ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
సిద్దిపేటజోన్: లాభదాయకమైన వ్యవసాయ విస్తరణకు శిక్షణ తరగతులు దోహదపడతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి అన్నారు. స్థానిక ఎన్జీఓ భవన్లో మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 క్లస్టర్ పరిధిలోని 30మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పాల్గొన్నారు.


