బీసీసీఐ వన్డే టోర్నీలో కృష్ణవేణి ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: ఆదివాసీ మహిళా క్రికెటర్ ప్రతిభకు బీసీసీఐ ఫిదా అయ్యింది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామానికి చెందిన తాటి కృష్ణవేణి జాతీయ స్థాయిలో తన గ్రామ ఖ్యాతిని చాటుతోంది. ఇటీవల వరంగల్ కేంద్రంగా హైదరాబా ద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జిల్లాల మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. వ రంగల్ జట్టు నుంచి ప్రాతి ని థ్యం వహించిన కృష్ణవేణి స్పిన్బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో ప్రతిభ కనబరిచి హెచ్సీఏ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి బీసీసీఐ వన్డే టోర్నమెంట్కు ఎంపికై ంది. జార్ఖండ్లోని రాంచీలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు బీసీసీఐ నిర్వహిస్తున్న వన్డే టోర్నమెంట్లో ప్రతిభ కనబరుస్తూ బెస్ట్ –11 తుది జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం.
బెస్ట్ –11 తుది జట్టులో స్థానం
జాతీయ స్థాయిలో గ్రామఖ్యాతి
చాటుతున్న ఆదివాసీ యువతి


