నవోదయను సందర్శించిన అధికారులు
పీఎంశ్రీ పనులు, నిధుల వినియోగంపై ఆరా
వర్గల్(గజ్వేల్): స్థానిక జవహార్ నవోదయ విద్యాలయాన్ని బుధవారం కేంద్ర అధికారుల బృందం సందర్శించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శైలేంద్రకుమార్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ ఉషారాణి, అకాడమిక్ విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డిలతో కూడిన ఈ బృందం పీఎంశ్రీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, తదితర వాటిని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, మ్యాథ్స్ సర్కిల్స్, సైన్స్ సర్కిల్స్ పరిశీలించారు. బ్యాగ్లెస్ డే తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. నిధుల వినియోగం తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ దాసి రాజేందర్కు పలు సూచనలు చేశారు.


