ఏప్రిల్లో రెండో విడుత ఇళ్లు మంజూరు..
పదేళ్లు అధికారంలో ఉన్నవారు కనీసం ఏడాదికి వంద ఇళ్లు కూడా కట్టలేకపోయారు. మొదటి విడుతలో మా ప్రభుత్వం 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఏప్రిల్లో రెండో విడుత మంజూరు, మూడో దశలో ప్రతీ పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. పట్టణాల్లో స్థలాలు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వ్యవసాయ భూముల సర్వే నంబర్లు, సరిహద్దు వివాదాలు, భూములకు పట్టాల సమస్య పరిష్కరిస్తాం.
– పొంగులేటి శ్రీనివాస్రెడ్డి,
రెవెన్యూ శాఖ మంత్రి


