Mahabubabad District News
-
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
మామునూరు : కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ జీ అన్నారు. బుధవారం వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వ్యవసాయం– రైతు కార్యశాల’ కార్యక్రమం నిర్వహించారు. చంద్రశేఖర్ తివారీ జీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో విశ్వాసం– అభివృద్ధి– ప్రజా సంక్షేమం– వ్యవసాయ రంగంలో స్వర్ణయుగానికి నాంది పలికిందని కొనియాడారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక లాభాలు పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతో దోహద పడుతుందని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. బీజేపీ నేతలు గౌతమ్రావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అజ్మీరా సీతారామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, రాజేశ్వర్రావు, అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, వన్నాల వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు నిషిధర్రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, రాజమౌళి గౌడ్, చాడ శ్రీనివాస్రెడ్డి, జలగం రంజిత్, కుసుమ సతీశ్, భాకం హరిశంకర్, నరేశ్, బన్న ప్రభాకర్, ప్రతాప్, పుల్లారావు, మంజుల రెడ్డి, గందె నవీన్, కన్నయ్య, రమ్య, రైతులు పాల్గొన్నారు రైతు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట బీజేపీ రాష్ట్ర (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ జీ -
క్రీడా పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు
వరంగల్ స్పోర్ట్స్ : ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన ‘క్రీడా పాఠశాల.. నిర్వహణ ఎలా?’ అనే కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. హనుమకొండ కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ రవి బుధవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని క్రీడా పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన 80 మంది విద్యార్థులకు తగిన ఏర్పాట్లు వేగవంతం చేయాలని డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను ఆదేశించారు. విద్యార్థులకు అదనపు గదుల కోసం ఇప్పటికే స్టేడియంలో క్రీడా సంఘాల ఆధీనంలో ఉన్న గదులను ఖాళీ చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యే విద్యార్థులు శిక్షణతో పాటు విద్యను కూడా ఒకే ప్రాంగణంలో పొందేలా స్టేడియం లోపలే పాఠశాల, హాస్టల్, భోజనశాల తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం స్టేడియంలోని గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత తదితర అంశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి.. స్కూల్ ప్రారంభానికి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ స్పోర్ట్స్ స్కూల్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, విద్య, వసతి ఒకేచోట అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. స్పోర్ట్స్స్కూల్ను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి క్రీడా సంఘాల ఆధీనంలోని గదులు ఖాళీ చేయాలని ఆదేశం -
ఎంజీఎం సూపరింటెండెంట్ ఎవరు?
కాశిబుగ్గ: వరంగల్లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో (ఎంజీఎం) కొత్త సూపరింటెండెంట్గా ఎవరిని నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పది రోజుల దాటినా పోస్టును భర్తీ చేయకపోవడంతో ఆస్పత్రిలో పాలన గతి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దికై ్కన ఈ ఆస్పత్రిపై ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎంజీఎం మరో కొన్ని నెలల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ భవనంలోకి మారనున్న ఈ సమయంలో సూపరింటెండెంట్ పోస్టు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టు కోసం రోజుకో సీనియర్ వైద్యుల పేరు వినపడుతున్నా భర్తీకి నోచుకోవడం లేదు. ఓ ఇద్దరు సీనియర్ వైద్యులు ఎంజీఎంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసినా వారికి ఎందుకో అవకాశం లభించలేదని తెలుస్తోంది. ఎంజీఎంలో నిలిచిన పేమెంట్స్.. ఇంత పెద్ద దవాఖానాకు వివిధ పనుల కోసం ఎన్నో ఖర్చులు ఉంటాయి. అయితే వాటికి సకాలంలో పేమెంట్స్ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చేసిన పనులు, అత్యవసర పనులు, ఇంకా చేయాల్సిన పనుల కోసం ఎంజీఎంలో చెల్లించడానికి ఎవరికీ అధికారం లేదు. ఇలాంటి వాటికి డబ్బులు ఎలా ఇవ్వాలంటూ అధికారులు సతమతమవుతున్నారు. చెక్ పవర్ లేక అధికారులకు ఆర్థిక ఇబ్బందులు.. సాధారణంగా చెక్ పవర్ సూపరింటెండెంట్కు ఉంటుంది. అయితే పది రోజుల నుంచి సూపరింటెండెంట్ లేకపోవడంతో అధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. డబ్బులు చెల్లించనిదే పనులు కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఆస్పత్రికి సంబంధించిన చెల్లింపులు ఎలా చేయాలో అర్థం కాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు లేకపోవడంతో చెక్ పవర్ కూడా అందని పరిస్థితి నెలకొంది. పైసలు లేకుండా ఆస్పత్రిని ఎలా నడిపించాలో, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో కొత్త సూపరింటెండెంట్గా ఎవరూ వస్తారో వేచిచూడాల్సిందే. ? ఆస్పత్రికి అవసరమైన వివిధ మందుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఏ మందులు కొనాలన్నా సూపరింటెండెంట్ అనుమతి తీసుకోవాలి. అలాగే ల్యాబ్ అవసరమైన కెమికల్స్ కోసం ఉన్నతాధికారి పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఉన్నతాధికారి లేకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ సిబ్బంది వాపోతున్నారు. దీంతో పేషెంట్లకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ స్టోర్లో ఉన్న మందులతోనే సరిచేయడం తప్ప కొత్తవి కొనుగోలు చేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పేషెంట్లకు అరకొర మందులు దిక్కవుతున్నాయి.ఎంజీఎంలో తరచూ ఏదో ఓ పరికరాన్ని మరమ్మతు చేయాల్సి వస్తోంది. దీంతో అధికారుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాని దుస్థితి నెలకొంది. ప్రైవేట్గా పరికరాల మరమ్మతు చేసినప్పుడు సదరు వ్యక్తులకు పేమెంట్స్ చేయకపోతే వారు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ రిపేర్ కోసం రమ్మంటే రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ఎంజీఎం అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ మరమ్మతు చేయిస్తే, డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు సమాచారం. పది రోజులు దాటినా నియమించని ప్రభుత్వం నిలిచిపోయిన పేమెంట్స్.. ఆగిన మందుల సరఫరా పరికరాల మరమ్మతులకు డబ్బులు కరువు ఎవరికీ చెక్ పవర్ లేక అధికారుల సతమతం కొత్త బిగ్బాస్ కోసం నిత్యం ఎదురుచూపులే -
బాలాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం జీర్ణోద్దరణ, తొలగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ మహేశ్ ఆధ్వర్యంలో స్వామివారికి పూలు, పండ్లు సమర్పించి విశేష పూజలు చేశారు. శృంగేరి పీఠాధిపతి శ్రీవిధుశేఖరభారతి తీర్థస్వామి ఆశీస్సులతో వచ్చిన వేద పండితులు సందీప్శర్మ, రాధాకృష్ణశర్మ తొమ్మిది మంది బృందంతో క్రతువును వైభవోపేతంగా జరిపించారు. ముందుగా మహాగణపతి పూ జ చేసి, ప్రత్యేకంగా అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పంచబ్రహ్మ హోమం, శాంతి పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, కళాపకర్షణ క్రతువును ఉదయం 10:20 గంటలకు ప్రారంభించారు. తర్వాత విజయ గణపతి, పార్వతి దేవి (శుభానంద మాత), మహా సరస్వతిమాత, శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ పూజలు నిర్వహించి పంచలోహ బింబాల(కలశాలు)లో ప్రాణప్రతిష్ఠ చేపట్టారు. శృంగేరి శారదాపీఠాధిపతి స్వామివారు బాలాలయ పూజల కోసం పంపించిన కాళేశ్వరముక్తీశ్వర స్వామివారి చిన్న లింగాల(నర్మదా రాయి)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లింగాలను దేవస్థానానికి అందజేశారు. బాలాలయంలోకి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేసిన కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అడవిలోని శ్రీఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయ మండపంలో శృంగేరి శిష్యబృందంతో ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. బాలాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్తి కర్రతో చేసిన విగ్రహాలను ఆసీనులు చేశారు. భక్తులు దర్శనాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత.. జీర్ణోద్దరణ, దేవస్థానం తొలగింపు ప్రక్రియ పనులు వేగవంతం కానుండడంతో ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పూజలు నిలిపి వేశారు. ప్రధాన దేవస్థానానికి కిలోమీటరు దూరంలోని శ్రీఆదిముక్తీశ్వరాయం వద్ద బాలాలయంలో భక్తులు దర్శనాలు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆలయాన్ని మూసివేశారు. పూజలో దేవస్థానం అర్చకులు వెల్ది శరత్చంద్ర, రామకృష్ణ, పవన్శర్మ, రాముశర్మ, విజయ్శర్మ, రాజ్కుమార్శర్మ, శ్రావణ్శర్మ, రాధకృష్ణశర్మ పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్ శర్మ, ధర్మకర్తలు శ్యాం, సత్తయ్య, శ్రీధర్రావు, సీతయ్య, సీతారాం, దుర్గయ్య, పద్మ, తదితరులు పాల్గొన్నారు. కాగా, శృంగేరి శిష్యబృందం ఆలయ నిర్వాహకులను సన్మానించి ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద దర్శనాలు కాళేశ్వరం దేవస్థానంలో పూజలు నిలిపివేత -
ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం
ములుగు: ములుగు జిల్లాలో తొలిసారి ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో భవిష్యత్కు దారులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవా ల్సిన అవసరం ఉందన్నారు. శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ సంవత్సర కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. ములుగు జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
మట్టి నమూనాల సేకరణలో నాణ్యత పాటించాలి
గూడూరు: మట్టి నమూనాల సేకరణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని హైదరాబాద్కు చెందిన క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ప్రాజెక్టు మేనేజర్ ఎ.ఎస్. హరీశ్, కన్సల్టెంట్ బి.ఆర్. ఎం. రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజ్పల్లి, గోవిందాపురం, చక్రు తండా గ్రామాల్లో బుధవారం నేల, భూ వినియోగ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వేతో నేల రకం, భూరక్షత, భూసారం, లోతు, నేల పరిరక్షణ, నేల కోత తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో ఉపగ్రహ చిత్రాల ద్వారా సాయిల్ ఫీల్డ్ సర్వే జరుగుతోందని, తద్వారా మట్టి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. భూమి సాంద్రత, ఫెర్టిలిటీ సర్వేస్ ఎనాలిసిస్, కెమికల్ ఎనాలిసిస్ హైదరాబాద్ ల్యాబ్లో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత మ్యాప్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ డిజిటల్ సర్వేతో జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి నేలలు ఉన్నాయి? ఏ భూమిలో ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుంది? ఎరువులు ఎంత మోతాదులో వినియోగించుకోవాలో రైతులకు పూర్తి అవగాహన వస్తుందన్నారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి, దేశ వ్యవసాయ రంగానికి, స్థానిక రైతులకు మేలు జరుగుతుందన్నారు. యువకుడిపై దాడి ● ముగ్గురిపై కేసు నల్లబెల్లి : యువకుడిపై దాడికి పాల్పడిన ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోడెం సాయి ప్రసన్న కుమార్ తెలిపారు. మండలంలోని రాంపూర్కు చెందిన గోదుమల శ్రీనివాస్ కుమారుడు రక్షిత్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆటోలో కూర్చున్నాడు. ఈ సమయంలో గ్రామానికి చెందిన దుస్స వెంకన్న, బోయినల అశోక్, జలగం రాజు.. రక్షిత్తో గొడవపడి దుర్బాషలాడారు. గమనించిన శ్రీనివాస్ కుటుంబీకులు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించగా రక్షిత్తో పాటు కుటుంబీకులపై దాడికి పాల్పడి చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం పేర్కొన్నారు. తాటిపైనుంచి పడి గీత కార్మికుడి మృతి చిల్పూరు: తాటిపై నుంచి పడి ఓ గీత కార్మి కుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జనగామ జిల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తండ వెంకట్రాజం(51) రోజు మాదిరిగానే కల్లుగీయడానికి తాటివనానికి వెళ్లి చెట్టు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో మోకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలి పారు. మృతుడికి ము గ్గురు పిల్లలు ఉన్నారు. -
మానవ భావోద్వేగాలకు ప్రత్యామ్నాయం లేదు
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్ : కృత్రిమ మేధస్సు (ఏఐ)యుగంలోనూ మానవ భావోద్వేగాలకు ప్రత్యామ్నాయం లేదని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ‘న్యూలిటరరీ అండ్ లాంగ్వెజ్ హారిజన్స్ వాయిసెస్ జెనరస్ అండ్ టెక్నాలజీస్’ అనే అంశంపై రెండు రోజులుగా సెనెట్హాల్లో నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 21వ శతాబ్దంలో ఆంగ్ల భాష ప్రపంచీకరణ, డిజిటలీకరణ, కృత్రిమ మేధస్సు యుగానికి ప్రధాన మాధ్యమంగా నిలిచిందన్నారు. అనంతరం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శారదతల్లం మాట్లాడుతూ చాట్జీపీటీ అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఈబుక్స్, ఆడియోబుక్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్తో సాహిత్య అనుభవం రూపాంతరం చెందినా మానవ భావోద్వేగాలు, సృజనాత్మకతకు ఏఐ ప్రత్యామ్నాయం కాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఇంగ్లిష్ విభాగం అధిపతి మేఘనారావు మాట్లాడుతూ ఈజాతీయ సదస్సులో 90 పరిశోధన పత్రాలు సమర్పించారని, 6 సాంకేతిక సెషన్లు, రెండు ప్యానల్ చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు ఎం. నవీన్, దీపాజ్యోతి పాల్గొన్నారు. సాహిత్యం.. ఉన్నత విద్యకు కీలకం కాగా, మొదటి రోజు సదస్సులో కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్యం, భాష, సాంకేతికత సమన్వయం ఉన్నత విద్యకు కీలకమన్నారు. భారతీయ కథన సంప్రదాయంలో పంచతంత్ర కథలు విశిష్ట స్థానం పొందాయని ములుగు సమ్మక్క, సారక్క గిరిజన కేంద్ర యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్ అన్నారు. సాహిత్యం, సాంకేతికత కలయికతో రచయితత్వం పాఠకత్వరూపంలో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని విక్రమ సింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ సీఆర్ విశ్వేశ్వర్రావు అన్నారు. -
వరంగల్లో పవన్ సందడి
జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ హనుమాన్నగర్ ప్రాంతానికి చెందిన తన అభిమాని నిరంజన్ ఇంటికి బుధవారం సినీహీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. నిరంజన్ను పరామర్శించారు. ఆత్మీయంగా పలకరించి శాలువాతో సన్మానించారు. పవన్ వస్తున్నాడన్న సమాచారం మేరకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరామర్శ అనంతరం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి చీర, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేపూజలు నిర్వహించుకున్నారు. – నయీంనగర్/హన్మకొండ కల్చరల్ -
‘పల్స్పోలియో’ను సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు పల్స్పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పల్స్పోలియో కార్యక్రమం విజయవంతంపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, ఉప కేంద్రాల వద్ద సకాలంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టేలా సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్ పంపిణీ, కోల్డ్చైన్ నిర్వహణ, బూత్ల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణపై సమావేశంలో చర్చించారు. 0 నుంచి 5సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, జిల్లాలో సుమారు 55 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో మీడియా అధికారి రాజ్కుమార్, హెచ్ఈ పురుషోత్తం, వి.శ్రీనివాస్, కేఎల్ఎన్ స్వామి, ఎస్.శ్రీనివాస్, పి.లింగారెడ్డి, అనిల్, సత్యనారాయణ, ఫార్మసిస్టు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు హనుమకొండములుగుమహబూబాబాద్జనగామవరంగల్భూపాలపల్లిభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) -
వన మహోత్సవానికి వేళాయె..
మహబూబాబాద్: వన మహోత్సవానికి సిద్ధం కావాలని కలెక్టర్ స్నేహశబరీష్ పిలుపునిచ్చారు. యాక్షన్ప్లాన్తో ముందుకెళ్లి విజయవంతం చేయాలని ఆదేశించారు. అయితే నర్సరీల్లో మాత్రం మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముందస్తు ప్లాన్ లేకపోవడంతో సరిపడా మొక్కలు లేవు. నర్సరీల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో మొక్కల సంఖ్య పెంచలేదు. మానుకోట మున్సిపాలిటీలో మూడు నర్సరీలు.. మానుకోట మున్సిపాలిటీ పరిధి కురవి రోడ్డులో ని గ్రీన్ల్యాండ్లో ఒక నర్సరీ, గాంధీపురం శివారులోని రెండెకరాల ప్రభుత్వ భూమిలో ఒక నర్సరీ, రామచంద్రాపురం కాలనీ గ్రీన్ల్యాండ్లో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. అయితే, కురవి రోడ్డులోని నర్సరీలో మాత్రమే మొక్కలు ఉన్నాయి. దానిలో కూడా 6,000 మొక్కలు మాత్రమే ఉన్నాయి. 10,000 విత్తనాలు నాటారు. అవి ఆగస్టులో మొక్కలు వస్తాయి. మానుకోట, నెల్లికుదురు ఎంపీడీఓ కార్యాలయాల నుంచి పదివేల మొక్కల చొప్పున తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 51 పట్టణ ప్రకృతి వనాలు.. ప్రభుత్వ భూములైన గ్రీన్ ల్యాండ్ల పరిరక్షణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 51 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి సుమారు 2,40,000 మొక్కలు నాటారు. వాటితో పాటు ఏడు పార్క్లు, 9 ఓపె న్ జిమ్లు ఏర్పాటు చేసి వాటి ఆవరణలో కూడా మొక్కలు నాటారు. అయితే నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ప్రధానంగా పట్టణ ప్రకృతి వనాలు మరి దారుణంగా మారాయి. గ్రీన్ బృందం.. నర్సరీలు, పార్కుల్లో మొక్కల సంరక్షణ కోసం గ్రీన్ టీం ఏర్పాటు చేశారు. ఆ టీంలో 21మంది ఉన్నా రు. అందులో ఏడుగురు డ్రైవర్లు ఉండగా.. ఒక్కొక్కరికి నెలకు రూ.12,000 వేతనం గ్రీన్ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు. ఆరు ట్యాంకర్లు ఉన్నాయి. వాటిని నర్సరీలు, 5కిలోమీటర్ల మేర డివైడర్లలో మొక్కలకు నీళ్లు పోయడానికి ఉపయోగిస్తున్నారు. కలెక్టర్ సమీక్ష సమావేశం.. ఈనెల 15న కలెక్టరేట్ అధికారులతో కలెక్టర్ స్నేహశబరీష్ వన మహోత్సవంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 18నుంచి వన మహోత్సవం ప్రారంభించాలని, యాక్షన్ ప్లాన్తో ముందుకు పోవాలని ఆదేశించారు. అయితే సరిపడా మొక్కలు లేకపోవడం ఆందోళనక కలిగించే అంశం. గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు.. వన మహోత్సవంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో కోతుల సమస్య తీరుతుంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం కోతుల సమస్య. ఫుడ్ కోర్టులో పండ్ల మొక్కలు ప్రధానంగా కోతుల తినే మొక్కలు నాటి, అవి పెరిగిన తర్వాత వాటిలోకి కోతులను వదిలేస్తారు. నేటినుంచి కార్యక్రమం ప్రారంభం యాక్షన్ప్లాన్తో ముందుకెళ్లాలని ఆదేశాలు గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులు మానుకోట మున్సిపాలిటీలో అందుబాటులో 6,000 మొక్కలే.. -
వరికి ఎల్నినో..!
సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. వానాకాలం పంటల సాగుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరిలో దీర్ఘకాలిక వంగడాల సాగుకు సమయం అయిపోయింది.. ఈ నెలాఖరులోపు సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే స్వల్పకాలిక వరి వంగడాలు విత్తుకోవాలని, లేకుంటే వద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో రైతులు వర్షాలు కురుస్తాయా.. లేక ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలా అనే మీమాంసలో పడ్డారు. ముఖం చాటేసిన వర్షాలు.. మండుటెండ ఉండే రోహిణి కార్తెలో నార్లు పోసుకున్న ఘటనలు ఉన్నాయి. మృగశిర కార్తె కూడా పూ ర్తి కావొస్తుంది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత తగ్గలేదు. గత ఏడా ది ఈ సమయానికి పలుమార్లు వర్షాలు కురిశాయి. ఎస్సారెస్పీ జలాలతో చెరువులు నింపి నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పంటల సాగుకు రైతులు వెనుకాడలేదు. కానీ, ఇప్పుడు ఎస్సారెస్పీ జలాలు విడుదల కాలేదు. విడుదల చేసినా మొక్కుబడిగా వదిలారు. కాగా, ఈ నెల 14న జిల్లాలో మొత్తం 102.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే జిల్లా సగటున 6.6 మీ.మీ నమోదైంది. ఈనెల 16న జిల్లాలో 6.4 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 0.4మిల్లీ మీటర్లు.. అంటే ఆకాశం నుంచి భూమిపై పడకముందే వర్షపు నీరు ఆవిరి అయినట్లే. దుక్కులు దున్ని దిక్కులు.. వర్షాకాలం సాగు చేసి చెడాలి.. యాసంగి సాగు చేయకుండా చెడాలి అంటారు పెద్దలు. అందుకోసమే యాసంగి పంటల సాగు పూర్తి కాగానే.. ఉన్న కాస్త పదునుతో భూములను దున్నుకున్నారు. మరికొందరు దున్నిన భూమిలో పత్తి గింజలు కూడా నాటారు. ఇలా జిల్లాలో 20వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు భూమిలో వేసి వర్షం ఎప్పుడు వస్తే అప్పుడు మొలకెత్తుతాయని ధీమాతో ఉన్నారు. అయితే మృగశిరకార్తె కూడా పూర్తి కావస్తుండడంతో భూమిలో వేసిన విత్తనాలు వట్టిపోతాయేమో అని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జాడలేని వర్షాలు.. దీర్ఘకాలిక వరి వంగడాలకు అవకాశం లేనట్టే ఈనెల గడిస్తే స్వల్పకాలిక వంగడాలు కూడా వద్దంటున్న శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ అధికారులు ఆరుతడి, పునాస పంటలే దిక్కంటున్న రైతులుపంటలమార్పు కోసం చూపు.. ప్రస్తుత పరిస్థితులు, యూరియా కొరత, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో సమస్యల నేపథ్యంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు అని శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు అటువైపుగా చూస్తున్నారు. ఇప్పటికే 150రోజుల పంట కాలం ఉండే సిద్ది, బీపీటీ రకాలు వేసినా ప్రయోజనం ఉండదు. 130 రోజుల పంటకాలం ఉన్న 16–38, కునారం వంటి వంగడాల సాగుకు మరికొద్దిరోజులే సమయం ఉంది. 120 రోజుల కాలవ్యవధిలో చేతికొచ్చే పంట రకాలు ఆర్ఎన్ఆర్, తెలంగాణ, వరంగల్ 962 రకాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది కూడా వేయలేకపోతే.. తక్కువ నీటి తడులతో పండే ఆరుతడి పంటలు జొన్న, శనగ, పెసర, బొబ్బెర, కూరగాయల సాగు చేయాలని బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ఆలోచిస్తున్నారు. కాగా, వర్షాధార పంటలు సాగుచేసే కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, గూడూరు, కేసముద్రం ప్రాంతాల రైతులు వలసలు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. -
పర్వతారోహకుడు యశ్వంత్కు అభినందనలు
మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్నాయక్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి గుగులోతు రవిని బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ఆయన మెమోంటో అందంచి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలి పర్వతారోహణ యాత్ర విశేషాలు, సాధించిన విజయాలను ఆయనకు వివరించాడు. యశ్వంత్ నాయక్ సాధించిన విజయాన్ని గుగులోత్ రవి అభినందిస్తూ, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తు సాహస క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభంనెహ్రూసెంటర్: మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ముల్కలపల్లి–ఖమ్మం రూట్లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని డిపో మేనేజర్ వి.కల్యాణి బుధవారం తెలిపారు. మహబూబాబాద్–ఖమ్మం రూట్లోని ముల్కలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా ఆర్టీసీ బస్సు సర్వీసులు మహబూబాబాద్–ముల్కలపల్లి–ఖమ్మంకు నడవనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల కోసం హెచ్ఎం ఎదురుచూపుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులు హాజరుకాలేదు. దీంతో హెచ్ఎం బోడ రాంజీ విద్యార్థుల కోసం తరగతి గదిలో నిరీక్షిస్తూ కూర్చున్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటి వరకు పాఠశాలకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యను అభ్యసించాలని, తల్లి దండ్రులు కూడా పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపేలా సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, పిల్లలు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరుకావాలని పాఠశాల హెచ్ఎం పేర్కొన్నారు. డీఏఓను కలిసిన సీఐపీఎంసీ అధికారులుమహబూబాబాద్ రూరల్ : హైదరాబాద్లోని సీఐపీఎంసీ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్రను డీఏఓ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలి శారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమం, మట్టిపరీక్ష, పంటమార్పిడి చేసి రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే అంశాలు, విత్తన శుద్ధి ఉపయోగాలు, పురుగు మందుల పిచికారీ, రైతులు రసాయన ఎరువులు తగ్గించి భూసారాన్ని కాపాడే జనుము, జీలుగ సాగుపై చర్చించారు. సీఐపీఎంసీ ఇన్చార్జ్ వెంకటరెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హొన్నప్ప, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయశంకర్, బయ్యారం ఏఓ కె.రాజు పాల్గొన్నారు. -
ఆదర్శం.. ఆ టీచర్
కేసముద్రం: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన కొట్టం ఆశ్విని ఇదే మండలం గాంధీనగర్జీపీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా(ఎస్జీటీ) పనిచేస్తున్నారు. కాగా, ఉపాధ్యాయురాలు అశ్విని–వెంకటేశ్ దంపతులు తమ కుమారుడు ఇషాంత్(ఫస్ట్క్లాస్), కుమార్తె పూర్వజ(నర్సరీ)లను బుధవారం కల్వల ప్రాథమిక, ప్రీప్రైమరీ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయురాలు -
నక్ష సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: నక్ష సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి గుమ్ముడూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వేను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద మానుకోట మున్సిపాలిటీని ఎంపిక చేశారన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆర్ఓఆర్ పక్కాగా నమోదు చేయాలన్నారు. కేత్రస్థాయిలో పరిశీలన పూర్తి అయిన తర్వాత డ్రాఫ్ట్ తయారు చేసి అర్బన్ ప్రాపర్టీ కార్డ్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.వినోద్ కుమార్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
నక్ష ప్రాజెక్ట్ షురూ
మహబూబాబాద్: పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘నక్ష ప్రాజెక్ట్’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా దానిలో మానుకోట మున్సి పాలిటీ ఉంది. ఈ మేరకు ప్రాజెక్ట్లో ఆర్ఓఆర్ న మోదు కార్యక్రమాన్ని ఇటీవల అధికారులు ప్రారంభించారు. ఇందులో ప్రధానం ఉద్ధేశ్యం ప్రాంతాలను ఖచ్చితమైన డిజిటల్ భూ రికార్డులను సృష్టించడం, స్పష్టమైన ఆస్తి యాజమాన్యాన్ని నిర్ధారించడం, యాప్లో గృహాలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, స్థలాలు, రోడ్లు, ఇతర అన్ని వివరాలు ఇందులో నమోదు అవుతాయి. మానుకోటలో 65,712 మంది ఓటర్లు.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉండగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా పట్టణంలో ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. సుమారు 23,200 గృహాలు ఉన్నాయి. 2024–25 సంవత్సరంలో నక్ష ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా మున్సిపల్ ఎన్నికలు, పన్నుల వసూలు తదితర కారణాలతో ఆలస్యమైంది. ముందుగా ఆరు నెలల పాటు ల్యాండ్ సర్వే విభాగం ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా ఫొటోల చిత్రీకరణ పూర్తి చేశారు. అనంతరం సర్వేయర్లు అన్ని గృహాల వివరాలు నమోదు అయ్యాయా? లేదా అని తెలుసుకోవడం కోసం గ్రౌండ్ ట్రూతింగ్ (రియాల్టీ కోసం) చేసి కమిషనర్ లాగిన్కు పంపారు. మొదటి విడతలో 17 వార్డులు.. మొదటి విడతలో మానుకోటలో 17 వార్డులు ఎంపిక చేశారు. వాటిని 203 బ్లాక్లుగా చేశారు. వాటిలో డ్రోన్ కెమెరాతో తీసిన అన్ని ఫొటోలు, గృహాల, వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, రోడ్లు ఉంటాయి. ఆర్ఓఆర్లో నమోదు డిజిటలైజేషన్లో భాగంగా మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు ఆర్ఓఆర్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈనెల 12న మానుకోట పట్టణంలోని హైమా గార్డెన్లో వివరాల నమోదు ప్రారంభమైంది. ఆ యాప్లో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన అన్ని ఫొటోలు ఉంటాయి. వాటి ఆధారంగానే ఇంటి యజమాని పేరుతో పాటు ఆధార్ నంబర్, ఇంటి హద్దులు, విస్తీర్ణం, డాక్యుమెంట్స్ ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఆర్ఓఆర్కు సహకరించాలి ఆర్ఓఆర్ నిమిత్తం వచ్చే సిబ్బందికి ప్రజలు అన్ని విధాలా సహకరించాలి. ఆస్తులు ఇతర వివరాలు డిజిటలైజేషన్ అవుతాయి. దీంతో అక్రమాలకు చెక్ పడుతుంది. అర్బన్ ప్రాపర్టీ కార్డుతో ఆస్తుల విషయంలో రక్షణ ఉంటుంది. డ్రోన్ కెమెరాలతో తీసిన తర్వాత సర్వేయర్లు గ్రౌండ్ ట్రూతింగ్ చేసి వాటి ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు. – ఎం.వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్30 రోజుల పాటు డ్రాప్ట్ ఆర్ఓఆర్ పూర్తి చేసిన తర్వాత దానిని మున్సిపాలిటీ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై డ్రాప్ట్ను ప్రదర్శిస్తారు. దానిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేసే అవకాశం కల్పిస్తారు. అనంతరం తుది జాబితాను అర్బన్ ప్రాపర్టీ కార్డు అందజేస్తారు. డిజిటలైజేషన్తో ప్రభుత్వ భూములతోపాటు రోడ్డులు, ఇతర కబ్జాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ‘ఆర్ఓఆర్’ యాప్లో నమోదు జూలై 31వ తేదీ వరకు గడువు పైలట్ ప్రాజెక్ట్గా మానుకోట మున్సిపాలిటీ ఎంపిక డ్రాఫ్ట్ ప్రదర్శన అనంతరం తుది జాబితా -
‘లూప్లైన్’ గుబులు !
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో పోస్టింగ్లు, బదిలీల వ్యవహారంపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతర్గత కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఏళ్ల తరబడి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, పోలీస్స్టేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకేచోట పనిచేస్తున్న నల్లగొండ జిల్లాలోని సైదులు అనే ఎస్ఐని ఇటీవల ఇతర విభాగాలకు డిప్యుటేషన్పై పంపగా.. క్యాన్సల్కు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేయడంపై సీరియస్ అయిన డీజీపీ అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. లా అండ్ ఆర్డరే ముద్దు.. డిప్యుటేషన్లు వద్దు.. సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికై న అధికారి తాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందే ముందు హోంశాఖ పరిధిలోని పోలీస్ అనుబంధ విభాగాల్లో డిప్యుటేషన్పై పనిచేయడం తప్పనిసరి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పదోన్నతి పొందే ముందు కూడా లూప్లైన్ పోస్టింగ్లో పనిచేసి ఉండాలి. ఇలా పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ అధికారి ఈ నిబంధనలు అనుసరించాల్సి ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ/సీసీఆర్బీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్, సీసీఎస్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంది. కానీ చాలామంది డిప్యుటేషన్లకు దూరంగా శాంతిభద్రతలు, నగర, పట్టణ ఠాణాల పోస్టింగ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 1,700 మంది డిప్యుటేషన్లకు దూరంగా కీలక పోస్టింగ్లలో కొనసాగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కేడర్లలో పని చేసినవారు, చేస్తున్న వారు వంద మందికిపైనే ఉంటారని చెబుతున్నారు. పోలీస్వర్గాల్లో చర్చనీయాంశంగా డీజీపీ ప్రకటన డిప్యుటేషన్లకు దూరంగా ఉన్నవారి వివరాల సేకరణ తెరపైకి లాఅండ్ఆర్డర్ పోస్టింగ్ల గుట్టు కమిషనరేట్లో సగం మంది ఈసారి లూప్లైన్కే..కొనసాగుతున్న వివరాల సేకరణ... డిప్యుటేషన్ల నిబంధన కొందరికే వర్తించగా, మరికొందరు వాటికి దూరంగా కోరుకున్నచోటే పని చేశారన్న చర్చ ఉంది. తాజాగా ఈ నిబంధన అమలుపై దృష్టిసారించిన అధికారులు.. వివిధ కేడర్లకు చెందిన వారి వివరాలు సేకరిస్తుండడం గమనార్హం. వివరాల సేకరణలో భాగంగా ప్రమోషన్కు ముందు లూప్లైన్లో పనిచేశారా? ఎన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు? ఒకే పట్టణం లేదా సబ్డివిజన్లో దీర్ఘకాలంగా ఉన్నారా? బదిలీల సమయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు వినియోగించుకున్నారా? శాఖ నిర్ణయాలను సవాల్ చేసిన సందర్భాలున్నాయా? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నా.. సగం మందికి ఈసారి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతుండగా.. ఇంతకాలం డిప్యుటేషన్లతో కాలం వెళ్లబుచ్చుతున్న మరికొందరిలో ఠాణా పోస్టింగ్లు రావొచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, విద్యార్హతలు ఇలా..
మండలం ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్/ పోస్టులు పాలిటెక్నిక్ బయ్యారం 12 21 10 02 7చిన్నగూడూరు 7 4 2 2 1దంతాలపల్లి 3422004డోర్నకల్ 4437 164 8గార్ల 1111402గూడూరు 28 15 10 1 5కేసముద్రం 1626413కొత్తగూడ 14 0 0 0 1కురవి 37 29 6 0 7మహబూబాబాద్ 62 99 23 2 5మరిపెడ 36 41 10 0 6నర్సింహులపేట 24 30 7 1 5నెల్లికుదురు 8 15 7 0 2తొర్రూరు 91 55 17 3 11పెద్దవంగర 44 23 9 0 6సీరోలు 10 5 3 0 3 -
చెరువులను లీజుకిస్తే చర్యలు
నెహ్రూసెంటర్: సంఘాల పరిధిలోని చెరువులను లీజుకు ఇస్తే చర్యలు తప్పవని జిల్లా మత్స్యశాఖ అధికారి జర్పుల భాస్కర్ హెచ్చరించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నియమాల ప్రకారం నడుచుకోవాలని, లీజుకు వెళ్తే సంఘం రద్దుకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. చెరువుల కౌలు రకమును సకాలంలో చెల్లించాలని, చేపలు పట్టే అనుమతి పొందిన తర్వాత చెరువును లూటిని అడ్డుకోవచ్చన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ మాట్లాడుతూ చెరువులోని మత్స్యసంపదను కాపాడుకో వాలని, మధ్య దళారులను నమ్మి లీజుకు ఇవ్వవద్దన్నారు. ఇటీవల జరిగిన చెరువుల లూటీపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రమోటర్స్ లింగాల పిచ్చయ్య, సింగాని అశోక్, జిల్లా మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ దామోర శ్రీనివాస్, కోల రవి, భూముల గురుమూర్తి, సిబ్బంది విష్ణు, శ్రీపతి రాజు, శివశంకర్, వేణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్ -
నాబార్డ్ సేవలు విస్తృతం
మహబూబాబాద్ రూరల్: జిల్లాకు ప్రత్యేకంగా నాబార్డ్ కార్యాలయం ఏర్పాటు చేయడం కీలక నిర్ణయమని, నాబార్డ్ ద్వారా జిల్లా నలుమూలలకు సమర్థవంతంగా సేవలు అందిస్తామని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభా స్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (డీడీఎం) కార్యాలయాన్ని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్వాతి బల్లముడి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సాయిరామ్ చౌరి, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర, జిల్లా సహకార అధికారి విజయకుమారి, డీహెచ్ఎస్ఓ మరియన్న, డీఐసీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి, డీవీఏహెచ్ఓ బి.కిరణ్, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఊరి బడిలోనే చదివిద్దాం..గూడూరు: మండలంలోని గుండెంగ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆ ఊరి ప్రభుత్వ బడి బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ నెల 10 బుధవారం గ్రామసభ నిర్వహించారు. గుండెంగ ప్రభుత్వ బడిలోనే 5వ తరగతి వరకు చదివే పిల్లలను చదివించాలని, ప్రైవేట్ బడుల్లో చదివించొద్దని తీర్మానం చేశారు. మంగళవారం గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల వాహనాల నిషేధమనే బ్యానర్లు కట్టించారు. అనంతరం వచ్చిన పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను నిలిపి, డ్రైవర్లకు గ్రామ పంచాయతీ తీర్మానం కాపీలను చూపారు. ప్రైవేటు బడిలో చదివే 6వ తరగతి ఆపై విద్యార్థులను మాత్రమే తల్లిదండ్రుల ఇష్టానుసారం తీసుకెళ్లాలని, 5వ తరగతిలోపు పిల్లలను పంపించమన్నారు. జీపీ తీర్మానం మేరకు ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందని సర్పంచ్ బోడ రాజమ్మ, మాజీ ఎంపీటీసీ బోడ కిషన్, వార్డు సభ్యులు గ్రామంలో చాటింపు వేయించారు. నేడు భద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8.36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరుగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ పాల్గొననున్నారు. ఈమేరకు మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభానికి ధాన్యాధివాసం, శయ్యాదివాసాలు జరిపారు. కార్యక్రమంలో జారతి వెంకటేశ్వర్లు, విజయకుమార్ పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి గార్ల: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో సీపీఐ పార్టీ నిర్వహించే ఉద్యమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
టీజీ టెట్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి: టీజీ టెట్–జూన్ 2026 (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్) హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నాలుగు ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ సెంటర్లలో మంగళవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన పరీక్షలో 1,455 మంది అభ్యర్థులకుగాను 1,189 మంది (81.71శాతం) అభ్యర్థులు హాజరైనట్లు డీఈఓ ఎల్విగిరిరాజ్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం రెండో సెషన్లో 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించగా.. 1,612 మంది అభ్యర్థులకుగాను 1,277 మంది (79.21 శాతం) హాజరయ్యారు. మొత్తం 14,227 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్విగిరిరాజ్ గౌడ్ తెలిపారు. -
నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు
తొర్రూరు రూరల్/దంతాలపల్లి: గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ హెచ్చరించారు. మంగళవారం తొర్రూరు మండలంలోని గోపాలగిరి, అమ్మాపురం, దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామాల్లో డిప్యూటీ కమిషనర్ పర్యటించి, అభివృద్ధి పనులు, నర్సరీలు, ప్రభుత్వాల ద్వారా మంజూరు అవుతున్న నిధుల వినియోగం, పంచాయతీ సిబ్బంది పనితీరు వంటి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ పంచాయతీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి పైసా వృథా చేయకుండా కలిసిమెలసి పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హరిప్రసాద్, డీఎల్పీఓ పుల్లారావు, సర్పంచ్లు కారుపోతుల సాయిదుర్గా, యనమాల సావిత్రి, ముద్దం సునీత, ఉప సర్పంచ్లు దర్మారపు మధు, సిరిపాటి విశాల్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ -
పోటాపోటీ!
మహబూబాబాద్బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 20267ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు డిమాండ్సాక్షి, మహబూబాబాద్: చిన్నదైనా.. పెద్దదైనా.. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటారు. మహిళలకు అయితే స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తల వంటి ఉద్యోగాలు అయితే బాగుంటాయని ఇష్టపడుతారు. ఈ కోవకు చెందిన ఉద్యోగాలే ప్రీ ప్రైమరీ పాఠశాల ఇన్స్ట్రక్టర్, ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 76 ప్రీప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయాలకు పోటాపోటీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉద్యోగం చిన్నదైతేనేం.. అని ఉన్నత చదువులు చదువుకున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాన్వెంట్ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిపితే పేద పిల్లలను ప్రైవేట్ స్కూల్కు పంపించరు. దీంతో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పైగా ఈ విద్యార్థులకు కాన్వెంట్ స్కూల్స్కు తీసిపోకుండా బోధన జరపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 76 పాఠశాలలకు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో బోధించేందుకు ఇన్స్ట్రక్టర్లు, వారికి సహాయకుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఊహించని విధంగా ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 1,188, ఆయా పోస్టులకు 428 దరఖాస్తులు వచ్చాయి. ఉన్నత విద్యావంతులు పోటీ.. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి ఇంటర్, ఆయా ఉద్యోగానికి ఏడో తరగతి ఉత్తీర్ణులయితే చాలు. కానీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి వచ్చిన దరకాస్తుల్లో ఇంటర్ పూర్తి చేసిన వారు 511, డిగ్రీ పూర్తి చేసిన వారు 433, పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు 128, బీటెక్, పాలిటెక్నిక్ చదివిన వారు 14 మంది, స్థానికేతరులు 133 మంది ఉండడం గమనార్హం. 478 433 128 14ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్/పాలిటెక్నిక్ మొత్తం పోస్టులు = 76మండలాల వారీగా వచ్చిన మొత్తం దరఖాస్తులు, విద్యార్హతలు ఇలా.. జిల్లాలో 76 బోధకుల పోస్టులకు 1,188, ఆయాలకు 428 దరఖాస్తులు ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువ.. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మహబూబాబాద్: వానాకాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల స్టాక్, సరఫరాపై నిఘా పెట్టాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి అభివృద్ధి, వానాకాలం సీజన్, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ స్నేహశబరీష్ అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ పంట మార్పి డిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలన్నారు. మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లు ఇవ్వాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, ఆర్డీఓలు రాజేశ్వరి, గణేష్ పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ -
అభిమానిని కలిసేందుకు నేడు హనుమకొండకు పవన్
నయీంనగర్: హనుమకొండ హనుమాన్నగర్కు చెందిన బాలుడు నిరంజన్ చికిత్స లేని జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతను చిన్నప్పటినుంచి హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని. ఒక్కసారైనా ఆయనను కలవాలనే నిరంజన్ కోరికను నెరవేర్చడానికి బుధవారం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హనుమకొండకు వస్తున్నారని స్థానిక జనసేన నాయకులు మంగళవారం తెలిపారు. కాగా, నిరంజన్ వయస్సు 17ఏళ్లు.. అయినా జన్యుపరమైన వ్యాధి కారణంగా పదేళ్ల బాలుడిగానే కనిపిస్తాడు. తండ్రి సాధారణ ప్లంబర్. ఆస్తులు అమ్మి నిరంజన్ వైద్యం కోసం రూ.40లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. అతన్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తనను చూసేందుకు అభిమాన హీరో వస్తుండడంతో నిరంజన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కాగా, పవన్ పర్యటన భద్రతా ఏర్పాట్లను సీపీ సన్ప్రీత్ సింగ్ మంగళవారం రాత్రి పర్యవేక్షించారు. -
డెడ్లైన్.. మే!
మొదటి దశలో త్రితల రాతి నిర్మాణాల వరకు పూర్తికాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరాలయంలో రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న నవ పునర్నిర్మాణ తొలి దశ పనుల పూర్తికి వచ్చే ఏడాది మే నెల వరకు డెడ్లైన్ విధించినట్లు దేవాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ధార్మికపరిషత్ సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ, తొలగింపు కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ప్లాన్ను సమగ్రంగా వివరించారు. ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణం చేస్తున్నారు. విస్తరణ పూర్తయితే ఒకేసారి సుమారు 25 వేల మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండి సౌకర్యవంతంగా దర్శనాలు చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. రూ.60 కోట్లతో అష్ట తీర్థాలకు ఘాట్లు, రహదారులు సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.198 కో ట్లు మంజూరు చేశారని, అలాగే, కాళేశ్వరంలోని అ ష్ట తీర్థాల అభివృద్ధికి మరో రూ.60 కోట్లు కేటా యించినట్లు కమిషనర్ తెలిపారు. పక్షితీర్థం, వ్యాస తీర్థం, జ్ఞానతీర్థం తదితర తీర్థాలతోపాటు వివిధ ఘాట్ల నిర్మాణం, ఘాట్ నుంచి ఘాట్ వరకు పూర్తి స్థాయి రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో.. మొదటి దశలో త్రితల (దక్షిణం, పడమర, ఉత్తరం ప్రాకారాలు మూడు అంతస్తులు స్లాబులు) ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆలయ నైరుతి, దక్షిణ భాగం నుంచి పనులు ప్రారంభించి గర్భాలయం పరిసరాలు, మిగతా పడమర, ఉత్తరం, దక్షిణ గోపురాలు స్లాబు వరకు పూర్తి చేస్తారు. ప్రాకారాలు, కొన్ని ఉప ఆలయాల నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. తూర్పు గోపురం, ప్రాకారం మినహా ఇతర పనులను మొదటి దశలో పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2027 మే నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నేటి నుంచి బాలాలయంలో దర్శనాలు.. అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం నుంచి శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. ప్రస్తుతం ప్రధాన ఆలయానికి కిలోమీటరు దూరంలోని బాలాలయమైన శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. అత్తికర్రతో ఉత్సవమూర్తులు.. బాలాలయంలో చిత్రపటాలు ఆసీనులు చేయకుండా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చైన్నై నుంచి అరుదుగా లభించే అత్తికర్రతో కాళేశ్వరముక్తీశ్వర లింగాలు, శుభానందాముక్తీశ్వరులు, సరస్వతి అమ్మవారు, ధ్వజస్తంభం తదితర మూర్తులను తయారు చేశారు. బుధవారం నుంచి ప్రత్యేక పూజలతో ఆసీనులు చేస్తారు. జూన్లో కుంభాభిషేకం.. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం వచ్చే ఏడాది జూన్ మాసంలో శృంగేరి పీఠాధిపతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో దేవస్థాన ఈఓ ఎస్.మహేశ్, స్థపతి నాయక్, గ్రంథాలయ చైర్మన్ రాజబాపు, కాటారం ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, శ్యామ్, సీతారాం, దుర్గయ్య, అశోక్, పద్మ, రాజయ్య, ప్రశాంత్ రెడ్డి ,శ్రీధర్ రావు, ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఫణీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు కళాపకర్షణ క్రతువు.. మంగళవారం సాయంత్రం వేదపండితులతో పంచబ్రహ్మ హోమం నిర్వహించారు. కాళేశ్వరాలయంలో బుధవారం ఉదయం 5 నుంచి 8గంటల వరకు ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. 8.15 గంటలకు శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంతో కళాపకర్షణ క్రతువు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలశాలలో దైవికశక్తిని ఆహ్వానిస్తారు. బాలాలయంలో పూజలు చేసి ఉత్సవమూర్తులను ఆసీనులు చేస్తారు. ఇప్పటికే బాలాలయం వద్ద ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. నేటి నుంచి బాలాలయంలో దర్శనాలు అరుదైన అత్తి కర్రతో తయారు చేసిన ఉత్సవ మూర్తులు కాళేశ్వరాలయంలో పూజలు నిలిపివేత దేవస్థానం అభివృద్ధికి భక్తులు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి -
యువకుడి హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో కుండె నరేశ్(32) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో మృతుడి భార్య, అత్త, మామను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుండె నరేశ్ ఇదే గ్రామానికి చెందిన కంకల కుమారస్వామి, కళమ్మ దంపతుల కుమార్తె అనూషను 2014లో వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, కొంతకాలంగా నరేశ్ మద్యం సేవించడం, భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇతర మహిళలతో సంబంధాలపై ఇరువురి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం(ఈనెల 15న) పోలీస్స్టేషన్లో ఆ కుటుంబానికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికెళ్లే క్రమంలో భార్య,అత్త, మామతో నరేశ్ గొడవ పడ్డాడు. అనంతరం అదే రోజు రాత్రి అత్తింటికెళ్లి గొడవ పడుతుండగా, భార్య, అత్త, మామ.. నరేశ్ను రాడ్తో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈక్రమంలో మంగళవారం కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.● భార్య, అత్త, మామలే నిందితులు ● వివరాలు వెల్లడించిన పోలీసులు -
డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య రైల్వే బ్లాక్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్–కొండపల్లి రూట్లో డోర్నకల్–గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య థర్డ్లైన్ ట్రిప్లింగ్ వర్క్స్ నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ కారణంగా ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు, దూరం కుదింపు, దారి మళ్లించి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. రద్దయిన రైళ్లు.. ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు కాజీపేట–డోర్నకల్ (67765) డైలీ ప్యాసింజర్ , డోర్నకల్–కాజీపేట (67766) డైలీ ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) డైలీ ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) డైలీ ప్యాసింజర్, విజయవాడ– భద్రాచలం(67215) డైలీ ప్యాసింజర్, భద్రాచలం–విజయవాడ (67216) డైలీ ప్యాసింజర్, విజయవాడ–సికింద్రాబాద్ (12713) డైలీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (12714) ఎక్స్ప్రెస్, ఆగస్టు 19వ తేదీన.. గుంటూరు–సికింద్రాబాద్ (12705) ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12706) ఎక్స్ప్రెస్, ఆగస్టు 17,18న సికింద్రాబాద్–భద్రాచలం (17659), సికింద్రాబాద్–మణుగూరు (12745) ఎక్స్ప్రెస్, ఆగస్టు 18,19న భద్రాచలం–సికింద్రాబాద్ (17660) ఎక్స్ప్రెస్, మణుగూరు–సికింద్రాబాద్ (12746) ఎక్స్ప్రెస్, ఆగస్టు 16,17,18న విశాఖపట్నం–మహబూబ్నగర్(12861) ఎక్స్ప్రెస్, ఆగస్టు 17,18,19న మహబూబ్నగర్–విశాఖపట్నం (12862) ఎక్స్ప్రెస్, ఆగస్టు 16,17,18న కాకినాడ టౌన్–లింగంపల్లి (12775) ఎక్స్ప్రెస్, ఆగస్టు 17,18,19న లింగంపల్లి–కాకినాడ టౌన్ (12776) ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. దూరం కుదింపు.. ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు–సికింద్రాబాద్ (17201) ఎక్స్ప్రెస్ను గుంటూరు–కాజీపేట మధ్య రద్దు, సికింద్రాబాద్–గుంటూరు (17202) ఎక్స్ప్రెస్ను కాజీపేట–గుంటూరు మధ్య రద్దు చేశారు. ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు భద్రాచలం–బల్లార్షా (17033) ప్యాసింజర్ భద్రాచలం–వరంగల్ మధ్య రద్దు, ఆగస్టు 15 నుంచి 18వ తేదీ వరకు సిర్పూర్టౌన్–భద్రాచలం (17034) సింగరేణి వరంగల్–భద్రాచలం మధ్య రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు.. ఆగస్టు 14 నుంచి 18 వరకు విశాఖపట్నం–ఎల్టీటీ ముంబాయి (18519), ఎల్టీటీ ముంబాయి–విశాఖపట్నం (18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు కాజీపేటలో హాల్టింగ్ తొలగించి వయా విజయవాడ, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 17,18న సీఎస్టీ ముంబాయి–భువనేశ్వర్ (11019), భువనేశ్వర్–సీఎస్టీ ముంబాయి (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్లకు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిరలో హాల్టింగ్ ఎత్తివేసి వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 18న మచిలీపట్నం–సాయినగర్ షిర్డీ (17208), సాయినగర్ షిర్డీ–కాకినాడ పోర్టు (17205) ఎక్స్ప్రెస్లకు కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిరలో హాల్టింగ్ ఎత్తివేసి వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఆగస్టు 18,19న చర్లపల్లి–షాలిమార్ (18046) ఎక్స్ప్రెస్ను భువనగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్లో హాల్టింగ్ ఎత్తివేసి వయా చర్లపల్లి, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 10 రీషెడ్యూలింగ్ ట్రైన్స్.. ఆగస్టు 8 నుంచి 15,17,19న విశాఖపట్నం–సికింద్రాబాద్ (20833) ఎక్స్ప్రెస్ గంట, ిసికింద్రాబాద్–విశాఖపట్నం (20834) ఎక్స్ప్రెస్ గంట, ఆదిలాబాద్–తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు, ఆగస్టు 17న తిరుపతి–హిసర్ (04718) ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు, ఆగస్టు 16న న్యూఢిల్లీ–చెన్నయ్సెంట్రల్ (12622) తమిళనాడు ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు, ఆగస్టు 17న హైదరాబాద్–విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు, ఆగస్టు 17న హైదరాబాద్–తాంబురం (12764) చార్మినార్ గంట, సికింద్రాబాద్–తిరుపతి (12764) పద్మావతి ఎక్స్ప్రెస్ గంట, బనారస్–రామేశ్వరం (22536) ఎక్స్ప్రెస్, రామేశ్వరం–అయోధ్య( 22613) ఎక్స్ప్రెస్ గంట పాటు రీషెడ్యూలింగ్ చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. కాజీపేట జంక్షన్–కొండపల్లి రూట్లో ఆగస్టు 15 నుంచి 18 రైళ్లు రద్దు 4 రైళ్లు దూరం కుదింపు.. 7 రైళ్ల దారి మళ్లింపు వరంగల్, కాజీపేట మీదుగా వెళ్లే 10 రైళ్లు రీషెడ్యూలింగ్ -
ప్రభుత్వానికి రూ.4.29 కోట్ల బకాయిలు
● రైస్ మిల్లు యజమాని అరెస్ట్ మల్హర్(కాటారం): ప్రభుత్వానికి రూ.4.29 కోట్ల విలువైన బియ్యం చెల్లించని రైస్ మిల్లు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాటా రం సీఐ నాగార్జునరావు కథనం ప్రకారం.. 2022–2023 రబీ, ఖరీఫ్ పంటకు సంబంధించిన సుమారు 38 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పట్టడానికి మండలంలోని దామెరకుంట గ్రామానికి చెందిన 3ఆర్ఎస్ రుద్ర రైస్ మిల్లుకు అప్పగించారు. అయితే మిల్లు యజమాని రవికాంత్ బియ్యం అప్పగించ లేదు. దీంతో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ రాఘవేందర్ సుమారు రూ.4.29 కోట్ల విలువైన బియ్యం అప్పగించలేదని రవికాంత్పై 2024లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై అభినవ్ కేసు నమోదు చేశారు. కాగా, ఈనెల 15న నిందితుడు రవికాంత్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించినట్లు సీఐ నాగార్జునరావు మంగళవారం తెలిపారు. స్తంభించిన ‘వాహన్ సారథి’.. ● నిలిచిన ఆర్టీఏ సేవలు ఖిలా వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాల్లో వాహన్ సారథి సేవలకు మంగళవారం తీవ్ర ఆటంకం ఏర్పడింది. సర్వర్లు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో సేవలకు అంతరాయం కలిగింది. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావడంతో సోమ, మంగళవారాల్లో సర్వర్లపై ఒత్తిడి పెరిగి స్తంభించినట్లు అధికారులు చెబుతున్నారు. సర్వర్లలో టెక్నికల్ సమస్యలు తలెత్తడం.. వరుసగా రెండో రోజు అదే సమస్య ఉత్పన్నమైంది. దీని వల్ల డ్రైవింగ్ లైసెన్స్లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఏ నిమిషం సర్వర్ వస్తుందోనని రోజంతా క్యూలైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఆయా నిపుణులు రంగంలో దిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య తలెత్తిందని చెబుతున్నారు. కాగా, సోమ, మంగళవారాల్లో నిలిచిన సేవలన్నీ బుధవారం తిరిగి అదే సమయంలో అందనున్నాయని అధికారులు పేర్కొన్నారు. అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్యహసన్పర్తి: అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగారానికి చెందిన రావుల భిక్షపతి(59) నాలుగేళ్ల క్రితం తన సోదరి వివాహానికి వివిధవర్గాల నుంచి సుమారు రూ.8లక్షల మేరకు అప్పు చేశాడు. ఓవైపు అప్పులు పెరిగిపోవడంతో ఆందోళనకు గురై సోమవారం వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. బాధితుడిని వెంటనే ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. -
బుధరావుపేటలో తుపాకీ కలకలం?
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో తుపాకీ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం రాత్రి ఓ బెల్ట్ షాపు వద్దకు మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ బెల్ట్ షాపు యజమానితోపాటు పలువురు గ్రామస్తులతో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో మాటామాట పెరగడంతో యువకుడిపై స్థానికులు చేయి చేసుకున్నట్లు తెలిసింది. తగాదా పెరిగిపోతుండడంతో అక్కడి నుంచి పంపించారు. బయటకు వెళ్లిన సదరు యువకుడు తుపాకీ పట్టుకుని బెల్ట్ షాపు వద్దకు వచ్చి నిర్వాహకుడితోపాటు పలువురిని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. సమీపంలో ఉన్న కొంత మంది ఫొటోలు, వీడియోలు తీసి పోలీసు అధికారులకు పంపినట్లు తెలిసింది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు వరంగల్, నర్సంపేట, ఖానాపురం మండలాలకు చెందిన పోలీసు అధికారులు యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు సమాచారం. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతికినా ఆచూకీ లభించలేదు. అయినా రాత్రి వరకూ గాలింపు చేపట్టినట్లు తెలిసింది. -
బిల్లులు చెల్లించడం లేదని..
కురవి: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్ తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మంగళవారం కాంట్రాక్టర్ తాళం వేశాడు. వివరాలిలా ఉన్నాయి. మన ఊరు–మన బడి పథకం కింద మంజూరైన నిధులతో తండాలోని ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ బానోత్ శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులు చేశాడు. అయితే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్ పాఠశాల ప్రారంభమైన రెండో రోజు పాఠశాలకు తాళం వేశాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరండాలో కూర్చున్నారు. ఈ విషయాన్ని హెచ్ఎం వీరన్న.. ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్కు తెలిపారు. దీంతో ఎంఈఓ లచ్చిరాం ఫోన్ చేయడంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ పాఠశాలకు వచ్చాడు. ఆయనతో చర్చించి తాళం తీయించడంతో తరగతులు యథావిధిగా కొనసాగాయి. ఎంఈఓతో చర్చలు సఫలం అనంతరం లాక్ తీసిన శ్రీనివాస్ -
ఆదివాసీలను వెనక్కి పంపాలి
ఇతర ప్రాంతాల ఏటూరునాగారం : మండలం కేంద్రంలోని 209 సర్వే నంబర్లో గల చెరువు శిఖం భూమిని ఇతర ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు కబ్జా చేస్తున్నారని ఏటూరునాగారం గిరిజనేతరులు చేపట్టిన శాంతియుత నిరసన, ధర్నా, బంద్ విజయవంతమైంది. మంగళవారం ఓడవాడ హనుమాన్ గుడి నుంచి వైజంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ మనన్ భట్, సీఐ శ్రీనివాస్, ఐదు మండలాల ఎస్సైలు, కానిస్టేబుళ్లు పెద్ద ఎత్తున హాజరై బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 30 మంది రైతులు 1965 నుంచి సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నారని, వారి భూముల్లో మిగతా మండలాల నుంచి వచ్చిన ఆదివాసీలు గుడిసెలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. బడే సులోచన, శమంతకమణి, గొంది గౌరమ్మ, బొల్లం సారయ్యతోపాటు మరికొంత మంది కబ్జాకు పాల్పడి ఇతర మండలాల నుంచి ఆదివాసీలను రప్పించి కర్రలు పాతుతున్నారని ఆరోపించారు. దీనిపై అక్రమణదారులను వెనకకు పంపాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ జగదీశ్ ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడారు. సర్వే నంబర్ 209లోని 125 ఎకరాల చెరువు శిఖం భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనిపై శాంతించిన ప్రజలు రెండు రోజుల సమయం ఇస్తామని, స్థానికేతరులను పొలాల నుంచి ఖాళీ చేయించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘర్షణ చోటు చేసుకోకుండా 163, 164 సెక్షన్ అమలు ఆకులవారిఘణపురంలోని సర్వే నంబర్ 209లో గల చెరువు శిఖం భూములో ఇతర ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు, స్థానిక గిరిజనేతరులకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ జగదీశ్ తెలిపారు. గొడవలకు దిగకుండా 163, 164 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసుకున్న వారిని పంపిస్తామన్నారు. ఏటూరునాగారం గిరిజనేతరుల డిమాండ్ శాంతియుత నిరసన, ర్యాలీ విజయవంతం -
హైపర్ యాక్షన్ ప్లాన్ రెడీ..
హన్మకొండ: భారీ వర్షాలు, ఈదురు గాలులకు ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యలను యుద్ధ ప్రాతి పదికన పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ హైప ర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) డ్రోన్ల ద్వారా సమస్యలను ముందుగా గుర్తించడం ద్వారా అప్రమత్తంగా ఉండేలా ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సర్కిల్లో జీపీఆర్ఎస్ ఆధారిత ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలను అధికారులు అందుబాటులో ఉంచుకున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాకు జరిగే అంతరాయాన్ని అధిగమించడానికి హైపర్ (హెచ్ఏఐపీఆర్) అనే ప్రత్యేక కార్యాచరణతో కూడిన ప్రణాళికను అమలు చేస్తున్నారు. ‘హైపర్’ కార్యాచరణ ప్రణాళిక విశ్లేషణ.. హెచ్ (హెడ్క్వార్టర్ అండ్ రెస్పాన్సిబిలిబీ): సిబ్బంది పని చేసే చోట నివాసముంటూ అప్రమత్తంగా ఉండడం. ఎ (అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవన్ అండ్ మెటీరియల్): అవసరమైన సిబ్బంది. సామగ్రిని ముందస్తుగానే సమకూర్చుకోవడం. ఐ (ఇన్మర్మేషన్ కలెక్షన్ అండ్ ప్రాంప్ట్ ఇంటిమేషన్): విద్యుత్అంతరాయాలపై కచ్చితమైన సమాచార సేకరణ, వేగంగా చేరవేయడం. పి (ప్లానింగ్ అండ్ మోబిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్): క్షేత్ర స్థాయిలో పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం. ఇ (ఎక్యుక్యూషన్ ఆప్ వర్క్): నిర్దిష్ఠ కార్యాచరణను వేగంగా అమలు చేయడం. ఆర్ (రిస్టోరేషన్ ఆఫ్ పవర్ సప్లై): విద్యుత్ సరఫరాను నిర్దేశిత సమయంలో పునరుద్ధరించడం జీపీఆర్ఎస్ ఆధారిత ఎమర్జెన్సీ వాహనాలు.. భారీ వర్షాలతో ఏర్పడే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రతీ సర్కిల్లోనూ ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ వాహనాల్లో మరమ్మతులకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి. వీటికి జీపీఆర్ఎస్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా సమస్య ఉన్న లొకేషన్ను వేగంగా గుర్తించి, సిబ్బంది ఘటనా స్థలికి త్వరగా చేసుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో టీజీ ఎన్పీడీసీఎల్ ముందు వరుసలో ఉంది. స్కాడా, జీపీఆర్ఎస్, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను కృత్రిమ మేధాతో అనుసంధానం చేశాం. తద్వారా ఫీడర్లలో వచ్చే సమస్యలు 7 నుంచి 21 రోజుల ముందు అంచనా వేయొచ్చు. విద్యుత్ డిమాండ్ను ముందే ఊహించి సరఫరాను నియంత్రించొచ్చు. లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. సంస్థలోని ప్రతీ ఉద్యోగి బాధ్యతతో హెడ్ క్వార్టర్లో ఉంటూ, అవసరమైన సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ను అందించడమే మా లక్ష్యం. కర్నాటి వరుణ్ రెడ్డి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భారీ వర్షాలకు ఉత్పన్నమవుతున్న విద్యుత్ సమస్యలు ఏఐ సాంకేతికత, డ్రోన్ల ద్వారా ముందస్తు గుర్తింపు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ -
విష పురుగు కాటుతో చిన్నారి మృతి
● నారాయణపురంలో ఘటన బచ్చన్నపేట : విష పురుగు కాటు వేయడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం జనగా మ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు మమత, మహేశ్ దంపతలకు కుమారుడు, కూతురు సంతానం. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారి మధుస్మిత (09)ను విషపురుగు కాటేసింది. వెంటనే తల్లిదండ్రులకు తెలుపడంతో వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. కాగా, మధుస్మిత మండల కేంద్రంలోని బిషప్ తుమ్మబాల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. -
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026
ముగ్గురు పిల్లల నుంచి 60 మంది వరకు..నెల్లికుదురు: ముగ్గురు పిల్లలతో మూతపడే దశకు చేరిన మండలంలోని సీతారాంపురం ప్రాథమికో న్నత పాఠశాల రెండేళ్లలో 60 మందితో కళకళలాడుతోందని హెచ్ఎం ఉప్పలయ్య అన్నారు. మొదటిరోజు సోమవారం పాఠశాలను మామిడి తోరణాలు, అరటి మట్టలతో అందంగా అలంకరించి పిల్లలకు స్వాగతం పలికినట్లు తెలిపారు. మొదటి రోజు 25 మంది పిల్లలు పాఠశాలకు రావడం అభినందనీయమన్నారు. సర్పంచ్ భాస్కర్ నాయక్ తన కుమారుడు హరినాయక్కు మూడో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నట్లు హెచ్ఎం తెలిపారు. -
భవనాలను సద్వినియోగం చేసుకోవాలి
కేసముద్రం: మహిళాశక్తి భవనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబా బాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మండలంలోని మహముద్పట్నం గ్రామంలో రూ.10లక్షల నిధులతో చేపట్టనున్న మహిళాశక్తి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్నాయక్, ఎంపీడీఓ క్రాంతి, ఎస్సై క్రాంతికిరణ్, సర్పంచ్ కట్ల ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఏశబోయిన అమృత శ్రీనివాస్, పార్టీ గ్రామ అధ్యక్షుడు మిట్టగడుపుల యాకూబ్, కాసోజు యాకాంతాచారి తదితరులు పాల్గొన్నారు. వర్షపు నీరు నిల్వకుండా చర్యలుమహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్యూబీలో వర్షపు నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రం శివారులోని బంధం చెరువు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న బ్రిడ్జి డ్రెయినేజీని సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. డ్రెయినేజీలో చెత్త పేరుకుపోవడంతో నీరు కాల్వలో నిలిచి సమస్య తలెత్తిందన్నారు. రైల్వే పనులు చేసిన క్రమంలో కాల్వ పూడుకపోయి ఆర్యూబీలో వర్షపు నీరు నిలిచిందన్నారు. రైల్వే అఽధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు. కేసముద్రం మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ ఇన్చార్జ్ కార్యదర్శిగా ఎన్.రాజేంద్రప్రసాద్ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం గ్రేడ్–3 సెక్రటరీగా కొనసాగుతున్న రాజేంద్రప్రసాద్కు మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తొర్రూరు సీడీపీఓగా రేష్మతొర్రూరు: తొర్రూరు ప్రాజెక్టు సీడీపీఓగా మంద రేష్మ నియమితులయ్యారు. ఈ మేరకు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట సీడీపీఓగా పని చేసిన ఆమె సాధారణ బదిలీల్లో భాగంగా తొర్రూరుకు వచ్చారు. ఇప్పటివరకు డిపప్యుటేషన్పై సీడీపీఓగా పని చేసిన కమలాదేవి సొంత స్థానం మహబూబాబాద్కు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన నూతన సీడీపీఓకు సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీల బలోపేతం, మాతా, శిశు సంరక్షణకు పాటుపడతానని రేష్మ తెలిపారు. రైతులకు అవగాహన కల్పించాలిమహబూబాబాద్ రూరల్: యూరియా యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువుల బస్తాలు ఇవ్వాలని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి, ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సురేంద్రమోహన్ అన్నారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి వారు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు ఎరువుల సరఫరా విధానం అమలు తీరు, వివరాలను జిల్లా వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయం నుంచి డీఏఓ ఎస్.విజయచంద్ర, డీసీఓ విజయకుమారి, ఏడీఏలు శ్రీనివాసరావు, శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, ఏఓలు, ఏఈఓలు, సొసైటీల సీఈఓలు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ అర్జీలు పెండింగ్లో పెట్టొద్దు
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ ● 17 వినతుల స్వీకరణ తొర్రూరు: ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 17 దరఖాస్తులు అందాయి. దానిలో 12 భూ సంబంధిత, 5 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి దరఖాస్తుదారులకు రశీదులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, ఏఎల్ఓ రవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, సీడీపీఓ రేష్మ, వైద్యాధికారి ప్రియాంక, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
కేసముద్రం: ఇనుపరాడ్డుతో ఓ వ్యక్తి తలపై మోది హతమార్చిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన కుండె నరేష్(36) అదే గ్రామానికి చెందిన కంకల కుమారస్వామి, కళమ్మ దంపతుల కుమార్తె అనూషను వివాహం చేసుకున్నాడు. నరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అత్తగారింటి వద్ద రాత్రి నరేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇనుపరాడ్డుతో తలపై మోదడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి ఎస్సై క్రాంతికిరణ్ చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నరేష్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మహబూబాబాద్: వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలనికలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం వన మహోత్సవం యాక్షన్ప్లాన్పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. ఈనెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నర్సరీల్లో డిమాండ్కు అనుగుణంగా మొక్కలు పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా యాక్షన్ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అనిల్కుమార్, పురుషోత్తం పాల్గొన్నారు. -
ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభం
పెద్దవంగర: మండలంలోని మోత్యాతండా గ్రామ పంచాయతీ పరిధి సో మ్లాతండా ప్రాథమిక పాఠశాల ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఉంది. అ యితే సోమవారం బ డి తెరుచుకొని పిల్లలతో కళకళలాడింది సర్పంచ్ గుగులోత్ కవిత యాకన్న చొరవతో స్కూల్ తెరుచుకుంది. తండా వాసులు జీవనోపాధి కోసం వలస వెళ్లడంతో గతంలో పాఠశాల మూతపడింది. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన సర్పంచ్ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్లు నిర్వహించారు. దీంతో పిల్లల్లో ఆసక్తి పెంచడమే కాకుండా వారి భవిష్యత్పై తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించారు. ఈ ప్రయత్నం సఫలీకృతం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు ముందుకొచ్చారు. స్థానిక విద్యార్థులతో పాటు సమీప భగ్యతండా, అమర్ సింగ్ తండా నుంచి కూడా పాఠశాలలో చేరారు. మొత్తంగా 15 మంది విద్యార్థులు చేరగా.. ఎంఈఓ బుదారపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు. -
పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
మహబూబాబాద్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పాఠశాలలపై విద్యాశాఖ, మున్సిపల్, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలన్నారు. అఽధికారులు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పాఠఽశాలల్లో తాగునీరు, విద్యుత్సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేయాలన్నారు. నాణ్యమైన భోజన పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 215 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి వినతి అందజేశారు. ధరలులు నియంత్రించాలని, రేషన్షాపుల్లో 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు అనిల్కుమార్, పురుషోత్తం, జిల్లా అధికారులు ఉన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ ప్రజావాణిలో 215 వినతులు -
కొనుగోల్ పూర్తి
ట్రాన్స్పోర్ట్ కిరాయి డబ్బులు రూ.లల్లో ఇలా (టన్నుకు)చెల్లించే డబ్బులు దూరం(కిలో మీటర్లు)సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో ప్రతీ సంవత్సరం ఒడిదొడుకులు, ఇబ్బందులు, గొడవలు, రైతుల ధర్నాలు, ఆందోళనల మధ్య కొనసాగిన ధాన్యం కొనుగోళ్లు.. ఈ ఏడాది యాసంగిలో కొన్ని సంఘటనల మినహా ప్రశాంతంగా పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా.. ప్రక్రియ అంతా 50రోజుల్లోనే పూర్తి చేశారని, సమష్టి కృషితోనే సాధ్యమైందని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులకు అభినందలను తెలిపినట్లు తెలిసింది. అయితే కొనుగోళ్లు సాఫీగా ముందుకు సాగడానికి, కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు దోహదపడిన ట్రాక్టర్ల కిరాయి విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. అంచనాలకు మించి.. యాసంగిలో 1,71,780 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేశారు. అయితే మెలిమి బియ్యం ఇచ్చే సన్న రకాలు, ఆర్ఎన్ఆర్ వంటి రకాలకు మిల్లర్లు కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అందజేసే ధరకు మించి పచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో 1.70లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని భావించారు. అయితే ఏప్రిల్ మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభించి జూన్ మొదటి వారంలోపే పూర్తి చేశారు. మొత్తం 50 రోజుల్లో 211 కొనుగోలు కేంద్రాల ద్వారా 26,645 మంది రైతుల నుంచి రూ. 448,27,89,823 విలువచేసే 1,88,003 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గత ఏడాది యాసంగిలో 1,77,610 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఈ ఏడాది యాసంగిలో 10,393 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించారు. ట్రాక్టర్ల కిరాయి కోసం.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంలో రైతుల ట్రాక్టర్లే కీలక పాత్ర పోషించాయి. జిల్లాలోని గతంలో ఎగుమతికోసం సకాలంలో లారీలు రాలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అదనంగా మరో రెండు రూట్లు పెంచి మొత్తం ఏడు ట్రాన్స్పోర్ట్ రూట్లు పెట్టారు. అయితే కాంట్రాక్టర్లు సకాలంలో లారీలను సరఫరా చేయలేకపోవడం, దిగుమతి ఇబ్బందులతో లారీల కొరత ఏర్పడింది. దీంతో కల్లాల్లో కాంటాలు పెట్టిన ధాన్యం అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. దీనిని గమనించిన కలెక్టర్ మిల్లులే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దిగుమతి చేసేలా ఏర్పాట్లు చేశారు. లారీలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతుల వద్ద నుంచి 554 ట్రాక్టర్లను తీసుకువచ్చి ధాన్యం తరలించారు. అయితే గతంలో రైతులు ట్రాక్టర్లు పెట్టి మిల్లులకు తరలించిన ధాన్యం తాలూకు డబ్బులు రైతులకు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా పీఏసీఎస్ సెంటర్లలో పలువురు రైతుల డబ్బులు కాజేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మొత్తం రూ.10కోట్ల మేరకు ట్రాన్స్పోర్ట్ కిరాయిలు వస్తే ఇందులో రూ. 2కోట్ల మేరకు రైతులు పెట్టిన ట్రాక్టర్లకు ఇవ్వాలి. ఈ యాసంగిలో కూడా అందరికన్నా పీఏసీఎస్ ఆధ్వర్యంలోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు పెట్టిన ట్రాక్టర్లకు కిరాయి డబ్బులు ఇప్పించాలని, ఇందుకోసం రైతుల ట్రక్షీట్లను తీసుకొని నేరుగా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. అందరి సహకారంతోనే కొనుగోళ్లు పూర్తియాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని గమనించిన కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఎగుమతి ఇబ్బందులు తొలగించేందుకు ట్రాక్టర్లను పెట్టాం. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, ప్రధానంగా రైతుల మద్దతుతో కొనుగోళ్లు సవ్యంగా జరిగాయి. ట్రాక్టర్ పెట్టిన ప్రతీ రైతుకు కిరాయి డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)403.13 392.83397.99 386.91 380.9841–800–8 9–2021–40జిల్లాలో లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ 50 రోజుల్లోనే ప్రక్రియ కంప్లీట్ అధికారులను అభినందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కిరాయిల కోసం రైతుల ఎదురుచూపులు -
బడికి పోతే బతికెటోడు బిడ్డా!
కురవి: తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు.. తమ ముద్దుల కొడుకును చూసుకుంటూ మురిసిపోయారు. అయితే, తోటి స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ ఉన్న ఆ బాలుడిని తాచుపాము కాటేసింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిన ఘటన నేరడ శివారు ఎల్కచెట్టు తండా జీపీ పరిధి మంచ్యాతండాలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. తండాకు చెందిన బానోత్ మధు–అరుణల ఒక్కగానొక్క కొడుకు బానోత్ గగన్విహారి(7) కురవిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. అమావాస్య కావడంతో బాలుడు బడికి పోలేదు. ఇంటి వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో రాతి గోడ సమీపంలో తాచుపాము కాటేసింది. తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘బడికి పోతే బతికెటోడు బిడ్డా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. పాముకాటుతో బాలుడి మృతి -
హాజరు అంతంతే..
అమావాస్యతో బడికిరాని విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బడిగంట మోగింది. వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన చిన్నారులు సోమవారం బడిబాట పట్టారు. ఇన్నిరోజులు బోసిపోయిన బడులు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. అమావాస్య కావడంతో చాలామంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యారు. – మహబూబాబాద్ అర్బన్ ● విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం ● 32,231 మంది పిల్లలకు 4,119 మంది హాజరు అమావాస్య ఎఫెక్ట్.. సోమవారం అమావాస్య కావడంతో విద్యార్థులు మొదటిరోజు బడికి రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. జిల్లాలో మొత్తం 32,231 మంది విద్యార్థులకు గాను 4,119 మంది మాత్రమే హాజరయ్యారు. కట్టెలమండి ప్రభత్వ పాఠశాల, సలార్తండా పాఠశాలలో విద్యార్థులు రాక ఉపాధ్యాయులు ఖాళీగా ఉండిపోయారు. సమస్యల స్వాగతం.. ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. చాలాచోట్ల తాగునీరు, విద్యుత్ అంతరాయం, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో సమస్యలు యథా విధిగా దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు లేక, ఫ్యాన్లు సరిగా తిరగకా విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని పలు తండాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని కొన్ని పాఠశాలలు తెరుచుకోలేదని విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నారు. విద్యార్థులు ఎదురుచూసి తిరిగి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు, హనుమంతునిగడ్డ, ప్రభుత్వ ప్రైమ రీ పాఠశాలల్లో డీఈఓ సత్యనారాయణమూర్తి, హెచ్ఎంలు రాంమోజీనాయక్, బాలాజీ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. డీఈఓ విద్యార్థులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. విద్యార్థుల ఇబ్బందులు. పాఠశాలల పునఃప్రాంభం రోజు ఎండవేడి వల్ల ఉక్కపోతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరుకాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ పాడుతూ కనిపించారు. ●విద్యార్థుల హాజరు శాతం పెంచాలి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరై పాఠశాలలను కొనసాగించి, విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. అదేవిధంగా గైర్హాజరైన, పాఠశాలలు సమయానికి తీయని ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేవిధంగా నడుచుకోవాలి. – సత్యనారాయణమూర్తి, డీఈఓ -
తప్పని నిరీక్షణ
● రైల్వే గేట్ వద్ద వాహనదారుల ఇబ్బందులు ● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ● బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా రాకపోకలకు నిరాకరణడోర్నకల్: డోర్నకల్–గార్ల రోడ్డు మార్గంలో 90వ లెవల్ క్రాసింగ్ రైల్వేగేట్ వద్ద ప్రతీ రోజు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, కాజీపేట రైలుమార్గంలో ప్రతీరోజు వందలాది రైళ్ల రాకపోకలు వల్ల రైల్వే గేట్ మూతబడి ఉండటంతో గంటల తరబడి వాహనదారులు నిరీక్షించాల్సి పరిస్థితి నెలకొంది. ఈమేరకు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ దానిపై నుంచి రాకపోకలకు అనుమతించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకల్లో మరింత జాప్యం.. గార్ల–డోర్నకల్ మార్గంలో ప్రతీరోజు బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు ఇతర వాహనాల ద్వారా డోర్నకల్, గార్ల, ఖమ్మం, బయ్యారం, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు ఐదు వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. మరోవైపు రైల్వేమూడో లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ మార్గంలో నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండడంతో రాకపోకల్లో మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా.. డోర్నకల్, గార్ల మార్గంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నాలుగేళ్ల క్రితం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. రైల్వేశాఖ బ్రిడ్జి పైనుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఆర్ అండ్ బీ అధికారులకు మూడు నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నేటికీ బ్రిడ్జి మీదుగా రాకపోకలను అనుమతించకపోవడంపై గార్ల, డోర్నకల్ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు రైళ్ల రాకపోకలతో రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చిన్న చిన్న పనులను పూర్తి చేయకుండా మూడు నెలలుగా ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్ అండ్ బీ అధికారులు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై సుమారు కిలోమీటరు మేర డాంబర్ లేయర్ వేయాల్సి ఉందని, అనంతరం రోడ్డు మార్కింగ్ పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతిస్తామని చెబుతున్నారు. బ్రిడ్జిని ప్రారంభించాలి.. నిత్యం రైల్వే గేట్ మూతబడడంతో వాహనదారులతో పాటు ఇరు పక్కల భూములు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ను కలిసి బ్రిడ్జిని ప్రారంభించాలని కోరాం. పది రోజులలోపు పనులు పూర్తి చేసి బ్రిడ్జి మీదుగా రాకపోకలను అనుమతిస్తామని వారు హామీ ఇచ్చారు. –బానోత్ రమేశ్, సర్పంచ్, బుద్దారం, గార్ల మండలం -
సర్వం సిద్ధం చేశాం..
తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి. పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠ్యపుస్తకాలు, యూనిపామ్, నోట్ బుక్స్, పాఠశాలలకు పంపిస్తున్నాం. ఈ నెల 19వరకు బడి బాట కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను చేర్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. –ఏ. సత్యనారాయణమూర్తి, డీఈఓ -
జనగామలో గంజాయి పట్టివేత
జనగామ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఆదివారం జనగామలో నిర్వహించిన తనిఖీల్లో 2.9 కిలోల గంజాయి పట్టుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఎస్సై రతీశ్, కానిస్టేబుళ్లు సాగర్, రమేశ్, నరేశ్, ప్రణయ్, మహేందర్ ఆర్టీసీ బస్టాండ్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ముగ్గురు యవకులు మిసాల శ్యామ్, కాశిబోయిన గౌతమ్, గుండా కార్తీక్ను ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారు 2.9 కిలోల గంజాయి లభించింది. దీంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ముగ్గురి యువకుల అరెస్ట్ 2.9కిలోల సరుకు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులు -
బడికి వేళాయె..
జిల్లాలో పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలలు 738 మోడల్ స్కూల్ 08 కేజీబీవీలు 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలు 23 మహాత్మాజ్యోతిబాపూలే గురుకులాలు 06 మైనార్టీ గురుకులాలు 05 ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 08 సాంఘిక సంక్షేమ గురుకులాలు 05 ప్రైవేట్ పాఠశాలలు 121 ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ 77మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. సోమవారం బడి గంట మోగనుండగా పుస్తకాలతో కుస్తీపట్టనున్నారు. దీంతో విద్యాలయాలు సందడిగా మారనున్నాయి. ప్రతీ విద్యాసంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పాఠశాలల్లో సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. పూర్తిస్థాయిలో చేరుకోని పుస్తకాలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 3,07,850 పుస్తకాలు రావాల్సి ఉండగా 1,00,090 మాత్రమే వచ్చాయి. కాగా, సరఫరా అయిన పుస్తకాలను గురుకులాలకు అందజేశారు. అలాగే జిల్లాకు స్కూల్ యూనిఫామ్ రాలేదు. జిల్లాలో మొత్తం 738 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత సంవత్సరంలో 40,703 మంది విద్యార్థులు నమోదు అయ్యారు. ప్రతీ విద్యాసంవత్సరం జూన్ నెలలో బడిబాట నిర్వహిస్తారు. విద్యాశాఖ ఆశించిన స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం మే 14 నుంచి బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,690 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. సమస్యలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల కొరత ఆందోళన కలిగిస్తోంది. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 3,491మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సరైన సబ్జెక్ట్ల టీచర్ల లేకపోవడంతో విద్యార్థులు విద్యాపరంగా నష్టపోవాల్సివస్తోంది. గతేడాది చాలాచోట్ల ప్రహరీలు, తాగునీరు, అదనపు గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు.. 2025–26 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మానుకోట రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచింది. చాలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 8,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,055మంది ఉత్తీర్ణత సాధించారు. 85 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ప్రశ్నార్థకంగా పర్యవేక్షణ.. జిల్లాలోని విద్యాధికారుల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. కాగా, 18 మండలాలకు సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈఓగా నియమించారు. ప్రధానోపాధ్యాయులు ఇటు పాఠశాల అటు ఎంఈఓ కార్యాలయ పనులతో సతమతమవుతున్నారు. దీంతో పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. ఎంఈఓలు అదనపు భారంతో సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ఐదేళ్లలో ప్రైవేట్లో నమోదు ౖపైపెకి.. గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ గురుకుల పాఠశాలల్లో పెరిగింది. కాగా, తమ పిల్లలు భద్రంగా ఉంటూ ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్తో పాటు గురుకులాల్లో జాయిన్ చేస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం జిల్లాకు చేరిన 1,00,090 పుస్తకాలు బడిబాటలో 3,690 మంది విద్యార్థుల అడ్మిషన్లు అడ్రస్ లేని స్కూల్ యూనిఫామ్ ఎక్కడి సమస్యలు అక్కడే.. ఐదేళ్లలో ప్రైవేట్ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు గురుకులాలకు సైతం ఆదరణ -
ఉద్యమకారుల సంక్షేమానికి కమిటీ
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. హనుమకొండ కాకతీయకాలనీలోని ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ నివాసంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆవిర్భావ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం నియమించిన కమిటీ రాష్ట్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహిస్తుందని, త్వరలోనే శుభవార్త చెబుతుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన మలిదశ ఉద్యమకారుల సమక్షంలో ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్గా గుడిమల్ల రవికుమార్ను ప్రకటించారు. ఈ సందర్బంగా గుడిమల్ల రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రూ.5వేల పింఛన్, ఆరోగ్యబీమా, గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు 20 మందితో కూడిన కమిటీని నియమించారు. సందెల సునీల్, ఓడపల్లి శ్యాంకృష్ణ, అనుముల రమేశ్, ఎండీ చాంద్పాషా, బొలిశెట్టి అశోక్, నెల్సన్, మీర్జా అంజద్, గోపగాని రాజు, టి.మనోహర్, చెన్నూరి నటరాజ్, జక్కుల స్వామి, రాంకుమార్, దస్తగిరి, బెజ్జంకి అశోక్, స్వర్ణలత, పద్మ, బరిగెల కృష్ణమూర్తి, ఉమ, సత్యం, రాజుతో కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
● కటాక్షపూర్లో ఘటన ఆత్మకూరు : గుర్తు తెలియని లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సిరంశెట్టి సాంబయ్య(66) తనకు ఎవరూ లేకపోవడంతో తన తమ్ముడి కుమారుడి ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బహిర్భూమికి వెళ్లడానికి రోడ్డు దాటుతుడున్నాడు. ఈ సమయంలో ములుగు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి కుమారుడు సిరంశెట్టి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. బైక్.. చెట్టును ఢీకొని ఇప్పలగూడెంలో వ్యక్తి.. వెంకటాపురం(కె): బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం ఇప్పలగూడెం గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన మడప నందయ్య(45), నూకాల మహేశ్ బైక్పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇప్పలగూడెం గ్రామ శివారులో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన గ్రామస్తులు 108లో వెంకటాపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నందయ్య మృతి చెందాడు. -
క్రీడా పాఠశాల.. నిర్వహణ ఎలా?
సర్కారు జీఓ లేదు .. రూపాయి ఇచ్చిందీ లేదు వరంగల్ స్పోర్ట్స్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు.. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి జిల్లాకు తీసుకొచ్చిన క్రీడా పాఠశాల ఒక్క ఏడాదిలోనే చతికిలబడే దుస్థితి నెలకొంది. భవిష్యత్ ప్రణాళిక లేమి, నిధుల కొరత, వసతుల కల్పన అంశాల పై దృష్టి కేంద్రీకరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గతేడాది ఎంతో ఆర్భాంటంగా ప్రారంభమైన క్రీడా పాఠశాల రెండో విద్యా సంవత్సరాన్ని కొనసాగించేందుకు ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నాయి. పాఠశాల నిర్వహణకు కావాల్సిన కనీస వసతుల కల్పన లోనూ పాలకులు, అధికారులు వ్యవహరించిన తీరు విద్యార్థులకు శాపంగా మారనుంది.తమ పిల్లలు చదువుతోపాటు ఆటల్లో తర్ఫీదు ఇచ్చే ప్రత్యేక క్రీడా పాఠశాలకు ఎంపికై నందుకు సంతోషించాలా..? అరకొర వసతుల నడుమ అవస్థలు పడుతారని తెలిసి ఆవేదన చెందాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రుల వంతు అయింది. నేడు స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నిధులు కేటాయించని ప్రభుత్వం.. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియ ంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక జీఓను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం విశేషం. ప్రభుత్వం జీఓనే కాదు.. గత విద్యా సంవత్సరం నిర్వహించిన స్పోర్ట్స్ స్కూల్కు ఒక్క రూపాయి కూడా నిధులను మంజూరు చేయలేదు. రూ.54 లక్షల నిధులు వెచ్చించిన డీఎస్ఏ.. హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహించేందుకు తరగతి గదులు, హాస్టల్ వసతులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాట్లను చేసింది. అందుకోసం సుమారు రూ.54 లక్షల నిధులను డీఎస్ఏ స్వయంగా వెచ్చించింది. ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించారు. పెండింగ్లో మెస్ బిల్లు.. స్పోర్ట్స్ స్కూల్ మొదటి సంవత్సరం నాలుగో తరగతితో ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 49 మంది బాలబాలికలు గత సంవత్సరం నాలుగో తరగతిని అభ్యసించారు. విద్యార్థులకు రూ.11.50 లక్షల మెస్ బిల్లులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్ బిల్లులు రాక అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. గత ఏడాది బిల్లులే ఇప్పటీకీ రాలేదు, కొత్తగా ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పోర్ట్స్ స్కూల్కు చేరిన పాఠ్య పుస్తకాలు.. నిధులు, వసతుల మాట పక్కన పెడితే నాలుగు, ఐదు తరగతుల పాఠ్య పుస్తకాలు ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్కు చేరుకున్నాయి. పుస్తకాలను అందుకున్న విద్యార్థులకు తరగతిగదుల, హాస్టల్ ఏర్పాట్లు ఎప్పటికీ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.కేవలం నాలుగో తరగతి మాత్రమే నిర్వహించిన డీఎస్ఏకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఈ విద్యా సంవత్సరం అదనంగా ఐదో తరగతిని కొనసాగించేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో గత విద్యా సంవత్సరం నాలుగో తరగతి చదివిన విద్యార్థులు 49 మంది ఐదో తరగతిలోకి అడుగుపెడుతుండగా.. కొత్తగా నాలుగో తరగతిలో అడ్మిషన్లు పొందిన 80 మంది విద్యార్థులను కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం 129 మంది విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్ వసతిపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. గతేడాది డీఎస్ఏ నిధులతోనే నిర్వహణ పాఠశాలకు అదనపు గదుల కొరత నేడు ప్రారంభం కానున్న స్పోర్ట్స్ స్కూల్ -
మళ్లీ చెట్ల కింద చదువులేనా..!
కొత్తగూడ: మండలంలోని వేలుబెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 77 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒక్క గది మాత్రమే ఉన్నది. బడిని మన ఊరు–మన పాఠశాల పథకంలో ఎంపిక చేసి అదనపు తరగతి గదులు, మంచి నీటి వసతి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. అయితే మూడేళ్లు అయినా పనులు మాత్రం పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే చేసిన పనులకు బిల్లులు రాలేదని, వస్తేనే మిగిలిన పనులు చేస్తానని చెప్పాడు. కాగా ఈ విద్యాసంవత్సరం కూడా విద్యార్థులు చెట్లకిందనే పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఉత్తమ విద్యాబోధన.. ఫలితాల సాధన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–2026 విద్యాసంవత్సరం పదో తరగతి ఫలి తాల్లో 67 మంది విద్యార్థులకు గాను 66 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా 558 మార్కులు సాధించి విద్యార్థిని ఏనుగ ఇందు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. ముగ్గురు విద్యార్థులు సౌశీల్ రెడ్డి, లక్ష్మిప్రసన్న, ప్రసన్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ టెస్టు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి జరుగుతుండగా పీఎంశ్రీ పథకం ద్వారా విద్యార్థుల అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. -
వర్షపు నీటితో నిండిన అండర్బ్రిడ్జి
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ పట్టణంలో రైల్వే అండర్బ్రిడ్జి కొద్దిపాటి వర్షానికే నీటితో నిండిపోవడంతో చెరువును తలపిస్తోంది. ఆదివారం గంటపాటు కురిసిన వర్షంతో నీరు అండర్బ్రిడ్జిలోకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని కొత్త బజారు, పాత బజారును అనుసంధానం చేసేలా ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఏటా వర్షాకాలంలో వర్షపు నీటితో నిండిపోతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనదారులు, పాదచారులు పాత బజారు నుంచి కొత్త బజారుకు పట్టణ శివారు ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ వానాకాలం ఇదే పరిస్థితి నెలకొంటుందని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. అండర్బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే.. వర్షం వల్ల అండర్బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అండర్బ్రిడ్జిని పరిశీలించారు. ప్రజల రాకపోకలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్, 33వ వార్డు కౌన్సిలర్ బి.అజయ్సారథిరెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణజ్ఞానేశ్వర్, అధికారులు తదితరులు ఉన్నారు. కొత్త బజారు, పాతబజారుకు నిలిచిపోయిన రాకపోకలు పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు, కౌన్సిలర్లు ఏటా వర్షాకాలం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
రక్తదానానికి ముందుకు రావాలి
● రక్తదాత తోట రాజేశ్వర్రావు ● ఎంజీఎంలో 135వ సారి రక్తదానం కాశిబుగ్గ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకోవడంలో ఉన్న సంతృప్తిలో ఎక్కడా ఉండదని ప్రముఖ ఫొటో గ్రాఫర్, ఆర్య సమాజం కార్యకర్త, రక్తదాత తోట రాజేశ్వర్రావు అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన 135వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రావు మాట్లాడుతూ ప్రతీఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, మనం చేసే రక్తదానం ఇతరుల ప్రాణాలను కాపాడుతుందన్నారు. వైద్యుల సూచనల ప్రకారం ఎన్నిసార్లు రక్తదానం చేసినా సమస్యలు రావని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి రక్తం సకాలంలో అందించాలంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత రక్తదానం చే స్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. -
కళాకారులకు అండగా ఉంటాం
● తెలుగు ఉభయ రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు మల్లేశం ● ముగిసిన జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు హన్మకొండ కల్చరల్: కళాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలుగు ఉభయ రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షుడు, కేంద్రఖాదీ చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ మేరకు ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈగ మల్లేశం, విశిష్ట అతిథులుగా గట్టు మహేశ్బాబు, నాటక సమాజాల రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, సీనియర్ రంగస్థల కళాకారులు బిటవరం శ్రీధరాస్వామి, బిటవరం శ్రీనాఽథ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ రంగస్థల కళాకా రుల ఐక్యవేదిక తరఫున అనేక సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య, కార్యవర్గాన్ని అభినందించారు. అనంతరం వెంపటి శ్రావణి శిష్యబృందం చేసిన శాసీ్త్రయ నృత్యాలు, మిమిక్రీ ప్రదర్శనలు అలరించాయి. ఎన్ఎస్ఆర్ మూర్తి, జేఎన్ శర్మ, ఆకుతోట లక్ష్మణ్, సాధుల సురేశ్, కుసుమ సుధాకర్, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్, సీత వెంటేశ్వర్లు, మాలి విజయ్రాజ్, సంజయ్బాబు, మట్టెవాడ అజయ్, నేరెళ్ల శోభావతి, తదితరులు పాల్గొన్నారు. ‘సూపర్’లో డిప్యూటీ సూపరింటెండెంట్ బదిలీ ● ఇక ఆర్ఎంఓపై ఆస్పత్రి భారం కాశిబుగ్గ: వరంగల్ కేఎంసీలోని సూపర్ స్పెషా లిటీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూ సుకునే డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బా లరాజు ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఆ స్పత్రి నిర్వహణ అంతా ఏకై క ఆర్ఎంఓ ప్రతా ప్పై పడింది. ఇప్పటికే ఔట్ సోర్సింగ్పై ఆధారపడి నడుస్తున్న సూపర్ ఇక సమస్యలమయంగా మారనుంది. ఎంజీఎంలో బిగ్బాస్ పోస్టు భర్తీ అయితేనే డిప్యూటీకీ మార్గం.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో బిగ్బాస్ (సూపరింటెండెంట్) పోస్టు వారం దాటినా భర్తీ కా వడం లేదు. ఇక్కడ కూడా ఆర్ఎంఓలపై భా రం పడుతోంది. ఇక్కడ పనిచేసిన ఇన్చార్జ్ సూ పరింటెండెంట్ బదిలీ కాగానే కొత్త వారు బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల పేదల పెద్దాసుపత్రికి బాస్గా ఎవరూ వస్తారో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ ఉన్నతాధికారి ఎంజీఎంతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నూతనంగా నిర్మాణం పూర్తి కావొస్తున్న 24 అంతస్తుల వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఇంత పెద్దాసుపత్రులకు నూతన బాస్ పోస్టింగ్ ఎందుకో జాప్యం జరుగుతోంది. అయితే ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వస్తేనే సూపర్లో డిప్యూటీ సూపరింటెండెంట్ను నియమించాల్సి ఉంటుంది. దీంతో కొత్త సూపరింటెండెంట్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. -
హెల్మెట్ మరిచాడు.. ప్రాణం కోల్పోయాడు
● రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై యువకుడి మృతి తొర్రూరు : నిర్లక్ష్యం ఒకరి ప్రాణం బలిగొంది. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఓ యువకుడి ప్రా ణం గాలిలో కలిసింది. ఈ విషాదకర ఘటన తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్(32) నెల్లికుదురు ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య పిల్లలతో తొర్రూరులో నివాసముంటున్నాడు. ఆదివారం సెలవు కా వడంతో తల్లితో చేపల కూర వండించుకుని తిందా మని స్వగ్రామ గుర్తూరుకు బైక్పై బయలుదేరాడు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్.. బైక్ను ఢీకొంది. దీంతో యువకుడి తలకు తీవ్ర గాయమైంది. కాళ్లు నుజ్జునుజ్జ య్యాయి. స్థానికులు గుర్తించి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం కోల్పోయాడు. ఘటనా స్థలిని సందర్శించిన ఎస్సై యువకుడికి తలకు తీవ్రగాయమవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని, తె లిపారు. అందరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కా పాడుకోవాలని స్థానికులకు సూచించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు సూర్యాపేటలోని టేకుమట్లకు చెందిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నరేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎస్సై అరెస్ట్వరంగల్ క్రైం: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సీసీఎస్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజ్కుమార్ను ఆదివారం అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఓ వివాహిత న్యా యం కోసం హనుమకొండ పోలీసులను ఆశ్రయించింది. అయితే, అప్పుడు అక్కడ విధులు నిర్వర్తిస్తు న్న రాజ్కుమార్ ఆ మహిళను పెళ్లి పేరుతో మోసం చేయడమేకాకుండా శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో సదరు మ హిళ హనుమకొండ పీఎస్లో ఫిర్యాదు చేసింది. కే సు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలి పారు. సదరు ఎస్సై రాజ్కుమార్ను అరెస్ట్ చేసి కో ర్టులో హాజరు పరిచినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా
సంగెం: దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ బోల్తాపడి రైతు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన రైతు అల్లం అనిల్ (35) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ అప్పుడప్పుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం గ్రామానికి చెందిన ఒడిదేని మహేశ్కు చెందిన ట్రాక్టర్ రోటోవేటర్తో అనిల్ తన వ్యవసాయ భూమిలో దుక్కిదున్నుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ అదుపు తప్పి కిందపడిపోయింది. రోటోవేటర్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడి అనిల్ అక్కకడిక్కడే మృతి చెందాడు. అనంతరం ట్రాక్టర్ రోటోవేటర్తో సహా ముందుకు వెళ్లి అక్కడ ఉన్న దేవాదుల ఎత్తిపోతల ఉపకాల్వలో బోల్తా పడింది. అనిల్కు భార్య సుప్రియ, కుమారుడు అశ్విన్, కూతురు కనిష్క ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అనిల్ తల్లిదండ్రులు, భార్య సుప్రియ, పదేళ్లలోపు ఉన్న పిల్లలు రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలచివేసింది. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. తీవ్రగాయాలతో రైతు మృతి -
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం అమావాస్య కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాఠశాలల తనిఖీ కొత్తగూడ: మండలంలోని పలు పాఠశాలలను ఆదివారం డీఈఓ సత్యనారాయణమూర్తి తనిఖీ చేశారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు వచ్చాయా అని ఎంఈఓ గుమ్మడి లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. మండల కేంద్రంలో దివ్యాంగుల కోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని పరిశీలించారు. వేలుబెల్లి ప్రాథమికోన్నత పాఠశాల గదులు, మరుగుదొడ్లు, వంట గదిని తనిఖీ చేశారు. ఆయన వెంట కమ్యూనిటీ మొబిలైజర్ సురేష్, వేలుబెల్లి సర్పంచ్ అక్షయ్వర్మ ఉన్నారు. తాటి, ఈత చెట్లు దగ్ధంమహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామంలో 30 తాటి చెట్లు, 60 ఈత చెట్లు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు వ్యాప్తిచెంది తాటి, ఈత చెట్లు ఉన్న ప్రాంతానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధిత గౌడ కులస్తులు ప్రమాదంపై విచారణ జరిపి నష్టపరిహారం అందించాలని కోరారు. హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్శర్మ, ఈశ్వర్చంద్ శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
రెడ్క్రాస్కు 8 రాష్ట్రస్థాయి అవార్డులు
హన్మకొండ అర్బన్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హనుమకొండ రెడ్క్రాస్ 8 రాష్ట్రస్థాయి అవార్డులు, రక్తకేంద్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. హైదరాబాద్లోని లోక్భవన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కలెక్టర్ చాహత్బాజ్పాయ్, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, రాష్ట్ర పాలకమండలి సభ్యుడు వీవీ శ్రీనివాస్రావు అవార్డులు అందుకున్నారు. రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహించడం, నాణ్యమైన రక్తసేవలు అందించడం, రక్త నిల్వలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా హనుమకొండ రెడ్క్రాస్ రక్తకేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ‘అత్యధిక రక్త సేకరణ చేసిన రక్తకేంద్రం’ విభాగంలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అలాగే, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వహణలో విశేష కృషి చేసిన హనుమకొండకు చెందిన ఎస్ఆర్ యూనివర్సిటీ, కిట్స్, వాగ్దేవి విద్యాసంస్థలకు అవార్డులు లభించాయి. విశిష్ట సేవల విభాగంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్, డఫోడిల్స్ స్కూల్కు గుర్తింపు లభించగా, అత్యధిక సార్లు స్వచ్ఛంద రక్తదానం చేసినందుకు జి.రామకృష్ణ, బి.శిరీష్కుమార్ రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు. జిల్లాకు 8 రాష్ట్రస్థాయి అవార్డులు లభించడం గర్వకారణమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హనుమకొండ రెడ్క్రాస్ రక్తకేంద్రాన్ని త్వరలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. -
వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: రైతులు వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల సహకారంతో రైతులకు ఉచితంగా వ్యవసాయ స్ప్రేయర్లను పంపిణీ చేసింది. హుస్సేన్ నాయక్ హాజరై మాట్లాడారు. రైతుల సాధికారత కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సంస్థ వ్యవసాయ స్ప్రేయర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని, మహిళలకు కుట్టుమిషన్లు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ అధికారి వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, గిరిజనశాఖ అధికారి దేశీరాంనాయక్, ఆర్డీఓ రాజేశ్వరీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, తహసీల్దార్ రాజేశ్వర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, నాయకులు ఎడ్ల అశోక్, ఒద్దిరాజు రామచంద్రరావు, శ్యామ్సుందర్శర్మ, మహేశ్, అశోక్కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
డోర్నకల్: రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్(పీసీఎస్సీ) అరోమాసింగ్ ఠాగూర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్తో పాటు ఆర్పీఎస్ స్టేషన్, పలు ప్లాట్ఫారాలను శనివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్పీఎఫ్ స్టేషన్ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం నాలుగు ప్లాట్ఫారాలను, మూడో లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్, ఆర్పీఎఫ్ సీఐ సురేష్గౌడ్, ఎస్సై యాసీన్బేగం తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. హన్మకొండ అర్బన్: భూగర్భ జల శాఖలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఠాకూర్ ధరమ్సింగ్ స్వచ్ఛంద రక్తదానంలో విశేష గుర్తింపు పొందారు. 1988లో మామునూరులో జరిగిన ఎన్సీసీ శిబిరంలో తొలిసారి రక్తదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సార్లు రక్తం ఇచ్చారు. 50 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా 2024లో జాతీయ అవార్డు, 53వ సారి రక్తదానం చేసిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో ‘హ్యుమనిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్నారు. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, ఆతర్వాత రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధి 36వ వార్డులో శనివారం రూ.60 లక్షలతో నిర్మాణం చేయనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మానుకోటను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. మంచి పనుల విషయంలో తన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య. డీఈఈ ఉపేందర్, స్థానిక కౌన్సిలర్ ముత్యం వెంకన్న, నాయకులు రామ్మోహన్రెడ్డి, మార్నేని వెంకన్న, జె.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో ఆర్థిక బలోపేతం
గూడూరు: పంట మార్పిడితో రైతులు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు నేర సారవంతమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర అన్నారు. మండలంలోని మట్టెవాడ శివారు నేలవంచలో శనివారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పంటల మార్పిడిపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. వరి కొయ్యలు కాల్చొద్దని, నానో యూ రియా వాడకం వల్ల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్మాలిక్, సాంకేతిక వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓలు పాల్గొన్నారు. రైతులు దృష్టిపెట్టాలి.. బయ్యారం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట, కొత్తగూడెం, కోయగూడెం, కంబాలపల్లి, వెంకటాపురం, కంబాలపల్లి, అల్లిగూడెం పంచాయతీల్లో శనివారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. యూరి యా యాప్ బుకింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయన వెంట ఏఓ రాజు తదితరులు ఉన్నారు. -
నాణ్యమైన విద్య.. ఉత్తమ ఫలితాలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. మెరుగైన బోధన, వసతుల కల్పనతో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలు అనగానే మెరుగైన విద్యా ప్రమాణాలు ఉండవని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించరని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక అపనమ్మకం ఏర్పడింది. కానీ, అవన్నీ అసత్యాలని నిరూపిస్తూ ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయి లో మూడో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శ నం. కాగా, ఆయా కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. 1970లో స్థాపన.. 1970 సంవత్సరంలో మానుకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్థాపించారు. ఇక్కడ ఎంతో మంది నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ఇక్కడ చదివిన వారు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు సాధించారు. కాగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను చేర్పించి కళాశాలను కాపాడుకోవాలని అధ్యాపక బృందం కోరుకుంటుంది. కోర్సులివే.. మానుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు డిప్లొమా వృత్తి విద్యా కోర్సులు సీటీ, ఈటీ, ఎంఈటీ, ఎంఎల్టీ గ్రూపులు ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతులు ఉన్నాయి. 46 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. కాగా, విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలను అప్గ్రేడ్ చేస్తూ తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో విద్యాబోధన చేస్తోంది. జిల్లాలో మొత్తం 10 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వాటిలో అత్యధికశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పెరిగిన వసతులు అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ప్రచారం ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణీ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకు మూడో ర్యాంకు ఉచిత అడ్మిషన్ నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందం విశాలమైన తరగతి గదులు, సౌకర్యాలు అత్యాధునికమైన ప్రయోగశాలలు అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్ నిర్వహణ గ్రంథాలయం, స్టడీ అవర్స్ వారానికి ఒకరోజు సప్లిమెంట్ టెస్టు నిర్వహణ వెనుకబడిన విద్యార్థులకు కేర్టేకర్తో ప్రత్యేక శిక్షణ మనటీవీ ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు సామాజిక అంశాలపై సాహిత్య, సాంస్కృతిక పోటీలు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు బస్పాస్ సౌకర్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లుప్రత్యేకతలు ఇవే.. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇష్టారీతిన రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయవద్దని టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్స్ వీధిలో ఆస్పత్రుల ఎదుట ద్విచక్ర వాహనాలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంపై శనివారం సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులు తమ ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఒక పద్ధతి ప్రకారం వాహనాలను పార్కింగ్ చేసుకోవాలే తప్ప ఎదుటి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తేవిధంగా ప్రవర్తించవద్దని సూచించారు. సీఐ సూచన మేరకు ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ పాపులాల్, హోంగార్డులు జంపయ్య, దేవేందర్ డాక్టర్స్ వీధిలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిపెద్దవంగర: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్త టాస్క్ఫోర్స్ అధికారులు సూచించారు. మండలంలోని రైతువేదికలో శనివారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లకు వానాకాలం పంటల సాగుకు సంబందించిన విత్తనాల విక్రయాలు, నిల్వలు, నాణ్యతా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పని సరిగా రశీదు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్లు చూసుకోవాలని, అనుమతిలేని నకిలీ విత్తనాలను విక్రయించొద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్స్ను రద్దుకు సిఫారసు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ స్వామి నాయ క్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, రెవెన్యూ అధికారులు, ఏఈఓలు, డీలర్ల సంఘం అధ్యక్షుడు దామోదర్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శనిత్రయోదశి..భక్తులు కిక్కిరిసి! కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా ని ర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. 17న భద్రకాళి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో ఈనెల 17న నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని భద్రకాళి ఆలయ ఈఓ సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు, ఈమేరకు జూన్ 15న సోమవారం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ 17న బుధవారం ఉదయం 8.36 గంటలకు కర్కాటక లగ్నంలో జరిగే ప్రతిష్ఠాపనోత్సవంలో జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీశ్రీవిద్యాశంకర భారతీస్వామి పాల్గొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పరిశీలనతోనే సరి!
● స్థలాలు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం ● కిరికిరిలో ప్రభుత్వ భూములు ● అధికారులకు తలనొప్పిగా మారిన కోర్టు కేసులు మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కేవలం రికార్డులకే పరిమిత మయ్యాయి. చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాగా.. ఉన్న భూములు కూడా కోర్టు కేసుల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్థలాల కేటాయింపు పరిశీలనకే పరిమితమవుతోంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. అలాగే కోర్టు కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి. నిర్మాణంలోని పలు అభివృద్ధి పనులు కూడా కోర్టు కేసులతో నిలిచిపోయాయి. కబ్జాల పర్వం.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. చివరకు చెరువులను కూడా వదలడం లేదు. అవి కుంట లుగా మారాయి. చివరకు కలెక్టరేట్ నిర్మా ణం కోసం కూడా స్థల సమస్య ఎదురైంది. ఆవిషయంలోఆందోళనలు జరిగి చివరకు కొంత మంది రైతులకు నష్టరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేశారు. మెడికల్ కాలేజీతో పాటు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కూడా భూ సమస్యలు తలెత్తాయి. పరిశీలనకే పరిమితమైన కేటాయింపు.. ● జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల కోసం రెవెన్యూ, సంబంధిత అధికారులు కొన్ని నెలలుగా స్థలాల కేటాయింపు కోసం సర్వేలు చేస్తున్నారు. ● జిల్లా కేంద్రంలో రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో మంజూరు కాగా.. నిర్మాణం కోసం స్థలాలు పరిశీలిస్తున్నారు. కాగా, మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం గ్రామ శివారు మొగిలిచర్ల రోడ్డులో సర్వే నంబర్ 137లో స్థల పరిశీలన చేసి 409 ఎకరాలు గుర్తించారు. కాని నేటికీ రైల్వే అధికారులకు కేటాయించలేదు. ● ఇంటెలిజెన్స్ ఆఫీసు కోసం సర్వే నంబర్ 551లో ఎస్పీ ఆఫీస్ సమీపంలో అర ఎకరం స్థల పరిశీలన చేశారు. అయితే కేటాయించలేదు. ● పోలీస్శాఖకు చెందిన భరోసా కేంద్రం, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ కోసం కలెక్టరేట్ రోడ్డులో 251 సర్వే నంబర్లో రెండెకరాలు గుర్తించారు. నేటికీ కేటాయించలేదు. ● జువైనల్హోం కోసం 551 సర్వే నంబర్లో రెండున్నర ఎకరాల స్థలం కేటాయించినా పలు సమస్యలున్నాయి. హార్టికల్చర్ కాలేజీ కోసం 551సర్వే నంబర్లో 16ఎకరాలు మెడికల్ కాలేజీ సమీపంలో పరిశీలించారు. ● ఇంజనీరింగ్ కాలేజీ కోసం జిల్లాకేంద్రం శివారులో గుమ్ముడూర్లో 281,287 సర్వే నంబర్లలో 70 ఎకరాలు కేటాయించారు. దానిలోనూ సమస్యలు ఉన్నాయి. కొలిక్కి రాని వివాదాలు.. జిల్లా కేంద్రంలోని కొత్తబజార్లో రెండెకరాల్లో ఆఫీసర్ క్లబ్ ఉంది. ఆ స్థలం విషయంలో స్పష్టత లేదు. మున్సిపాలిటీకి సంబంధించినదేనని, దానిలో ఇండోర్ స్టేడియంలో లేక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని దశాబ్దకాలంగా అంటున్నారు. అలాగే ఇందిరాగాంధీ సెంటర్లో సుమారు 2,000 గజాల స్థలం ఉంది. దానిని 2019లో వేలం వేసే ప్రయత్నాలు జరిగాయి. కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు ఆ స్థలం తమదే అని అంటుండగా.. మున్సిపాలిటీ అధికారులు ఆస్థలం మన్సిపాలిటీదని వాదనలు జరుగుతున్నాయి. కోర్టు కేసులతో.. జిల్లా కేంద్రం శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొన్ని కోర్టు కేసుల వల్ల నిలిచిపోయాయి. ఈనెల 10న కలెక్టర్ స్నేహశబరీష్ వాటిని పరిశీలించారు. 2018లో అనంతారం రోడ్డులో ఆరెకరాల స్థలంలో స్మృతి వనం పనులు చేపట్టారు. సగానికి పైగా పనులు జరిగాయి. అప్పటి కలెక్టర్ తన క్యూషల్ ఫండ్ నుంచి రూ 27.50 లక్షలు కేటాయించారు. కానీ కోర్టు కేసులతో పనులు నిలిచిపోయాయి. -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్రెడ్డి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుధీర్ఘ కాల ప్రయోజనాలకు సంబంధించిన జీఓ 21ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసి డిగ్రీ కళాశాలలకు పదోన్నతి పొందినవారికి జూనియర్ కళాశాలల్లో పనిచేసిన 50శాతం సర్వీస్ను కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(క్యాస్)లో పదోన్నతులకు పరిగణలోనికి తీసుకోనున్నారు. దీంతో ఎంతోమంది డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా ప్రయోజనం లభించనుంది. ఈజీఓ సాధించినందుకు సురేందర్రెడ్డికి శనివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సంఘం బాధ్యులు అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ జీఓ సాధనకోసం సంఘం నిరంతరంగా పోరాడిందన్నారు. విద్యారంగంలోని సంస్కరణలకు కట్టుబడి ఉంటూ ఈ కీలకమైన జీఓ 21ని ప్రత్యేక చొరవ తీసుకొని ఆమోద ముద్రవేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆధునిక డిజిటల్ తరగతులు, మౌలికవసతులు మెరుగుపర్చాలన్నారు. అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు గోపి, ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నా, మహిళా సెక్రటరీ డాక్టర్, శ్రావణి, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ రమేష్గౌడ్, మల్టీజోన్–1 సెక్రటరీ డాక్టర్ శంకరయ్య, గౌరవ ససలహాదారు డాక్టర్ బెల్లియాదయ్య, యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజారామ్, శాతవాహన యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ కోఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి మాట్లాడారు. బాధ్యులు, శాంతికుమార్, ములుగు, పర్కాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ మల్లేశం, డాక్టర్ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి -
చిట్ఫండ్స్ బాధితుల వెతలు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఆధ్వర్యంలో రిజిష్టర్డ్ చిట్ఫండ్ కంపెనీల్లో తమ సొమ్మును చిట్టీల రూపంలో పొదుపు చేసుకున్న బాధితులకు ఊరట కల్పించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ గతేడాది ఎఫ్డీ రిలీజ్కు ఆర్డర్ ఇచ్చింది. దీంతో గతేడాది అక్టోబర్ నుంచి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 168 రిజిష్టర్డ్ చిట్ఫండ్ కంపెనీల బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, ఫిర్యాదు చేసినా.. చిట్ఫండ్ కంపెనీలు, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 మందికి ఎఫ్డీలు అందించిన కనకదుర్గ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అచల, అక్షర, శుభనందిని, భవితశ్రీ, కనకదుర్గలతోపాటు 168 రిజిష్టర్డ్ చిట్ఫండ్ కంపెనీలను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా చిట్ఫండ్ కంపెనీలో ఒక చిట్టీ ప్రారంభించాలంటే దానికి సరిపడా సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చెల్లించాలనేది నిబంధన. తద్వారా సదరు చిట్స్ కంపెనీ బోర్డు తిప్పేసినా, డబ్బులు తిరిగి చెల్లించకపోయినా ఎఫ్డీల నుంచి చెల్లిస్తారు. అచల, అక్షర, శుభనందిని, భవితశ్రీ, కనకదుర్గ చిట్ఫండ్ కంపె నీల బాధితులకు ఎఫ్డీలను తొలుత చెల్లించేందు కు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జా రీ చేసింది. కేవలం కనకదుర్గ చిట్ఫండ్ మాత్రమే గతేడాది డిసెంబర్ నుంచి 300 మందికిపైగా ఎఫ్డీ చెక్కులను అందజేసి చేతులుదులుపుకుంది. అయితే కనకదుర్గ చిట్స్పై కూడా వందల సంఖ్యలో ఫిర్యాదులు ఉండడం గమనార్హం. డీఎల్ఎస్ఏను ఆశ్రయించిన అచల బాధితులు.. అచల చిట్ఫండ్ కంపెనీకి చెందిన బాధితులు చిట్స్ సహాయ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా లీగల్ సెల్ అథారిటీ చొరవతో మూడు కోట్ల ఎఫ్డీలను 80 మందికి అందజేశారు. ఇంకా 30 మంది బాధితులకు ఎఫ్డీల చెక్కులు అందాల్సి ఉండగా. కన్జ్యూమర్ కోర్టు ద్వారా 15 మందికి పరిహారం అందింది. జాయింట్ అకౌంట్ తెరవని శుభనందిని.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఎఫ్డీ రిలీజ్ను ప్రారంభించినా.. శుభనందిని మాత్రం ఏడాదిగా జాయింట్ అకౌంట్ను తెరవలేదు. ఎఫ్డీ రిలీజ్ కోసం జిల్లా రిజిస్ట్రార్తోపాటు సంబంధిత చిట్స్ కంపెనీ చైర్మన్లు జాయింట్ అకౌంట్ను ప్రారంభించాలి. కానీ శుభనందిని ఇంత వరకు అకౌంట్ ఓపెన్ చేయకుండా.. తన రియల్ వెంచర్లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటుంది. ఎఫ్డీల కోసం ఎదురుచూపులు ఏడాదిగా ఖాతా తెరవని శుభనందిని కుప్పలుగా ఫిర్యాదులు డీఎల్ఎస్ఏను ఆశ్రయించిన అచల బాధితులు -
ప్రాణం తీసిన అతివేగం.. నిద్రమత్తు
రఘునాథపల్లి: వివాహవేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైనవారు మరో అరగంటలో స్వస్థలానికి చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కింద చెట్లను ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దనగిరి దర్గా వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజిముద్దీన్ భార్య షాహిన్బేగం, కుమార్తె అయేషాసుల్తాన, కుమారుడు అసదుద్దీన్ (26), బంధువులు మహ్మద్ రహీముద్దీన్, అతని భార్య రేష్మ సుల్తానాతో కలిసి కొండ్రాతి సంతోష్కు చెందిన కారును అద్దెకు తీసుకున్నారు. రహీముద్దీన్ కారు నడుపుతూ ఈ నెల 11న కర్ణాటకలోని గుల్బర్గా వెళ్లారు. అక్కడ అతని కుమార్తె హబీబా అఫ్సా (27) బంధువుల వివాహ రిసెప్షన్లో పాల్గొని 12వ తేదీ రాత్రి హనుమకొండకు పయనమయ్యారు. రహీముద్దీన్ కుమార్తె హబీబాఅఫ్సా కూడా వారితో వస్తోంది. అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో గోవర్దనగిరి దర్గా ఎదురుగా ఉన్న మూల మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్లను బలంగా ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఎడమ వైపు ముందు సీట్లో తండ్రి పక్కన కూర్చున్న హబీబా అప్సా, ఎడమ వైపున వెనుక సీట్లో కూర్చున్న అజిముద్దిన్ కుమారుడు అసదుద్దీన్ తల, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని షాహిన్బేగం, అయేషాసుల్తాన, రహీముద్దీన్, రేష్మ సుల్తానా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగ్రాతులను 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హబీబా ఆఫ్సా, అసదుద్దిన్ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అజిముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై నరేష్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదస్థలాన్ని వెస్ట్జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. కారు అదుపు తప్పడంతో ప్రమాదం ఇద్దరి దుర్మరణం నలుగురికి తీవ్ర గాయాలు గోవర్దనగిరి దర్గా వద్ద ప్రమాదం -
నాటకరంగాన్ని బతికించాలి
హన్మకొండ కల్చరల్: నాటక కళాకారులకు ఆదరణ కరువైందని, దాతలు, కళాపోషకులు, ప్రభుత్వం కళలు, కళాకారులను ఆదరించి నాటకరంగాన్ని బతికించుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శనివారం రెండో రోజు కొనసాగాయి. ఈ మేరకు వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథులుగా కవి రామాచంద్రమౌళి, కళారాజేశ్వరరావు, యేర కోటేశ్వరరావు, ఆకుతోట లక్ష్మణ్, డాక్టర్ కాజీపేట తిరుమలయ్య పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అనంతరం వెంపటి శ్రావణి శిష్యబృందం చేసిన శాసీ్త్రయ నృత్యాలు అలరించాయి. నాటిక పోటీల్లో భాగంగా రెండోరోజు ‘ఇది అతని సంతకం’, ‘కొత్త భూతం’ నాటిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ మూర్తి, జేఎన్ శర్మ, సాదుల సురేష్, కుసుమ సుధాకర్, శ్రీధరస్వామి, జూలూరు నాగరాజు, ఆకుల సదానందం, సీత వెంటేశ్వర్లు, మట్టెవాడ ఆజయ్ పాల్గొన్నారు. పాత ఇనుప సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత ఇనుప సామగ్రి దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 4.30 గంటల సమయంలో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పాత ఇనుప సామగ్రి దుకాణంలో పాత పుస్తకాలు, పేపర్లు పెద్ద మొత్తంలో ఉండడంతో మంటలు అదుపులోకి రావటానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రెండ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు -
గుప్తనిధుల పేరిట బురిడీ
ఏటూరునాగారం: పాత బంగారం ఇస్తే కిలో కొత్త బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొంగురు మహేష్ తెలిపారు. శనివారం పోలీస్స్టేషన్లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు తులాల పాత బంగారం, పుస్తెల తాడు ఇస్తే పూజలు చేసి కొత్త బంగారం కిలో ఇస్తామని మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన షేమినా, రజియా, షేమినా భర్త రబ్బాని మోసం చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన చిదురాల వాసుదేవ్ అతడి భార్య శ్వేత వద్దకు వెళ్లిన సదరు మహిళలు తమకు గుప్తనిధుల్లో బంగారం దొరికిందని, పాత బంగారం ఇస్తే కిలో కొత్త బంగారం ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం పుస్తెలతాడుతోపాటు తవ్వకాల్లో దొరికిన బంగారం ఇస్తామని చెప్పి రూ.14 లక్షల నగదును కూడా ఈ ముఠా సభ్యులు వాసుదేవ్వద్ద తీసుకున్నారు. ఆ తర్వాతముఖం చాటేసి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుండగా వాసుదేవ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు నిందితులు మరికొన్ని మోసాలకు కూడా పాల్పడినట్లు తెలుస్తోందని తెలిపారు. ముగ్గురు మహిళలపై కేసు ఎస్సై బొంగురు మహేష్ -
వెండి పట్టీలకు మెరుగు పేరుతో మోసం
ఏటూరునాగారం: వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతామని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఓడవాడలో శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా.. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన ఇర్సవడ్ల భాగ్య, సుంకరి లలిత, బొడ్డు హరిత, పాలిశెట్టి రమణల వద్దకు ఓ వ్యక్తి వచ్చి వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతానని చెప్పి కాళ్లకు ఉన్న గొలుసులు తీసుకొని తనతో తెచ్చుకున్న రసాయనంలో శుభ్రం చేశాడు. ఇలా నలుగురితోపాటు మరో పది మంది వద్ద గొలుసులు రసాయనంలో పాలిష్ వేస్తామని చెప్పాడు. అయితే సదరు వ్యక్తి డబ్బులు తీసుకోకుండానే ఎందుకు పట్టగొలుసులను శుభ్రం చేస్తున్నాడని అనుమానించిన మహిళలు తమకు తెలిసిన బంగారం షాపు వద్దకు వెళ్లి గొలుసులను తూకం వేయించగా.. బరువు తగ్గి ఉన్నాయి. 20 తులాలు ఉన్న పట్టగొలుసు పది తులాలు, 10 తులాలు ఉన్న గొలుసు 6 తులాలు ఇలా తరుగు పేరుతో అరగదీసి ఆ వ్యక్తి పరారైనట్లు గ్రహించి కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే రోజు 15 మంది గొలుసుల తరుగు పేరుతో వెండిని తస్కరించడం సంచలనం కలిగించింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆలస్యంగా గుర్తించిన బాధితులు ఏటూరునాగారంలో ఘటన -
కాజీపేట రైల్వే క్రూ లాబీ బలోపేతం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే క్రూ బుకింగ్ లాబీ బలోపేతం అవుతుంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే అధికారులు లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టింగుల్లో 121 మంది స్టాఫ్కు కాజీపేట క్రూలాబీకి మంజూరు చేశారు. కొంత కాలంగా నుంచి క్రూ లింక్ల తరలింపు, కుదింపు, నిర్వీర్యం సమస్యలతో సతమతువుతున్న కాజీపేట లోకో రన్నింగ్స్టాఫ్కు 121 మంది పోస్టింగ్ కొంత ఊరటనిచ్చిందని రైల్వే నాయకులు చెబుతున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్ల కేటగిరీ విభాగం బదిలీల్లో 47 మంది, మెయిల్ ఎక్స్ప్రెస్ పదోన్నతుల్లో ఐదుగురు లోకోపైలెట్లు, ప్యాసింజర్ లోకోపైలెట్ల పదోన్నతిలో ఏడుగురు, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లలో 9 మంది ప్యాసింజర్ లోకోపైలెట్లు, గూడ్స్ లోకోపైలెట్ల బదిలీల్లో 24 మంది, పోస్టింగ్లో గూడ్స్ లోకోపైలెట్లు నలుగురు, పోస్టింగ్లో లోకోపైలెట్ షంటర్స్ 25 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ దశల వారీగా ఇచ్చినట్లు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్కుమార్ శనివారం తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే సంఘ్ అధ్యక్ష కార్యదర్శులు కొత్త మురళీకృష్ణ, జి.ప్రభురాజ్ కృషి ఫలితంగా 121 మంది పోస్టులు కాజీపేట లాబీకి మంజూరైనట్లు రాజ్కుమార్ తెలిపారు. 121 మంది రన్నింగ్స్టాఫ్కు పోస్టింగ్ -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి..
హన్మకొండ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మంచిర్యాల జిల్లాలో కలిశారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మహేందర్రావు పుట్ట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ వేతనాల చెల్లింపు, సేవా ప్రయోజనాల కల్పన తదితర అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని పరిశీలించిన భట్టి విక్రమార్క.. సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై మరింత సమగ్రంగా చర్చించేందుకు హైదరాబాద్లో సమావేశం కావాలని సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్తోపాటు సంతోష్, డాక్టర్ రామకృష్ణ, మధుబాబు, శశికాంత్, వినోద్, సతీష్కుమార్ తదితర ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎంకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి -
నిల్వ.. నిల్
ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో కరువైన రక్త నిల్వలుకాశిబుగ్గ : వరంగల్లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం).. పేద రోగులకు పెద్ద దిక్కు. ఖరీదైన వైద్యం పొందలేని అభాగ్యులకు కొండంత ధైర్యం. అందుకే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు వైద్యసేవలు అందిస్తోంది. అయితే ఇంతటి పేరుగాంచిన ఎంజీఎంలో రక్తపు నిల్వలు కరువయ్యాయి. ఎంజీఎంతో పాటు సీకేఎం, హనుమకొండలోని ప్రసూతి ఆస్పత్రి రక్త నిధి కేంద్రాలకు ఎంజీఎం బ్లడ్ బ్యాంకు అమ్మ ఒడిగా పనిచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం కావాల్సి వస్తే చుక్క కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. ఈ వేసవిలో రక్తం కావాలంటే ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీయాల్సి వస్తోంది. దాదాపు నెలరోజుల పైనుంచి ఇదే పరిస్థితి చోటు చేసుకోవడంతో పేషెంట్లు, అటెండెంట్లు ఆందోళన చెందుతున్నారు. పేదరికంలో ఉన్న తాము ఉచిత వైద్యం కోసం వస్తే బ్లడ్ బ్యాంకులో రక్తం లేదంటున్నారని వారు వాపోతున్నారు. వార్డుల్లోని వైద్యులు రక్తం కోసం తొందరపెట్టగానే తాము వేలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రైవేట్గా కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తదాతలకు కరువైన ప్రోత్సాహం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చే రక్తదాతలకు ప్రోత్సాహం కరవైంది. బ్లడ్ బ్యాంకులో డోనర్ మోటివేటర్లు, కౌన్సిలర్లు లేకపోవడంతో స్వచ్ఛందగా వచ్చే రక్తదాతలు కరవవుతున్నారు. అలాగే, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిని అదునుగా చూస్తున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు వ్యాపారం చేసుకోవడానికి కలిసి వస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు రక్తం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ తమ కుటుంబీకులను బతికించుకుంటున్నారు. సిబ్బంది లేమితో తప్పని తిప్పలు.. ఎంజీఎంలోని బ్లడ్బ్యాంకును సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇందులో పది మంది వరకు సిబ్బంది పనిచేయాల్సి ఉంది. అయితే కేవలం నలుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, ఇటీవల నలుగురు ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించారు. ఇదే క్రమంలో రక్తదాతలను ప్రోత్సహించడానికి బ్లడ్ డోనర్ మోటివేటర్లు, కౌన్సిలర్లు లేరు. దీంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం సిబ్బందికి సమస్యగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో యూత్, ఇతర దాతలు రక్తదానం చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో బ్యాంకులో రక్తం నిల్వలు జీరోకు చేరుకున్నాయి. వరంగల్, హనుమకొండలోని ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేట్ బ్యాంకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేకరించిన రక్తంలో కనీసం 30శాతం ఎంజీఎం బ్లడ్ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ఉత్తర్వులను అమలు చేయకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే, ప్రైవేట్ బ్యాంకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. దీనిపై ఇప్పటికై నా ఆస్పత్రి నిర్వాహకులు స్పందించి రక్తపు నిల్వలు సమకూర్చడంతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల అక్రమ వ్యాపారానికి అడ్డు కట్ట వేయాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. బ్లడ్ మోటివేటర్, కౌన్సిలర్ లేక తగ్గిన రక్తదాన శిబిరాలు రక్తంతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ప్రాణాపాయ స్థితిలో వాటిని ఆశ్రయిస్తున్న బాధితులు -
టెస్కో ద్వారా చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కృషి
కాశిబుగ్గ: గతంలో మాదిరి చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోళ్లకు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్లో వారం రోజుల నుంచి దీక్ష చేస్తున్న నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే తాను సంబంఽధిత మంత్రి, సీఎంఓ ఆఫీస్ లో చెప్పి వచ్చానని, సంఘాల్లో ఉన్న స్టాక్ కొనుగోలు గురించి మాట్లాడానని, అధికారులు వచ్చి పరిష్కారం చేస్తారని పేర్కొన్నారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని, వచ్చిన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారని వివరించారు. సీఎం కూ డా చేనేత కార్మికులకు తోడుగా ఉంటూ సమస్య పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, వెంటనే సంఘాల్లో మే 31 వరకు ఉన్న స్టాక్ను టెస్కో ద్వారా కొనుగోలు చేసేలా సహకారం అందిస్తానని, అలాగే 30 శాతం పెరిగిన వేతనాలు కూడా చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ప్రతినిధులు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, యెలగం వెంకటమల్లు, యెలగం సాంబయ్య, చిప్ప వెంకటేశ్వర్లు, మీసాల ప్రకాశ్, యెలగం ఓంప్రకాశ్, కూరపాటి సంపత్, కమలాకర్, రమేశ్, ఓదెలు, భిక్షపతి, మదనయ్య, వేణుమాధవ్ పాల్గొన్నారు. దీక్షలు విరమించిన చేనేత కార్మికులు.. చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని, టెండర్ విధానం రద్దు చేయాలని కోరుతూ వందలాది మంది చేనేత కార్మికులు కొత్తవాడ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద వారం రోజుల నుంచి దీక్షలు చేపడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హామీతో శుక్రవారం మధ్యాహ్నం విరమించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖకు టీపీసీసీ నేత చిప్ప వెంకటేశ్వర్లు, పలు సంఘాల పర్సన్ ఇన్చార్జ్లు అడిగొప్పుల సంపత్, యెలగం సాంబయ్య, యెలగం వెంకటమల్లు, కూరపాటి సంపత్, ఓం ప్రకాశ్, మదనయ్య కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల్లో నేత కార్మికుల సమస్య పరిష్కారం రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి హామీతో దీక్షలు విరమించిన కార్మికులు -
గాడి తప్పిన నిర్వహణ
తొర్రూరు: మున్సిపాలిటీలో ఇంటింటా చెత్త సేకరణ, డంపు యార్డుకు తరలింపు ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగేందుకు పారిశుద్ధ్య విభాగం వాహనాలే ఆధారం. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అధికారులు రూ.లక్షలు వెచ్చించి ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా చేయించడంపై మాత్రం శ్రద్ధ వహించడంలేదు. తొర్రూరు పట్టణంలో చెత్త సేకరణ, ఇతర వాహనాల వినియోగంలో మున్సిపాలిటీ అధికారులు రవాణాశాఖ నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో బీమా లేని వాహనాలపై పని చేసేందుకు కార్మికులు భయపడుతున్నారు. బీమా లేదు.. ధీమా లేదు.. గత ఆరేళ్ల కాలంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశారు. కొనుగోలు ఎంత ముఖ్యమో.. రవాణాశాఖ నిబంధనలు పాటించడం అంతే ముఖ్యం. పెద్దగా చదువుకోని వారు సైతం వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా, కాలుష్య ధ్రువీకరణ తదితర ప్రక్రియలను పూర్తి చేస్తారు. రవాణా శాఖతోపాటు, పోలీసులు ఎడాపెడా జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయడం సాధారణం. కానీ తొర్రూరు మున్సిపాలిటీ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్, గుర్తింపు నంబర్లు ఉండవు. మున్సిపాలిటీలో ఆరు ఆటోలు, నాలుగు ట్రాక్టర్లు, జేసీబీ, డోజర్, వైకుంఠధామం వాహనాలున్నాయి. పాత వాహనాలకు కొనుగోలు పత్రాలు లేక రిజిస్ట్రేషన్, బీమా చేయించలేదు. కొత్తవాటిలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లేని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏడాదిన్నర క్రితం ఖరీదు చేసిన వాటికి పత్రాలున్నా పట్టింపు కరవైంది. నిబంధనలు బేఖాతరు వాహనం కొనుగోలు చేసే సమయంలో నెల రోజులకు ఉపయోగపడేలా తాత్కాలిక రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డు ఇస్తారు. అనంతరం శాశ్వత ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు నంబర్ను తీసుకుని బీమా చేయించాల్సి ఉంటుంది. గుర్తింపు, బీమా లేని వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులకు ఎలాంటి పరిహారం అందదు. వాహనాల బీమా, నిర్వహణ నిమిత్తం ఏటా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా వినియోగం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసిన 5 ఎలక్ట్రికల్ వాహనాలు మూలన పడ్డాయి. పనికిరానివి పాత సామాను కింద నిబంధనల మేరకు విక్రయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. తొర్రూరులో 58 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతీ రోజు 8 టన్నుల చెత్తను డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. చెత్త తరలింపు సమయాల్లో గత ఆరేళ్ల కాలంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి వాహనాలకు రిజిస్ట్రేషన్, బీమా చేయించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపల్ వాహనాలకు బీమా, రిజిస్ట్రేషన్ కరువు ప్రమాదాలు జరిగితే తప్పని ఇక్కట్లు రూ.లక్షలు వెచ్చించి బీమా మరుస్తున్న వైనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు -
టపాసులు కాల్చిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
● ఏసీబీ దాడుల్లో ఎంపీడీఓ, ఎంపీఓ పట్టుబడడంతో సంబురాలు నర్సింహులపేట: ఎంపీడీఓ పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అవినీతి అధికారుల పీడ పోయిందని, చాలా ఇబ్బంది పడ్డామని బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్, బీఆర్ఎస్ మండల నాయకుడు బండి రమేష్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎంపీడీఓ ఆఫీస్ పక్కన, అంబేడ్కర్ సెంటర్లో టపాసులు కాల్చారు. మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న, ఎండీ.మదార్ పాల్గొన్నారు. ఉలిక్కిపడ్డ నర్సింహులపేట.. ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ యాకయ్య ఏసీబీ అధికారులకు పట్టుపడటంతో ప్రజలు, అధికారులు ఉలిక్కిపడ్డారు. మహబూబాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న పెనుగొండ రాధిక నర్సింహులపేట ఇన్చార్జ్ ఎంపీడీఓగా 10 నెలలుగా పని చేస్తున్నారు. ఎంపీఓ కిన్నెర యాకయ్య గతంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసి బదిలీపై వెళ్లారు. పదోన్నతిపై ఎంపీఓగా నర్సింహులపేటకు వచ్చి కొన్ని నెలలు ఎంపీడీఓ పని చేసి ప్రస్తుతం ఎంపీఓగా ఉన్నారు. వీరు ప్రస్తుతం ఏసీబీ దాడిలో పట్టుపడ్డారు. ఇంతకు ముందు 2012 సంవత్సరంలో నర్సింహులపేట తహసీల్దార్గా పని చేస్తున్న అకుల సమ్మయ్య, 2017లో నర్సింహులపేట ఎంపీడీఓగా పని చేస్తున్న తాళ్ల ఉపేందర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. -
శుభకార్యాలకు వెళ్లొస్తూ మృత్యుఒడికి..
లింగాలఘణపురం: వారంతా స్నేహితులు. కారులో రెండు చోట్ల బంధువుల ఇళ్లలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. అక్కడ ఆటాపాటలతో ఆనందంగా గడిపారు. వేడుకలు ముగిసిన అనంతరం సంతోషంగా ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో లారీ.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ– సూర్యాపేట రోడ్డుపై నవాబుపేట వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రవణ్కుమార్, మృతుల బంధువులు కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన ఇమ్రాన్ (28), సుభానీ (30), హనుమకొండ బొక్కలగడ్డకు చెందిన ఎండీ మాసిద్, సమీర్, ఖమ్మానికి చెందిన నూర్ స్నేహితులు. గురువారం ఉదయం సూర్యాపేట, మిర్యాలగూడలో జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. వేడుకలు పూర్తయిన అనంతరం అదే రోజు రాత్రి కాజీపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గజ్వేల్ నుంచి ధాన్యం లోడ్తో సూర్యాపేట వైపునకు వెళ్తున్న లారీ నవాబుపేట వద్ద కారును ఢీకొంది. దీంతో సుభానీ అక్కడికక్కడే, కారు నడుపుతున్న ఇమ్రాన్ జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలైన మిగతా ముగ్గురు ఎండీ మాసిద్, సమీర్, నూర్ను జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఇమ్రాన్కు ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. శుభకార్యాలకు వెళ్లి తిరిగొస్తూ ప్రమాదానికి గురై కనిపించని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రవణ్కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దతూండ్లలో వృద్ధురాలు.. మల్హర్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పెద్దతూండ్లలో చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై మహేందర్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెంది నారా ముత్తమ్మ(75) కొన్ని సంవత్సరాలుగా కొయ్యూరు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 11న రాత్రి సమయంలో కొయ్యూరు పాత పెట్రోల్ బంక్ ఎదుట గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతిరాలి బంధువు రామచంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు యువకుల దుర్మరణం ముగ్గురికి తీవ్ర గాయాలు నవాబుపేట వద్ద ఘటన -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్పర్సన్ నాగవాణిమహబూబాబాద్ రూరల్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, షేర్ ఎన్జీఓ సంయుక్తంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలలు బడికి.. పెద్దలు పనికి, పలుగు పారవద్దు.. పలక బలపం ముద్దు అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాగవాణి మాట్లాడుతూ.. స్వర్గం బాల్యంలోనే ఉందని, ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తున్నా హోటళ్లు, ఇటుక బట్టీల్లో, ఇళ్లల్లో పిల్లలు మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది యసాడి చెన్నమల్లారెడ్డి మాట్లాడుతూ.. బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలతో ఎలాంటి పనులు చేయించినా నేరమని, అలా చేసిన వారికి జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ క్రాంతికుమార్, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై ఉమ, డోర్నకల్ సీడీపీఓ శ్రీలక్ష్మి, జేఆర్సీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రావణి, షేర్ ఎన్జీఓ ప్రతినిధులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
జమ్మూ అండ్ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసిన యశ్వంత్
మరిపెడ రూరల్: జమ్మూ అండ్ కశ్మీర్ లైఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాను మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గవర్నర్కు తన పర్వతారోహణ ప్రయాణం, సాహస యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలు, అలాగే తాను చేపట్టిన ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ మిషన్ లక్ష్యాలు వివరించా రు. ఇటీవల తాను విజయవంతంగా పూర్తి చేసి న లద్దాఖ్ పర్వతారోహణ యాత్ర గురించిన లె ఫ్టినెంట్ గవర్నర్కు వివరించగా..యశ్వంత్ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపాడు. నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న య శ్వంత్ కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంత్యపుష్కరాల ఆదాయం రూ.97.27లక్షలు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సరస్వతీనది అంత్య పుష్కరాల్లో భక్తులకు అందించిన ప్రసాదాల విక్రయాలు, వివిధ సేవా టికెట్ల ద్వారా దేవస్థానానికి రూ.97లక్షల 27వేల 500 ఆదాయం సమకూరిందని ఈఓ మహేశ్ శుక్రవారం తెలిపారు. పుష్కరాల కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించి, దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ప్రసాదాలు, సేవా టికెట్లను వినియోగించారని చెప్పారు. భక్తుల సహకారం, అధికారుల సమన్వయం, సిబ్బంది సేవల ఫలితంగా ఈ ఆదాయం లభించినట్లు ఆయన పేరొన్నారు. నాటికలు యదార్థ జీవితాలకు ప్రతిబింబాలు ● కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య ● ఘనంగా జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం హన్మకొండ కల్చరల్ : నాటికలు యదార్థ జీవితాలకు ప్రతిబింబాలని, కళలు, కళాకారులను ప్రోత్సహించాలని కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య కోరారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బన్న అయిలయ్య, విశిష్ట అతిథులుగా డాక్టర్ శ్రీరామోజు సుందరమూర్తి, డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి, నేరెళ్ల శోభావతి, జేఎన్ శర్మ, గంజి దేవరాజు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. కాగా, పోటీల్లో భాగంగా మొదటి రోజు ‘మంచి మనసులు’, ‘నువ్వో సగం నేను సగం’ నాటిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
బడిబాటను విజయవంతం చేయాలి
● గిరిజన శాఖ డీడీ దేశీరాం నాయక్ కురవి: బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాం నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని, బడిఈడు పిల్లలను బడిలో చేరే విధంగా చూడాలన్నారు. ఈవిద్యాసంవత్సరం వంద శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డి.రాములు, డిప్యూటీ డీఈఓడీ సారయ్య, జీసీడీఓ విజయ, ఎస్ఓ కొమ్మాలు, డీఆర్సీ శ్రీకాంత్, అకౌంటెంట్ సుహాసిని, హెచ్ఎం బాబు, వార్డెన్ బి.పద్మ పాల్గొన్నారు. -
కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
● కలెక్టర్ స్నేహా శబరీష్మహబూబాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహా శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంటర్ విద్య తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పకడ్బందీగా నిర్వహించి ప్రతీ నెల స్క్రిప్టు టెస్టులు నిర్వహిచాలన్నారు. మరమ్మతులు ఉంటే వాటి కోసం ప్రదిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచి రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. డీఐఈఓ మదార్, అధికారులు పాల్గొన్నారు. -
యూరియా వినియోగాన్ని తగ్గించాలి
డీఏఓ విజయచంద్ర మహబూబాబాద్ రూరల్ : యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర రైతులకు సూచించారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో రైతులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయచంద్ర రైతులతో మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూసారం లోపించి పంటల దిగుబడి తగ్గుతుందని తెలిపారు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను వేసి భూమిలో కలియ దున్నటం ద్వారా భూసారం పెరిగి పంటల దిగుబడి వస్తుందన్నారు. రైతులకు యూరియా సరిపడా అందించడం జరుగుతుందని, ఫెర్టిలైజర్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకుని రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, సొసైటీ సీఈఓ కె.ప్రమోద్ కుమార్, రైతులు పాల్గొన్నారు. రోడ్లపై వ్యర్థాలు వేయొద్దు మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్ మహబూబాబాద్: చికెన్షాపు యాజమానులు చికెన్ వ్యర్థాలను రహదారులు, కాల్వల్లో వేయొద్దని మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం చికెన్ షాపుల యాజమానులు, పందుల పెంపకందారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాపుల వద్ద దుర్వాసన లేకుండా చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు నిషేధించి స్టీల్ బాక్స్లను ఉపయోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉన్నవారు రెన్యూవల్ చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని వాటిని పట్టణం నుంచి బయటికి తరలించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ అంకుశావలి, సానిటరీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీహరి, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. తొర్రూరు ఆర్టీసీ డీఎంగా ప్రసూనలక్ష్మి తొర్రూరు: ఆర్టీసీ డీఎంగా కె.ప్రసూనలక్ష్మి నియమితులయ్యారు. డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. నర్సంపేట డీఎంగా పనిచేసిన ప్రసూనలక్ష్మి సాధారణ బదిలీల్లో భాగంగా తొర్రూరుకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ డీఎంగా పని చేసిన పద్మావతి. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి పీఓగా బదిలీపై వెళ్లారు. వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో వారంతపు సెలవులు, 15వ తేదీ సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ మంగళవారం నుంచి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఇంటర్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ మహబూబాబాద్ అర్బన్: జిల్లా రీజియన్లోని గిరిజన గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీ య సంవత్సరంలో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన శాఖ రీజినల్ కోఆర్డినేటర్ టి.రత్నకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన గిరిజన వి ద్యార్థులు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట గిరిజన గురుకుల కళాశాలలో ఉదయం 10 గంటలకు స్పాట్ కౌన్సెలింగ్కు హా జరుకావాలని తెలిపారు. పదో తరగతి మెమో, టీసీ, కులం, నివాసం, ఆదాయం ఒరిజినల్ ధ్రువపత్రాలు, పాస్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. బాలుర కళాశాలలు దామరవంచ, మరిపెడ, మహబూబాబాద్లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లు ఉన్నాయని, రెడ్యాల గురుకుల కళాశాలలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాలికలకు కేసముద్రంలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. -
మార్కెట్ పనివేళల్లో మార్పులు
ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాము ల వ్యవసాయ మార్కెట్లో పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ తీవ్రత తగ్గడం వల్ల ఈ నెల 16వ తేదీ నుంచి సరుకుల బిడ్డింగ్ సమయాలను పాత పద్ధతి, ప్రతీ బుధవారం పనిదినంగా ప్రకటించామ ని తెలిపారు. మిర్చి ఉదయం 7.30 గంటలకు, పల్లికాయ ఉదయం 8.30 గంటలకు, పత్తి ఉదయం 8.35 గంటలకు, పసుపు, ధాన్యం, అపరాలు ఉదయం 9 గంటలకు వేలం ప్రారంభం కానుందన్నారు. రైతులు గమనించి పని దినాల్లో సరుకులు తీసుకురావాలని ఆయన కోరారు. -
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో జరుగుతున్న రూ.వేలకోట్ల అవినీతి అక్రమాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. తెలంగాణకు సింగరేణి అమూల్యమైన సంపద అని, 137 ఏళ్ల చరిత్ర కలిగి న ఈ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం జీతాల చెల్లింపుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుందని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ల వ్యవస్థలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి కొందరికి లబ్ధి చేకూర్చారని హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనస్కు వెళ్లిన ఓబీ టెండర్లు ప్రస్తుతం అదనపు ధరలకు కేటాయిస్తున్నారని, దీనివల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. బొగ్గు నిల్వల్లో భారీ వ్యత్యాసాలు.. బొగ్గు నిల్వల లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రికల్ టన్నుల బొగ్గు లేదని, 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. మూతపడిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ వద్ద 1.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధి కారులు లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్స్ప్లోజివ్స్ కొనుగోళ్లలో మార్కెట్ ధర రూ.37వేలు ఉంటే అధిక ధరలు రూ.44వేలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని ఆరోపించారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ సంస్థలనుంచి కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించడం ద్వారా అదనపు ఆర్థికభారం మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిలో నిజాలు తేలా లంటే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్రెడ్డి, నాయకులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–2 సందర్శించేందుకు వెళ్లిన హరీశ్రావు, నాయకులను అనుమతి లేదని సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఉన్నతాధికారులను అనుమతి తీసుకుని రావాలని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడినుంచి వెనక్కి వచ్చారు. రెండున్నరేళ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ టెండర్లలో కొందరికే లబ్ధి చేకూరేలా నూతన నిబంధనలు సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు -
బైక్ అదుపు తప్పి రేకంపల్లిలో ఆర్టీసీ డ్రైవర్..
దుగ్గొండి: బైక్ అదుపు తప్పిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రేకంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నీరటి వేణు(34) హనుమకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్ల వారుజామున విధులకు హాజరు కావడానికి బైక్పై వస్తున్నాడు. మార్గమధ్యలో గిర్నిబావి దగ్గర లోకేశ్వర మిల్లు సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీప్రసన్న, కుమారుడు విశ్వంత్, కుమార్తె మనస్విని ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. ప్రాణం తీసిన పగిలిన రోడ్డు.. గిర్నిబావి నుంచి నల్లబెల్లి వరకు నాలుగేళ్ల క్రితం డబుల్ రోడ్డు వేశారు. గిర్నిబావి నుంచి లోకేశ్వర మిల్లు వరకు సీసీ రోడ్డు వేశారు. అయితే 24 ఫీట్ల సీసీ మధ్యలో 100మీటర్లు దూరం వరకు ఆరు ఇంచుల వెడల్పుతో రోడ్డు పగిలింది. దీంతో రాత్రి వేళ పగిలిన రోడ్డు మధ్యలో ద్విచక్ర వాహనం టైరు ఇరుక్కొని పడిపోవడంతో వేణు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పాఠశాలలను సిద్ధం చేయాలి
● అదనపు కలెక్టర్ పురుషోత్తం మహబూబాబాద్ రూరల్ : వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు సౌకర్యంగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠశాలలోని తరగతి గదులను శుభ్రం చేయాలని, తాగునీటి ట్యాంకులో చెత్త చెదారం తొలగించి బ్లీచింగ్ చల్లాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలలకు వచ్చే సమయానికి ఎలాంటి సమస్యలు లేకుండా సంబంధిత గ్రామపంచాయతీల పాలకవర్గాలు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు సాధించిన ఫలితాలతో రూపొందించిన కరపత్రాలను ఈసందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సర్పంచ్ చీరిక వసంతఉపేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
ఇల్లు బిల్లు వస్తలేదు..
● పెండింగ్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ● నిర్మాణాలు పూర్తయినా అందనివైనం ● మొదటి విడతలో 10,231మంజూరు.. 2,905 ఇళ్లు పూర్తి ● ఎదురుచూస్తున్న లబ్ధిదారులుమహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో ఉంది. కానీ, బిల్లుల చెల్లింపులో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలు తుది దశకు వచ్చినా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక పూర్తయిన ఇళ్లలో కూడా చాలా వరకు చివరి బిల్లులు రాకపోవడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో మాత్రం ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మొదటి విడతలో 10,231 ఇళ్లు మంజూరు జిల్లాలో 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీలకు గాను ప్రభుత్వం 10,231 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది. కాగా, ఈనెల 8న అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం వాటిలో 8,937 మార్కింగ్ (ముగ్గు పోసుకుని ప్రారంభించారు) చేయగా 2,905 ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు గాను 3,474 ఇళ్లకు 2,982 మార్కింగ్ చేయగా 1,275 పూర్తి చేశారు. మానుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలకు 3,522 ఇళ్లకు 3,052 మార్కింగ్ చేయగా 910 పూర్తి చేశారు. మానుకోట జిల్లా పరిధి ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాలకు 1,043కు 948 మార్కింగ్ చేయగా.. 88 మాత్రమే పూర్తయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు మండలాలు, మున్సిపాలిటీ 1,050కి 887 మార్కింగ్ చేయగా 341 పూర్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని రెండు మండలాలకు 1,142 ఇళ్లకు గాను 1,068 మార్కింగ్ చేయగా.. 291 పూర్తి చేశారు. అర్హతలు.. ఎంపిక ఇలా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరించి ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి తదితర సంక్షేమ పథకాలకు అవకాశం కల్పించింది. దాని ప్రకారం నిరుపేదలు, స్థలం ఉండి ఇళ్లు లేని వారిని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. తర్వాత గెజిటెడ్, స్పెషల్ ఆఫీసర్ల విచారణ తర్వాత గ్రామాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషర్లు తుదిజాబితా రూపొందించి కలెక్టరేట్కు పంపించారు. బేస్మెంట్ వరకు రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయితే మరో రూ.లక్ష, స్లాబ్కు ముందుగా రూ.రెండు లక్షలు చెప్పినా రూ.1,40,00 ఇచ్చారు. మిగిలిన 1,60,000 పూర్తి అయిన తర్వాత. అయితే ఇందుకు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీలో అయితే వార్డు ఆఫీసర్ నిర్మాణ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి ఆతర్వాత ఏఈ, డీఈ వద్ద ప్రాసెస్ అయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమచేస్తున్నారు. అయితే ఫొటోలు తీసే విషయంలో అధికారులు డబ్బులు అడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో లబ్ధిదారుడే స్వయంగా యాప్లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు రెండో విడతలో.. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఈ విడతలో నియోజకవర్గంలో 2,000 ఇళ్లలో 500 ఇళ్లకు గోడలు ఉన్న వాటికి స్లాబ్ ఇతరత్రా నిర్మాణాలు చేసుకున్నా బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఈనెల 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో 12 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సైతం అందచేశారు. చెల్లింపుల్లో జాప్యం డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెస్మెంట్, గోడల వరకు బిల్లులు సవ్యంగా వస్తున్నా.. తర్వాత ఆలస్యంగా వస్తున్నాయని వాపోతున్నారు. పనులు పూర్తయి రెండు నెలలు గడిచినా బిల్లులు రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి విడతలో ఈనెల 8వ తేదీ వరకు రూ.221 కోట్లు లబ్ధిదారులు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
కేయూ ఉద్యోగులకు వేతనాలు విడుదల
● పెన్షన్దారులకు పెన్షన్ కూడా.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని బోధన, బో ధనేతర ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు పెన్షన్దారులకు కూడా శుక్రవారం సాయంత్రం అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచి వేతనాలు విడుదల చేశారు. కేయూలో ఉద్యోగులు, పెన్షన్దారులకు వేతనాలు విడుదల జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారని ‘అందని మే నెల వేతనాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సంబంధిత పోర్టల్లో బిల్లులు అప్లోడ్ కావడం లేద ని, దీంతో వేతనాల బిల్లులుకు సంబంధించిన ప్రతి పాదనలు డీటీఓకు చేరలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు అంటూ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వీసీ కె. ప్రతాప్రెడ్డి, రి జిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్ చర్చించారు. ఐఎఫ్ఎంఎస్లో వేతనబిల్లులు అప్లోడ్ కావాలంటే సాంకేతిక సమస్య రెక్టిఫై కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీటీఓకు వెళ్లి ప్రభుత్వం నుంచి వేతనాలు విడుదల కావాలంటే కొద్దిరోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈనెల 13న రెండో శనివారం,14న ఆ దివారం సెలవుదినాలు కూడా వస్తున్నాయి. ఉద్యోగుల,పెన్షన్దారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేయూ అంతర్గత నిధుల నుంచే వేతనాలు విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు, పెన్షన్దారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: కేంద్రంలో నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేస్తూ కుట్రలకు పాల్పడుతోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎంపీ కావ్య మాట్లాడుతూ ఓటర్ల జాబితాల సవరణలతో బీజేపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఓటు చోరీ ప్రయత్నాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ బూత్ లెవల్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ చేపట్టాలన్నారు. ప్రతీ అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పోరాటం చేస్తోందని అన్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సీరియస్గా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడారు. కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. నాలుగోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
దీర్ఘకాలిక పోరాట ఫలితమే ఈ విజయం
హన్మకొండ కల్చరల్: అర్చక ఉద్యోగులు దీర్ఘకాలిక పోరాట ఫలితమే ఈ విజయమని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ అర్చకులు, ఇతర దేవాలయ ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ నుంచి ప్రస్తుత పథకాల పెంపుకు రాష్ట్ర దేవాదాయశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సంబంధిత సర్క్యులర్ కాపీని జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మకు అందజేశారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ 2026 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ అయిన అర్చకులకు రూ. 12లక్షలు చెల్లిస్తారన్నారు. జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, కాండూరి కృష్ణమాచారి, పెన్నా మోహన్శర్మ, వాసుదేవశర్మ, డీవీ ఆర్శర్మ, నారాయణస్వామి, శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, బాబు శంకర్ పాల్గొన్నారు. కాగా, మంత్రి సురేఖ.. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ప్రమోషన్ పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఆలయాల్లో అవినీతిని సహించేది లేదని, దేవాలయానికి సాంప్రదాయంగా వచ్చే మహిళలను గౌరవించాలన్నారు. జీన్స్ ప్యాంట్లు ధరించి వచ్చే వారిని అనుమతించకూడదని పేర్కొన్నారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు
● ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ హన్మకొండ : ఆధునిక సాంకేతికతతో విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో ఏ ర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సబ్స్టేషన్ పరిధిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటుతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కష్టాలు తగ్గుతాయన్నారు. పట్టణాల్లో రింగులా గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే అంతరాయాలు నివారించొచ్చన్నారు. అంతకు ముందు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్లో సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదించిన పలు వినూత్న ప్రతిపాదనలను నవీన్ మిట్టల్కు వివరించారు. ప్రకృతి వైపరీత్యాలకు సిద్ధంగా ఉండాలి.. ప్రకృతి వైఫరీత్యాలు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మెటీరియల్తో సిద్ధంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం 18 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ఈదురు గాలులకు స్తంభాలు కూలిపోయి, విద్యుత్ లైన్లు తెగిపోయి విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.గిరిధర్రెడ్డి, టి.మధుసూదన్, ప్రభాకర్, డీఈలు తిరుమలరావు, రాజుచౌహాన్, అశోక్, మాధవరావు, వెంకటరమణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్దాస్, కిషన్ పాల్గొన్నారు. -
పట్టుతప్పుతున్న పాలన.. ఆర్ఎంఓలపై ఆధారం
● ఎంజీఎంలో ఇంకా భర్తీకాని సూపరింటెండెంట్ పోస్టు కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల నుంచి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ స్థానంలో ఎవరూ లేకపోవడంతో పాలన పట్టుతప్పుతోంది. ఒకవైపు వైద్యుల కొరత, మరోవైపు నర్సింగ్, మినిస్టీరియల్ సిబ్బంది కొరతతో అత్యవసర విభాగంతోపాటు వార్డుల్లో వైద్యసేవలకు అంతరా యం ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది సిబ్బంది ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. అలాగే, సాయంత్రం ఓపీలు సరిగా జరగడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. సిబ్బంది అయితే పేషెంట్లను స్ట్రెచర్, వీల్చైర్పై తీసుకెళ్లేందుకు డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రాత్రివేళ డ్యూటీ కి నామమాత్రంగా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. కాగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు రాకుండా ఆర్ఎంఓలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆర్ఎంఓలకుగాను ఇద్దరు ఆస్పత్రికి సంబంధించిన ఇండెంట్లపై సంతకాలు చేస్తూ, వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి పరిమితమవుతున్నారు. గతంలో పనిచేసిన వారే వస్తున్నారా? ఎంజీఎం సూపరింటెండెంట్గా ఎవరు వస్తారనే చర్చ ఆస్పత్రి వర్గాల్లో జోరుగా సాగుతోంది. డీఎంఈ స్థాయిలో ఈ పోస్టు ఉండటంతో ఫలానా అధికారి వస్తున్నారని ఊహించని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసినవారు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు మూడో వ్యక్తికి తెలియకుండా ఆర్డర్తోనే రావాలని చూస్తున్నట్లు సమాచారం. -
ఉపాధి పనుల్లో పెళ్లి వేడుకలు
దంపతులకు చెట్ల ఆకులు, పూలతో పెళ్లి జరిపించిన ఉపాధి కూలీలుజఫర్గఢ్: ఉపాధి హామీ పనుల్లో కూలీలు.. దంపతులకు పెళ్లి జరిపించారు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లిలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఉపాధి పథకంలో భాగంగా గ్రామ చెరువు పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పనికి వెళ్లిన కూలీలు విరామ సమయంలో చెట్ల కింద సేదదీరుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన ఉపాధి పనుల్లో జరిగిన పెళ్లి వేడుకలను చూశారు. అనంతరం తమ సహచర కూలీలైన మాచర్ల కొమురయ్య సుభద్ర దంపతులకు పెళ్లి జరిపించారు. కూలీలు పూజారిగా గాను, కు టుంబ పెద్దలుగా వ్యవహరించి పూలు, చెట్ల ఆ కులతో దంపతులను ముస్తాబు చేసి వివాహం జరిపించారు. ఆకులతో తయారు చేసిన పుస్తెల తాడు కట్టించడం, తలంబ్రాలు పోయించడం, పూలదండలు వేయించడం వంటి తంతు జరిపించారు. అనంతరం పెళ్లి జరిపించిన పెద్దల పాదాలకు దంపతులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన కూలీలతోపాటు గ్రామస్తులకు ఆనందం కలిగించింది. -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు ఊరుగొండ వద్ద ఘటన -
విధులకు వెళ్తూ మృత్యుఒడికి..
● అదుపు తప్పిన బైక్.. రెవెన్యూ ఉద్యోగి మృతి ● వర్ధన్నపేటలో ఘటనవర్ధన్నపేట: విధులకు వెళ్తూ ఓ రెవెన్యూ ఉద్యోగి మృత్యుఒడికి చేరాడు. బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట తహసీల్ కార్యాయం చైన్మెన్ బుంగ వెంకటనర్సు(55) బైక్పై తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణానికి వచ్చి విధులు ముగించుకున్నాడు. తిరిగి తహసీల్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో అంబేడ్కర్ సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటనర్సు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు
గోవిందరావుపేట: మహిళా ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. మహిళా సంఘాల బలోపేతం, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ముందు లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం సోమలగడ్డ క్రాస్ సమీపంలోని పీఎస్ఆర్ గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. రసాయన వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా విస్తరించడ సంతోషకరమన్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పంటగా రైతులు దీనిని స్వీకరించాలని సూచించారు. అనంతరం ఉత్తమ రైతులను మంత్రి సీతక్క, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, కలెక్టర్ హేమంత్ సహదేవరావు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి ఆధునిక సాగు మార్గం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
విద్యుత్ బస్సులను వేధిస్తున్న బ్యాటరీలు
హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులను బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయి. 75 రోజుల వ్యవధిలో రెండు సార్లు బ్యాటరీల్లో మంటలు వచ్చాయి. దీంతో మార్గమద్యలో బస్సులు నిలిచి విసిగి పోతుండగా మరో వైపు బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్తో వస్తున్న మంటలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ బస్సులో మంటలు వస్తాయో, ఎక్కడ తగులబడుతాయోననే ఆందోళనల మధ్య అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. మార్చి 28న రాత్రి టీజీ 03 టీ 1260 ఎలక్ట్రిక్ బస్ బ్యాటరీ నుంచి మంటలు ఎగిసిపడగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఆర్పారు. ఈ ఘటనలో ఏడు బ్యాటరీలకు నష్టం కలిగింది. కాగా, ఇదిలా ఉండగా బుధవారం రాత్రి టీజీ 03 టీ 2209 బస్సుకు చార్జ్ పెట్టగా రెండు గంటల్లో పూర్తయి వెంటనే బ్యాటరీ నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే గమనించిన సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తుండగా మంటలు లేచాయి. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో రెండు బ్యాటరీలు దెబ్బతిన్నాయి. మంటలు వెంటనే ఆర్పకపోతే ఈ బస్సుతో పాటు పక్కన ఉన్న బస్సులు మంటలకు దగ్గమయ్యేవి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. ఈ ఘటనతో 75 రోజుల్లో రెండు సార్లు జేబీఎం బస్సులో బ్యాటరీల్లో మంటలు లేచాయి. దీంతో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయోననే సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. బుధవారం రాత్రి మంటలు సిబ్బంది అప్రమత్తం.. తప్పిన పెనుముప్పు -
సాగులో మార్పు రావాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు పంటల సాగులో మార్పు తీసుకురావాలని, నీటి వసతి ఆధారంగా పంటల సాగు చేయాలని, యూ రియా వాడకం తగ్గించాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక వరి రకాలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర అన్నారు. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అధిక మొత్తంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఆయిల్పామ్ సాగు చేయాలన్నారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సాక్షి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అ నూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు డీఏఓ ఎస్.విజయచంద్ర, జిల్లా ఉద్యాన, ప ట్టు పరిశ్రమ శాఖ అధికారి మరియన్న సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: ఖరీఫ్కు అనువైన వరి రకాలు ఏమిటి? రైతులు: శ్రీనివాస్రెడ్డి గూడూరు, నవీన్ కొత్తగూడ, సత్తిరెడ్డి బయ్యారం, శ్రీనివాస్ జంగిలిగొండ, వెంకన్న జయ్యారం, వేణుగోపాల్ గుండెపుడి, సురేష్ బొడ్లాడ, హరినాయక్ వీరారం. జవాబు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు స్వల్పకాలిక వరి రకాలను సాగుచేయడం మేలుదాయకం. వరిలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048(తెలంగాణ సోనా), హెచ్ఎంటీ, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 962, జేజీఎల్ 1798, ఎంటీయూ 1010, కేఎన్ఎం 118 వంటి రకాలు సాగు చేసుకోవచ్చు. ప్ర: పత్తిలో అధిక దిగుబడికి ఏ రకం విత్తనాలు నాటాలి? రైతులు: నాగయ్య కురవి, రాజశేఖర్ కంబాలపల్లి, నవీన్ పర్వతగిరి, వెంకన్న బూరుకుంటతండా, లక్ష్మణ్ వేంనూర్, లింగన్న వీఎస్ లక్ష్మీపురం. జ: పత్తిలో అధిక సాంద్రత పద్ధతి ద్వారా సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడి వస్తుంది. మొక్కల మధ్య దూరం తగ్గి అధిక మొక్కలు వేసుకునేందుకు వీలుంటుంది. నూజివీడు రకాలు ఎంచుకోవడం మంచిది. రాశిలో స్విఫ్ట్, నూజివీడులో సిరి, వేదలో ప్లాటినం రకాలు సాగు చేసుకోవచ్చు. ప్ర: నకిలీ విత్తనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు: ఉపేందర్ గూడూరు, రఘు నడివాడ, యాకూబ్రెడ్డి చిన్నగూడూరు, రాజు కంఠాయపాలెం, విజయ్ ఉగ్గంపల్లి. జ: నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో, మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. పంటకాలం పూర్తయ్యే వరకు ఖాళీ ప్యాకెట్లు, బిల్లులు తమ వద్ద ఉంచుకోవాలి. లాట్ నంబర్ వేయించాలి. రైతు, షాపు యజమాని ఇద్దరి సంతకం ఉండాలి. గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే వారిని నమ్మవద్దు. జాగ్రత్తలు పాటిస్తే పంటనష్టం జరిగినప్పుడు పరిహారం వచ్చేందుకు వీలుంటుంది. ప్ర: యూరియా పంపిణీలో మార్పులు చేస్తారా? రైతులు: కృష్ణ డోర్నకల్, మల్లయ్య, శ్రీనివాస్ కొమ్ములవంచ, ఠానూనాయక్ బిల్యాతండా, వినయ్, సాయికుమార్ మడగూడ, అనిల్ వెంక్యాతండా, మోతిలాల్ గుండ్లబోడుతండా, అశోక్ బోరింగ్తండా, వెంకన్న ఇస్లావత్తండా, సైదులు రెడ్యాల. జ: రైతులు యూరియాను యాప్ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. యాప్లో బుకింగ్ గురించి తెలియని వారు సంబంధిత షాపుల వద్ద ఉండే వలంటీర్లను సంప్రదించాలి. రైతు వేదికల వద్ద ఏఈఓలు సహకారం అందిస్తారు. పంటల సాగు విషయంలో రైతులు సాధ్యమైనంత వరకు యూరియా వాడకాన్ని తగ్గించి నానోయూరియా వినియోగంపై దృష్టి సారించాలి. ప్ర: పచ్చిరొట్ట ఎరువుల ప్రయోజనాలు ఏమిటి?రైతులు: నవీన్ కొత్తగూడ, శ్రీనివాస్రెడ్డి గూడూరు, కిషన్ గార్ల, శ్రీనివాస్ అమీనాపురం, మహేశ్ చిట్యాల, శంకర్ పెద్దవంగర, ఉప్పలయ్య అమ్మాపురం, రాంబాబు గుర్రాలగుట్టతండా, వెంకన్న పర్వతగిరి, శ్రీహరి కొత్తగూడ. జ: పంటల సాగుకు ముందుగానే పచ్చిరొట్ట ఎరువులైన జిలుగ, జనుము సాగు చేసి భూమిలో కలియదున్నాలి. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో దోహదం చేస్తాయి. అదే విధంగా ఎప్పటికీ ఒకేరకం పంటలు కాకుండా ఆరుతడి పంటలైన కందులు, మినుములు, పెసర, బొబ్బెర, నువ్వులు తదితర రకాలు సాగు చేయడం మంచిది. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ పత్తి, మిర్చి, మక్కజొన్న వరకే కాకుండా ఆయిల్పామ్ సాగుపై దృష్టి పెంచాలి. ప్ర: మిరపనారు కొనుగోలు చేయవచ్చా?రైతులు: రాంబాబు గుర్రాలగుట్ట, ఉప్పలయ్య అమ్మాపురం, శ్రీనివాస్ కొమ్ములవంచ, శేఖర్, సాగర్ మల్యాల, రమేశ్ సికింద్రాబాద్, నరేష్ చోక్లాతండా, సునీల్ దామ్యతండా, నవీన్ రామచంద్రుతండా, సతీష్, గణేష్ రెడ్యాల. జ: మిరపనారు సిద్ధం చేసుకునేందుకు రైతులు మిరప విత్తనాలు కొనుగోలు చేయగానే ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎత్తు నారుమడులు పోసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నారు చేతికి అందుతుంది. మిరపసాగు సమయంలో పంట మధ్యలో పసుపురంగు, నీలిరంగు, జిగురు అట్టాలను ఏర్పాటు చేసుకుంటే దోమ, నల్లి బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మిరపనారు పోసుకోని రైతులు నర్సరీల్లో కొనుగోలు చేసుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు రశీదులు తీసుకుని మిరప సాగు చేయాలి. ప్ర: వరి నారుమడిలో జాగ్రత్తలు ఏమిటి?రైతులు: ఉప్పలయ్య అమ్మాపురం, హరినాయక్ వీరారం, సత్తిరెడ్డి బయ్యారం, విజయ్ ఉగ్గంపల్లి, యాకూబ్రెడ్డి చిన్నగూడూరు, నవీన్ కొత్తగూడ, నాగయ్య కురవి, శ్రీనివాస్రెడ్డి గూడూరు, సుధాకర్, శ్రీనివాస్ జంగిలిగొండ, మల్లయ్య కొమ్ములవంచ. జ: వరినారు మడిలో తగిన జాగ్రత్తలు పాటించి ప్రధాన పొలం సాగుకంటే ముందు జిప్సమ్ వేసుకుని కలియదున్నాలి. యూరియా తగ్గించి నానో యూరియా అలవాటు చేసుకుని కాంప్లెక్స్ ఎరువులు కూడా సిఫార్సు మేరకే వాడాలి. రసాయనాలు పురుగుమందుల వాడకం తగ్గిస్తే పంట దిగుబడి మంచిగా వస్తుంది. నేరుగా వరివిత్తే విధానం మంచిది. వర్షాలు పడకముందు పంట సాగు చేయవద్దు. వరిలో కాలిబాటలు తీస్తే పంటకు ఎలాంటి దోమపోటు రాకుండా ఉంటుంది. నీటి వసతి ఆధారంగా పంటలు ఎంపిక చేసుకోవాలి స్వల్పకాలిక రకాలు వేయాలి భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు యూరియా వాడకం తగ్గించాలి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమంలో డీఏఓ విజయచంద్ర రైతుల నుంచి అనూహ్య స్పందన -
ఆదిముక్తీశ్వరా.. నీకు ప్రణామాలు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. తద్వారా అడవిలో వెలసిన ఆదిముక్తీశ్వర ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఏడాదిపాటు ఆదిముక్తీశ్వరాలయానికి భక్తజనం క్యూ కట్టనున్నారు. దీంతో ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగనుంది. షెడ్డుకు మరమ్మతులు.. రూ.198 కోట్ల వ్యయంతో శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థాన రాతి కట్టడాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవమూర్తులను (బాలాలయం) ఆదిముక్తీశ్వరాలయం సమీపంలోని ప్రత్యేక షెడ్డులో ప్రతిష్ఠించి నిత్య పూజలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ షెడ్డుకు గాలి, వెలుతురు పడకుండా సిమెంట్ మరమ్మతులు ప్రారంభించారు. క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి. 17న ఉదయం క్రతువు.. కర్ణాటకలోని శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామివారి అనుమతితో ఈ నెల 17న ఉదయం 8.15 గంటలకు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించి, ఆలయ తొలగింపు, పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 17 నుంచి భక్తుల దర్శనాలు, అభిషేకాలు, మొక్కులు, ప్రత్యేక పూజలు ఆదిముక్తీశ్వరాలయంలోనే నిర్వహించబడతాయి. టికెట్ విక్రయాలు, ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు ఇతర వసతులపై దృష్టిసారిస్తున్నారు. వసతుల ఏర్పాటు.. ఆదిముక్తీశ్వరాలయం వద్ద స్థలం పరిమితంగా ఉండడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే, రవాణా, తాగునీరు, క్యూలైన్లు తదితర సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సుమారు ఏడాది పాటు భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలోనే స్వామివారిని దర్శించుకోనున్నారు. దీంతో ఆలయంలో సుమారు 60 మంది వరకు అర్చక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు దినసరి లేబర్ కూడా పనులు చేస్తున్నారు. దేవాదాయశాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయకుండా గోప్యత పాటిస్తోంది. ఈనెల 17వ తేదీ నుంచి అడవిలో వెలసిన ఆలయంలో పూజలు రూ.198 కోట్ల వ్యయంతో కాళేశ్వరముక్తీశ్వరాలయంలో రాతి నిర్మాణ పనులకు శ్రీకారం ఏడాది పాటు కిలోమీటర్ దూరంలోని ఆదిముక్తీశ్వరాలయంలో మొక్కులు, అభిషేకాలు -
సమర్థవంతంగా పనిచేయాలి
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీటీఎన్ఎస్ ద్వారా ప్రతీ పిటిషన్, కేసు వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న పనుల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. గంజాయి విక్రేతలు, రవాణాదారులు, పాత గంజాయి కేసుల నిందితులు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు, విస్తృత నిఘా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, కార్డన్సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భద్రతా భావం తీసుకురావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా క్షేత్రస్థాయిలో కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించడం ద్వారా నిందితులకు శిక్షలుపడేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. నేటి నుంచి మార్కెట్కు సెలవులు కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న(శుక్రవారం) ప్రముఖ వ్యాపారి తాటికొండ పుల్లయ్య సంతాప సూచకంగా చాంబర్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు, 13, 14న(శని,ఆదివారం) వారాంతపు సెలవులు, 15న(సోమవారం) అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి ఈనెల 16న మార్కెట్ పునఃప్రారంభమవుతుందని చెప్పారు. -
ఓకే ‘సర్’
ఓటరు కోసం ఆధారాలు.. సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు వద్దకు వచ్చిన సర్వే అధికారులకు ప్రభుత్వం నుంచి జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించొచ్చు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగ గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్ఐసీ, పీఎస్యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్ఆర్సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ మొదలైనవి దోహదపడుతాయి. సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. 94శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకొని మానుకోట జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపారు. ఈనెల 25నుంచి ఇంటింటి గణన ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు గల్లంతు కాకుండా రాజకీయ పార్టీల నాయకులు సర్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 94శాతం మ్యాపింగ్ పూర్తి.. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం. కాగా, అర్హులకు ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, నకిలీ ఓట్లను తొలగించడం అంతే అవసరం. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలతో వెళ్తున్నారు. ఒకేసారి సవరణ కార్యక్రమం మొదలు పెడితే ఓటరును గుర్తించడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్ స్టేషన్లల్లో మొత్తం 4,84,933 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,57,819 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకున్నారు. 94శాతం మ్యాపింగ్ పూర్తి చేసి రాష్ట్రంలోనే మహబూబాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 25 నుంచి ప్రారంభం.. సర్ అసలు ప్రక్రియ ఈనెల 25నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ప్రచురించి ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్టింగ్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు క్లైమ్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యుమరేషన్ ఫామ్స్పై నిర్ణయం, అభ్యంతరాల పరిష్కారం మొదౖలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. రాజకీయ నాయకుల ఆరా.. తమ ప్రాంతానికి చెందిన ఓటర్లు జాబితా నుంచి వైదొలిగిపోకుండా రాజకీయ నాయకులు ప్రత్యేక ఆరా తీస్తున్నారు. బిహార్ రాష్ట్రంలో సర్ ద్వారా 65 లక్షల ఓటర్ల పేర్లు, పశ్చిమ బెంగాల్లో ఓటర్ల తొలగింపు పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తమ అనుచరులు, పార్టీల నాయకుల ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్యకర్తలను బీఎల్ఓల వద్దకు పంపించి జాబితా చూడటం, మ్యాపింగ్లో పేర్లు ఉన్నాయా లేదా చూడడం, ధ్రువీకరణ పత్రాలు నింపే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు వార్డుల వారీగా అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. మ్యాపింగ్ ప్రక్రియ ఇలా.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జిల్లా ముందంజ 94శాతం మ్యాపింగ్ పూర్తితో రాష్ట్రంలోనే మొదటిస్థానం ఓటర్ల పేర్లు మిస్కాకుండా రాజకీయ నాయకుల ఆరా ఈనెల 25నుంచి ఇంటింటి గణననియోజకవర్గం పీఎస్లు ఓటర్లు మ్యాపింగ్ శాతం మహబూబాబాద్ 288 2,60,761 2,51,693 96 డోర్నకల్ 267 2,24,172 2,06,126 91 మొత్తం 555 4,84,940 4,57,819 94 -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు విధులు నిర్వహించకుండా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. నెలవారీ నేర సమీక్ష గురువారం కిట్స్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో తొలిసారిగా సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ 2.0 ద్వారా పోలీస్ కమిషనరేట్ పరిధి పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ ఆన్లైన్ పద్ధతిలో సంబంధిత స్టేషన్ అ ధికారులను అడిగి తెలుకున్నారు. పెండింగ్ కేసుల, కేసుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా వెళ్లి తనిఖీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల బస్సులను స్థానిక పోలీస్ అధికారులు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, ప్రభాకర్రావు, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మొద్దు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
ఈతకెళ్లి యువకుడి మృతి
● యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాలలో ఘటన ● మృతుడు జనగామ జిల్లా వనపర్తి వాసి లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తికి చెందిన కానుగంటి శ్రీనివాస్, అనురాధ దంపతుల కుమారుడు మణికంఠ (19) యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మ జాలలో స్నేహితులతో కలిసి ఈ తకెళ్లి నీట మునిగి మృతి చెందాడు. వనపర్తి గ్రామస్తుల కథనం ప్రకారం.. మణికంఠ ఇటీవల ట్రాక్టర్ డ్రైవింగ్ కోసం వెల్మజాలకు వెళ్లాడు. అక్కడ సంగి శ్రీశైలం అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్నేహితులతో కలి సి బావిలో ఈతకు వెళ్లాడు. అయితే మణికంఠకు ఈత రాకున్నా బావిలో దూకి నీటిలో మునిగి చని పోయాడు. కాగా, రెండేళ్లుగా ట్రాక్టర్ నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అవుతున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అనురాధ, శ్రీనివాస్ దంపతుల రోదనలు మిన్నంటాయి. మణికంఠ మృతితో వనపర్తిలో విషాదం అలుముకుంది. -
కూతురును సర్కారు బడిలో చేర్పించిన సర్పంచ్
ఇనుగుర్తి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమంలో చిన్నముప్పారం మహిళా సర్పంచ్ తన కూతురుకు అడ్మిషన్ తీసుకుని ఆదర్శంగా నిలిచా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నముప్పారం మహిళా సర్పంచ్ రాయలి భవాని శేఖర్ తన కూతురు మహతిని ప్రైవేట్ పాఠశాలను కాదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. అలాగే తమ మిత్రుడు గుండు వేణు కుమారుడు రుత్విక్ను కూడా అదే పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తమకున్న నమ్మకాన్ని చాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ భవాని శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సరైన వసతులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులెవరూ ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు -
నాణ్యమైన విత్తనాలు అందించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్: నకిలీ విత్తనాలను నివారిస్తూ రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయశాఖ, గృహ నిర్మాణశాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. వానాకా లం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యతపై తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఖరీఫ్ సీజన్ పంటల సాగులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. డీఏఓ విజయచంద్ర, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మొదటి విడతలో కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక కారణాల వల్ల, లబ్ధిదారుల జెండర్ మార్పుల వల్ల పేమెంట్ సమస్య ఎదురవుతుందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతికి తావులేకుండా, అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ఇన్చార్జ్ పీడీ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, వివిధ మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీలు సిద్ధం
హన్మకొండ: హనుమకొండ సర్కిల్ పరిధిలో విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం రెండు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీలు సిద్ధం చేశా రు. వీటిని హనుమకొండ టౌన్, హనుమకొండ రూరల్ డివిజన్కు కేటాయించారు. గురువారం హ నుమకొండ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని హనుమకొండ ఎస్ఈ బి.సామ్యానాయక్ డివిజనల్ ఇంజనీర్లకు అందించారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు, వినియోగదారులకు మెరుగైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ మొబైల్ ట్రాలీలు ఉపయోగపడుతాయన్నారు. విని యోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబనాయక్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● మేడారంలో ఘటన ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేడారం సమీపం రెడ్డిగూడేనికి చెందిన వల్లేపు జానకీరామ్ (20) మేడారంలో సోడా బండి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సోడా బండిలోని ఫ్రిడ్జ్లో నీరు చల్లబడేందుకు విద్యుత్ సరఫరా కోసం కరెంట్ తీగలకు వైరు తగిలించి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి బండిని పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీగకు అతుకులు ఏర్పడిన కారణంగా సోడా బండికి విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపారు. -
టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి
● మంత్రి తుమ్మలకు మాజీ మేయర్ వినతి కాశిబుగ్గ: చేనేత కార్మికుల ఉపాధి కోసం టెండర్ విధానాన్ని రద్దు చేసి, చేనేత ఉత్పత్తులన్నీ టెస్కో ద్వారానే కొనాలని కోరుతూ.. రాష్ట్ర చేనేత జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావును వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి కోరారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. చేనేత ప రిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారని, ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది మంది నేత కార్మికుల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత ఉత్పత్తులపై టెండర్ విధా నం అమలు చేయడం, టెస్కో ద్వారా నేరుగా కొనుగోళ్లు లేకపోవడం వల్ల సంఘాల్లో చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని, కార్మికులు ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈనెల 1 నుంచి వరంగల్లో కార్మికులు మగ్గాలను బంద్ చేసి దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టెండర్ విధానం కాకుండా గతంలో ఉన్న టెస్కో ద్వారా నేరుగా కొని, ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేసి, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్రస్థాయి పద్య పఠన పోటీలు ● జూలై 20వతేదీ లోపు ఎంట్రీలు పంపాలి హన్మకొండ కల్చరల్/గీసుకొండ : రాష్ట్ర స్థాయి పౌ రాణిక పద్యనాటక, పద్య పఠన పోటీల కోసం ఆసక్తిగల వారు జూలై 20వ తేదీ లోపు తమ ఎంట్రీలు పంపాలని కళాపిపాసి సదానందాచారి సాంస్కృతిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారేడోజు స దానందాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. తమట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పా ల్గొనే వారు పద్యనాటకంలోని ఏదైనా పాత్రకు సంబంధించిన ఐదు పద్యాలు, ఐదు రాగాలతో భావయుక్తంగా 12 నిమిషాలకు మించకుండా పాడేవారై ఉండాలన్నారు. ఈ రంగంలో ప్రఖ్యాతి చెందిన వారు, అనేక ప్రదర్శనలు ఇచ్చిన వారు పోటీల్లో పా ల్గొనొద్దని, కొత్తవారికి, చూడకుండా, తప్పులు లేకు ండా పాడేవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ఆధార్ జిరాక్స్, వయస్సు,సెల్ నంబర్, పాడే నాటకం పేరు, అందులోని ఏ పాత్ర పద్యాలు పాడుతారో తెలుపుతూ, ఐదు పద్యాలు, వాటి ఐదు రాగాల పేర్లను రాసి వాట్సాప్ ద్వారా తమకు పంపాలన్నారు. హార్మోనియం లేకుండా ఐ దు పద్యాలను ఐదు రాగాల్లో పాడిన వీడియోను త మకు వాట్సాప్ చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతోపాటు ప్రోత్సాహ క బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి గల వా రు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మారేడోజు కేశవ (సెల్ 93475 10237)కు వాట్సాప్ ద్వారా ఎంట్రీలు పంపించాలని, వివరాలకు ఆయనను సంప్రదించాలని కోరారు. పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పాల్గొనే వారికి త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ సీజ్
గూడూరు: మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి తిరుమల నర్సింగ్హోంలో అనుమానాస్పద గర్భస్రావం జరిగిందన్న సమాచారంతో గురువారం డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నర్సంపేట డివిజన్ చెన్నరావుపేట మండలం పుల్లయ్యబోడుతండాకు చెందిన ఓ మహిళకు అనుమానాస్పద కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిందని, ఆస్పత్రి రికార్డులను, కేసు షీట్లను, ఇతర సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వరంగల్ జిల్లాకు చెందినదని, ఆ జిల్లా వైద్య శాఖ అధికారికి పంపిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అనంతరం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ విరాజిత, డిప్యూటీ డెమో రాజ్కుమార్, లోక్యా, ప్రశాంత్, మనోహర్ పాల్గొన్నారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
● డీసీహెచ్ఎస్ చింత రమేశ్ గార్ల: వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్ఎస్ చింత రమేశ్ ఆదేశించారు. గురువారం గార్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. వార్డులను పరిశీ లించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని, ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరైందని, త్వరలో యంత్ర సామగ్రి అమర్చుతారని పేర్కొన్నారు. నూతనంగా స్పెషలిస్ట్ వైద్యురాలు కృష్ణవేణి జాయిన్ అయ్యారని, త్వరలో మరికొంత మంది స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరుతారని ఆయన వెల్లడించారు. సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్గౌడ్, డాక్టర్లు బాలునాయక్, నాగేశ్వరరావు, సతీష్, కృష్ణవేణి, అన్నపూర్ణరెడ్డి, నర్సింగ్ ఆఫీసర్లు స్వాతి, మెర్సీరాణి, రాణి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న ఎమ్మెల్యే
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ స్వయంగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రతీ పథకానికి అర్హులు కావాలంటే ఫార్మర్ ఐడీ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు. ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రంస్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అడ్మిషన్లకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓ ఆటోకు మైక్ అమర్చి పదో తరగతిలో తమ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు తెలుపుతూ పట్టణంలోని అమీనాపురం, కిష్టాపురం, గిర్నితండాలో గురువారం ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పాఠశాల ప్రత్యేకతలు తెలుపుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం బందెల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి మహబూబాబాద్: గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్రెడ్డి అన్నారు. పాఠకులు గురువారం జిల్లా గ్రంథాలయంలో నెలకొన్ని సమస్యలపై వెన్నం శ్రీకాంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు పుస్తకాలు కావాలని, ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈసందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాఠకులకు మెరుగైన సౌకార్యాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఐఈఓ మదార్గౌడ్ గురువారం తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ గ్రూప్లో 1,110 మంది విద్యార్థులకు గాను 903 మంది ఉత్తీర్ణులయ్యారని, ఒకేషనల్ గ్రూప్లో 340 మంది విద్యార్థులకు 268 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ గ్రూప్లో 2,141 మంది విద్యార్థులకు 1,652 మంది ఉత్తీర్ణత సాధించారని, ఒకేషనల్ గ్రూప్ లో 461 మంది విద్యార్థుల గాను 337 మంది పాసైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు. 12 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని జంగిలికొండ క్రాస్ వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పట్టుకుని కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై పి.రాజు గురువారం తెలిపారు. రూరల్ ఏఎస్సై జాకీర్ తమ సిబ్బందితో కలిసి కేవుల తండా వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ట్రాలీని ఆపి తనిఖీ చేయగా అందులో 24బస్తాలు (12 క్వింటాళ్ల) నల్లబెల్లం లభ్యమైందన్నారు. అలాగే 50 కిలోల పటిక, 10 లీటర్ల గుడుంబా ఉందని వివరించారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య బావుసింగ్, రోటిబండ తండాకు చెందిన తేజావత్ మల్సూర్పై కేసు నమోదు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. -
నేడు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.విజయచంద్రతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు నేడు (గురువారం) సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 49210, 96034 62487 -
అధిక ధరలను నియంత్రించాలి
మహబూబాబాద్: అధిక ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల మోదీ పాలనలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పేదలపై భారం పడిందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్తో కొంతమంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారని, అందుకు సంబంధిత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు అజయ్సారథిరెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీని వాస్, పెరుగు కుమార్, నవీన్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండురంగాచారి, వెంకన్న, నా గేశ్వర్రావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీలపై టాస్క్ఫోర్స్
ఈ వానాకాలంలో సాగు అంచనా(ఎకరాల్లో)పంట గత ఏడాది ఈ వానాకాలం సాగు (అంచనా) పత్తి 1,06,674 1,01,716 వరి 2,30,723 2,35,163 మొక్కజొన్న 66,208 73,760 మిర్చి 31,423 38,819 పప్పుదినుసులు 1,353 2,100 ఆయిల్పామ్ 7,904 8,676 ఇతరపంటలు 2,065 17,487 మొత్తం 4,46,350 4,77,721బయ్యారం: పంటల సాగుల విత్తనం ఎంపిక కీలకం. అయితే మార్కెట్లో అసలుతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది. కాగా, ఏటా నకిలీ విత్తనా లు అని తెలియక నాటిన రైతులు నష్టపోతున్నారు. ఈమేరకు నకిలీ విత్తనాలు రైతుకు చేరకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లోని విత్తనదుకాణాల్లో సోదాలు నిర్వహిస్తూ డీలర్లకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయొద్దని, అలాంటి వ్యక్తుల సమాచారం తమకు అందజేయాలని అధి కారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బిల్లుతో పాటు ప్యాకెట్ భద్రపర్చుకుంటే మేలు.. విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ల నుంచి తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలి. అలాగే విత్తన ప్యాకెట్లను పంట దిగుబడి వచ్చే వరకు భద్రపర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు మొలకెత్తకున్నా, మొలకెత్తిన విత్తనాలు పూత, కాత లేకపోతే సంబంధిత డీలర్, కంపెనీ నుంచి రైతులకు నష్టపరిహారం అందుతుంది. పెరగనున్న మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర పంటల సాగు.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వానాకాలంలో సాగు చేసిన పంటల్లో ఈఏడాది మిర్చి, మొక్కజొన్న, వరి, పప్పుదినుసులు, ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లతోటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. పత్తి పంట గత ఏడాది కంటే తక్కువ ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులు సహకరించాలినకిలీ విత్తనాలను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్శాఖ సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అనుమతి లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత వ్యక్తుల సమాచారం అందజేసేందుకు రైతులు సహకరించాలి. – రాజు, ఏఓ, బయ్యారం విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు వానాకాలంలో 4,77,721 ఎకరాల్లో సాగు అంచనా -
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
దంతాలపల్లి: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. బుధవారం మండలంలోని రామానుజాపురంలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత గంజాయి మత్తులో తూగుతుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ద్వి చక్రవాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్రెడ్డి, ఎస్సై రవికుమార్, ఉపసర్పంచ్ మల్లం మౌనిక, గ్రామ కార్యదర్శి ప్రభు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
వాహనదారులు క్షేమంగా గమ్యస్థానం చేరాలి
గూడూరు: ద్విచక్రవాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు అందించా రు. తర్వాత రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ప్లకార్డుల ప్రదర్శనతో గూడూరు సీఐ వినయ్కుమార్ వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. మండలంలో గాజులగట్టు, పొనుగోడులో పోలీసుల ప్రత్యేక దృష్టితో జీపీ పాలకవర్గం గ్రామంలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన మొదలు పెట్టి సక్సెస్ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత కొమ్మాలు, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ సత్యనారాయణ, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నరేష్రెడ్డి, ఆర్టీఏ శంకర్నాయక్, ఎస్సై గిరిధర్రెడ్డి, ఏఓ అబ్దుల్మాలిక్, ఎఫ్ఆర్వో ప్రసాదరావు, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీష్ -
వచ్చే ఏడాది ఖరీఫ్కు సాగునీరు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతుల పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణెకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి -
చాపకింద నీరులా..
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026నెహ్రూసెంటర్: జీవనశైలిలో మార్పుల వల్ల జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధుగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతో ంది. పట్టణాల్లో కనిపించే వ్యాధులు ఇప్పుడు పల్లెల్లో సైతం విస్తరిస్తూ కలవరపెడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ప్రధాన కారణమవుతున్నా యి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ రీస్క్రీనింగ్ పేరుతో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి పరీక్షలను నిర్వహిస్తూ వారి వివరాలను నమోదు చేస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు జిల్లాలో 50వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. అలాగే క్యాన్సర్, లెప్రసీ వంటి వ్యాధులను గుర్తిస్తూ వైద్యం అందిస్తున్నారు. విస్తరణ ఇలా.. జిల్లాలో చాపకిందనీరులా బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధుల విస్తరణ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన వారు సైతం ఈ వ్యాధులు బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. మూడున్నర లక్షలకుపైగా 30 ఏళ్లపైబడిన వారిని పరీక్షించగా 50 వేల మంది షుగర్, బీపీ, ఇతర వ్యాధులతో బాధపడుతుండడం ఆశ్చర్యం కలిగి స్తోంది. ప్రతీరోజు వ్యాయామం చేస్తూ శారీక శ్రమ, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 6 నెలలకు ఓసారి వైద్య పరీక్షలు చేయించుకుని అందుకు తగినట్లు జీవన విధానంలో మార్పులు చేసుకో వడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలుపుతున్నారు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడంతో పాటు ఆహారపు అలవాట్లు బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్రతీరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అవగాహన లేక, నిర్లక్ష్యంతో వ్యాధుల బారిన పడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి రీ స్క్రీనింగ్.. జిల్లాలో 30ఏళ్లు పైబడిన వారందరిని వైద్యారోగ్యశాఖ సిబ్బంది రీస్క్రినింగ్ ద్వారా సర్వే చేపడుతున్నారు. జిల్లాలో మొత్తంగా 30 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 3,92,894 ఉండగా ఇప్పటి వరకు 2,75,968 మందికి సర్వే నిర్వహించారు. సర్వే ద్వారా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి బాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వేలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలిప్రజలందరూ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా క్రమం తప్పకుండా ఉచితంగా అందజేస్తారు. సర్వేలు, పరీక్షలు నిర్వహిస్తున్న వెద్య సిబ్బందికి సహకరించాలి. ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ బీపీ, షుగుర్ వ్యాధుల విస్తరణ జిల్లాలో 50వేల మందికి పైగా బాధితులు 30ఏళ్లు పైబడిన వారికి వైద్య పరీక్షలు మారుతున్న జీవనశైలి వల్లే వ్యాధుల వ్యాప్తి -
ములుగు జిల్లా షూటింగ్కు అనువైన ప్రాంతం
వెంకటాపురం(ఎం): సినిమా షూటింగ్లకు ములుగు జిల్లా అనువైన ప్రాంతమని సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్ అన్నారు. షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నెం. 2’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బుధవారం మండలంలోని అందుగులమీది ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలో సినిమా చిత్రీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందుగులమేది గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ మంచైపె హీరోహీరోయిన్పై పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వేణు యాదవ్, కోడైరెక్టర్ అరవింద్, లిరిక్స్ రైటర్ రాజ్ కుమార్, మూవీ ఎడిటర్ యూనిక్, డీఓపీ తరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్ లోకేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్, యూనిట్ సభ్యులు సిద్ధు, రఘు, రాహుల్, రఘుపతి, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్ అందుగులమేది ప్రాంతంలో సినిమా చిత్రీకరణ -
ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర
మహబూబాబాద్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని టీపీసీసీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సిరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేయడం సరికాదని, సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లు అక్రమంగా తొలగించారని ఆరోపించారు. 2002నాటి ఓటరు జాబితా ఆధారంగా చేసుకుని నూతన ఓట్లను తొలగించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని, దీనిని అడ్డుకోవడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, కానీ వారు ప్రజలను పక్కదారి పట్టించే ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు సర్ ప్రక్రి య కొనసాగనుందని, ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టత నిచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా, సర్ మానుకోట, డోర్నకల్ ఇన్చార్జ్లు పులి అనిల్ కుమార్, అవేజ్, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ పార్లమెంట్ ఇన్చార్జ్ నర్సిరెడ్డి -
‘దిక్సూచి’ పేరిట రూ.46.50 లక్షలు హాంఫట్
జనగామ: ‘దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46లక్షల 50వేల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ ఘటన జనగామ కలెక్టరేట్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డీడీఓ హోదాలో ఉన్న తహసీల్దార్ సీహెచ్.శ్రీకాంత్పై జనగామ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓ రవికిరణ్ బుధవారం తెలిపారు. అసలేం జరిగింది.. పదో తరగతి విద్యార్థుల కోసం 15వేల ‘దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ఒక్కొటి రూ.310 చొప్పున మొత్తం రూ.46లక్షల50వేలకు హనుమకొండకు చెందిన మెస్సర్స్ రిత్విక్ గ్రాఫిక్స్ ప్రొప్రైటర్ విజయ్ నుంచి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ఏఓ, డీడీఓ అయిన తహసీల్దార్ సీహెచ్.శ్రీకాంత్ ఈ బిల్లును ప్రాసెస్ చేసి 2026, మార్చి26న ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం సొమ్ము చెల్లించారు. ఆడిట్లో అక్రమాలు బట్టబయలు.. కలెక్టర్ సందీప్ కమార్ ఝా ఆదేశాలతో జిల్లా ఆడిట్ ఆఫీసర్ నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు ఫిర్యాదులో పొందు పరిచారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల నమోదు 4,635 మాత్రమే ఉండగా, సుమారు 5,100 పుస్తకాలు అవసరమని గుర్తించారు. కాగా, 15 వేల పుస్తకాలు ఆర్డర్ చేశారు. అంటే అవసరానికి మూడు రెట్లు ఎక్కువ. ఇందులో రూ.46.50 లక్షల భారీ కొనుగోలుకు ఓపెన్ టెండర్ పిలవకుండా కేవలం మూడు సంస్థల నుంచి డైరెక్ట్ కొటేషన్ తీసుకున్నారు. డీఈఓ ఇండెంట్ లేకపోవడంతో పాటు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుమతి కూడా తీసుకోలేదని అందులో ఉంది. డబ్బుల గోల్మాల్ ఇలా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి లిఖితపూ ర్వకంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరుకోలేదు. గూడ్స్ రిసిప్ట్ నోట్, స్టాక్ ఎంట్రీ, పంపిణీ రికార్డు, రిసిప్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఏదీ లేకుండానే యథేచ్ఛగా చెల్లింపులు కానిచ్చేశారు. సాక్ష్యాలు మాయం చేసే కుట్ర పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46.5 లక్షలు డెబిట్ అయిన వెంటనే కలెక్టరేట్ అధికారిక ఈ–మెయిల్ collecto-jangaon@ gmail. comMS$ HDFC, IDFC FIRST బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్ అలర్ట్ అయినట్లు మెయిల్ వచ్చింది. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 4.30కు ఈ చెల్లింపు జరిగింది. అధికారిక మెయిల్ పాస్వర్డ్లు తెలిసిన శ్రీకాంత్ ఈ లావాదేవీకి సంబంధించిన అలర్ట్ మెయిల్స్ను, కమ్యూనికేషన్లను డిలీట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త కలెక్టర్కు ఈ లావాదేవి తెలియకుండా, తనను, ఏ–2 రిత్విక్ గ్రాఫిక్స్ను చట్టపరమైన శిక్ష నుంచి కాపాడుకునేందుకే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు.. హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, ఎఫ్ఐఆర్ఎస్టీ బ్యాంకు రికార్డులు, గూగుల్ లాగిన్ డేటా, ఐపీ అడ్రస్లు, డివైజ్ డేటా, యాక్టివిటీ హిస్టరీ, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారిక ఇ–మెయిల్ ను అనధికారికంగా యాక్సెస్ చేసి సాక్ష్యాలు మాయం చేయడం తీవ్రమైన నేరమని ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు.. ఆధారాలు లేకుండా జీమెయిల్ అకౌంట్ నుంచి తొలగించిన వారిపై చట్ట ప్రకారం అప్పటి కలెక్టర్ ఏఓ శ్రీకాంత్, ప్రొప్రైటర్ విజయ్, హనుమకొండ గ్రాఫిక్స్ రుత్విక్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రస్తుత కలెక్టరేట్ ఏఓ రవికిరణ్ జూన్ 6న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించగానే ఆరా.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరలేదని గుర్తించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. కాగా, జిల్లా పాలనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనదైన శైలిలో ముందుకెళ్తుతుండగా, ఈ కేసులో పూర్తిస్థాయి నిజాలు బయటకు తీస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.విద్యాశాఖలో జరిగిన కుంభకోణాన్ని ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గుర్తించి వెలుగులోకి తెచ్చారు. అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్న కలెక్టర్ చొరవతోనే ఈ భారీ భాగోతం బయటపడింది. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్ర మంలోనే విద్యాశాఖలో జరిగిన ఆర్థిక లావాదేవీల పై దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది ‘దిక్సూచి’ కార్యక్రమాన్ని చేపట్టారు. జనగామ కలెక్టరేట్లో వెలుగులోకి.. పుస్తకాలు రాకుండానే డబ్బులు డ్రా గత తహసీల్దార్ శ్రీకాంత్పై కేసు -
రైలులో గర్భిణికి ప్రసవం చేసిన 108 సిబ్బంది
● సీకేఎం ఆస్పత్రికి తరలింపు.. తల్లీబిడ్డ క్షేమం కాశిబుగ్గ: బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ రైలులో ప్రయాణిస్తున్న అర మంజుల అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా, 108 సిబ్బంది వెళ్లి ప్రసవం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు ఆపిన తర్వాత గర్భిణి సమాచారం తెలుసుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పెలట్ అమర్లు అక్కడికి చేరుకున్నారు. ఆమె పరిస్థితి గమనించి, రైలులోనే ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం ఇద్దరిని వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వెంటనే స్పందించిన 108 సిబ్బందిని రైల్వే అధికారులు అభినందించారు. ● నలుగురికి గాయాలు కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని 36వ డివిజన్లో వీధి కుక్కల బెడద స్థానికులను భయపెడుతోంది. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాంపెల్లి వరమ్మ, రేణుకుంట్ల రమేష్, మహ్మద్ తాహి, గౌనియాలపై దాడి చేయగా వారికి గాయాలయ్యాయి. వీరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. -
నీళ్లు రావు.. చెత్త ఎత్తరు
● మున్సిపల్ సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం డోర్నకల్: మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నెలల తరబడి తాగునీటి సరఫరా నిలిచిందని, చాలా రోజులుగా చెత్తబండ్లు రావడం లేదని, రోడ్లు అధ్వానంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం జరిగిన వార్డు సభలో స్థానికులు సమస్యలపై మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందిని నిలదీశారు. నెలల తరబడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చెత్తను తొలగించకపోవడంతో ఇళ్లు, వీధులు చెత్తతో నిండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, పాలకవర్గం స్పందించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికారులను, పాలకవర్గాన్ని నిలదీశా రు. మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ చంద్రమౌళి, డీటీ వీరన్న, సీడీపీఓ లక్ష్మి, కౌన్సి లర్లు బాదావత్ హేమలత, ఎల్లావుల సువర్ణ, గారె రమేశ్, బానోత్ ప్రమీల, ఆంగోత్ శైలజ, గుగులోత్ రాము తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో దేవాదాయశాఖలో పోస్టుల భర్తీ
హన్మకొండ కల్చరల్ : త్వరలో దేవాదాయశాఖ కార్యాలయాలు, దేవాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పాచిక, పరిచారిక, అర్చక పోస్టులను వేదపండితుల ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు హైదరాబాద్లో కమిషనర్ హనుమంతరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల, అర్చకుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, వారిని గ్రాంట్ ఇన్ ఎయిడ్లో చేర్చాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, జేఏసీ నాయకులు కోరారు. దీనికి కమిషనర్ హనుమంతరావు స్పందిస్తూ మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్కలకు పంపించామని, అలాగే అర్చకుల ప్రమోషన్ల విషయమై వారంలో సమావేశం ఏర్పాటు చేసి 888 జీఓ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యాండర్ స్ట్రెంత్ ప్రకారం దేవాదాయశాఖ కార్యాలయాల్లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ, వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ పాతర్లపాటి నరేశ్శర్మ, రాష్ట్ర కన్వీనర్ గంగు సత్యమూర్తి, కాండూరి కృష్ణమాచారి, ధనుంజయ్శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు వివరించారు. ప్రతీ కలెక్టరేట్లో దేవాదాయశాఖ చాంబర్ ఏర్పాటు రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు -
మేడారం అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ(గద్దెలు) ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దడంతోపాటు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మేడారం హరిత హోటల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ మేడారం మహాజాతర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రత, పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సేవల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాశ్వత నిర్వహణ వ్యవస్థ ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు.. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చే అవకాశమున్నందున ముందస్తుగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. జంపన్నవాగును పర్యాటక కేంద్రంగా.. జంపన్నవాగు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, మేడారంలో శాశ్వత ప్రాతిపదికన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అంతకు ముందు వనదేవతలను దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. -
మొన్న.. నిన్న.. నేడు
వరంగల్ అర్బన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మొయిన్ గేట్కు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ కావడంతో మరమ్మతు కోసం తవ్వకాలు చేశారు. లీకేజీని సరిచేసి గుంతను తవ్విన మట్టితోనే పూడ్చివేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకరోజు గడవకముందే గుంతగా మారింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. చూడలేక, వాహనదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వరంగల్ ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో’ ఈనెల 7వ తేదీన ‘ప్రమాదాలకు కేరాఫ్ ఎంజీఎం రోడ్డు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. మరునాడు ట్రాఫిక్ పోలీసులు స్పందించి బల్దియా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ సహకారం, ట్రాఫిక్ పోలీసుల చొరవతో కంకర డస్ట్, ఇసుక పోసి గుంతను పూడ్చి వేశారు. బారికేడ్ను తొలగించారు. ఒకటి, రెండు రోజులు గడవకముందే ఆ గుంత మళ్లీ కుంగిపోయింది. రెండు రోజులుగా గుంత ప్రమాదకరంగా మారడంతో ట్రాఫిక్ పోలీసులు మళ్లీ బారికేడ్ పెట్టారు. ఈ రహదారి ప్రధాన నిర్వహణ బాధ్యత ఆర్అండ్బీ ఇంజనీర్లతోపాటు పైపులైన్ లీకేజీ కోసం తవ్వకం చేసిన బల్దియా ఇంజనీర్లది. కానీ ఎవరికి వారు అన్నట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇకనైనా ఆర్అండ్బీ, బల్దియా ఇంజనీర్లు ప్రధాన రహదారిపై గుంత ఏర్పడకుండా శాశ్వత మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు విన్నవిస్తున్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల ప్రగతి
పెద్దవంగర: గ్రామసభలు గ్రామాభివృద్ధికి పునాది వంటివని, గ్రామంలోని సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను ప్రజలే నిర్ణయించే వేదిక గ్రామసభ అని కలెక్టర్ స్నేహశబరీష్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో సర్పంచ్ దుంపల శ్రీదేవి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమి లోని పోషకాలు, సూక్ష్మజీవులు దెబ్బతింటాయని అన్నారు. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో వినియోగించాలని సూచి ంచారు. నిబంధనలు ఉల్లంఘించి కొయ్యలను కాల్చితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భూసారాన్ని కాపాడుకోవడానికి పంట మార్పిడి విధానం అవసరమని, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఆధునిక సాగు విధానంపై అవగాహన కల్పించాలని అదేశించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యసాధనపై దృష్టి సారించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పలు దరఖాస్తులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్ కుమార్, ఏఓ స్వామి నాయక్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనమహబూబాబాద్: జిల్లా కేంద్రం శివారులోని గుమ్ముడూర్ ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం కలెక్టర్ స్నేహశబరీష్ పరిశీలించారు. నిర్మాణాలు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ కోర్టు కేసులో ఉందని చెప్పారు. సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట డీఈఈ ఉపేందర్, సంబంధిత అధికారులు ఉన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్మాట్లాడుతున్న కలెక్టర్ స్నేహ శబరీష్ -
బడిబాట..
రెండు చిలకల కథ నేను గీసిన చిత్రం బాస్కెట్ బాల్ నేర్చుకుంటున్నాం కాజీపేట : హాయ్. నాపేరు పాము అన్విక్ భారతి. వేసవి సెలవుల్లో నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు మా అమ్మ గాయిత్రి, నాన్న రాజేశ్తో కలిసి వెళ్లా. అక్కడ మా అమ్మమ్మ నాకు రాత్రి వేళల్లో మంచి కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. ఇందులో భాగంగా ఓ రామచిలక కథను చెప్పి నీతిని బోధించింది. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతడు అడవిలోకి వేటకు వెళ్లి రెండు రామచిలకలను పట్టి తెచ్చి రాజుకు బహూకరించాడు. రాజు వాటిని వెంటనే మంత్రికి, సేనాధిపతికి చేరొటి ఇచ్చాడు. రామచిలకలకు ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తారో వారికి బంగారు కానుకలు ఇస్తానని ప్రకటించాడు. మంత్రి, సేనాధిపతులు చిలకలను ఇంటికి తీసుకెళ్లి భార్యలకు ఇచ్చి రాజుగారి కానుకల విషయం తెలిపాడు. మంత్రి భార్య సంగీతం నేర్పించే గురువు కావడంతో చిలుకకు చక్కటి పద్యాలు, పాటలు, మాటలు నేర్పించింది. సేనాధిపతి భార్య పదవి ఉందనే అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో కఠిన పనులు చేయిస్తూ నిత్యం వారిని తిడుతుండేది. ఆది విన్న ఆ చిలక పూర్తిగా తిట్లనే నేర్చుకుంది. మంత్రికి రాజు మీద ఎనలేని ప్రేమ ఉండడంతో చిలకకు కూడా ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. సేనాధిపతి ఇతర రాజులతో కలిసి కుట్రలు చేస్తుండేవాడు. ఒకరోజు ఆ రెండు చిలకల ను రాజు సభకు తీసుకురావాలని ఆదేశిస్తాడు. సభలో రా జు మంత్రి చిలకను ఎలా ఉన్నావంటూ ప్రశ్నిస్తాడు. దానికి ఆ చిలక పద్ధతిగా బాగున్నాను మీరు ఎలా ఉన్నారంటూ అడుగుతుంది. రాజుకు దీంతో ఎక్కడాలేని సంతోషం కలుగుతుంది. సేనాధిపతి చిలకను ప్రశ్నించగా దానికి ఆ పక్షి నేను ఎలా ఉంటే నీకేందుకు మా సేనాధిపతి నీపై దాడి చేస్తాడు నువ్వు చస్తావు అంటుంది. వెంటనే ఆగ్రహించిన రాజు.. సేనాధిపతి బంధిని చేసి కఠినంగా శిక్షిస్తాడు. నీతి! మంచివాళ్ల సహవాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది. అందుకే అన్నారు పెద్దలు సహవాస దోషం అని -
దోపిడీకి పాల్పడిన పాత నేరస్తుల అరెస్ట్
ఖిలా వరంగల్ : ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి దోపిడీకి పాల్ప డిన ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, వెండి, బంగారు ఉంగరాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సైలతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్కు చెందిన ప్రస్తుతం కాజీపేట వైఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్న బౌరి పవన్ సింగ్, అదే ప్రాంతానికి చెందిన బౌరి రవీందర్ సింగ్, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన బాపూరి సికెందర్ సింగ్ పాత నేరస్తులు. వీరు టీమ్గా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ఒక జంటలను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న నిందితులు ఉర్సుగుట్ట – భట్టుపల్లి రోడ్డులో వేచి చూస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు, యువతి బైక్పై వచ్చి ఓ పెట్రోల్ బంక్ ఎదుట ఉన్న ఒక వెంచర్లోకి వెళ్లడాన్ని గమనించారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి నిందితులు అక్కడికి చేరుకుని ఆ జంటను చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి ఇవి మీ తల్లిదండ్రులకు పంపుతాం.. మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ జంట నగదు లేదని చెప్పగా నిందితులు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. పవన్ సింగ్ సదరు యువతి చేతికి ఉన్న బంగారు, రవీందర్ సింగ్ ఆ యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాలను లాక్కున్నారు. ఇదే క్రమంలో సికెందర్ సింగ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ వీడియోలను డిలీట్ చేసినట్లు నటించి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దోచుకున్న ఉంగరాలను వరంగల్లో విక్రయించేందుకు నిందితులు బైక్పై వస్తుండగా ఎస్సై శ్రవణ్,హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు వాజీద్, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి బంగారు, వెండి ఉంగరాలు మూడు సెల్ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. నగదు, ఉంగరాలు, బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ స్వామి -
రైలు ఎక్కబోతూ మృత్యుఒడికి..
ఖిలా వరంగల్: రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడి ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్పై చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ చిలకగూడ ప్రాంతానికి చెందిన పుప్పాల ధరణి (30) వరంగల్లోని తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం షిర్డీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు వెళ్లేందుకు తల్లి భాగ్యలక్ష్మి, కూతురు ధరణి వరంగల్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఇద్దరు కలిసి రైలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో ధరణి ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్రెడ్డి తెలిపారు. ● ప్లాట్ఫామ్ మధ్యలో పడి మహిళ దుర్మరణం ● వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన -
కలెక్టర్ మేడమ్కు నమస్కరించి..
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 202 జిల్లా పాలనాధికారి స్నేహశబరీష్కు మారుమూల ప్రాంత విద్యార్థిని లేఖసాక్షి, మహబూబాబాద్: ‘శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ స్నేహ శబరీష్ మేడమ్ గారికి నమస్కరించి రాయునది. నేను జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని. పదిరోజుల నుంచి మా అమ్మానాన్నలు ఒకటే గొడవ. ఒకరు ప్రైవేట్ బడికి పంపుదాం అంటే మరొకరు సర్కారు బడికి పంపుదామని అంటున్నారు. నాకేమో సర్కారు బడికే వెళ్లాలని ఉంది. కానీ, సమస్యలతో ఉన్న సర్కారు బడిని బాగుచేస్తే నాలాంటి పేద పిల్ల లు చదువుకునే అవకాశం ఉంటుంది. నా విన్నపాన్ని మన్నించి మీరు బడులు బాగు చేయిస్తారు.. మంచి చదువు చెప్పిస్తారని నా నమ్మకం. ఈ విషయాలన్నీ మీకు నేరుగా కలిసి చెప్పాలనే అనుకున్నా.. కానీ నేను చిన్నపిల్ల ను.. మీ దగ్గరకు రాలేక.. నేరుగా కలువలేక.. ఈ లేఖ రాస్తున్నాను.’ పర్యవేక్షణ లేక.. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు సరిగ్గా బోధించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రోజు బడికి వెళ్లినా.. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నాం. రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఆ మండలంలోని సీనియర్ పీజీ హెచ్ఎంలకే ఎంఈఓల బాధ్యతలు అప్పగించారు. వారికి వివిధ రకాల రిపోర్టులు ఇవ్వడం, వారి సొంత పాఠశాలలను చూసుకోవాల్సి ఉండడంతో పాఠశాలల పనితీరు.. ఉపాధ్యాయుల రాకపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కాగా, ఈనెల 15నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో సమస్యలు.. తల్లిదండ్రులు లేని వారు, పేద ఆడపిల్లలు చదివే కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూళ్లు ఎవరికి పట్టని విధంగా మారాయి. గత ఏడాది పలు మోడల్ స్కూళ్లలో జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే భయంగా ఉంది. తీరని సమస్యలు.. జిల్లా వ్యాప్తంగా 762 ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో పది పాఠశాలలకు భవనాలు లేవు. ఇందులో ఆరు పాఠశాలలు అద్దె భవనాలు, రెండు పాఠశాలలు రెంట్ ఫ్రీ భవనాలు, మరో రెండు పాఠశాలలు చెట్లకింద నిర్వహిస్తున్నారు. 338 పాఠశాలలకు ప్రహరీలు ఉండగా.. 92 పాఠశాలల ప్రహరీలు కూలిపోయాయి. మరో ఐదు పాఠశాలలకు ఫెన్సింగ్ వేశారు. 222 పాఠశాలలకు ప్రహరీలు లేవు. 98 పాఠశాలల్లో ప్రహరీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో ఏడు నిర్మాణాల్లో ఉన్నాయి. 21 పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు లేవు. ఆరు పాఠశాలలకు కనెక్షన్లు ఉన్నా మరమ్మతులకు గురయ్యాయి. 17 పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 272 పాఠశాలల్లో వంట గదులు లేవు. దీంతో ఆరుబయట వంట చేస్తున్నారు. సమస్యలతో ప్రభుత్వ బడులు సతమతం ఎంఈఓల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం 15నుంచి పాఠశాలల పునఃప్రారంభం ప్రత్యేక దృష్టిపెట్టి సౌకర్యాలు కల్పించాలని వినతి కలెక్టర్కు వినతి చేస్తున్న విద్యార్థిని -
ప్రజావాణి ఫిర్యాదుతో పాఠశాల పునఃప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగిన ప్రజావాణిలో ధరంసోతు సీతారాంనాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించామని డీఏఓ సత్యనారాయణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండాలో మూసివేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు భాగాస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోటుబుక్స్ అందజేస్తున్నామన్నారు. పాఠశాలలో 15మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు మైస శ్రీనివాసులు, సీఎంఓ సురేష్, ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, ఉపాధ్యాయులు సిరినాయక్, ప్రతిభ, భోజన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ మరిచి.. విచక్షణ కోల్పోయి
వరంగల్ స్పోర్ట్స్ : క్రమశిక్షణ నేర్పించాల్సిన పెద్దలే విచక్షణ కోల్పోయారు. క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన నిర్వాహకులే భౌతికదాడులకు తెగబడ్డారు. క్రీడా లోకానికే మచ్చతెచ్చేలా వ్యవహరించిన తీరుతో యువ క్రీడాకారులు ఆత్మ పరిశీలనలో పడ్డారు. హనుమకొండలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బాక్సింగ్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 బాలబాలికల ఎంపికలు అపహాస్యం పాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎంపికలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఉదయమే బాక్సింగ్ హాల్కు చేరుకున్నారు. నిబంధనల మేరకు క్రీడాకారులకు ముందుగా వైద్య పరీక్షలు చేసిన అనంతరం వెయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్వాహకులు వైద్య బృందం రాకముందే క్రీడాకారుల బరువు నమోదు చేస్తున్నారు. అందులో కొందరు క్రీడాకారులు బరువు 100 నుంచి 200 గ్రాముల ఎక్కువగా ఉన్నట్లు చూపెట్టారు. దీంతో బరువు తగ్గించేందుకు అరగంట పాటు గ్రౌండ్లో వ్యాయామం చేసేందుకు వెళ్లారు. అనంతరం మరోసారి వెయింగ్ కోసం వచ్చిన క్రీడాకారులను సమయం ముగిసిందంటూ నిర్వాహకులు ఎంపికల్లో పాల్గొనకుండా రిజెక్ట్ చేశారు. నిబంధనల పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నిర్వాహకులు అవేమీ పట్టించుకోకకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై రెఫరీగా వ్యవహరించే కోచ్ శ్రీకాంత్, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి. రవీందర్కుమార్తో వాగ్వాదానికి దిగాడు. సమయం పేరుతో క్రీడాకారుల భవిష్యత్ను నాశనం చేయడమేంటని నిలదీశాడు. ఈ క్రమంలో మాటలు కాస్త దూషించే స్థాయికి ఆ తర్వాత బాక్సింగ్ హాల్లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఠాణా మెట్లెక్కిన పంచాయితీ.. రెఫరీ వర్సెస్ అసోసియేషన్ అధ్యక్షుడి మధ్య జరిగిన దాడులతో క్రీడాకారులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. గొడవ ముదురుతుండడంతో అక్కడే కొందరు 100 డయల్ చేయడంతో ఇద్దరిని హనుమకొండ పీఎస్కు తరలించారు. కాగా, ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో క్రీడాకారుడి నుంచి రూ.300 వసూలు చేసిన నిర్వాహకులు కనీసం అరటిపండు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఉమ్మడి జిల్లా నుంచి 17 మంది హాజరు.. పంచాయితీ సమస్యను పక్కనపెట్టి సాయంత్రం 5 గంటలకు ఎంపిక ప్రక్రియ కొనసాగించినట్లు నిర్వహణ కార్యదర్శి సీ. హెచ్ రామకృష్ణ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు బాలికలు, 13 మంది బాలురు ఎంపికలకు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాక్సింగ్ క్రీడ ఎంపికలో భౌతిక దాడులు నిర్వాహకుల తీరుపై అసంతృప్తి ఠాణా మెట్లెక్కిన క్రీడల పంచాయితీ -
అంకిత భావమే విజయానికి మూలం
హసన్పర్తి: కృషి, నిజాయితీ, అంకితభావమే విజయానికి మూలమని బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంగోపాల్రావు అన్నారు. మంగళవారం వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాంగోపాల్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సావీనర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని చెప్పారు. జీవితాంతం నేర్చుకునే తత్వం సృజనాత్మకత, పట్టుదల, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సార్ యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి మాట్లాడుతూ అభిరుచి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధించొచ్చన్నారు. విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం చూపే విలువలను అందించేదని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్య విలువల ఆధారిత అభ్యాసానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. ఈసందర్భంగా సుమారు 1,500 మంది విద్యార్థులకు డిగ్రీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కూచి పూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డికి భారతీయ కళల రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ (హానరిస్ కాసా) ప్రదానం చేసింది. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, ప్రో–చాన్స్లర్ ఎ.మధుకర్ రెడ్డి, ప్రో–వైస్ చాన్స్లర్ డాక్టర్ వి.మహేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.వెంకట రమణారావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ ఆర్. అర్చనారెడ్డి, డైరెక్టర్ ఐ క్యూఏసీ ప్రొఫెసర్ పి.వి. రాజశేఖర్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఎ.వి.వి. సుధాకర్ పాల్గొన్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఐఐటీ, మాజీ డైరెక్టర్ (ఢిల్లీ) రాంగోపాల్రావు అన్నారు. మంగళవారం ఎస్సార్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితిల్లో నెలకొందన్నారు. కొన్నాళ్లుగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్నత విద్యలో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన వారిని వీసీలుగా నియమించాలన్నారు. బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ చాన్స్లర్ రాంగోపాల్రావు ఘనంగా ఎస్సార్ స్నాతకోత్సవం 1,500 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం -
ధరలు తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి. అసలే రైతులు అష్టకష్టాలతో పంటలు సాగు చేస్తుంటే తమ నడ్డివిరిచే విధంగా ధరలు పెంచి అగాధంలోకి నెట్టివేస్తుంది. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఇష్టారాజ్యంగా పెంచడం విచారకరం. వర్షాలు రావడం ఆలస్యమై కర్షకులు బాధపడుతుంటే పంటల సాగుకు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కదా అని ధరల పెంపుదల చేయడం ఎంతవరకు సమంజసం. – బోళ్ల సందీప్ రెడ్డి, రైతు, ఆమనగల్ రైతులపై అదనపు భారంకాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. నేను మూడు ఎకరాల్లో వరి, ఒక ఎకరం మిర్చి, రెండు ఎకరాల్లో కూరగాయలు, పెసర పంట సాగు చేయబోతున్నాను. మొత్తం పంటల సాగుకు సంబంధించి 13 బస్తాల అడుగు మందు కొనుగోలు చేయాలి. ప్రస్తుత సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో వేల రూపాయల్లో ఖర్చులు పెరుగుతాయి. – దొడ్డ సాగర్, రైతు, మల్యాల -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
ఎంజేపీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి : వరంగల్లోని రంగశాయిపేట ఆర్టీఓ జంక్షన్ సమీపంలోని ములుగు, మహబూబాబాద్ మహాత్మాజ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో (ఎంజేపీబీసీ)లో ఈవిద్యాసంవత్సరం( 2026–2027)లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీఎన్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల విద్యార్థినులు కూడా ఈ కళాశాలల్లో అడ్మిషన్లు పొందొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కళాశాలకు ఆప్షన్ ఇవ్వని విద్యార్థినులు నేరుగా ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. తమ ఒరిజనల్ విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఈ కళాశాలల్లో బీకాంసీఏ, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీపీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఎస్డీఎస్, బీజెడ్సీ, బీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు. వివరాలకు 9866610429, 9676817038, 8130594460 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అనాథపిల్లలకు అండగా బాలవికాస ● 250 మంది గ్రామీణ పేదలకు ఆర్థికసాయం కాజీపేట రూరల్ : సమాజంలో పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు బాలవికాస సంస్థ అండగా ఉంటుందని జనవికాస అధ్యక్షుడు లూర్థు మర్రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం బాలవికాస, సోపార్ మద్దతుతో నడుస్తున్న ఆరు జిల్లాలకు చెందిన గ్రామీణ పేద అనాథ విద్యార్థులు 250 మందికి రూ.7,50,000 లక్షల విలు వైన కిరాణా సరుకులు, స్టడీ కిట్లు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రమశిక్షణ నై పుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రము ఖ వక్త విజయ్ జక్కోజు మాట్లాడుతూ యువతకు భవిష్యత్ బాలవికాస మార్గదర్శకమన్నా రు. కోఆర్డినేటర్లు, బాలవికాస మహిళా ప్రో గ్రాం సభ్యులు జ్యోతి, అమూల్య పాల్గొన్నారు. -
పావుగంట ఆలస్యమైందని పక్కన పెట్టారు
వైద్యులు రాకముందే వెయింగ్ తీసుకున్నారు. 200 గ్రాములు ఎక్కువ ఉన్నావని తెలపడంతో ఎంపికకు ఇంకా సమయం ఉందని గ్రౌండ్ వర్కవుట్ చేశా. ఆ తర్వాత మరోసారి వెయింగ్ కోసం వస్తే ఆలస్యమైందని చెప్పి బాక్సింగ్ హాల్ నుంచి బయటకు పంపారు. ఇప్పటి వరకు నేను రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక మెడల్ సాధించా. ఎప్పుడూ ఇలా జరగలేదు. రాజేశ్, బుద్దారం, ములుగు జిల్లా సమయపాలన తప్పనిసరి క్రీడాకారులకు సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరి. ఎంపికలు ఉన్నాయని తెలిసి సదరు క్రీడాకారుడు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఎంపికలకు అనర్హుడిగా తేల్చి పంపాం. కొందరు కోచ్లు నిబంధనలు తెలియకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తద్వారా క్రీడాకారులు నష్టపోతారని మరిచిపోతున్నారు. రవీందర్కుమార్, అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ -
విద్యార్థుల నమోదులో లక్ష్యాలు సాధించాలి
గార్ల: పాఠశాలల వారీగా విద్యార్థుల నమోదు లక్ష్యాలను ఉపాధ్యాయులు సాధించాలని డీఈఓ ఎం. సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం డీఈఓ తనిఖీ చేసి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం నాటికి పరిసరాలు, వాటర్ట్యాంక్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మానవ మనుగడకు అడవులే ఆధారంగూడూరు: మానవ మనుగడకు, భూమిపై జీవకోటికి అడవులు ప్రాణధారమని ఎఫ్ఆర్వో ప్రసాదరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గూడూరు అటవీశాఖ రేంజ్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అడవుల ప్రాముఖ్యత, రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. జీవ వైవిధాన్ని కాపాడటంతో పాటు ఆక్సిజన్ అందిస్తూ, వర్షాలు పడడానికి, వాతావరణ సమతుల్య తకు అడవులు సహాయపడుతాయన్నారు. అలాంటి అడవులను, వన్యప్రాణులను, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలు, ఎంపీడీఓ సత్యనారాయణ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేయాలినెహ్రూసెంటర్: బిర్సాముండా పోరాటస్ఫూర్తితో ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు సాగించాలని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్నాయక్ అన్నారు. గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బిర్సాముండా వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బిర్సాముండా ఆది వాసీల అస్తిత్వం కోసం జల్–జంగల్–జమీన్ నినాదంతో అటవీపై సర్వ హక్కులు ఆదివాసీలకే దక్కాలని, ఆదివాసీల విముక్తి కోసం పోరా టాలు సాగించారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాటాలకు ఆదివాసీ గిరిజనులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిత్తారి సోమన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న, డీబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలెపాక వెంకన్న, గణేష్, ఆంగోత్ కిషన్నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
తుదిదశకు ఇన్వెస్టిగేషన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
రేపు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.విజయచంద్రతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు తేదీ : ఈ నెల 11న (గురువారం) సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 49210, 96034 62487


