ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రబోధించిన దైవ కుమారుడైన ఏసు క్రీస్తు సిలువ మరణం పొందిన రోజు (ఏప్రిల్ 3,శుక్రవారం)ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే (Good Friday 2026) నిర్వహించుకున్నారు.
పలు ప్రాంతాల్లో సిలువ యాత్రలు నిర్వహించారు. అలనాడు క్రీస్తును ముళ్ల కొరడాలతో కొట్టి, రక్తం చిందింపజేసి.. సిలువ వేసిన సన్నివేశాలను కళ్లకు కట్టేలా ఈ యాత్రలు సాగాయి.


