అవగాహనతోనే లెప్రసీ దూరం
కొండపాక(గజ్వేల్): అవగాహనతోనే లెప్రసీ (కుష్ఠు) వ్యాధిని దూరం చేసుకోవచ్చని జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి అన్నారు. మండలంలోని దుద్దెడలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అన్ని గ్రామాల్లో కృష్ఠు వ్యాధి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండీటీ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు. లెప్రసీ వ్యాధి నిర్మూలన కోసం గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, మండల వైద్యాధికారి శ్రీధర్, డీపీఎంఓలు పాల్గొన్నారు.
జిల్లా అధికారి డాక్టర్ నిర్మలారెడ్డి


