breaking news
cricket
-
గెలవాలంటే ఆ మ్యాచ్ విన్నర్ ని దింపాల్సిందే.. ఒక్కడు చాలు...
-
సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు
-
సంజూ తలరాత మార్చేసిన మ్యాచ్ ఇది... ఇంగ్లాండ్కి అంత సీన్ లేదు.. కానీ..!
-
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
-
శిఖర్ ధావన్ -సోఫీ షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది. అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్ అయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్నిప్రారంభించబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్) తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial)తన ఇన్స్టా హ్యాండిల్లో శిఖర్ ధావన్ సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో కళకళలాడింది. ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 19న వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం వెడ్డింగ్డేట్పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ నైట్ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఎవరీ సోఫీ షైన్సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ. సోఫీ ఐర్లాండ్లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో పనిచేసింది. అనంతరం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో చేరింది.దుబాయ్లోని ఒక రెస్టారెంట్లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్తో సన్నిహితంగా కనిపించినప్పుడు వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.కాగా శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. -
కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?
-
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
-
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
-
పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం లోకేష్ క్రికెట్ మ్యాచ్ ఖర్చు కోటి పైనే
-
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
-
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
-
వైభవ్ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్
‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్కు వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెప్టెన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోర్నిలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. -
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
-
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
-
ఇంగ్లండ్ ‘క్లీన్స్వీప్’
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్ను ‘క్లీన్ స్వీప్’ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... టి20 సిరీస్ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్ కరన్ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో రాణించగా... జోస్ బట్లర్ (25), లియామ్ డాసన్ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (4), బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (7), విల్ జాక్స్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్ మెండిస్ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 4, జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
-
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
-
ఓవర్ టూ గ్రౌండ్.. సినీతారల క్రికెట్ లీగ్ వచ్చేస్తోంది
ప్రతి ఏటా సినిమాలతో మాత్రమే కాదు.. క్రీడలతోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెరపై అలరించిన స్టార్స్ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. సినీ హీరోస్ అంతా అలరించే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది సీజన్తో అభిమానులను అలరించనున్నారు.ఈ ఏడాది సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్లను జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సీజన్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. వైజాగ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ సీజన్లో తెలుగు వారియర్స్ తన తొలి మ్యాచ్ భోజ్పురి దబాంగ్స్తో తలపడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. C-C-L- 2-0-2-6 @ccl @TeluguWarriors1 It’s time for Some Cricket 🏏 VIZAG - 16th JAN 6.30 PM VIZAG - 17th JAN 6.30 PM #Vizag #cricket #thaman #Teluguwarriors #Ccl2026 pic.twitter.com/2doMxidzFD— thaman S (@MusicThaman) January 10, 2026 The countdown begins as the Celebrity Cricket League 2026 takes centre stage from January 16th 🔥🏏Eight teams. Big rivalries. Unmatched Sportainment.🎟️ Book your tickets now and be there from ball one!https://t.co/zCQUwXWpBvhttps://t.co/CnNrNFcwm9@Karbulldozers… pic.twitter.com/r1IQFbK4LO— CCL (@ccl) January 12, 2026 -
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
-
డబ్ల్యూపీఎల్లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం
ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది. -
నలిగిపోతున్న క్రికెట్
దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రీడలు బలి కావడం ఇటీవలికాలంలో ఎక్కువైపోయింది. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య బంధాలు బలపడటానికి దోహదపడతాయి. దురదృష్టవశాత్తు అలా జరగకపోగా, రాజకీయాలకు క్రీడలు బలైపోతున్నాయి. ఈ పోకడ జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో పతాక స్థాయికి చేరింది.తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ బలైపోయింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంపశయ్యపైకెక్కాయి. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలిగించింది. ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడమని భీష్మించుకు కూర్చుంది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి స్వదేశంలో ఐపీఎల్ను బ్యాన్ చేసుకుంది. ఈ చర్య-ప్రతి చర్యల పర్వం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. భారత్-బంగ్లాదేశ్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో క్రికెట్లో చోటు చేసుకున్న ఇలాంటి పరిణామాలపై ఓ లుక్కేద్దాం.భారత్-పాక్ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చేది భారత్-పాక్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోవడానికి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు, రాజకీయాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల చేత 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.భారత్-బంగ్లాదేశ్తాజాగా భారత్-బంగ్లాదేశ్ పరిస్థితి కూడా భారత్-పాక్ తరహాలో మారిపోతుంది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో, ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. వారు భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఓ మెట్టు పైకెక్కి వారి దేశంలో ఐపీఎల్ను కూడా బ్యాన్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇలాగే ఓవరాక్షన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భారత్తో ద్వైపాక్షిక సిరీస్లు జరగడం అసాధ్యం.దీని వల్ల భారత్కు ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేదంతా బంగ్లాదేశే. స్వదేశంలో ఐపీఎల్ను నిషేధించడం వల్ల కూడా భారత్కు పోయేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూ కోల్పోయి, ఆర్దికంగా బంగ్లాదేశే నష్టపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా బంగ్లాదేశ్ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని వల్ల భారత్కు నష్టమేమీ ఉండదు కానీ, క్రికెట్ బలైపోతుంది.ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. రాజకీయం, ఉగ్రవాదం, అంతర్గత అస్థిరతలు, సరిహద్దు వివాదాల కారణంగా మొదటి నుంచి ఈ ఇరు దేశాల మధ్య క్రికెట్ నలిగిపోతూ వస్తుంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్పై పాక్ వైమానిక దాడులకు తెగబడటంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది పౌరులు చనిపోవడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్లో జరగాల్సిన టీ20 ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది.పాకిస్తాన్-శ్రీలంక2009లో శ్రీలంక జట్టు పాక్లో పర్యటిస్తుండగా.. లాహోర్లో ఆ జట్టు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉదంతం తర్వాత చాలాకాలం పాటు శ్రీలంక పాక్తో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రోద్భలంతో పాక్లో పర్యటిస్తున్నా, లంక ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియాఈ రెండు దేశాల మధ్య కూడా ఓ దశలో క్రికెట్ సంబంధాలు చెడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆఫ్ఘనిస్తాన్తో క్రికెట్ ఆడటం నిలిపి వేసింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ.. నష్టపోయింది మాత్రం క్రికెటే.ఇంగ్లండ్-జింబాబ్వేజింబాబ్వేలో మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అస్థిరత కారణంగా ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య ఓ దశలో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2003 వరల్డ్కప్లో ఇంగ్లండ్ జింబాబ్వేలో పర్యటించేందుకు నిరాకరించింది. నేటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.సౌతాఫ్రికా-వెస్టిండీస్1970ల్లో సౌతాఫ్రికాలో జాతి వివక్ష అధికంగా ఉండేది. ఆ సమయంలో ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు కొనసాగించేందుకు ఏ దేశం ఇష్టపడలేదు. వెస్టిండీస్ ఓ అడుగు ముందుకేసి సౌతాఫ్రికాతో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. 1970–1991 మధ్యలో సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైంది.ఇలా రాజకీయం, ఉగ్రవాదం, జాతి వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన వంటి కారణాల చేత క్రికెట్ నలిగిపోయింది. అభిమానులు ఈ క్రీడ మజాను ఆస్వాదించలేకపోయారు. ఆటగాళ్ల కెరీర్లు నాశనమయ్యాయి. క్రికెట్ బోర్డులు ఆర్దికంగా నష్టపోయాయి. -
ఆంధ్ర పోరాడినా...
బెంగళూరు: ఆంధ్ర జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి పోరాడినా ఓటమి తప్పలేదు. విజయ్ హజారే వన్డే టోరీ్నలో గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆంధ్ర చివరకు 7 పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. భారత ఆల్రౌండర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (111 బంతుల్లో 130; 10 ఫోర్లు, 5 సిక్స్లు) గుజరాత్ను గెలిపించాడు. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో గుజరాత్ స్కోరు 29/3 కాగా...అక్షర్ జట్టును ఆదుకున్నాడు. అక్షర్, విశాల్ జైస్వాల్ (60 బంతుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆరో వికెట్కు 142 పరుగులు జత చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టగా, నితీశ్కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (125 బంతుల్లో 102; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో ఆంధ్రను చివరి దాకా రేసులో నిలిపాడు. అయితే ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేయగలిగింది. శ్రీకర్ భరత్ (39; 6 ఫోర్లు, 1 సిక్స్), ధనుశ్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా...ఎస్డీఎన్వీ ప్రసాద్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఐదు మ్యాచ్లాడిన ఆంధ్రకిది నాలుగో పరాజయం! ఇదే వేదికపై మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్లో హరియాణాతో ఆంధ్ర తలపడుతుంది. -
పడి లేచిన ప్రయాణం...
ఆ్రస్టేలియా జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడమంటే అంత ఆషామాషీ విషయం కాదనేది జగమెరిగిన సత్యం. విపరీతమైన పోటీని తట్టుకొని ఆ అవకాశం పొందడంతో పాటు పుష్కర కాలం జట్టుతో కొనసాగడం అంటే మామూలు మాటలా! అందులోనూ పాకిస్తాన్లో పుట్టి అక్కడి నుంచి వలస వచి్చన ముస్లిం ప్లేయర్కు ఇది సాధ్యమా అంటే ముమ్మాటికీ అసాధ్యం అనే చెప్పవచ్చు...ఇలాంటి అసాధ్యాన్ని ఉస్మాన్ తారిఖ్ ఖ్వాజా సుసాధ్యం చేసి చూపాడు. చక్కటి టెక్నిక్, సొగసైన స్ట్రోక్ ప్లే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో నిలవగల సహనంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా... ఆ్రస్టేలియా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడి కెరీర్ను ఓసారి పరిశీలిస్తే... సిడ్నీలోనే మొదలు... ఐదేళ్ల ప్రాయంలోనే పాకిస్తాన్ నుంచి కుటుంబంతో సహా ఆస్ట్రేలియాకు వలస వచి్చన ఉస్మాన్ ఖ్వాజా... ఉపఖండంలో అందరు పిల్లల్లాగే చిన్నప్పటి నుంచి క్రికెట్ను ఎంతగానో ఆరాధించేవాడు. ప్రత్యక్షంగా మ్యాచ్లు చూసేందుకు వెళ్లాలనే కోరిక ఉన్నా... ఆరి్థక పరిస్థితులు సహకరించకపోవడంతో... మైదానం బయటే ఉండిపోయిన ఖ్వాజా...ఆటపై తనకున్న మక్కువతో అద్భుతం చేసిచూపాడు. 2011 ‘యాషెస్’సిరీస్లో భాగంగా సిడ్నీ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు... ఆ్రస్టేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం ప్లేయర్గా నిలిచాడు. అది మొదలు కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ ఎడమ చేతి బ్యాటర్... సుదీర్ఘ ఫార్మాట్లో తన టెక్నిక్తో పాటు... ఉపఖండ పిచ్లపై సులువుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యంతో ఆసీస్ జట్టులో కొనసాగాడు. కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ప్రతిసారి... అలుపెరగని కెరటంలా పైకెగిసిన ఖ్వాజా... ఆ్రస్టేలియా తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానంతో కెరీర్కు వీడ్కోలు ప్రకటించాడు. మేటి ఇన్నింగ్స్లు... 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడిన ఉస్మాన్ ఖ్వాజా... 2023 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నాడు. 2015 బ్రిస్బేన్ టెస్టులో న్యూజిలాండ్పై చేసిన 174 పరుగులు... 2016 అడిలైడ్ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆడిన 145 పరుగుల ఇన్నింగ్స్... 2018 దుబాయ్ మ్యాచ్లో పాకిస్తాన్పై చేసిన 141 పరుగులు... 2022 సిడ్నీ టెస్టులో ఇంగ్లండ్పై ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్... పాకిస్తాన్పై కరాచీ టెస్టులో కొట్టిన 160 పరుగులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఖ్వాజా కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలెన్నో. టెక్నిక్తో పాటు సహనానికి మారుపేరుగా నిలిచిన అతడు... టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు క్రీజులో దర్శనమిచి్చన అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్తో 2023 బరి్మంగ్హామ్ టెస్టు మ్యాచ్లో... ఆట ఐదు రోజుల పాటు ఏదో ఒక దశలో బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 321 బంతులు ఎదుర్కొని 141 పరుగులు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్లో 197 బంతులు ఎదుర్కొని 65 పరుగులతో జట్టుకు విజయం అందించడం విశేషం. శ్రీలంకపై గాలేలో తన కెరీర్లో ఏకైక డబుల్ సెంచరీ (232)ని సాధించి జట్టును గెలిపించాడు. వన్డేల్లో ఇలా... సుదీర్ఘ ఫార్మాట్లో మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఖ్వాజా 2013లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో విఫలమైన అతడు... ఆ తర్వాత కొన్ని మెరుగైన ప్రదర్శనలతో కెరీర్లో 42.00 సగటుతో 1554 పరుగులు చేశాడు. ఆ్రస్టేలియా వన్డే జట్టులో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు. ఇక స్వల్ప టి20 కెరీర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున 6 మ్యాచ్లు ఆడాడు. జాతీయ జట్టుకు దూరమైనా... బిగ్ బాష్ లీగ్తో పాటు విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు వెల్లడించాడు. స్పిన్ను ఎదుర్కోవడంలో మంచి పేరున్న ఖ్వాజాకు... భారత్పై మాత్రం చెప్పుకోదగ్గ రికార్డు లేదు. టీమిండియాతో 14 టెస్టు మ్యాచ్లాడిన అతడు 29.12 సగటుతో 728 పరుగులు చేశాడు. -
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
-
హైదరాబాద్లో ఘనంగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
VHT.. విరాట్, రోహిత్ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక
విజయ్ హజారే ట్రోఫీ (VHT).. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల దేశవాలీ టోర్నీ. ఈ టోర్నీని అంతర్జాతీయ వన్డేలతో కలిపి లిస్ట్-ఏ ఫార్మాట్గా పరిగణిస్తారు. 1993–94లో జోనల్ స్థాయిలో ప్రారంభమైన ఈ టోర్నీ.. 2002–03 నుంచి అన్ని రాష్ట్ర జట్లు పాల్గొనేలా జాతీయ స్థాయికి విస్తరించింది.తొలినాళ్లలో ఈ టోర్నీని రంజీ వన్డే ట్రోఫీగా పిలిచే వారు. 2004లో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే మరణం తర్వాత విజయ్ హజారే ట్రోఫీగా నామకరణం చేశాడు. 2007-08 ఎడిషన్ నుంచి ఇదే పేరుతో ఈ టోర్నీ కొనసాగుతుంది.ప్రస్తుతం ఈ టోర్నీలో 38 రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 టైటిళ్లు సాధించాయి. ఈ టోర్నీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి అనేక మంది స్టార్ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది.ఇవాల్టి నుంచి (డిసెంబర్ 24) 2025-26 ఎడిషన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ టోర్నీలో అత్యుత్తమ రికార్డులు, విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా మహారాష్ట్రకు చెందిన అంకిత్ బావ్నే (4010 పరుగులు) కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు (15) కూడా బావ్నే పేరిటే ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇషాన్ కిషన్ (273) ఖాతాలో ఉంది.ఫాస్టెస్ట్ సెంచరీ ఇవాళే (బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ-32 బంతుల్లో) నమోదైంది. టోర్నీ చరిత్రలో యంగెస్ట్ సెంచూరియన్ రికార్డు కూడా ఇవాళే నమోదైంది. బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించాడు. ఈ సెంచరీ లిస్ట్-ఏ చరిత్రలో ఎనిమిదో వేగవంతమైన శతకంగానూ (36 బంతుల్లో) రికార్డైంది.ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్గా సిద్ధార్థ్ కౌల్ (155 వికెట్లు, పంజాబ్) ఉన్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు షాబాజ్ నదీమ్ (జార్ఖండ్, 8/10) పేరిట ఉన్నాయి. ఓ సింగిల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డు జయదేవ్ ఉనద్కత్ (2012–13 ఎడిషన్లో 19 వికెట్లు) పేరిట ఉంది.జట్టు రికార్డుల విషయానికొస్తే.. అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా ఇదే సీజన్లో నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో బిహార్ రికార్డు స్థాయిలో 574 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్కోర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అత్యల్ప స్కోర్ అస్సాం (36 పరుగులు vs ముంబై, 2012) పేరిట ఉంది.ఈ టోర్నీ విరాట్ కోహ్లి (2006-07 సీజన్లో), రోహిత్ శర్మ (2005-06 సీజన్లో) లాంటి దిగ్గజాలను వెలుగులోకి తేవడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, రజత్ పాటిదార్, శుభ్మన్ గిల్ లాంటి టీమిండియా స్టార్లకు తమ సత్తా చాటేందుకు వేదికగా ఉపయోగపడింది. -
ఐసీసీ ప్రీమియర్ పార్ట్నర్గా హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్ టోర్నమెంట్లకు ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్కప్ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.ఈ ఒప్పందంతో హ్యుందాయ్కు లభించే ప్రత్యేక హక్కులు..- మ్యాచ్డే కాయిన్ టాస్లో భాగస్వామ్యం - స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్ - అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement) ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు. కాగా, హ్యుందాయ్ మోటర్ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించింది. -
ఈ ఏడాది క్రికెట్లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..!
అంతర్జాతీయ క్రికెట్లో 2025 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ ఏడాది చాలా ప్రపంచ రికార్డులు చేతులు మారాయి. దిగ్గజాలు తమ వారసత్వాన్ని మరింత బలపరుచుకోగా, కొత్త తరం ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లి, జో రూట్.. మహిళల క్రికెట్లో స్మృతి మంధన లాంటి వారు వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. జట్ల పరంగా పురుషుల క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు.. మహిళల క్రికెట్లో టీమిండియా సరికొత్త వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాయి. తిలక్ వర్మ 318 నాటౌట్ఈ ఏడాది టీమిండియా ఆటగాడే ప్రపంచ రికార్డుల బోణీ కొట్టాడు. జనవరిలో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తిలక్ టీ20ల్లో ఔట్ కాకుండా 318 పరుగులు (19*, 120*, 107*, 72*) చేసి విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును తన పేరిట బదిలీ చేసుకున్నాడు. విరాట్ కోహ్లి @ ఫాస్టెస్ట్ 14000 రన్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో (ఛాంపియన్స్ ట్రోఫీ) విరాట్ కోహ్లి ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పురుషుల వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ ఈ మైలురాయిని 350 ఇన్నింగ్స్ల్లో చేరుకుంటే, కోహ్లి కేవలం 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలుఇదే ఏడాది విరాట్ మరో భారీ ప్రపంచ రికార్డును కూడా సాధించాడు. ఓ సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెస్ట్ల్లో 51 సెంచరీలు చేయగా.. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 53 వన్డే శతకాలు ఉన్నాయి. అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక స్కోర్సౌతాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా డెస్మండ్ హేన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. హేన్స్ 1978లో తన వన్డే అరంగేట్రంలో 148 పరుగులు చేయగా.. బ్రీట్జ్కే 150 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.రోహిత్ శర్మ.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడుఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్స్కు చేర్చడంతో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును ఫైనల్స్కు చేర్చిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే, టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్కు చేర్చాడు. వీటిలో డబ్ల్యూటీసీ మినహా అన్ని టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.అనామక బ్యాటర్ ఖాతాలో ప్రపంచ రికార్డుఆస్ట్రియాకు చెందిన అనామక బ్యాటర్ కరణ్బీర్ సింగ్ ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1488) చేసిన బ్యాటర్గా కరణ్బీర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఓ ఓవర్లో ఏకంగా 39 పరుగులుసమోవా జట్టు ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (39) సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సమోవాకు చెందిన డారియస్ విస్సర్ ఓ ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు పిండుకోగా.. 3 పరుగులు నో బాల్స్ రూపంలో వచ్చాయి.రూట్ @ 213టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్కు సంబంధించి వరుసగా రికార్డును బద్దలు కొడుతున్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్.. ఈ ఏడాది ఫీల్డింగ్లో ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. రూట్ టెస్ట్ అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా (213) రాహుల్ ద్రవిడ్ (210) రికార్డును బ్రేక్ చేశాడు. చరిత్ర సృష్టించిన స్టార్క్ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో స్టార్క్ (420) పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (414) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.వన్డేల్లో అతి భారీ విజయంఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు వన్డేల్లో అతి భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ జట్టు సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2023 జనవరిలో భారత్ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది.మంధన ఖాతాలో భారీ రికార్డుభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ రికార్డును బద్దలు కొట్టింది. టేలర్ 5000 పరుగులు పూర్తి చేసేందుకు 129 ఇన్నింగ్స్లు తీసుకోగా.. మంధన కేవలం 112 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని తాకింది.టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డుమహిళల వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆసీస్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఆసీస్పై ఈ భారీ రికార్డు సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. -
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హిట్.. టెస్ట్ల్లో ఫట్..!
2025.. భారత పురుషుల క్రికెట్కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్ క్రికెట్లో చతికిలబడిన భారత్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.షాకిచ్చిన దిగ్గజాలుఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.అప్పటికే (2024 టీ20 వరల్డ్కప్ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్ల్లో భారత్కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. టెస్ట్ల నుంచి వైదొలుగుతూనే రోహిత్ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.గిల్ జమానా షురూదీంతో టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ శకం మొదలైంది. అయితే రోహిత్, కోహ్లి గైర్హాజరీలో గిల్కు టెస్ట్ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్ కెప్టెన్గా తొలి పర్యటనలో గిల్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్లో ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్లో గిల్ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.5 మ్యాచ్ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్, సుందర్, సిరాజ్, బుమ్రా, ఆకాశదీప్ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.ఓటమితో ప్రారంభం2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్ ఇదే.విండీస్ను క్లీన్ స్వీప్ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్ స్వదేశంలో విండీస్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.సొంతగడ్డపై పరాభవంఈ ఏడాది భారత్కు టెస్ట్ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్గా చూస్తే, ఈ ఏడాది భారత్కు విండీస్పై మినహా ఒక్క టెస్ట్ సిరీస్ విజయం కూడా దక్కలేదు.వన్డేల్లో తిరుగలేని భారత్ఈ ఏడాది భారత్ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.మూడోసారి ఛాంపియన్అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆసీస్ చేతిలో భంగపాటుఈ ఏడాది ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసి, అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్లో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2తో కోల్పోయింది.రెచ్చిపోయిన రోహిత్.. నిరాశపరిచిన కోహ్లిఈ సిరీస్లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. విరాట్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు.పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలుఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్లో రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్ ఈ సిరీస్ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్ను ఘనంగా ముగించింది. ఆసీస్తో సిరీస్ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై సిరీస్ విజయాలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ పొట్టి ఫార్మాట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.ఈ మధ్యలో భారత్ ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్ను (ఫైనల్ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టైటిల్ గెలిచాక ఆసియా క్రికెట్ కౌన్సిల్కు బాస్గా ఉన్న పాకిస్తానీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఆసియా కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్గా చూస్తే.. భారత్ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. -
మొదటి మ్యాచ్లోనే ముద్ర.. వార్నర్ వికెట్తో వార్తల్లోకెక్కాడు
తెనాలి: ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతమైన వికెట్తో సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన సత్తాను చాటిన ఈ ఎడంచేతి ఫాస్ట్ బౌలర్ను తాజా ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరాల్లోకి వెళితే...పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగరీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్ తొలి గురువు. క్రికెట్లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథ్వీరాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తండ్రి వారసత్వంగా క్రికెట్పై ఆసక్తి... పృథ్వీరాజ్ కు ఆట వారసత్వం అనుకోవచ్చు. తాత ప్రసాదరావు పహిల్వాన్. తండ్రి యర్రా శ్రీనివాసరావు స్వస్థలం చీరాల. బాపట్లలో ఇంజినీరింగ్ కాలేజీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్గా ఉన్నారు. రెండేళ్లు కాలేజీ చాంపియన్. 1985లో గుంటూరు జిల్లా అండర్–19 క్రికెట్ జట్టులో ఆడారు. 1986లో జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యమే పృథ్వీరాజ్కు క్రికెట్పై ఆసక్తిని కలిగించింది. విజయమోహన్ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అండర్–14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్ గా చేశాడు. 19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి... 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికైన పృథ్వీరాజ్ రెండు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించే ఇండియన్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్కు ఇండియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజ్ కు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోపీలో ఇండియా రెడ్ టీమ్కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు ఆడి, హైదరాబాద్పై రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్డేలోనే ప్రొఫెసర్ ధియోధర్ ట్రోఫీకి ఆడారు. అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. వార్నర్ వికెట్తో సంచలనం అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్కు చేరింది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్తో మ్యాచ్తోనే జట్టులో బెర్త్ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథీ్వరాజ్ బౌలింగ్లో రెండు క్యాచ్లను జారవిడిచారు. అయినప్పటికీ మెయిడెన్ వికెట్గా వార్నర్ను బౌల్డ్ చేయడంతో వార్తల్లోకెక్కాడు, అంతకుముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్కు నెట్ బౌలర్గా పృథీ్వరాజ్, కోల్కతా నుంచి ఆకాశ్దీప్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్దీప్ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు. రంజీ ట్రోఫీల్లో సత్తా మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్, వైట్ బాల్లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్పై రెండు ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెందింది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీరాజ్. 2025–26 సీజన్ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్లో ఏడు పరుగుల సగటుతో 12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యేకత ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ పృథ్వీరాజ్ ప్రత్యేకత. 145–150 కి.మీ. వేగంతో బౌల్ చేయటం, బంతిని రెండువైపులా స్వింగ్ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు ఉన్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ప్రముఖ శిక్షకుడు సీడీ థాంప్సన్ మెలకువలు నేర్చారు. ఈ ప్రత్యేకతలతోనే గాయాలతో కొన్ని సీజన్లు వైట్బాల్కు దూరంగా ఉన్నా, మళ్లీ ఘనంగా గుజరాత్ టైటాన్తో పునరాగమనం చేయగలిగాడు పృథీ్వరాజ్. గుజరాత్ టైటాన్ జట్టు ఆడిన తొలి ఐపీఎల్లోనే కప్ను గెలుచుకుందనీ, ఆ జట్టులో ఆటతో టీమిండియాకు ఆడే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాడు. -
T20 Match: భారత్– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్ : భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్ విభాగంలో ఇటీవల వరల్డ్ కప్లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది.బలంగా టీమిండియామరోవైపు భారత జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కమలిని, స్పిన్నర్ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. -
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
-
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
-
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
-
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
-
సత్య నాదెళ్లకు అదో సరదా..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారతీయ-అమెరికన్ అయిన ఆయన మైక్రోసాఫ్ట్లో అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థకు ఈసీవో అయ్యారు. అపారమైన తన శక్తి సామర్థ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.ప్రతి మనిషికీ వృత్తితోపాటు ఓ వ్యాపకమూ ఉంటుంది. ‘మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాల’ అంటాడు ఓ సినిమాలో విలన్ రావు గోపాలరావు. కానీ ఈ దిగ్గజ టెక్ సీఈవోది ‘క్రీడా పోషణ’. క్రీడాకారుడు కాకపోయినా క్రికెట్ ఆటను విశ్లేషించే మొబైల్ యాప్ ఒకదానిని సత్య నాదెళ్ల రూపొందించారు. అంతేకాదు.. కాస్త సమయం దొరికినప్పుడల్లా కోడ్ రాస్తుంటారాయన. అది ఆయనకో సరదా...ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. థాంక్స్ గివింగ్ సందర్భంగా తాను చిన్నప్పటి నుండి ఇష్టపడే క్రీడ క్రికెట్ ను విశ్లేషించడానికి ఇంటి వద్ద తాను స్వయంగా డీప్ రీసెర్చ్ ఏఐ యాప్ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల ఈ వారం భారత్ వస్తున్నారు. ఇక్కడి వ్యాపార, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ ఇటీవలె భారత్లో రాబోయే నాలుగేళ్లలో ఏఐ, క్లౌడ్ రంగాల్లో 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. -
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
-
Cricket: ఫైనల్లో దుమ్ములేపిన సాక్షి టీమ్ TV9పై ఘన విజయం
-
క్రికెట్ తర్వాతే ఏదైనా: స్మృతి
న్యూఢిల్లీ: తన జీవితంలో క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో పాల్గొన్న సందర్భంగా స్మృతి మాట్లాడుతూ ... ‘నేను క్రికెట్ కంటే ఎక్కువ ప్రేమించే విషయం ప్రపంచంలో మరొకటి లేదు. భారత జెర్సీ వేసుకోవడం కన్నా పెద్ద గౌరవం ఏం ఉంటుంది. అది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. సమస్యలన్నీ పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి సారించేందుకు ఉపకరిస్తుంది. చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి నా మదిలో ఎప్పుడూ ప్రపంచ చాంపియన్గా ఎదగాలనే కోరిక ఉండేది. అది ఇటీవల నిజమైంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ నెగ్గడం మా జీవితంలో అతిగొప్ప క్షణం. ట్రోఫీ హస్తగతం అయిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు’ అని స్మృతి వివరించింది. -
క్రికెట్ చరిత్రలో కవలలు.. మరో కొత్త జోడీ
క్రికెట్ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్ (స్టీవ్-మార్క్). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.పురుషుల క్రికెట్లో మరో ట్విన్స్ జోడీ జేమ్స్ మరియు హేమిష్ మార్షల్. వీర్దిదరు న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్, వన్డే క్రికెట్ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్ బ్రదర్స్ (క్రెయిగ్-జేమీ). జేమీ మరియు క్రెయిగ్ ఓవర్టన్ కలిసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్ సోదరులలాగే ఒకే స్టయిల్ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. పురుషుల క్రికెట్ తొలినాళ్లలో మరో ట్విన్స్ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్, ఎరిక్ బెడ్సర్. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ మరియు కేట్ బ్లాక్వెల్ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్ ఆసీస్ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించింది.మహిళల క్రికెట్లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్ కాదు. ట్రిప్లెట్స్ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్, ఎస్సీ షెవిల్ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం క్రికెట్కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్ కుమారులు కావడం మరో విశేషం.బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ. ఈ ఇద్దరు త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి. -
క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.భౌగోళిక ఒత్తిడులు2025 ఐపీఎల్ సీజన్కు ముందు భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్లతో సహా అనేక మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్షిప్ డీల్స్లో 15-20% తగ్గుదల కనిపించింది.దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్కు దూరం చేసింది.రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లుఐపీఎల్ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్షిప్లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై నిషేధం లీగ్కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్షిప్లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్లు (ఆటో, ఫిన్టెక్, హెల్త్కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.బ్రాడ్కాస్టింగ్ రైట్స్లో పోటీ లోపంకార్పొరేట్ ప్రభావం ఐపీఎల్ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్ మొత్తం విలువను దెబ్బతీసింది.ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు వ్యూయర్షిప్ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.పునరుద్ధరణకు మార్గాలురియల్-మనీ గేమింగ్పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్షిప్లను ఆకర్షించాలి.ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.భవిష్యత్ సీజన్ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
క్యాన్సర్ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను క్యాన్సర్ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్ 14) బిగ్బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్తో బీబీఎల్ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. థండర్తో ఒప్పందం అనంతరం మాడిన్సన్ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.మాడిన్సన్ థండర్తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాడిన్సన్ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్ బిగ్బాష్ లీగ్లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్ (7 సీజన్లు), మెల్బోర్న్ స్టార్స్ (3), మెల్బోర్న్ రెనెగేడ్స్ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్ అతని నాలుగో జట్టు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన మాడిన్సన్ ఆసీస్ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్ 2014 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్లు ఆడాడు. బిగ్బాష్ లీగ్ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
-
కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
టెస్టు సిరీస్ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ‘స్టార్స్’ రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు. సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్స్లతో అచ్చమైన వన్డే ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. బంతితో కుల్దీప్, హర్షిత్ రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్ గెలుపు ఇచి్చన స్ఫూర్తితో వన్డే సిరీస్లో బరిలోకి దిగిన సఫారీ జట్టు కడదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డే కెరీర్లో 52వ సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ కేఎల్ రాహుల్ (60; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. బ్రాట్కీ (80 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ (39 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కార్బిన్ బాష్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. సెంచరీ భాగస్వామ్యం...ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... ఆడుతున్న ఒక్క ఫార్మాట్లోనే అదరగొడుతున్నారు. చివరగా ఆ్రస్టేలియాతో ఆడిన వన్డేలో దంచికొట్టిన ఈ జంట ... సిడ్నీలో ఎక్కడ ఆపిందో రాంచీలో అక్కడి నుంచే మోత మోగించింది. ఫామ్, ఫిట్నెస్లో యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మరోసారి చాటింది. నాలుగో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కాగా.. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది విరాట్ తన ఉద్దేశాన్ని చాటాడు. సాధారణంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించే కోహ్లి చూడచక్కటి షాట్లతో కట్టిపడేయగా... రోహిత్ కూడా లయ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో భారత జట్టు 80/1తో నిలిచింది. సుబ్రాయెన్ బౌలింగ్లో రోహిత్ రెండు వరుస సిక్స్లు బాదితే... కార్బిన్ బాష్ బౌలింగ్లో కోహ్లి చెలరేగిపోయాడు. రోహిత్ తనదైన పుల్ షాట్లతో రెచ్చిపోగా... విరాట్ వన్డేల్లో తన రెండో అత్యధిక సిక్స్ (7)లు ఈ మ్యాచ్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి 48, రోహిత్ 43 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ అవుట్ కాగా... రుతురాజ్ (8), సుందర్ (13) విఫలమయ్యారు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాక జూలు విదిలి్చన విరాట్... సుబ్రాయెన్ వేసిన 39వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి అవుటయ్యాడు. ఆఖర్లో జడేజా (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో... రాహుల్ కీలక పరుగులు జోడించాడు. యాన్సెన్ దూకుడు... భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం దక్కలేదు. రికెల్టన్ (0), డికాక్ (0), మార్క్రమ్ (7) పెవిలియన్కు చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో టోనీ జార్జి (39; 7 ఫోర్లు), బ్రెవిస్ (37; 2 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి బ్రిట్కీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు ఎక్కువసేపు నిలవలేకపోయినా... యాన్సెన్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యాన్సెన్... భారీ షాట్లతో టీమిండియాను భయపెట్టాడు. దీంతో సఫారీ జట్టు పోటీలోకి రాగా... కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ అవుట్ చేసి జట్టులో ఆనందం నింపాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి బాష్ ఆఖర్లో పోరాడినా... జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.వన్డే ‘సిక్స్’లలో రోహిత్ రికార్డుఈ మ్యాచ్లో మూడు సిక్స్లు బాదిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ... వన్డే క్రికెట్లో అత్యధిక (352) సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెపె్టన్ షాహిద్ అఫ్రిది (351) పేరిట 15 ఏళ్లుగా ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు బాదగా... రోహిత్ 278 మ్యాచ్ల్లోనే అతడిని అధిగమించాడు. గేల్ (301 మ్యాచ్ల్లో 331 సిక్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు.కోహ్లి కాళ్లు తాకాలని... ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విరాట్ వరకు చేరుకున్న అభిమాని... కోహ్లికి పాదాభివందనం చేశాడు. అంతలో అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) డికాక్ (బి) బర్గర్ 18; రోహిత్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 57; కోహ్లి (సి) రికెల్టన్ (బి) బర్గర్ 135; రుతురాజ్ (సి) బ్రెవిస్ (బి) బార్ట్మన్ 8;సుందర్ (సి) బాష్ (బి) బార్ట్మన్ 13; రాహుల్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 60; జడేజా (సి) మార్క్రమ్ (బి) బాష్ 32; హర్షిత్ (నాటౌట్) 3; అర్షదీప్ (బి) బాష్ 0; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు)349. వికెట్ల పతనం: 1–25, 2–161, 3–183, 4–200, 5–276, 6–341, 7–347, 8–347. బౌలింగ్: యాన్సెన్ 10–0–76–2; బర్గర్ 10–0–65–2; బాష్ 10–0–66–2; బార్ట్మన్ 10–0–60–2; సుబ్రాయెన్ 10–0–73–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 7; రికెల్టన్ (బి) హర్షిత్ 0; డికాక్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 0; బ్రీట్కీ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 72; జోర్జి (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; బ్రెవిస్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 37; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 70; బాష్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 67; సుబ్రాయెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 17; బర్గర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 17; బార్ట్మన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 332. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–11, 4–77, 5–130, 6–227, 7–228, 8–270, 9–312, 10–332. బౌలింగ్: అర్షదీప్ 10–1–64–2; హర్షిత్ రాణా 10–0–65–3; సుందర్ 3–0–18–0; ప్రసిధ్ 7.2–1–48–1; కుల్దీప్ 10–0–68–4; జడేజా 9–0–66–0. -
డబ్ల్యూబీబీఎల్కు జెమీమా దూరం
బ్రిస్బేన్: భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్... మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మిగిలిన మ్యాచ్లకు దూరమైంది. టీమిండియా వైస్ కెపె్టన్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో... సహచరిణికి అండగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. దీంతో డబ్ల్యూబీబీఎల్ రెండో దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండనని నిర్వాహకులకు తెలిపింది. జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకొని తమ ప్లేయర్కు వెసులుబాటు కలి్పంచింది. వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలిచిన అనంతరం జెమీమీ డబ్ల్యూబీబీఎల్లో పాల్గొనేందుకు ఆ్రస్టేలియా వెళ్లింది. కొన్ని రోజుల ప్రాక్టీస్ అనంతరం భారత ఓపెనర్ స్మృతి మంధాన వివాహం కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే వివాహం జరగాల్సిన రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి వాయిదా పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తిరిగి ఆ్రస్టేలియా వెళ్లకూండా స్మృతికి తోడుగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. డబ్ల్యూబీబీఎల్లో జెమీమా బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకుంది. మహిళల బిగ్ బాష్ లీగ్ తదుపరి మ్యాచ్ల నుంచి ఆమెను విడుదల చేసింది’ అని బ్రిస్బేన్ హీట్ జట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో డబ్ల్యూబీబీఎల్లో మిగిలిన నాలుగు మ్యాచ్లకు జెమీమా దూరం అయింది. భారత జట్టు తొలిసారి మహిళల వన్డే వరల్డ్కప్ గెలవడంలో జెమీమా కీలక పాత్ర పోషించింది. సెమీఫైనల్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించి ఫైనల్కు చేర్చింది. -
మళ్లీ మైదానంలోకి ధావన్, హర్భజన్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ సహా పలువురు దిగ్గజ ఆటగాళ్లు లెజెండ్స్ ప్రొ టి20 లీగ్ బరిలోకి దిగనున్నారు. గోవా వేదికగా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ లీగ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు పలువురు అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఈ లీగ్లో భాగస్వాములు కానున్నారు. దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఈ జాబితాలో ఉన్నారు. ఆ్రస్టేలియా మాజీ కెపె్టన్ మైకేల్ క్లార్క్ లీగ్ కమిషనర్గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అన్నీ జట్లలో కలిపి 90 మంది లెజండరీ ప్లేయర్లు పాల్గొననున్నారు. ‘క్రికెట్కు అతిపెద్ద నిలయంగా ఉన్న భారతదేశం నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచి్చంది. ఈ లీగ్లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడి అభిమానులకు ఆటపై అభిరుచి ఎక్కువ. ఈ లీగ్ ద్వారా పలువురు పాత మిత్రులతో పాటు, గతంలో హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులను తిరిగి కలిసే అవకాశం లభించనుంది. లెజెండ్స్ ప్రొ టి20 లీగ్లో కొత్త పాత్రలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని క్లార్క్ పేర్కొన్నాడు. -
మనసున్న శ్రీ చరణి!
సాక్షి ప్రతినిధి, కడప: భారతదేశానికి ప్రపంచకప్ గెలిపించడమే కాదు.. దేశ ప్రజల మనస్సూ గెలుచుకుంది. మైదానంలో చిరుతలా కదలడమే కాదు .. చిరు వయస్సులోనే గొప్ప పరిణతి చూపిస్తోంది. ఆమె ఎవరో కాదు భారతజట్టు మహిళా క్రికెటర్..మనసున్న మన చరణి. తనకు కేటాయించిన ప్రోత్సాహక బహుమతిలో రూ.10 లక్షలు అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల కోసం కేటాయించాలని కోరి ప్రజల మన్ననలు చూరగొంది.జిల్లాలో ఇప్పుడు ఎక్కడా చూసినా శ్రీచరణి పేరు మార్మోగుతోంది. తన ప్రతిభతో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచడంపై నలుమూలల నుంచి ప్రశంసలు పొందుతోంది. అయినప్పటికీ పొగడ్తలకు ఎక్కడా పొంగిపోలేదు. అంతర్జాతీయ స్థాయికి చేరినప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆరీ్టపీపీలో కలియతిరుగుతూ, కడప క్రికెట్ స్టేడియంలో తరీ్ఫదు పొందుతున్న శ్రీచరణిలాగే ఉండిపోయింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కోచ్లతో అదే గురుభక్తితో మెలిగింది. కీర్తి కిరీటం పొందినప్పటికీ నిన్నమొన్నటి శ్రీచరణిలాగే కలుపుగోలుగా ఉండిపోవడం అదో గొప్ప లక్షణంగా పరిశీలకులు వివరిస్తున్నారు. అకాడమీ క్రీడాకారుల కోసం..కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో శుక్రవారం భారత మహిళ క్రికెటర్ శ్రీచరణిని ఘనంగా సత్కరించిన విషయం విదితమే. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్చార్జ్ మేయర్ ముంతాజ్బేగం పాల్గొన్నారు. జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీచరణిని ప్రోత్సహిస్తూ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వెంటనే కమలాపురం ఎమ్మెల్యే కూడా రూ.5లక్షలు ప్రకటించారు. అంతలో శ్రీచరణి జోక్యం చేసుకుని తన ముందు కూర్చుని ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న భవిష్యత్ క్రీడాకారులు, అండర్–14 క్రికెట్ టీమ్ సభ్యులను చూపిస్తూ వారి ప్రోత్సాహం కోసం రూ.10లక్షలు కేటాయించాలని సూచించడం ఆమె గొప్పమనస్సుకు ప్రత్యక్ష నిదర్శనం. నిన్నామొన్నటి వరకూ ఖర్చుల డబ్బులు కోసం అమె ఎంతో కష్టపడింది. మేనమామ కిశోర్కుమార్రెడ్డి సహకారంతో నెట్టుకొచ్చింది. తాజాగా తనకు దక్కిన గౌరవంలో తనతోటి ట్రైనింగ్ పొందినా, పొందుతున్న క్రీడాకారు ల కోసం రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించడంపై ప్ర శంసలు దక్కుతున్నాయి. చిన్నవయస్సులో అత్యున్న త గౌరవం దక్కించుకున్న చరణికి అంతే పెద్ద మన స్సు ఉందని ఈ ఘటనతో రుజువు కావడం విశేషం. -
వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!
ఏ క్రీడలో అయినా దేశానికి ప్రాతినిథ్యం వహించడం క్రీడాకారులందరి కల. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డి, ఎంతో శ్రమించి, చాలా త్యాగాలు, పోరాటాలు చేస్తారు. ఒక్క క్రీడలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలంటేనే ఇన్ని కష్టాలు ఎదర్కోవాల్సి వస్తే.. కొందరు ఒకటికి మించిన క్రీడల్లో జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ క్రీడాకారులపై ఓ లుక్కేద్దాం.ఈ టాపిక్ డిస్కషన్కు రాగానే ముందుగా ఇద్దరు మహిళా క్రికెటర్లు గుర్తుకు వస్తారు. వారిలో మొదటి పేరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సూజీ బేట్స్ కాగా.. రెండో పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ. ఈ ఇద్దరు వారి దేశాల తరఫున క్రికెట్తో పాటు మరో క్రీడలో పాల్గొన్నారు.సూజీ బేట్స్సూజీ న్యూజిలాండ్ తరఫున క్రికెట్తో పాటు బాస్కెట్బాల్ ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె.. 2008 Beijing Olympicsలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. బాస్కెట్బాల్లో ఆమె పలు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పాల్గొంది. ప్రస్తుతం సూజీ బాస్కెట్బాల్ను వదిలి క్రికెట్పై దృష్టి సారించింది.ఎల్లిస్ పెర్రీ17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పెర్రీ.. క్రికెట్తో పాటు ఫుట్బాల్లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. ఆమె 2011 FIFA Women’s World Cupలో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది.పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా చాలా మంది మల్టీ టాలెండెడ్ ఉన్నారు.యుజ్వేంద్ర చహల్ఐపీఎల్లో మెరిసి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న చహల్.. చెస్ క్రీడలోనూ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. World Chess Federationలో చహల్ పేరు నమోదై ఉంది. భారత్ తరఫున క్రికెట్ & చెస్ ఆడిన ఏకైక ఆటగాడు చహల్.ఏబీ డివిలియర్స్మిస్టర్ 360 డిగ్రీస్గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కావడంతో పాటు ఆ దేశం తరఫున జూనియర్ లెవెల్లో టెన్నిస్ కూడా ఆడాడు. అలాగే స్విమ్మింగ్, రగ్బీ, గోల్ఫ్, బాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడల్లోనూ ఏబీకి ప్రావీణ్యం ఉంది. మల్టీ టాలెంటెడ్ పదానికి ఏబీ నిజమైన అర్హుడని చాలామంది అంటుంటారు.జాంటీ రోడ్స్క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్గా పేరొందిన జాంటీ రోడ్స్.. సౌతాఫ్రికా తరఫున క్రికెట్తో పాటు హాకీ ఆడే అవకాశం కూడా వచ్చింది. 1992, 1996 ఒలింపిక్స్ సౌతాఫ్రికా హాకీ జట్టుకు రోడ్స్ ఎంపికయ్యాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల అతను హాకీలో దేశానికి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.ఆండ్రూ ఫ్లింటాఫ్ఈ ఆల్రౌండ్ దిగ్గజం ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు బాక్సింగ్ క్రీడలోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ఫ్లింటాఫ్ ప్రొఫెషనల్ బాక్సర్గా మారాడు. ఈ క్రీడలోనూ అతను అత్యున్నతాలను చూశాడు.ఇయాన్ బోథమ్క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ముఖ్యుడైన ఇయాన్ బోథమ్.. ఇంగ్లండ్ తరఫున క్రికెట్తో పాటు ఫుట్బాల్ కూడా ఆడాడు. క్రికెట్ ఆడే సమయంలోనే బోథమ్ పలు క్లబ్ లెవెల్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్నాడు.సర్ వివియన్ రిచర్డ్బ్యాటింగ్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్ వెస్టిండీస్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు ఓ కరీబియన్ దీవి తరఫున ఫుట్బాల్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. క్రికెట్లో అత్యున్నత స్థానానికి చేరకముందే 1974 FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో Antigua & Barbuda దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ది. అయితే ఆ బ్యాట్ను స్మృతి సోదరుడు శ్రవణ్కు (జూనియర్ క్రికెటర్గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్ప్రీత్కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్స్టార్ అయింది. క్రికెట్తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్చైర్లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్చైర్లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్చైర్పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్బాల్ ప్లేయర్స్ను పరిచయం చేశారు. -
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
-
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
-
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
-
ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీతో జై షా భేటీ
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా భేటీ అయ్యారు. లుసానేలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 1900 పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఆ తర్వాత మరెప్పుడూ విశ్వక్రీడల్లో క్రికెట్కు చోటు దక్కలేదు. ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలిస్లో జరగనున్న ఒలింపిక్స్లో తిరిగి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్లో పాల్గొంటుండగా... టి20 ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేయనుండగా... దీనిపై ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీని కలవడం ఆనందంగా ఉంది.ఆ దిశగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఒలింపిక్ ఉద్యమంలో క్రికెట్ పాత్ర, దాని ప్రాధాన్యత గురించి చర్చించాం’ అని జై షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై ఐఓసీ అధ్యక్షురాలితో ఈ ఏడాది ఆరంభంలోనూ జై షా సమావేశమయ్యారు. -
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
-
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
క్రికెట్కు సరికొత్త ఫార్మాట్ పరిచయం కాబోతుంది. టెస్ట్, టీ20ల కలబోతతో ఈ ఫార్మాట్కు టెస్ట్ ట్వంటీగా (Test Twenty) నామకరణం చేశారు. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ వ్యూహాత్మకతను, టీ20ల వేగాన్ని కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్గా ఉండబోతుంది.దీని తొలి ఎడిషన్ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ ఫార్మాట్కు దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్ మద్దతిచ్చారు. యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్ను కనిపెట్టినట్లు నిర్వహకులు తెలిపారు. క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఉద్దేశమని వారు పేర్కొన్నారు.టెస్ట్ ట్వంటీ నియమాలు.. ఈ ఫార్మాట్లో మ్యాచ్లు ఒకే రోజులో పూర్తవుతాయి. మ్యాచ్ మొత్తం 80 ఓవర్ల పాటు జరుగుతుంది. టెస్ట్ల తరహాలో రెండు ఇన్నింగ్స్లు ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్లో ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడుతుంది. టెస్ట్ల తరహాలో స్కోర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. రెండు ఇన్నింగ్స్ల స్కోర్లు కలిపి ఫలితం నిర్ణయించబడుతుంది.ఫలితాలు విజయం, ఓటమి, టై, డ్రాగా ఉంటాయి.డ్రా అయితే చివరి బంతి వరకు 5 వికెట్లు మిగిలి ఉండాలి.డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉంటుంది.ప్రతి మ్యాచ్కు ఒక్క పవర్ ప్లే ఉంటుంది.ఇందులో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి.పవర్ ప్లేను కెప్టెన్ ఎంచుకుంటాడు.మొదటి ఇన్నింగ్స్లో తీసుకుంటాడా లేదా రెండో ఇన్నింగ్స్లో తీసకుంటాడా అన్నది అతని ఛాయిస్. పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి.30-యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.ఈ ఫార్మాట్లో ఫాలో ఆన్ నిబంధన కూడా ఉంటుంది. కనీసం 75 పరుగుల వెనకబడితేనే ఫాలో ఆన్ అమల్లోకి వస్తుంది.ఈ ఫార్మాట్లో అర్లీ కొలాప్స్ క్లాజ్ (early collapse clause) అనే సరికొత్త నిబంధన ఉండనుంది. ఈ నబంధన ప్రకారం ప్రత్యర్థిని 10 ఓవర్లలోపు ఆలౌట్ చేస్తే, వారికి అదనంగా 3 ఓవర్లు పొందే అవకాశం ఉంటుంది.ఈ ఫార్మాట్లో మ్యాచ్లో ఐదుగురు మాత్రమే బౌలింగ్ చేయాలి.ఒక్కో బౌలర్ గరిష్టంగా 8 ఓవర్లు వేయవచ్చు.ఆరు ఫ్రాంచైజీలు..ఈ ఫార్మాట్ తొలి ఎడిషన్కు ఆరు ఫ్రాంచైజీలు ఖరారైనట్లు తెలుస్తుంది. దుబాయ్, లండన్, అమెరికా దేశాల నుంచి తలో ఫ్రాంచైజీ.. భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు ఉండనున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు, ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు అక్టోబర్ 16 నుంచి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. చదవండి: విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..! -
జెండర్ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్ కామెంటేటర్
దారులు ఏర్పరచేవారెప్పుడూ ఒంటరిగానే బయలుదేరుతారు! చెప్పకనే ఆ బాటను పదిమందికీ గమ్యంగా మారుస్తారు. అలా పురుషుల రంగమైన క్రికెట్లో మహిళలను కామెంటరీ బాక్స్ వరకు నడిపించిన వ్యక్తి చంద్ర నాయుడు. ఆమెను పరిచయం చేస్తోంది ఈ వారం పాత్ మేకర్..ఇప్పుడిప్పుడే క్రికెట్లో మహిళల ఉనికి, ఉన్నతి కనిపిస్తోంది. కామెంటరీ రంగంలోనూ మహిళా గళాలు వినిపిస్తున్నాయి. క్రికెట్ నేపథ్యం కాకపోయినా మందిరా బేడీ క్రికెట్ యాంకర్గా, కామెంటేటర్గా కనిపించి, వినిపించి కలకలం రేపింది. అంజుమ్ చో్రపా, ఇసా గుహా, లీసా స్థాలేకర్, స్నేహల్ ప్రధాన్ లాంటి క్రికెటర్స్ కూడా ఆట నుంచి రిటైరైపోయి కామెంటేటర్స్గా మారినవారే! వీళ్లందరికీ ఆ ధైర్యం, స్ఫూర్తిని పంచింది మాత్రం 1970ల్లోని క్రికెట్ ప్లేయర్.. చంద్ర నాయుడు. మగాళ్లే వినిపించే క్రికెట్ వ్యాఖ్యానంలోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ రంగంలో మహిళలు రావడానికి దారిని ఏర్పరచారు.ఘనకీర్తి వారసత్వంచంద్రనాయుడు.. దేశపు తొలి టెస్ట్మ్యాచ్ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు కూతురు. 1932లో లార్డ్స్ స్టేడియంలో మన దేశం ఇంగ్లండ్తో ఆడిన తొలి టెస్ట్మ్యాచ్లో మన జట్టుకు ఆయనే సారథ్యం వహించారు. అతని సోదరులైన సీఎల్ నాయుడు, సీఆర్ నాయుడు, సీఎస్ నాయుడు కూడా క్రికెటర్లే. అలా క్రికెట్ కుటుంబంలో పుట్టిన చంద్ర నాయుడు రక్తంలో కూడా క్రికేట్ ఉండటంతో ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారావిడ. ఊహ తెలిసేప్పటికి ఆమె ఆసక్తి, ఇష్టం అన్నీ క్రికెటే అయ్యాయి. ప్రాక్టీస్తో ఆటలో ప్రావీణ్యం సంప్రాదించి దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.సల్వార్, కమీజ్తో రోల్ మోడల్గా.. ఇటు చదువు.. అటు ఆటలు.. రెండిట్లోనూ చంద్ర చురుకే! 1950ల్లో తన కాలేజీ రోజుల్లో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సల్వార్, కమీజ్తోనే క్రికెట్ ఆడేవారు ఆమె. ఈ ఆట కోసం ΄్యాంట్, షర్ట్ ధరించాల్సిన అవసరం ఉండదని, సంప్రదాయ దుస్తుల్లోనే చక్కగా ఆడొచ్చని తోటి అమ్మాయిలు గ్రహిస్తారని! క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్లోకి వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలు రావాలని చంద్ర ఆశించారు. అందుకే స్పోర్ట్స్వేర్తో వాళ్లు వెనుకడుగు వేయకుండా తనను ఓ రోల్మోడల్గా చూపేందుకు ప్రయత్నించారు ఆమె.ట్రయల్ బ్లేజర్ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ ఆట నుంచి ఆమె దృష్టి క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం మీదకు మళ్లింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ల కోసం రేడియోలో వ్యాఖ్యానం చెప్పడం మొదలుపెట్టారు. ఆల్ ఇండియా రేడియో కోసం కాకుండా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేరుగా వ్యాఖ్యానం చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ అవకాశం 1977లో వచ్చింది బాంబే (అప్పటి) – మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్తో! ఆ ఆటను వ్యాఖ్యానించడానికి స్టేడియంలో తొలిసారిగా మైక్ పట్టుకున్నారు చంద్ర నాయుడు. ఆ సందర్భమే ఆమెను తొలి మహిళా కామెంటేటర్ అనే ఖ్యాతిని తెచ్చి పెట్టింది. చరిత్రలో నిలిపింది. భారతీయ క్రికెట్ బ్రాడ్కాస్టింగ్లోనే ఓ సంచలనంగా మారింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్కి ఆల్ ఇండియా రేడియోలో ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి బీబీసీ మేల్ కామెంటేటర్స్ అబ్బురపడ్డారట.టీచర్గా ...క్రికెట్ కామెంటరీ నుంచి రిటైరయ్యాక చంద్ర నాయుడు ఇండోర్ వెళ్లిపోయి.. అక్కడి ప్రభుత్వ మహిళా పీజీ కాలేజ్లో లెక్చరర్గా చేరారు. చివరి వరకు అక్కడే పనిచేసి ప్రిన్సిపల్గా రిటైరయ్యారు. ఆమె తండ్రి తొలి టెస్ట్ మ్యాచ్కి ఎక్కడైతే కెప్టెన్గా వ్యవహరించారో అక్కడే ఆ లార్డ్స్ స్టేడియంలోనే 1982లో ఇండియా, ఇంగ్లండ్కు మధ్య జరిగిన గోల్డెన్ జుబ్లీ టెస్ట్ మ్యాచ్కు చంద్ర నాయుడు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆమె ఇండోర్లో.. 2021, ఏప్రిల్లో తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు. -
ఒక్క తప్పుతో.. వరల్డ్ కప్ ఆశలు గల్లంతు?
-
సియట్ అవార్డుల వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్ శర్మ (ఫొటోలు)
-
చీప్ ట్రీక్స్... పాక్ కి బుద్ధి చెప్పిన లేడీస్
-
Tilak : కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటతో పాక్ను గడగడలాడించాడు..
-
ట్రోఫీ, మెడల్స్ ని ఎత్తుకెళ్లిన మొహసిన్ నఖ్వీ..
-
బరిలో దిగితే విధ్వంసమే..!
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల అభిమాన క్రీడగా మారిన క్రికెట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. సాధారణంగా విధ్వంస రచన చేసే టీ20 ఫార్మాట్లో విజయాన్ని శాసించే స్థాయికి బౌలర్లు ఎదిగారు. గెలుపే ఆకాంక్షగా బ్యాటింగ్ బరిలో దిగితే పరుగుల వర్షం కురిపిస్తున్నారు. అనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా యమ క్రేజీ ఉన్న క్రికెట్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ రంజీ, దేశవాళీ టోరీ్నల్లో రాణిస్తున్నారు. ఏపీఎల్ (ఆంధ్ర ప్రీమియర్ లీగ్) లోనూ అదరగొడుతున్నారు. పురుషులే కాదు ..మహిళలు కూడా తాము ఎందులోనూ తీసిపోమని సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఆర్డీటీ అందిస్తున్న శిక్షణతో రాటు దేలిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. దత్తా.. సాటిలేని సత్తా ఆంధ్రా తరపున అండర్–19 విభాగంలో హర్యానాపై మచ్చా దత్తారెడ్డి ఏకంగా 172 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. మణిపూర్పై 105 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–23లో గోవాపై 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఏపీఎల్లోనూ రాణించాడు. కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్గా సత్తా చాటుతున్నాడు. బాల్ వేస్తే.. వికెట్ గిరగిరా.. గిరినాథరెడ్డి మంచి ఆల్రౌండర్. అండర్–25 విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించాడు. ఏపీఎల్లో రాయలసీమ కింగ్స్ జట్టుకు కెపె్టన్గా ఉన్నాడు. కుడిచేతి బ్యాట్స్మెన్, మీడియం పేస్ బౌలింగ్తో ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. అండర్–23లో మధ్యప్రదేశ్ జట్టుపై 7 వికెట్లు తీసిన రికార్డు ఉంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన గిరినాథరెడ్డి మంచి ఆల్రౌండర్గా గుర్తింపు దక్కించుకున్నాడు. మల్లి బౌలింగ్తో ప్రత్యర్థి బెంబేలు రాప్తాడుకు చెందిన మల్లికార్జున ఎడమ చేతి స్పిన్నర్. ఆంధ్ర తరపున అండర్–16లో సిక్కింపై 8, గోవాపై 7 వికెట్లు కూలదోశాడు. అండర్–19 కేటగిరిలో బెంగాల్పై 7 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్గా గుర్తింపు పొందాడు. బీసీసీఐ అండర్–16 టోరీ్నలో అత్యధికంగా 38 వికెట్లు తీసిన రెండో క్రీడాకారుడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు. ఏపీఎల్లోనూ రాణిస్తున్నాడు. ‘ప్రశాంత’ంగా ఆడేస్తూ.. డీబీ ప్రశాంత్కుమార్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో 85 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. హిమాచల్ప్రదేశ్పై ఆడిన మ్యాచ్లో 189 పరుగులు సాధించాడు. కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన డీబీ ప్రశాంత్కుమార్ బరిలో ఉన్నంత సేపూ ప్రశాంతంగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు విజయాకాశాలను దెబ్బ తీయడంలో దిట్టగా పేరుగాంచాడు. అర్జున్.. రన్ మెషీన్ కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అర్జున్ టెండూల్కర్ సత్తా చాటుతున్నాడు. అండర్ –19 , అండర్–23 కేటగిరిలో రాణించాడు. సీనియర్ వన్డే అంతర జిల్లా టోరీ్నలో 127 పరుగులు సాధించాడు. రెండు అర్ధసెంచరీలు చేశాడు. కుడి చేతి ఆఫ్ స్పిన్నర్గా ఆల్రౌండర్ ప్రతిభ చాడుతున్న అర్జున్ టెండుల్కర్ స్వగ్రామం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం. బౌలింగ్ మాయాజాలం కురుగుంట గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ డైలీ వర్కర్ రవి, ఆయన భార్య నారాయణమ్మ తాము పడుతున్న కష్టం తమ బిడ్డ వినయ్కుమార్ పడకూడదని భావించారు. చదువుతో పాటు క్రికెట్లోనూ శిక్షణ ఇప్పించారు. వారి నమ్మకాన్ని వినయ్కుమార్ వమ్ము చేయలేదు. 2013 నుంచి 2017 వరకు అనంతపురం క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆర్డీటీ కోచ్లు నరే‹Ù, ఆర్.కుమార్ వద్ద మెలకువలు నేర్చుకుని, అండర్–19, 23, 25 టోరీ్నలతో పాటు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లోనూ తిరుగులేని ప్రతిభను చాటాడు. తన బౌలింగ్ మాయాజాలంతో హజరా ట్రోపీలో ఏకంగా 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. -
ప్రధాని మోదీ ట్వీట్ పై PCB చీఫ్ మోషిన్ నఖ్వీ అక్కసు
-
వెస్ట్ ఇండీస్ టూర్ కోసం టీమిండియా స్క్వాడ్
-
తెలుగోడు ఎక్కడున్నా ఏలేస్తాడు..! తిలక్ వర్మకు వైఎస్ జగన్ అభినందనలు
-
ఆ ఒక్క టీమ్ ని ఓడిస్తే.. అమ్మాయిలు వరల్డ్ కప్ తెచ్చేస్తారు
-
ఆసియా కప్ లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
-
టీమిండియా తస్మాత్ జాగ్రత్త!
-
పాక్ స్పిన్నర్ చిల్లర వేషాలు.. చావుదెబ్బ కొట్టిన హసరంగా
-
అయ్యర్ రిటైర్మెంట్ ఝలక్?
-
యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్
దుబాయ్: యూఎస్ఏ క్రికెట్ (USA Cricket) సభ్యత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వేటు వేసింది. ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ఏ క్రికెట్ బోర్డు విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకుంది. కాగా, ఏడాది పాటు సమీక్షలు జరిపిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.అయితే, 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ఏ ఒలింపిక్, పారా ఒలింపిక్స్ కమిటీ గుర్తింపు పొందడానికి యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వైఖరి అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని మండిపడింది.ఇది కూడా చదవండి: భారత్కు ఎదురుందా!ఇదే సమయంలో, ఒలింపిక్స్, ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, సస్పెన్షన్ దురదృష్టకరమని పేర్కొంది. క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఇది అవసరమైన చర్య అని ఐసీసీ పేర్కొంది. అమెరికాలో ఆటగాళ్లను రక్షించడం, క్రీడను అభివృద్ధి చేయడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.🚨 USA suspension Clarity 🚨 Despite the suspension, the USA men’s team remains eligible and will participate in the upcoming ICC T20 World Cup. The ICC clarified that the suspension affects governance, not team eligibilityUSA Cricket was suspended by the ICC due to serious… pic.twitter.com/3nKLk63kbf— Vipin Tiwari (@Vipintiwari952) September 23, 2025 -
దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత
దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ (Harold Dickie Bird, 92) వయోభారంతో కన్నుమూశారు. మంగళవారం లండన్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (Yorkshire County Cricket Club) అధికారికంగా ప్రకటించింది. డికీ బర్డ్ 2014లో యార్క్షైర్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆటగాడిగా యార్క్షైర్, లీసెస్టర్షైర్ కౌంటీలకు ప్రాతినిథ్యం వహించినా, అంతర్జాతీయ అంపైర్గానే మంచి గుర్తింపు పొందారు. డికీ బర్డ్ తన కెరీర్లో 66 టెస్టులు, 69 వన్డేలు, 3 వరల్డ్ కప్ ఫైనల్స్కు అంపైర్గా వ్యవహరించారు. డికీ బర్డ్ క్రికెట్ అంపైరింగ్కు కొత్త నిర్వచనం చెప్పారు. అతని అంపైరింగ్ హాస్యం, స్టయిల్తో వైవిధ్యంగా ఉండేది. క్రికెట్కు న్యాయం చేసిన అంపైర్హెరాల్డ్ డెనిస్ "డికీ" బర్డ్ 1933 ఏప్రిల్ 19న యార్క్షైర్లో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్పై మోజు పెంచుకున్న అతను.. స్థానిక యార్క్షైర్ జట్టు తరఫున జెఫ్రీ బాయ్కాట్, మైఖేల్ పార్కిన్సన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడాడు.ఆటగాడిగా ప్రయాణం 1956 నుంచి 1964 వరకు Yorkshire, Leicestershire తరఫున 93 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 3,314 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోర్ 181 నాటౌట్. ఈ స్కోర్ను గ్లామోర్గన్పై సాధించాడు. ఆ సీజన్లో (1959) యార్క్షైర్ టైటిల్ గెలిచింది.యుక్త వయసులోనే అంపైరింగ్ వైపు..! డికీ బర్డ్ 32 ఏళ్ల యుక్త వయసులో ఆటను వీడి, తొలుత కోచింగ్వైపు వెళ్లాడు. ఆతర్వాత 1973లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ ద్వారా అంపైర్గా అరంగేట్రం చేశాడు. 20 ఏళ్ల తర్వాత అతను ఇంగ్లండ్ వెలుపల అంపైర్గా (1992లో Zimbabwe vs India) నిలిచాడు. 1995లో ఓల్డ్ ట్రాఫర్డ్లో అధిక సూర్యరశ్మి కారణంగా ఆట నిలిపిన సంఘటన అతని వైవిధ్య శైలికి ఉదాహరణ.రచయిత కూడా..!క్రికెటర్గా, కోచ్గా, అంపైర్గా రాణించిన డికీ బర్డ్లో మరో కోణం కూడా ఉంది. అతనిలో ఓ గొప్ప రచయిత ఉన్నాడు. అతని “My Autobiography” యూకేలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది.యార్క్షైర్లో విగ్రహంఇంగ్లండ్ క్రికెట్కు చేసిన సేవలకు గుర్తుగా MBE (Member of the Order of the British Empire) పురస్కారం అందుకున్నాడు. ప్రత్యేకించి యార్క్షైర్ కౌంటీకి అతను చేసిన సేవలకు గుర్తుగా యార్క్షైర్లో డికీ బర్డ్ విగ్రహం ఏర్పాటు చేయబడింది. -
వక్ర బుద్ధి మారదా..? మరో వివాదంలో ఆసియా కప్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
-
ఆహా... ఏమా ఆట... ఏమా పోరాటం!
ఆహా... ఏమా ఆట... ఏమా పోరాటం! బంతి బెంబేలెత్తిపోయేలా... బౌండరీలు చిన్నబోయేలా సాగిన పోరులో టీమిండియా పరాజయం పాలైనా... తమ ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంది. బెత్ మూనీ భారీ సెంచరీతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా రికార్డు స్కోరు చేయగా... స్మృతి మంధాన వీరవిహారం చేయడంతో ఒక దశలో గెలుపు సులువే అనిపించినా... ఆఖరికి భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. హర్మన్ప్రీత్ బృందం సిరీస్ కోల్పోయినా.. వన్డే ప్రపంచకప్నకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందుకుంది!న్యూఢిల్లీ: పరుగుల వరద పారిన పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు పోరాడి ఓడింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని భారత జట్టు 43 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. దీంతో ఆసీస్ 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. మొదట ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ సెంచరీతో విజృంభించగా... జార్జియా వాల్ (68 బంతుల్లో 81; 14 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (72 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఛేదనలో భారత జట్టు 47 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్స్లు) సుడిగాలి సెంచరీతో ప్రత్యరి్థని వణికించగా... దీప్తి శర్మ (58 బంతుల్లో 72; 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 52; 8 ఫోర్లు) హాఫ్సెంచరీలతో మెరిశారు. చివర్లో స్నేహ్ రాణా (35; 3 ఫోర్లు) పోరాడినా... టీమిండియా లక్ష్యానికి 43 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంపొందించేకు ఈ మ్యాచ్లో భారత జట్టు గులాబీ రంగు జెర్సీలు ధరించి ఆడింది.మహిళల అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన (50 బంతుల్లో) సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా స్మృతి నిలిచింది. ఆసీస్ ప్లేయర్ లానింగ్ (45 బంతుల్లో; న్యూజిలాండ్పై) అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు తరఫున ఇదే వేగవంతమైన శతకం కాగా... గతంలో ఆమె 70 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పుడు రెండో స్థానానికి చేరింది.స్కోరు వివరాలు ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: హీలీ (సి) హర్మన్ప్రీత్ (బి) క్రాంతి 30; జార్జియా (సి) (సబ్) ఉమ 81; పెర్రీ (సి) క్రాంతి (బి) అరుంధతి 68; మూనీ (రనౌట్) 138; గార్డ్నర్ (సి) రాధ (బి) రేణుక 39; తహిలా (ఎల్బీ) (బి) దీప్తి 14; గ్రేస్ (సి అండ్ బి) దీప్తి 1; జార్జియా (సి) హర్మన్ప్రీత్ (బి) రేణుక 16; అలానా (సి) స్నేహ్ రాణా (బి) అరుంధతి 12; గార్త్ (సి అండ్ బి) అరుంధతి 1; షుట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 412. వికెట్ల పతనం: 1–43, 2–150, 3–256, 4–338, 5–378, 6–379, 7–380, 8–399, 9–406, 10–412. బౌలింగ్: క్రాంతి 6–0–56–1; రేణుక 9–0–79–2; స్నేహ్ రాణా 10–0–68–1; అరుంధతి 8.5–0–86–3; దీప్తి 10–0–75–2; రాధ 4–0–48–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) మూనీ (బి) గార్త్ 10; స్మృతి (సి) గార్డ్నర్ (బి) గ్రేస్ 125; హర్లీన్ (సి) మూనీ (బి) షుట్ 11; హర్మన్ప్రీత్ (ఎల్బీ) (బి) గార్త్ 52; దీప్తి (సి) (సబ్) నాట్ (బి) తహిలా 72; రిచ (రనౌట్) 6; రాధ (సి) వాల్ (బి) జార్జియా 18; అరుంధతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 10; స్నేహ్ రాణా (స్టంప్డ్) హీలీ (బి) షుట్ 35; క్రాంతి (నాటౌట్) 8; రేణుక (సి) వాల్ (బి) గార్త్ 2; ఎక్స్ట్రాలు 20; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్) 369. వికెట్ల పతనం: 1–32, 2–85, 3–206, 4–216, 5–231, 6–261, 7–289, 8–354, 9–364, 10–369. బౌలింగ్: షుట్ 7–1–53–2; కిమ్ గార్త్ 9–1–69–3; గార్డ్నర్ 8–0–80–1; తహిలా 7–0–44–1; అలానా 7–0–60–0; గ్రేస్ హ్యారిస్ 2–0–20–1; జార్జియా 7–0–42–1. కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతీక రావల్ (10), హర్లీన్ డియోల్ (11) విఫలమైనా... స్మృతి మంధాన చెలరేగిపోయింది. మూడో ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదిన మంధాన... ఐదో ఓవర్లో 6, 4 కొట్టింది. ఆరో ఓవర్లో 4, 4, 6.. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. జోరుమీదున్న మంధానకు కెప్టెన్ హర్మన్ప్రీత్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు 32 బంతుల్లో హర్మన్ హాఫ్సెంచరీ పూర్తైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ 204/2తో నిలిచింది. ఇక గెలుపు సులభమే అనుకుంటుండగా... హర్మన్ అవుటైంది. కాసేపటికి స్మృతి కూడా వెనుదిరగ్గా... రిచా ఘోష్ (6) దురదృష్టవశాత్తు రనౌటైంది. ఒక దశలో టీమిండియా 289/7తో ఓటమి అంచులో నిలిచింది. ఈ సమయంలో స్నేహ్ రాణా అండతో దీప్తి శర్మ పోరాడింది. 48 బంతుల్లో 61 పరుగులకు చేయాల్సిన దశలో దీప్తి అవుట్ కావడంతో జట్టుకు పరాజయం తప్పలేదు. సూపర్ బ్యాటింగ్ ... ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు వన్డే సిరీస్ గెలవని భారత జట్టు... కొండంత లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ప్రతీక రావల్ (10), హర్లీన్ డియోల్ (11) విఫలమైనా... స్మృతి మంధాన చెలరేగిపోయింది. మూడో ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదిన మంధాన... ఐదో ఓవర్లో 6, 4 కొట్టింది. ఆరో ఓవర్లో 4, 4, 6.. తదుపరి ఓవర్లో మరో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. జోరుమీదున్న మంధానకు కెప్టెన్ హర్మన్ప్రీత్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో మంధాన 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు 32 బంతుల్లో హర్మన్ హాఫ్సెంచరీ పూర్తైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ 204/2తో నిలిచింది. ఇక గెలుపు సులభమే అనుకుంటుండగా... హర్మన్ అవుటైంది. కాసేపటికి స్మృతి కూడా వెనుదిరగ్గా... రిచా ఘోష్ (6) దురదృష్టవశాత్తు రనౌటైంది. ఒక దశలో టీమిండియా 289/7తో ఓటమి అంచులో నిలిచింది. ఈ సమయంలో స్నేహ్ రాణా అండతో దీప్తి శర్మ పోరాడింది. 48 బంతుల్లో 61 పరుగులకు చేయాల్సిన దశలో దీప్తి అవుట్ కావడంతో జట్టుకు పరాజయం తప్పలేదు. -
పాక్ మొసలి కన్నీరు.. చుక్కలు చూపించిన భారత్!
-
Team India: హ్యాండ్ షాక్ గొడవేంటి గురూ!!
-
జిత్తులమారి పాక్... దొంగ ఏడుపులు
-
తగిన శాస్త్రి జరిగింది! పాక్ సీట్ చింపిన భారత్
-
భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్పై పొలిటికల్ వార్
-
జీవనాధారం కోసం ఉద్యోగానికి ‘జై’... క్రికెట్కూ ‘సై’
సాక్షి క్రీడా విభాగం : మన దేశంలో క్రికెట్ ఓ మతమైంది. కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల అంత స్థాయికి ఎదగలేకపోయినా సరే ఒక్కసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే చాలు... ‘గ్రేడ్’తో పని లేకుండా కోట్ల రూపాయల్లో వార్షిక పారితోషికం... పోటీలకు ఇంతని లక్షల్లో మ్యాచ్ ఫీజలు లభిస్తాయి. కాబట్టి ఆటగాడైతే చాలు... దేశవాళీ క్రికెట్తోనూ ఆటతోనే విలాసవంతంగా బ్రతికేస్తాడు. అంతెందుకు ఒక్క ఐపీఎల్ సీజన్లో జూనియర్ స్థాయి ఆటగాడైన సరే అదృష్టం తలుపుతట్టి వేలంలో ఆయా జట్లకు ఎంపికైనా చాలు మిగతా జీవితమంతా సుఖమయం అవుతుంది. అయితే ఇదంతా భారత్లోనే చెల్లుతుంది. కానీ ఇతర దేశాల్లోని క్రికెటర్లు మైదానంలో చెమటోడ్చాలి. ఆఫీస్లో ఉద్యోగం చేయాలి. చాలా దేశాల్లో ఇలానే... క్రికెట్ ఆడే ఎన్నో దేశాల్లో ఇలాగే ఉంటుంది. కేవలం బ్యాట్ పట్టి నెట్స్లో ప్రాక్టీస్ చేసి, మ్యాచ్లపుడు మైదానంలో దిగితే సరిపోదు. జీవనాధారం కోసం ఉద్యోగం లేదంటే వ్యాపారం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాల్సిందే! తాజా ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలో ఉన్న ఒమన్ క్రికెటర్లు కూడా ఇదే చేస్తారు. రూపాయి మారకం విలువ పరంగా ఒమని రియాల్ (ఒమన్ కరెన్సీ) మనకంటే చాలా విలువైందే అయినా... క్రికెట్లో మాత్రం బలహీనమైంది. అక్కడి ప్రొఫెషనల్ క్రికెటర్లు సైతం తెల్లారితే లంచ్ బాక్స్లు కట్టుకొని ఆఫీస్కు వెళ్తారు. సాయంత్రమైతేనే ఆటకు సిద్ధమవుతారు. మ్యాచ్లు, పెద్ద పెద్ద సిరీస్లు ఉంటేనే పక్షం లేదంటే నెలకు మించి సెలవులు పెట్టి మెగా ఈవెంట్లు ఆడతారు. ఇది ముగియగానే ఒమన్ ఆటగాళ్లు మళ్లీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఇవి ఎవరో ‘నెట్టింట’ పెట్టిన విషయాలో, ‘షార్ట్స్’, ‘రీల్స్’లో చెప్పిన కబుర్లో కాదు... స్వయంగా ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్, ఆల్రౌండర్ సుఫియాన్ మెహమూద్ వెల్లడించిన వాస్తవాలు. ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం క్రికెటే తమ కెరీర్ కానేకాదని జతిందర్ స్పష్టం చేశాడు. తమ తొలి ప్రాధాన్యం ఉద్యోగమేనన్నాడు. ఆటను మొదలు పెట్టిన తొలినాళ్లలో మా ప్రాధాన్యమంతా ఉద్యోగానికే ఉండేదని, క్రికెట్ ఆట తమకు రెండో ప్రాధాన్యమని ఒమన్ కెప్టెన్ చెప్పాడు. ‘నేనే కాదు చాలామంది ఇదే చేస్తారు. ఠంచనుగా ఉద్యోగం చేసేందుకు బయల్దేరతారు. క్రికెట్ను ఓ ప్రత్యామ్నాయంగానే చూస్తారు. అయితే ఇప్పుడు ఆసియా కప్ లాంటి పేరొందిన సిరీస్ ఆడటం ద్వారా క్రికెట్ కల పెద్దగా అనిపిస్తుంది. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని జతిందర్ అన్నాడు. కాంక్రిట్పై కష్టాలెన్నో... ఒమన్లో క్రికెట్కు ప్రత్యేకించి టర్ఫ్ గ్రౌండ్లు అంటూ లేని రోజుల్లో తాము సిమెంట్ వికెట్లపైనే ఆడాల్సి వచ్చిందని, 2008లో ఆస్ట్రోటర్ఫ్ వినియోగంలోకి వచ్చినా... మూడేళ్ల తర్వాతే 2011 నుంచి పూర్తిస్థాయి టర్ఫ్ గ్రౌండ్పై క్రమం తప్పకుండా ఆడుతున్నామని జతిందర్ ఒమన్ క్రికెట్ కష్టాలను చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఫలితం (ప్రాభవం లేని క్రికెట్)లేని ఆట కోసం ఎందుకు కష్టపడాలని ఎన్నోసార్లు అనిపించినా... ఏదో క్రికెట్పై ఉన్న కాస్త మక్కువే ఇక్కడిదాకా తీసుకొచ్చిందని వివరించాడు. 36 ఏళ్ల జతిందర్ ఇప్పటి వరకు 36 వన్డేలాడి 1704 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టి20ల్లో 115 స్ట్రయిక్రేట్తో 1120 పరుగులు సాధించాడు. మరోవైపు 34 ఏళ్ల ఆల్రౌండర్ సుఫియాన్ 8 వన్డేలాడి 107 పరుగులు చేయడంతో పాటు 24.50 సగటుతో 6 వికెట్లు కూడా తీశాడు. తనకు టీమిండియాలో గిల్, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, అర్ష్ దీప్, తిలక్ వర్మ అంటే ఇష్టమని చెప్పాడు. క్రికెటెందుకు... చదువుకో ముందు! సుఫియాన్ ఒమన్ క్రికెట్ జట్టుకు ఎంపికవగానే అతని తల్లిదండ్రులు ససేమిరా అన్నారట! ఒమన్లో క్రికెట్కు భవిష్యత్తే లేదని, ఉన్నత చదువులు చదివి ఉన్నతోద్యోగంపైనే దృష్టి సారించాలని తన తల్లిదండ్రులు గట్టిగా చెప్పారని పేర్కొన్నాడు. ‘కానీ క్రికెట్ అంటే పిచ్చి. నాపై ఉన్న నమ్మకమే ఆటవైపు నడిపించింది. 2016 టి20 ప్రపంచకప్ అర్హత సాధించగానే మేం పడిన కష్టాలకు సాంత్వన చేకూరింది’ అని సుఫియాన్ తెలిపాడు. ఒమన్ క్రికెట్ నిలబడటానికి ఆ మెగా ఈవెంట్ ఎంతగానో దోహదం చేసిందన్నాడు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. -
Asia Cup: గంభీర్ గుండాగిరి! ఫైర్ అయిన అయ్యర్
-
కోహ్లి ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా?
-
కాలం నను తరిమిందో సూలంలా ఎదిరిస్తా రోహిత్ మాస్
-
కెప్టెన్ అయ్యర్ గిల్ కు భారీ షాక్
-
‘కౌంటీ కల నెరవేరింది’
హైదరాబాద్: కౌంటీ క్రికెట్లో హాంప్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు టీమిండియా ప్లేయర్, హైదరాబాదీ క్రికెటర్ ఠాకూర్ తిలక్వర్మ పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలు... జీవిత కాలం పాటించనున్నట్లు వెల్లడించాడు. భారత జాతీయ జట్టు తరఫున 4 వన్డేలు, 25 టి20లు ఆడిన తిలక్ వర్మ... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ‘కెరీర్ ప్రారంభించిన సమయంలో ఏదో ఒక రోజు కౌంటీ క్రికెట్ ఆడాలనుకున్నా. నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ ఏడాది హాంప్షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్తో పాటు, పరిమిత ఓవర్ల మ్యాచ్లు సైతం ఆడాను. కేవలం ఆటలోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వాటిని కెరీర్ ఆసాంతం అనుసరిస్తా. హాంప్షైర్ యాజమాన్యానికి ధన్యవాదాలు’ అని తిలక్ వర్మ గురువారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఈ సీజన్లో హాంప్షైర్ తరఫున మొత్తం 7 మ్యాచ్లాడిన తిలక్ 412 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 హాఫ్సెంచరీలు ఉన్నాయి. తన బౌలింగ్తో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మరోవైపు హాంప్షైర్ కూడా తిలక్పై ప్రశంసలు కురిపించింది. ‘సుదీర్ఘ ఫార్మాట్లో అతడి తొలి శతకం హాంప్షైర్ జట్టు తరఫున నమోదైంది. మేం అంచనా వేసిన దానికంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడాడు, తిలక్లో అపార ప్రతిభ ఉంది. గణాంకాలు పక్కనపెడితే అతడు జట్టుకు చేకూర్చిన బలం వెలకట్టలేనిది’ అని హాంప్షైర్ క్లబ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 28 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఈ జోనల్ టోరీ్నతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే నెల యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) వేదికగా జరగనున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో బరిలోకి దిగే భారత జట్టులో తిలక్కు చోటు దక్కడం దాదాపు ఖాయమే! -
సిక్సర్ల సునామీ.. ఏకంగా..!
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్కు మెరుపు ఆరంభం లభించింది. నిన్న (ఆగస్ట్ 9) విజయవాడ సన్షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా 32 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయలసీమ రాయల్స్.. పైలా అవినాశ్ (39 బంతుల్లో 96; 4 ఫోర్లు, 11 సిక్సర్లు), గిరినాథ్ రెడ్డి (23 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయలసీమ ఇన్నింగ్స్లో ధృవ కుమార్ రెడ్డి 10 (సిక్స్), షేక్ రషీద్ 18 (4 ఫోర్లు), మద్దిల వర్దన్ 1, వాసు దేవరాజు 14, సత్య సాయి సాత్విక్ 2, సాయి ప్రణవ్ చంద్ర 1, జాగర్లపూడి రామ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. విజయవాడ బౌలర్లలో ఎల్ మోహన్, నరసింహ రాజు తలో 2 వికెట్లు పడగొట్టగా.. పృథ్వీ రాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బరిలోకి దిగిన విజయవాడ సన్షైనర్స్.. కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (48 బంతుల్లో 98; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), గరిమెల్ల తేజ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడటంతో మరో 19 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయవాడ ఇన్నింగ్స్లో మామిడి వంశీకృష్ణ 16, మున్నంగి అభినవ్ 0, ధీరజ్ కుమార్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. రాయలసీమ బౌలరల్లో జాగర్లమూడి రామ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
World Cup 2027: రోహిత్, కోహ్లి ఖేల్ ఖతం.. గంభీర్ గర్జన!
-
క్రికెట్ టీమ్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న పెద్ది షాట్!
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.All the best to the teams participating. Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025 -
అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఎంపిక
ఓ యువ క్రికెటర్ 17 ఏళ్లు కూడా నిండకుండానే జాతీయ జట్టుకు నాయకుడయ్యాడు. 17 ఏళ్ల జాక్ వుకుసిక్ (Zach Vukusic) క్రొయేషియా జాతీయ పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా ఎంపికైన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.కెప్టెన్గా ఎంపికైన రోజే (ఆగస్ట్ 7, 2025) సైప్రస్పై విజయం సాధించి జాక్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులో అంతర్జాతీయ విజయం సాధించిన కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన జాక్.. 2007, సెప్టెంబర్ 30న జన్మించాడు.జాక్ క్రొయేషియా తరఫున 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 139 స్ట్రయిక్రేట్తో 197 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. జాక్ ఇంగ్లండ్లో సోమర్సెట్ కౌంటీ అకాడమీకి కూడా ఆడుతున్నాడు. ఇటీవలే అతను ఇంగ్లండ్ స్టార్ పేసర్ డేవిడ్ విల్లే బౌలింగ్లో భారీ సిక్సర్ బాది వార్తల్లో నిలిచాడు. జాక్ ఫ్రాన్స్ ఆటగాడు నొమాన్ అంజాద్ (18 ఏళ్ల 24 రోజులు) రికార్డును అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. -
దులీప్ ట్రోఫీకి విజయ్ ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: టెక్కలికి చెందిన క్రికెటర్ త్రిపురాన విజయ్ మరో మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మెరవనున్నాడు. ఈ పోటీలు సెప్టెంబర్లో జరగనున్నాయి. జిల్లా నుంచి దులీప్ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి జిల్లా క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. సౌత్జోన్ జట్టుకు ఆంధ్రా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపిక కాగా.. అందులో విశాఖకు చెందిన రిక్కీబుయ్ ఒకరు కాగా.. మరొకరు త్రిపురాన విజయ్ కావడం గమనార్హం.2023–24 సీజన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ మ్యాచ్లలో 26 వికెట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రంజీ మ్యాచ్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దులీప్ ట్రోఫీకి ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ తాజాగా ఏపీఎల్ నాల్గో సీజన్లో రికార్డు స్థాయిలో రూ. 7.55 లక్షలు దక్కించుకున్నాడు. రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, మిడిలార్డర్ బ్యాటింగ్తోపాటు బెస్ట్ ఫీల్డర్గా రాణిస్తున్నాడు. విజయ్ తల్లిదండ్రులు వెంకటకృష్ణరాజు, లావణ్య టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటారు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. విజయ్ ప్రస్తుతం టెక్కలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.చాలా సంతోషంగా ఉందిదులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతాను. త్వరలో జరగనున్న ఏపీఎల్లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కోచ్లు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.– త్రిపురాన విజయ్, క్రికెటర్ -
IND Vs ENG: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
England Vs India: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం
-
రసవత్తరంగా ఇంగ్లాండ్-భారత్ ఐదో టెస్ట్
-
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
భారత్కు రానున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్లో పర్యటించాడు. నాడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. -
2028 ఒలింపిక్స్.. పాక్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్తో జెంటిల్మెన్ గేమ్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్లో క్రికెట్కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, రాబోయే ఒలింపిక్స్లో పాల్గొనే జట్లపై ఐసీసీ తాజాగా ఓ కంక్లూజన్కు వచ్చినట్లు తెలుస్తుంది. రీజియన్ల వారీగా టాప్ ర్యాంక్ జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికా క్వాలిఫై అయ్యే అవకాశముంది. ఆరో జట్టు ఎంపికపై క్లారిటీ లేదు. ఇదే జరిగితే పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల ఒలింపిక్స్ కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్లు లాస్ ఏంజెలెస్కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్ప్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు లేవు.మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి. -
ఫుట్బాల్లో డీలా... క్రికెట్లో ఇటలీల...
ఫుట్బాల్కు పెట్టింది పేరైన ఇటలీలో ఇప్పుడు మరో క్రీడ ప్రేక్షకాదరణ పొందుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్లో నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) చాంపియన్గా... మరో రెండుసార్లు (1970, 1994) రన్నరప్గా నిలిచిన ఇటలీ... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2018, 2022లో జరిగిన ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీకి అర్హత పొందలేకపోయిన ఆ జట్టు... వచ్చే ఏడాది జరగనున్న ఫుట్బాల్ విశ్వ సమరంలో బరిలోకి దిగడం కూడా అనుమానంగా మారింది. ఘన చరిత్ర... అంతకుమించిన వారసత్వం... అపార నైపుణ్యం... దేశవ్యాప్తంగా ఫుట్బాల్కు మెరుగైన మౌలిక వసతులు ఉన్నా ఈ క్రీడలో తిరోగమనం దిశలో పయనిస్తున్న ఇటలీ... కనీస సౌకర్యాలు లేని క్రికెట్లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రాక్టీస్ చేసేందుకు కనీసం పచ్చిక పిచ్లు కూడా లేకున్నా... ప్రపంచకప్నకు తొలిసారి అర్హత సాధించి భళా అనిపించింది. యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్కప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఇటలీ క్రికెట్పై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే దేశంలో క్రికెట్కు క్రేజ్ దక్కుతుందా అనే స్థాయి నుంచి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించే స్థాయికి ఇటలీ చేరుకుంది. క్లబ్లు, ఏజ్ గ్రూప్ మ్యాచ్లు, ప్రత్యేక టోర్నీలు, సన్నాహక మ్యాచ్లు ఇలా అన్నీ ఉన్న ఫుట్బాల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్న ఇటలీ... ప్రాక్టీస్ చేసేందుకు సరైన మైదానాలు, మెరుగయ్యేందుకు అవసరమైన కనీస వసతులు లేని క్రికెట్లో మాత్రం రాణిస్తోంది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలస వచ్చిన ప్లేయర్లతో నిండిన జట్టు... వారం మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతాల్లో వీలు చిక్కినప్పుడు మాత్రమే సాధన చేసే ప్లేయర్లతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందడం అంటే మామూలు విషయం కాదు. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్లో పటిష్ట టీమిండియాతో ఆడాలనుకుంటున్నట్లు ఆ జట్టు సారథి జో బర్న్స్ వెల్లడించాడు. ఆరస్టేలియా నుంచి ఇటలీకి... ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ కొన్నేళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్న్స్ పూర్వీకులుఆ్రస్టేలియాకు వెళ్లగా... ఇప్పుడు మెరుగైన కెరీర్ కోసం అతడు తిరిగి ఇటలీకి చేరుకున్నాడు. అప్పటికే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... వారికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోగా... బర్న్స్ రాకతో ఆ ఇబ్బంది తీరింది.అతడితో పాటు ఆ్రస్టేలియాలో దేశవాళీ క్రికెట్ ఆడిన హ్యారీ మనెంటి, బెన్ మనెంటి... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడిన గే, స్టివర్ట్ వంటి ప్లేయర్లు... జాతీయ జట్ల తరఫున అవకాశం దక్కని ఉపఖండ ఆటగాళ్లతో ఇటలీ జట్టులో ప్రతిభకు కొదవ లేకుండా ఎదిగింది. బర్న్స్ సారథ్యంలో ఎప్పటికప్పుడు మెరుగవుతున్న ఇటలీ జట్టు... నెదర్లాండ్స్ తర్వాత ఐసీసీ టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించిన యూరప్ జట్టుగా నిలిచింది. కెవిన్ ఒబ్రియాన్ కోచింగ్లో... ఐర్లాండ్కు చెందిన ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రియాన్ ఓసారి ఇటలీలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి యువ ఆటగాళ్ల నైపుణ్యం చూసి ముచ్చట పడ్డాడు. మెరుగైన వసతులు లేకపోయినా... ప్లేయర్లలో ఏదో సాధించాలనే తపనను గమనించాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని ప్రపంచకప్ స్థాయిలో మెరుపులు మెరిపించిన ఒబ్రియాన్.. అనంతరం కాలంలో ఇటలీ క్రికెట్ జట్టు సహాయక కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు దశ తిరిగింది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్పై ఐర్లాండ్ రికార్డు లక్ష్యఛేదనతో ఒక్కసారిగా స్టార్గా మారిన ఒబ్రియాన్... ఇటలీ ప్లేయర్లకు గొప్పగా శిక్షణనిచ్చాడు. ఇటలీ జట్టు టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడంతో తను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అయిందని ఒబ్రియాన్ అన్నాడు. ‘కోచ్గా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. అసలు కోచింగ్ వైపు అడుగులు వేసినప్పుడు ఇదంతా ఊహించలేదు. కానీ ప్లేయర్లు నిబద్దతతో కృషి చేసి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో 2007 వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై ఐర్లాండ్ జట్టు విజయాలు సాధించడంలో ప్లేయర్గా ఒబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు. సహాయక కోచ్గా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే ‘ఏజ్ గ్రూప్ క్రికెట్’కు ప్రాధాన్యత ఇచ్చి వాటి ఫలితాలు బోర్డుకు అందించాడు. ప్రపంచకప్తో ఆదరణ దక్కేనా! యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభానికి రెండు వారాల ముందు... ఇటలీ జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒలింపిక్స్లో క్రికెట్ను క్రీడాంశంగా ప్రవేశపెట్టడంతో... ఇకపై మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. ఇటలీలో పచ్చిక పిచ్లు అందుబాటులో లేకపోవడంతో... కృత్రిమ పిచ్లపై సాధన చేసేలా జట్టును సిద్ధం చేసింది. ఇతర జట్లతో మ్యాచ్లసంఖ్యను సైతం పెంచింది. ‘టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడం ఒక కీలక మలుపు. మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సౌకర్యాలు మెరుగైనప్పుడే యువత ఇటువైపు అడుగులు వేస్తుంది.ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో పాల్గొంటే... ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తద్వారా దేశంలో ఆటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్పాన్సర్లు, ఎండార్స్మెంట్ల రూపంలో ఆదాయం పెరుగుతుంది’ అని ఇటలీ క్రికెట్ జట్టు మేనేజర్ పీటర్ డి వెనుటో అన్నాడు.కలుగమగె కథే వేరు...శ్రీలంకకు చెందిన క్రిషన్ కలుగమగె 15 ఏళ్ల వయసులో ఇటలీకి వలస వెళ్లాడు. మొదట అథ్లెట్ కావాలనుకున్న క్రిషన్ ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో... ఒక రెస్టారెంట్లో పిజ్జా మేకర్గా పనికి కుదిరాడు. జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు ఒకవైపు పని కొనసాగిస్తూనే... వ్యక్తిగత ఆసక్తిని చంపుకోలేక క్రికెట్ను కొనసాగించాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ 2022లో ఇటలీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటలీలో క్రికెట్కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో... ఆ తర్వాత కూడా అతడు రెస్టారెంట్ ఉద్యోగం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం చేసే పనిని పక్కన పెట్టిన క్రిషన్... ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించిన తర్వాత వచ్చిన స్పందనతో ఆశ్చర్యపోయాడు. ‘క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ వందలాది మంది పూలు, స్వీట్లతో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఏమాత్రం ఊహించనిది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా’ అని కలుగమగె అన్నాడు. స్టీరింగ్ పక్కన పెట్టి... 2006లో కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్ సింగ్... అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ మాదిరిగా అక్కడ క్రికెట్కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ పొట్ట కూటి కోసం క్యాబ్ డ్రైవర్గా కొనసాగుతున్నాడు. 2024 టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సమయంలోనే ఇటలీ జట్టు త్రుటిలో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో... ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో... స్టీరింగ్ను పక్కన పెట్టిన జస్ప్రీత్ పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గ ఫలితం దక్కడం ఆనందంగా ఉందని అతడు వెల్లడించాడు. ‘వరల్డ్కప్కు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ జట్టులో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్లమయ్యాక ముందు తరాలకు చెప్పుకునేందుకు ఇంతకు మించి ఇంకేం కావాలి’ అని అన్నాడు. -
Indian Cricket: టీమిండియాలోకి రైతుబిడ్డ
-
ICC: ర్యాంకింగ్తో ఖరారు చేస్తారా?.. క్వాలిఫయింగ్ టోర్నీ ఉంటుందా?
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, నిబంధనలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం సింగపూర్లో జరిగింది. విశ్వక్రీడల్లో క్రికెట్ కోసం ఐసీసీ వర్కింగ్ గ్రూప్ (ICC Working Group)ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. ఈ గ్రూప్ సిఫార్సులతోనే ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడ నియమావళిని ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది. శుక్రవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ల కమిటీ (సీఈసీ) సమావేశంలో ప్రధానంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుపైనే చర్చ జరిగింది. ఒలింపిక్స్ కోసం ఈ గ్రూప్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పటికీ చాన్నాళ్లుగా ఇది పెండింగ్లో పడింది. ఇక ఇప్పుడు వేగవంతం చేయాల్సిన అవసరం వచ్చిందని పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఈసీ, క్రికెట్ బోర్డులు... ఈ రెండింటి నుంచి సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ బృందానికి పలు బాధ్యతలు అప్పగిస్తారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత పద్ధతిని ఖరారు చేయడం, ఐసీసీ వర్గాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వర్కింగ్ గ్రూప్ పని చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. విశ్వక్రీడల కోసం ర్యాంకింగ్తో జట్లను ఖరారు చేయాలా లేదంటే క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించడం ద్వారా జట్లను ఒలింపిక్స్కు పంపించాలా అన్న అంశాన్ని వర్కింగ్ గ్రూప్కే వదిలేయాలని ఐసీసీ చైర్మన్ జై షా సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల కనీస వయస్సును 15 ఏళ్లుగా ఉంటేనే మంచిదని ఐసీసీ కమిటీ ఇదివరకే సిఫార్సు చేసింది. ఐసీసీ నూతన సీఈఓ సంజోగ్ గుప్తాకూడా 15 ఏళ్ల వయసు ప్రామాణికమేనని బలపరిచారు. ఐసీసీ ఉన్నతస్థాయి సమావేశంలో జై షా, సంజోగ్ సహా పలువురు ఐసీసీ బోర్డు కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్లోని విఖ్యాత ఎల్ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది. » ఒలింపిక్స్లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి. -
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. షెడ్యూల్ విడుదల
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్తో క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్లో క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్లు లాస్ ఏంజెలెస్కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్ప్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు లేవు.మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.ఒలింపిక్స్లో క్రికెట్కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు బేస్బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్ (సిక్సస్), స్క్వాష్ జోడించబడ్డాయి. -
‘రికార్డులు ఉన్నది తిరగరాయడానికే’
జొహన్నెస్బర్గ్: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.అయితే అందుకు భిన్నంగా ముల్డర్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు. మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్ ఐదో స్థానానికి చేరాడు. -
పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్
-
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం
-
ఆర్జే మహ్వశ్తో డేటింగ్.. చాహల్ బయటికి చెప్పేశాడుగా!
టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ మ్యాచ్లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఆర్జే మహ్వశ్ ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ మద్దతుగా నిలిచింది. పంజాబ్ ఆడిన అన్ని మ్యాచ్లకు హాజరై సందడి చేసింది. దీంతో చాహల్తో డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ పలు కథనాలొచ్చాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ముద్దుగుమ్మ.అయితే తాజాగా చాహల్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్లో అతని ప్రేమ, డేటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. తన రిలేషన్ షిప్ గురించి "కౌన్ హై వో లడ్కీ? అంటూ చాహల్ను ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ 'నాలుగు నెలల కిందటే.. ఇండియా మొత్తం తెలుసు' అంటూ మాట్లాడారు. ఇది చూసిన నెటిజన్స్ పరోక్షంగా ఆర్జే మహ్వశ్ అని క్లారిటీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పేరు ప్రస్తావించకపోయినా నెట్టింట మాత్రం తెగ వైరల్గా మారింది. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం చాహల్ను ఆట పట్టించారు.కాగా.. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే ఆర్జే మహ్వశ్తో కలిసి చాహల్ మొదటిసారి ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ల కనిపించారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా కపిల్ షోలో చాహల్ కామెంట్స్ చూస్తుంటే మహ్వస్తో డేటింగ్ కన్ఫామ్ చేసినట్లేనని నెటిజన్స్ భావిస్తున్నారు. -
ఊహలకందని విధ్వంసం.. 78 బంతుల్లో 28 సిక్సర్ల సాయంతో 263 పరుగులు
అమెరికాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్లో ఊహలకందని విధ్వంసం జరిగింది. ఎడిసన్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించే ఓ ఆటగాడు 78 బంతుల్లో 17 ఫోర్లు, 28 సిక్సర్ల సాయంతో 337.18 స్ట్రయిక్రేట్తో 263 పరుగులు (నాటౌట్) చేశాడు. క్రికెట్ చరిత్రలో బహుశా ఇంతటి విధ్వంసం ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్కు అధికారిక గుర్తింపు ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇంతటి విధ్వంసానికి కారకుడు ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by Loudoun Cubs Cricket Academy (@loudouncubs)వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట అమెరికాలో క్రికెట్ లీగ్ ఆఫ్ న్యూజెర్సీ (CLNJ) అనే క్రికెట్ టోర్నీ (40 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఇందులో భాగంగా ఎడిసన్ క్రికెట్ క్లబ్, ఈసీసీ షార్క్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రౌనక్ శర్మ (ఎడిసన్ క్రికెట్ క్లబ్) అనే ఆటగాడు సిక్సర్ల సునామీ సృష్టించి 78 బంతుల్లో అజేయమైన 263 పరుగులు చేశాడు. ఇందులో రౌనక్ తన తొలి సెంచరీని కేవలం 27 బంతుల్లోనే చేయడం మరో విశేషం.Raunaq Sharma lit up club cricket with a jaw-dropping 263 off just 78 balls against ECC Sharks!🔥💯His knock, in a 40-over clash, stands as one of the most explosive and highest-scoring innings in limited-overs cricket history. (official or unofficial) pic.twitter.com/3MuBcCQ2QW— CricTracker (@Cricketracker) July 3, 2025ఇదే టోర్నీలో అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లోనూ రౌనక్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాడు. NJ Lions CCతో జరిగిన మ్యాచ్లో 81 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 209.88 స్ట్రయిక్రేట్తో 170 పరుగులు చేశాడు.దీనికి ముందు జరిగిన మరో టోర్నీలో (WMCB T20 League Elite Division) కూడా రౌనక్ ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓ మ్యాచ్లో 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన రౌనక్.. 220.65 స్ట్రయిక్రేట్తో 50.75 సగటున 406 పరుగులు చేశాడు. 33 ఏళ్ల రౌనక్ శర్మ భారత్లోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఆయన.. క్రికెట్ అవకాశాల కోసం యూఎస్ఏకు వలస వెళ్లాడు. ప్రస్తుతం రౌనక్ హ్యూస్టన్ స్టార్స్ అనే అమెరికన్ జట్టుకు ఆడుతున్నాడు. రౌనక్కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు చిన్నతనంలో కలిసి ఆడారట. -
క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ బీజీఎం కింగ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు ఓ రేంజ్లో తన టాలెంట్ బయటపెడతారు. అయితే తమన్లో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. క్రికెట్లోనూ మనోడు అదరగొట్టేస్తాడు. సీసీఎల్ లీగ్లో తెలుగు వారియర్స్ టీమ్లో కీలక ప్లేయర్ కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ తమన్ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. షార్ట్కి, స్లాట్కి తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అని అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన తమన్ తనదైన శైలిలోనే ఇచ్చిపడేశాడు. ఓకే రా.. వచ్చి నేర్చుకుంటా.. అడ్రస్ పంపు బే.. అంటూ అదే స్టైల్లో రిప్లై ఇచ్చాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. అనవసరంగా నువ్వే తెలియకుండా కామెంట్ చేశావంటూ అతనికి ఇచ్చి పడేస్తున్నారు. Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7— thaman S (@MusicThaman) June 25, 2025 Don’t bowl short bro 🤪🔥💥 !! pic.twitter.com/sIUMcd2iaY— thaman S (@MusicThaman) June 24, 2025 -
రెస్టారెంట్ బిజినెస్లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!
సిటీ వ్యాపార తెరపై బాలీవుడ్ నటీనటుల రంగ ప్రవేశం ఇప్పటికే ఊపందుకుంది. అదే బాటలో మరోవైపు క్రీడాకారులు, మరీ ముఖ్యంగా క్రికెట్ వీరులు భాగ్యనగర పిచ్పై అడుగుపెట్టడం మొదలైంది. జాతీయ స్థాయిలో వినోద, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఇతర రంగాలపై సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వారి వ్యాపార రంగానికి నగరం ఒక తిరుగులేని గమ్యంగా కనిపిస్తోంది.వరుసగా ఇక్కడ రెస్టారెంట్స్ ప్రారంభిస్తున్న వైనం వైవిధ్యభరిత కేఫ్ల నుంచి విలాసవంతమైన ఫైన్–డైన్ స్పాట్ల వరకూ కాదే వ్యాపారమూ కాలుపెట్టేందుకు అనర్హము అన్నట్టుగా సెలబ్రిటీలు నగరంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఇప్పటికే విభిన్న దేశాల, వైవిధ్యభరిత రుచులతో ఆహార ప్రియులకు వెల్కమ్ చెబుతున్న నగరం పలువురు సెలబ్రిటీల కొత్త రూట్కు బాటలు వేస్తోంది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే వేగవంతమైన వృద్ధితో, విస్తృతమైన వ్యాపార అవకాశాలతో స్వాగతం పలుకుతోంది హైదరాబాద్. ఈ నేపథ్యంలో నగరంలో ఆహార విపణి రంగంలో కాలు మోపిన క్రికెటర్లు, వారు నెలకొల్పిన రెస్టారెంట్ల విశేషాలు ఇవీ.. పేసర్..ఫ్లేవర్..క్రికెట్ ప్రేమికులకు చిరపరిచితమైన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నగరం వైపు తన బౌలింగ్ను గురిపెట్టాడు. ఆయన హైదరాబాద్లో తన సొంత విలాసవంతమైన రెస్టారెంట్, జోహార్ఫాను ఏర్పాటు చేశాడు. ఈ వారంలో ఇది ప్రారంభం కాబోతున్న ఈ రెస్టారెంట్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఆయన నెలకొల్పారు. జోహార్ఫా.. మొఘల్, పెర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాల మిశ్రమంతో నగరవాసులకు రాచరికపు కుకింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రాండ్’ ఎంట్రీ.. అంతర్జాతీయంగా పేరొందిన చదరంగం క్రీడాకారుడు గ్రాండ్మాస్టర్ అంకిత్ సైతం నగరంలో క్రీడాకారుల రాకకు తన వంతు ఊపు తెచ్చారు. యోగా, వెల్నెస్ నిపుణుడు కూడా అయిన అంకిత్.. గత మార్చి నెలలో జూబ్లీహిల్స్లో ఒక వినూత్నమైన ఆరోగ్య సాధనా కేంద్రాన్ని ‘అంకితం’ పేరిట ఏర్పాటు చేశారు. పైలేట్స్, యోగా, ధ్యానంతో పాటు జిమ్ వర్కవుట్స్ సైతం అందుబాటులోకి తెస్తూ పూర్తి స్థాయి వ్యాయామాలకు, వెల్నెస్ యాక్టివిటీలకు అంకితం అయిన వెల్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. రుచుల.. బ్యారక్స్.. గత ఏడాది డిసెంబర్లో సైనిక్పురిలో బ్యారక్స్ – ఆంటెరూమ్ను ప్రారంభించడం ద్వారా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా నగర ఆహార రంగంలోకి ప్రవేశించారు. మూడు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ప్రదేశం కేవలం రెస్టారెంట్.. అంత కంటే ఎక్కువ. ఇది పూర్తి స్థాయి సోషల్ గేదరింగ్ అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జాబితాలో కొత్తగా సిరాజ్ జోహార్ఫా చేరడంతో.. మరింత మంది క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు ఈ పంథాను అనుసరిస్తారని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. క్రీడల్లో అద్భుతమైన విజయాలతో నగరవాసులకు దగ్గరైన క్రీడాకారులు తమ వంటకాల్లో వైవిధ్యం ద్వారా కూడా తమను అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రన్మెషిన్.. వన్ 8తో వచ్చెన్.. భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ తన ప్రసిద్ధ వన్8 కమ్యూన్ రెస్టారెంట్ను గత ఏడాది మేలో నగరంలో ప్రారంభించారు. అనతి కాలంలోనే నగరంలో అత్యంత ట్రెండీగా, లగ్జోరియస్గా మారింది. నగరంలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్ దాని ప్రీమియం వైబ్ ప్రత్యేకమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్లో గత జనవరి నెలలో ఓ గెస్ట్కి స్వీట్ కార్న్ తీసుకున్నందుకు గాను రూ.525 బిల్ వేయడం అనే ఉదంతం వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో మీమ్ ఫెస్ట్గా మారింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
స్వదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
అండర్ వేర్లో క్రికెట్ అడిన స్టార్ హీరో.. ట్రోల్స్పై ఫన్నీ రిప్లై!
బాలీవుడ్ స్టార్ హీరో క్రికెట్ ఆడితే.. అందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటి క్రికెట్ ఆడితే తప్పేంటి? హీరోలు క్రికెట్ ఆడోద్దా ఏంటి? అంటారా? ఆ హీరో ఆటని ఎవరు తప్పుపట్టడం లేదు. ఆ ఆట ఆడేందుకు వేసుకొచ్చిన దుస్తులపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంతి-బ్యాట్ ఆట ఆడేందుకు అండర్వేర్ ధరించి గ్రౌండ్లోకి వచ్చాడు. దానికి సంబంధించిన వీడియోని సదరు హీరోనే ఇన్స్టాలో షేర్ చేయగా.. అదికాస్త వైరల్ అయి అతన్ని ట్రోలింగ్కి గురి చేసింది. ఆ హీరో ఎవరో కాదు.. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న టైగర్ ష్రాఫ్. 2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రానికి బాలీవుడ్ రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్కు వెళ్లిపోయాడు. తాజాగా ఈ యంగ్ హీరో, అక్షయ్ కుమార్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యలతో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే ఆ సమయంలో టైగర్ కేవలం అండర్వేర్ మాత్రమే ధరించాడు. తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోని ఇన్స్టాలో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యలతో కలిసి బీచ్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అయితే, టైగర్ ఒక్కడే అండర్వేర్లో ఆడటంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేసి, ట్రోల్ చేశారు. "చెడ్డీ ప్రీమియర్ లీగ్", "ఊర్ఫీ జావేద్ మేల్ వెర్షన్" అంటూ కామెంట్స్ చేశారు. కొందరు అతని ఫిట్నెస్ను ప్రశంసించినప్పటికీ, చాలామంది అతన్ని విమర్శించారు. తాజాగా ఈ ట్రోల్స్పై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ మరో వీడియోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అందులో ఈ సారి ట్రాక్ ప్యాంట్ వేసుకొని క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘ట్రాక్ ప్యాంట్లోనూ అదే స్థితి’ అని కాస్త ఫన్నీగా రాసుకొచాడు. ఇక టైగర్ ష్రాఫ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్య ఆయనకు సరైన హిట్ పడలేదు. ఆయన చివరగా నటించిన సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం బాఘీ4 చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
రోహిత్ ను చావు దెబ్బ తీసింది ఇతనే!
-
ఈ ఏడాది... కలిసొచ్చింది!
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్బాష్ టి20 లీగ్లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ), ఎఫ్ఏ కప్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్..నేషనల్ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ) లీగ్లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్బీఏ ఫైనల్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్లో పీఎస్జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ...టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్లో పోటీ పడుతున్న ఆర్సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్గార్ట్ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ వీఎఫ్బీ స్టుట్గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్గా నిలిచిన స్టుట్గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్పూల్ను మట్టికరిపించి చాంపియన్గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్హామ్ ఎఫ్సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. -
Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!
-
IPL 2025: శ్రేయస్ వేట..గంభీర్ విలవిల
-
లక్నోను చిత్తు చిత్తుగా ఓడించిన సన్రైజర్స్
-
కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్
-
పాక్కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం
-
బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
-
IPL 2025: ఐపీఎల్ మళ్లీ షురూ
-
ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్లో కోల్కతా నైట్రైడర్స్తో జరగాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు. -
IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్కతా నుంచి అహ్మదాబాద్కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. -
IPL 2025: ముంబై అంపైర్లను కొనేసిందా?
-
Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్
-
2026 ఏషియన్ గేమ్స్లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
వచ్చే ఏడాది జపాన్లో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్గనైజింగ్ కమిటీతో భేటి అనంతరం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఈ విషయాన్ని వెల్లడించింది. తదుపరి ఆసియా క్రీడల్లో క్రికెట్తో పాటు మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడకు కూడా అప్రూవల్ లభించింది. క్రితం ఆసియా క్రీడల్లో (2022 హాంగ్ఝౌ గేమ్స్, చైనా) లాగానే ఈసారి కూడా పురుషులు, మహిళల విభాగాల్లో క్రికెట్ పోటీలు జరుగుతాయి. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. 14 పురుష జట్లు, 9 మహిళల టీమ్స్ పాల్గొంటాయి.గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ను తొలిసారి 2010లో పరిచయం చేశారు. ఆతర్వాత కేవలం రెండు సార్లు (2014, 2022) మాత్రమే ఆసియా క్రీడల్లో క్రికెట్కు అనుమతి లభించింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంతో తదుపరి ఆసియా క్రీడల్లో కూడా క్రికెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.1900 (పారిస్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం ఇదే మొదటిసారి. కేవలం రెండు క్రికెట్ జట్లు పాల్గొన్న ఆ ఒలింపిక్స్లో ఫ్రాన్స్పై గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. గత ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత పురుషుల టీమ్ అత్యధిక సీడింగ్ (పాయింట్లు) ఆధారంగా గోల్డ్ మెడల్ గెల్చుకోగా.. హర్మన్ నేతృత్వంలోని భారత మహిళల టీమ్ ఫైనల్లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది. -
IPLలో గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం
-
చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన SRH
-
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
బిహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె అయిన తాజ్పూర్లో పుట్టిన ఆ బాలుడు ప్రస్తుతం క్రికెట్లో దూసుకుపోతున్నాడు. రైతుబిడ్డగా ఎదిగిన అతను ఆటలో ప్రావీణ్యం చూపుతూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్కు ఎంపికైన ఘటన సాధించిన అతనే వైభవ్ సూర్యవంశీ. మార్చి 27, 2011న పుట్టిన సూర్యవంశీది రైతు కుటుంబం. పోలంలో పని చేస్తేనే ఇంట్లో అందరూ పోట్టనింపుకునే పరిస్థితి వారిది. చిన్ననాటి నుంచి క్రికెట్పై వైభవ్కు వల్లమాలిన ఇష్టం.ఆ ఇష్టాన్ని తండ్రి సంజీవ్ గమనించారు. ఎనిమిదేళ్ల తన కొడుకు ముందు ముందు క్రికెట్లో అద్భుతాలు సష్టిస్తాడని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం తన మద్దతు అవసరం అని గ్రహించి, తన పోలాన్ని అమ్మేసి మరీ కొడుకుకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి క్రికెట్పై దష్టి పెట్టిన వైభవ్ శిక్షణ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు. సమస్తిపూర్కు తండ్రితోపాటు వెళ్లి అక్కడ కోచ్ల దగ్గర శిక్షణ పోందేవాడు. 12 ఏళ్లకే శిక్షణలో రాటుదేలాడు. తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొని ముంబయి జట్టుపై ఆడాడు. అక్కడే అతని ప్రతిభ అందరికీ తెలిసింది. అనంతరం అండర్–16, అండర్–19 టోర్నమెంట్లలో వైభవ్ తన సత్తా చాటాడు. ఒక్కో చోట తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ మేలైన క్రీడాకారుడిగా మారాడు. అండర్–19 ఏషియా కప్లో తన ఆటతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.ఇన్ని విజయాలు సాధించిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంపికై దేశమంతటికీ తెలిశాడు. 14 ఏళ్లకు రూ.1.10 కోట్ల పారితోషికంతో ఐపీఎల్కు ఎంపికై, అతి చిన్నవయస్కుడైన ఐపీఎల్ ఆటగాడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా మైదానంలో విజంభిస్తూ అందరి ప్రశంసలు పోందుతున్నాడు..pic.twitter.com/ElkZUyaI2z— Sujeet Suman (@sujeetsuman1991) April 24, 2025 -
IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై
-
రోహిత్ పై పాండ్యా విషం.. నువ్వు మారవా బ్రో?
-
సచిన్ టెండుల్కర్ బర్త్డే.. అరుదైన ఫొటోలు చూశారా? (ఫోటోలు)
-
Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో
-
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ క్రికెట్ గ్రౌండ్లోనే ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. మృతుడిని ఓల్డ్ బోయినపల్లి చెందిన ప్రణీత్(32)గా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.గత వారం రోజుల క్రితం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్కు శనివారం ఫిట్స్ రావడంతో అంబులెన్స్లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రశాంత్ గుండెపోటుకు గురై మృతిచెందాడు.ఇటీవలే కొన్నిరోజుల క్రితం...గుజరాత్లో ఓ ఎనిమిదేళ్ల బాలిక తరగతి గది కారిడార్లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విగతజీవిలా కిందకు వాలిపోవడం స్కూల్ సీసీటీవీలో రికార్డయింది. కాగా, ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. -
పొమోనాలో 2028 ఒలింపిక్స్ క్రికెట్ పోటీలు
దుబాయ్: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల వేదిక ఖరారైంది. 128 సంవత్సరాల విరామం అనంతరం విశ్వక్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా... ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా వివరాలు వెల్లడించారు. టి20 ఫార్మాట్లో పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ భారత్... మహిళల విభాగంలో ప్రస్తుత చాంపియన్ న్యూజిలాండ్ జట్లతో కూడిన పోస్టర్ను ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసింది.1900 పారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఈసారి లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ఒలింపిక్స్ ప్రధాన వేదిక లాస్ ఏంజెలిస్కు పొమోనా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పొమోనాలో జరగనున్న పోటీలతో ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనం చేయనుంది. విశ్వక్రీడల్లో క్రికెట్ను భాగం చేయడంతో ఆటకు మరింత ఆదరణ దక్కనుంది. టి20 ఫార్మాట్ ద్వారా ఇది విశ్వవ్యాప్తమై మరింత మంది అభిమానుల ఆదరణ దక్కించుకుంటుంది’ అని జై షా పేర్కొన్నాడు. 2023లో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ సమావేశంలో... విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టి20 క్రికెట్ పోటీలు నిర్వహించగా... 2022 బరి్మంగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల విభాగంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. -
IPL 2025: లక్నోపై చెన్నై విజయం
-
హైదరాబాద్ లోని పార్క్ హయత్లో అగ్నిప్రమాదం
-
ఒలింపిక్స్లో ఆరు క్రికెట్ జట్లు
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ క్రీడాంశంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో ఆరు, మహిళల విభాగంలో ఆరు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. టీమ్లో 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్కు అవకాశం దక్కింది. మ్యాచ్లన్నీ టి20 ఫార్మాట్లోనే జరగనున్నాయి. అయితే ఏ ఆరు జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్యదేశం కాకపోయినా... ఆతిథ్య జట్టుగా అమెరికాకు క్రికెట్ పోరులో అవకాశం దక్కడం ఖాయం. అంటే మరో ఐదు జట్లు మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించవచ్చు. ఏదైనా కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–5లో ఉన్న జట్లను ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్ టీమ్ అర్హత సాధిస్తే ఏ దేశం బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. క్రికెట్లో వెస్టిండీస్ పేరుతో కరీబియన్ ద్వీపంలోని వేర్వేరు దేశాలు కలిసి ఆడుతున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్లో మాత్రం ఈ దేశాలన్నీ విడిగా పోటీ పడతాయి. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు బార్బడోస్ టీమ్ ప్రాతినిధ్యం వహించింది. విండీస్ రీజియన్ పోటీల్లో విజేతగా నిలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది. మొత్తం 351 మెడల్ ఈవెంట్లు... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు మరో నాలుగు కొత్త క్రీడాంశాలకు చోటు లభించింది. బేస్బాల్/ సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్లను కొత్తగా చేర్చారు. పారిస్ ఒలింపిక్స్లో మొత్తం 329 మెడల్ ఈవెంట్లు ఉండగా... ఇప్పుడు మరో 22 జత కలవడంతో ఈ సంఖ్య 351కి చేరింది. స్విమ్మింగ్లో గరిష్టంగా 41 పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుష అథ్లెట్ల సంఖ్య (5,167)తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళా అథ్లెట్లు (5,333) బరిలోకి దిగనున్నారు.ఫుట్బాల్లో 12 పురుష జట్లు ఉంటే 16 మహిళా టీమ్లు ఉంటాయి. గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, కాంపౌండ్ ఆర్చరీలలో తొలిసారి మిక్స్డ్ టీమ్లు ఉండబోతున్నాయి. అథ్లెటిక్స్లో కూడా మొదటిసారి 4్ఠ100 మిక్స్డ్ రిలే ఈవెంట్ను చేర్చారు. ఓవరాల్గా అథ్లెట్ల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే 10,500 ఉండనుంది. -
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్! -
సన్ రైజర్స్ అడ్రెస్ గల్లంతు! ప్లే ఆఫ్ చేరాలంటే...
-
IPL : సిరాజ్ పగ కోహ్లి ఫ్యూజులౌట్
-
స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్ స్టోరీ వైరల్!
గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్కు బ్రేకప్ చెప్పిన మలైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.కుమార్ సంగక్కరగా పాపులర్ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించు కున్నాడు. చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించిఅనూహ్యంగా క్రికెట్ కరియర్లోకి1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్గా, శక్తివంతమైన బ్యాక్హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర 1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్కు కోచ్గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్కు చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ, తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు.(సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)ప్రేమకథ ఎలా మొదలైందంటేసంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్వుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్తో సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యెహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమపక్షులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్రస్తుత సీజన్కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. -
ఇషాన్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
-
లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో విజయం
-
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్లైన్లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్లో దగ్గుబాటి రానా, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
బౌలర్గా శ్రీలీల .. బ్యాట్స్మెన్గా ఎవరంటే?.. రాబిన్హుడ్ టీమ్ ప్రకటించిన నితిన్!
టాలీవుడ్ హీరో నితిన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వెంకీ కుడుముల డైరెక్షన్లో వస్తోన్న రాబిన్హుడ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నితిన్కు యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. రాబిన్హుడ్ టీమ్ నుంచి క్రికెట్ జట్టును తయారు చేయాలంటే ఎవరూ దేనికి సూట్ అవుతారో చెప్పాలంటూ హీరోను అడిగింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. మా క్రికెట్ టీమ్లో శ్రీలీల బౌలర్.. ఎందుకంటే ఆమె వయ్యారంగా బౌలింగ్ చేస్తే ఎవరైనా అవుట్ కావాల్సిందే.. వికెట్ కీపర్గా మా మైత్రి నిర్మాత రవిశంకర్.. అంపైర్గా వెంకీ కుడుముల.. బ్యాట్స్మెన్గా నేనే.. మా టీమ్లో క్యాచ్లో పట్టేది నవీన్.. మా టీమ్ ఓనర్గా డేవిడ్ వార్నర్ అంటూ ఫన్నీగా తమ రాబిన్హుడ్ టీమ్ను ప్రకటించారు. -
ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా
-
IPL : ఈసారి కప్ కొట్టే కెప్టెన్ ఇతనే..


