సౌమ్యకు ఘన నివాళి
సిద్దిపేటకమాన్: విధి నిర్వహణలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సిద్దిపేట ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ సౌమ్య చిత్రపటానికి సిద్దిపేట ఎకై ్సజ్ పోలీసు స్టేషన్లో సిబ్బంది సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సౌమ్య ఎకై ్సజ్ శాఖకే కాకుండా సమాజానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


