breaking news
cricket
-
అంతా కోహ్లి వల్లే.. రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్
-
రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
-
రెచ్చగొట్టి .. గుర్నూర్ బ్రార్ తిక్క కుదిర్చిన డకెట్
-
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?
-
‘వైభవ్ కోసం అతడిని బలిపశువును చేశారు’
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వైభవ్ సూర్యవంశీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడికి వచ్చిన హైప్ను దృష్టిలో పెట్టుకొని సీనియర్ జట్టుకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు. వైభవ్ చేత అంత త్వరగా అంతర్జాతీయ అరంగేట్రం చేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. కేవలం మీడియా సృష్టించిన హైప్, ప్రజల్లోని ఎమోషన్స్ చూసి సెలెక్టర్లు తొందరపడ్డారని పేర్కొన్నాడు.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అవకాశం లభించని వైభవ్కు ఇంగ్లండ్ పర్యటనలో రెండో టీ20లో అవకాశం దక్కింది. మొదటి మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ను రెండో మ్యాచ్లో పక్కన పెట్టి అతడి స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చారు. అయితే వరుసగా మూడు మ్యాచ్ల్లో వైభవ్ కేవలం 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20 మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి మళ్లీ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ప్రయోగాలపై స్పందించిన వసీం జాఫర్.. అసలు శాంసన్ ఫామ్లో లేడనే బలమైన నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి మార్పులు చేయకూడదని హితవు పలికాడు. సంజు శాంసన్ లాంటి మ్యాచ్ విన్నర్కు జట్టులో క్రమబద్ధమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతనికి ఇంకా చాలా సమయం ఉందని జాఫర్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే ముందే కేవలం టీమ్తో ప్రయాణిస్తూ, వెలుపల నుండి ఆటను గమనిస్తూ అతను ఎంతో నేర్చుకోవచ్చని సూచించాడు. 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన శాంసన్ను కేవలం వైభవ్ కోసం పక్కనబెట్టి అతడిని బలిపశువును చేయడం సరైన చర్య కాదన్నాడు.కేవలం మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో కంగారుగా జట్టులోకి తెచ్చి ఒత్తిడి పెంచడం పద్ధతి కాదన్నాడు. తదుపరి జింబాబ్వే టూర్ కోసం వైభవ్ను ఎంపిక చేసి, కేవలం ఒకే ఫార్మాట్ ఆడే సంజు శాంసన్ను పక్కన పెట్టడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని వసీం జాఫర్ తెలిపాడు.చదవండి: సెమీస్ సమరం.. ఎవరి బలమెంత? -
కోచ్గా గంభీర్ అవుట్.. అదే నిజమైతే టీమిండియానే WORLD NO1
-
వరల్డ్ కప్ హీరోని పక్కన పెడతారా? బుడ్జోడా వెళ్లి IPL ఆడుకో
-
ఇది IPL కాదమ్మా... టీమిండియాపై ఆర్చర్ సెటైర్లు
-
భారత్ కు సవాల్ బుడ్డాడు గెలిపిస్తాడా!
-
రవి బిష్ణోయ్ ఔట్? సంజు ఇన్? మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే!
-
నన్ను మోసం చేశాడు.. పృథ్వీ షా కాబోయే భార్య షాకింగ్ కామెంట్స్..
-
సీవీ మిలింద్ ఆల్రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: టిజి20 లీగ్లో సీవీ మిలింద్ ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఖమ్మం ఏసెస్ జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్పై గెలుపొందింది. మొదట రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ఆదిత్య జవ్వాజి (37 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్లు), ప్రకాశ్ రెడ్డి (25 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఖమ్మం జట్టు సారథి మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులుచేసింది. హిమతేజ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు), మికిల్ జైస్వాల్ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు), మిలింద్ (21 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సత్తాచాటడంతో ఖమ్మం సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్పై గెలుపొందింది. -
15 ఏళ్ల 99 రోజులు..
12 ఏళ్ల 284 రోజుల వయసులో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్... ఈ మైలురాయితోనే అందరి దృష్టినీ ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత భారత సీనియర్ జట్టు ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఈ మధ్య కాలంలో అతను చూపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు, సంచలన ఇన్నింగ్స్లు చర్చనీయాంశంగా నిలిచాయి.తక్కువ వయసుకు సంబంధించి వరుసగా ఎన్నో ఫీట్లు నమోదు చేయడం ఒక ఘనత కాగా... వయసుతో సంబంధం లేకుండా అతని విధ్వంసక బ్యాటింగ్తో ప్రతీసారి అందరినీ అలరించడం వైభవ్ ప్రత్యేకతగా నిలిచింది. అలవోకగా సిక్సర్లు బాదే అతని నైపుణ్యం అందరితో ఔరా అనిపించేలా చేసింది. ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లోనే సెంచరీ సాధించిన (13 ఏళ్ల 187 రోజుల్లో) కొద్ది రోజులకే ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు అతడిని ఎంచుకుంది.2025 ఐపీఎల్లో 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్... తాను ఐపీఎల్లో ఆడిన తొలి బంతినే సిక్స్గా మలచి రాబోయే రోజులపై సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 35 బంతుల్లోనే సెంచరీ బాది సత్తా చూపించాడు.అండర్–19 జట్టు సభ్యుడిగా ఇంగ్లండ్పై 52 బంతుల్లో సెంచరీ, ఆ తర్వాత ఆసియా కప్లో యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు, విజయ్హజారే ట్రోఫీలో 36 బంతుల్లో సెంచరీ, ఇంగ్లండ్పై అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్లో 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175, ఇండియా ‘ఎ’ తరఫున శ్రీలంకపై 29 బంతుల్లో 94 పరుగులు... ఇలా వరుసగా వచ్చిన అద్భుత ప్రదర్శనలు అతని స్థాయిని పెంచుతూ వచ్చాయి. ఇక ఐపీఎల్–2026లో అతని విశ్వరూపం కనిపించింది. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో చేసిన 776 పరుగులు వైభవ్ను శిఖరానికి చేర్చాయి. ఇందులో 63 ఫోర్లు, రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక అప్పటినుంచి అతను భారత జట్టుకు ఆడటమే మిగిలింది అని అందరికీ అర్థమైంది. అంచనాలకు అనుగుణంగా అతనికి అవకాశం దక్కాలని అంతా కోరుకున్నారు. ఐర్లాండ్తో తొలి రెండు మ్యాచ్లకు, ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టి20కి తుది జట్టులో చోటు లభించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎట్టకేలకు అందరూ ఎంతగానో ఎదురు చూసిన క్షణం శనివారం వచి్చంది. ఈ మ్యాచ్లోనూ తనదైన శైలిలో ఆర్చర్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా, టంగ్ బౌలింగ్ మిడ్వికెట్ మీదుగా వైభవ్ కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినా... భారత క్రికెట్లో అతని వైభవానికి పునాది పడినట్లే.'ఆర్చర్ బౌలింగ్లో తాను ఆడిన తొలి బంతినే వైభవ్ సిక్స్ కొట్టాడు. అతని ‘తొలి బంతి’ బాధితుల జాబితాలో ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, లుంగీ ఎన్గిడి, జస్ప్రీత్ బుమ్రాలాంటి స్టార్లు ఉండటం విశేషం.' -
గంభీర్కు గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్! "వైభవ్ను ఆడించండి"
-
ఎన్ని మ్యాచ్లు ఓడినా.. వైభవ్కు అవకాశం లేదా? కోచ్ కామెంట్స్తో హాట్ టాపిక్
-
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
-
ఇతను ఒక కోచేనా?.. Gautam Gambhirపై వైరల్ పోస్టు!
-
LA 2028: టీమిండియా అభిమానులకు శుభవార్త!
‘బ్లాక్ సండే’ ఎఫెక్ట్తో విచారంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్-2028లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది. కాగా దాదాపు శతాబ్దకాలం తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్ను చేరుస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆరు జట్ల చొప్పునఈ క్రమంలో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జట్ల ఎంపిక, అర్హతకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC) తాజాగా విధివిధానాలు రూపొందించినట్లు సమాచారం. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈవెంట్లో పురుషుల, మహిళల క్రికెట్ నుంచి ఆరేసి జట్లు పాల్గొంటాయి.అర్హత ఏమిటి?ఇందులో డిసెంబరు 31, 2026 నాటికి ఉన్న అత్యుత్తమ ర్యాంకింగ్ కలిగిన నాలుగు జట్లను (ఖండాల వారీగా) ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా అత్యుత్తమంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ జట్ల అర్హత లాంఛనమే.ఇక ఆతిథ్య అమెరికా మాత్రం ర్యాంకింగ్స్లో కనీసం టాప్-15లో ఉంటేనే అర్హత సాధిస్తుంది. మిగిలిన ఒక స్థానం కోసం.. టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.పురుషుల క్రికెట్ సంగతి ఇలా ఉంటే.. మహిళల క్రికెట్లో మాత్రం టీ20 ప్రపంచకప్-2026లో ప్రదర్శన ఆధారంగా అర్హ త సాధిస్తాయని తెలుస్తోంది. హయ్యస్ట్ ర్యాంకింగ్ ఉన్న జాతీయ ఒలింపిక్ కమిటీల నుంచి నాలుగు జట్లు అర్హత పొందుతాయి. ఆతిథ్య అమెరికా టాప్-15 ర్యాంకింగ్స్లో ఉంటేనే క్వాలిఫై అవుతుంది. ఇక మరొక్క స్థానం కోసం టాప్-8లో ఉన్న జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి.బ్లాక్ సండేభారత క్రికెట్ చరిత్రలో ఆదివారం (జూన్ 28, 2026) చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియా ఘోర పరాభవం పాలైంది. రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓడి.. సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్ అయింది. తొలిసారి ఐరిష్ జట్టు చేతిలో ఇంతటి ఘోర అవమానం చవిచూసింది.మరోవైపు.. భారత మహిళల జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో.. ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా గత పర్యాయంలోనూ భారత్ సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమైంది. -
తప్పు చేసారు... అదే బుర్డోడిని తీసుకొని ఉంటే ఊదేసేవాడు
-
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
-
JIO హాట్ స్టార్లో రాదు... లైవ్ ఫ్రీ గాఎందులో చూడాలంటే
-
అభిషేక్ అవుట్..? ఐర్లాండ్ తో ప్లేయింగ్ 11 ఇదే
-
ఇప్పట్లో క్రికెట్ కష్టమే గాయంపై షాకింగ్ విషయాలు
-
భారత డ్రెస్సింగ్ రూమ్లోకి వైభవ్కు నో ఎంట్రీ.. కానీ ..!
-
పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్పై మహిళ కేసు
-
టీమిండియా ప్లేయింగ్ 11 చూస్తే.. ఇంగ్లాండ్ వణకాల్సిందే
-
సఫారీల చేతిలో ఓటమి, భారత్ సెమీస్ కు వెళ్లాలంటే..!
-
కానీ వీడు మాత్రం ఫైనల్ అంటే చాలు చెలరేగిపోతాడు
-
TG20 League 2026: అదిరిపోయే ఆరంభం..
-
స్టార్ క్రికెటర్ల వేటకు శ్రీకారం..! హైదరాబాద్ లో క్రికెట్ జాతర
-
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
-
ఐర్లాండ్ టూర్కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు
-
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
-
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్కు తప్పని శిక్ష..
-
కన్నడ బ్యూటీ క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
-
శ్రీలంక ప్లేయర్ ను కొట్టబోయిన వైభవ్
-
IND vs SL : గ్రౌండ్లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక
-
ఏపీఎల్ జిగేల్..! కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి..
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో క్రికెట్ క్రీడాభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026’ రెండో దశ మ్యాచ్లు బుధవారం (జూన్ 17) నుంచి తొలిసారిగా జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. స్థానిక వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు మొత్తం 9 మ్యాచ్లను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్స్ వెలుగుల్లో ఈ టీ–20 పోరు సాగనుండటంతో జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఏసీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్, రికీ భుయ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటడానికి ఇప్పటికే కడపలో అడుగుపెట్టారు.ఏడు జట్ల హోరాహోరీ.. రోజుకు రెండు మ్యాచ్లుఈ టోర్నమెంట్లో 7 జట్లు తలపడనున్నాయి. ప్రతి రోజూ రెండు మ్యాచ్లు జరగనుండగా, మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 2:00 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో హై–వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ను పంచనున్నాయి.ఊరూరా విస్తృత ప్రచారం.. పాఠశాలల ప్లాన్!కడపలో ఏపీఎల్ నిర్వహణపై ఏసీఏ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ టోర్నీ కోసం విడుదల చేసిన ప్రత్యేక సాంగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగ్స్, బెలూన్స్ ద్వారా ఏపీఎల్పై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఈ క్రికెట్ మ్యాచ్లు చూపించాలనుకుంటుండటంతో ఏపీఎల్ పండగలా మారింది.చక్కటి వసతులు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం!కడపలో మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చే క్రీడాభిమానులకు స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతులు సమకూర్చినట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి, జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మునికుమార్రెడ్డి, రెడ్డిప్రసాద్లు తెలిపారు.ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 ప్లేఆఫ్స్ (టాప్–4 స్థానాల) రేసు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా ఏడు జట్ల ప్లేఆఫ్స్ అర్హత అవకాశాలు క్రింది విధంగా ఉన్నాయి. క్యాపిటల్ అమరావతి రాయల్స్/భీమవరం బుల్స్ ఈ రెండు జట్లు తలా 6 పాయింట్లతో టేబుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.అర్హత సమీకరణం: అమరావతి రాయల్స్ ఆడిన 3 మ్యాచ్లూ గెలిచి అజేయంగా ఉంది. వీరు కడప లెగ్లో ఆడబోయే 3 మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ సీటు ఖరారవుతుంది. భీమవరం బు ల్స్ ఒక్క విజయం సాధిస్తే సేఫ్ జోన్లో ఉంటుంది. కాకినాడ కింగ్స్/విజయవాడ సన్షైనర్స్ ఈ రెండు జట్లు తలా 4 మ్యాచ్లు ఆడి, 2 విజయాలతో 4 పాయింట్లు సాధించాయి.అర్హత సమీకరణం: ఈ జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే కడప దశలో వీరు ఆడబోయే రెండు మ్యాచ్లలో కనీసం ఒకటైనా భారీ రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా క్వాలిఫై అవుతారు. సింహాద్రి వైజాగ్ లయన్స్/తుంగభద్ర వారియర్స్ ఈ రెండు జట్లు కేవలం ఒక్కో విజయం (2 పాయింట్లు)తో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి.అర్హత సమీకరణం: వీరికింకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రేసులో నిలవాలంటే కడప గడ్డపై ఆడబోయే 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. నెట్ రన్ రేట్ చాలా మైనస్లో ఉన్నందున భారీ విజయాలు అవసరం.రాయల్స్ ఆఫ్ రాయలసీమఆడిన 3 మ్యాచ్లలోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.అర్హత సమీకరణం: రాయలసీమ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై అద్భుతం జరగాలి. కడపలో వారు ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్లలోనూ భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, విజయవాడ, కాకినాడ జట్లు తమ మిగిలిన మ్యాచ్లలో ఓడిపోవాలని ప్రార్థించాలి.కెప్టెన్: నితీష్ కుమార్ రెడ్డి..ప్రధాన ఆటగాళ్లు: పి.వి.సత్యనారాయణ రాజు, హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కల్లూరు, టి.వి.సాయి శ్రవణ్, మునీష్ వర్మ భూపతిరాజు, బైలపూడి యశ్వంత్, ధీరజ్ కుమార్ మైచర్ల, భువనేశ్వర్ రావు, రవికిరణ్ మోపాడ, వంశీ కృష్ణ తన్నేరు, గిరీష్ కుమార్ రెడ్డి, సతీష్ నోదగాల.కెప్టెన్ : అశ్విన్ హెబ్బార్ప్రధాన ఆటగాళ్లు: జి. సాయి వెంకట సుమిత్, జహీర్ అబ్బాస్, ఎమ్.అభినవ్, ఎ.లలిత్ మోహన్, తేజస్వి పిన్నింటి, విజయ్ ఆకుల.కెప్టెన్: కె.ఎస్.భరత్ప్రధాన ఆటగాళ్లు: పిన్నింటి తప స్వి, గొలమారు మనీష్, మిత్తా లేఖాజ్ రెడ్డి, కె.పి.సాయి రాహు ల్, మిద్దె అంజనేయులు, కె.సుదర్శన్, షేక్ కమరుద్దీన్, అభిషేక్ ఎమ్. రెడ్డి.కెప్టెన్: షేక్ రషీద్ప్రధాన ఆటగాళ్లు: జె. సాకేత్ రామ్, ఎస్.ధ్రువ కుమార్ రెడ్డి, తేజ రెడ్డి ఎర్రగుడి, సాయి పూర్ణ తేజ గరిమెళ్ల, వంశీ కృష్ణ మామిడి, వాసు యెడ్ల, ఎన్. మాధవ్. -
అమ్మ ఫోన్ కాల్.. ప్రెస్ మీట్ను మధ్యలో ఆపేసిన నితీశ్ కుమార్ రెడ్డి
-
పాకిస్తాన్ తో భారత్ ఫైట్.. T20 ప్రపంచ కప్ వేట
-
అన్నను మించిన తమ్ముడు 10ఏళ్లకే బుడోడి తమ్ముడు సెంచరీ
-
క్రికెట్ క్యాచ్తో చిన్నారి ప్రాణాలు కాపాడాడు!
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తూర్పు లండన్లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public. pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026 -
బుడ్జోడికి షాక్ ఐర్లాండ్ సిరీస్ డౌటే
-
భారత్ అండర్–19 క్రికెట్ జట్టులో నల్గొండ కుర్రాడు..
యాదగిరిగుట్ట: భారత్ అండర్ –19 క్రికెట్ జట్టుకు రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు ఉట్కూరి యష్వీర్గౌడ్ ఎంపికయ్యాడు. జూలై 1వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ అండర్ 19 క్రికెట్ టీమ్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో యష్వీర్గౌడ్ ఉన్నాడు.యష్వీర్గౌడ్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అంబర్పేట్లో ఉంటున్నాడు. రెండేళ్లుగా అండర్ –19 హైదరాబాద్ టీమ్లో ఆయన ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో బెంగళూర్లో బీసీసీఐ ఇచ్చిన శిక్షణలో పాల్గొని ఆకర్షించాడు. దీంతో బీసీసీఐ యష్వీర్గౌడ్ను శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్కు బౌలింగ్ ఆల్రౌండర్గా ఎంపిక చేసింది.మరో రెండు రోజుల్లో భారత్ అండర్–19 జట్టుతో కలిసి బెంగళూర్ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తల్లిదండ్రులు ఉట్కూరి రాజ్కుమార్, వాణి, బాబాయ్ దీపక్కుమార్ గురువారం సాక్షికి తెలిపారు. భారత్ అండర్–19 జట్టుకు యష్వీర్ గౌడ్ ఎంపిక కావడం రాజాపేటకే కాదు, తెలంగాణకే గర్వకారణమని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..
-
త్వరలో సిరాజ్ పెళ్ళి..! అమ్మాయి ఈమేనా?
-
India A vs Sri Lanka: మొదటి మ్యాచ్ లో నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ..
-
ఒక్క మ్యాచ్ ఆడకుండానే.. ఇంగ్లాండ్ లో బుడ్డోడి ప్రకంపనలు
-
పాపం.. కారున్నా నడపలేడు బుడ్జోడికి ఎంత కష్టం వచ్చిందో
-
భారత్ కు మరో యువరాజ్ అసలెవరీ మానవ్ సుతార్
-
నేనేమి పాపం చేశాను, రెండు టైటిళ్లు గెలిచినా.. దక్కని చోటు
-
BCCI మాస్టర్ ప్లాన్, వైభవ్ సెలక్షన్కి కారణం అదే
-
సచిన్ రికార్డు బ్రేక్... టీమిండియాలోకి వైభవ్ అయ్యర్కు కెప్టెన్సీ
-
RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!
-
వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!
15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన కనపరిచి.. అందరినీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే.. ఇతడు ఐపీఎల్ కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్స్, స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా సుమారు రూ.7 కోట్ల వరకు ఆర్జించినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులో అతనకి వస్తున్న భారీ ఆదాయానికి పన్నులు ఎవరు కట్టాలి? అనేది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మైనర్ పిల్లల (18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు) ఆదాయానికి డైరెక్ట్ ట్యాక్స్ అంటూ ఉండదు. కాబట్టి.. వీరి ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంగానే పరిగణిస్తారు. పిల్లలు సంపాదించినప్పటికీ.. దానికి సంబంధించిన ట్యాక్స్ తల్లిదండ్రులు చెల్లించాలన్నమాట.సెక్షన్ 99 ప్రకారం (మునుపటి సెక్షన్ 64(1A) స్థానంలో), మైనర్ ఆదాయం.. తల్లిదండ్రులలో ఎవరి మొత్తం ఆదాయం ఎక్కువగా ఉంటుందో, వారి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు. తల్లిదండ్రులు విడిపోయిన సందర్భంలో.. పిల్లలను చూసుకునే తల్లి లేదా దండ్రి ఆదాయంలో అది కలుస్తుంది. దీంతో పిల్లల పేరుతో పెట్టుబడులు పెట్టినా, వాటి ద్వారా వచ్చిన వడ్డీ లేదా ఇతర లాభాలు సాధారణంగా తల్లిదండ్రుల పన్ను పరిధిలోకి వస్తాయి.అయితే.. ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. పిల్లలు తన సొంత ప్రతిభ, నైపుణ్యం, కృషి లేదా ప్రత్యేక జ్ఞానం ద్వారా సంపాదిస్తే, ఆ ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంలో కలపరు. ఈ కారణం చేతనే.. వైభవ్ సూర్యవంశీ వంటి క్రీడాకారుల ఆదాయానికి నేరుగా వారి పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది.ఇదీ చదవండి: బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!ఈ నిబంధన కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా.. యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, బాల నటులు, ఈస్పోర్ట్స్ ప్లేయర్లకు కూడా వర్తిస్తుంది. పిల్ల తన సొంత ప్రతిభతో సంపాదిస్తే.. ఆ ఆదాయం అతని లేదా ఆమె పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది. పిల్లల 18 సంవత్సరాలు పూర్తయితే నియమాలు మారిపోతాయి. అప్పుడు అతను లేదా ఆమె స్వతంత్రంగా పన్ను చెల్లింపుదారుడిగా మారి, తన ఆదాయానికి తానే బాధ్యత వహించాలి. -
ద్రవిడ్ కాదు వైభవ్ సూర్యవంశీని RR లోకి తెచ్చింది ఇతనే
-
పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి
-
కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే
-
బిసీసీఐ మాస్టర్ ప్లాన్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ రెడీ..
-
RCBకి భారీ దెబ్బ టిమ్ డేవిడ్పై సస్పెన్షన్!
-
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన కెరీర్ క్రీడల్లో మాత్రమే కాకుండా.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.➤ఒకటి.. కోహ్లీ విజయానికి కారణం అతని స్థిరత్వం, క్రమశిక్షణ. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు, సంవత్సరాల తరబడి నిరంతర ప్రదర్శనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ఒకేసారి పెద్ద లాభాలు ఆశించడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP) వంటి విధానంతో నిరంతరంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.➤రెండవది, తక్కువ వయస్సులోనే ప్రారంభించడం. కోహ్లీ 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో ప్రవేశించారు. ఇది అతనికి అనుభవం, తప్పిదాల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. పెట్టుబడుల్లో కూడా ముందుగా ప్రారంభిస్తే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు.➤మూడవది, డైవర్సిఫికేషన్ (పెట్టుబడుల విభజన). కోహ్లీ కేవలం ఒక రంగంలోనే కాకుండా స్పోర్ట్స్, టెక్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా షేర్లు, బాండ్లు, బంగారం వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి.➤నాలుగవది, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. క్రికెట్లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కోహ్లీ స్థిరంగా ఆడతాడు. అలాగే మార్కెట్ పతనాలు వచ్చినప్పుడు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.➤చివరగా.. వయస్సు, అవసరాల ప్రకారం వ్యూహం మార్చుకోవడం. కోహ్లీ ఇప్పుడు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా రిటైర్మెంట్ దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.Note: పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన! -
బెంగళూరులో జరగాల్సింది అహ్మదాబాద్ లో ..బాంబు పేల్చిన DK శివకుమార్
-
పాక్ మాజీ కెప్టెన్కు అవమానం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావల్పిండి వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1000వ వన్డేను మధురానుభూతిగా మల్చుకుంది. మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన బాబర్ ఆజంకు అవమానం జరిగింది. పాక్ వెయ్యి వన్డేలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ జట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్) సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజంకు చోటు దక్కలేదు. 1992 వన్డే వరల్డ్కప్ సాధించిన పాక్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ఖాన్ను కెప్టెన్, ఆల్రౌండర్ స్లాట్కు ఎంపిక చేశాడు. ఇక బ్యాటర్గా బాబర్ ఆజం కాకుండా సయీద్ అన్వర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రషీద్ లతీఫ్ను, ఫాస్ట్ బౌలర్ కోటాలో వసీమ్ అక్రమ్ను, స్పిన్నర్ కోటాలో సక్లెయిన్ ముస్తాక్ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థసెంచరీలు సాధించారు. అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 42.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, మార్నస్ లబుషేన్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ! -
సామ్రాజ్యాన్ని కూల్చేసిన గిల్-సుదర్శన్..!
-
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
-
హార్దిక్ కోసం పంత్ బలి
-
వైభవ్ కోసం రాజస్థాన్ మాస్టర్ ప్లానా!?
-
హార్దిక్ పాండ్యా కూడా..!
ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పంత్ బాటలో ముంబై సారథి హార్దిక్ పాండ్యా కూడా నాయకత్వానికి గుడ్బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ‘మానసికంగా తీవ్రంగా అలసిపోయిన’ హార్దిక్ ఈ బాధ్యతల బరువునుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.లక్నో తరహాలోనే ముంబై కూడా 4 మ్యాచ్ల్లో గెలిచి, 10 మ్యాచ్ల్లో ఓడింది. అయితే స్వల్పంగా మెరుగైన రన్రేట్ ఉండటంతో 9వ స్థానంతో ముగించింది. ముంబై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన రోజే తాను కెప్టెన్సీ వదిలేయాలని భావిస్తున్న విషయాన్ని హార్దిక్ టీమ్ యాజమాన్యంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన పాండ్యా గాయం కారణంగా 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని సారథ్యంలో 2024లో చివరి స్థానంలో నిలిచిన ముంబై... గత ఏడాది ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించి మూడో స్థానంతో ముగించింది. -
తనే నా క్వీన్... వైరల్ అవుతున్న వైభవ్ ఓల్డ్ వీడియో
-
వైభవ్ సూర్యవంశీ ఇంస్టాగ్రామ్ స్టోరీ వైరల్
-
వైభవ్ దెబ్బకు కంటతడి పెట్టుకున్న కావ్యపాప
-
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య తొలి టి20
చెమ్స్ఫోర్డ్: టి20 వరల్డ్ కప్కు ముందు సన్నాహకంగా ఇంగ్లండ్తోనే 3 టి20 మ్యాచ్ల సిరీస్కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో ఇంగ్లండ్తో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది.ప్రస్తుతం వన్డే వరల్డ్ చాంపియన్ అయిన మన జట్టు టి20ల్లో కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై మ్యాచ్ ప్రాక్టీస్ కీలకం కానుంది. ఏడాది క్రితం ఇక్కడే ఇంగ్లండ్పై భారత్ టి20 సిరీస్ నెగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా, రిచా దూకుడుగా ఆడటంపై జట్టు విజయావకాశాలు ఉన్నాయి.బౌలింగ్లో రేణుకా సింగ్, క్రాంతి, అరుంధతి రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా, శ్రీచరణిపై స్పిన్ భారం నిలిచింది. కెపె్టన్ చార్లీ డీన్తో పాటు సీనియర్లు సోఫియా డంక్లీ, హీతర్ నైట్, ఎమీ జోన్స్, సోఫీ ఎకెల్స్టోన్ల ప్రదర్శనపై ఇంగ్లండ్ ఆధారపడుతోంది. మరో 9 పరుగులు సాధిస్తే హర్మన్ప్రీత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటుంది. -
ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు.ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్) -
ఎక్స్ ట్రా ప్లేయర్ గా వచ్చి.. RCB రూపురేఖలు మార్చేసిన పటీదార్ కథ ..
-
తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)
-
IPL వెలుగులో బెట్టింగ్ ‘చీకటి ఆట’!
ఐపీఎల్ (IPL) సీజన్ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్ఫారమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్సైట్లు, మనీ లాండరింగ్ నెట్వర్క్ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లను గుర్తించిన క్లౌడ్సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్సైట్ డొమైన్లు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ గుర్తించింది.ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్ఫారమ్ అడ్మిన్ ప్యానెల్ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్డ్రా రిక్వెస్ట్లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.రూ. 4.65 కోట్ల విత్డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్ఫారమ్లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్డ్రా రిక్వెస్ట్లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.మనీ మ్యూల్ నెట్వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.క్రికెటర్ల పేరిట డీప్ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్లను ఏఐ (AI) డీప్ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కోట్ల మంది హృదయాలను కదిలించిన డెలివరీ బాయ్
-
పాకిస్తాన్ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్ అడుగులు
సిల్హెట్: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్... రెండో మ్యాచ్లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. సల్మాన్ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (134 బంతుల్లో 75 బ్యాటింగ్; 8 ఫోర్లు), కెపె్టన్ షాన్ మసూద్ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షాన్ మసూద్ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అవుట్ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్ షకీల్ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్ చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్ 296/5తో మ్యాచ్ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చివర్లో సల్మాన్తో పాటు హసన్ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్తో పాటు సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4, నహీద్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్... పాక్ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది. -
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత!
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్గా గుర్తింపు పొందిన మైక్స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 1958లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 50 మ్యాచ్ల్లో 2,278 పరుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లో 637 మ్యాచ్లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. అంతేకాదు 1991 నుంచి 2003 మధ్య వార్విక్షైర్ కౌంటీ బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. ఆయన పదవిలో ఉన్న సమయంలోనే వార్విక్షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. క్రికెటర్గానే గాక రగ్బీ ప్లేయర్గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 1956లో వేల్స్తో జరిగిన రగ్బీ మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మరణంపై వార్విక్షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా గ్లామోర్గాన్తో మ్యాచ్కు ముందు వార్విక్షైర్ మైక్ స్మిత్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.చదవండి: బంగ్లా బ్యాటర్ చరిత్ర.. పాక్కు క్లీన్స్వీప్ గండం! -
RCBతో ఓటమి కన్నీళ్లు పెట్టుకున్న పాంటింగ్
-
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
-
తెలంగాణ క్రికెట్లో కొత్త శకం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీఎల్ వివరాలను వెల్లడించారు. హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. -
గిట్టుబాటు కాదనే.. స్టేడియం మార్పు
శివాజీనగర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. అది వర్క్ఔట్ కాదని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఐపీఎల్ ఫైనల్స్ను గుజరాత్లోని అహ్మదాబాద్కు మార్చడంపై గురువారం నగరంలో స్పందిస్తూ, మ్యాచ్కు భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికి 5 మ్యాచ్లు ఇక్కడ జరిగాయని చెప్పారు. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది. 25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసిందన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. వినతి మేరకు సస్పెన్షన్ రద్దు ఐపీఎస్ రామచంద్రరావు సస్పెన్షన్ రద్దుపై స్పందిస్తూ, సీఎం అనుమతి తీసుకొని రద్దు చేశారు, ఈ నెలాఖరులో ఆయన రిటైరవుతారు, పెన్షన్ సెటిల్మెంటు తదితరాలు ఉన్నాయని, సస్పెన్షన్ ఎత్తేయాలని రామచంద్రరావు సీఎంకు విన్నవించారు, కావాలంటే తరువాత విచారణను కొనసాగించవచ్చని అభ్యరి్థంచారు అని తెలిపారు. -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీ.. లక్ష్యానికి చేరువగా కేకేఆర్ఐపీఎల్ 19వ సీజన్లో ఫిన్ అలెన్ తొలిసారి తన ప్రభావం చూపిస్తుండడంతో కేకేఆర్ లక్ష్యానికి చేరువగా వస్తోంది.143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (61), గ్రీన్ (29) పరుగులతో ఆడుతున్నారు.ఏడు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (32), కామెరున్ గ్రీన్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్పటేల్ బౌలింగ్లో అంగ్క్రిష్ రఘువంశీ (1) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అంతకముందు 13 పరుగులు చేసిన కెప్టెన్ రహానే రనౌటయ్యాడు. 4 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.కేకేఆర్ లక్ష్యం 143 పరుగులు..కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅక్షర్ పటేల్ (11) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ 128 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.18 ఓవర్లలో ఢిల్లీ 126/518 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అశుతోశ్ శర్మ (28), అక్షర్ పటేల్ (10) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లుపదో ఓవర్ రెండో బంతికి నిస్సాంకను అవుట్ చేసిన అనుకుల్ రాయ్.. ఐదో బంతికి స్టబ్స్(2)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది.నాలుగో వికెట్ డౌన్10.2అనుకుల్ రాయ్ బౌలింగ్లో నిస్సాంక స్టంపౌట్. 29 బంతుల్లో 50 పరుగుల చేసి నిష్క్రమించిన నిస్సాంక. క్రీజులోకి అక్షర్ పటేల్. ఢిల్లీ స్కోరు: 89-4(10.4). స్టబ్స్ రెండు పరుగులతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీసునిల్ నరైన్ బౌలింగ్లో రోవ్మన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి అవుటైన సమీర్ రిజ్వి (3). క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ స్కోరు: 80-3 (10).రెండో వికెట్ డౌన్8 పరుగులు చేసిన నితీశ్ రానా కామెరున్ గ్రీన్ బౌలింగ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 74 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నిస్సాంక 43 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (23) రూపంలో తొలి వికెట్ వికెట్ కోల్పోయింది. కార్తిక్ త్యాగి బౌలింగ్లో భారీ షాట్ ఆడే యత్నంలో బ్యాట్ ఎడ్జ్కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్లో ఉన్న కామెరున్ గ్రీన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. నిస్సాంక 31 పరుగులతో ఆడుతున్నాడు.4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. నిస్సాంక (25) పరుగులతో ధాటిగా ఆడుతుండగా, కేఎల్ రాహుల్ (14) అతడికి సహకరిస్తున్నాడు.టాస్ నెగ్గిన కేకేఆర్టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పు లేకుండానే మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 19 సార్లు, 15 సార్లు కేకేఆర్ గెలిచింది. ఇక అరుణ్జైట్లీ స్టేడియంలో కేకేఆర్ 6 సార్లు, ఢిల్లీ 5 సార్లు విజయం సాధించాయి.తుది జట్లు:కోల్కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్కోల్కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్లు: రమణదీప్ సింగ్, ఫిన్ అలెన్, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్లు: కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్🚨Toss update from Delhi🚨@kkriders won the toss and elected to bowl first against @DelhiCapitals Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/Nd38qv8r3f— IndianPremierLeague (@IPL) May 8, 2026 -
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్ 2, 4 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్ సిరీస్ ఐపీఎల్ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్కు ముందు టీ20 సిరీస్ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్కు ముందు కూడా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కోసం పాక్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్ సిరీస్ప్రస్తుతం పాక్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ సిల్హెట్ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరీస్లు జరుగనున్నాయి. -
వాడికి 50 కోట్లు ఇస్తే వంటిచెతొ గెలిపిస్తాడు, పంత్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫాన్స్
-
సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
-
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
-
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
-
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
-
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
-
వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్’!
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడలు నేర్చుకోవడానికి హైదరాబాద్లో సమ్మర్ క్యాంపుల బాటపట్టే విద్యార్థులపై జీహెచ్ఎంసీ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొ రేషన్లు చార్జీల భారం మోపాయి. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని స్టేడియాలు, ప్లేగ్రౌండ్లలో సమ్మర్ కోచింగ్లకు యూజర్ ఫీజులు పెంచాయి. గతంలో బేస్బాల్, బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ వంటివి ఆడుకోవడానికి రూ. 50గా ఉన్న నెలవారీ ఫీజును రూ. 200 చేశాయి. సైక్లింగ్, క్యారమ్స్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, క్రికెట్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, టెన్నికాయిట్ తదితర ఇన్డోర్/ఔట్డోర్ గేమ్స్పైనా ఫీజులు పెంచాయి.క్రికెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 400కు పెంచగా జిమ్ ఫీజు రూ. 200 నుంచి రూ. 400కు, లాన్ టెన్నిస్ (క్లే) ఫీజు రూ. 450 నుంచి రూ. 1,500కు పెంచేశాయి. వాటన్నింటికీ ఏడాదికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీలు ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపాయి. అయితే సమ్మర్ క్యాంపుల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇచ్చాయి. పాఠశాల విద్యార్థులకూ భారం: పాఠశాలల విద్యార్థులు ప్లేగ్రౌండ్లు బుక్ చేసుకోవడంపైనా ఫీజుల భారం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,000కి పెరగడంతోపాటు విస్తీర్ణాన్ని బట్టి గ్రౌండ్ల ఫీజులు పెరిగాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లేగ్రౌండ్ను ఒక విద్యా సంవత్సరంలో 11 నెలల్లో 75 గంటలపాటు వినియోగించుకోవడానికి రూ. 10 వేలుగా ఉన్న ఫీజును మూడు రేట్లతో రూ. 15 వేలు చేశారు. అదే గ్రౌండ్ను 150 గంటలు వాడేందుకు రూ. 20 వేలుగా ఉన్న ఫీజును రూ. 30 వేలకు పెంచారు.వెయ్యి చదరపు మీటర్ల గ్రౌండ్ను 11 నెలల్లో 150 గంటలు వాడుకోవడానికి రూ. 40 వేలుగా ఉన్న ఫీజును రూ. 60 వేలు చేశారు. మరోవైపు వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకపూట ఆయా గ్రౌండ్లను వినియోగించుకునేందుకు ప్రస్తుతమున్న రూ. 4 వేల ఫీజును రూ. 6 వేలకు, రోజు ఫీజు (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) రూ. 7,500 నుంచి రూ. 11,000కు పెంచారు. వాలీబాల్ కోర్టు ఒకపూట ఫీజును రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, క్రికెట్ నెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 200కు, బాస్కెట్బాల్ కోర్టు రోజు ఫీజును రూ. 7500 నుంచి రూ. 11,000కు పెంచారు. -
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
-
చితక్కొట్టిన సన్ రైజర్స్
-
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
-
IPLల్లో ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
-
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
-
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
-
నైట్రైడర్స్ ‘హోం’లో ఒలింపిక్స్
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్లో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ పునరాగమనం చేస్తుండగా ఇప్పుడు ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్లు నిర్వహించే ప్రధాన వేదిక ఖరారైంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ‘పొమోనా’లో కొత్తగా నిర్మిస్తున్న మైదానాన్ని క్రికెట్ ప్రధాన వేదికగా నిర్ణయించారు. ఈ మైదానం ఐపీఎల్ టీమ్ కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యానికి చెందినది కావడం విశేషం. అమెరికాలో 2023 సీజన్ నుంచి నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో లాస్ ఏంజెలిస్ నైట్రైడర్స్ జట్టు కూడా ఉంది. ఈ టోర్నీలో తమ ‘హోం’ గ్రౌండ్ కోసం నైట్రైడర్స్ ఈ స్టేడియాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వచ్చే రెండేళ్లలో మైదానం నిర్మాణం పూర్తి చేసుకొని ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో క్రికెట్ పురోగతి కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా అన్నారు. ‘అంతర్జాతీయ క్రీడగా క్రికెట్ విస్తరించే క్రమంలో ఇది మరో కొత్త మలుపు. ఒలింపిక్స్లో పాల్గొని ఆట స్థాయిని పెంచడమే మా లక్ష్యం. ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనానికి సంబంధించి ఈ స్టేడియం నిర్మాణం కొత్త మైలురాయి. ఒలింపిక్స్లో ఈ మైదానం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మా విశ్వాసం’ అని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా, నైట్రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్, పొమోనా నగర మేయర్ టిమ్ సాండోవల్ పాల్గొన్నారు. -
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
-
అభిషేక్ విధ్వంసం.. సెంచరీతో ఉప్పల్లో ఉప్పెన!
ఐపీఎల్లో అభిషేక్ మళ్లీ విధ్వంసం సృష్టించాడు. తనకే సాధ్యమైన రీతిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను సెంచరీతో ఉప్పల్ మైదానంలో ఉప్పెన సృష్టించాడు. బౌండరీలతోనే సరిగ్గా 100 పరుగులు రాబట్టిన అభిషేక్కు క్లాసెన్, ఇషాన్ కిషన్, హెడ్ కూడా అండగా నిలవడంతో హైదరాబాద్ భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం రైజర్స్కు సరితూగలేకపోయింది. ఏ దశలోనూ కావాల్సిన దూకుడును ప్రదర్శించని క్యాపిటల్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. సమష్టి బౌలింగ్తో రైజర్స్ ఢిల్లీని పడగొట్టి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రైజర్స్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్లు) ఐపీఎల్లో తన రెండో సెంచరీతో చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులు సాధించింది. నితీశ్ రాణా (30 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా... సమీర్ రిజ్వీ (28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. సన్రైజర్స్ బౌలర్ ఇషాన్ మలింగకు 4 వికెట్లు దక్కాయి. THE HUNDRED CELEBRATION BY ABHISHEK SHARMA. 🔥- Proud father and Kavya Maran cheering. ❤️ pic.twitter.com/pbBYLZViiL— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2026భారీ భాగస్వామ్యాలు... తొలి నాలుగు ఓవర్లలో 6 ఫోర్లతో 36 పరుగులు రాబట్టిన రైజర్స్ ఇన్నింగ్స్ నితీశ్ రాణా వేసిన ఐదో ఓవర్తో ఊపందుకుంది. ఈ ఓవర్లో అభిషేక్, హెడ్ కలిసి 3 సిక్స్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్ప్లేలో టీమ్ 67 పరుగులు సాధించింది. అనంతరం 25 బంతుల్లో అభిõÙక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, అక్షర్ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి హెడ్ వెనుదిరిగాడు. అయితే మరోవైపు అభిషేక్ దూకుడు కొనసాగగా, ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన ధాటిని ప్రదర్శించాడు. వీరిద్దరు కలిసి కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 22 పరుగులు రాబట్టారు. 86 పరుగుల వద్ద డీప్ బ్యాక్వర్డ్లెగ్లో రాణా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ శర్మ... రాణా ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్లో దురదృష్టవశాత్తూ రిటర్న్లో బౌలర్ చేతికి తగిలిన బంతి నాన్స్ట్రయికింగ్ స్టంప్స్ను పడగొట్టడంతో కిషన్ రనౌటయ్యాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో అభిషేక్ ను ఆపడంలో ఢిల్లీ సఫలం అయింది. ఈ 30 బంతుల్లో 17 బంతులు ఆడిన అభిషేక్ 2 ఫోర్లతో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఉన్న క్లాసెన్ మాత్రం తనదైన శైలిలో చెలరేగడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఎన్గిడి ఓవర్లో రెండు వరుస సిక్స్లు కొట్టిన అతను... ముకేశ్ వేసిన చివరి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మిల్లర్ విఫలం... ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అడుగు పెట్టిన పేసర్ మదుషంక చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. తన 3 ఓవర్ల తొలి స్పెల్లో 24 పరుగులే ఇచి్చన అతను నిసాంక (8) వికెట్ తీశాడు. మరోవైపు నితీశ్ రెడ్డి వేసిన రెండు ఓవర్లలో రాణా, రాహుల్ కలిసి 2 సిక్స్లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 59 పరుగులకు చేరింది. శివాంగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాణా 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్ను సాకిబ్ వెనక్కి పంపించగా, తర్వాతి ఓవర్లో మలింగ వరుస బంతుల్లో రాణా, మిల్లర్ (0)లను అవుట్ చేయడంతో రైజర్స్ పైచేయి సాధించింది. ఆ తర్వాత రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి పోరాడినా లాభం లేకపోయింది. 26 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన దశలో స్టబ్స్ అవుట్ కావడంతో ఢిల్లీ గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలుసన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 135; హెడ్ (సి) రిజ్వీ (బి) అక్షర్ 37; ఇషాన్ కిషన్ (రనౌట్) 25; క్లాసెన్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–97, 2–176. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–53–0, నితీశ్ రాణా 4–0–55–0, ఎన్గిడి 4–0–41–0, అక్షర్ పటేల్ 2–0–23–1, కుల్దీప్ 2–0–30–0, నటరాజన్ 4–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) (సబ్) లివింగ్స్టోన్ (బి) మదుషంక 8; రాహుల్ (సి) అభిషేక్ (బి) సాకిబ్ 37; నితీశ్ రాణా (సి) అభిషేక్ (బి) మలింగ 57; రిజ్వీ (సి) మదుషంక (బి) దూబే 41; మిల్లర్ (బి) మలింగ 0; స్టబ్స్ (సి) సాకిబ్ (బి) మలింగ 27; అశుతోష్ (సి) అనికేత్ (బి) మలింగ 14; అక్షర్ (సి) నితీశ్ (బి) దూబే 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) మదుషంక (బి) దూబే 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–21, 2–107, 3–107, 4–107, 5–166, 6–186, 7–192, 8–195, 9–195. బౌలింగ్: మదుషంక 4–0–36–1, నితీశ్ రెడ్డి 4–0–57–0, ఇషాన్ మలింగ 4–0–32–4, సాకిబ్ 4–0–29–1, శివాంగ్ 2–0–28–0, హర్‡్ష దూబే 2–0–12–3. -
పిచ్చి కూతలు కూసారు.. పిక్చర్ చూపించాడు.. తెలుగోడి విశ్వరూపం
-
నిమ్మకాయలకు వికెట్లు IPLలో బ్లాక్ మ్యాజిక్
-
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
-
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్కు చుక్కలు
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్లోనూ ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ (సీఎస్కే) ఆర్సీబీతో మ్యాచ్లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్తో మ్యాచ్లో 32 పరుగులు సమర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్లు జారవిడవడం మా కొంపముంచింది’ -
తెలుగు మాస్ సాంగ్తో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం.. వీడియో వైరల్
ఐపీఎల్ సందడి మామూలుగా ఉండదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే తెలుగువారికి పూనకాలే. అది కూడా హైదరాబాద్లో మ్యాచ్ జరిగితే ఆ జోష్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని ఉన్న సీఎస్కే టీమ్తో మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్. ఈ క్రేజీ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే తలపడగా.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే ఈ మ్యాచ్లో తెలుగు సాంగ్స్ క్రికెట్ ప్రియులను ఊర్రూతలుగించాయి. ముఖ్యంగా నాని మూవీ ప్యారడైజ్ సాంగ్ స్డేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్ మధ్యలో పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ అనే పాటను ప్లే చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్కు ఏకంగా పూనకాలతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ప్యారడైజ్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉప్పల్ రోర్స్ విత్ ఆయా షేర్ మానియా అంటూ వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో కేవలం తెలుగులోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. కాగా.. నాని హీరోగా వస్తోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సూపర్హిట్గా నిలిచింది. మరోసారి వీరిద్దరు కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. Nannu peekuthava...Jumbalikay aayasher 💥💥Uppal Stadium roars with #AayaSher mania🧡 pic.twitter.com/T9WIePBKzN— THE PARADISE (@TheParadiseOffl) April 18, 2026 -
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
-
వైభవ్ సేఫ్.. రోమి భిందర్కు బీసీసీఐ షాక్!
రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రోమి భిందర్కు రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అతడిపై నిషేధం కూడా పడుతుందని వార్తలు వచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం రోమి భిందర్కు జరిమానాతో సరిపెట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఐపీఎల్లో జట్టు మేనేజర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగిం చడానికి అనుమతి ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగే సమయంలో ఫోన్ వాడడం నిషేధమని ఆయన తెలిపారు. అయితే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు మాత్రం జట్టు మేనేజర్లు ఫోన్ వాడేందుకు అనుమతి ఉందన్నారు. ఈ విషయంలో రోమి భిందర్కు షోకాస్ నోటీసు కూడా జారీ చేశామని, కానీ నోటీసుపై అతడు ఇచ్చిన వివరణపై యాంటీ కరప్షన్ యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అయితే రోమి భిందర్కు మొదటి ఉల్లంఘన కాబట్టి, నిబంధనల ప్రకారం అతడికి రూ. లక్ష జరిమానాతో సరిపెడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ గుణపాఠంగా తీసుకోవాలని, ఆట దెబ్బతినకుండా ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రోమి భిందర్ డగౌట్లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే కూర్చొని ఫోన్ చూడడం వివాదానికి దారి తీసింది. అయితే ఈ చర్యతో వైభవ్ సూర్యవంశీకి సంబంధం లేకపోవడంతో, అతడిని కేవలం హెచ్చరికతోనే సరిపెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్కు సన్రైజర్స్ బ్రేకులు వేసింది. మ్యాచ్లో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను ఆదివారం కేకేఆర్తో ఆడనుంది.చదవండి: ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే తక్కువ! -
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
-
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
-
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
-
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
-
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్వుడ్ దెబ్బకి కన్నీళ్లు
-
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
-
వైభవ్ సూర్యవంశీ 'గోల్డెన్ డక్'.. కావ్యపాప కాంతార సెలబ్రేషన్స్
-
ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై
-
హీరో నుంచి జీరో, బొక్క బోర్ల పడ్డ బుడోడు....
-
అదరగొట్టిన SRH వైభవ్ డకౌట్...
-
ఎవడైతే నాకేంటి .. I DONT CARE
-
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
-
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
-
రనౌట్ వివాదం : అంపైర్ను పొడిచి చంపేశాడు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లో రనౌట్ నిర్ణయం అంపైర్ ప్రాణం తీసింది. స్థానిక మ్యాచ్లో 21 ఏళ్ల క్రికెట్ అంపైర్ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించాడు అజిత్. ఇందులో భాగంగా అఇత్ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో 26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత, మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండిగాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్ సోదరుడు వాపోయాడు. కిషోర్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. -
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
-
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
-
ప్రాణం తీసిన క్రికెట్ పథకం ప్రకారం దాడి
-
యువకుడి ప్రాణం తీసిన క్రికెట్
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో క్రికెట్ ఆట విషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. జరిగిన ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. -
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!
-
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
-
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
-
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
-
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
-
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
-
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
-
ఐపీఎల్ ఫీవర్ మొదలు.. హైదరాబాద్లో స్క్రీనింగ్ల సందడి!
సాక్షి, హైదరాబాద్: ధనాధన్ క్రికెట్ ఫీవర్ మరోసారి సిటీజనుల్ని చుట్టుముట్టనుంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ కోసం నగర వ్యాప్తంగా వేదికలు సిద్ధమయ్యాయి. ఒంటరిగా, స్నేహితులతో, సన్నిహితులతో కలిసి, బృందాలుగా వీక్షించేవారి అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారీ స్క్రీన్స్ ప్రధాన ఆకర్షణగా, డీజే సంగీతం, రుచికరమైన వంటకాలు, సర్ప్రైజ్ గిఫ్టులు వంటివి జతగా ఈ వేదికలు క్రికెట్ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి. బెంగళూరు పంథాలో.. నగరంలో ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యక్ష ప్రసారాలను అందించడానికి సిద్ధమయ్యాయి. వీటిలో భారీ స్క్రీన్లు, ప్రత్యేక మెనూలు ముఖ్యమైన మ్యాచ్లు ఉన్న రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. బెంగళూర్లో అండర్డాగ్స్ వైట్ ఫీల్డ్ పేరుతో ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఉంది. అది స్టేడియం తరహా వాతావరణం హై క్వాలిటీ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్తో అలరిస్తోంది. అదే పంథాలో నగరంలోనూ పలు వేదికలు, పార్టీ ప్లేస్లు.. క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొండల్లో సందళ్లు.. ఐపీఎల్ స్క్రీనింగ్కు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పలు వేదికలు పేరొందాయి. జూబ్లీహిల్స్లోని ఎయిర్ లైవ్ 2 భారీ స్క్రీన్స్కి ఫేమస్. ఇక ప్రోస్ట్ బ్రూ పబ్ పెద్ద స్క్రీన్లతో కూడిన ఒక ప్రసిద్ధ వేదిక. అలాగే జీరో 40 బ్రూవింగ్ ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. సందడిగా, ఆకర్షణీయంగా ఉండే సెట్టింగ్కు ప్రసిద్ధి చెందిన ఫర్జీ కేఫ్, హై లైఫ్ బ్రూవింగ్ కంపెనీ కూడా భారీ స్క్రీన్లకు ప్రసిద్ధి చెందింది. హ్యాపీ అవర్స్ పేరిట స్పెషల్ ఆఫర్లు అందించే అమ్నీసియా స్కై బార్ ఓపెన్ వాతావరణంలో వీక్షించాలనుకునేవారికి మంచి ఎంపిక. హైటెక్ సిటీలో.. క్రికెట్ సిరి.. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో... సత్వా నాలెడ్జ్ సిటీ జెడ్ భారీ స్థాయి స్క్రీనింగ్లను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతంలోని రష్ స్పోర్ట్స్ కేఫ్..క్రీడా పోటీల వీక్షణకు ప్రత్యేకంగా పేరొందింది. ఇంటరాక్టివ్ గేమింగ్, మ్యాచ్ వీక్షణ అనుభవాన్ని అందించేందుకు ఇనార్బిట్ మాల్లోని స్మాష్ సిద్ధమైంది. గోవా వంటకాలకు పేరొందిన ది ఫిషర్ మ్యాన్స్ వాఫ్స్, బ్రాడ్ వే, గచ్చి»ౌలిలోని ఎల్స్ వేర్ లాంజ్, టికి షాక్ మరెన్నో ప్లేసెస్ ఆట చూడడాన్ని అపూర్వ అనుభవంగా మార్చేందుకు రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ కూడా జిందాబాద్.. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎట్ ది బార్ నెక్ట్స్ డోర్ ఎస్ఎల్ఎన్ టెరి్మనస్లోని 10 డౌనింగ్ స్ట్రీట్, కొంపల్లిలోని ఓల్డ్ ట్రీస్ కేఫ్, ఆర్ అడ్డాలు లార్జ్ స్క్రీన్స్కు చిరునామాగా నిలుస్తున్నాయి. ఎల్బీనగర్లోని నార్ఫెస్ట్ ది దాబా వంటివి మేము సైతం అంటూ సిద్ధమయ్యాయి. ఇవి కాకుండా నగరం చుట్టుపక్కల ఫార్మ్ హౌజ్లు రిసార్ట్స్ కూడా ప్రత్యేక స్క్రీనింగ్స్తో ఆహా్వనిస్తున్నాయి. మొయినాబాద్లోని ఆయనా రిసార్ట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ ఉన్న రోజున ముందస్తు బుకింగ్స్ అవసరం అని గత అనుభవాలు చెబుతున్నాయి. -
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్షిప్ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
-
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
-
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
-
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
-
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
-
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
-
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
-
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
-
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
-
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
-
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
-
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
-
గెలవాలంటే ఆ మ్యాచ్ విన్నర్ ని దింపాల్సిందే.. ఒక్కడు చాలు...
-
సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు


