మున్సిపాలిటీకి భారీగా నిధులు..
భూపాలపల్లి మున్సిపాలిటీకి రెండేళ్లలో రోడ్లు, డ్రెయిజీలు, కమ్యూనిటీహాల్, విద్యాభివృద్ధికి రూ. 200 కోట్లు మంజూరు చేశాం. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరినట్లు.. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. గణపసముద్రం, భీమ్ఘన్పూర్ చెరువు అభివృద్ధి, జూకల్, బూర్నపల్లి వద్ద ఇందిరాసాగర్ చెక్డ్యామ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తాం. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి చుక్క నీరు అందలేదు. సింగరేణి అభివృద్ధిపై సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులతో సమీక్షలు నిర్వహించాం. మెడికల్ బోర్డును ప్రారంభించి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం.
– దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఐటీ శాఖ మంత్రి


