breaking news
Mahabubabad District News
-
ఇంటి దొంగలు
సాక్షి, మహబూబాబాద్: బ్యాంకుల్లో తనఖాపెట్టిన బంగారం, ఖాతాల్లో డబ్బులకు రక్షణ లేకుండాపోతోంది. ఇటీవల జిల్లాలోని పలు బ్యాంకుల్లో పలువురి ఖాతాల్లో డబ్బులు మాయం కావడం, నిబంధనలకు విరుద్ధంగా రుణాల పంపిణీ, తనఖాపెట్టిన బంగారం మాయంకావడం వంటి ఘటనలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరుస సంఘటనలు.. నాలుగైదు నెలల్లో జిల్లాలోని పలు బ్యాంకుల్లో జరిగిన సంఘటనలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ పట్టణంలోని ఓ బ్యాంకులో ఖాతాదారులు తనఖాపెట్టిన రూ. 91లక్షల విలువచేసే బంగారం బ్యాంకులో కీలక ఉద్యోగి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లాడు. మరో గోల్డ్లోన్ బ్రాంచ్లో తనఖా పెట్టాడు. అక్కడి నుంచి సదరు వ్యక్తి తన అనుచరుల ఖాతాలోకి డబ్బులు బదిలీ చేశాడు. ఈవిషయం బయటకు పొక్కడంసంబంధిత ఉద్యోగిపై బ్రాంచ్ మేనేజన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రంలో నిల్వ ఉన్న డబ్బులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అందులో నుంచి బ్యాంకులో పనిచేసే కీలక ఉద్యోగి కోట్ల రూపాయలు తమ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం ఈఓ బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా ఖాతాలో ఉండాల్సిన డబ్బులు వేరే వారి ఖాతాలోకి జమచేసినట్లు తేలింది. దీంతో సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేసి రికవరీ చేయించిన సంఘటన చర్చనీయాంశమైంది. అదే విధంగా జిల్లాలోని ఓ మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి బ్యాంకులోని డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకోవడం, ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసిన విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారి పసిగట్టారు. ఆ ఉద్యోగిపై కేసు నమోదు చేయగా.. విచారణ జరిపి సదరు ఉద్యోగిని జైలుకు పంపించారు. వీటితో పాటు జిల్లాలోని పలు బ్యాంకుల్లో కూడా డబ్బుల దుర్వినియోగం చేసిన విషయంపై పలువురిపై ఫిర్యాదులు ఉన్నాయి. నగదు దుర్వినియోగం ఆ శాఖ పరిధిలో ఉంటుంది బ్యాంకుల్లో తనఖాపెట్టిన బంగారం, డిపాజిట్ చేసిన డబ్బులు దారి మళ్లించడం నేరం. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. రికవరీ, చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పథకాల దుర్వినియోగం, నిజమైన లబ్ధిదారులను ఇబ్బంది పెట్టిన విషయాలపై చర్యల కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – యాదగిరి, లీడ్బ్యాంకు మేనేజర్ బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారం పక్కదారి పలువురి అకౌంట్లల్లో విరుద్ధంగా రుణాల పంపిణీ వరుస సంఘటనలతో ఖాతాదారుల ఆందోళనబ్యాంకు ఉద్యోగులపై ఆరోపణలు గతంలో బ్యాంకు ఉద్యోగులు అంటే నిక్కాసుగా వ్యవహరిస్తారు అనే పేరు ఉండేది. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలతో వారు కూడా గాడి తప్పుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలోని మహిళా సంఘాలకు రుణాలు అందజేయడం, ఒక బ్యాంకులో లోను ఉన్నా... ఆ సంఘాల సభ్యులకు తెలియకుండా మరో బ్యాంకులో లోన్లు ఇవ్వడంపై చర్చ జరిగింది. అయితే విషయం తెలుసుకున్న సభ్యులు సంఘం నిర్వాహకులను నిలదీయం, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంపై జిల్లాలో చర్చ జరిగింది. అదేవిధంగా జిల్లాలోని వ్యవసాయ రుణాల పంపిణీ, రెన్యూవల్స్ సందర్భంలో కొందరు బ్యాంకు మేనేజర్లు ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వారు చెప్పిన వారికే రుణాలు ఇవ్వడం, ఇందుకోసం వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకోవడం, ఇన్సూరెన్స్ పేరుతో అధికంగా డబ్బులు వసూళ్లు చేసినట్లు విమర్శలు వచ్చాయి. -
నేటినుంచి మాలిక్యూలర్ మోడలింగ్పై వర్క్షాప్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో నేటినుంచి ఈ నెల 22 వరకు ఏఐ అండ్ మాలిక్యూలర్ మోడలింగ్పై వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేయూలోని సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటిక్స్అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ మాలిక్యూలర్ మోడలింగ్ టూల్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ యూజింగ్ మోల్సాఫ్ట్ అనే అంశంపై వారం రోజులపాటు వర్క్షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అడ్వెంట్ ఇన్ఫర్మాటిక్స్, మోల్సాఫ్ట్ ఎల్ఎల్సీ ఇండియా వ్యవస్థాపకుడు సీఈఓ అధీకృత ప్రతినిధి సురోజిత్సాధు కీలకోపన్యాసం చేయనున్నారని ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ టి.శాస్త్రి ఆదివారం తెలిపారు. చర్లపల్లి–గోరఖ్పూర్ మధ్య అమృత్భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ ● అక్టోబర్ 2నుంచి అమలు కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ–గోరఖ్పూర్ నగరాలను అనుసంధానం చేస్తూ ప్రయాణికుల రవాణా కోసం నాన్ ఏసీ సూపర్ఫాస్ట్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వివరాలు.. అక్టోబర్ 2వ తేదీన చర్లపల్లి–గోరఖ్పూర్ (22075) వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు చర్లపల్లిలో ప్రతి శనివారం 21:45 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్కు 23:28 గంటలకు చేరుకొని ఆదివారం 6:25 గంటలకు గోరఖ్పూర్కు చేరుతుంది. అదేవిధంగా అక్టోబర్ 4వ తేదీన ప్రతి ఆదివారం బయలుదేరే గోరఖ్పూర్–చర్లపల్లి (22076) అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలు గోరఖ్పూర్లో 8:30 గంటలకు బయలుదేరి కాజీపేట జక్షన్కు సోమవారం 12:58 గంటలకు చేరుకొని 15:00 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. స్లీపర్ అండ్ అన్ రిజర్వుడ్ కోచ్లతో ఉన్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ జంక్షన్, బేతుల్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, బీనా జంక్షన్, వీజీఎల్ ఝాన్సీ జంక్షన్, ఓరా, పొక్రాయన్, కాన్పూర్ సెంట్రల్, ఆషీబాగ్, లక్నో సిటీ, గోమిత్ నగర్, బరాబంకి జంక్షన్లో హాల్టింగ్ కల్పించారు. అత్యవసర విభాగంలో తప్పని క్యూ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రక్త పరీక్షల కోసం పేషెంట్లు, అటెండెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివారం అత్యవసర విభాగంలో బ్లడ్ టెస్టులు చేయించుకునేందుకు రోగులు క్యూ కడుతున్నారు. క్యాజువాలిటీలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు, వార్డుల్లో అడ్మిట్ అయిన పేషెంట్ల అటెండెంట్లు రక్త నమూనాలు పట్టుకుని గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివారం ఓపీలు బంద్ కావడం వల్ల సెంట్రల్ ల్యాబ్ బంద్ చేస్తున్న నేపథ్యంలో.. రక్త పరీక్షల తాకిడి ఎక్కువై ల్యాబ్ సిబ్బందిపై భారం పడుతోంది. వాస్తవానికి ఒక్కో షిప్టులో ఆరుగురు సిబ్బంది ఉండాలి. కానీ, కేవలం ముగ్గురితోనే నడిపిస్తున్నారు. దీంతో ముగ్గురిపై ఒత్తిడి పెరిగి సకాలంలో రక్త పరీక్షలు చేసి, రిపోర్ట్ ఇవ్వడం సమస్యగా మారుతోంది. రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆదివారం అదనంగా సిబ్బంది నియమించాలని పేషెంట్లు కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఆపదలో వచ్చిన తాము అవస్థలు పడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. అదేవిధంగా బ్లడ్ రిపోర్టులు తొందరగా కావాలంటే ప్రైవేట్కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. -
డీఎంఓ సురేఖకు కన్నీటి వీడ్కోలు
ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విదితమే. ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని జులైవాడలో గల సొంతింటికి ఆమె భౌతికకాయం చేరుకుంది. సురేఖ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. కుమారుడు, భర్తను కోల్పోయిన కొద్దినెలల్లోనే ఆమె సైతం దూరం కావడంతో కుటుంబం వరుస విషాదాలతో కుంగిపోయింది. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం.. డీఎంఓ సురేఖ అంత్యక్రియలను పెద్దమ్మగడ్డలో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ప్రార్థనల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారులు అశ్రునయనాల మధ్య ఆమె మృతదేహాన్ని సమాధి చేశారు.కడసారి చూపు.. డీఎంఓ మృతదేహాన్ని చూసేందుకు మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు, జేడీఎం మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఎర్ర ప్రియాంక, ఇక్కడి పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారులు ఉప్పల శ్రీనివాస్, ప్రస్తుత మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు ప్రసాద్, రాజేందర్, రాము, లక్ష్మీనారాయణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమడి శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, మార్కెట్ సిబ్బంది భౌతికాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెటింగ్ శాఖతోపాటు రైతు సమస్యలపై ఆమె చూపిన శ్రద్ధను గుర్తు చేసుకున్నారు. పెద్దమ్మగడ్డలో అంత్యక్రియలు -
వనదేవతలకు మొక్కులు
ములుగు రూరల్/ఎస్ఎస్ తాడ్వాయి : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మేడారం చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్లో గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కు సమ్మక్క–సారలమ్మ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలి వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల సన్నిధిలో సీఎం ఎత్తు బంగారం (బెల్లం) తులాభారం వేశారు. ఎత్తుబంగారం, పసుపు, కుంకుమ, చీరసారెలతో అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు చీరసారె, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. అనంతరం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సీఎం రేవంత్రెడ్డికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదం అందించి ఆశీర్వచనం అందించారు. మంత్రి సీతక్క.. సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కట్టారు. తల్లుల గద్దెల నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు సీఎం రేవంత్రెడ్డి కరచాలనం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీఎం రేవంత్రెడ్డి మొక్క నాటారు. ప్రధాన ఆర్చ్ ద్వారం పక్కన ఏర్పాటు చేసిన జలప్రసాదం (మినరల్ వాటర్ ప్లాంట్)ను ప్రారంభించారు. పలువురికి చేయూత, సామాజిక భద్రత పింఛన్ల చెక్కులు అందించారు. ఆదివాసీ చిత్రాల పరిశీలన మేడారం మహాజాతరలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈమేరకు పూజల అనంతరం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రి సీతక్కతో కలిసి ఆదివాసీ చరిత్రకు సంబంధించిన సాండ్ స్టోన్పై చెక్కిన ఆదివాసీ బొమ్మలను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డికి ఘన స్వాగతం హెలిపాడ్ వద్ద మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం పర్యటనలో ఎంపీలు వేం నరేందర్రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళీనాయక్, మామిడాల యశస్వినిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సీఎం దివ్యదేవరాజన్, మేడారం ఈఓ వీరస్వామి ఉన్నారు. ఎత్తు బంగారం సమర్పణ మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ మేడారంలో గంటపాటు సీఎం పర్యటన -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
అనుమతి పత్రాల ట్యాంపరింగ్
ఖమ్మం క్రైం : కలప తరలింపునకు అటవీ శాఖ అధికారులు జారీచేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఖమ్మం సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు. గతేడాది డిసెంబర్లో ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ నుంచి అందిన ఫిర్యాదుతో ఏసీపీ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ గౌడ్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఈమేరకు ఏసీపీ ఆదివారం వెల్లడించిన వివరాలు.. నల్లతుమ్మ స్థానంలో సండ్ర.. నల్లతుమ్మ కలప సరఫరా పేరిట అటవీ అధికారులు అనుమతి పత్రాలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం గోప్యాతండాకు చెందిన కలప వ్యాపారి కొర్ర శివ నేతృత్వంలో మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి, కురవి, సీరోలు, కాంపెల్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికించారు. ఆపై నల్లతుమ్మ పేరుతో జారీ అయిన అనుమతి పత్రాలపై సండ్ర కర్రగా మార్చారు. ఈ పత్రాల ఆధారంగా కలపను విజయవాడకు చెందిన రాధేశ్యామ్కు విక్రయించాడు. ఆయన మధ్యప్రదేశ్లోని జాబువా పట్టణం ఏఎం ఎంటర్ప్రైజెస్ యజమాని అబ్దుల్ రహేమాన్కు సరఫరా చేసినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్లోని పాన్మసాలా తయారీలో సండ్ర కలప వాడుతుండడంతో సుమారు తొమ్మిది లారీల కర్రను సరఫరా చేశాడని గుర్తించారు. ఈమేరకు శివ, రాధేశ్యామ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. ఇందులో శివపై గతంలోనూ వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అయితే, కేసు విచారణ కొనసాగుతుండగా, ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేసులో విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ సర్వర్, ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ గౌడ్, ఎస్సై ఎ.వంశీకృష్ణ, సిబ్బంది శ్రీనివాస్, హరి, జానీ, నరింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్ సిబ్బందిని సీపీ సునీల్దత్ అభిందించారు. నల్లతుమ్మ స్థానంలో సండ్ర కలప తరలింపు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖమ్మం సీసీఎస్ పోలీసులు -
ముల్కనూరులో మరో చారిత్రక శిల్పం
● కాటమయ్య గుండుపై అయ్యదేవుడు భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇటీవల కల్యాణి చాళుక్యుల శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిశోర్, సిద్దమల్ల రమేశ్ మరో చారిత్రక శిల్పాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. చాళుక్యుల శాసనం పరుపు బండపై ఉండగా దీనికి ఎదురుగా ఒక పెద్ద రాతిగుండు ఉంది. దీన్ని స్థానికులు కాటమయ్య గుండుగా పిలుస్తారు. ఈ గుండుకు ఉత్తరాభిముఖంగా మూడు అర్థ శిల్పాలున్నాయి. వాటిలో గుర్రాన్నెక్కి కుడిచేత చెంటూ ఆయుధాన్ని భుజంపై పెట్టుకుని ఎడమ చేత కళ్లెం పట్టుకున్న అయ్యదేవుడిని స్థానికులు కాటమరాజుగా పిలుస్తున్నారు. అతడి గుర్రం ఎదుట ఒక కుక్క ఉంది. గ్రామాలను రక్షించే అయ్యదేవుళ్లను ఒక్కొ ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో కాటమయ్య అని పిలువగా మరికొన్ని ప్రాంతాల్లో కాటమరాజుగా పిలుస్తారు. ఈ శిల్పాలు కల్యాణి చాళుక్యుల కాలానికి దగ్గరగా ఉన్నాయని, అయితే ఇవి ఎక్కువగా స్థానికంగా చేయించినవి కావడం వల్ల భిన్నమైన శైలిలో ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ స్పష్టం చేశారు. అయ్యదేవుడి వెనుక భాగాన చేతుల్లో పూజాద్రవ్యాలతో ఒక సీ్త్ర శిల్పం ఉంది. అయ్యదేవుడు కొన్ని సార్లు దేవేరితో కనిపిస్తాడని, ఇక్కడ పూర్తి భిన్నంగా ఉన్నాడని తెలిపారు. స్థానికులు ఈ ప్రాంతంలో ఒక ముఠాగా ఏర్పడి ఇటీవల డిటెక్టర్ సాయంతో తవ్వకాలు జరిపారని స్థానికులు వెల్లడించారు. -
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
మహబూబాబాద్ రూరల్ : ఘన జీవామృతం, పంచగవ్య, సీతాఫల ఆకులు, వేప గింజల కషాయం వంటి ప్రకృతి వ్యవసాయంతో రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించవచ్చు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. పశువుల ఆధారిత వనరులు, జీవ పదార్థాలు, వ్యవసాయ అవశేషాలు తదితరాలను వినియోగించడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు శిక్షణ, అవగాహన.. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ నిర్వహణలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే ముందు తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, సా గు విధానాలు, నేల పరిస్థితులు తదితర అంశాలపై వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయ ద్రావణాల తయారీపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో రైతులు తమ పొలాల్లోనే సులభంగా తయారు చేసుకుని వినియోగించుకోగ ల వివిధ సహజ ఇన్పుట్ల తయారీ విధానాలపై రై తులు, సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఘన జీవామృతం, పంచగవ్య, సీతాఫల ఆకుల కషా యం, వేప గింజల కషాయం వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్ పుట్ల తయారీ విధానం, వాటి ఉపయోగాలు, పంటలకు వినియోగించే విధానం తదితర అంశాలను ప్రాయోగికంగా వివరించారు. ఘన జీ వామృతం ద్వారా నేలలో జీవసారం, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరచడం, పంచగవ్యను పంటల పెరుగుదలకు అనుకూలంగా వినియోగించడం, సీతాఫల ఆకులు, వేప గింజల ఆధారిత కషాయాలను సహజ పంట సంరక్షణలో వినియోగించే విధానాలపై అవగాహన కల్పించారు. రసాయన రహిత సాగుతో నేలకు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, రైతులకు ప్రయోజనాలు నాణ్యమైన పంట.. ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంప్రతి క్లస్టర్లో సుమారు 125 మంది రైతులతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసి, వారి పొలాల నుంచి శాసీ్త్రయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించేలా కార్యాచరణ చేపట్టనున్నారు. సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి నేలలోని పోషక స్థాయిలు, నేల ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలను గుర్తించి, పంటల సాగుకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించనున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) కీలకంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల పరిధిలో పనిచేస్తున్న సీఆర్పీలకు అవసరమైన శిక్షణ అందించి, రైతులతో సమన్వయం చేయడం, మట్టి నమూనాల సేకరణకు రైతులను సిద్ధం చేయడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించనున్నారు. -
స్మార్ట్ రేషన్కార్డులపై స్పష్టత కరువు
జిల్లాలో 558 రేషన్షాపులు.. ఉత్తర్వుల్లో ఉన్న అంశాలు ఇవే.. ముఖ్య ఉద్దేశం.. పంపిణీ షురూ.. గైడ్లైన్స్ రాలేదంటున్న అధికారులు.. అయోమయం.. మండలం కార్డులు బయ్యారం 16,309 చిన్నగూడూరు 5,801 దంతాలపల్లి 11,167 డోర్నకల్ 17,156 గంగారం 3,844 గార్ల 12,845 గూడూరు 20,642 ఇనుగుర్తి 8,953 కేసముద్రం 19,992 గైడ్లైన్స్ రాలేదంటున్న సివిల్ సప్లయీస్ అధికారులు అయోమయంలో రేషన్ డీలర్లు జిల్లాకు చేరిన 2,78,379 కార్డులు దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకేనా ?మండలం కార్డులు కొత్తగూడ 10,042 కురవి 18,397 మానుకోట 36,964 మరిపెడ 25,060 నర్సింహులపేట 10,602 నెల్లికుదురు 16,537 పెద్దవంగర 10,216 సీరోలు 8,289 తొర్రూరు 25,563 -
రేపు అష్టోత్తర శతకలశ కుంభాభిషేకాలు
మహబూబాబాద్ రూరల్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నివారణ, అన్నదాత కష్టాలు తీరాలని కోరుతూ జిల్లా పరిధిలోని 18 మండలాల్లోని 115 దేవాలయాల్లో మంగళవారం అష్టోత్తర శతకలశ కుంభాభిషేకాలు జరపాలని నిర్ణయించారు. గ్రామప్రజల ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశ (108) కుంభాభిషేకాలు, పూజలు చేయాలని డీడీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆదివారం సూచించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడి ఆశీస్సులు పొందాలని జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహాచార్యులు, చక్రధరాచార్యులు పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 26న 115 మంది డీడీఎన్ అర్చకుల ఆధ్వర్యంలో అనంతాద్రి దేవాలయంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని దేవాలయ ట్రస్టీ నూకల రాంచంద్రారెడ్డి, సభ్యులు నాయిని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రంజిత్కుమార్ మహబూబాబాద్: తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నాగవెల్లి రంజిత్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ అధ్యక్షత ఎన్నికలు జరగగా.. ఎన్నికల ఆఫీసర్లుగా వెంకటేశ్వర్లు, మున్వర్బేగ్, రిటర్నింగ్ అధికారిగా రోహిత్ వ్యవహరించారు. ఎన్నికల్లో మూడోసారి ఫోరం జిల్లా అధ్యక్షుడిగా రంజిత్కుమార్ను ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోలిపాక భరత్, కోశాధికారిగా సాదుల మనోజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, అసోసియేట్ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. కోడిపుంజుకు కమ్మలు.. ముత్యాలమ్మకు మొక్కులుకేసముద్రం: కోడిపుంజుకు కమ్మలు కుట్టించి, మెడలో మద్యం బాటిల్ వేసి ముత్యాలమ్మకు ఓ భక్తుడు వినూత్న రీతిలో తన మొక్కు చెల్లించుకున్నాడు. కేసముద్రంస్టేషన్లో ఆదివారం బోనాల పండుగ జరిగింది. గ్రామానికి చెందిన తోడిటి వెంకన్న అనే వ్యక్తి తన కోడిపుంజుకు కమ్మలు కుట్టించి, మెడలో మద్యం సీసా వేసి, మేళతాళాల నడుమ ఆ కోడిపుంజును తీసుకెళ్లి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాడు. ఈ దృశ్యాన్ని భక్తులంతా ఆసక్తిగా తిలకిస్తూ, సెల్ఫీలు దిగారు. బిల్ల మహేందర్కు సాహితీ పురస్కారం అందజేత విద్యారణ్యపురి: హనుమకొండలోని పీఆర్రెడ్డి భవన్లో సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఒద్దిరాజు సోదరుల స్మృత్యర్థం కవి బిల్లా మహేందర్ రచించిన ఉత్తమ కవితా సంపుటి ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ పుస్తకాన్ని సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా బిల్లా మహేందర్కు రూ.10 వేల నగదు పురస్కారం అందించి సత్కరించారు. బాధ్యులు గండ్ర లక్ష్మణ్రావు, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య పుస్తకాన్ని సమీక్షించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. తాను మంచి పాఠకురాలినని, ప్రజలకు మేలు చేసే కవిత్వం బిల్లా మహేందర్ రాస్తున్నారని అభినందించారు. కాగా, ఇదే కార్యక్రమంలో మైక్రో ఆర్టిస్టు మట్టెవాడ అజయ్ని నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్ చారి నిర్వహించగా, సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర్బాబు అధ్యక్షత వహించారు. సహృదయ సాంస్కృతిక సంస్థ బాధ్యులు, కవులు పొట్లపెల్లి ఒద్దిరాజు, రఘురావు, ఏవీ నర్సింహారావు, లక్ష్మణ్రావు, సీత వెంకట్, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
చెరువులో పడి పశువుల కాపరి.. మల్హర్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ పశువుల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ పరిధి దబ్బగట్టులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజమల్లు (55) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం దబ్బగట్టు శివారులో చెరువు వద్దకు పశువులను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం పశువులను తీసుకెళ్లడానికి చెరువు వద్దకు వెళ్లగా అక్కడ పెద్ద గుంతలోని నీటిలో జారిపడ్డాడు. గమనించిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించి రాజమల్లు మృతదేహాన్ని బయటకు తీశారు. వ్యవసాయ బావిలో పడి రైతు.. భీమదేవరపల్లి : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ధర్మారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోపగోని వెంకటయ్య (63) శనివారం తన వ్యవసాయ బావిలో క్రేన్, కూలీల సాయంతో పూడికతీత పనులు చేయిస్తున్నాడు. సాయంత్రం పనులు ముగిసిన తర్వాత వెంకటయ్య, అతడి కుమారులు, కూలీలు బావి వద్దే ఉన్నారు. అదే సమయంలో వెంకటయ్య బావి అంచున ఉన్న స్టార్టర్ వైర్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అదే బావిలో పడిపోయాడు. గమనించిన కుమారులు, కూలీలు వెంటనే క్రేన్ సహాయంతో అతడిని బయటికి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యకు వెంటనే ముల్కనూరులోని ఓ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తీసుకు వస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మల్హర్ మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ పశువుల కాపరి, భీమదేవరపల్లి మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సత్వర న్యాయమే నిజమైన దేశభక్తి
● జిల్లా జడ్జి మురళీమోహన్ మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు సత్వర న్యాయం అందించడం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ వంతు బాధ్యతగా గుర్తించాలని జిల్లా జడ్జి మురళీమోహన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెళ్లి, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి అర్వపల్లి కృష్ణతేజ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కేయూ అభివృద్ధికి ప్రతిపాదనలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులు అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్రెడ్డి.. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. -
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
మహబూబాబాద్ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20267సాక్షి, మహబూబాబాద్: పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. జిల్లాను విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శని వారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీ య జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ పథకాలు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకున్నామని, రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున అందజేస్తామని, 1078 గుడిసెల్లో నివసిస్తున్న వారికి నూతన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా 558 చౌకదుకాణాల్లో మూడు నెలలకు 15,769 టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. 41,424 కొత్తకార్డులు, 50,935 కుటుంబ సభ్యుల నమోదు కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్రేషన్ కార్డులు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చె ప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పీజీ గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, క్రమం తప్పకుండా ప్రతీ నెల వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, కులవృత్తుల కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమం, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం నిధు లు విడుదల చేస్తున్నామన్నారు. బ్యాంకు లింకేజీ, వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నామని అన్నారు. కాలానుగుణంగా వ్యవసాయం.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వ విప్ అన్నారు. 99రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మట్టి పరీక్షలు నిర్వహించామని అన్నారు. రైతు భరోసా కింద 2,14,625 మంది రైతులకు రూ.268కోట్లు అందజేశామని, రైతు బీమా పథకం ద్వారా 687 మంది చనిపోయిన రైతుల కుటుంబాల ఖాతాల్లో రూ.34కోట్లు జమచేశామని చెప్పారు. మిషన్ వైవిధ్యం కార్యక్రమంతో స్వల్పకాలిక రకాల సాగును ప్రోత్సహించడం, ఆరుతడి పంటలకు అవసరమైన ప్రోత్సాహకాలు, సలహాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా బిందు, తుంపర్ల సేద్యం, పండ్లతోటల పెంపకంతో పాటు ఆయిల్పామ్ సాగు వైపు రైతులను మళ్లించి లాభాల బాటలో నడుపుతున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందిస్తున్నామని విప్ చెప్పారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 173 సబ్ సెంటర్లు, ఒక బస్తీ దవాఖాన, రెండు సీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించామని ఆన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, చిత్రంలో కలెక్టర్ స్నేహశబరీష్, ఎస్పీ శబరీష్ తదితరులువిద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట త్యాగాల స్ఫూర్తితో ప్రజా పాలన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహబూబాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 80వ స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కేసముద్రం, చిన్నగూడురు కేజీబీవీ విద్యార్థినులు, అనంతారం మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ గురులకు పాఠశాల, మానుకోట జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థినులు పలు జాతీయ గీతాలకు నృత్యాలు చేశారు. గిరిజన ఆశ్రమ పా ఠశాల విద్యార్థినులు యోగాసనాలను నృత్య రూ పం ద్వారా ప్రదర్శించారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, జీసీడీఓ గాయత్రి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు విప్ రాంచంద్రునాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ బహుమతులు అందజేశారు. స్టాళ్ల సందర్శన.. పలు శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పా టు చేశారు. వాటిని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ సందర్శించారు. కూరగాయాల సాగుపై జిల్లా అధికారి మరియన్న వివరించారు. -
స్మార్ట్ రేషన్కార్డు లబ్ధిదారుల గౌరవానికి ప్రతీక
● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ మహబూబాబాద్: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్కార్డులు ఇస్తుందని, ఇది లబ్ధిదారుల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కలెక్టరేట్లో ప్రధాన సమావేశ మందిరంలో శనివారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుకు భద్రత ఉంటుందన్నారు. ఆరోగ్య పథకాలు, విద్యా ఫీజు రాయితీలు ఇతర ప్రయోజనాలకు కార్డు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతీ కుటుంబానికి చేరవేయడంలో జిల్లా ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు మంజూరైన 2,78,379 స్మార్ట్ రేషన్ కార్డులను మండలస్థాయి అధికారులు ఎమ్మెల్యే ద్వారా 15 రోజుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్జ్యోతి, డీసీఎస్ఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై విస్తృత ప్రచారం చేయాలి పంట మార్పిడి విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సాగునీటి పారుదల కమిటీ, వ్యవసాయ సలహాలు, సూచనల కమిటీల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ రైతు ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. కూరగాయల సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ స్నేహశబరీష్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. జెడ్పీలో..మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ స్నేహశబరీష్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషొత్తం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేయాలి● ఎస్పీ డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ రూరల్ :దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశ సేవకు ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించగా.. ఎస్పీ శబరీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతంర ఎస్పీ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పోలీసు అధికారులకు సేవా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పంట పొలంలో త్రివర్ణ పతాకం రెపరెపలుజిల్లాకేంద్రం శివారు అనంతారం గ్రామ శివారులో కౌలురైతు అడిదల వీరభద్రం వరిపొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. వరినాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. – మహబూబాబాద్ రూరల్ -
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు
మహబూబాబాద్ రూరల్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నాయకులు అవమానకరంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీలో మల్లికార్జున ఖర్గేపై జరిగిన వివక్షపూరిత, అవమానకర చర్యను నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ నాయకులు తమ వైఖరిని మార్చుకుని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గూగులోత్ జ్యోతిరమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్, చిలువేరు సమ్మిగౌడ్, బాలాజీనాయక్, కౌన్సిలర్లు ధనలక్ష్మి, పార్వతి, మాధవి, అరుణ, దిలీప్, రాజు, సర్పంచులు రేణుక, నిర్మల, రెహనాఫర్వీన్, డీవైసీ అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, నాయకులు ప్రసాద్ నాయక్, వీరన్న, రమేష్, గిరిధర్ గుప్తా, ప్రవీణ్ కుమార్, శ్రీను, వెంకటి, పద్మజ, పద్మబాయి, సత్యమనోరమ, ఖలీల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ నిరసన -
మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలి
చిన్నగూడూరు: మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శబరీష్ ఆదేశించారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టా లన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. మరిపెడ సీఐ పవన్కుమార్, ఎస్సైలు కుశకుమార్, సతీష్, సంతోష్, ఏఎస్సై వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ కొండల్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి హసన్పర్తి : పోటీ ప్రపంచంలో విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అన్నాసాగరంలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ప్రవేశం పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితంలో ఇంజనీరింగ్ విద్య ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వపు లక్షణాలు, సమయపాలనను అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు కళాశాల విద్యకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీనివాస్, సుదర్శన్, కుమారస్వామి, ప్రశాంత్, ఏఓ స్వాతి, అధ్యాపకులు పాల్గొన్నారు. శేషుకుమార్ హత్య కేసు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన సీఐ సూర్యప్రకాశ్ ఏటూరునాగారం : మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ఈనెల 12న జరిగిన తాటి శేషుకుమార్ హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏటూరునాగారం సీఐ జీడి సూర్యప్రకాశ్ తెలిపారు. శుక్రవారం ఏటూరునాగారం పోలీస్స్టేషన్లో నిందితుల అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. పూరేడుపల్లికి చెందిన కొప్పుల నర్సింగరావు, అతడి భార్య లక్ష్మి, గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శేషుకుమార్ కలిసి కమలాపురం శివారులోని పుల్లంశెట్టి శ్యామ్కుమార్ వ్యవసాయ భూమిలో పనుల కోసం ముగ్గురు కలిసి పాకలో ఉంటున్నారు. శేషుకుమార్ వారంరోజుల నుంచి నర్సింగరావు భార్య లక్ష్మితో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇదే విషయంలో పద్ధతి మార్చుకోవాలని భార్యభర్తలు శేషును మందలించారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో పాటు ఈనెల 12న మళ్లీ నర్సింగరావు, లక్ష్మితో గొడవపడ్డాడు. విసుగుచెందిన నర్సింగరావు భార్య లక్ష్మితో కలిసి శేషు పడుకొని ఉండగా గొడ్డలితో దాడిచేసి హత్య చేశారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈనెల 13న కమలాపురం శివారులో హనుమకొండకు వెళ్లే క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారించగా నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నట్లు సీఐ వివరించారు. కేసును త్వరగా చేధించిన మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ‘దేవాదుల’
స్టేషన్ఘన్పూర్ : ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా శుక్రవారం పంట కాల్వలకు నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి, నవాబుపేటతో పాటు బొమ్మకూరు, చీటకోడూరు రిజర్వాయర్ల ద్వారా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సాధ్యమైనంతవరకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుంచి కూడా సాగునీరు విడుదల చేయడం లేదని, కేవలం దేవాదుల ప్రాజెక్టు నుంచి మాత్రమే పంటలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లలో 50శాతం వరకు నీటినిల్వలు ఉన్నాయని, ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో సాగునీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల -
పీఏసీఎస్ల ద్వారా విత్తనోత్పత్తి
హన్మకొండ : ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సీడ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.నగేష్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నాబార్డ్ సహకారంతో బ్రీడర్ విత్తనాలను పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందించి, నాణ్యమైన విత్తనాలను రైతుస్థాయిలో పండించి తిరిగి వారికే విక్రయించే విధానంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు, కార్యదర్శులతో చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగేశ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. నాబార్డ్ సహకారంతో ప్రతి పీఏసీఎస్కు తొలిదశలో ఐదెకరాల చొప్పున విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా రైతులకు అధిక లాభం చేకూరుతుందన్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకుడు డాక్టర్ ఎం.శ్రీధర్, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, వరంగల్ జిల్లా సహకార అధికారి నీరజ, శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాధర్, దిలీప్, నర్సయ్య, రమ్య, రాజ్కుమార్, విశ్వతేజ, మదన్మోహన్, శివచరణ్, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సీడ్ డైరెక్టర్ నగేష్ కుమార్ -
కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పు సాధ్యం
మహబూబాబాద్ అర్బన్ : కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పులు సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఐ జనచైతన్య ప్రచార యాత్ర ముగింపు సభకు ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితం నాశనం చేసిందని, రామాలయం భక్తుల డబ్బులు చోరీ చేసి రాముడికి దోహ్రం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు అస్తవ్యవస్తంగా ఉన్నాయని, 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విద్యార్థులను బొద్దింకతో పోలిస్తే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలతో ప్రధానికి బుద్ధి చెప్పారని, అదేవిధంగా రైతులకు కూడా మోసం జరిగిందన్నారు. కేంద్రంలో కూటమి నేతలతో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. సెప్టెంబర్ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథిరెడ్డి, సహాయ కార్యదర్శులు బి.అజయ్సారథిరెడ్డి, నల్లు సుధాకర్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు నర్రా సంధ్యశావణ్, రేషపల్లి నవీన్, నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండురంగచారి, వెంకన్న, సందీప్, శేఖర్, స్వామి, రవీందర్, వెలుగు శ్రావణ్, రవి, రమేశ్, లింగ్యనాయక్, మహమూద్, ప్రవీణ్, శంకర్, పాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
పోషకాహార లోపాన్ని అధిగమించాలి
● పల్స్ ఫార్మా డైరెక్టర్ ఆచార్య దేవరాజ్రామ్బహు కేయూ క్యాంపస్ : పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు నూతన ఆవిష్కరణలు అవసరమని హైదరాబాద్ పల్స్ ఫార్మా డైరెక్టర్, కేయూ ఫార్మసీ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ దేవరాజ్రామ్బహు పేర్కొన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్లో దివంగత ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ వై.మధుసూదన్రావు తొలిస్మారకోపన్యాసంలో ఆయన ఇన్నోవేటివ్ నానోడ్రగ్ డెలవరీ ప్లాట్ఫామ్స్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, హైబ్రిడ్ పంటల ప్రభావంతో ముఖ్యమైన ఖనిజాల లోపం పెరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యా, పరిశోధన రంగానికి ప్రొఫెసర్ మధుసూదన్రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎండోమెంట్ లెక్చర్కు కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కమిటీ బాధ్యులు కిషన్, షాయాదా, డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. తొలుత దివంగత ప్రొఫెసర్ మధుసూదన్రావు చిత్రపటానికి అతిథులు, ఆచార్యులు, పరిశోధలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
పాఠాలు బోధించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీని ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎల్నినో వల్ల వాతవారణంలో చోటుచేసుకునే మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడం, చెట్లను నరకడం వల్ల వర్షపాతంపై పడే ప్రభావం తదితర అంశాలపై పదో తరగతి విద్యార్థినులకు ఎమ్మెల్యే బోధించారు. అనంతరం పాఠశాల ఆవరణ, వంట గదులు, తాగునీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను చదవడంతో పాటు వాటి వెనుక ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తాను సొంతంగా రూ.5వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థినులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు నర్ర సంధ్య శ్రావణ్, నిమ్మల మాధవి శ్రీను, పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దుర్గలక్ష్మి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జ్వరంతో విద్యార్థిని మృతి
కొత్తగూడ : జ్వరంతో చికిత్స పొందుతున్న విద్యార్థి మృతిచెందింది. ఈ సంఘటన గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి నాగేశ్వర్రావు కథనం ప్రకారం.. వజ్జ లిఖిత (17) జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. లిఖిత కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రిన్సిపాల్ సుధాగౌతమిని వివరణ కోరగా లిఖిత జూలై 14న సెలవుపై ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నెలరోజుల నుంచి పాఠశాలకు రాలేదన్నారు. లిఖిత మృతిచెందినట్లు తెలిసిందని వివరించారు. -
విరిగిన విజయ డెయిరీ పాలు
హన్మకొండ చౌరస్తా : ‘రసాయనాలు లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడం అభినందనీయం’ అని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఈ నెల 13న హనుమకొండలోని విజయ డెయిరీని సందర్శించిన సమయంలో చెప్పిన మాటలు.. డెయిరీని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ పాడి రైతులు, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని, వారికి మరింత దగ్గర కావాలని అధికారులకు సూచించారు. కానీ వరంగల్ యూనిట్ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు శుక్రవారం సరఫరా చేసిన పాలు మొత్తం విరిగిపోయాయి. కలెక్టర్ చెప్పిన మరుసటి రోజే పాలు విరగడంతో డెయిరీ అధికారుల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ.3.85లక్షల నష్టం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ప్రభుత్వ విద్యా సంస్థలకు పాల సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. లీటర్కు రూ.55 చొప్పున విజయ డెయిరీ డిస్ట్రిబ్యూటర్కు చెల్లిస్తుండగా, ప్రభుత్వ విద్యా సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు లీటరుకు రూ.65.50లు చెల్లిస్తున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 294 సంస్థలకు డిస్ట్రిబ్యూటర్లు విజయ పాలను సరఫరా చేస్తున్నారు. సుమారు 7వేల లీటర్ల పాలకు రూ.55 చొప్పును రూ.3,85,000ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం ఆయా జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు భరించాలా, డెయిరీ భరిస్తుందా అని తేలాల్సి ఉంది.సుమారు 7వేల లీటర్ల్లు నేలపాలు ప్రభుత్వ విద్యాసంస్థలకు సరఫరా తప్పెవరిది.. నష్టం ఎవరికీ కలెక్టర్ సందర్శించిన మరుసటి రోజే ఘటనజిల్లా విద్యా పాల సరఫరా సంస్థలు లీటర్లలో..వరంగల్ 60 1,300 హనుమకొండ 65 2,200 భూపాలపల్లి 29 650 ములుగు 28 600 మహబూబాబాద్ 60 1,500 జనగామ 40 1,400 -
ఇనుగుర్తి వాసికి రాష్ట్రపతి పోలీస్ పతకం
ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన మాలోత్ రాములునాయక్ మరో అరుదైన గౌరవం పొందనున్నారు. 1998 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్పై సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ)లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విస్ట్ సర్వీసెస్’(రాష్ట్రపతి పోలీస్ పతకం)కు ఎంపికయ్యారు. కాగా, 2014లో ఆయన ‘పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్’ అందుకున్నారు. ఉత్తమ అధికారులకు అవార్డులుమహబూబాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు డీపీఆర్ఓ పసునూరి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న ఉద్యోగుస్తులందరూ సకాలంలో హాజరై ప్రశంస పత్రాలు అందుకోవాలని కోరారు. న్యాయవాదులపై దాడులను అరికట్టాలితొర్రూరు: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్లో న్యాయవాదిపై దాడిని వ్యతి రేకిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వెంకటరత్నం మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారి తరఫున న్యాయవాదులు వాదించకుండా సహకరించాలన్నారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు నాగేశ్వర్, కోశాధికారి ఉమావతి, న్యాయవాదులు రఘురాంరెడ్డి, వల్లపు మధుసూదన్, ప్రవీణ్రాజు, వెంకన్న, శ్రీధర్, రామకృష్ణ, విజయ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పార్కులు అందుబాటులో ఉండాలిమరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని పార్కులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. మరిపెడలోని పార్కులో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కుల కోసం ప్రభుత్వం వెచ్చించిన నిధులను వాటికే ఖర్చు చేయాలన్నారు. పార్కులో చిన్నారుల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని, వాకర్స్కు కావల్సిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాలం సునీతరవీందర్రెడ్డి, కౌన్సిలర్లు గంట్ల గౌతంరెడ్డి, గుగులోతు నీలాలచ్చిరాం, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యను బలోపేతం చేయడంలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పాత్ర కీలకమని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో శుక్రవారం ప్రీప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడాలి. ప్రీప్రైమరీ స్థాయి నుంచే చిన్నారుల్లో విద్యపై ఆసక్తి పెంపొందించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఏఎంఓ వెంకటేశ్వర్లు, సీఎంఓ సురేష్, ఏఎస్ఓ సంతోష్కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రావు పాల్గొన్నారు. -
భూమి సరిహద్దులు సక్రమంగా నిర్ణయించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ దంతాలపల్లి: సర్వేలో భూమి సరిహద్దులు సక్రమంగా నిర్ణయించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దముప్పారం, కాలువపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న భూసర్వేను కలెక్టర్ మూడు కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 30,31,32,33 సర్వే నంబర్లలోని 21 మంది రైతులకు ఇంతకుముందే నోటీసులు జారీ చేశామన్నారు. ఆ భూములను క్షుణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పరిశీలన అనంతరం భూముల పాత హద్దుల ప్రకారం హద్దులు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. రైతుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా పారదర్శకంగా సర్వే చేపట్టాల ని అధికారులకు సూచించారు. గర్భిణులకు పరీక్షలు తప్పనిసరి.. గర్భిణులకు ప్రతీనెల పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. పెద్దముప్పారం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యంతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవాల సంఖ్య పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ కందిమళ్ల భరత్బాబు, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, తొర్రూరు ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ సునీల్కుమార్, ఎంపీడీఓ సక్రీయ నాయక్, వైద్యాధికారులు కవిత, వాణి, డీపీఓ నిలోహన్, వివిధ ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య ప్యాచ్ వర్క్
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్డివిజన్ పరిధిలోని డోర్నకల్–గుండ్రాతి మడుగు మధ్య నేటినుంచి (శనివారం) ఈనెల 19వ తేదీ వరకు చేపట్టే మూడో రైల్వేలైన్ ప్యాచ్ వర్క్ నిర్మాణంతో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. పలు రైళ్లకు కాజీపేట, వరంగల్లో తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేసినట్లు వివరించారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. నేటినుంచి ఈ నెల 18వ తేదీ వరకు విశాఖపట్నం–ఎల్టీటీ (18519) వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్, ఎల్టీటీ–విశాఖపట్నం (18520)ఎక్స్ప్రెస్, ఈ నెల 17, 18న ముంబాయి–భువనేశ్వర్ (11019) వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈ నెల 18న మచిలిపట్నం–శ్రీషిర్డి సాయినగర్ (17208) వెళ్లే ఎక్స్ప్రెస్, శ్రీషిర్డి సాయినగర్–కాకినాడ (17205) వెళ్లే ఎక్స్ప్రెస్, ఈ నెల 18,19న చర్లపల్లి–షాలిమార్ (18046) ఈస్ట్కోస్ వెళ్లే ఎక్స్ప్రెస్ వయా కాజీపేట జంక్షన్, వరంగల్కు రాకుండా వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్కు దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15,17న రేణిగుంట–నిజాముద్దీన్ (00761) వయా విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్లే ఎక్స్ప్రెస్ను వయా కాచిగూడ, మల్కాజ్గిరి, కాజీపేట, బల్లార్షా మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లు తాత్కాలిక రద్దు గుంటూరు–సికింద్రాబాద్ (17201) వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఈ నెల 19 వరకు గుంటూరు–కాజీపేట మధ్య రద్దు, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) సింగరేణి వెళ్లే ఎక్స్ప్రెస్ను భద్రాచలంరోడ్–వరంగల్ మధ్య రద్దు, ఈ నెల 18 వరకు సిర్పూర్కాగజ్నగర్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే ఎక్స్ప్రెస్ను వరంగల్–భద్రాచలంరోడ్ మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే బ్లాక్తో పలు రైళ్ల దారి మళ్లింపు కాజీపేట వరకే గోల్కొండ -
బాధితులకు సత్వర న్యాయం
మహబూబాబాద్ రూరల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో జిల్లా పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు సంబంధించిన ఎంఆర్ఎం పోర్టల్ అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా పోలీసులకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. ఎంఆర్ఎంతో బాధితులకు సహకారం.. ప్రత్యేకంగా మనీ రీస్టోరేషన్ మాడ్యుల్ (ఎంఆర్ఎం) ద్వారా సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన నగదును గుర్తించి, ఫ్రిజ్ చేయించి, నిబంధనల ప్రకారం బాధితులకు తిరిగి అందించడంలో జిల్లా సైబర్ క్రైమ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. సైబర్ ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, బ్యాంకులతో సమన్వయం, మోసపోయిన నగదును గుర్తించడం (ట్రేస్ చేయడం), సమయానుకూలంగా చర్యలు చేపట్టడం వంటి అంశాల్లో జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. డీజీపీ నుంచి అవార్డు స్వీకరణ.. జిల్లా పోలీసుల ప్రతిభకు అవార్డు వరించింది. హైదరాబాద్ పంజగుట్టలోని టీజీఐసీసీలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా జిల్లా పోలీసుల తరఫున తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ అవార్డు అందుకున్నారు. ఫిర్యాదు చేస్తే నగదు పొందే అవకాశం.. సైబర్ నేరాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును ఫ్రిజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. సమన్వయంతో ప్రథమ స్థానం సైబర్ నేరాలపై నిరంతర పర్యవేక్షణ, బాధితులకు అండగా నిలవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, బ్యాంకింగ్ సంస్థలతో సమన్వయంతో పనిచేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణం. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్తో పాటు మొత్తం సైబర్ క్రైమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు. – డాక్టర్ శబరీష్, ఎస్పీ ● ఎంఆర్ఎం పోర్టల్ అమలులో అత్యుత్తమ పనితీరు రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసులకు ప్రథమ స్థానం -
అవయవ దానం గొప్పది..
● జిల్లా జడ్జి మురళీమోహన్మహబూబాబాద్ రూరల్: అవయవదానం గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఒకరి చిన్న త్యాగం మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ పొందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు ధైర్యంతో ముందుకు వచ్చి అవయవ దానానికి అంగీకరిస్తే, ఎంతోమంది నిరాశలో ఉన్న బాధితులకు నూతన జీవితాన్ని అందించవచ్చని తెలిపారు. అవయవ దానంపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అపోహలను తొలగించి, ప్రతీ ఒక్కరు దీనిపై విస్తృత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అవయవ దానం ద్వారా కాలేయ మార్పిడి చేయించుకున్న పరకాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవయవాల కోసం ఎదురు చూసే వారికి జీవన్ దాన్ సంస్థ వరంలాంటిదాన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ కేంద్రంగా ఇది పనిచేస్తుండగా అవయవం అవసరమైన వారు జీవన్ దాన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షాలిని షాకెల్లి, న్యాయమూర్తులు స్వాతి మురారి, అర్వపల్లి కృష్ణతేజ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
భూముల రీ సర్వే వేగవంతం చేయాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: జిల్లాలో భూముల రీసర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం భూముల సమగ్ర రీ సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే పూర్తి చేసిన తర్వాత రూపొందించిన తాత్కాలిక మ్యాప్లు, రికార్డులు గ్రామంలో ప్రదర్శించాలన్నారు. ప్రతీ భూ కమతానికి కచ్చితమైన డిజిటల్ మ్యాప్తో పాటు ప్రత్యేకమైన భూధార్ సంఖ్య కేటాయిస్తామన్నారు. నిజాంకాలం నాటి రికార్డుల స్థానంలో నూతన డిజిటల్ రికార్డులు రావడం వల్ల భవిష్యత్లో సరిహద్దుల తగాదాలు ఉత్పన్నం కావన్నారు. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు అందించాలిఅధికారులు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తే ప్రజలు మర్చిపోరని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేసి, అర్హులైన 16 మంది అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కష్ట సమయంలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అధికారులంతా జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఆర్వో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్ బిల్లు పడలే..
సాక్షి, మహబూబాబాద్: పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే పథకాన్ని నమ్ముకుని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు చివరి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి పెంచిన అధికారులు బిల్లులు ఇచ్చే సమయంలో ముఖం చాటేస్తున్నారు. అప్పుతెచ్చి ఇల్లుకట్టాం.. బిల్లు ఇప్పి ంచండి అంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరగా బిల్లులు ఇప్పించమని వేడుకుంటున్నారు. గృహ ప్రవేశాలు చేసిన రాని బిల్లులు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అధికారులు చెప్పిన విధంగా ఇల్లు నిర్మించుకొని గృహ ప్రవేశాలు పూర్తి చేసుకున్నా.. నేటికీ చివరి బిల్లులు రాలేదు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,651 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 8,994 ఇళ్లు ప్రారంభించారు. మిగిలిన 1,657 ఇళ్లు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. కాగా, మున్సిపాలిటీల పరిధిలో నిర్మా ణం పూర్తి చేసిన 392 ఇళ్ల మొత్తం బిల్లులు రాగా.. 3,151ఇళ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు రాలేదు. అప్పులు చేసి అవస్థలు .. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో చాలామంది లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణానికి రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఇందులో ప్రభుత్వం నుంచి బేస్మెంట్ బిల్లు రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.లక్ష చెల్లించారు. స్లాబ్ పోసిన తర్వాత రూ.1,40,000.. మొత్తం రూ. 3,40,000 మాత్రమే లబ్ధిదారులకు చేరాయి. మిగిలిన రూ.1.60లక్షలు ఇప్పటివరకు అందలేదు. అయితే ఇందులో రూ. 12వేల టాయిలెట్స్ కోసం, ఉపాధిహామీ పథకం ద్వారా 90రోజుల పనిదినాలకు రూ.7వేలు.. మొత్తం రూ.39వేలు ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. వీటితో రూ.1.21లక్షలు లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఉండడంతో ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లు పూర్తయినప్పటికీ ఖాతాల్లో జమకాని చివరి బిల్లు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులతో లబ్ధిదారుల ఇబ్బందులు బిల్లులు ఇప్పించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలుమొత్తం మంజూరైన ఇళ్లు 10,651 ప్రారంభించినవి 8,994 ఇప్పటికీ ప్రారంభించనివి 1,657 భూమిలెవల్ 5,36 బేస్మెంట్ లెవల్ 1,223 రెంటల్ లెవల్ 705 స్లాబ్లెవల్ 2,987 నిర్మాణం పూర్తయినవి 3,543 -
పల్లెల అభివృద్ధిపై నజర్
మహబూబాబాద్: గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్ఏపీ) కార్యక్రమం చేపట్టింది. జిల్లాస్థాయిలో సర్పంచ్లకు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సభలను నిర్వహించి స్థానిక అవసరాలను గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పఽథకాల సమన్వయం ద్వారా సుస్థిరమైన, సమగ్ర, అవసరాల ఆధారిత గ్రామీణ అభివృద్ధి సాధించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 482 జీపీలు.. జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 6,35,872 జనాభా ఉంది. ఆయా జీపీలకు గాను 406 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. కాగా, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్ నుంచి కార్యక్రమ అంశాలపై డీపీఓ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కార్యక్రమం చేపట్టారు. జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం.. గత నెల 8న జిల్లా కేంద్రంలో జీపీఎస్ఏపీ కార్యక్రమంపై జిల్లాస్థాయిలో సర్పంచ్లు, కార్యదర్శులు, సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరించారు. అవగాహన తర్వాత శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రణాళికలోని అంశాలు.. ప్రణాళికలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. గ్రామ సభల ద్వారా.. ప్రతీ గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాలి. స్థానిక అవసరాలను గుర్తించడం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటారు. అన్ని అంశాలను నమోదు చేసుకుంటారు. ప్రణాళికను ఐదేళ్ల పాటు నిర్వహణకు రూపొందించి అమలు చేస్తారు. పలుశాఖల భాగస్వామ్యంతో.. ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, స్రీనిధి, వీబీజీ రాంజీ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేశారు. ఆయా శాఖల నిధులతో పాటు జీపీకి వచ్చే నిధుల నుంచి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఆయా శాఖల డేటాను డ్యాష్ బోర్డు మాడ్యూల్స్లో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు.. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద బయ్యారం మండలంలోని కోటగడ్డ గ్రామం, మరిపెడ మండలం అబ్బాయి పాలెం, మానుకోట మండలంలోని జంగిలిగొండ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో గ్రామ సభలు, ఇతర ప్రక్రియ పూర్తి చేశారు. 100 శాతం డేటాను నమోదు చేసి డెమో లాగిన్లోకి పంపారు. రాష్ట్ర స్దాయిలో ప్రత్యేక మ్యానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 1నుంచి 15వ తేదీ వరకు గ్రామ సభలు పూర్తి చేసి డేటాతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈనెల 31లోగా పూర్తి చేసేలా కసరత్తు.. జిల్లాలోని అన్ని జీపీల్లో గ్రామ సభలు నిర్వహించి జీపీఎస్ఏపీ పూర్తి అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 31లోగా పూర్తి చేయాలని డీపీఓ ఆదేశాలతో కార్యదర్శులు ఆప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసమే.. గ్రామాలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా మార్చడం కోసమే జీపీఎస్ఏపీ కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో గ్రామసభలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెలాఖరులోగా కార్యక్రమం పూర్తి అవుతుంది. – రేవంత్, డీపీఓ జీపీల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక కొనసాగుతున్న గ్రామ సభలు పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు ఎంపిక ప్రణాళికలో ఐదు సంవత్సరాల అభివృద్ధి -
డీసీఓగా సర్దార్ సింగ్
మహబూబాబాద్ రూరల్ : జిల్లా సహకార అధికారి(డీసీఓ)గా మాలోత్ సర్దార్ సింగ్ను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉన్నత అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీసీసీబీలో డీఆర్/ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన మహబూబాబాద్ డీసీఓగా విధుల్లో చేరనున్నారు. ప్రత్యామ్నాయ లైన్లతో విద్యుత్సరఫరానెహ్రూసెంటర్: నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ప్రత్యామ్నాయ విద్యుత్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ దర్శన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆరు ఇంటర్లింక్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. 33/11కేవీ సబ్స్టేషన్ నుంచి మరొక 33/11 కేవీ సబ్స్టేషన్కు.. మరో 132/32 కేవీ సబ్ స్టేషన్కు, ఇదే విధంగా 33 కేవీ లైన్ నుంచి మరొక 33 కేవీ లైన్కు అనుసంధానం చేయడం ద్వారా ప్ర త్యామ్నాయ విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. -
96 మిల్లులు.. 73,809 టన్నులు!
‘రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై సీరియస్గా ఉండాలి. భవిష్యత్లో వారికి సీఎంఆర్ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి. ’ – సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి న కోట్లాది రూపాయల సీఎంఆర్ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది. ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు.. మహబూబాబాద్లో అత్యధికం.. ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్మిల్లుల నుంచి 73,809 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్ జిల్లా ఉంది. డిఫాల్టర్లకూ సీఎంఆర్..?.. ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు? 2022–23 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్లలో కూడా సీఎంఆర్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.ధాన్యం (మెట్రిక్ టన్నులు)మొత్తం మిల్లులుచెల్లించిన మిల్లులుసీఎంఆర్ ఇచ్చిన ధాన్యం (మె.టన్నులు)బకాయి ధాన్యం (మె.టన్నులు)ఇప్పటికీ సరఫరా అయినది (మె.టన్నులు)ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయి లెక్క ఇదీ.. సీఎంఆర్ బకాయిల కొండ... ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లకు పైగా 2022–23 రబీ సీజన్ బకాయిలే భారీగా.. మహబూబాబాద్లో అత్యధికం ఆ తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలు.. బకాయి మిల్లర్లపై అధికారుల ఉదాసీనత.. సర్కారు సీరియస్.. డిఫాల్టర్లలో కలకలం..1,11,634బకాయి 73,80937,825216120(55.56%)జిల్లా సీఎంఆర్గా మొత్తం బకాయి బకాయి బకాయి ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ (మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..) హనుమకొండ 13,015 34 8,683 12 19.42 వరంగల్ 32,425 67 21,512 27 48.54 జనగామ 4,429 45 3,258 27 7.49 జేఎస్ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59 మహబూబాబాద్ 40,758 25 33,309 12 74.90 ములుగు 5,107 25 2,843 13 6.36 -
మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్కు తప్పిన ప్రమాదం
మరిపెడ రూరల్ : మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం స్టేజి సమీపంలో గురువారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రయాణిస్తున్న కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో కారు వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అనుచరులు, స్థానికులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న ఓ బైక్ ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఎదురుగా కూలీలు వస్తుండటంతో వారిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ అప్రమత్తమై వాహన వేగాన్ని తగ్గించారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు అదుపుతప్పి మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కాగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధరావత్ తండా గ్రామస్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న అనంతరం ఊపిరిపీల్చుకున్నారు. -
సాగు నీరందేనా..?
బయ్యారం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. 16.2 అడుగుల నీటి సామర్థ్యం గల చెరువులోకి బుధవారం నాటికి 13.3 అడుగుల మేర నీరు చేరింది. ఆయకట్టు పరిధిలో అధికారికంగా ప్రతీ వానాకాలంలో 7వేల ఎకరాల్లో వరిసాగు అవుతుండగా.. అనధికారికంగా మరో 7 వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఆయకట్టు ఎక్కువగా ఉండి చెరువు నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో రెండు సార్లు చెరువు నిండితేనే పంటలు పండే పరిస్థితి. ఎల్నినోతో రైతుల ఇబ్బందులు.. ప్రతీ వానాకాలంలో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల కన్న బయ్యారం పెద్దచెరువు మొదట నిండుతుంది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా చెరువులోకి వరదనీరు చేరడం కష్టతరంగా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునేందుకు మరో 3 అడుగుల దూరమే ఉన్నప్పటికీ ఇటీవల ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా చెరువులోకి నీరు ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి ఉంది. వెదజల్లి.. వరి నాట్లు వేసిన రైతుల్లో ఆందోళన బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలో కొన్ని సంవత్సరాలుగా బయ్యారం, రంగాపురం, చర్లపల్లి, జాఫ్రబాద్, వెంకట్రాంపురం, సంగ్యాతండా, కోటగడ్డ, కొత్తపేట, గంధంపల్లి, సంతులాల్పోడుతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు తొలకరిలో కురిసిన వర్షాలకు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్నారు. ఈ ఏడాది సైతం నెలరోజుల క్రితం రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు బాడువ భూముల్లో నిలిచిన వర్షపునీటిని ఆధారం చేసుకొని రైతులు వరినాట్లు వేశారు. ఈ క్రమంలో గత వారంరోజులుగా వరుణదేవుడి కరుణ లేకపోవడంతో పంటలు వాడుముఖం వేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేరిన నీటిని విడుదల చేస్తే తమ పంటలకు జీవం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.బయ్యారం పెద్దచెరువులో 13.3అడుగుల నీటిమట్టం ఇప్పటికే వందలాది ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు ఇటీవల కురిసిన వర్షాలతో పెరిగిన మరింత సాగు విస్తీర్ణం నీటి విడుదలపై ఆదేశాలు లేవంటున్న ఇరిగేషన్ అధికారులు -
పాఠశాలలను బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం గిరిజన పాఠశాలల హెచ్ఎంలు, ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశీరాంనాయక్ మాట్లాడుతూ.. ప్రతీ హెచ్ఎం, హెచ్డబ్ల్యూ వెల్ఫేర్ ఆఫీసర్లు యూడబ్ల్యూహెచ్ఎంఎస్లో ఎంప్లాయ్ ప్రొఫైల్ త్వరితగతిన అప్డేట్ చేయాలన్నారు. రాజీవ్ విద్యా దివేన పథకంలో విద్యార్థుల దరఖాస్తుల ప్రకియ పూర్తి చేయాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని, జిల్లాలో గిరిజన పాఠశాలల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల చదువు సామర్థ్యాలు పెంపొందించాలని, ఎఫ్ఎల్ఎన్ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సారంగపాణి, సక్రూ, సురేందర్, డీఆర్పీ, ఎస్సీఆర్పీలు పాల్గొన్నారు. పౌష్టికాహారం అందించాలి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాంనాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన కళాశాల హాస్టల్ను ఆయన సందర్శించి, మాట్లాడారు. హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు ఉంటే, ఫిర్యాదు బాక్సులో వినతి పత్రాలు వేయాలన్నారు. స్టోర్ రూంలో బియ్యం, నిత్యావసర సరుకులను పరిశీలించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సీతారాములు, వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రజా భద్రతకు పటిష్ట చర్యలు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ప్రజా భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబా బాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్, ఎన్డీపీఎస్, నల్లబెల్లం, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, సకాలంలో సమన్లు జారీ, హిస్టరీ షీట్ల అప్డేట్, నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగించాలని, గుడుంబా తయారీ కేంద్రాలు, అనుమానాస్పద ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తరచూ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని, తయారీదారులు, విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. కేసుల దర్యాప్తుతో పాటు న్యాయస్థానాల్లో సమర్థవంతమైన సమన్వయం, ప్రాసిక్యూషన్ బాధ్యులకు సహకారం అందిస్తూ నిందితులకు శిక్షలుపడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసపత్రాలను అందజేశారు. -
మౌలిక సదుపాయాలు కల్పించాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కురవి: పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం కాంపల్లి పీఎంశ్రీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, తరగతి గదుల్లో బోధన–అభ్యసన ప్రక్రియ, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రీ ప్రైమరీ తరగతులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణతో ముందుకు సాగాలని, గుణాత్మకమైన విద్యను అందించాలని, ప్రతీ తరగతి గదిలో బోధిస్తున్న అంశానికి అనుగుణంగా టీఎల్ఎంలను ప్రదర్శించి ఐఎఫ్బీ ప్యానళ్లను వినియోగించాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీరోలు ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, హెచ్ఎం కరుణశ్రీ పాల్గొన్నారు. క్రీడల్లో రాణించేలా కృషి చేయాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా పీఈటీలు, పీడీలు కృషి చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్జీఎఫ్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ స్థాయిల్లో క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు వారి ప్రతిభ ద్వారా లభించిన ప్రశంసపత్రాలు వారి భవిష్యత్కు ఉపయోగపడాలన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రస్థాయి క్రీడలు క్రమశిక్షణతో నిర్వహించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎంఈఓలు లచ్చిరాంనాయక్, వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ జ్యోతి, డీఎస్ఓ అప్పారావు, పీఈటీలు పాల్గొన్నారు. -
నిబంధనలతో అమ్మకాలు చేయాలి
ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు ఆటోలను షోరూమ్ నిర్వాహకులు టీఆర్, ఇన్సూరెన్స్ లేకుండా అమ్మకాలు చేయవద్దు. ప్రజలు కూడా తప్పనిసరిగా టీఆర్, ఇన్సూరెన్స్తోనే వాహనాలు కొనుగోలు చేయాలి. షోరూమ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – బి. శంకర్ నాయక్, జిల్లా రవాణాశాఖ అధికారి జిల్లాలో పెరిగిన వివిధ వాహనాలు ఇవే..ద్విచక్రవాహనాలు2024 2025 2026 2026 2025 1,78,89810,185 10,946 12,048 1,59,610 2024 1,05,720 1,14,433 1,25,4996,696 7,369 9,005 6,464 7,378 9,3017,059 9,561 11,717105720 1,44,897114433125499మొత్తంకార్లుసరుకురవాణాఆటోలువాణిజ్య, ప్రజా● -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూఎస్పీసీ జిల్లా కన్వీనర్ రమేశ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రమేశ్ మాట్లాడుతూ.. పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని, మోడల్, ఎయిడెడ్, గురుకులాల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీఓ నంబర్ 25ను సవరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. నాయకులు దేవేందర్, ఉపేందర్, రామ లింగారెడ్డి, హరి, సైదులు, అనిత, భిక్షపతి పాల్గొన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గంగారం: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం, కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అజీవిక యోజన పథకం అమలు, విత్తనాల పంపిణీ తీరును పరిశీలించారు. 10రకాల కూరగాయల విత్తనాల కిట్స్ను 752మంది రైతులకు పంపిణీ చేశారు. స్థానిక రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతంగా జరుగుతున్న ఫార్మ్ పాండ్ (నీటి కుంటల) పనులను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో లబ్ధిదా రులకు అందుతున్న పింఛన్ల పంపిణీ, తదితర అంశాల తీరును పరిశీలించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కేజీబీవీ తనిఖీ.. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, భోజన వసతి, పారిశుద్ధ్యం, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఉద్యానశాఖ అధికారి మరియన్న, తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీఓ వైష్ణవి, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఎంపీడీఓ కార్యాలయం, కేజీబీవీల ఆకస్మిక తనిఖీ -
నేటి నుంచి శ్రావణమాసం షురూ..
నెల రోజులపాటు ఆలయాల్లో పూజలు మహబూబాబాద్ రూరల్ : భక్తులు అత్యంత పుణ్యప్రదంగా, విశేషంగా భావించే శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నెల రోజులపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, వ్రతాలు, ఇతర దైవిక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రావణమాసం సందర్భంగా అర్చకులు దేవాలయాలను ముస్తాబు చేస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికశోభ సంతరించుకోనుంది. శ్రీరామ ఆలయంలో ఏడు వారాల వ్రతం.. శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి మానుకోట శ్రీరామ ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యసన్నిధిలో సామూహిక ఏడు వారాల వ్రతం నిర్వహించనున్నట్లు అర్చకుడు కృష్ణప్రసాద్ తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ వరకు వ్రతం జరుగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ఆలయంలో తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 22న అవగాహన సదస్సు మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఎంపికై న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 22న ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెల్లి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవావాధికార సంస్థ, రాష్ట్ర విద్యాశాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ అవగాహన సదస్సుకు హాజరుకావాలని కోరారు. పాఠశాలలోకి పాము.. విద్యార్థుల భయాందోళనమరిపెడ రూరల్: మండలంలోని చిల్లంచర్ల ఉన్నత పాఠశాలలోకి బుధవారం ఓ పాము ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. పాము సంచరించడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి దానిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి పామును పట్టుకున్న ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. గ్రామ శివా రులోని చెరువు శిఖం ప్రాంతంలో పాఠశాల నిర్మించారని, ప్రహరీ లేకపోవడంతో తరచూ విషపురుగులు లోపలికి ప్రవేశిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా సహకార అధికారి సరెండర్మహబూబాబాద్ రూరల్ : జిల్లా సహకార (కో ఆపరేటివ్) అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.విజయకుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ స్నేహశబరీష్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఉన్నతాధికారుల సూచనలను పాటించకపోవడం, జిల్లా యంత్రాంగానికి అవసరమైన సమాచారాన్ని సకాలంలో తెలియజేయకపోవడంపై నివేదిక అందినట్లు ధ్రువీకరించారు. అవసరమైన సందర్భాల్లో ముందస్తు అనుమతి పొందకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, విధుల నిర్వహణలో విధానపరమైన లోపాలకు పాల్ప డడం వంటి అంశాలపై కలెక్టర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె చర్యల వల్ల జిల్లా పరిపాలనకు ఇబ్బందులు ఏర్పడడంతో పాటు, జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణపై ప్రతి కూల ప్రభావంపడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎ.విజయకుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతులను డీసీఓ, హైదరాబాద్లోని స్పెషల్ కమిషనర్ ఫర్ కో ఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయానికి పంపించారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ మహబూబాబాద్ రూరల్ : న్యాయవాదులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్, సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, ఆడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ క్యారమ్ బోర్డు ఆడారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవాదులు ప్రతీరోజు కోర్టు విధుల్లో ఉంటూ తమ ఆరోగ్యాలను కాపాడుకోలేక పోతున్నారన్నారు. ప్రతీ న్యాయవాది క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ జనగం సిద్ధార్థ, జీపీ తోర్నాల నగేష్ కుమార్, పీపీ కొంపెల్లి వెంకటయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వేటు పడుతోంది..
సాక్షి, మహబూబాబాద్: మొదటి నుంచి జిల్లా అధికారులను రాష్ట్రంలోనే ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. చిన్న అధికారుల నుంచి పెద్దస్థాయి అధికారుల వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే మానుకోట వివాదాలకు నిలయంగా మారింది. ఆ పేరును చెరిపేందుకు చేసే ప్రయత్నాలు కొన్ని సఫలమైనా.. మరికొన్ని మాత్రం వెంటాడుతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఇక్కడ పనిచేసే సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్ప డిన వారిలో కొందరు బయటకు వెళ్లగా.. మరికొందరు ఏసీబీకి చిక్కారు.. ఇంకొందరు జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన కొద్దిరోజులకే ఏసీబీకి పట్టుపడ్డారు. అయితే, తాజాగా కూడా జిల్లాలోని పలుశాఖలు అవినీతిమయంగా మారడం.. ఇద్దరిపై వేటు పడటం.. మరికొందరు ఆరోపణలు ఎదుర్కోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరిపై వేటు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఇందులో జిల్లాలోని చెరువుల లీజు, మత్య్స సొసైటీల సభ్యత్వాల నిధులు ఎవరికి చెప్పకపోవడం, కలెక్టర్కు నోట్ ఫైల్ కూడా పెట్టకుండా రూ.46లక్షల డ్రా చేసి దగ్గర పెట్టుకున్నారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. నిజ నిర్ధారణ కావడంతో జిల్లా మత్య్సశాఖ అధికారి భాస్కర్ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా తమ వద్ద పెట్టుకున్నారనే ఆరోపణలు, కనీసం ట్రాన్స్పోర్టు చార్జీలు ఇవ్వకపోవడం, ఎంపీడీఓలు ఖర్చుచేసిన డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు పెట్టిన ఆరోపణపై జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన హరిప్రసాద్ను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేశారు. మరికొందరిపై ఆరోపణలు.. తాజాగా కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం జిల్లాలో చర్చగా మారింది. ఇందులో జిల్లా వైద్యారోగ్యశాఖలో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహణ కోసం ముందుగా విడుదల చేసిన నిధులను కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఇవ్వని విషయంపై ఇటీవల జిల్లాకు చెందిన కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర పనుల్లో అవకతవకలు జరిగాయని, పలు గ్రామాల్లో పనులు చేయకుండానే ఎన్బీలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సంబంధిత అధికారుల చేతివాటంతోనే కొందరు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. గిరిజన సంక్షేమశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయలు చేతులు మారినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే విధంగా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ కార్యాలయాల్లో అక్రమాలు జరిగిన విషయంపై ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం. జిల్లాలోని పలుశాఖల అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంల్లో జిల్లా ఉన్నతాధికారి ప్రతీ ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చిన ఆరోపణలల్లో నిజం ఎంత ఉంది.. ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చాయి.. ఆరోపణలు చేసిన వారు ఎవరు... వారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణాల్లో పరిశీలన జరుగుతున్నటు సమాచారం. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికా రుల గుండెల్లో దడ పుడుతోంది. అవినీతికి పాల్పడుతున్న కొందరు జిల్లా అధికారులు ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్ వేటు మరికొందరిపై కొనసాగుతున్న ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ -
ప్రారంభమెప్పుడో..?
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. ఈమేరకు అగ్రిమెంట్ పూర్తి చేసి నెల దాటినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. డిజైన్ డ్రాయింగ్ విషయంలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గడువులోపు పనులు పూర్తయ్యేనా అని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. రూ.12 కోట్లు కేటాయింపు.. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.59కోట్లు విడుదల చేయించారు. ఆ నిధుల నుంచి రూ.12 కోట్లు వరద కాల్వల కోసం కేటాయించారు. రూ 5.50 కోట్లు, రూ.6.50 కోట్ల చొప్పున రెండు ప్యాకేజీల్లో కేటాయించినట్లు మున్సిపల్ ఇంజనీర్ విభాగం అధికారులు తెలిపారు. కాగా గతంలో బస్తీదవాఖానా ఎదుట, బ్రహ్మకుమారీస్ మందిరం సమీపం, పీఎస్ఆర్ గార్డెన్ సమీపంలోని రాహుల్ నగర్లో మేజర్ వరద కాల్వలు నిర్మాణం చేశారు. వాటితో పాటు 10 మైనర్ వరద కాల్వల నిర్మాణం చేశారు. చెరువులకు అనుసంధానం.. వరద కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు. దీంతో నీరు వృథా కాదు. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు సమస్య తీరుతుంది. అనుసంధానం అంతా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాగా, పట్టణంలోని స్నేహనగర్, రామన్నపేట, మన్మదతోట ప్రాంతం, గుండ్ల కుంట చెరువు ప్రాంతం, జమాండ్లపల్లిలోని కొంత భాగం, బంధం చెరువు ప్రాంతం తదితర ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని కాల్వల నిర్మాణం చేయనున్నారు. డిజైన్ డ్రాయింగ్లో ఆలస్యం.. కాల్వల నిర్మాణ అగ్రిమెంట్ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కాగా ఆ శాఖ వరంగల్లోని ఎస్సీ కార్యాలయానికి డిజైన్ డ్రాయింగ్ కోసం పంపారు. కానీ, ఆ డిజైన్ రాలేదు. దీంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఏడాది మాత్రమే గడువు.. కాల్వల నిర్మాణానికి ఏడాది మాత్రమే గడువు ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. త్వరగా డిజైన్ పూర్తి చేసి కాల్వల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వల నిర్మాణంతో ముంపు సమస్య తీరుతుందని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆప్రాంతాలను పలుమార్లు అధికారులు పరిశీలిస్తున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదు. కాల్వల నిర్మాణప్రాంతాల గుర్తింపు.. బంధం చెరువు నుంచి పాషివాగు మీదుగా జనాల చెరువుకు వరద కాల్వ నిర్మాణం చేస్తారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సమీపంలోని సెవెన్హిల్స్ నుంచి బంధం చెరువు వరకు.. నర్సంపేట ఎన్హెచ్ బైపాస్ నుంచి గుండ్లకుంట చెరువు వరకు.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ నుంచి నిజాంచెరువు వరకు.. హస్తినాపురం నుంచి నిజాం చెరువు, సిగ్నల్ కాలనీ నుంచి రైల్వే ట్రాక్ కింద నుంచి నిజాం చెరువు, నిజాం చెరువు నుంచి రాబంద్రు చెరువు వరకు కాల్వ నిర్మాణం చేయనున్నారు. అగ్రిమెంట్కే పరిమితమైన వరద కాల్వల నిర్మాణం డిజైన్ డ్రాయింగ్లో తీవ్ర జాప్యం పలుమార్లు అధికారులు ముంపు ప్రాంతాల పరిశీలన -
సీహెచ్సీలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకం
ఉమ్మడి జిల్లాలో జన్ధన్ ఖాతాలు ఇలా..(2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు)20242026ఆధార్ అనుసంధానమైనవియాక్టివ్ ఖాతాలురూపే కార్డులుసోర్స్: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానం గార్ల: మండల కేంద్రంలోని సీహెచ్సీలో కొత్తగా ఐదుగురు స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరినట్లు డీసీహెచ్ఎస్ రమేశ్ తెలిపారు. మంగళవారం సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, స్పెషలిస్ట్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో మొత్తం 9మంది స్పెషలిస్ట్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో నూతనంగా గైనకాలజిస్ట్ మౌనిక, పిడియాట్రిక్ ప్రదీప్, అనస్తీసియా మనీషా, డాక్టర్ వైశాలిరెడ్డి విధుల్లో చేరినట్లు తెలిపారు. ప్రతీరోజు రాత్రి సమయంలో ఒక నైట్ డ్యూటీ డాక్టర్ కచ్చితంగా విధుల్లో ఉండాలని వైద్యులకు సూచించారు. వైద్య పరికరాలు రాగానే రోగులకు అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో సరిపడా డాక్టర్లు, సిబ్బంది ఉన్నందున ప్రతీ నెల 20 డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమష్టిగా పనిచేస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తర్వాత సీహెచ్సీ సూపరింటెండెంట్గా సీనియర్ డాక్టర్ నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఏఓ స్వాతికుమార్, సీనియర్ అసిస్టెంట్ కిశోర్, నర్సింగ్ ఆఫీసర్స్ స్వాతి, మెర్సీ, ఝాన్సీరాణి, రాణి, ఎంఎన్ఓ బైరపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలి
మరిపెడ రూరల్: మరిపెడ మున్సిపాలిటీలో చేపట్టిన అంతర్గత రోడ్డు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని 7వ వార్డు పరిధి శ్రీరామవిలాస్ కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పానుగోలు రాంలాల్, కాలం రవీందర్రెడ్డి, కౌన్సిలర్ జాటోతు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ఉపేందర్, భిక్షపతి, రవికాంత్, గుండగాని వెంకన్న, లచ్చిరాం, కరణ్సింగ్ పాల్గొన్నారు. విద్యుత్శాఖ డీఈగా కృష్ణ బాధ్యతల స్వీకరణతొర్రూరు: డివిజన్ కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా ఎన్.కృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈ కృష్ణ మాట్లాడుతూ.. డివిజన్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా.. వాటి పరిష్కారానికి నిరంతరం చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలిమహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు కొందరు స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని, చెడు వ్యసనాలకు దూ రంగా ఉండాలని, ఇష్టపడి చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. న్యాయవాదులు మల్లారెడ్డి, రాజ్కృష్ణ, ఆనంద్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ప్రవీణ్రెడ్డిమహబూబాబాద్ అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు వాసిరెడ్డి ప్రవీణ్రెడ్డి మంగళవారం ఎన్నికయ్యారు. ప్రవీణ్రెడ్డి తొర్రూరు పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమేరకు డీఈఓ సత్యనారాయణమూర్తి ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఆరుతడి పంటలను సాగు చేయాలికురవి: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వచ్చే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందన్నారు. ఆరుతడి పంటలైన పెసలు, మినుములు, కందుల, నువ్వులు, ఆముదం వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. మిషన్ వైవిధ్యం పథకం కింద ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్రావు, ఏఓ నరసింహారావు, ఏఈఓ రాజేశ్వరి, పశువైద్య అధికారి టి.రాజేందర్, నీటిపారుదల శాఖ ఏఈ కవిత, అంబటి వీరభద్రం, జక్కుల నాగన్న పాల్గొన్నారు. -
‘కంపా’ నిధులు మంజూరు చేయండి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య న్యూశాయంపేట : హనుమకొండలోని కాకతీయ జువాలజికల్ పార్క్ అభివృద్ధికి కంపా(కాంపెన్సెటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటి) నిధులు మంజూరు చేయాలని మంగళవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటి సభ్య కార్యదర్శి డాక్టర్ వి.క్లెమెంట్ బెన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూ పార్క్లో సింహాల ఎన్క్లోజర్, నైట్షెల్టర్, హైనా, జూకల్, వైల్డ్డాగ్ ఎన్క్లోజర్లు నైట్ షెల్టర్లు, సరీసృపాల ఎన్క్లోజర్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తెలంగాణ అటవీశాఖ ఇప్పటికే కేంద్ర జూ అథారిటికి సమర్పించిందని ఎంపీ గుర్తు చేశారు. ఎంపీ వినతిపై అథారిటి కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, జూ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కడియం కావ్య వెల్లడించారు. -
తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు పెన్షన్తో భరోసా
● రెడ్క్రాస్ రాష్ట్ర పాలకమండలి సభ్యుడు శ్రీనివాస్రావుహన్మకొండ అర్బన్ : తలసేమియా, సికిల్ సెల్ వంటి జన్యుపరమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వం అందించనున్న పెన్షన్.. ఆర్థికసాయం మాత్రమే కాదని, వారి కుటుంబాలకు గొప్ప భరోసానిస్తోందని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధులతో జీవితాంతం పోరాడుతున్నారని, వారికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి, మందులు, వైద్య పరీక్షలు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. వివాహానికి ముందు హీమోగ్లోబిన్, హెచ్పీఎల్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలను ఈ వ్యాధుల నుంచి కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతున్నప్పటికీ ఇతర ఖర్చులతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15నుంచి తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు పెన్షన్ అమలు చేయనున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. -
క్రీడలతో ఉద్యోగుల్లో మానసికోల్లాసం
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి వరంగల్ స్పోర్ట్స్ : క్రీడలతో మానసికోల్లాసం కలిగి నూతనోత్సాహాన్ని నింపేందుకు దోహదపడుతాయని, అందుకే సంస్థలో శ్రమించే ప్రతీ ఉద్యోగి క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండ్రోజుల పాటు జరగనున్న ఉద్యోగులకు క్రీడా పోటీలను సీఎండీ వరుణ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా రెడ్డిపురంలోని క్రికెట్ గ్రౌండ్లో ఉద్యోగులు, క్రీడాకారులతో కలిసి సీఎండీ వరుణ్రెడ్డి క్రికెట్, క్యారమ్ ఆడారు. డైరెక్టర్లు మోహన్రావు, తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, సీఈలు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు మాధవరావు, వేణు బాబు, హేమంత్ కుమార్, స్పోర్ట్స్ అధికారి జగన్నాథ్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్ /పరకాల : పరకాలలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిపాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేతతో కలిసి మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరకాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏ ర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభకు వివిఽ ద ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందుస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం భద్రతకు అ త్యంత ప్రాధాన్యమిస్తూ హెలిపాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతా లు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్ర ణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను సీపీ శ్వేత ఆదేశించారు. అదనపు కలెక్టర్ రవి, డీసీపీ అంకిత్కుమార్, డీఆర్డీఓ మేన శ్రీను, స్థానిక సంస్థ ల ఇన్చార్జ్, అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్బాబు, ఈఈ దేవికతో పాటు పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, కమిషనర్ పవన్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఏసీపీ సతీష్బాబు, సీఐ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ఆర్సీఓగా శ్రావణ్కుమార్
దామెర : మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓగా శ్రావణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని ఒగ్లాపూర్ ఎంజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఆర్సీఓగా విధుల నిర్వహించిన ఎం.రాజ్కుమార్ బదిలీపై కరీంనగర్కు వెళ్లారు. హైదరాబాద్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ను వరంగల్కు బదిలీ చేయగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. మస్కట్ నుంచి స్వదేశానికి.. ● మాజీమంత్రి కేటీఆర్ చొరవతో బాధితురాలికి విముక్తి శంషాబాద్ : ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ అక్కడ చిత్రహింసలు భరిస్తూ బందీగా మారిన పరిస్థితి నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్న బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు.. వరంగల్కు చెందిన మహ్మూదా కేర్ టేకర్గా పని చేసేందుకు జూలై 16న మస్కట్కు వెళ్లింది. అయితే తాను వర్క్ వీసాపై కాకుండా విజిట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుసుకుంది. తనతో పని ఒప్పందం కుదుర్చుకున్న వారు చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయించడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. తనపై చోరీ నెపం నెట్టి జైల్లో పెడాతమని కూడా సదరు యజమాన్యం భయపెట్టారని పేర్కొంది. అతి కష్టం మీద తన చెల్లికి ఫోన్లో సమాచారం చేరవేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ సాయంతో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఇరుదేశాల ఎంబసీలకు సమాచారం అందించారన్నారు. కేటీఆర్ సొంత ఖర్చులతో తాను హైదరాబాద్కు చేరుకున్నట్లు ఆమె తెలిపింది. పనికోసం పొరపాటున కూడా ఎవరు విజిట్ వీసాపై విదేశాలకు వెళ్లకూడదని బాధితురాలు పేర్కొంది. పాము కాటుతో రైతు మృతి గంగారం : పాము కాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని మర్రిగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈసం సూర్యనారాయణ (46) మొక్కజొన్న చేనులో యూరియా చల్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి పాముకాటు వేసింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించినట్లు ఎస్సై కోటేశ్వర్రావు తెలిపారు. నేటినుంచి కేయూలో జాతీయ సదస్సు ● వీసీకి ఆహ్వాన పత్రిక అందజేతకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైంది. నేడు, రేపు కేయూలోని పరిపాలన భవనం సెనెట్ హాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యులు ప్రొఫెసర్ గాదె దయాకర్ పూర్తిచేశారు. జాతీయ సదస్సు నేపథ్యంలో పరిపాలన భవనానికి విద్యుత్ లైట్లతో అలంకరించారు. దీంతో పరిపాలన భవనం మంగళవారం రాత్రి విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటుంది. అలాగే వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులతో గాదె దయాకర్ సదస్సు సన్నాహక సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల సదస్సులో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, తదితర సమకాలీన అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు చర్చించనున్నారని తెలిపారు. -
క్రీడాకారులకు భోజనం పెట్టేదెలా?
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. సభ వేదికలపై ఊకదంపుడు మాటలతో ఉత్తేజపరుస్తూ, క్రీడాకారులకు అందించే భోజన వసతుల అంశంలో నిరుత్సాహ పరుస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు హనుమకొండలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం చొరవ తీసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసి ఎట్టకేలకు జేఎన్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించారు. ఈ ఏడాది 5వ తరగతి.. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గతేడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన తెలంగాణ క్రీడా పాఠశాలను నిధుల కొరత వేధిస్తోంది. మొదటి విద్యా సంవత్సరం కేవలం 4వ తరగతితో ప్రారంభమైన ఈ స్కూల్, ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి కొనసాగుతుంది. జీఓ లేదు.. రూపాయి రాలేదు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఇప్పటి వరకు ప్రభుత్వం జీఓ జారీ చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ నిర్వహణకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కా కపోవడం విశేషం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కు సంబంధించిన నిధులతోనే స్పోర్ట్స్ స్కూల్ను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పేరుకుపోతున్న బకాయిలు..? జేఎన్ఎస్లో గతేడాది 4వ తరగతిలో మొదటి విద్యా సంవత్సరం సందర్భంగా 49 మంది బాలబాలికలకు ప్రవేశాలు కల్పించి క్రీడాపాఠశాలను ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి రూ.180 చొప్పున, గతేడాది మెస్కు చెల్లించాల్సిన బకాయి సుమారు రూ.15లక్షలు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్న ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం గమనార్హం.డైట్ మెనూ ఉదయం: 5:30 టీ, బిస్కెట్లు8:00 రోజు గుడ్డు, పాలు, అరటిపండుతో పాటు ఒక్కో రోజు చపాతీ, పూరీ, ఉతప్ప, ఇడ్లీ, ఉప్మా, బ్రెడ్జామ్ మధ్యాహ్నం: అన్నం, వెజ్ కర్రీ, సాంబార్, పెరుగు, అప్పడంసాయంత్రం : 5:30 టీ, బిస్కెట్లు, రెండు చపాతీలు, పప్పురాత్రి : వారంలో ఒక్కోరోజు చికెన్, మటన్, చేపలు, రసం, గుడ్లతో అన్నం, స్వీటుత్వరలోనే బిల్లులు చెల్లిస్తాం.. గతేడాది పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ మెస్ బిల్లు ఫైళ్లను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి పంపించాం. అక్కడి ఉన్నతాధికారులు బకాయి చె ల్లించేందుకు కసరత్తు చేశారు. ఒకటి, రె ండ్రోజుల్లో బకాయి బిల్లులు చెల్లిస్తాం. – ప్రశాంత్, డీవైఎస్ఓ, హనుమకొండ పెండింగ్లో స్పోర్ట్స్ స్కూల్ మెస్ బిల్లు మొదటి ఏడాది బకాయి రూ.15 లక్షలు -
కుష్టు వ్యాధి నివారణకు చర్యలు
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: కుష్టువ్యాధి రహిత జిల్లాగా మానుకోటను ముందు వరుసలో నిలపాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం కుష్టువ్యాధి నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని కుష్టు వ్యాధిగ్రస్తులకు మందులు అందజేస్తామని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానితులను సమీపంలోని పీహెచ్సీ వెద్యాధికారి వద్దకు పంపాలన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది కుష్టును తరిమికొట్టేలా తమవంతుగా కృషి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్, డీపీఎంఓలు సతీష్రెడ్డి, వాల్యా, డెమో రాజ్కుమార్, నోడల్ పర్సన్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
లండన్కు లార్డ్ అయినా జన్మభూమికి ముద్దుబిడ్డనే
హన్మకొండ : లండన్కు లార్డ్ అయినా జన్మభూమికి ముద్దుబిడ్డనేనని బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు పేర్కొన్నారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ సమన్వయంతో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమకొండ రాంనగర్లోని నిత్య బాంక్వెట్ హాల్లో బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత ఉదయ్ కుమార్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రధాని అందించిన ఈ పదవిని హోదా కన్నా ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో జరిగిన సీటా ఒప్పందం భవిష్యత్లో దౌత్యపరమైన సంపదను పెంచుతుందని, ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొన్న 20 మందిలో ఒకరిగా నిలవడం అదృష్టంగా భావిస్తూ ఇద్దరు ప్రధానమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. లండన్లో ఉన్న భారతీయులను, ముఖ్యంగా తెలుగు/తెలంగాణ ప్రజలను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మట్టి కీర్తిని ఉదయ్ కుమార్ నాగరాజు విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఆయన సామాజిక దృక్పథాన్ని, విజ్ఞాన వికాసాన్ని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’గా నామినేట్ చేసిందన్నారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, మార్తినేని ధర్మారావు, వొడితల సతీష్ కుమార్, నన్నపునేని నరేందర్తో పాటు ఆయా పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, కుటుంబ సభ్యులు శాలువా కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు.బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు -
దర్గా ప్రాంగణంలో భక్తుల కిటకిట
కాజీపేట రూరల్ : కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రెండో రోజు మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. దేశంలోని వివిధ రాష్ట్రాల దర్గాల పీఠాధిపతులు దర్గాను దర్శించుకొని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషాను కలిశారు. కొనుగోలుదారులతో దుకాణాలు స ందడిగా మారాయి. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాత్రి దర్గాను దర్శించుకుని పూజలు చేశారు. -
విశ్రాంత ఆచార్యుల సేవలు అభినందనీయం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో విశ్రాంత ఆచార్యులు అందించిన సేవలు అభినందనీయమని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) ఆధ్వర్యంలో సెనెట్ హాల్లో నిర్వహించిన కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు, విశ్రాంత ఆచార్యుల సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కేయూ అధ్యాపకులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం బ్లాక్ గ్రాంటును రూ.90కోట్ల నుంచి రూ.140 కోట్ల వరకు పెరిగిందన్నారు. రూసా నిధులు రూ.50కోట్లతో అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నామన్నారు.132 మంది పార్ట్టైం అధ్యాపకుల నియమకాలు చేపడుతున్నామని, భవిష్యత్లో రెగ్యులర్ అధ్యాపకుల నియమాకాలు చేపడుతామన్నారు. కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పొడువునా సీనయర్ అధ్యాపకులు, ఉద్యోగుల సహాకారంతో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కుర్తా అధ్యక్షుడు ప్రొఫెసర్ సదానందం మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగానే కాకతీయ యూనివర్సిటీ 1976 ఆగస్టు 19న ఆవిర్భవించిందన్నారు. కుర్తా జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వి.రవీందర్ మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ కెమిస్ట్రీ విశ్రాంత ఆచార్యులు సీతారామారావు, కేయూ మాజీ వీసీ విశ్రాంత ఆచార్యులు విద్యావతి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ విశ్రాంత ఆచార్యులు ఎం.కిష్టయ్యను వీసీ ప్రతాప్రెడ్డి, కుర్తా బాధ్యులు శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, కుర్తా కోశాధికారి ప్రొఫెసర్ జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని రూపొందించిన సావనీర్ను వీసీతో పాటు కుర్తా అధ్యక్షుడు సదానందం, జనరల్సెక్రటరీ ప్రొఫెసర్ రవీందర్ ఇతర బధ్యులు ఆవిష్కరించారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి కూడా కాకతీయ యూనివర్సిటీకి ఏమి చేయలేక పోయాననే బాధ ఎప్పటికి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యికిపైగా అధ్యాపక పోస్టులు మంజూరు చేసినా వివిధ కారణాలతో అప్పటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదన్నారు. కేయూ అభివృద్ధి పనులకు రూ.50కోట్లు మంజూరు చేయించాను, కానీ అవి వినియోగం కాలేదన్నారు. వర్సిటీకి ఏమి చేయలేదు కదా అని తాను వర్సిటీకి రావటం లేదని, తాను ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ సార్లు మాత్రమేనని పేర్కొన్నారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి -
డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవు
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: డిఫాల్ట్ రైస్ మిల్ల ర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సీఎంఆర్ తదితర విషయాలపై సంబంఽధిత అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న సీఎంఆర్ గడువులోగా పెట్టాలని చెప్పారు. సీఎంఆర్ విషయంలో ఆలస్యం చేయవద్దన్నారు. బియ్యం సరఫరా సజావుగా కొనసా గేందుకు రైస్మిల్లర్లు జిల్లా యంత్రాగానికి పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహారావు, డీసీఎస్ఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఇండెంట్లు తయారు చేయాలి
● జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి హన్మకొండ చౌరస్తా: మందులు, సర్జికల్స్ ఇండెంట్లను రోగుల వినియోగానికి అనుగుణంగా, పారదర్శకంగా తయారు చేయాలని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. జీఎంహెచ్లో అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వైద్యులు, ఫార్మసీ అధికారులు పరస్పర సమన్వయం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వినియోగాధారిత ఇండెంట్లను రూపొందించాలని పేర్కొన్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) ఇన్చార్జ్ ఫార్మసీ ఉప్పు భాస్కర్రావు, నళిని మాట్లాడుతూ.. సీఎంఎస్ నుంచి సరఫరా అయ్యే మందులు, సర్జికల్స్ జాబితాపై వైద్యులకు పూర్తి అవగాహన ఉండాలని, దీంతో మందులను మరింత సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రోగులకు ఎలాంటి మందుల కొరత రాకుండా రాష్ట్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, పారదర్శంగా ఇండెంట్లు పంపితే మందుల కొరత నివారించవచ్చని అన్నారు. సీఎంఎస్ ద్వారా ఆస్పత్రులకు సరఫరా చేసే 628 రకాల ఔషధాలు, 536 రకాల సర్జికల్ సామగ్రికి సంబంధించిన పుస్తకాలను ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. జీఎంహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ ఎ.మంజుల, పిల్లల వైద్య నిపుణురాలు ఎన్ మానస, అనస్థీషీయా డి.రాజు, ఆస్పత్రి ఫార్మసీ అధికారులు శోభారాణి, కవిత, రజిని, ఏఓ కె.రమేశ్బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ సీహెచ్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా అయితే నీళ్లకోసం కొట్లాటలే?
హసన్పర్తి : రానున్న రోజుల్లో నీళ్ల కోసం తమ తమ నియోజకవర్గాల ప్రజల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. దేవాదుల నీటివిడుదలపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. చింతగట్టులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్సీ రమేశ్ అధ్యక్షత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. సెప్టెంబర్లో వర్షాలు కురవకపోతే గోదావరిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందన్నారు. సమ్మక్క బ్యారేజీని పూర్తిస్థాయిలో నింిపి సిద్ధం ఉంచాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రానున్న 45 రోజుల పాటు పూర్తి స్థాయిలో మోటార్ల సాయంతో నిరంతరం నీరు అందించాలని ఆదేశించారు. ధర్మసాగర్ నుంచి ఘన్పూర్ వరకు టన్నెల్ పనులు పూర్తయినా నేటివరకు వినియోగంలోకి రాలేదన్నారు. భీమ్గణపురం, గణపురం చెరువులను నింపి తాగునీరు అందించాలని చెప్పారు. దేవాదుల రిజర్వాయర్లలో నీటి నిల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందించే అవకాశాలను పరిశీలించి నీరు విడుదల చేయాలని సూచించారు. దేవాదుల ఫేజ్–3 ప్యాకేజీ–6 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 78 వేల ఎకరాల సాగు నీరు అందించే అవకాశం ఉందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. మంజూరైన పనులు చేపట్టాలని తిరుగుతన్నా.. స్పందన లేదన్నారు. కనీసం ఫోన్చేసిన అధికారులు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇదే అవకాశంగా భావించిన ప్రతిపక్షాలు తమపై దుమ్మెత్తి పోస్తున్నారని వాపోయారు. తన మాటలు లెక్కచేయడం లేదని, మంత్రి సీతక్క ఆదేశిస్తే రామప్ప నుంచి తన నియోజకవర్గానికి నీరు విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కోనారెడ్డి చెరువును రిజర్వాయర్గా ఏర్పాటు చేయాలని కోరారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ప్యాకేజీ–6 పనులు నత్తనడకన నడస్తున్నాయని, వెంటనే ఆ పనులు వేగవంతం చేసి రైతులకు సాగు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈలు సుధీర్, ధర్మ, ఎస్ఐ రాంప్రసాద్, సీతారాంనాయక్, స్వామి, రామకృష్ణ, డీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపాటు సీతక్క చెబితేనే నీళ్లు విడుదల చేస్తున్నారు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పెద్ది జ్ఞాపకాలతో కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ... ‘ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికా మన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజ లు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నా రు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● సీఎంను కలిసిన డీడీఎన్ అర్చకులు హన్మకొండ కల్చరల్ : ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజ్జుల ప్రసాద్శర్మ, ప్రధాన కార్యదర్శి వెగ్గళం సంతోష్శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా డీడీఎన్ అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్శర్మ తదితరులు సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద వరుణయాగానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వారు సమస్యలను వివరించారు. ఉద్యోగ భద్రత కోసం దేవాదాయశాఖ ద్వారా నియామక పత్రాలు అందించాలని, పేస్కేల్ వర్తింపచేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీడీఎన్ అర్చకుల సమస్యలను పరిష్కరించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు నిధులు మంజూరు కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మొదటి ప్రాధాన్యత కింద టెయిర్–1లో రూ. 88.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. ఇరిగేషన్శాఖ రూ.60 కోట్లు, ఆర్అండ్బీ రూ.20.90 కోట్లు, పంచాయతీరాజ్ రూ. 5.90 కోట్లు, ఎండోమెంట్ రూ. 2 కోట్లు మంజూరు చేయగా.. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు ఉన్న పుష్కర ఘాట్లకు రూ. వివిధ శాఖల ద్వారా రూ. 645 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారు. కాళేశ్వరంలో.. రూ.88.80కోట్లతో వివిధ శాఖలతో పాటు ఇరిగేషన్శాఖ నిధులతో అష్ట తీర్ధాల అభివృద్ధి, ఘాట్ల విస్తరణ, పలు దేవత విగ్రహాలు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఆర్అండ్బీ శాఖతో పలు చోట్ల కల్వర్టులు, హైలెవల్ వంతెనలు నిర్మించనున్నారు. పంచాయతీ రాజ్ నిధులతో మజీద్పల్లి, ప్రధాన రహదారి, ఇతర రహదారులు నిర్మించనున్నారు. రూ.198 కోట్లతో దేవస్థానం.. రూ.198కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా పునర్నిర్మాణం పనులు ముమ్మరం చేసింది.రాతి నిర్మాణం కోసం శ్రావణ మాసంలో భూమి పూజకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తర్వాత ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పది రోజులుగా కూల్చివేత పనులు తుది దశకు చేరాయి. చిన్నారిపై పిచ్చికుక్క దాడి టేకుమట్ల : మండల కేంద్రానికి చెందిన వారాల ఉమేష్ కూతురు ఆద్య సోమవారం ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అక్కడే ఉన్న పిచ్చికుక్క పాప ముఖంపై దాడి చేసింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు కుక్కను తరిమి వేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా కుక్క దాడిలో పాపకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.కన్నాయిగూడెంలో ఆరుగురిపై.. కన్నాయిగూడెం : మండలంలో వివిధ గ్రామాల్లో సోమవారం ఒక్కరోజే ఆరుగురిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెంలో ముగ్గురిపై, మండల కేంద్రంలో ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. -
స్పందన అంతంతే..
● ప్రణామ్ సెంటర్పై ప్రచారం కరువు ● నామమాత్రంగా తనిఖీలు ● నిర్వహణపై వయోవృద్ధుల అసంతృప్తిమహబూబాబాద్: వయో వృద్ధుల సంక్షేమం, వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంజూరు చేసింది. నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన సెంటర్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సంబంధిత అధికారుల తనిఖీలు లేక.. నిర్వహణ సరిగా లేకపోవడంతో వయోవృద్ధులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నాలుగు నెలల క్రితం.. జిల్లా కేంద్రంలోని మండల విద్యాశాఽఖాదికారి కార్యాలయంలోని రెండు గదుల్లో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధుల కోసం ఆ సెంటర్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్ నిర్వహణ చేపడుతున్నారు. ఈనెల 8,9,10వ తేదీల్లో ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో సెంటర్ బంద్ చేశారు. ఆటవస్తువులు.. సెంటర్లో స్నాక్స్, టీ, అరటి పండ్లు, రాగి జావ, జొన్న గటిక ఇతర ఆహార పదార్థాలు ప్రతీరోజు ఇవ్వాలి. దానిలో క్యారమ్స్, చెస్, కథల పుస్తకాలు, టీవీ ఏర్పాటు చేశారు. వారానికి ఒక రోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్లో సూపరింటెండెంట్, కుక్, ఏఎన్ఎం, మల్టీపర్సస్ వర్కర్ పని చేస్తున్నారు. నామమాత్రంగా తనిఖీలు.. సెంటర్ను సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో సూపరింటెండెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహస్తున్నారని పలువురు వయోవృద్ధులు ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా బిల్లులు పెడుతున్నా.. అఽధికారులు ఆమోదిస్తున్నారని పలువరు ఆరోపిస్తున్నారు. రెండు నెలలకు రూ.50,000 బిల్లు వచ్చినట్లు ఆసెంటర్ సూపరింటెండెంట్ లోకేష్ తెలిపారు. ప్రచార వైఫల్యంతో.. జిల్లా సంక్షేమశాఖ అధికారులు సెంటర్ నిర్వహణపై ప్రచారం చేయకపోవడంతో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెంటర్కు ప్రతీరోజు 12నుంచి 13 మంది వస్తున్నారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, సూపరింటెండెంట్ మాత్రం సెంటర్కు ప్రతీరోజు 30మంది వయో వృద్ధులు వస్తున్నట్లు తెలిపారు. అయితే బిల్లులు, హాజరు పట్టిక ఇతర వాటిపై విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయని పలువురు అంటున్నారు. రెండు నెలల బిల్లులు మాత్రమే ఇచ్చారు సెంటర్ ఏర్పాటు చేసి నాలుగు నెలలు పూరైంది. కానీ, రెండు నెలల బిల్లులు మాత్రమే వచ్చాయి. సెంటర్ మాత్రం సక్సెస్ అయింది. ఆ సెంటర్ మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కానీ, ప్రతీరోజు కూడా భోజనం పెడుతున్నాం. సంబంధిత అధికారుల సహకారంతో సెంటర్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. – లోకేష్, సెంటర్ సూపరింటెండెంట్సెలవుల్లో కూడా ఉండాలని.. సెలవులు ఇస్తే సెంటర్ బంద్ చేస్తున్నారు. సెంటర్ బంద్ చేస్తే కాలక్షేపానికి ఇబ్బంది అవుతుందని, సెలవుల్లో కూడా సెంటర్ నిర్వహించాలని వయోవృద్ధులు కోరుతున్నారు. సెంటర్ను సక్రమంగా నిర్వహిస్తే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది. -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం
ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వరంగల్ హంటర్రోడ్డు ఉర్సుగుట్ట తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ పంప్ కాలనీకి చెందిన బంక కొమురయ్య (70) పని నిమిత్తం ఉర్సుగుట్ట వైపు వెళ్లి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కొమురయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో ఏఆర్ ఎస్సై.. వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.శామ్యూల్ (57) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట జంక్షన్ వద్ద తన నివాసం నుంచి రోజు వారీగా విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శామ్యూల్ మృతితో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి
శాయంపేట : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పల్లెబోయిన భిక్షపతి (45) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చేపలు పట్టేందుకు మండలంలోని జోగంపల్లి శివారులో చలివాగు ప్రాజెక్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలో ఉన్న చేపలు తీస్తుండగా ప్రమాదవశాత్తు భిక్షపతి కాళ్లు, చేతులు వలలో చిక్కుకోగా మృతిచెందాడు. తెల్లవారిన కూడా భిక్షపతి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు, తోటివారు చలివాగు వద్దకు వెళ్లి వెతకగా వలలో చిక్కుకొని భిక్షపతి మృతి చెంది కనిపించాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి.. ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నపేట రఘునాథ్కాలనీకి చెందిన బుర్ర సంపత్ (57) సోమవారం ఉదయం వరంగల్ ఫోర్ట్రోడ్డులో నడుచుకుంటూ రంగశాయిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ నుంచి రంగశాయిపేట వైపు అతివేగంగా వెళ్తున్న కారు సంపత్ను బలంగా ఢీకొట్టింది. దీంతో సంపత్ తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ.. జనగామ రూరల్ : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా ముత్యాలమ్మ (60) సోమవారం తన వ్యవసాయ భూమి వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. -
సీపీఎం జైల్భరోలో ఉద్రిక్తత
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన జైల్భరో కార్యక్రమం ఉద్రిక్తత నడుమ సాగింది. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనలో పలువురు మహిళలకు గాజులు కోసుక పోగా.. తోపులాటలో మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్తో సహా పలువురు నాయకులను అరెస్టు చేసి మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అని విమర్శించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం రూ. 600చెల్లించాలని, పని దినాలు ఏడాదికి 200 రోజు లకు పెంచాలని, పట్టణాల్లో పథకాన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సూర్ణం సోమయ్య, బానోత్ సీతారాం నాయక్, సమ్మెట రాజమౌళి, దుడ్డెల రాంమూర్తి, కుమ్మరి కుంట్ల నాగన్న, పట్ల మధు, గుండు సులోచన, కంపల్లి శ్రీనివాస్, కందునురి కవిత, యమగాని వెంకన్న, గారే కోటేశ్వరావు, చంగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట పలువురు నాయకుల అరెస్టు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీపై పోరు సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటు -
సర్ ముగింపు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఎస్ఐఆర్(సర్) ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఓట్లు భద్రంగా ఉన్నాయి.. ఎన్ని ఓట్లు తొలగించనున్నారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కాగా, జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 48,144 ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. ఈమేరకు డ్రాఫ్ట్ జాబితాను ఈనెల 17న విడుదలు చేసి అభ్యంతరాలు రాకపోతే తొలిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 48,144ఓట్లు తొలగించే అవకాశం జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,84,935 మంది ఓటర్లు ఉన్నారు. బూత్లెవల్ అధికారులు మాత్రం 4,36,791 మంది ఓటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. మరో 3,013 మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. మొత్తంగా 4,36,735మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, పూరించిన తర్వాత తీసుకున్నారు. ఇందులో ముందుగా ప్రకటించిన విధంగా 2002 ఓటరు జాబితా ప్రకారం రక్తసంబంధీకుల ఓటర్లతో సరి అయినవి 2,40,970 ఓట్లు ఉండగా, 2025 జాబితాలో ఓటు ఉన్నవారు 1,80,883 మంది ఉన్నారు. వీరుపోగా అటు రక్తసంబంధీకులతో, ఇటు స్వయంగా జాబితాలో లేకుండా దేనితో సరికాని వారు 14,882 మంది(3.07శాతం) ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఫారాలు భర్తీ చేశారు. వీరు పోగా మిగిలిన వారిలో 9,376 మంది మరణించారు. 29,785 మంది ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతానికి ఓటు మార్చుకున్నారు. వీరితోపాటు 8,853 మందికి ఇతర ప్రాంతాల్లో కూడా ఓటు ఉన్నట్లు గుర్తించారు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉండి అందుబాటులో లేనివారు 862 మందిని గుర్తించారు. ఇలా మొత్తంగా 48,144మంది ఓటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసి సరైన సమాధానం, ఆధారాలు చూపకపోతే ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. సవరణ జాబితాలో 76,928 ఓట్లు.. ఓటరు సవరణ కార్యక్రమంలో తలెత్తిన సమస్యలు, తప్పులుగా నమోదు కావడం మొదలైన కారణాలతో జిల్లాలో 76,928 ఓట్లను సవరణ జాబితాలో చేర్చారు. ఇందులో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు(ఏఎస్డీ) మొత్తం 3,473 మంది ఉన్నారు. అదే విధంగా ఇంటిపేరు, తండ్రిపేరు, పేర్లు తప్పుగా నమోదు అయిన వారు 4,281 మంది, ఇతర వయస్సు, వారసుల పేర్లు తప్పు మొదలైన కారణాలతో సవరణ జాబితాలో చేర్చిన వారు 69,174 మంది ఉన్నారు. మరోసారి పరిశీలించి వారి వద్ద ఉన్న నిజమైన ఆధారాలతో సవరణ చేయనున్నారు. జిల్లాలో 842 గ్రామ పంచాయతీలు, 600లకు పైగా ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. అదివాసీ గూడేలు, తండాల నుంచి సమీపంలోని తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్, మరిపెడతో పాటు ఇతర జిల్లాలు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, సూరత్, బీమండీ, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి జీవిస్తున్నారు. అయితే, తాము ఎక్కడ ఉన్నా .. తమ సొంత గ్రామంలోనే మా ఓటు హక్కు కలిగి ఉండాలనే ఆలోచనతో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సమాప్తం తొలగించేందుకు సిద్ధంగా 48,144 ఓట్లు 17న డ్రాఫ్ట్ జాబితా విడుదల అభ్యంతరాల స్వీకరణ, సవరణకు నోటీసులు -
‘పెద్ది’ విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దుర్మార్గం
నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందు కు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టి ధర్నా నిర్వహించా రు. అనంతరం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించిన పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఆవిష్కరించి తీరుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఆకుల శ్రీనివాస్, డాక్టర్ లెక్కల విగ్యాసాగర్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టిన మోదీ
నెహ్రూసెంటర్: దేశ ప్రజల ప్రయోజనాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, అమెరికాకు తాకట్టుపెట్టిందని ఎస్కేఎం నాయకులు ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని, రైతాంగానికి నష్టం చేకూర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో సోమవారం ఎస్కేఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా కన్వీనర్ గుజ్జు దేవేందర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేక వీరన్న, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనప పొమ్మన్న, ఆలకుంట్ల సాయిలు, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు హలావత్ లింగన్న మాట్లాడారు. కార్మిక వ్యతిరేక లేబర్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం, పంటలకు మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు, అమెరికాకు వత్తాసు పలుకుతూ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలను తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో నందగిరి వెంకటేశ్వర్లు, జడ సత్యనారాయణ, బూర్క వెంకటయ్య, సూర్యం, వీరభద్రం, పర్వత కోటేష్, గజ్జి సోమన్న, సామ పాపయ్య, బోనగిరి మధు, ఏపూరి వీరభద్రం, కోటమ్మ, జలగం ప్రవీణ్, రాజమల్లు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన, నాయకుల అరెస్టు -
విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ/వర్ధన్నపేట : వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి వారు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. మహబూబాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని, నేడు ఆ కల నెరవేరుతుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పర్యటనకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. మామునూరు విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు, సమీప ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలని కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ మంత్రిని కోరారు. విమానాశ్రయం పునరుద్ధరణతో వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధితో పాటు వ్యాపార రంగానికి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నేతలు -
వరుణయాగంతో వరుణుడి అనుగ్రహం
మహబూబాబాద్ రూరల్ : వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణయాగంతో వరుణుడి అనుగ్రహం లభిస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. సోమవారంనాగార్జున సాగర్ వద్ద కృష్ణానది తీరంలో వరుణయాగం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే మురళీనాయక్ వరుణయాగంలో పాల్గొన్నారు. సోమేశ్వరస్వామికి అన్నపూజ పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా బహుళ త్రయోదశి పురస్కరించుకొని స్వామివారికి అన్నపూజ నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అ ర్చనలు, కోడెమొక్కులు చెల్లింకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 49 మందిపై కేసులుమహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో పాటు మరో 24మందిపై కేసులు నమోదు చేశామని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి సోమవారం తెలిపారు. అదే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐలయ్యతో పాటు మరో 23మందిపై కేసులు నమోదు చేశామన్నారు. టేకు కలప స్వాధీనంబయ్యారం: మండలంలోని చుంచుబంధంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.76 వేల విలువైన టేకు కలపను సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీశాఖాధికారి రవికిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో టేకు కలప నిల్వ ఉందనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా.. కలప పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి నవీన్కుమార్సుమతి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో పని చేస్తున్న పాణిగంటి గణేష్కు రూ.24 వేలు వేతనాన్ని నవీన్కుమార్ దంపతులు అందించారు. -
కేయూలో రెండ్రోజుల జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో కేయూ పరిపాలన భవనం సెనెట్ హాల్లో జాతీయ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఇందుకు సంబంఽధించిన ఆహ్వాన పత్రికను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి పలువురు ఆవిష్కరించారు. కేయూ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), స్టేట్ ఎక్సఫర్ట్ అప్రైజరల్ కమిటీ (ఎస్ఈఏసీ), ఎన్విరాన్మెంటల్ ప్రొఫెషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినరైజింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ స్ట్రాటెజిక్ అండ్ మల్టి–షేక్ హెల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్ అనే అంశంపై ఈ జాతీయ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల నుంచి ఇప్పటికే 150 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రిజిస్ట్రార్ -
పీఆర్సీ అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను, వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద చేపట్టిన తుది దశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన క్యూ లైన్ స్థలాన్ని పరిశీలించి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో భాగంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈఓ వీరస్వామి, సర్పంచ్ భారతి పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
సొంతింటి కల సాకారమే ధ్యేయం
కమలాపూర్ : అర్హులైన పేద కుటుంబానికి సొంతిళ్లు అందించి వారి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరాణితో కలిసి మంత్రి పొంగులేటి సోమవారం గూడూరులో ప్రారంభించారు. కమలాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కమలాపూర్ మండలంలో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉప్పల్ను, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు బండి వనజకళాధర్, పబ్బు సతీశ్, అదనపు కలెక్టర్ రవి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్దార్థ నాయక్, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేష్కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు. అంతకుముందు గూడూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి పొంగులేటితో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వాగ్వాదం డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభస చోటుచేసుకుంది. కమలాపూర్లో సోమవారం డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని, మీరిచ్చిన హామీలు అమలు చేయాలని, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రులను కోరారు. ఇందుకు మంత్రి పొన్నం కౌంటర్ ఇవ్వగా స్టేజీపైనే పొంగులేటి, కౌశిక్రెడ్డి కాసేపు వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడాతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పట్టి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతూ అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడాలని, ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలంటూ స్టేజీపైనే మంత్రితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు స్టేజీపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం..
ములుగు రూరల్ : మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ అలియాస్ షకీల (దివంగత మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ. 20 లక్షల రివార్డు చెక్కును అందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఏఎస్పీ మమన్ భట్ పాల్గొన్నారు. రివార్డు చెక్కులు, హెల్త్ కార్డులు అందజేత మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు విలేకరుల సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ -
రహదారిపై లారీ, పాలవ్యాన్ బీభత్సం
మరిపెడ రూరల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆనెపురం స్టేజీ సమీపంలో కుడియా తండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని స్టేజీతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కుడియా తండాకు చెందిన అజ్మీరా సుశీల (50) ఆదివారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తోంది. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళ్తున్న పాల వ్యాన్ ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుశీలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మహిళను ఢీకొట్టిన పాల వ్యాన్ వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ అదుపు తప్పి పాల వ్యాన్ను ఢీకొట్టింది. అంతే వేగంతో లారీ అదుపు తప్పి రహదారికి కుడి వైపునకు దూసుకెళ్లింది. అక్కడ ఓ ఇంటి ఎదుట నిలిపిన కారు, ఆటోను ఢీకొట్టడంతో పాటు భారీ చెట్టు పెకిలించి పడేసింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ ప్రభాకర్రావు, క్లీనర్ తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అజ్మీరా సుశీలకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఇలా 563 జాతీయ రహదారిపై రాత్రివేళ క్షణాల్లో జరిగిన పెను ప్రమాదం తండా వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రమాదంలో మహిళ దుర్మరణం లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు -
పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం
● మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి అవగాహన పాలకుర్తి టౌన్ : మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం చేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సంతలో మైకులో మత్తు పదార్థాలు–అనర్ధాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్–సేవ్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. యువతను నన్మార్గంలో నడిపించేందుకు తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. -
గిరిజనుల సంస్కృతికి ప్రతీక తీజ్
● ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : గిరిజన మహిళల ఐక్యతకు, సంప్రదాయ పరిరక్షణకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లతండా గ్రామంలో తీజ్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై తీజ్ పండుగ విశిష్టతను, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. తీజ్ పండుగ గిరిజన మహిళల ఆధ్యాత్మిక విశ్వాసానికి, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తండాల్లో సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తండా పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. ‘తీజ్’ వేడుకల్లో ప్రభుత్వ విప్.. కురవి: మండలంలోని గాజాతండా గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తీజ్ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ పాల్గొన్నారు. యువతులతో కలిసి రాంచంద్రునాయక్ తీజ్ బుట్టలను ఎత్తుకుని నృత్యాలు చేశారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఆయన వెంట తండా యువతులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
ఆదివాసీ హక్కులు సాధించుకుందాం
కొత్తగూడ: రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదివాసీ హక్కులను సాధించుకుందామని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. షెడ్యూల్డ్ చట్టాలు, 1/70 చట్టం, పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. గాంధీనగర్ నుంచి కొమురంభీం విగ్రహం వరకు విద్యార్థుల థింసా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుడుంద్బె జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండా ఆవిష్కరించగా.. వివిధ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ఆదివాసీ నాయకులు, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, మాస్లైన్ పార్టీలు వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాయి. -
ప్రభుత్వం దృష్టికి ఆస్పత్రుల సమస్యలు
కాశిబుగ్గ: రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని వజ్ర గార్డెన్లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్–2026’ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఆస్పత్రుల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో చర్చించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం కోసం వచ్చిన రోగులను ప్రేమపూర్వకంగా చూస్తూ, మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా మహాసభలో వైద్యరంగంలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రవీణ్ ప్రమాణ స్వీకారం.. థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన డాక్టర్ పి.ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా ఆస్పత్రుల సమస్యలను గుర్తించి సకాలంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహాసభ ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రవీణ్, కో చైర్మన్ ముక్కా దిలీప్కుమార్, సెక్రటరీ ఎల్.నాగేశ్వర్రావు, కోశాధికారి వి.నరేష్కుమార్, వద్దిరాజు రాకేష్, రాష్ట్ర అఽధ్యక్షుడు అరుణ్ కటారి, ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాద్, కోశాధికారి కె.అశోక్కుమార్, పూర్వ అధ్యక్షుడు ఎల్ సురేష్ గౌడ్, ఎస్.నౌనిపాల్ సింగ్, వి.అశోక్, మహేష్బాబు, గుండేటి రమేష్, కాళీప్రసాద్రావు, నర్సింగారెడ్డి, అశోక్రెడ్డి, నరసింహారావు, విజయ్చందర్రెడ్డి, కస్తూరి ప్రమీల, శేషు మాధవ్, విద్యాసాగర్, దశరథం, సుదీప్, సుధీర్కుమార్, కొత్తగట్టు శ్రీనివాస్, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు ఘనంగా థానాకాన్–2026 11వ వార్షిక రాష్ట్ర మహాసభ -
ఎత్తిపోస్తేనే సాగు
● పెద్ద చెరువును నింపితేనే సస్యశ్యామలం ● ఎత్తిపోతల పథకంలో చోరీకి గురైన విద్యుత్ మోటర్లు ● వినియోగంలోకి తేవాలంటున్న రైతులు డోర్నకల్: డోర్నకల్ పట్టణ శివారు మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు ఏర్పా టు చేసిన ఎత్తిపోతల పథకం దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారింది. పెద్దచెరువు కింద రెండు వందల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా.. ప్రతీ సంవత్సరం మత్స్యకారులు చేపల పెంపకం చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి. 2012లో ఎత్తిపోతల ఏర్పాటు.. మున్నేరువాగు నుంచి పెద్ద చెరువుకు నీటిని తరలించి ఆయకట్టు భూముల్లో రెండు పంటలు పండించాలనే ఉద్దేశంలో 2012లో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారు. వాగు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని పెద్ద చెరువుకు నీటిని తరలించేందుకు రూ.1,53,91,000 నిధులతో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి 20 హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ మోటార్లు, కంట్రోల్ ప్యానల్ బోర్డు, రెండు స్టార్టర్లు, 3 హెచ్పీ వాక్యూ మ్ పంప్ మోటారునుు ఏర్పాటు చేశారు. లిఫ్ట్ కోసం షెడ్డు పక్కనే ప్రత్యేకంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. మున్నేరువాగు నుంచి పెద్ద చెరువు వరకు రెండు కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్ను ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల పాటు వాగు నుంచి చెరువుకు నీటిని తరలించారు. అనంతరం విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో లిఫ్ట్ సేవలు మూలనబడ్డాయి. విద్యుత్ మోటార్లు చోరీ.. లిఫ్ట్ పని చేయకపోవడం, షెడ్డుకు రక్షణ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఖరీదైన 20 హెచ్పీ విద్యుత్ మోటార్లను చోరీ చేశారు. ప్యానల్ బోర్డును ధ్వంసం చేసి దాంట్లో విలువైన పరికరాలను ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైరును సైతం చోరీ చేశారు. గతేడాది మే నెలలో విద్యుత్ మోటార్ల చోరీని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నేటికీ చోరీపై విచారణ జరగలేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులతో పెద్ద చెరువులో నీటి నిల్వలు అడుగంటాయి. చెరువు కింద భూములు సాగు చేస్తున్న రైతులు లిఫ్ట్ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చెరువు సందరీకరణ పనులు పూర్తవుతుండడం, బతకమ్మ పండుగ సమీపిస్తుండటంతో చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
అదనపు కట్నం వేఽధింపులతో వివాహిత ఆత్మహత్య
● సముద్రాలలో ఘటన స్టేషన్ఘన్పూర్: అదనపు కట్నం వేఽధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జఫర్గఢ్కు చెందిన కోల ప్రతాప్ తన కుమార్తె సోని(28)ని ఐదేళ్ల క్రితం స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన తాడెం అనిల్కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నంగా రూ.5లక్షల నగదు, ఆరు తులాల బంగారంతో పాటు జఫర్గఢ్లో ఉన్న 100 గజాల ప్లాట్ అందించారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల వయస్సున్న కన్వీక్, ఏడాది వయస్సున్న క్రిష్విక్ ఉన్నారు. ఈ క్రమంలో అనిల్ తన భార్య వద్ద ఆరు తులాల బంగారాన్ని తన సొంత ఖర్చులకు అమ్ముకోవడంతోపాటు రెండేళ్ల క్రితం మరో యువతితో సంబంధం పెట్టుకుని సోనిని మానసికంగా, శారీరంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా సోనిని మంచిగా చూసుకుంటానని ఒప్పుకోవడంతో అనిల్ వద్దకు పంపించారు. అయితే పదిహేను రోజుల నుంచి అనిల్ అదనపు కట్నం కోసం సోనిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సోని తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పింది. ఈ క్రమంలో ఈనెల 8న అనిల్ తాగొచ్చి రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై మనస్తాపం చెందిన సోని అదే రోజు (శనివారం) రాత్రి గడ్డిమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే మృతురాలి తల్లి, సోదరుడు.. అనిల్కు ఫోన్ చేయగా అంబులెన్స్లో హనుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కోల ప్రతాప్ ఫిర్యాదు మేరకు అనిల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్కుమార్ తెలిపారు. మహాముత్తారం: అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊకంటి మనోహర్రెడ్డి(45) కుటుంబపోషణతోపాటు పిల్లల చదువులకు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి గ్రామ సమీపంలోని అడవిలో ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన బాటసారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భూపాలపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దాట్ల కుమారస్వామి తెలిపారు. -
కాజీపేట దర్గా మత సామరస్యానికి ప్రతీక
కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు హిందూ, ముస్లిం మతసామరస్యానికి, సోదరభావానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాజీపేట దర్గాలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్, పారిశద్ధ్యం, వైద్య, పోలీస్ తదితర అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తి, శాంతితో ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు. దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చొరవతో ఈ ఏడాది దర్గాలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, రూ.40 లక్షలతో మంచి నీటి పనులు, రహదారి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 30 వేల మంది భక్తులకు బోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, ఇందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్ లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు హాజరుకానున్నారని, హిందూ ఆలయ పూజరులు, బ్రహ్మణులు, ఉలమాలు, ముషాయిఖ్లు పాల్గొని శాంతి సందేశాన్నిస్తారని తెలిపారు. సోమవారం ఉర్సు ఉత్సవాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీ న్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో దర్గా ఉపపీఠాధిపతి భక్తియార్బియాబానీ, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, సింగారపు రవిప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● నేటినుంచి దర్గా ఉత్సవాలు ప్రారంభం -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. భారతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు ఉమ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కంకర అయ్యప్పరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయడానికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి యువజన కాంగ్రెస్ ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటినుంచి దేశంలో అనేక సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తూ యువజన కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు గార్లపాటి సాయితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉబ్బపల్లి శ్రావణ్, గూడూరు, నెల్లికుదురు మండలాల, కేసముద్రం టౌన్ అధ్యక్షులు బొల్లికొండ మధు, మద్ది రాజేష్, ఎండి.రియాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, శ్యామ్, నునావత్ రాజేష్, వేల్పుల శేఖర్, సాత్విక్, హరికిషన్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే సిద్ధయ్య మృతి
● నియోజకవర్గంలో విషాదం జనగామ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అప్పటి చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్ధయ్య (95) అనారోగ్యంతో హైదరాబాద్ పద్మారావు నగర్లోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్ పల్లికి చెందిన సిద్ధయ్య 1978లో చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన సిద్ధయ్యకు 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు జనగామ నియోజకవర్గంపై ప్రత్యేక అనుబంధం ఉండేది. కాగా, సిద్ధయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బచ్చన్నపేట మండలానికి 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయించడంలో కీలకంగా కృషి చేశారని స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు. గొర్రె సిద్ధయ్య మృతిపై కాంగ్రెస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. కొత్తపెల్లి రాజయ్య తదితరులు సంతాపం తెలిపారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
● మరిపెడలో ఘటన మరిపెడ : లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మరిపెడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం దబ్బతండాకు చెందిన బానోత్ వెంకట్రాం(45) పనుల నిమిత్తం బైక్పై మండల కేంద్రానికి వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఖమ్మం నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలికి ఎస్సై గండ్రాతి సతీశ్ చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
వైద్య విద్యలో వరంగల్ ఖ్యాతి
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణలో వైద్య విద్యకు కీలక కేంద్రంగా ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఐఐఆర్ఎఫ్–2026 (ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్) మెడికల్ ర్యాంకింగ్స్లో వరంగల్ కేఎంసీ 60వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 144 వైద్య కళాశాలలను వివిధ అంశాల ఆధారంగా అంచనా వేయగా.. కేఎంసీకి 870.10 స్కోర్ లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ 43వ ర్యాంకు (895.87 స్కోర్)తో ముందంజలో ఉండగా.. ఉస్మానియా మెడికల్ కాలేజీ 51వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత స్థానంలో కేఎంసీ 60వ ర్యాంకు (870.10 స్కోర్), ఆదిలాబాద్ రిమ్స్ 139వ ర్యాంకు (761.28 స్కోర్) సాధించింది. వైద్య విద్య.. వైద్య సేవలకు వెన్నెముక.. 1959లో ప్రారంభమైన కేఎంసీ ఆరు దశాబ్దాలకు పైగా వైద్య విద్యలో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్తోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ తది తర కోర్సులను అందిస్తోంది. కేఎంసీలో 32 విభా గాలు, 242 మంది ఫ్యాకల్టీ, అనుబంధంగా 8 ఆస్పత్రులున్నాయి. కేఎంసీకి అనుబంధంగా ఉన్న మహా త్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ స్థాయి వైద్యసేవల కేంద్రాల్లో ఒకటి. వరంగల్తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో కేఎంసీలో వైద్య విద్య అ భ్యసించే విద్యార్థులకు తరగతి గదులతోపాటు విస్తృతమైన క్లినికల్ ఎక్స్పోజర్ లభిస్తోంది. టాప్–50లోకి దూసుకెళ్లేందుకు దృష్టి.. కేఎంసీలో ఎంబీబీఎస్తోపాటు వివిధ పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో పీజీ కో ర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా యూరాలజీ, ిపీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, కా ర్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, కార్డియాలజీ వంటి విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ శిక్షణకు కూడా అవకాశాలున్నాయి. కేఎంసీ 60వ స్థానంతో ఆగకుండా.. పరిశోధన, మౌలిక వసతులు, వైద్య సే వలు, బోధనా ప్రమాణాలను మరింత బలోపేతం చేసి టాప్–50లోకి దూసుకెళ్లాలన్నదే ఇప్పుడు తదు పరి లక్ష్యంగా పనిచేసే దిశగా కళాశాల బృందం పనిచేయాలని ఆలోచిస్తోంది. జాతీయ స్థాయిలో కేఎంసీకి 60వ ర్యాంక్ ఐఐఆర్ఎఫ్ 2026 మెడికల్ ర్యాంకింగ్స్లో ఓరుగల్లు సత్తా 870.10 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం కేఎంసీకి కన్నా మెరుగ్గా గాంధీ, ఉస్మానియా కాలేజీలు భవిష్యత్లో టాప్–50లో ఉండడంపై సిబ్బంది దృష్టికేఎంసీకి వచ్చిన 60వ ర్యాంకు కేవలం వైద్య విద్య నాణ్యతపైనే ఆధారపడింది కాదు. బోధన–అభ్యసన వనరులు, పరిశోధన, విద్యార్థుల కెరీర్ ఫలితాలు, పరిశ్రమలతో అనుసంధానం, ప్లేస్మెంట్ వ్యూహాలు, భవిష్యత్ దృష్టి, కళాశాలపై బాహ్య గుర్తింపు వంటి అంశాలను ఐఐఆర్ఎఫ్ పరిశీలించింది. ప్రతీ విభాగంలో వచ్చిన స్కోర్లను నిర్దిష్ట వెయిటేజీతో కలిపి 1,000 పాయింట్లకు కేఎంసీ 870.10 స్కోర్ సాధించి దేశంలో 60వ స్థానంలో నిలిచింది. -
వాగులో పడి వృద్ధురాలి మృతి
కొత్తగూడ: మతిస్థిమితం లేని వృద్ధురాలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్జ నర్సమ్మ(80)కు మతి స్థిమితం లేదు. నాలుగు రోజులుగా నర్సమ్మ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పక్క గ్రామాల్లో గాలించినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆదివారం రాళ్లవాగులో పశులకాపరికి మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి నర్సమ్మగా గుర్తించిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
20 నుంచి పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్) ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి పి. శ్రీనివాస్ తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఫుడ్ సైన్స్ అండ్ టె క్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ం, ఎంఎస్డబ్ల్యూ తదితర కోర్సుల పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో నిర్వహించనున్నామని వారు తెలిపారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. టిఫిన్ సెంటర్లో చోరీ : ఇద్దరి అరెస్ట్కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ టిఫిన్ సెంటర్లో ఇటీవల చోరీకి పాల్ప డిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. పోలీస్స్టేషన్లో ఆదివారం ఎస్సైలు శివ, మోనికారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరటి అన్వేష్, జాడి రాజేష్ మూసిఉన్న తాజ్ టిఫిన్ సెంటర్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించారు. హోటల్ యజమాని పొగళ్ల జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని సామగ్రి పట్టుకున్నట్లు తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సిబ్బంది వి.క్రాంతికుమార్, జి.కుమారస్వామి, సల్మాన్ పాషాను సీఐ శ్యాంసుందర్ అభినందించారు. పుష్పాలంకరణలో మెట్టు రామలింగేశ్వరుడు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మెట్టుగుట్టపై పవిత్రోత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మెట్టు రామలింగేశ్వర స్వా మి సేవా సమితి ఆధ్వర్యంలో రెండో ఆది వారం సందర్భంగా మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించి రామలింగేశ్వరుడిని పుష్పాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, అర్చకులు అభిలాష్శర్మ, విష్ణువర్ధనాచార్యులు, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ రఘుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
మ్యాథ్స్ లెక్చరర్కు షోకాజ్ నోటీసు
గార్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేక్ సర్టిఫికెట్తో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్న సీహెచ్.సత్యనారాయణకు ఆర్జేడీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి ఆదివారం వెల్లడించారు. సత్యనారాయణ బిహార్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథ్స్ సర్టిఫికెట్ పొందినట్లు ఇంటర్ బోర్డు విచారణలో తేలింది. వారం రోజుల్లో ఇంటర్ బోర్డుకు లెక్చరర్ సత్యనారాయణ వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు. కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్హౌస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) ను నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్జూబ్లీ ఉత్సవాల మీట్లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి ఉన్నారు. -
పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి
వరంగల్ క్రైం: పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు వరంగల్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటనలో భాగంగా నక్సలిజంపై పోరాటంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కుటుంబీకులతో ఆదివారం సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులు, బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ – వీర్’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సాయం, ఎక్స్గ్రేషియా, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్/టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోర్టల్ను రూపొందించిన ఎస్ఐబీ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు వెంటనే సమాచారం అందించి, ఆయా యూనిట్ల పరిధిలోని అన్ని పోలీస్ అమరవీరుల కుటుంబాల నుంచి సమస్యలు, ఫిర్యాదులు సేకరించి, వాటిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తూ వారి సమస్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను ఆదేశించారు. తన వృత్తి జీవిత ప్రారంభ దశలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్లో విధులు నిర్వహించిన తాను విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనని తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ అమరవీరుల కుటుంబాల కోసం ‘టీజీ వీర్’ నూతన కమిషనరేట్ భవన సముదాయం సందర్శనములుగు రూరల్/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలంలోని కర్రెగుట్టలను డీజీపీ సీవీ ఆనందర్ సోమవారం సందర్శించనున్నట్లు ములుగు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు డీజీపీ ములుగు జిల్లా కేంద్రం నుంచి కర్రెగుట్టలకు బయలుదేరుతారని పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు పామనూరు సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం గోవిందరావుపేట మండలం చల్వాయి ఐదో బెటాలియన్ సందర్శన, అనంతరం భోజనం చేస్తారు. అనంతరం ములుగు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ మావోయిస్టులతో సమావేశం కానున్నారు. చివరిగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
దుర్గమ్మ ఆలయంలో చోరీ
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దుండగులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తు ల కథనం ప్రకారం.. దుండగులు తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కళ్లతో పా టు హుండీలను పగలగొట్టి భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. వీటితో పాటు కొంత నగదు కూడా అపహరించారు. అమ్మవారికి సంబంధించిన వెండి కళ్లు విలువ రూ. 25 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై సర్పంచ్ తాటికాయల మమత చేతన్కుమార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని కురవి గేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బండి అనూష ల్యాప్టాప్ చోరీకి గురైందని టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి ఆదివారం తెలిపారు. అనూష ఈ నెల 8వ తేదీన ఉదయం కుటుంబ సమేతంగా వరంగల్కు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే తాళాలు పగలగొట్టి ఇంటి తలుపు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే, ల్యాప్ టాప్ కూడా కనిపించ లేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై జి.సుదర్శన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు. -
పోలీసింగ్లో వరంగల్ భేష్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ క్రైం: రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే వరంగల్ జిల్లా పోలీసింగ్ బాగుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం వరంగల్కు వచ్చిన ఆయన వరంగల్ నిట్లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయాలి.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేరాలపై సమీక్ష జరిపిన డీజీపీ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. దోపిడీ కేసులు 29కు పెరగగా, సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు, 2026 జనవరి–జూలైలోనే 119 కేసులుగా నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాల కేసులు 40 నమోదు కాగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సంబంధించిన 117 కేసులు నమోదు అయినట్లు డీజీపీకి అధికారులు వివరించారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను మరింత విస్తరించి ప్రజల భద్రతను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. చోరీలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని కమిషనర్ శ్వేత వివరించగా.. వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన ‘నేను సైతం’ కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. డ్రగ్స్, సైబర్ మోసాలపై పీపీటీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) టీ–స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీపీ ఎన్.శ్వేత కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ పనితీరు, నేరాల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మహిళల భద్రత, ఆర్థిక నేరాల ధోరణులు తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అధిక లాభాల ఆశతో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి దూరంగా సైబర్ మోసాలకు తావుండదని చెప్పారు. పిల్లలే టార్గెట్.. గ్రామాలకు డ్రగ్స్.. డ్రగ్ పెడ్లర్లు చిన్న పిల్లలను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని డీజీపీ అన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తిస్తున్నామని, అయితే కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రంగా.. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మార్చుతున్నామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, సైబర్ మోసాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడి ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని చెప్పారు. సోషల్ మీడియాకు ప్రజలు బానిసలవుతున్నారని, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు. బేసిక్ పోలీసింగ్కు ప్రాధాన్యం... సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటే కానీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత, సీసీటీఎన్, టీ ఈగల్ఫోర్స్, సీఐడీ ఎస్పీలు రూపేశ్, సాయిశ్రీ, గిరిధర్, శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. వరంగల్తో విడదీయరాని అనుబంధం తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, అనంతరం వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివని డీజీపీ సీవీ ఆనంద్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. హనుమకొండ హంటర్రోడ్డులో నివాసం ఉన్నానన్న ఆయన నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతీ రోజు ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వస్తామా.. లేదా? అన్న ఆందోళనకర పరిస్థితులు అప్పట్లో ఉండేవన్నారు. ప్రస్తుతం మావోయిజం పూర్తిగా అంతరించిపోవడం సంతోషకరమన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగు డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ వరంగల్తో అనుబంధం విడదీయరానిది.. ఐపీఎస్గా ఇక్కడి నుంచే ప్రస్థానం నిట్ మీడియా సమావేశంలో గతాన్ని గుర్తుచేసుకున్న పోలీస్ బాస్పోలీస్ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి : డీజీపీ -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు ● చిత్రపటం వద్ద నివాళి ● పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ● రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంసాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి ఎర్రవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా.. నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. -
చోరీకి వచ్చాడు.. మహిళను హతమార్చాడు
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈమేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీసుస్టేషన్లో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించిన వివరాలు.. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్లైన్ గేమ్లతో అప్పుల పాలయ్యాడు. షాప్ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్, మాస్క్ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లు కావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించి మాస్క్ తొలగించి ప్రశాంత్ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో ఆమె తలపై మోదగా కన్నుమూసింది. అనంతరం గొలుసును దాచి పెట్టి ఇంటికి వెళ్లిన ఆయన తెల్లవారునుంచే ఏమీ తెలియనట్లే వ్యవహరించాడు. కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆతర్వాత ప్రశాంత్ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50లక్షల నగదు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దర్యాప్తులో భాగంగా పలువురి కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్పై అనుమానం వచ్చింది. దీంతో మహేష్ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈమేరకు నిందితుడు ప్రశాంత్తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేష్ను సైతం అరెస్ట్ చేశారు. కాల్డేట్, నగదు లావాదేవీల ఆధారంగా నిందితుల అరెస్ట్ -
తెగిన రైల్వే విద్యుత్ తీగ
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్పర్తి–ఉప్పల్ మధ్య ఉన్న మెయిన్ డౌన్లైన్లో శనివారం రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగ తెగిపోయింది. దీంతో సెక్షన్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి–ఉప్పల్ మధ్య గల ఆర్వో బ్రిడ్జిపై కేబుల్ లాగుతుండగా రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ తీగపై పడింది. ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే నాగ్పూర్ ప్యాసింజర్ సుమారు గంటన్నర పాటు ఉప్పల్–హసన్పర్తి మధ్య నిలిపివేసినట్లు తెలిపారు. అదేవిధంగా గూడ్స్ రైలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జమ్మికుంట, కాజీపేట రైల్వే ఓహెచ్ఈ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి సుమారు 11 గంటల వరకు మరమ్మతులు చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. నాగ్పూర్ ప్యాసింజర్ ఆలస్యంతో కాజీపేటకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్–హసన్పర్తి మధ్య ప్యాసింజర్, గూడ్స్ రైలు నిలిపివేత మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించిన రైల్వే సిబ్బంది -
పోలీసులు అంకిత భావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
తండాల్లో తీజ్ జోష్..
● శుక్రవారం నుంచి వేడుక ప్రారంభం ● ఉత్సాహంగా పాల్గొంటున్న గిరిజన యువతులు మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా తీజ్ వేడుకలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందిన రోజుకు గుర్తుగా తీజ్ నిర్వహిస్తారని ఇతీహాసం చెబుతుంది. తండాల్లోని యువతులు గోర్ బంజారాలు శ్రీసేవాలాల్ మహారాజ్, దండి మేరామ యాడీలను దైవ దూతలుగా కొలుస్తూ పంటలు బాగా పండాలని, భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుతూ తీజ్ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పండుగ.. తీజ్ నారు వలే తమ భావి జీవితాలు కూడా అభివృద్ధి చెందాలని, సేవాలాల్ మహారాజ్, మేరామ యాడీలను కొలుస్తూ యవతులు ఆషాడ / శ్రావణ మాసాల్లో తొమ్మిది రోజులు నిర్వహించే పండగే తీజ్. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వివాహితులు తమ భర్తల నుంచి ప్రేమను పొందడానికి తీజ్ నిర్వహిస్తారు. మొదటి రోజు.. తండా యువకుల సాయంతో పూజారి(నాయక్) క ర్ర సామగ్రి, రంగుల వస్త్రాలతో మంచెను తయా రు చేసిన అలంకరిస్తారు. మహిళలు పాటలు పాడుతుండగా ముందురోజు నానబెట్టిన గోధుమలను యువతులు బుట్టలో అలుకుతారు. తండా పెద్దల సమక్షంలో బుట్టలను మంచైపె పెడతారు. రెండో రోజు.. యువతీ యువకులు దగ్గరలోని చేలలో బోరడీ ఆటను ఆడుకుంటారు. నాన బెట్టిన శనగలను అమ్మాయిలు పాటలు పాడుతూ రేగు చెట్టు ముళ్లకు గుచ్చుతున్న సమయంలో తండా యువకులు కర్రతో చెట్టును కదలిస్తారు. కదిలే చెట్టు ముళ్లకు శనగలను గుచ్చలేక వారి బాధను పాటల రూపంలో వర్ణిస్తూ యువకులను ఒప్పించి శనగలను రేగు ముళ్లకు గుచ్చి ఆటను ముగిస్తారు. ఏడో రోజు.. తీజ్ పండుగలో ఏడోరోజు కీలకం. ఏడో రోజు ఢమోళి అనే పూజలో పూజారి సేవాలాల్ మహారా జ్కు చూర్మో ముద్దలతో భోగ్ రూపేణా సమర్పించిన అనంతరం సామూహిక మొక్కు చెల్లిస్తారు. తొమ్మిదో రోజు.. తీజ్ చివరి రోజున ‘కడావ్’ పూజ తర్వాత తీజ్ నిమజ్జనంతో వేడుక ముగుస్తుంది. సేవాలాల్ మహరాజ్కు తీపి పదార్థాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు. తీజ్ నిర్వహించే అమ్మాయిలు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి కేవలం శాఖాహారాన్నే భుజిస్తారు. తీజ్ చివరి రోజు సాయంత్రం మాత్రమే మేరామ మాత(యాడి) పూజను పొట్టేళ్ల బలితో మాంసాహారం ఉంటుంది. రాష్ట్ర పండుగగా గుర్తించాలి వేర్వేరు తండాల్లో వేర్వేరు తేదీల్లో కాకుండా గిరిజనులంతా ఒకేసారి నిర్వహించడం ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి లంబాడీల తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. ఢమోళీ తీజ్ పూజ రోజు సెలవు ప్రకటించాలి. – గుగులోత్ నందులాల్ నాయక్, జిల్లా అధ్యక్షుడు, సేవాలాల్ సేన -
ఆదివాసీ.. మానవాళికి మూలవాసి
ప్రకృతితో పెనవేసుకుని జీవిస్తున్న గొత్తికోయలుఏటూరునాగారం: ఆదివాసీలు.. మానవాళి మూలవాసులు. వీరి జీవనం పూర్తిగా ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. కట్టు, బొట్టూ.. ఆహారం, ఆహార్యం.. వేషధారణ, వస్త్ర ధారణ, ఆలోచన, ఆచారాలు పూర్తిగా మైదాన ప్రాంతవాసులకు భిన్నం. అడవి తల్లే వీరి జీవనాధారం. గుట్టలు, గూడేలే వీరి ఆవాసం. అడవుల్లోనే జీవించే ఆదివాసీలు నేటికీ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ నవజీవనాన్ని కొనసాగిస్తున్నారు. పండుగలు, శుభాకార్యాలను సైతం తమ కట్టుబాట్లు, నిబంధల మేరకే కొనసాగించుకుంటూ తమకంటూ ఓ జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ క్ర మంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా వారి జీవనం విధానం, అభివృద్ధి, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సేంద్రియ వ్యవసాయం.. నేటి సమాజంలో ఏ పంట దిగుబడి తీయాలన్నా రసాయన ఎరువులను అధికంగా వాడడం గమనార్హం. కానీ ఏజెన్సీలోని గొత్తికోయలు, ఆదివాసీలు సేంద్రియ వ్యవసాయం పాటిస్తున్నారు. కేవలం పశువుల పేడ, వేప ఆకులతో పంటలు పండిస్తున్నారు. కల్తీ లేని పంటలు పండించుకుంటున్నారు. ఇంటి చుట్టూ అరటిపండ్లు, కూరగాయలు, ఇతర పంటలు వేసుకుని వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అభివృద్ధికి ఆమడ దూరం.. ఆదివాసీ గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇంకా రోడ్లు, రవాణా సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నేడు అనారోగ్యంతో మూలుగుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారిన తమ తలరాతలు మారడం లేదని ఆదివాసీ ప్రజలు పేర్కొంటున్నారు. కాగా, 1986లో ఏటూరునాగారంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కార్యాలయాన్ని స్థాపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు, 177 షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా ఐటీడీఏ వ్యాప్తంగా 1,86,607 మంది ఆదివాసీ జనాభా ఉంది. పథకాలు అందని ద్రాక్ష.. ఐటీడీఏ పరిధిలో ఇంకా 30 వేల వరకు అటవీ హక్కు పత్రాలు కోసం ఆదివాసీలు ఎదురు చూస్తున్నారు. మాతా శిశు సంచార వైద్యశాల(వాహనాల) తొలగించడంతో గూడేలకు వాహనం వెళ్లడం లేదు. హార్టికల్చర్, అగ్రికల్చర్, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, మైనర్ ఇరిగేషన్ వంటి శాఖలు కనుమరుగయ్యాయి. గతంలో ఈ శాఖల ద్వారా ఆదివాసీలకు లబ్ధిచేకూరేది. ఇలా అనేక పథకాలు రోజు రోజుకూ కనుమరువుతున్నాయి.ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్ నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ, విగ్రహాలకు పూలమాలలు వేస్తామన్నారు. గిరిజన భవన్లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీఓ పేర్కొన్నారు. గొత్తికోయగూడేలకు మిషన్ భగీరథ పైపులైన్, ప్రభుత్వ చేతి పంపులు లేవు. దీంతో వర్షాకాలంలో వాగులు, తోగుల నీరు మురికిగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వ ర్షం కురుస్తున్న సమయంలో బయట కర్రకు నాలుగు మూలలకు చీర కట్టి మధ్యలో రాయివేసి ఆ నీటిని బిందెలో నింపుకుంటారు. వాటిని తాగు నీటికి ఉపయోగించడం నానాటికీ కొనసాగుతోంది. గొత్తిగోయ గూడేలకు ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేదు. కేవలం దిగిటిలు, నెగల్లు పెట్టుకుని కారుచీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. ఇందులో 3,154 మంది జనాభా ఉంది. వారికి సరైన రోడ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, పక్కా ఇళ్లు లేవు. తాత్కాలికంగా పెంకుటిల్లులు వేసుకుని జీవిస్తున్నారు. పాఠశాలలకు సరైన భవనం లేకపోడంతో మంత్రి సీతక్క కంటైనర్ పాఠశాలలు మంజూరు చేయించారు. అయితే మరికొన్ని గ్రామాల పాఠశాలలు పక్కా భవనం లేక గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గుండెంగవాయి, మామిడిగూడెం వంటి గ్రామాలకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారం కోసం మూడు కిలోమీటర్ల మేర పిల్లలను ఎత్తుకుని సమీపంలోని బూటారం కేంద్రానికి కాలినడకన చేరుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఆ గూడెంలోని 0–5 చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చాలీచాలని ఆహారం తీసుకుని రక్తహీనతకు లోనవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గొత్తికోయలకు అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయడం లేదని ఆదివాసీలు పేర్కొంటున్నారు. నేటికీ సంస్కృతి, సంప్రదాయాల ఆచరణలోనే.. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
వరంగల్లో జెన్ జీ మూవ్మెంట్ తీసుకొద్దాం
‘యూత్ మీటప్ విత్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హన్మకొండ: వరంగల్లో జెన్జీ మూవ్మెంట్ తీసుకొద్దామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్జీ యువత తలుచుకుంటే రాజకీయాల్లో అనేక మార్పులు సాధ్యమవుతాయన్నారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్ వస్తోందని, అయితే దీనికి ముందు కులాన్ని తీసివేయాలని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, తాను బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కులగణనను వ్యతిరేకించినందుకు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి మళ్లిస్తే, సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేయూ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానన్నారు. గతంలో ఎమ్మెల్సీలకు ఉన్న అభివృద్ధి నిధులను సీఎంగా రేవంత్ వచ్చాక లేకుండా చేశారని విమర్శించారు. అనంతరం విద్యార్థులు, యువత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 1,800 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–06, 08, 10,12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18తోపాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మెత్తం 60 ఈవెంట్లలో జరిగిన పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్ల ప్రదానం -
ఏఐసీసీ చీఫ్ను కలిసిన డాక్టర్ రామకృష్ణ
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్గా, పార్టీలో సీనియర్గా వరంగల్ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.మధ్యవర్తుల వలలో పడొద్దు ● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు ● ఎంజీఎం అధికారుల స్పష్టీకరణ కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాలేదని ఎంజీఎం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఇటీవల 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హా స్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని కూడా వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి అధికారులు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు, ఉద్యోగులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ యూనిట్లో స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. శనివారం కేయూ ఆడిటోరియంలో రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెడ్క్రాస్ సొసైటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి సుమారు 1000 మంది సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలోనే కేయూ ఎన్ఎస్ఎస్కు ఇండియన్ రెడ్క్రాస్ సేవా సర్టిఫికెట్ లభించిందని గుర్తుచేశారు. ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ యుద్ధాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుండి సహాయక చర్యలు చేపడుతుందని వివరించారు. అరుదైన రక్తగ్రూపు దాతల వివరాలను డేటాబేస్ రూపంలో సేకరించి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా ఈ బ్రాంచ్ పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి లైఫ్ అసోసియేట్గా, ఇతరులు లైఫ్ మెంబర్గా సభ్యత్వం పొందాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ నోడల్ అధికారి ఈసం నారాయణ, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, బీసీ సెల్ డైరెక్టర్ బి.సతీశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారి ఈసం నారాయణకు సభ్యత్వ దరఖాస్తు, నిర్ణీత రుసుము చెల్లించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ తొలి లైఫ్ మెంబర్గా సభ్యత్వం తీసుకున్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం -
ఆర్గానిక్లో జైపాల్రెడ్డిదే విజయం
కేసముద్రం మండలం తాళ్లపూసపెల్లి గ్రామానికి చెందిన రైతు సొల్లేటి జైపాల్ రెడ్డి.. గత కొన్ని సంవత్సరాలుగా తనకున్న 40 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో పలు పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎల్ఓఎఫ్ఎం (లిక్విడ్ ఆర్గానిక్ ఫార్మేటెడ్ మైన్యూర్) బయో ఎరువును తయారుచేసి పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 15 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్, 10 ఎకరాల్లో మామిడి, ఐదు ఎకరాల్లో పెసర, కందులు, మినుములు, నువ్వులు, వేరుశనగ, మిర్చి పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. లోక్ గ్లైసమిక్ ఇండెక్స్ వరి విత్తనాన్ని సాగు చేస్తూ, ఎకరానికి 18–20 క్వింటాల దిగుబడి సాధిస్తున్నాడు. పంట ఉత్పత్తులను పలు ప్రాంతాల నుండి వచ్చిన రైతులతో పాటు పలువురు నేరుగా గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తారని జైపాల్ రెడ్డి తెలుపుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే బయో ఎరువులను ఉపయోగిస్తూ పండించిన ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ బాగుంటుందని జైపాల్రెడ్డి చెబుతున్నాడు. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రసాయనాలు వద్దు.. ఆర్గానిక్ ముద్దు అని నిర్ణయం ● ప్రధానంగా ఇంటి అవసరాలకు.. ● సేంద్రియ ఎరువులతో సాగు సాక్షి, మహబూబాబాద్: పెరిగిన శాస్త్ర విజ్ఞానం, అందిపుచ్చుకున్న ఆవిష్కరణలు అన్నీ మానవ సంపత్తే అయినా.. మానవ మనుగడకు ఉపయోగపడటమే కాకుండా మాన వినాశనానికి కూడా దోహద పడుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.! వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, కొత్త వంగడాలు, హైబ్రీడ్ రకాలు, పంట పెరిగేందుకు, చీడపీడల నివారణకు దోహదపడుతాయి. కానీ అదే విధంగా వాతావరణాన్ని కలుషితం చేయడం, కేన్సర్ లాంటి భయానక వ్యాధుల బారిన పడేందుకూ కీలకంగా ఉంటున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తినడం రోగాలు కొని తెచ్చుకోవడం ఎందుకని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగానికి స్వస్తిచెప్పి సేంద్రియ ఎరువులు, పురాతన పద్ధతులతో వ్యవసాయం చేయడం అలవాటు చేసుకున్నవారు కొందరు. అయితే.. వ్యవసాయ భూమిలో ఏ పంటలు వేసుకున్నా.. తాము తినే పంటలను మాత్రం సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. మరికొందరు అయితే ఫామ్ హౌజ్ల్లో సేంద్రియ సాగుతో కూరగాయలు, పండ్లు పండించుకొని తిని తృప్తిపడుతున్నారు. సేంద్రియ కూరగాయలు.. -
కాళోజీ హెల్త్వర్సిటీ రిజిస్ట్రార్గా వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సి టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్గా డాక్టర్ జేవీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనపు డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల పాటు ఫారెన్ సర్వీసు డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు హెల్త్ వర్సిటీ ఇన్చార్జ్ రిజి స్ట్రార్గా ఉన్న డాక్టర్ నాగార్జునారెడ్డి ఇకనుంచి జాయింట్ రిజిస్ట్రార్గా పనిచేయనున్నారు. కాగా, నూతన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఓరుగల్లుతో రిజిస్ట్రార్కు అనుబంధం.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా నియమితులైన డాక్టర్ వెంకటేశ్వర్లుకు ఓరుగల్లుతో అనుబంధం ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన 26 సంవత్సరాలపాటు ఆర్థోపెడిక్ విభాగంలో విధులు నిర్వర్తించారు. 1998 నుంచి 2024 వరకు ఎంజీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, హెచ్ఓడీగా, డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశారు. 2024 నుంచి 2025 వరకు యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. 2025 నుంచి 2026 సంవత్సరం ఇప్పటి వరకు భూపాలపల్లి వైద్య కళాశాలలో అడిషనల్ డీఏంఈ హోదాలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. -
రూ.4.38 కోట్ల విలువైన సీఎంఆర్ దుర్వినియోగం
చిట్యాల: ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) అప్పగించకుండా, ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.4.38 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్మిల్లులో చోటు చేసుకుంది. వివరాలి లా ఉన్నాయి. శుక్రవారం రాత్రి విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లులో ఉన్న ధాన్యానికి భారీగా తేడా కనిపించింది. 2022–23 రబీలో 556.400 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రూ.93,95,407 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.55 లక్షలు మాత్రమే మిల్లు యజమాని చెల్లించాడు. అలాగే, 2025–26 ఖరీఫ్లో 4,218.080 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 1,328.728 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. మిగిలిన నిల్వలో 1251.434 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లులో లేవని తనిఖీలో వెల్లడైంది. 2025–26 రబీలో కేటాయించిన 850.680 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 176.880 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2025–26 సంవత్సరానికి సంబంధిం మొత్తం 1,428.314 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ. 3,99,92,792 కాగా.. పాత బకా యిలు రూ.38,95,407తో కలిపి మొత్తం రూ.4,38,88,199 ప్రభుత్వ సొమ్మును మిల్లు యజమాని యాంసాని సంతోష్ దుర్వినియోగం చేశాడని అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాములు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం మిల్లు యజమాని యాంసాని సంతోష్పై క్రిమినల్ కేసు నమోదు చేసినుట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ రాకేశ్, తహసీల్దార్ లక్ష్మణ్, పౌరసరఫరాల శా ఖ ఇన్స్పెక్టర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్స్ రాహుల్, అరవింద్ తదితరులు ఉన్నారు. ● వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్మిల్లుపై అధికారులు దాడులు ● యజమానిపై కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు -
నేడు ‘థానా’ వార్షిక రాష్ట్ర మహాసభ
కాశిబుగ్గ: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్’–2026ను ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. వరంగల్ ఐఎంఏ హాల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు. ములుగురోడ్డులోని వజ్ర గార్డెన్స్లో జరిగే వార్షిక కాన్ఫరెన్స్ థానాకాన్కు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, వైద్యనిపుణులు, వైద్యులు, ఆరోగ్యరంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ , అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ప్రత్యేక అతిథిగా హాజరై ‘వైద్యుల కోసం సైబర్ భద్రత’ అంశంపై అవగాహన ఉపన్యాసం చేస్తారని వివరించారు. వరంగల్కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు పి.ప్రవీణ్ 2026–27 సంవత్సరానికి థానా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. సమావేశంలో థానా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కా దిలీప్కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్.నాగేశ్వర్రావు, కోశాధికారి వి.నరేశ్కుమార్, వద్దిరాజు రాకేశ్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
అందరి సహకారంతోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ ● రూ.46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబాబాద్: అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డులో రూ.46 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులకు రూ.59 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరద కాల్వల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించామని దాంతో ముంపు ప్రాంతాల సమస్య తీరుతుందన్నారు. దశల వారీగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు బొల్లు రాజు, పుచ్చకాయల సరిత, బాబు, నాయకులు ఎడ్ల రమేష్, జ్ఞానేశ్వర్, వెంకట్, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. విద్యార్థులపై నిఘా ఉండాలి మహబూబాబాద్ అర్బన్: గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు, విద్యార్థులపై 24 గంటలు ప్రిన్సిపాల్స్ నిఘా ఉండాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కార్యాలయంలో ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలని, గురుకుల పాఠశాల, కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అవసరమైన వాతావరణం కల్పించాలని, వారు క్రమశిక్షనతో చదివి లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని చెప్పారు. ఆత్మ కమిటీ చైర్మన్గా గోవర్ధన్ రెడ్డి మహబూబాబాద్ రూరల్/ మహబూబాబాద్ అర్బన్: ఆత్మ కమిటీ చైర్మన్గా మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన వెన్నం గోవర్ధన్ రెడ్డిని ఆత్మ కమిటీ సభ్యులు శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జెన్నారెడ్డి జనార్ధన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ను గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వార్డు కౌన్సిలర్ బోడ రవి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్, నాయకులు మిట్టకంటి రామిరెడ్డి, దూపటి వినయ్ కుమార్, చిదిరాల జ్ఞానేశ్వర్, గోనే శ్యాంరావు, చీరిక ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి కొత్తగూడ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ డీడీ దేశీరాంనాయక్ సూచించారు. శనివారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగులు ఆదిలక్ష్మి, శ్రీనివాస్, సాయిలు, సమ్మయ్య, నాయకులు సందీప్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. భూసేకరణపై విచారణకు ఆదేశించాలి గార్ల: మండలంలో చేపట్టిన మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ భూసేకరణపై జాతీయ ట్రైబల్ కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ సమర్పించిన తప్పుడు నివేదికను తిరస్కరించి, ఆర్టికల్ 338ఎ(8) ప్రకారం తక్షణమే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలని టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ కోరారు. శనివారం గార్లలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్ను తిరస్కరించాలని షెడ్యూల్ తెగల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని జాతీయ ట్రైబల్ కమిషన్ను కోరారు. మండలంలోని ఏకై క నీటి వనరు మున్నేరు నది నీటిని లింక్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కు మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాలేరు రిజర్వాయర్కు ఇప్పటికే నాగార్జున సాగర్, సీతా రామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తున్నా, మున్నేరు నది నీళ్లు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లింకు కెనాల్ కోసం ఏర్పాటు చేసిన పీసా గ్రామసభల్లో 1/3 గిరిజనులు హాజరు కాకున్నా తప్పుడు సంతకాలు పెట్టించిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీ య ఎస్టీ కమిషన్ సమగ్రంగా విచారణ జరిపి తప్పుడు నివేదిక పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
టెక్నాలజీతో విద్యుత్ సరఫరాను బలోపేతం చేయాలి
హన్మకొండ: విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఇంధన శా ఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్ట ల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాల యం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముందుగా వరుణ్ రె డ్డి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్పీడీసీఎ ల్ పరిధిలో చేపట్టనున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఇందులో 33/ 11 కెవీ సబ్స్టేషన్లలో సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరే జ్ సిస్టమ్ ఏర్పాటు, రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్ కోసం 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు గురించి వివరించారు. రోజు రోజుకు వి ద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్లో విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను వివరించారు. ఛార్జింగ్ సమయంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించడంతో పాటు అదనపు గ్రిడ్ లోడింగ్ను నివారించవచ్చని చెప్పారు. 33 కేవీ ఫీడర్లపై రియాక్టివ్ కరెంట్ను తగ్గించడం లక్ష్యంగా 347 సబ్స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు పెట్టామన్నారు. 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకు కరెంట్ను తగ్గించి పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, మాధవ రావు, కె.వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, నాగ ప్రసాద్, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు, జీఎం ప్రభావతి, డీఈలు కె.అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ -
దొంగల ముఠా అరెస్టు.. సొత్తు స్వాధీనం
మహాముత్తారం: ఓ వైన్స్లో, బైక్ను చోరీ చేసిన నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కరీంనగర్ జిల్లా ముగ్దంపూర్ గ్రామానికి చెందిన భూతం ఆంజనేయులు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మహంకాళి కమల్, కరీంనగర్ ఆదర్శనగర్లో నివాసం ఉంటున్న శివరాత్రి అభిలాష్, కరీంనగర్ మండలం మండులపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి అరుణ్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో యామన్పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్లో చోరీ, ఒక హీరోస్ప్లెండర్ మోటార్ సైకిల్ను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులనుంచి 5 బీరు బాటిళ్లు, 25 రాయల్స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, రూ.5వేలు నగదుతోపాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్ కారు, 2 స్మార్ట్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు మహాముత్తారం ఎస్ఐ రమేష్ తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
కురవి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మానుకోట జిల్లా సీరోలు మండలం తాళ్లసంకీస గ్రామంలో గురువారం చోటుచేసుకున్నట్లు శుక్రవారం సీరోలు ఎస్సై సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసంకీస గ్రామంలో కొరిపెల్లి బాలకృష్ణ–స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం బాలకృష్ణ తన ఇంటికి తాళం వేసి మహబూబాబాద్లోని తన షాపునకు వెళ్లాడు. భార్య స్వరూప సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో విధులకు హాజరయ్యేందుకు వెళ్లింది. గురువారం సాయంత్రం బాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో పరిశీలించగా.. రెండు ఇనుప బీరువాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు గుర్తించాడు. విషయం తెలుసుకున్న సీరోలు పోలీసులు క్లూస్ టీం సభ్యుల బృందంతో ఘటనస్థలాన్ని పరిశీలించారు. 14 తులాల బంగారు అభరణాలు, రూ.2.05లక్షలు అపహరించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ విషయమై బాలకృష్ణ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 14 తులాల బంగారు ఆభరణాలు రూ.2.05లక్షల నగదు అపహరణ -
వ్యవసాయ బావుల వద్ద చోరీలు
జనగామ: జనగామ మండలం చీటకోడూరు, వడ్లకొండ గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్కు పంపినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. చీటకోడూరు సర్పంచ్ కుకట్ల యాదగిరితోపాటు గ్రామానికి చెందిన మరో 44 మంది రైతులు, వడ్లకొండకు చెందిన 10 మంది రైతుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మధ్యాహ్నం వడ్లకొండ క్రాస్రోడ్ వద్ద ఎస్ఐ భరత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రంలోని కలహాండి జిల్లా ధర్మగర్ గ్రామానికి చెందిన రసిక్ మజ్హి, బింబదర్ పాత్ర, జాడు మజ్హి ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. దీంతో వారు రైతుల వ్యవసాయ పొలాల వద్ద బోర్లు, మోటార్ల వైర్లు, సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.80 వేల నగదు, పనిముట్లు, పరికరాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. రైతుల ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందించి, శాసీ్త్రయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టడం వల్ల నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని సీఐ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కేసు చేదనలో సీఐ పర్యవేక్షణలో ఎస్ఐలు భరత్, రతీష్, హెడ్ కాని స్టేబుల్ నాసర్, మహిళా పోలీసు కానిస్టేబుల్ మనీషా, పోలీసు కానిస్టేబుళ్లు కరుణాకర్, కృష్ణ, భాస్కర్, సాగర్, ఐడీ అసిస్టెంట్ సల్మాన్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.80 వేల నగదు, పరికరాలు స్వాధీనం -
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్ : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాననే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానుకోట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రావు కాలనీలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుని జీవిస్తున్న కుంట రాకేష్ (23) రెండు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి ప్రేమ విషయంలో పలుమార్లు పెద్దల పంచాయతీలు ఘర్షణలు జరగ్గా అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదు. దీంతో రాకేష్ తండ్రి ఉప్పలయ్య అతడికి తొమ్మిది నెలల క్రితం వేరే అమ్మాయితో వివాహం జరిపించాడు. ఆషాడమాసం కావడంతో రాకేష్ భార్య తల్లిగారింటికి వెళ్లగా ఒంటరిగా ఉన్నాడు. ఈక్రమంలో గురువారం పండ్లు అమ్ముకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులు భోజన సమయానికి ఇంటికి వచ్చి చూసేసరికి రాకేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు. రాకేష్ తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నెక్కొండ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెక్కొండ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన బత్తుల సాయిరాం (20) పదో తరగతిలో ఫెయిల్ అవ్వడంతో జులాయిగా తిరుగుతున్నాడు. నిత్యం సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ పనులకు సాయం కోరిన తల్లిదండ్రులకు సాయిరాం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీతో నిత్యం సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తావా.. అంటూ తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన సాయిరాం నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
పరుగు పందెంలో పాల్గొన్న బాలలు జంప్ చేస్తున్న బాలుడువరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి 1వ పిల్లల అథ్లెటిక్స్ పోటీలు, జావెలిన్ డే వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరగనున్న అథ్లెటిక్స్ మీట్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,757 మంది అథ్లెట్లు హాజరైనట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అండర్–06, 08, 10, 12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18 తో పాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పిల్లల అథ్లెటిక్స్, జావెలిన్ త్రో పోటీలు ముగిసినట్లు తెలిపారు. రెండో రోజు యూత్ విభాగంలోని అండర్–18 బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్పుట్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్ లాంటి మెత్తం 60 ఈవెంట్లలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ జేఎన్ఎస్లో ప్రారంభం వివిధ జిల్లాల నుంచి హాజరైన 1,757 మంది క్రీడాకారులు -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
వరంగల్ జిల్లా సంగెం మండలంలో, పర్వతగిరి మండలంలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. తిమ్మాపూర్లో.. సంగెం : ద్విచక్రవాహనం ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొట్టడంతో మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తబ్బెట ఎల్లస్వామి(56) గురువారం రాత్రి ఇంటి సమీపంలోని కిరాణాషాపునకు వెళ్లి వస్తున్నాడు. అదేసమయంలో అదే గ్రామానికి చెందిన తాటికొండ మణికంఠ స్కూటీపై అతివేగంగా అజాగ్రత్త వస్తూ ఎల్లస్వామిని ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడడంతో ఎల్లస్వామి తల, మెడ, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అతన్ని వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడికి భార్య సుధ, ఇద్దరు కుమారులు రాజు, యాదగిరి ఉన్నారు. పెద్ద కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ.. పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామంలో మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ సలీమా(35) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద విద్యుత్ హీటర్ను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. -
అథ్లెటిక్ ఈవెంట్ కాదు..!
వరంగల్ స్పోర్ట్స్: ఇలా తీగలను దాటడం కూడా అథ్లెటిక్స్ పోటీల్లో ఓ ఈవెంట్ అని అనుకుంటే పొరబడినట్లే. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ లోపలికి వెళ్లే ప్రధాన గేటు దాటగానే కుడి వైపు సైడ్ట్రాక్కు అడ్డుగా ఇనుప తీగలను కట్టారు. అటు వైపు వెళ్లే అథ్లెట్లు తీగలను దాటేందుకు ఫీట్లు చేయక తప్పలేదు. కొందరు పిల్లలు తీగలను గమనించకపోవడంతో మెడకు తగిలి పడిపోయారు. హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు వారి తల్లిదండ్రులు, టెక్నికల్ అఫీషియల్స్ ఇనుప తీగలతో ఇబ్బందులు పడ్డారు. -
తిరుపతి–కరీంనగర్ ఎక్స్ప్రెస్ వేళలో మార్పు
● అక్టోబర్ 10 నుంచి అమలు కాజీపేట రూరల్: తిరుపతి నుంచి కరీంనగర్ (12761)కు వయా గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మీదుగా వెళ్లే బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేళలో స్వల్ప మార్పులు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 08ః05 గంటలకు బయల్దేరే ఈ ఎక్స్ప్రెస్ రాత్రి 07ః50 గంటలకు బయల్దేరుతుందని దెలిపారు. తిరుపతి నుంచి 15 నిమిషాల ముందే బయల్దేరేలా సమయం మార్చినట్లు తెలిపారు. ఈ మార్పు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్వో స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులకు పునుగు పిల్లి అప్పగింతశాయంపేట : ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యుడు మారెపల్లి సునీల్ ఓ పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డుపై పునుగు పిల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పశువైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిపారు. పునుగు పిల్లికి మెరుగైన చికిత్స కోసం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కోటేశ్వర్ రావు, వాచర్ అశోక్ జిల్లా పశువైద్యశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సునీల్, వన్యప్రాణి ప్రేమికుడు సాయికృష్ణ పాల్గొన్నారు. పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం ● ‘స్టేట్ యూత్ అంబాసిడర్– టీబీ అడ్వకసీ ఫెలో’గా సందీప్ ఎంపికపాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకర్తి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎలమకంటి సందీప్ ప్రతిష్టాత్మక ‘స్టేట్ యూత్ అంబాసిడర్ –టీబీ అడ్వకసీ ఫెలోగా’ ఎంపికయ్యారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూనైట్ ఇండియా ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. సందీప్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులతో టీబీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖాతో సమన్వయం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో టీబీ నివారణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిచడం ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి. ఈ సందర్భంగా సందీప్ పాలకుర్తికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పలువురు అభినందించారు. -
విచారణపై అనుమానాలు!
హన్మకొండ చౌరస్తా: ‘నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది ఐటీఐ అధికారుల తీరు. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఐటీఐ అధికా రులే దారి తప్పి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను మీరుతూ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుతో నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. విచారణకు ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా నిజాలు బయటిపెట్టకుండా సదరు ఉద్యోగులను కాపాడుకునేందుకు ఉత్తుత్తి విచారణ చేపట్టి ఉన్నతాధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ సభలో పాల్గొనడంపై ఫిర్యాదు.. హైదరాబాద్లోని ఎంప్లాయ్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో ట్రెయినింగ్ ఆఫీసర్గా ఉన్న ఓంకార్ (ప్రస్తుతం మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపాల్గా ఉన్నారు.), పెద్దపల్లి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఫిబ్రవరి 02, 2025లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు. విధి నిర్వహణలో కొనసాగుతూనే రాజకీయ సభలో పాల్గొనడంపై ఓ వ్యక్తి ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్, గవర్నర్, ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ కమిటీని నియమించారు. డైరెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 25న హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. మహబూబ్బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ను వరంగల్లోని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆఫీస్లో విచారించారు. కానీ, అందుకు సంబంధించిన నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందించ చర్య లో జాప్యం నెలకొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఐటీఐ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్పై విచారణ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు అధికారుల తీరుపై విమర్శలుఓంకార్, మల్లికార్జున్ లపై వచ్చిన ఫిర్యాదుపై డైరెక్టర్ ఆదేశాలతో జూన్ 25న విచారణ జరిగింది వాస్తవమే. విచారణ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ ఆర్డీడీ నర్సయ్య, సభ్యుడిగా నేను ఉన్నాం. అయితే ఫిర్యాదు ఎదుర్కొంటున్న వారిద్దరు, నేను ఒక్కటే అసోసియేషన్కు చెందిన వారమని తెలిపాను. దీంతో ఆర్డీడీ నర్సయ్య మరో కమిటీ వేసి మరోసారి విచారణ చేయాలని ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్కు నివేదించారు. తదుపతి కమిటీ విచారణ చేసే వరకు వేచిచూడాల్సిందే. – చందర్, ప్రిన్సిపాల్ ఐటీఐ వరంగల్విచారణ చేపట్టి నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ కమిటీ సభ్యుడిగా ఉన్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. తెలంగాణ టెక్నికల్ అసోసియేషన్లో బాధ్యుడు కాగా, అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు అధికారులు సైతం అదే అసోసియేషన్ బాధ్యులని తెలిసింది. సన్నిహితులు అయినందునే విచారణను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘కాళేశ్వరం’ రాతి నిర్మాణానికి మట్టి పరీక్షలు
● శ్రావణ మాసంలో నూతన ఆలయానికి భూమిపూజ చేసే అవకాశంకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ లో భాగంగా పునర్నిర్మాణం కోసం హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మట్టి పరీక్షల ను శుక్రవారం ప్రారంభించారు. దేవస్థానం నిర్మా ణం పూర్తిగా రాతితో చేపట్టనున్న నేపత్యంలో మట్టి గట్టితనంపై పరీక్షలు చేస్తున్నారు. మొత్తం దేవస్థా నం నిర్మాణ ప్రాంతంలో తొమ్మిది చోట్ల 30 నుంచి 40 ఫీట్ల మేర డ్రిల్లింగ్ చేపట్టారు. ఇప్పటికే నాలుగు డ్రిల్లింగ్ హోల్స్ వేశారు. మిగితావి శనివారం వరకు పూర్తి చేసి ల్యాబ్కు పంపిస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికి వేసిన నాలుగు హోల్స్లో గట్టి బండరాయిలాంటి మట్టి వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పటికే దేవస్థానం పాత ఆలయాలన్ని 90 శాతం వరకు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో శ్రావణమాసం మొదలు కానుండడంతో సరికొత్త రాతి ఆలయ నిర్మాణానికి ముగ్గుపోసే ముహూర్తం ఖరారు కానుంది. -
గడువులోగా జనగణన పూర్తి చేయాలి
మహబూబాబాద్: నిర్ణీత గడువులోగా జనగణన–2027 ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జనగణనపై సమీక్షించారు. ఈసందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, తాగునీరు తదితర అంశాలను సేకరించి జిల్లా గణన హ్యాండ్బుక్ నెట్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. సంబంఽధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
గాంధీపార్కు అభివృద్ధికి కృషి
మహబూబాబాద్: మానుకోట పట్టణంలోని గాంధీ పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కును శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కులో వాకింగ్ ట్రాక్, వేదిక ఇతర సందరీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులతో తయారు చేయిస్తామన్నారు. ఎస్టిమేషన్ను బట్టి నిధుల మంజూరుపై ఆలోచిస్తామన్నారు. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు స్థానికులు సహకరించాలన్నారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారు రూ.60 కోట్లు మంజూరు చేయించామని, ఆ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం బంధం చెరువు వద్ద జరుగుతున్న వరద కాల్వల పనులను పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ పనులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అజయ్సారథిరెడ్డి, డీఈఈ సీహెచ్.ఉపేందర్, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్, రాజు, నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, పెరుగుకుమార్, వీరన్న, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వర కు వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయ న వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కా రం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్ డీజీపీగా జిల్లాకు తొలిసారి వస్తున్న సీవీ ఆనంద్ -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన..పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన.. ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ -
ప్రత్యామ్నాయ పంటలతోనే భరోసా
వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మహబూబాబాద్: రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యవసాయం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పంటల సాగుపై ప్రతీ రైతుకు స్పష్టమైన సందేశం చేరేలా అధికారులు పని చేయాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,81,167 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు చెప్పారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలికురవి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం సీరోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, రికార్డులు, పోలీసింగ్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్లోని వివిధ రికార్డులు, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డయల్–112 కాల్స్పై స్పందన, గ్రామాల సందర్శన వివరాలు, గంజాయి ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచార సేకరణ, గ్రామస్థాయిలో వీపీఓ వ్యవస్థ పనితీరు, స్టేషన్ సిబ్బంది, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, నేరాల పరిస్థితి తదితర అంశాలపై సమీక్షించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్–112 ద్వారా వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలన్నారు. గ్రామాల సందర్శనను నిరంతరం కొనసాగిస్తూ గ్రామస్తులతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. గంజా యి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వీపీఓ వ్యవస్థను గ్రామస్థాయిలో సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజలతో మర్యాదపూర్వక వైఖరి, బాధ్యతాయుత సేవాభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్సై సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలినెల్లికుదురు: మోడల్ స్కూల్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని మోడల్ స్కూళ్ల ప్రత్యేక అధికారి సాయిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను శుక్రవారం ప్రత్యేక అధికారి సందర్శించారు. స్కూల్, కళాశాల, హాస్టల్ను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, కేర్టేకర్ అనిత పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కేయూ క్యాంపస్: విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి సూచించారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు శుక్రవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం, ఇంటర్నెట్, ఏఐ, ఆన్లైన్ వీడియో లెక్చర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. నిట్ ప్రొఫెసర్ బి.స్ఫూర్తి మాట్లాడుతూ.. కళాశాల జీవితం విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన దశ అని అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళాశాల కల్పిస్తున్న సదుపాయాలు, అకడమిక్ కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈనెల 11 నుంచి 16 వరకు నూతన విద్యార్థినులకు ఇండక్షన్ ప్రోగ్రాం గురించి కన్వీనర్ ఎస్.సాహితి, సహ కన్వీనర్ టి.వెంకటేశ్, ఇన్చార్జ్ డాక్టర్ శ్రీరామ్జ్యోత్స్న తెలిపారు. -
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కాంగెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శుక్రవారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, పట్టణాల అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. మూడు నెలలుగా తర్జనభర్జన.. జిల్లాలోని 18 మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపికపై మూడు నెలలుగా నాయకుల మధ్య తర్జనభర్జన కొనసాగింది. జిల్లాలో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నా యి. ములుగు, ఇల్లెందు, పారికుర్తి నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాలకు ఒక్కరి పేరు, మరికొన్ని మండలాలకు ఇద్దరి నుంచి ఐదుగురు పేర్లు ప్రతిపాదించినట్లు ప్రచారం. ఇలా జిల్లాలోని 18 మండలాలకు మొత్తం 50మందికి పైగా నాయకుల పేర్లు రాసి పంపించారు. అయితే ఎంపిక విషయంలో ఎంత మంది అబ్జర్వర్లు వచ్చినా.. ఎంత మంది నాయకులు ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్. కాగా, ఎమ్మెల్యేలు చూసించిన నాయకులపై మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. మరికొన్నిచోట్ల ఎంపీ బలరాంనాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మరికొన్ని మండలాల్లో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మండల అధ్యక్షుల ఎంపిక కోసం కొందరి పేర్లు సిఫారసు చేసినట్లు ప్రచారం జరిగింది. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూ రు, పెద్దవంగర మండలాల్లో ఏకాభిప్రాయంతో.. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రతిపాదించిన నాయకులపై కొందరు కార్యకర్తలు తెలిపిన అభ్యంతరాలపై చర్చ జరిగింది. అయితే తర్వాత సర్దిచెప్పి ఆరు మండలాల ఎంపిక పూర్తి చేశారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మండల అధ్యక్షుల ఎంపికపై ఉన్న చిక్కుముడి వీడలేదు. దీంతో జాబితా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వద్దకు చేరిందనే వార్తలు వచ్చాయి. బుజ్జగింపులు.. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని మండలాల అధ్యక్ష పదవులు అశిస్తున్న వారిలో ఎమ్మెల్యే కొందరి పేర్లు సూచించగా.. ఎంపీలు, ఇతర పార్టీ పెద్దల మరికొందరి పేర్లు చెప్పి పట్టుబట్టారు. దీనిపై ఎమ్మెల్యే, ఇతర నాయకుల సమాలోచనకు వచ్చి జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. అయితే పదవి ఆశించిన వారిని బుజ్జగించడం, మరో అవకాశం ఇస్తామని చెప్పడం, పీఏసీఎస్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. ఏదీ ఏమైనా ఎట్టకేలకు పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక వర్గాల మధ్య కుదిరిన సయోధ్య పోటీ ఎక్కువగా ఉన్న చోట సమన్వయం మరో అవకాశం ఇస్తామని బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే.. నియోజకవర్గం మండలం అధ్యక్షుడు మహబూబాబాద్ మహబూబాబాద్ బెల్లంకొండ శ్రీనివాస్ గూడూరు దారావత్ బాలాజీ కేసముద్రం చిలువేరు సమ్మి ఇనుగుర్తి బైరు అశోక్ గౌడ్ నెల్లికుదురు ఎదళ్ల యాదవ రెడ్డి డోర్నకల్ దంతాలపల్లి కొడుపుగంటి హరికృష్ణ నర్సింహులపేట బొబ్బ సోమిరెడ్డి కురవి బలగాని శ్రీనివాస్ గౌడ్ డోర్నకల్ బత్తుల శ్రీనివాస్ సీరోలు బుడిగం లక్ష్మీనారాయణ చిన్నగూడూరు మారబోయిన వెంకటేశ్వర్లు మరిపెడ గుగులోత్ రవినాయక్ మరిపెడ పట్టణం బానోత్ రాంలాల్ డోర్నకల్ పట్టణం కాల సుమీర్ జైన్ -
అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి
● ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రు నాయక్ కురవి: సర్పంచ్లకు అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ వీరబాబు అధ్యక్షతన జరిగింది. అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదని సభలో సర్పంచ్లు ఏకరువు పెట్టారు. ప్రతీ గ్రామంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఏఈ శారద పట్టించుకోవడంలేదని, ఫోన్ చేసినా ఎత్తడంలేదని సర్పంచ్లు మండిపడ్డారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్ల ఫోన్ ఎత్తకుండా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఏడీఈ రమేష్ సభకు వచ్చి సర్పంచ్లు తెలిపే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్లు శాంతించారు. కరెంట్ బిల్లులు చెల్లించాలని ఎంపీడీఓ, ఎంపీఓలు అడుగుతున్నారని సర్పంచ్లు ఆరోపించారు. 17 మంది బీఆర్ఎస్ సర్పంచ్లపై వివక్ష చూపుతున్నారని, ఈజీఎస్ పనులు రాకుండా చేశారని బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నాన్ స్టార్ట్ ఇందిరమ్మ ఇళ్లను ఇంత వరకు క్లియర్ చేయలేదని, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ వీరబాబుపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా పూర్తి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు. అధికారులు సర్పంచ్లకు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో భగీరథ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వేసవిలో ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్ విజయ, డీఈ జుంకీలాల్, చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, గార్లపాటి వెంకటరెడ్డి, కొర్ను రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
కూరగాయల సాగుతో ఆదాయం
మహబూబాబాద్ రూరల్ : ఆరుతడి, కూరగాయల పంటల సాగు మేలుదాయకమని, మహిళా సంఘాల సహకారంతో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. జిల్లాలో 4వేల ఎకరాల్లో కూరగాయలు సాగు విస్తీర్ణానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 524 ఎకరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా, వ్యవసాయ అధికారుల సహకారంతో కూరగాయలు సాగు చేపట్టినట్లు చెప్పారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బీర, సోర, కాకర, బోడ కాకర, బెండ, చిక్కుడు, ఆకుకూరలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు ఆధునిక పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం చేయాలన్నారు. రైతులు కూరగాయల పంటలు సాగుచేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఐకేపీ డీపీఎం శ్రీకాంత్, ఉద్యాన అధికారులు శాంతిప్రియదర్శిని, స్రవంతి, సిబ్బంది జ్యోత్స్న, సుకన్య, రామకృష్ణ ఉన్నారు. -
టాస్క్ సెంటర్ ఏర్పాటులో జాప్యం
మహబూబాబాద్: జిల్లాలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సెంటర్ ఏర్పాటుకు అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రైవేట్ భవనాలు పరిశీలించగా అద్దె ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేశారు. త్వారీత ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. కాగా, టాస్క్ సెంటర్లో శిక్షణ కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి.. నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు టాస్క్ సెంటర్ మంజూరు చేసింది. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చిన అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పి స్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టాస్క్ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్లో టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం రీజినల్ మేనేజర్ సునీల్రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి మానుకోట పట్టణంలోని తొర్రూరు రోడ్డు, ఈదులపూసపల్లి రోడ్డులో ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ డీగ్రీ కళాశాలను కూడా పరిశీలించారు. జిల్లా పరిశ్రమలశాఖ, ఉపాధి కల్పన శాఖ సమన్వయంతో ఆ సెంటర్ పనిచేస్తుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇప్పటి వరకు 6,536 మంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్లీ భవనాల పరిశీలన.. ఇటీవల మళ్లీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను పరిశీలించారు. కానీ ఆ గదులకు బదులుగా అనుకూలంగా లేని వేరే రెండు గదులు ఇస్తామని చెప్పారు. అయితే టెక్నికల్ సమస్య వస్తుందని అధికారులు విముఖత వ్యక్తం చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీ, ఎస్పీ పాత కార్యాలయ భవనం, రెడ్యాలలోని ప్ర భుత్వ భవనాలను పరిశీలించారు. కాగా, ఎస్పీ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మారిస్తే.. టాస్క్ సెంటర్ను పాత ఎస్పీ కార్యాలయంలో ఏ ర్పాటు చేయాలనే ఆలోచిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అయితే నేటి వరకు సెంటర్కు భవనం కేటాయింపు జరగలేదు. రూ.30లక్షలు కేటాయింపు.. టాస్క్ సెంటర్లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్ స్నేహశబరీష్ ఇతర గ్రాంట్ నుంచి రూ.30 లక్షలు కేటాయించి కంప్యూటర్లు, మెటీరియల్స్, ఫర్ని చర్ ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలి పారు. కలెక్టర్ సెంటర్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకోసం బడ్జెట్ కేటాయించారని అఽ దికారులు తెలిపారు. అయితే అనువైన భవనం లేక సెంటర్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్రంలో ఇచ్చే శిక్షణలు.. కేంద్రంలో మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంటర్ ఓపెన్ చేసి ఉంటుంది. వారం నుంచి ఆరు నెలలు వరకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్, ఐసెట్, నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డెటా అనాలిటిక్స్, మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డవలప్మెంట్, పరిశ్రమల అవసరాలు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. యువత నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా టాస్క్ పని చేస్తుంది. ఇంటర్వ్యూల ద్వారా ఉపాధి.. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆతర్వాత పలు కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయించి ఉద్యోగ అవకాశాలు వారే కల్పిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. టాస్క్ సెంటర్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు చాలామంది ఉండడంతో.. సెంటర్కు మంచి స్పందన వస్తుంనది అధికారులు చెబుతున్నారు. నెలాఖరు వరకు సెంటర్ ఏర్పాటుప్రభుత్వ భవనంలో సెంటర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. అందుకే ఆలస్యమవుతోంది. మిగితా ప్రాసెస్ అంతా పూరైంది. నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వారికి సమాచారం ఇస్తున్నాం. యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరులోగా సెంటర్ ఏర్పాటు అవుతుంది. – శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్భవనాల పరిశీలనకే పరిమితం రెండు నెలలుగా కసరత్తు చేస్తున్న అధికారులు అనువైన ప్రభుత్వ భవనం లేకనే ఆలస్యం శిక్షణకు 271 దరఖాస్తులు ఇప్పటికే 271 మంది దరఖాస్తు టాస్క్ సెంటర్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. అందుకోసం గూగుల్ లింక్ ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 6వ తేదీ వరకు 271మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారంతా సెంటర్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
జయశంకర్ సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ స్నేహశబరీష్ కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘన ంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆయన సిద్ధాంతాలు, భావజాలం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి మహబూబాబాద్: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. సంక్షేమ పథకాలపై స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేస్తామని చెప్పారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, ఆర్వో నాగలక్ష్మి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
భవనాన్ని అందుబాటులోకి తేవాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కేసముద్రం: కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని మహముద్పట్నం గ్రామంలోని కేజీబీవీని ఆయన సందర్శించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. అప్డేట్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన డీడీ రెండు రోజుల్లో అందజేస్తామని విద్యుత్శాఖ ఏడీకి తెలిపారు. 15 రోజుల్లో నూతన భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఇంగ్లిష్లోనే బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జీఈసీఓ గాయత్రి, ఇన్చార్జ్ ఎస్ఓ అర్చన, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు పాల్గొన్నారు. గోదాం ఖాళీ చేయించాలి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో హరికృష్ణ మూమెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సీఎం బ్రేక్ఫాస్ట్ సప్లైచేసే కేంద్రాన్ని డీఈఓ సందర్శించారు. గోదాంలో బస్తాలను ఖాళీచేసే పనులను ఆయన పరిశీలించారు. త్వరగా ఖాళీ చేయించాలని సూచించారు. -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు చెక్!
నాలుగు లెవల్ క్రాసింగ్ల వద్ద చేపట్టనున్న పనుల అంచనా వ్యయం రూ.197 కోట్లు కాగా, ఆ మేరకు నిధులు కేటాయించారు. ఈ నాలుగు పనుల్లో ఒక్కదానికి టెండర్ సైతం ఖరారు చేశారు. మిగతా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. ● వరంగల్–చింతలపల్లి మార్గంలోని ఎల్సీ నంబర్ 64 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.77 కోట్లు అంచనా వేశారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ● ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 69/ఎం వద్ద రూ.100 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ (జీఏడీ), అంచనాల తయారీ పనులు జరుగుతున్నాయి. ● ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 70 వద్ద రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో రైల్వేవాటా పూర్తయింది. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ● నెక్కొండ–ఇంటికన్నె మార్గంలోని ఎల్సీ నంబర్ 74 వద్ద రూ.8 కోట్లతో చేపట్టాల్సిన ఆర్యూబీ పనులు కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. సాక్షిప్రతినిధి, వరంగల్ : రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు చెక్ పడనుంది. ఉమ్మడి వరంగల్లో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. వీటి కోసం ఏకంగా రూ.197 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఒకచోట టెండర్ ఖరారుకాగా.. మరోచోట డిజైన్లు, అంచనాల రూపకల్పన జరుగుతోంది. ఇంకోచోట రైల్వే వాటా పనులు పూర్తికాగా.. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఒక ఆర్యూబీ పనులు మాత్రం నిలిచిపోయాయి. పెండింగ్ పనులపైన దృష్టి సారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంనుంచి మరో మూడు.. కేంద్ర రైల్వేశాఖ చేపట్టిన నాలుగు పనులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో మూడు ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. కాజీపేట–వరంగల్ మార్గంలోని ఎల్సీ నంబర్ 60, ఎల్గుర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 66, 67 వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాకపోకల అంతరాయానికి చెక్.. రాష్ట్రంలో మరో 118 ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అంచనా వ్యయం సుమారు రూ.4,883 కోట్లుగా స్పష్టం చేసిన రైల్వేశాఖ.. ఇందులోనే మూడు ఆర్వోబీలు, ఏడు ఆర్యూబీలు, ఎనిమిది లెవల్ క్రాసింగ్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వివరించింది. క్రాసింగ్ల వద్ద రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో.. వీటి స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగుచోట్ల ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం వరంగల్లో రైల్వే వంతెనలకు రూ.197 కోట్లు.. ప్రకటించిన కేంద్రం రైల్వే పెండింగ్ పనుల్లో ఎట్టకేలకు కదలిక -
మార్కెట్ చరిత్రలో మక్కలకు రికార్డు ధర
● రూ.2,629 పలికిన పంట కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మక్కలకు మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. మక్కల సీజన్ ప్రారంభంలో క్వింటాకు ధర రూ.1,500 నుంచి 1,900 వరకు మాత్రమే పలికింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మద్దతు ధర రూ.2,400కు మించి పలుకుతూ వస్తుంది. కాగా, గురువారం మార్కెట్కు 55 బస్తాల మక్కలు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.2,629, కనిష్ట ధర రూ.2,400 పలికినట్లు అధికారులు తెలిపారు. కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి మక్కలకు రూ.2,629 పలికినట్లు తెలిపారు. మార్కెట్కు వరుస సెలవులు ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈనెల 8,9,10 తేదీల్లో వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 వారాంతపు సెలవు, 10 (సోమవారం) బోనాల పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో మా ర్కెట్కు వరుసగా మూడురోజులు సెలవు ఉంటుందన్నారు. తిరిగి 11న పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దన్నారు. బావిలో పడి రైతు మృతి ● కొత్తపేటలో ఘటన బయ్యారం: వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత సైదులు (50) ఉదయం తన వ్యవసాయ బావికి విద్యుత్ మోటారు, పైపులు బిగించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బావి వద్ద మోటారు బిగించి పైపులు సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. మృతుడి అల్లుడు సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. ప్రశాంత్బాబు తెలిపారు గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి.. తొర్రూరు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తొర్రూరుకు చెందిన రెడ్డబోయిన వెంకటనారాయణ(55) స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్డీఐ(స్పెషల్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్)గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే విధుల్లో ఉన్న వెంకటనారాయణకు చాతిలో నొప్పిగా అనిపించడంతో సహచరులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఉపేంద్ర, కుమారుడు మణిదీప్, కుమార్తె మానస ఉన్నారు. -
డీపీఓ ఆకస్మిక తనిఖీ
కురవి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీపీఓ రేవంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామాభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ స్వరూప, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి వేద రాజేశ్ పాల్గొన్నారు. కాగా డీపీఓ రేవంత్ మొదటి సారి కురవి గ్రామ పంచాయతీకి రావడంతో సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దైద భద్రయ్యలు సన్మానించారు. ప్రీ ప్రైమరీ సిబ్బంది నియామక జాబితా విడుదల మహబూబాబాద్ అర్బన్: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామక జాబితాను గురువారం ఎట్టకేలకు విడుదల చేశారు. నియామకాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, అర్హుల ఎంపికలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు జాబితను విడుదల చేశారు. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీ నుంచి ఇన్స్ట్రక్టర్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యవసాయ మార్కెట్కు సెలవులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు రోజులపాటు క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ గురువారం తెలిపారు. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు, సోమవారం బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవురోజుగా ప్రకటించిందన్నారు. మళ్లీ మంగళవారం యథావిధిగా వ్యవసాయ మార్కెట్ పరిధిలో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. రైతులు సెలవురోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురికావద్దని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం నెహ్రూసెంటర్: ఆదివాసీల స్వయం పాలన, రాజ్యాధికారం, హక్కుల కోసం పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. ఆగస్టు 9న ఆదివాసీ పోరాట దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, అటవీ హక్కులు, వనరుల కోసం, హక్కుల సాధనకే ఆదివాసీలు ఏళ్లుగా పారాటాలు సాగిస్తున్నారని, వారి పోరాటాల ఫలితంగానే పెసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం వచ్చాయన్నారు. అనంతరం న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన 15 కుటుంబాల వారు ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కార్యక్రమంలో బానోత్ ఉక్లా, ఆరెం కొటమ్మ, బానోత్ దేవేందర్, ఇరుగు నాగన్న, గణేష్, శివ, నారాయణ, సిద్దబోయిన జీవన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలి మహబూబాబాద్ రూరల్ : ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 6నుంచి దేశ వ్యాప్తంగా పార్టీ ప్రజా చైతన్య ప్రచార యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్లు గ్రామంలో అమరజీవి తండా రామచంద్రు స్తూపం వద్ద సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర గురువారం ప్రారంభించారు. విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బి.అజయ్ సారథిరెడ్డి, నాయకులు పాండురంగచారి, సందీప్, లింగ్యనాయక్, కుమార్, సాంబలక్ష్మి, వెంకన్న, రవి, వీరన్న, రవీందర్, రమేష్, వేణు పాల్గొన్నారు. -
ఇలా.. 24 అంతస్తులు
కాశిబుగ్గ: హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మహానగరంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (24 అంతస్తులు) రూపు దిద్దుకుంటోంది. ఆ ధునిక హంగులు, అధునాతన సౌకర్యాలతో రోగులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ని ర్మిస్తున్న ఈ పెద్దాస్పత్రి ఈ ఏడాది చివరి నా టికి ప్రారంభోత్సవం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పడం లేదు. 12 ఎకరాలు.. 2,018 పడకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్లో చేపట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు చివరి దశ కు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల కు పెద్ద దిక్కువగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సమీపంలోనే జీ+23 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 2,018 పడకలతో దాదాపు 12 ఎకరా ల్లో చేపట్టారు. తెలంగాణలోని అతిపెద్ద సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులు ఇక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లకుండానే ఇక్కడ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో అంతస్తులో పలు వైద్య విభాగాల ఏర్పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పలు ప్రత్యేకతలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు హైదరాబాద్కు వెళ్లకుండానే ఓరుగల్లులోనే మెరుగైన వైద్యం24 అంతస్తుల్లో ఉండే విభాగాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాద్లోని ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, 24 అంతస్తుల్లో ఏఏ విభాగాలు ఉంటాయో వైద్యాఽధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిన వివరాలు. ఒకటో అంతస్తు : ఓపీ, క్యాజువాలిటీ, అత్యవసర వైద్యసేవలు రెండో అంతస్తు : పూర్తిగా అధునాతన ఐసీయూ సేవలు మూడు, నాలుగు అంతస్తులు : పలు విభాగాలకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు 6 నుంచి 12 అంతస్తులు : పలు డిపార్ట్మెంట్ల వార్డులు 13వ అంతస్తు : ల్యాబ్లు, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు 14, 15 అంతస్తులు : మెయింటెనెన్స్, టీచింగ్ 16, 17, 18 అంతస్తులు : ఫ్యాకల్టీ టీచింగ్, డెమో క్లాసులు 19, 20, 21 అంతస్తులు : రెసిడెంట్ డాక్టర్లు (పీజీలు) 22, 23 అంతస్తులు : ఆడిటోరియం, ఏబీసీ బ్లాకులు ఏర్పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, ఆంకాలజీ–క్యాన్సర్ పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఐసీయూ, ఆపరేషన్లు థియేటర్లు వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యసేవలు ఫిజియోథెరపి, ఆర్గాన్ ట్రిట్మెంట్, వృద్ధుల కోసం ప్రత్యేక చికిత్స హిమోఫిలిటీ (రక్త సంబంధ వ్యాధులు) సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్, కీమోథెరపి, సర్జరీలు న్యూక్లియర్ థెరపి, డయాలసిస్ సెంటర్ కార్డియో థోరాసిక్, ఓపెన్ హార్ట్ సర్జరీలుసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వైద్యులు త్వరితగతిన వచ్చి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా రోడ్డు సదుపాయం కల్పించారు. కాకతీయ మెడికల్ కాలేజీ, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్యులు నేరుగా వాహనాల్లో వచ్చే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేఎంసీకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టి పనులు చేపట్టారు. హాస్పిటల్కు వచ్చే రోగులు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండడంతో పలు సర్వీసులను సూపర్ స్పెషాలిటీ ఆవరణలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
చేప పిల్లల పంపిణీకి కసరత్తు
● నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ● చర్యలు చేపడుతున్న అధికారులు ● టెండర్ ప్రక్రియ షురూజిల్లాలో చేప పిల్లలు, చేపల దిగుబడి వివరాలు నెహ్రూసెంటర్: జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. ఈమేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టేలా టెండర్ల ప్రక్రియకు అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 1,229 చెరువుల్లో గతేడాది సుమారు 2కోట్ల మేరకు చేప పిల్లలను పంపిణీ చేశారు. అదనుదాటిన తర్వాత పంపిణీ చేయడంలో మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతమైన త్వరగా చేప పిల్లల పింపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నాణ్యత పాటించాలని.. చేప పిల్లల పంపిణీలో నాణ్యత, కొలతలు, లెక్క ప్రకారం చెరువులోకి చేరడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చేప పిల్లల పంపిణీలో సరైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం చేరేలా.. జిల్లాలో 1,229 చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. అన్ని చెరువుల్లో కలిపి సుమారు 4కోట్లకు పైగా చేప పిల్లలను వదలనున్నారు. 35–40 ఎంఎం, 80–100 ఎంఎం సైజ్ చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. అయితే సహకార సంఘాలకు నగదు బదిలీ చేయడం ద్వారా నాణ్యమైన పిల్లల్ని కొనుగోలు చేసి వర్షాల ప్రారంభంలోనే చెరువుల్లో వదులుకుంటామని మత్స్యకారులు కోరుతున్నారు. టెండర్ల కోసం ఏర్పాట్లు... జిల్లాలో 200 మత్స్యసహకార సంఘాలు, సుమారు 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అదను దాటకుండానే చెరువుల్లో చేప పిల్లలను వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ టెండర్లను అహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం టెండర్దారులను ఎంపిక చేస్తామని, చేప పిల్లల పంపిణీకి సంబంధించిన చర్యలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2023–24 4.20 కోట్లు 9 వేల టన్నులు 2024–25 1.8కోట్లు 23 వేల టన్నులుచేప పిల్లల పంపిణీ -
28 కేజీల గంజాయి పట్టివేత
నర్సంపేట రూరల్ : ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. ఈనెల 05వ తేదీన ఒడిశాకు చెందిన బోలెరో వాహనంలో భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ బైపాస్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని నిలిపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురులో ఒకరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో వాహనం కింది భాగంలో సుమారు రూ. 14లక్షల విలువైన 28 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వెంటనే గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర ఆధ్వర్యంలో పంచానామా నిర్వహించి, కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్ ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకున్న ఎస్సై అరుణ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. మరిపెడలో 2.24 కిలోలు స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్ మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకుల గల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1.12 లక్షల విలువైన 2.240 కిలోల సరుకు, కారు, 4 సెల్ ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్సై సతీశ్, సిబ్బంది రవీందర్, రమేశ్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంత మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వారు తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీ సులు కారును నిలిపి తనిఖీ చేశారు. ఇందులో డ్రైవ ర్ సీటు కింద 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో నల్లగొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన గండికోట వంశీ, చిత్రం రాకేశ్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మాదాసు మ హేశ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండలో సెల్ఫ్ డ్రైవ్కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి నల్లగొండలో విక్రయించేందుకు వస్తున్నట్లు నిందితులు నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇద్దరి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
‘మన’ స్ఫూర్తి.. ఘన ‘కీర్తి’
● ఎంఐటీలో ప్రతిష్టాత్మక హంఫ్రీ ఫెలోషిప్నకు జనగామ జిల్లాకు చెందిన ఐఏఎస్ ఎంపికజనగామ : జనగామ జిల్లా తరిగొప్పుల వాసి, ఐఏఎస్ అధికారి జల్లి కీర్తి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో నిర్వహించే ప్రతిష్టాత్మక హ్యూబర్ట్ హెచ్.హంఫ్రీ ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపికయ్యారు. అసోం, మేఘాలయ కేడర్కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆమె ప్రస్తుతం అసోంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు సాగే ఈ ఫెలోషిప్లో కీర్తి జల్లి ‘టెక్నాలజీ పాలసీ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధన, విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాపాలన రంగంలోని మధ్యస్థాయి నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. కర్మశ్రీ అవార్డుతో సన్మానం.. కీర్తి జల్లి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసి సివిల్ సర్వీస్ సాధించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా, తల్లి గృహిణిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అసోంలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్తోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్–19 నియంత్రణ, వరద సహాయక చర్యల్లో చూపిన నాయకత్వానికి అసోం ప్రభుత్వం ఆమెను కర్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ప్రభుత్వ సేవల్లో సాంకేతికత వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత పరిపాలనపై ఈ ఫెలోషిప్లో కీర్తి ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. ఎంఐటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలో అధ్యయనం చేసే అవకాశాన్ని దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణమని పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. -
గోదారమ్మా.. కరుణించు
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వర్షాధారమే దిక్కు.. సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని జీవిస్తున్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతీ సంవత్సరం వర్షం కురిస్తేనే పంటలు పండుతున్నాయి. వర్షాలు లేకపోతే ఏజెన్సీ అంతా ఏడారిగా మారుతుంది. కాగా, ఎన్నికల సమయంలో గోదావరి జలాలు తరలిస్తామని నాయకులు చెబుతున్నారే తప్ప.. ఆచరణలో చూపడం లేదు. ప్రభుత్వాలు కరుణించి గోదావరి నీటిని ఎత్తిపోస్తేనే జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల రైతుల సాగునీటి గోస తీరుతుంది. తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు అన్నట్లు ఉంది.. కొత్తగూడ మండలం రైతుల పరిస్థితి. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు కట్టమాత్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. చెరువు విస్తీర్ణం మాత్రం కొత్తగూడ మండలంలోని గ్రామాల్లో ఉంటుంది. నీటి నిల్వ పెరిగితే ఈ ప్రాంతం గ్రామాలే ముంపునకు గురవుతాయి. ఇక్కడి ప్రజలే ఇబ్బందులు పడుతారు. కానీ కొత్తగూడ మండలంలోని ఒక్క గ్రామానికి కూడా పాకాల చెరువు నుంచి పంటలకు నీరు మాత్రం రాదు. ఎత్తిపోస్తేనే.. భూములు సస్యశ్యామలం పాకాల చెరువు నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తేనే ఏజెన్సీ మండలాల్లో భూములు సస్యశ్యామలంగా మారుతాయి. గోదావరి జలాలు ఇప్పటికే ములుగు జిల్లాలోని రామప్ప చెరువు నుంచి పాకాల చెరువులోకి ఎత్తిపోస్తున్నారు. కాగా, పాకాల చెరువు బ్యాక్ వాటర్ను కొత్తపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో లిఫ్ట్పెట్టి ఎత్తిపోయాలి. ఇలా సుమారుగా 10కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ పైపులైన్లు వేసి మధ్యలో చెరువులు నింపుతూ గంగారం మండలం తిరుమలగండి చెరువు నుంచి పందిపంపుల వాగు వరకు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే కొత్తపల్లి, వేలుబెల్లి, ముస్మి, పోలారం, బత్తులపల్లి, కార్లాయి, గోపాలపురం, తాటివారి వేంపల్లి, పొగుళ్లపల్లి, ఓటాయి, కోనాపురం, సాధిరెడ్డిపల్లి, జంగంవానిగూడెం, గంగారం మండలం తిరుమలగండి, పుట్టలభూపతి, మడగుడెం, గంగారం గ్రామాలకు సాగునీరు వెళ్తుంది. అక్కడి నుంచి పందిపంపుల వాగులో నీటిని వదిలితే బయ్యారం పెద్దచెరువు గోదావరి జలాలతో నిండుతుంది. తద్వారా కొత్తగూడ, గంగారం మండలాలతోపాటు బయ్యారం, గార్ల మండలాల్లోని ప్రత్యక్షంగా 50వేల ఎకరాలు, పరోక్షంగా మరో 50వేల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది. ఎన్నికల హామీగానే.. పాకాల నీటిని ఎత్తిపోసే పథకం ఎన్నికల హామీగానే మిగిలింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే చందూలాల్ ఈ వాగ్దానమే ముందుకు తీసుకొచ్చారు. తర్వాత వరుస ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సీతక్కతోపాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే సీతక్క మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ పథకం కోసం సర్వే చేయించారు. లిఫ్ట్ ద్వారా పదికిలో మీటర్ల మేరకు భూగర్భ పైపులైన్తో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులతో రూ.300కోట్ల బడ్జెట్తో అంచనాలు వేశారు. అయితే రెండేళ్లు అయినా దీనిపై మళ్లీ మాట్లాడడం లేదు. ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.. పాకాల చెరువు నుంచి కొత్తగూడ, గంగారం మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం సర్వే చేయించాం. పరిపాలనా అనుమతులు, బడ్జెట్ కేటాయింపులు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. ఎన్నికల హామీగానే గోదావరి జలాల తరలింపు పాకాల చెరువు నుంచి ఎత్తిపోయాలని రైతుల డిమాండ్ పందిపంపుల వాగులోకి లిఫ్ట్ చేస్తే బయ్యారం చెరువుకు జలకళ లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం -
తప్పు చేస్తే శిక్ష తప్పదు
దంతాలపల్లి: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తప్పు చేస్తే శిక్ష తప్పదని సీడీపీఓ ఎల్లమ్మ అన్నారు. మండలంలోని దొనకొండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, శిశువుల తల్లులతో వాగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇస్తున్నారా.. ప్రతీ నెల శిశువు బరువు చూస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తుల వాగ్మూలం ప్రకారం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవుల శావణి, ఏసీసీడీపీఓ తేజాకల్యాణి, సూపర్వైజర్ శ్రీలత, ఉపసర్పంచ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ: జిల్లాలో లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పోలీస్శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రత, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన ప్రతీ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస, లైంగిక దాడులు, సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత మహిళలకు చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్, వైద్య సేవలు, పునరావాసం వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పలువురు బాధిత మహిళల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మహిళా కమిషన్ సెక్రటరీ ప ద్మజారమణ, రెవెన్యూ అదనపు కలెక్టర్, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, జిల్లా న్యాయ సేవల సంస్థ, ‘షీ’ టీమ్స్, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, పోలీస్శాఖ అధికారులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర తనిఖీలకు పోలీసులకు ఆదేశం -
గోడ కూలి వృద్ధురాలి మృతి
● పున్నేలులో ఘటన ఐనవోలు: ప్రమాదవశాత్తు ప్రహరీ (గోడ) కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడికందుల లక్ష్మీకాంతం(60) రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కులవృత్తిలో భాగంగా అదే గ్రామంలో గండి సదానందం ఇటీవల మృతి చెందగా వారి ఇంట్లో ఐదోరోజు కార్యక్రమానికి గురువారం కూలీకి పని వెళ్లింది. సదానందం ఇంటి ఎదుట పని చేస్తుండగా పక్కన ఉండే కత్తి కృష్ణమూర్తి ఇంటి ప్రహరీ కూలి లక్ష్మీకాంతంపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కోడలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్.. మృతురాలికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబీలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్ షేక్ ఉస్మాన్ అలీ, మాజీ సర్పంచ్ కత్తి దేవేందర్ ఉన్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య రఘునాథపల్లి: మద్యానికి బానిసైన రిటైర్డ్ రైల్వే ఉ ద్యోగి క్షణికావేశంలో గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి యాదగిరి (70) రైల్వేశాఖలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సరైన ఉపాధి లేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కనకలక్ష్మితో తరచూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడు. ఈ నెల 5న మరోసారి భార్యతో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగాడు. అనంతరం క్షణికావేశానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. -
భావజాల వ్యాప్తితో ఉద్యమం బలోపేతం
హన్మకొండ: తెలంగాణకు జరుగుతున్న న ష్టం, అన్యాయాన్ని భావజాల వ్యాప్తితో ప్ర జల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతమైందని, భావజాల వ్యాప్తికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎనలేని కృషి చేశారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, మధుసూదన్, సి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చెక్కు అందజేతవిద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి టీజీ ఎన్పీడీసీఎల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ టౌన్ డివిజన్ కాజీపేట సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహస్తూ ఊకంటి ప్రకాశ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా, ఆయన భార్య సంధ్యకు యూనియన్ బ్యాంకు బీమా ద్వారా క్లెయిమ్ రూ.1.05 కోట్లు మంజూరు చేయగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి చెక్కు అందించారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి


