హైదరాబాద్లోని టెలివిజన్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన 'సురక్ష కా తిరంగా' సైబర్ అవగాహన కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తాను కూడా సైబర్ నేరాల బాధితుడినేనని, తన కుటుంబ సభ్యులను సైబర్ కేటుగాళ్లు 6-7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు.
బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఇన్వెస్ట్మెంట్ల పేరుతో మోసం చేయడానికి యత్నించారని తెలిపారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులు నంబర్ వన్ అని ప్రశంసించిన ఆయన, వారానికి ఒకసారి మొబైల్ పాస్వర్డ్, నెలకు ఒకసారి వైఫై పాస్వర్డ్ మారుస్తానని చెప్పారు.


