జన జాతరకు రెడీ
విద్యుత్ దీపాల వెలుగుల్లో ఏడుపాయల
నేటి నుంచి ప్రారంభం ● ముస్తాబైన ఏడుపాయల
పాపన్నపేట(మెదక్): జన జాతరకు ఏడుపాయల ముస్తాబైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జాతరకు సుమారు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సింగూరు నుంచి విడుదల చేసిన నీటితో ఘనపురం ఆనకట్ట కళకళలాడుతోంది. 33 శాఖలకు చెందిన సుమారు 3 వేల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వివిధప్రాంతాల నుంచి 150 బస్సులునడుపుతుంది.
జన జాతరకు రెడీ
జన జాతరకు రెడీ


