‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి

Feb 14 2026 9:05 AM | Updated on Feb 14 2026 9:05 AM

‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి

‘హరిత’ సేవలు సమర్థవంతంగా నిర్వహించాలి

హన్మకొండ: హరిత కాకతీయ హోటల్‌ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్‌ మేనేజర్‌ కత్తి నాథన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో మేడా రం విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ హరిత కాకతీ య హోటల్‌ సిబ్బంది అందించిన సేవలను మంత్రులు, జి ల్లా కలెక్టర్‌, అధికారులు ప్రశంసించారని తెలిపారు. అతి థులకు సౌకర్యాలు, భోజనం అందించే విషయంలో విజయవంతమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జనరల్‌ మేనేజర్‌ కత్తి నాథన్‌ను జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ కుసు మ సూర్య కిరణ్‌, హరిత కాకతీయ హోటల్‌ హనుకమకొండ మేనేజర్‌ అశోక్‌, ఏఈ విజయ్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ జంగయ్య, చైత న్య, సాంబ శివరెడ్డి, హెడ్‌ కుక్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ

జనరల్‌ మేనేజర్‌ కత్తి నాథన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement