే తమ తల్లి అనారోగ్యానికి గురవుతోందని, అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమ బంధువులు పాగే శ్రీనివాస్, పాగే రామయ్యకు విషయం చెప్పగా వారు సరే అన్నారు. దీంతో నలుగురు కలిసి కలిసి గత నెల (నవంబర్) 25వ తేదీన రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బక్కయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పలిమెల పోలీసులు.. దర్యాప్తులో భాగంగా రాజయ్య, సంతోష్, శ్రీనివాస్, రామయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో పలిమెల ఎస్సై జె.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: మేడారం భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను సూచించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజియన్లోని అన్ని డిపోల మెకానికల్ సూ పర్ వైజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర–2026కు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర సమయంలో బస్సులు మరమ్మతులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల్లో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ మేనేజర్ ఎ.రవీందర్ పాల్గొన్నారు. సీపీని కలిసిన ఆర్టీసీ ఆర్ఎం.. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను టీజీ ఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కలిశారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో సీపీని మర్యాద పూర్వకంగా కలిసి మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. పోలీసు శాఖ ద్వారా సహకారం అందించాలని కోరుతూ లేఖ అందించారు. హనుమకొండ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు. -
వైద్యశిబిరాలు ఏర్పాటు చేయండి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ కురవి: గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జాతీయ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విరాజిత, సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
యాసంగి ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో వానాకాలం పంట కోతలు ముగుస్తుండడంతో యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాగా, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగి సాగు ప్రణాళిక రూపొందించడంతో పాటు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం ఆధారంగా వీటిని సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటలు నిండుగా ఉండడంతో అధికంగా పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరితో పాటు మొక్కజొన్న, ఆరుతడి పంటలు కూడా ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. 2,55,527 ఎకరాల్లో పంటలు.. జిల్లాలో యాసంగి సాగు జనవరి వరకు కొనసాగనుండగా.. ఇప్పటికే ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జనవరిలో వరి పంట సాగు చేయనున్నారు. మొత్తంగా 2,55,527 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు. 85,976 మెట్రిక్ టన్నుల ఎరువుల ప్రతిపాదన.. యాసంగి సాగుకు మొత్తం 85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో యూరియా 59,273.78 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3157.025 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1828.75 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20978.86 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 738.02 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలోనే 40 శాతానికి పైగా ఎరువులను యాసంగి పంటల సాగుకోసం అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరం... యాసంగి సాగు కోసం 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ద్ధం చేశారు. ఇందులో వరి విత్తనాలు 49,237 క్వింటాళ్లు, మక్కలు 5,056 క్వింటాళ్లు, జొన్నలు 71 క్వింటాళ్లు, వేరుశనగ 730 క్వింటాళ్లు, పెసర్లు 115 క్వింటాళ్లు, మినుములు 15.76 క్వింటాళ్లు, బొబ్బెర్లు 63 క్వింటాళ్ల మేరకు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. వరి తర్వాత.. మొక్కజొన్నకే ప్రాధాన్యం.. పంట కోతలు పూర్తవుతున్న పలు గ్రామాల్లో యాసంగి సీజన్ పనులను రైతులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పటికీ పలువురు రైతులు యాసంగిలో వరిపంటనే సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రెండో పంటగా మొక్కజొన్నకు ప్రాధాన్యత ఇస్తూ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీటికి తోడుగా ఎస్సారెస్పీ నీటి సరఫరాపై ఆశతో వరి సాగుతో పాటు మొక్కజొన్న సాగుకు ముందుకొస్తున్నారు. గతంలో యాసంగిలో వరిపంటతో పాటుగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాటు కోతుల బెడద కారణంగా ఆరుతడి పంటలను సాగు చేసేందుకు భయపడుతున్నారు. 2,55,527 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా 85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు, 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు పంట ఎకరాలు వరి 16,4124 మొక్కజొన్న 84,261 పెసర 2,879 మినుములు 394 జొన్న 1,565 వేరుశనగ 1,043 బొబ్బెర 1,261 -
ఎన్నికలపై నిరంతర నిఘా
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో మంగళవారం ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపులుగా ఉండడం పూర్తిగా నిషేధమని చెప్పారు. సెన్సిటివ్, హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు పికెటింగ్, వీడియో రికార్డింగ్, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్ పరిసరాల్లోకి ప్రచార సామగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ చిహ్నాలు తీసుకురావొద్దన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ సెంటర్లకు తరలిస్తామన్నారు. ఆయా ప్రాంతాలన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. అన్నిచోట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల రాకపోకలు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఉద్రిక్తత, ప్రజలు గుంపులుగా ఉండడం, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడని ఆదేశించారు. ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, మొత్తం 1,000 మంది పోలీసు సిబ్బంది మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని పౌరులు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించి ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు. -
బాక్సుల్లో మందుల్లేవు!
తొర్రూరు: ప్రయాణికుల భద్రతే లక్ష్యం, వారి సంఖ్య పెంచడమే ధ్యేయమని చెప్పే ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బస్సుల్లో బాక్సులు ఏర్పాటు చేసినప్పటికీ దానిలో మందులు ఉండడం లేదు. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ఏ బస్సులో మందులు కనిపించడం లేదు. మహబూబాబాద్, తొర్రూరు డిపోల్లో 175 బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో పేరుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నా వాటిలో మందులు పెట్టడం లేదు. ఖాళీగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో బాక్సులను ఏర్పాటు చేసింది. ప్రమాద వేళల్లో వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నా అందులో మందులు కరువై ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రథమ చికిత్స అందడం లేదు. రవాణా శాఖ అధికారులు బస్సులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాత్రమే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అందులో మందులు ఉంటున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. దీంతో బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేసే బాక్సులు అలంకార ప్రాయంగా మారాయి. కిట్లో ఇవి ఉండాలి.. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ బస్సులో ప్రథమ చికిత్స బాక్సులు ఉండాలి. అందులో ప్రథమ చికిత్సకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేయాలి. కిట్లో దూది, టించర్, బ్యాండేజీలు, గాయాలైనప్పుడు కట్టే క్లాత్, గాయాలకు సంబంధించిన ఆయింట్మెంట్ ఉండాలి. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ ఎయిడ్ కిట్లోని మందులను మార్చాలి. ఇది రవాణా శాఖ ప్రాథమిక నిబంధన. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్బాక్సులు ఏర్పాటు చేయడంతో పాటు మందులు ఉండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సుల్లో క్షతగాత్రులకు అందని ప్రథమ చికిత్స కొత్త బస్సులకే కిట్లు పరిమితం మందులు లేకపోవడంతో తప్పని ఇబ్బందులు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు -
హాస్టల్ వసతి కల్పించాలి..
కేయూ క్యాంపస్ : హాస్టల్ వసతి కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం క్యాంపస్లోని పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతి కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికే పలుమార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికై నా వెంటనే వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేసినా పట్టించుకోలేదు. ఉదయం 11.30 నంచి సాయంత్రం 6గంటల వరకు ఆందోళన కొనసాగించారు. మరోసారి రిజిస్ట్రార్ రామచంద్రం.. పలువురి విద్యార్థులను చాంబర్కు పిలించుకుని మాట్లాడారు. వీసీ ప్రతాప్రెడ్డి మంగళవా రం యూనివర్సిటీకి రానున్నారని, ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. సమస్యను వీసీ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఇప్పుడు హాస్టల్ వసతి కల్పిస్తామని స్ప ష్టంగా ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని, లేనిపక్షంలో కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. స్టా లిన్, రంజిత్కుమార్, సందీప్, అరుణ్, రాకేశ్రెడ్డి, శ్రీను, ఆదిత్య, రోహిత్, ప్రదీప్, శివాజీ, యాకూ బ్, దిశా,రణధీర్, శరత్ పాల్గొన్నారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థుల డిమాండ్ పరిపాలన భవనం వద్ద ధర్నా -
వరంగల్లో 22.45 శాతం డ్రాపౌట్స్!
● కాకతీయ వర్సిటీ, రెండు కళాశాలల అభివృద్ధికి రూ. 56 కోట్లు.. ● లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ జిల్లాలో సెకండరీ విద్య స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ (బడి మానేయడం) రేటు ఆందోళనకరంగా ఉందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఏకంగా 22.45 శాతం డ్రాపౌట్ రేటు నమోదైనట్లు సోమవారం లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేంద్రం పలు నిధులను మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీతో పాటు హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కలిపి పీఎం ఉషా కింద మొత్తం రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ – క్వాలిటీ ఇంప్రూవ్మెంట్’ కింద కాకతీయ వర్సిటీలో పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు రూ. 50 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద కాకతీయ వర్సిటీలో ఒక బాలుర (150 సామర్థ్యం), ఒక బాలికల (300 సామర్థ్యం) హాస్టల్ నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరయ్యాయి. అంతేగాక జాతీయ విద్యా విధానం2020 అమలులో భాగంగా వరంగల్ జిల్లా నుంచి 16 పాఠశాలలను ‘పీఎం శ్రీ’ పథకం కింద అప్గ్రేడ్ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. డిసెంబర్ 8వ తేదీ (సోమవారం) యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ (06569) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు మంగళవారం చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 10వ తేదీ( బుధవారం)న హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు (06570) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు గురువారం చేరుకుని వెళ్తుంది. ఈ రెండు రైళ్ల సర్వీస్లకు యెలహంక, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, భోపాల్, బీనా, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. జాతరకు సహకరించాలి హన్మకొండ: మేడారం జాతరకు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజ యభాను కోరారు. ఈ మేరకు సోమవారం ములు గు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ కిషన్ జాదవ్ను ములుగులో కలిశారు. ఈ సందర్భంగా 2026 మేడారం జాతరపై వారితో చర్చించారు. ఆర్టీ సీ ఏర్పాట్లను వివరించారు. జాతరకు వచ్చే భక్తులు, సిబ్బందికి చేయాల్సిన ఏర్పాట్లు, ఆయా శాఖల ద్వారా అందించాల్సిన సహకారం గురించి చర్చించారు. సమన్వయం, సహకారంతో ముందుకెళ్తామని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవి చందర్ పాల్గొన్నారు. -
అవినీతి జలగలు!
ప్రజల రక్తం పీల్చుతున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు వరంగల్ క్రైం : అవినీతి జలగలు( ప్రభుత్వ ఉన్నతాధికారులు) ప్రజల రక్తం పీల్చుతున్నాయి. ప్రజ లకు హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలకు అ డుగడుగునా కప్పం కట్టాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్ప డితే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేద్దామనుకుంటే పై న ఇంకా పెద్ద తిమింగలాలు ఉంటున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుంటే మరోపక్క అవినీతి పరులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. స్టాంప్ అండ్ రిజిస్టేషన్స్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, విద్యు త్, మున్సిపాల్, ఎకై ్సజ్, విద్య, వైద్యారోగ్య శాఖల్లో అవినీతికి తావున్నప్పటికీ దాడులు కొన్ని శాఖలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులను పట్టుకున్నా లంచం తీసుకోవడానికి ఏమ్రాతం వెనుకడుగు వేయడం లేదు. ఫలితంగా కొన్ని శాఖల్లో అవినీతి హక్కుగా మారుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్టీఏ, రెవెన్యూ, రిజిస్టేషన్ శాఖల్లో ప్రతీ ఫైల్కు లెక్కను పక్కాగా ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఎవరైనా, ఎక్కడైనా ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే అనే స మాధానం ఎదురవుతోంది. దీనిని బట్టి అవినీతి ప్ర భుత్వ శాఖల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమవుతోది. ఈ క్రమంలో మంగళవారంతో అవి నీతి నిరోధక వారోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఏసీబీకి పట్టుబడిన అధికారులపై ‘సాక్షి’ కథనం పట్టుబడుతున్న అవినీతి అధికారులు.. చాలా మంది ప్రభుత్వ అధికారుల అవినీతి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. బాధితులు.. అవినీతి అధికారుల వేధింపులు భరిస్తూనే వారి డిమాండ్లు నెరవేరుస్తున్నారు. ఏసీబీ అధికా రుల ఫిర్యాదు చేస్తా తప్ప దాడులు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. గతంలో అవినీతికి పాల్పడిన అధికారులను హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించే వారు.అయితే వ రంగల్లో ఏసీబీ కోర్టు ఏర్పాటు కావడంతో ఇక్కడే హాజరపరుస్తున్నారు. కాగా, అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కితే బాధితులు సంబురాలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి అవినీతి అధికారుల డిమాండ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతోంది. ● ఈనెల 5న ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.లక్ష డిమాండ్ చేసి రూ. 60 వేలు ఒప్పందం కుదుర్చుకున్న హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది గౌస్, మనోజ్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు చేయగా రూ. 30 లక్షలు నగదు లభించింది. వెంకట్రెడ్డి అవినీతి అధికారులకు పట్టుపడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. ● ఈ ఏడాది జనవరి 6న మహబాబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ కర్రి జగదీశ్.. పీడీఎస్ బియ్యం వ్యాపారి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అప్పటికే రూ. 2 లక్షలు తీసుకున్నారు. మరో రెండు లక్షల కోసం చూస్తుండగా ఏసీబీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించింది. ● ఫిబ్రవరి 6న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై, పలు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విలువల ప్రకారం రూ. 5 కోట్లపైబడే అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ● ఈఏడాది మార్చి 20న స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ.. గిఫ్ట్ రిజిస్టేషన్ కోసం ఓ ప్రైవేట్ ఉద్యోగి ద్వారా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సె ప్టెంబర్ 1న తన బ్యాంకు లాకర్లో రూ. 6 లక్షలు లభిస్తే వాటికి లెక్కలు చూపకపోవడంతో ఏ సీబీ అధికారులు మరోసారి రామకృష్ణపై ఆదా యానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ● జూన్ 13న జనగామ జిల్లా ఆర్అండ్బీ శాఖలో ఓ కాంట్రాక్టర్కు బిల్లు మంజూరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా ఈఈ చిలుకపాటి హుస్సేన్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ● ఆగస్టు 23న మహబాబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఎకై ్సజ్ కేసులో ఇన్స్పెక్టర్ భూక్య రాజేశ్, కానిస్టేబుల్ ధరావత్ రవి.. బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ● నవంబర్ 21న జనగామ జిల్లా పాలకుర్తి సబ్ డివిజన్ మిషన్ భగీరథ డిప్యూటీ ఇంజనీర్ కూనమళ్ల సంధ్య(డీఈ).. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ● నవంబర్ 28న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర్ తహసీల్దార్ వీరగంటి మహేందర్.. గిఫ్ట్ రిజిస్టేషన్ విషయంలో రూ. 10 వేల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. ఇదే కేసులో ప్రైవేట్ డ్రైవర్ తుప్పరి గౌతంను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంవత్సరం కేసులు 2020 7 2021 7 2022 9 2023 11 2024 18 2025 19 పెరుగుతున్న ఏసీబీ దాడులు.. అయినా మారని తీరు ఇప్పటికే 19 కేసులు నమోదు.. హక్కుగా మారుతున్న అవినీతి నేటితో అవినీతి నిరోధక వారోత్సవాలు ముగింపుప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. హక్కుగా లభించే పనులకు లంచం ఇవ్వొద్దు. అవినీతి అధికారుల సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులపై ట్రోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నంబర్ 9154388912కు ఫిర్యాదు చేయాలి. – పి. సాంబయ్య డీఎస్పీ, ఏసీబీ -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి మైసమ్మ చెరువులో పడి గల్లంతైన విద్యార్థి భూక్య సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. ఈనెల 6వ తేదీ ఉదయం మైసమ్మ చెరువులో ఈతకెళ్లి సాయికిరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, విద్యార్థి గల్లంతైన సమయంలో అతడితోపాటు వచ్చిన విద్యార్థుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రూరల్ సీఐ సర్వయ్య ఎస్సైలు దీపిక, రవికిరణ్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శని, ఆదివారాల్లో 48 గంటల పాటు విద్యార్థి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాక వారితోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మర గాలింపు చేపట్టగా సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించా రు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కాగా, ఎన్నో ఆశలతో సాగాల్సిన సాయికిరణ్ జీవితం అర్ధంతరంగా ఆవిరైపోయిందని తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
ఓటర్లకు డబ్బులిచ్చినా... భయపెట్టినా నేరమే..
విచారణలో నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానాపాలకుర్తి టౌన్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని డబ్బులు, మద్యం పంచడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి ప్రలోభాలకు పాల్ప డుతుంటారు. ఇలా చేస్తే నేరానికి పాల్పడినట్లే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)–2023 ప్రకారం.. ఎన్నికల సమయంలో నేరానికి పాల్పడిన వారికి సెక్షన్ 169 నుంచి 177 వరకు శిక్షలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను బెదిరించడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం, వైరంతో కూడిన ప్రచారం చేయడం కూడా నేరమే. ఇవి నిరూపణ అయితే ఏడాది జైలు శిక్ష పడుతుంది. చనిపోయిన వారి పేరుపై ఓటు వేయాలని ప్ర యత్నించడం, మారుపేరుతో ఓటు వేయడం, లేదా ఒకసారి ఓటు వేశాక.. మరోసారి వేయాలని ప్రయత్నించడం, దొంగ ఓట్లు వేసేలా ఇతరులను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తే, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది. ఫలితాలను ప్రభావితం చేసేలా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వ్యక్తిత్వం గురించి అబద్ధపు ప్రకటనల (వివాహేతర సంబంధాలున్నాయని, అతను స్మగ్లర్ అని, మంచి వాడు కాదని, అతను ఒక కుల, ఒక మతం వాడని, లాంటిచర్యలు)తో ప్రచారం చేయడం నేరం. నిరూపణ అయితే జరిమానా విధిస్తారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చులు సంబంధిత అధికారులకు సమయంలోపు చూపించాలి. లేకపోతే రూ. 500 వరకు జరిమానా విధిస్తారు. ఎన్నికల సమయంలో నేరాలు జరినట్లు ఆధారాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే అవసర మైతే కేసు నమోదు చేస్తారు. కేసు నిరూపణ అయితే అభ్యర్థిపై అనర్హత వేటు పడడంతోపాటు, చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశముంది.ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు ఆశ చూపి, మద్యం, బియ్యం, వస్త్రాలు, ఇతర వస్తువులు, బహుమతులు ఇచ్చి ఓటు అడగడం నేరం.ఈ నేరం నిరూపణ అయితే ఏడాది జైలు, జరిమానా విధిస్తారు. -
ధాన్యం రాశులతో మార్కెట్ కళకళ
మార్కెట్ కవరు షెడ్డులోని ధాన్యం రాశులు ● నేడు కొనుగోళ్లు బంద్ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం రైతులు తీసుకొచ్చిన ధాన్యం రాశులతో కళకళలాడింది. 4,026 క్వింటాళ్ల ధాన్యం (6,193 బస్తాలు) కొనుగోళ్లు చేయగా.. కాంటాల్లో ఆలస్యమైంది. కాగా వ్యాపారస్తుల కోరిక మేరకు మంగళవారం ధాన్యం కొనుగోళ్లకు బంద్ ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. బుధవారం యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. -
అంధులకు ప్రత్యేక సౌకర్యాలు
జనగామ: పోలింగ్ కేంద్రాల్లో అంధులు, ఆశక్తులైన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంధత్వం లేదా శారీరక బలహీనతల కారణంగా స్వయంగా బ్యాలెట్ పేపర్పై గుర్తు చేయలేని ఓటర్లు, 18 ఏళ్లకు తక్కువ కాకుండా ఉన్న ఒక సహచరుడిని ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే, అదే వ్యక్తి ఒకే రోజు, మరెక్కడా ఏ ఇతర ఓటరుకు సహచరుడిగా ఉండకూడదు. సహచరుడు వేసి ఓటుకు సంబంధించి రహస్యంగా ఉంచుతామని నమూనా–22 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. అన్ని కేసుల వివరాలు నమూనా–23లో నమోదు చేసి రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. కంటి చూపు బలహీనంగా ఉన్న ఓటర్లు స్వయంగా గుర్తు చేయగలరా అనే అంశాన్ని పోలింగ్ సిబ్బంది ప్రశ్నించొచ్చు. కానీ, పోలింగ్ సిబ్బందే సహచరులుగా వ్యవహరించొద్దు. బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ అందుబాటులో ఉన్న పోలింగ్ స్టేషన్లలో సహచరుడికి అనుమతి ఉండదు. జనగామ: ఎన్నికల నిర్వహణ నియమావళి–2018లోని 25 (2)వ నియమం ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వినియోగించేకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది తమ సొంత గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో పనిచేయలేని సమయంలో ఫారం–15 (అనుబంధం 21) ద్వారా సాధారణ పోలింగ్ స్టేషన్లోనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందిన పక్షంలో (అనుబంధం 22) ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం జారీచేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రంపై సంతకం తీసుకొని, ఓ టర్ల జాబితా మార్కు చేసిన కాపీలో వారి పేరు ఉంటే సాధారణ ఓటరు తరహాలోనే ఓటు వేయడానికి అనుమతిస్తారు. అంతేకాకకుండా అన్ని పోలింగ్ కేంద్రాల సిబ్బంది ఈడీసీ కాకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. తమ సొంత మండలంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడంపై ఎలాంటి అభ్యంతరం ఉండదని ఎన్నికల శాఖ తెలిపింది. జనగామ: పోలింగ్ ప్రారంభం ఆలస్యమైనా, నిర్ణీత సమయానికే పోలింగ్ ముగించాలి. అయితే ముగింపు సమయానికి కేంద్రం వద్ద ఉన్న ఓటర్లందరికీ ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలి. ముగింపు సమయానికి కొద్ది నిమిషాల ముందు క్యూలో ఉన్నవారికి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. క్యూలో చివరి వ్యక్తి నుంచి మొదలుకొని వరుస సంఖ్యలతో స్లిప్పులు పంపిణీ చేసి, వారు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగించాలి. ముగింపు సమయం అనంతరం కొత్తగా ఎవరూ క్యూలో చేరకుండా పోలీసు, ఎలక్షన్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలి. నిర్ణీత ముగింపు సమయం తర్వాత క్యూలో ఉన్న వారంతా ఓటు వేసిన వెంటనే పోలింగ్ ముగిసినట్లు ప్రకటించాలి. ఆ ప్రకటన తర్వాత ఎవరిని ఓటు వేయనియొద్దు. -
పీఆర్సీ అమలు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలతో పాటు పీఆర్సీ అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం మండల ప్రధానకార్యదర్శి సారెడ్డి లింగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్, వివిధ మండలల అధ్యక్షులు యాకయ్య, విద్యాసాగర్, నాయకులు గోవర్ధన్, ప్రసాదరావు, మురళి, శ్రీనివాస్ కార్తీక్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు. 11న మార్కెట్కు సెలవు కేసముద్రం: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈనెల 11న కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 12 తేదీన మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంతొర్రూరు: నేషనల్ యూత్ వలంటీర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సోమవారం తెలిపారు. పదో తరగతి అర్హత కలిగిన ఉమ్మడి జిల్లాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ స్వచ్ఛంద సేవకు ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేల ప్రోత్సాహకం అందుతుందన్నారు. ఎంపికై న యువ వలంటీర్లు క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్య, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజలను చైతన్యపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు http://nyks.nic.in/ NationalCorps/nyc.html వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు మహబూబాబాద్ రూరల్ : యువకులు గంజాయి, డ్రగ్స్ వినియోగంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. జాగృతి పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాజగోపాల్ కాలనీలో మంత్రాలు, మూఢనమ్మకాలు, ఆన్లైన్ గేమింగ్, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై సోమవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ.. వృద్ధులైన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. 1930 సైబర్ టోల్ నంబర్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై షేక్ షాకీర్, జిల్లా పోలీసు కళాబృందం సభ్యులు పృథ్వీ రాజ్, సత్యం, తిరుపతి, తారాసింగ్, పోలీసు స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రైల్వే డిపోను మానుకోట లోనే ఏర్పాటు చేయాలినెహ్రూసెంటర్: రైల్వే మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న డిమాండ్చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పార్టీ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మానుకోట వెనుకబాటుకు గురవుతుందని, నాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నేడు రై ల్వే మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. వేలాది మంది నిరుద్యోగులు ఉన్న మానుకోటలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. మె యింటెనెన్స్ డిపో సాధించే వరకు అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు సాగించాలని పిలుపుని చ్చారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి డిపో తరలించకుండా అడ్డుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి రవి, సత్యం, జగత్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. -
ఎంజీఎంలో గందరగోళం!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వానస్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లులు చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా సర్జికల్, మెడికల్ టెండర్స్తో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సేవలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. 20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల్లో రోగులకు ఔషధాలు అందించడం కీలకం. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలను సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలం కావడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పా టు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు. స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా? ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు అందించే విషయంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకమే. ఈ విభాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను సైతం పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు. ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్ ఎంజీఎం ఆస్పత్రిలో మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్స్ అధ్వానస్థితిలో పేషెంట్కేర్ సేవలు పట్టించుకోని పాలనాధికారులు -
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..
ఈదులపూసపల్లి రోడ్డు వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలో అనుమతులు లేని ఓ ప్రైవేట్ పాఠశాలపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖ అధికారులు అసలు స్పందించడం లేదు, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ మూముళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. యాజమాన్యం మా వెనుక పోలీస్ బలం ఉంది, విద్యాశాఖ అధికారులు మేము చెప్పినట్టు వింటారు అంటూ బెదిరిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – గూగులోతు సూర్య ప్రకాశ్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు -
ఉత్సాహంగా బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్లో సోమవా రం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భోగి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే క్రీడల్లో లక్ష్యం సాధిస్తారన్నారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 90 క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హనుమకొండ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు, బాక్సింగ్ సంఘం జిల్లా ప్రతినిధులు పెద్దమ్మ, నర్సింహరాములు, స్విమ్మింగ్ సంఘం జిల్లా కార్యదర్శి మంచాల స్వామిచరణ్, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం శోభారాణి, పీడీ శ్రీధర్రావు, సెలక్షన్ కమిటీ కన్వీనర్ శీలం పార్థసారధి, బాక్సింగ్ అఫిషియల్స్ శ్యాంసన్, జీవన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేకుండా అడ్మిషన్లు
మహబూబాబాద్ అర్బన్: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఏటా ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. పలువురు అనుమతులు తీసుకోకుండా విద్యాసంస్థలను నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆకర్షణీయమైన బ్యానర్లు, పోస్టర్లు వేసి పెద్దఎత్తున అడ్మిషన్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో చాలా ప్రైవేట్ స్కూ ళ్లు ప్రభుత్వ గుర్తింపు లేకుండా వెలిసినా.. బయటపడ్డవి కొన్ని మాత్రమే. అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో అనుమతులు లేని పాఠశాలలు వెలు గులోకి రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. విద్యార్థులతో చెలగాటం.. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ యూడైస్ నిబంధనలు ప్రకారంపేర్లు నమోదు కాకపోతే, వారు విద్యాశాఖ లెక్కలోకి రారని, ఆ విద్యార్థులకు హాల్ టికెట్లు రావని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతులు లేకుండా కొనసాగుతోంది. ఇందులో పదో తరగతి విద్యార్థులు సుమారు 29 మంది చదువుతున్నారు. అయితే నవంబర్లో యూడైస్లో వివరాలు కనిపించకపోవడంతో ఆ విద్యార్థులందరూ టీసీలు తీసుకొని అనుమతులు ఉన్న మరో పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆ పాఠశాలలో ఇప్పటికే 130 విద్యార్థులు చదువుతున్నారని, అడిషనల్ సెక్షన్ అనుమతి లేదని తెలిసింది. అలాగే ముత్యాలమ్మ గూడెం, కృష్ణకాలనీలో అడిషనల్ సెక్షన్కు అనుమతులు లేని మరో రెండు పాఠశాలల్లో 230మందికి పైగా పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారని సమాచారం. ఇలా అనుమతులు లేని పాఠశాల, అడిషనల్ సెక్షన్కు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారని, విద్యార్థుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల జీవితాలతో యాజమాన్యాల చెలగాటం యూడైస్లో వివరాలు కనిపించకపోవడంతో మరో స్కూల్లో చేరిన విద్యార్థులు మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు యూడైస్ ప్రమాణికం.. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్)లో ప్రతీ విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది.. వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. కాగా యూడైస్ను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన వివరాలు యూడైస్లో లేకుంటే వార్షిక పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.


