అనంతపురం: ఆర్డీటీ మైదానంలో సినీతారల క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ సందడి చేశారు.
నటీనటులను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఫైనల్ పోటీల్లో బ్లూ బ్లాస్టర్ జట్టు, గ్రీన్ గ్లాడియేటర్ జట్లు తలపడ్డాయి.
టాస్ గెలిచిన బ్లూ బ్లాస్టర్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన గ్రీన్ గ్లాడియేటర్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లూ బ్లాస్టర్స్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయకేతనం ఎగరేసింది. విజేత జట్టుకు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్ ట్రోఫీ అందించారు.


