నిర్మల్ రూరల్ మండలం ముజ్గిలో మల్లన్న జాతర ఘనంగా సాగుతోంది. మరోవైపు కడెం మండలం అక్కకొండ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఉత్సవాల్లో వాగంగా దేవదేవులు మల్లన్న, లక్ష్మీనృసింహస్వామి సోమవారం ఉదయం రథాలపై భక్తులకు దర్శనమిచ్చారు.
వేకువ జామునే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథాలపై ఉంచి ఊరేగించారు. జాతరలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవ దేవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నమో మల్లన్న.. నమో నారసింహ నినాదాలతో జాతర ప్రాంగణాలు మార్మోగాయి.


