మేడారం రెండోరోజు ఆదాయం రూ.3,54,25,200
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో మేడారం సమ్మక్క సారక్క మహాజాతర హుండీల్లోని కానుకల లెక్కింపు రెండోరోజు కొనసాగింది. శుక్రవారం 160 హుండీల ద్వారా రూ.3,54,25,200 ఆదాయం సమకూరిందని మేడారం జాతర ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇందులో విదేశీ కరెన్సీ రూ.63,436 ఉందని తెలిపారు. రెండురోజుల్లో కలిపి రూ.6,04,53,636 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. ఇప్పటివరకు 285 హుండీల్లోని కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కంబోడియా, నేపాల్, మలేషియా, ఆరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు.
160 హుండీల్లోని కానుకల లెక్కింపు
మేడారం రెండోరోజు ఆదాయం రూ.3,54,25,200


