breaking news
Congress Party
-
తలుపులు తెరవండి.. వేరే పార్టీల వారిని చేర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు తలుపులు తెరవాలని రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర ఆరోగ్య, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. వేరే పార్టీలకు చెందిన వారిని కలుపుకుంటేనే బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి మీతోపాటు మేము ఉంటాం. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అభిమానించేంతలా చూసుకోవాలి. కార్యకర్తలతో మంచిగా ఉండండి. వారితో మంచిగా లేకుంటే మీరు డిస్కనెక్ట్ అవుతారు’అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమకు సమాచా రం ఉందన్నారు. గురువారం రాష్ట్రానికి వచ్చిన నడ్డా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘ఇప్పటికే ఒకసారి మన బస్సు (అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి) మిస్సయింది. ఇంకోసారి బస్సు మిస్ కానివ్వకండి. వేర్లు లేని చెట్ల లాగా మారకండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల వ్యతిరేకతే మనల్ని గెలిపిస్తుందనే భావనతో ఉండకండి. సొంతంగా పార్టీ గెలిచేందుకు మనం ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. నేను అవినీతికి పాల్పడను. ఇంకొకరిని అవినీతి చేయనివ్వను అన్న ప్రాథమిక సూత్రంతోనే మోదీ విజయం సాధించారు. మనమంతా కూడా మోదీ పేరు చెప్పుకొని గెలుస్తున్నా...సొంతంగా గెలుపు కోసం అనుసరించబోయే కార్యాచరణ ఉందా ? మీ అంత మీరు గెలిచేందుకు ఏం చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోండి. అవినీతితో పోరాడడంతోపాటు ఎల్లప్పుడూ ప్రజల పక్కనే చేదోడువాదోడుగా నిలిస్తే తప్పకుండా వారు ఆదరిస్తారు. మీ మీ కార్యక్షేత్రాలను వదలకుండా కష్టపడి పనిచేయాలి. లీడర్ల వెంట తిరిగినంత మాత్రాన లీడర్లు కాలేరు. రేపు కాంగ్రెస్ నేతలను (హిమాచల్లో) కలవడానికి వెళుతున్నాను. ఎందుకంటే వారిని కలిస్తే వారు మనవారు అవుతారు’అని నడ్డా దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటిమోహన్రావు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శాంతికుమార్, చింతల రామచంద్రారెడ్డి బండారు విజయలక్ష్మి, లంకెల దీపక్రెడ్డి, కప్పర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చిన సర్కార్ ఉండాలా ? ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ఏటీఎంగా మారిందని, అదే ప్రభుత్వం కొనసాగాలా? మారాలా? అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గురువారం ఓ హోటల్లో ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం–దౌత్యం–అభివృద్ధి’అంశంపై నిర్వహించిన మేధావుల గోష్టిలో నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ను అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీదని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హెచ్సీయూ వీసీ జె.అనురాధ, ఐఫ్లూ వీసీ ప్రొ.నాగళ్లపల్లి నాగరాజ్ ప్రసంగించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వివిధరంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సొంత సర్వేలో తేలిందన్న కేటీఆర్.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేల భయంతోనే సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైంది. మరోసారి ప్రజలు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని తెల్చిచెప్పారు...సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని.. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటారా..? కడియంకు కొండా వార్నింగ్..
-
రేవంత్ 20 ఏళ్ల రాజకీయం.. సీఎం కుర్చీపై కొత్త సమరం!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయనను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు.ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయనను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా, దానిని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్నదానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రావణుడి వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌటు వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడినని, విపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా!తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఏమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి రెండున్నర ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే.తారక రామారావు, మాజీ మంత్రి హరీష్లు చర్చకు సిద్దం అంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.మిడ్జిల్లో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్రావులను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరు అన్నా, వారు మిమ్మల్ని అన్నా ఇదేదో మీ రెండు పార్టీలకే సంబందించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు కదా! అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా! కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు కదా! పోలింగ్కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి.కేసీఆర్ గెలిస్తే పదివేలే రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15వేలు రూపాయలు వస్తాయని అన్నారా? లేదా? అప్పుడు అది సాధ్యమా? కాదా? అన్నది ఆలోచించలేదా? గతంలో అమెరికా టూర్లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఆ మానిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా! ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2500రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే! అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్నిచోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది. దానిని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలుచేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా, బీఆర్ఎస్ను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు. కేటీఆర్, హరీష్రావులకు, అదే టైమ్లో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాలకన్నా ప్రభుత్వంలో ఉన్నవారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, కొత్తగా మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసికి సంబంధించి రెండున్నర టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా ఉన్న మూసిని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు.అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు వ్యయం చేయాలన్న ఆలోచనను కూడా ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణ భారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే. కాని మానిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. విపక్షంగా బీఆర్ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ 28720 కోట్ల బకాయిపడ్డారని విమర్శిస్తున్నారు. వీటిపై తగురీతిలో జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలనవల్ల కలిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.కేసీఆర్ పాలన, తన పాలనపై చర్చకు సిద్దమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాలలో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభలలో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఉంటున్నాయి. తాను గుంపుమేస్త్రీనని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని, ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంతవరకు బాగానే ఉంటుంది కాని, గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే ఏదో మేకలు, గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్ల్రీ అని ఎద్దేవ చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రీ అని చెప్పుకున్నా, ఆ పదం అంత బాగున్నట్లు అనిపించదు.మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలు చెప్పనని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని రేవంత్ ప్రకటించారు. నిజంగా అలా చేయగలిగితే ఆయనను అభినందించవచ్చు. రేవంత్తో సహ రాజకీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారా? లేదా? అన్నది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమేమి చెప్పింది. వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్య సంధుడనని రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కాని తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అన్నది చర్చనీయాంశం.ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరు. తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో దైర్యంగా ప్రశ్నించగలిగ ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ మరీ ఘోరంగా పోలీసులను ప్రజలపై, ప్రశ్నంచేవారిపై ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కాని అబద్దాలు చెప్పను అన్న స్టేట్ మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాద్యమైనంతవరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్కు మరోసారి అభినందనలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సూర్యాపేట లో హైటెన్షన్.. సామెల్-ఛామల కిరణ్ వర్గాల మధ్య దాడి!
-
అమృతం కురిసిన రోజు
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు. వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.పాదయాత్రలతో చరిత్ర33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో! పథకాలే పతకాలుగా...2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి. మహా విషాదం2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్తో కలిసి చంద్రబాబు, రేవంత్లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీకి బిగ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికి ఒకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. ప్రధానమైన ఈ సమస్యను అధిగమిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ఇటీవలి సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం చేసిన సీరియస్ హెచ్చరికలను రాష్ట్ర నేతలు సీరియస్గా తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వెనుకడుగుపై నిర్దిష్ట కార్యాచరణ రూపకల్పనలో రాష్ట్ర బీజేపీ విఫలమవుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నా యి. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైనా స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముగ్గురు ముఖ్య నేతలు పర్యటించినా.... దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబద్ పరేడ్గ్రౌండ్స్లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, జూన్ 28–30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా.. రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనుకడుగు తప్పడం లేదంటున్నారు. తెలంగాణలో పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకొని, ప్రజల ఆదరణతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ పుంజుకోవడం మళ్లీ ఎన్నికల ముందు చతికిలబడడం ఓ ప్రహసనంగా మారడంతో అధినాయకత్వం తలపట్టుకుంటోంది. అధిష్టానం ‘మందు బిళ్ల’పనిచేస్తుందా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ మూడురోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడం, సమన్వయ లేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యనేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవడం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్నబిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగే ఇచ్చారు. బెంగాల్ కేడర్ కసి ఇక్కడెందుకు లేదు ? తాజాగా జరిగిన రాష్ట్ర కార్యవర్గభేటీలో పదేళ్లలో తృణముల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమబెంగాల్లో బీజేపీ కార్యకర్తలు ఎంతటి పీడన, అణచివేత, హత్యలు, అత్యాచారాలకు గురయ్యారో ఆ రాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ వివరించారు. అక్కడ తృణమూల్ అరాచకాలను ఎదుర్కోవడంతోపాటు, 15 వేల మంది కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లినా వెనుకడుగు వేయకుండా పోరాడారని, అలాంటి నిబద్ధత, కచ్చితంగా ఫలితాలు సాధించాలనే కసి రాష్ట్ర పార్టీలో ఎందుకు కరువైందని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యుల్లో ఎవరు పని చేస్తున్నారు? ఎవరు టైంపాస్ చేస్తున్నారో అధిష్టానం దగ్గర పూర్తి సమాచారం ఉందని బన్సల్ హెచ్చరిచ్చినట్టు తెలిసింది. బెంగాల్లో కార్యకర్తల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు కేసులకు సైతం వెరవకుండా రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల ఎకరాలు. రాష్ట్రంలోని పేదలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమి ఇది. ఈ భూములపై అసైనీలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసైన్డ్ భూములకే కాదు దాదాపు 7 లక్షల ఎకరాల పోడు భూములపై కూడా హక్కులిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ అధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుండగా..అప్పటినుంచి ఇప్పటివరకు అసైన్డ్ భూముల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతూనే ఉంది. అయితే తాజాగా.. మంత్రివర్గ భేటీలో దీనిపై చర్చ జరిగిన నేపథ్యంలో.. దీనికి సంబంధించి పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హక్కుల కల్పనతో పాటు ల్యాండ్ పూలింగ్, రెగ్యులరైజేషన్, పరిమిత అధికారాల కల్పన లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నప్పటికీ అసైన్డ్ భూములు కలిగిన పేదలకు ఉచితంగా హక్కులు కల్పించాలనే నిర్ణయానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అన్నివిధాలా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల విషయంలో ఏం చేయాలన్నా తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి (1977) సవరణలు చేయాల్సి ఉన్నందున చట్ట సవరణ ముసాయిదాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఏం జరిగింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం..పేదలకు హక్కులు కల్పించడం, తదుపరి పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడగా, అలా చేస్తే పేదల చేతుల్లో ఉండే కొద్దిపాటి భూములు అన్యాక్రాంతమవుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కొందరు చెప్పారు. మరికొందరు.. పూర్తి హక్కుల కల్పన కాకుండా నాలా తరహాలో భూమి వినియోగ మార్పిడి అధికారాలు కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ద్వారా అన్ని లక్షల ఎకరాల భూమి ఒకేదఫాలో మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశముందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇంకొందరు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రివర్గం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనానికి మంత్రుల కమిటీ లేదా భూచట్టాల నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. హక్కుల కల్పనకు సిఫారసులు అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి పలు సిఫారసులు వచ్చాయి. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీతో పాటు వ్యవసాయ కమిషన్ తమ సిఫారసులు పంపాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర అరి్థక సంస్థలు, భూ విధానాలపై పనిచేసే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు ఉండకూడదని, అలా ఉండడం పేదల ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదిస్తుందని వెల్లడించాయి. మార్కెట్లోని ఇతర వస్తువులు మాదిరిగా ల్యాండ్ మార్కెట్ కూడా సరళంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా ఈ నివేదికల్లో వ్యక్తమైంది. తర్వాతి పరిణామాలపై మల్లగుల్లాలు ఇంతవరకు బాగానే ఉన్నా.. హక్కుల కల్పన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనే ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతోందని పలు నివేదికలు చెపుతున్నాయని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, పేదలకు భూములు లేకుండా పోతాయనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టుగా.. ఇంత పెద్ద మొత్తంలో భూములు ఒకేసారి మార్కెట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనవుతుందనే మీమాంస కూడా ప్రభుత్వ పెద్దలను అయోమయంలో పడేస్తోందనే చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు..! ఒకవేళ పేదలకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించని పక్షంలో ప్రభుత్వం ముందు రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఇవి రెండూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిశీలించినవే కావడం గమనార్హం. అందులో ల్యాండ్ పూలింగ్ (పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వమే సమీకరించి వారికి ఆ భూమిలో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కొంత భాగం ఇవ్వడం) ఒకటి కాగా ఈ విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని అధ్యయనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా అసైనీల చేతుల నుంచి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్టుగా గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను వారికి ఉచితంగానే ఇచ్చేసి, ఇతరుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వ విలువకు క్రమబద్ధీకరించే వీలుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చిక్కులున్నా హక్కులు కల్పిస్తే మేలు అసైన్డ్ భూముల విషయంలో చాలా చిక్కులున్నాయి. భూరికార్డులు సరిగా లేవు. పట్టా మార్పిడి జరగడం లేదు. కొత్త పుస్తకాలు రావడం లేదు. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్నాయి. ఈ రికార్డులను సరిచేసి పేదలకు భద్రమైన భూమి హక్కులు కల్పించగలగాలి. భూముల జియో ట్యాగింగ్ చేయాలి. తాత్కాలిక భూదార్ ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ సరి చేసి శాశ్వత భూదార్ ఇవ్వాలి. ఏది ఏమైనా పేదలకు అసైన్ చేసిన భూమిపై వారికి పూర్తి హక్కులు ఇస్తే మేలు జరుగుతుంది. 25 లక్షల ఎకరాల భూమిలో అందరూ అమ్ముకోవాలనుకునే వారుండరు. – ఎం.సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు -
రంకెలు వేస్తే అంకెలు మారవు
సాక్షి, హైదరాబాద్: అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, రోజూ బయటపడుతున్న అవినీతి ఆరోపణలు, స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రోజుకో కొత్త అప్పుల లెక్క చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. మా మాట అసెంబ్లీలో ఒకటే.. బయట ఒకటే. మీరు మాత్రం శ్వేతపత్రంలో ఒకలా, అసెంబ్లీలో మరోలా, ప్రెస్మీట్లలో ఇంకోలా చెబుతున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ శిష్యుడిగా చెప్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లే. దీనిపై అసెంబ్లీలోనైనా, బహిరంగ వేదికపైనైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం..’అని మరోసారి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అప్పులు ఇప్పించేందుకు సచివాలయం చుట్టూ బాంబే, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారని లంచాలు ఇచ్చి అప్పులు తెచ్చే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన అప్పుల లెక్కలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్, భట్టి..ఎవరు చెప్పింది నిజం? ‘భట్టి విక్రమార్క వెల్లడించిన పత్రాల్లో.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న రూ.84,268 కోట్ల రుణాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రూ.15,118 కోట్ల అప్పును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో కలిపేశారు. ఈ రెండూ కలిపి రూ.99,386 కోట్లను 2023 డిసెంబర్ నాటికి ఉన్న మొత్తం బకాయి రూ.5,16,881 కోట్ల నుంచి తీసేస్తే అసలు అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం, కాగ్ నివేదిక, ఆర్బీఐ గణాంకాలు, ఎకనామిక్ సర్వే అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లేనని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్లు మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాత్రం రూ.1.77 లక్షల కోట్లే అని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? లేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పింది నిజమా? నాలుగు నెలల్లో అప్పు ఎలా తగ్గింది?..’అని హరీశ్రావు నిలదీశారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. అప్పుల కోసం రూ.వందల కోట్ల కమీషన్లు ‘ప్రస్తుత ప్రభుత్వం అప్పులు కూడా పారదర్శకంగా తీసుకురాలేక బ్రోకర్లకు వందల కోట్ల రూపాయల కమీషన్లు చెల్లిస్తోంది. టీజీఐఐసీ భూముల తాకట్టు ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు కోసం రూ.170 కోట్ల బ్రోకరేజ్ చెల్లించారు. హెచ్ఎండీఏ భూములపై మరో రూ.20 వేల కోట్ల అప్పు తెస్తే మొత్తం రూ.510 కోట్ల వరకు బ్రోకర్లకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. డిస్కంలు, హైదరాబాద్ కార్పొరేషన్లు, వాటర్ బోర్డు ద్వారా మరో రూ.70 వేల కోట్ల అప్పు సమీకరించే లక్ష్యంతో మొత్తం లక్ష కోట్ల అప్పులకు రూ.1,710 కోట్ల వరకు కమీషన్లు వెళ్తున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనను రావణుడితో, కాంగ్రెస్ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించారు. ముందుగా నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు. ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? ‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్హౌస్లో పండించిన గంజాయి, డ్రగ్స్ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్రావుకు మొయినాబాద్లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? ఆ పశుపతి ఫామ్హౌస్లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి ‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్దే అధికారం..’ అని రేవంత్ అన్నారు. రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్ను దత్తత తీసుకోవాలి ‘2006 జూలై 2 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం కాన్వాయ్కు ట్రాఫిక్ చిక్కులు శంషాబాద్ రూరల్: మిడ్జిల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్కు శనివారం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో కాన్వాయ్ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ జాంను క్లియర్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్
హైదరాబాద్: యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై ప్రసంగించారు.దేశంలోనే తొలిసారిగా యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇలాంటి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. నేషనల్ లీగల్ కాంక్లేవ్ లో న్యాయవాదులకు పరస్పర అనుభవాల మార్పిడి, సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి కాన్క్లేవ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిభ్, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, బిహర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది వివేక్ టoకీయా, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ రూపేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు నిఖిల్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నందితా రావు, సంజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ కాంగ్రెస్లో భగ్గుమన్న అసంతృప్తి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం ముదిరిపాకానపడింది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీయే ఈ లుకలుకలకు ఆజ్యం పోయడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్ను కొనసాగించాలంటూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద సంఖ్యలో కీలక నేతలు హాజరయ్యారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై అధిష్టానం ఆందోళన చెందుతోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా పార్టీ ముక్కలవుతుందా అని బెంబేలెత్తుతోంది.కాషాయం వైపు రంధావా చూపుగురుదాస్పూర్ కాంగ్రెస్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం రంధావా మాట్లాడుతూ.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితుల గురించి మాజీ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ రాజా వడింగ్లనే అడగాలంటూ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలతో ఇన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి..రాజకీయ పరిణామాల మధ్య చండీగఢ్ ఎంపీ మనీశ్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బుధవారం ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో తనకు చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యక్తులు, సంస్థల అభద్రతాభావానికి ఏదైనా చికిత్స ఉంటే బాగుండు’అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 45 ఏళ్లుగా తాను పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశానని, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు చాలా ఇచి్చందని అందులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై పరోక్ష దాడిగానే విశ్లేషకులు భావిస్తున్నారు.మొరిండాలో చన్నీ బలప్రదర్శన..పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో జలంధర్ ఎంపీ, మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అధిష్టానంపై పోరుబాట పట్టారు. స్వగ్రామం మొరిండాలోని నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు సహా 30 మంది దాకా కీలక నేతలు హాజరయ్యరు. పంజాబ్ కాంగ్రెస్లో బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న రాణా గుర్జీత్ (కపుర్తలా ఎమ్మెల్యే), పర్గత్ సింగ్ (జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే), ఓపీ సోనీ (మాజీ డిప్యూటీ సీఎం), భరత్ భూషణ్ ఆశు (మాజీ మంత్రి) తదితరులున్నారు.సమావేశానికి ఎమ్మెల్యేలు తృప్త రాజిందర్ బాజ్వా, కాలా థిల్లాన్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యరు. తదుపరి కార్యాచరణలపై వారంతా దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. చన్నీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయకుండా పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాదని సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే దర్శన్ బ్రార్ కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా చన్నీ పేరు ఖరారైనప్పటికీ, అనూహ్యంగా రాజా వడింగ్నే కొనసాగించారని ఆయన ఆరోపించారు.చన్నీ వ్యూహాలు.. ప్రధాన డిమాండ్లు..రాజా వడింగ్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని చన్నీ వర్గం బహిరంగంగానే వకాల్తా పుచ్చుకుంటోంది. చన్నీ రెండు ప్రధాన డిమాండ్లతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవారే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడం ఆనవాయితీ. 2017లో కెపె్టన్ అమరీందర్ సింగ్ సైతం అప్పటి పీసీసీ చీఫ్ ప్రతాప్ బాజ్వాను తప్పించి ఆ పదవిని దక్కించుకున్నారు. తద్వారా తన మద్దతుదారులకు టికెట్లు ఇప్పించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు చన్నీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజా వడింగ్ క్రెడిట్ తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే, 2022 ఎన్నికల తరహాలోనే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చన్నీ పట్టుబడుతున్నారు. పంజాబ్లో జాట్ సిక్కుల సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్ అధిష్టానం రాజా వడింగ్ను పీసీసీ చీఫ్గా కొనసాగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేసేందుకు చన్నీ పంజాబ్లోని 31 శాతం దళిత ఓటుబ్యాంకును అస్త్రంగా వాడుకుంటున్నారు. -
ఆగని అప్పుల రగడ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులపై చెలరేగిన వివాదం మూడో రోజు కూడా కొనసాగింది. తొలిరోజు.. కేటీఆర్ చేసిన బహిరంగ చర్చ సవాల్తో రభస ప్రారంభం కాగా, రెండో రోజు గురువారం గన్పార్క్, తెలంగాణ భవన్ వేదిక గా రచ్చరచ్చ అయ్యింది. మంత్రివర్గ భేటీలోనూ చర్చనీయాంశమైంది. ఇక శుక్రవారం అప్పులపై అధికార పక్షం, విపక్షం లేఖాస్ర్తాలు సంధించుకున్నాయి. తాను చెప్పిన అప్పు లెక్కలకు కట్టుబడి ఉన్నానంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు లేఖలు రాశారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్రావుకు లేఖలు రాసిన ఆయన.. తాను చెప్పిన అప్పు లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించినా, నిరూ పించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.దీనిపై చర్చించేందుకు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్కు వస్తున్నానని, బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సవాల్ చేశారు. చెప్పినట్లే సాయంత్రం ప్రెస్క్లబ్కు వెళ్లారు. బీఆర్ఎస్ నేతలు రాకపోవడంతో వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా మంత్రి జూపల్లి లేఖలపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్రావు.. తాను కూడా ఆయనకు ఒక లేఖ రాశారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల గణాంకాలతో పాటు, బీఆర్ఎస్ చేసిన అప్పుల లెక్కలను అందులో వివరించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి, తాను అప్పుల గురించి మాట్లాడిన వీడియోలను వాట్సాప్ ద్వారా మంత్రి జూపల్లికి పంపారు. ఇవి చూసిన తర్వాతైనా రాజీనామా చేయాలన్నారు. మరోవైపు సంగారెడ్డిలోనూ మాట్లాడుతూ..జూపల్లిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం భట్టి కూడా శుక్రవారం.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, కాంగ్రెస్ హ యాంలో చేసిన అప్పులు, చెల్లింపులపై గణాంకాలు వెల్లడించారు. -
‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా..నిరూపిస్తా’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, అది నిరూపిస్తానన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 3వ తేదీ) సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్ల కోసం మూడు కుర్చీలు వేశామని, కానీ వారు రాలేదన్నారు. దీనిలో భాగంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ‘ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా.. నిరూపిస్తా. దమ్ముంటే కాదని నిరూపించండి. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు మీరు చేసిందా కాదా?, మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు మీరు చేసింది కాదా?, మా ప్రభుత్వం చేసిన అప్పు గురించి నేను చాలెంజ్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత అప్పులకు వడ్డీ కింది రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా కట్టాం’ అని పేర్కొన్నారు.ఇక హరీష్ రావు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.. అందులో ఏమీ లేదని విమర్శించారు. ‘ నేను లేఖలో ప్రస్తావించిన వాటికి హరీష్ నుంచి సమాధానం రాలేదు. అసలు మీరు ఎందుకు ప్రెస్క్లబ్కు రాలేదో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
చర్చ.. రచ్చ!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్రావు, కేటీఆర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రెండు రోజులుగా మాటల యుద్ధం అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. గన్పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు హరీశ్ తరలింపు మంత్రులతో గన్పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్పార్క్కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్పార్క్కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు. అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి గాందీభవన్లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్పార్క్కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్కు సవాల్ విసిరారు. మళ్లీ తెలంగాణ భవన్కు హరీశ్ ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్రావు కంచన్బాగ్ పోలీస్స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. -
మీరు ఉండాల్సింది గన్ పార్క్ లో కాదు జూపార్క్ లో
-
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ఆకస్మిక బదిలీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారిణి జి. లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత బాధ్యతల నుండి బదిలీ చేస్తూ, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఐఏఎస్,ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ బదిలీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారిణి లక్ష్మీబాయి, మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడం దీనికి ప్రధాన కారణం. -
‘రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్కు లేఖలు రాశారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. సీఎం రేవంత్రెడ్డికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆరోపించారు. ఇటీవల రేవంత్రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నెగెటివ్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లోనే 46 మంది నాయకులు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, రేవంత్రెడ్డిని మార్చాలంటూ పలువురు మంత్రులు సైతం అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రేవంత్రెడ్డిని ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్లు మాత్రమే కాపాడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి వ్యవహారశైలి కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. గతంలో రేవంత్రెడ్డిపై మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించారని.. ఆ నివేదికను మనసులో పెట్టుకునే ఆమెకు ఎంపీ పదవి రాకుండా రేవంత్రెడ్డి అడ్డుకున్నారని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు -
పోలీసులతో వాగ్వాదం KTR అరెస్ట్
-
బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్ల నడుమ.. కేసీఆర్కు అద్దంకి ఫోన్
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల అప్డేట్స్.. తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశంలో హరీష్తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి ఎందుకు రాలేదు: హరీష్జూపల్లికి చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిమంత్రి జూపల్లికి విషయం లేకనే చర్చకు రాలేదుమంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానని సెల్ఫ్గోల్ వేసుకున్నారుఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుకేసీఆర్ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు: అద్దంకికేసీఆర్ బయటకు రావడానికి బయపడుతున్నాడు.బీజేపీ పొత్తులొ ఎక్కువ సీట్లు లాగేందుకు బిఆర్ఎస్ బలంగా ఉందని చెప్పేందుకు కేటీఆర్- హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు.జీతం తీసుకునేందుకే మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ వస్తున్నారు.కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్.కేటీఆర్, హరీష్ ను పంపి తెలంగాణను ఆగం చేస్తున్నారు.కేటీఆర్- హరీష్ రావు సైడ్ యాక్టర్స్.బీజేపీ- బిఆర్ఎస్ మధ్య సీట్ల ఒప్పందం జరుగుతుంది.ప్రతిపక్ష నేత కేసీఆర్కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్మీడియా సమావేశం నుంచే కేసీఆర్కు ఫోన్ చేసిన అద్దంకిఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇలాగే చేస్తానంటుంన్న అద్దంకిఅసెంబ్లీకి రావాలని కోరడానికే కేసీఆర్కు ఫోన్ చేస్తున్నా అంటున్న అద్దంకి. తెలంగాణ భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.తెలంగాణ భవన్ వద్ద మరోసారి హైటెన్షన్..గన్పార్క్కు బయలుదేరిన కేటీఆర్.గన్పార్క్కు వెళ్తుండగా కేటీఆర్ను అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం.పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం.కేసీఆర్ రావాలంటే రాహుల్ గాంధీ రావాలిరాహుల్ గాంధీని తోలుకొస్తే.... కేసీఆర్ ను తెచ్చే భాద్యత నాదిఅక్కడేమో మంత్రులు తొడలు కొడుతున్నారు.. ఇకడేమో పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారుముఖ్యమంత్రి సవాల్ విసిరితే సందట్లో సడేమియా అన్నట్టు మద్యలో జూపల్లి దూరిండుఅన్ని లెక్కలు చెప్పడానే సిద్ధంగా ఉన్నాం.సీఎం, జూపల్లికి కేటీఆర్ సవాల్.. అరెస్ట్ ఎందుకు.. చర్చకు దమ్ము లేదా?: కేటీఆర్ సవాల్తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్తో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.సవాల్ చేసిన సీఎం తోక ముడిచి పారిపోయారు.సవాళ్ల మధ్యలో మంత్రి జూపల్లి దూరారు.చర్చకు సిద్దమైతే మంత్రి జూపల్లి ఎక్కడికి పోయారు.బహిరంగంగా చర్చించే దమ్ము మంత్రులకు లేదు.చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేయాలి?.చర్చించేందుకు కనీసం అసెంబ్లీ అయినా పెట్టండి.సవాళ్లు చేయడం.. పారిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనం.ముఖ్యమంత్రి, మంత్రులు చేతకాని వాళ్లని తేలిపోయింది.విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు.చర్చకు మంత్రి వస్తారనుకుంటే ముఖం చాటేశారు.ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం బయటపడింది.మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు.అప్పులపై చర్చకు రావాలని మొన్న సీఎం సవాల్ విసిరారు.గురుకులాల్లో అవినీతిపై చర్చకు వెళ్తే హరీష్రావును అరెస్ట్ చేశారు.తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి అన్నారు.తెలంగాణ భవన్కు రాకుండా జూపల్లి ఎక్కడో మాట్లాడుతున్నారు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, సభలోనే చర్చిద్దాం.గన్పార్క్ దగ్గర జూపల్లి ఉంటే, మేం అక్కడికే చర్చకు వస్తాం.మేం గన్పార్క్ వెళ్తే చార్మినార్ రమ్మంటారు.చార్మినార్ వెళ్తే కొల్లాపూర్ రమ్మంటారు.అసలు తన శాఖలో ఏం జరుగుతుందో జూపల్లికే తెలియదు.లేదంటే మా వాళ్లను కంచన్బాగ్కు పంపించారు కదా..అక్కడికే రండి అక్కడే చర్చిద్దాం.సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వస్తే.. అక్కడ చర్చకు మేం రెడీ.ముఖ్యమంత్రి రేవంత్.. సెక్యూరిటీ లేకుండా చర్చకు రావాలి.హరీష్రావు చర్చలకు వస్తే అరెస్ట్ చేయిస్తారు. కంచన్బాగ్ పీఎస్కు బీఆర్ఎస్ నేతలుతెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. హరీష్ సహా గులాబీ పార్టీలను కంచన్బాగ్ పీఎస్కు తరలింపుపోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నేతల బృందాన్ని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సిటీ చుట్టూ తిప్పుతున్న పోలీసులుపోలీసుల వాహనం వెంబడి వందలాది వాహనాల్లో బయల్దేరిన బీఆర్ఎస్ శ్రేణులుహరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు వెంటే వస్తామంటున్న బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/BwNMKhesLv pic.twitter.com/Z8VfKmNEG8— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026 జూపల్లి కోసం కేటీఆర్ వెయిటింగ్..మంత్రి జూపల్లి కోసం తెలంగాణభవన్లో ఎదురుచూస్తున్న కేటీఆర్తెలంగాణభవన్లో చర్చ కోసం జూపల్లికి కుర్చీ ఏర్పాటు.సవాల్ చేయడం కాదు.. జూపల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..హరీష్, కేటీఆర్ కోసం రెండు గంటల పాటు ఎదురుచూశాంముగ్గురం మంత్రులం అమర వీరుల స్తూపం దగ్గరకి వచ్చి వెయిట్ చేశాంహరీష్, కేటీఆర్ చర్చకు రాలేదుబీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధంపోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? అంటూ ప్రశ్నలు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే..హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.హరీష్ను అరెస్ట్ చేసి వాహనం ఎక్కించిన పోలీసులు. హరీష్ కామెంట్స్..మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు వస్తానన్నారు.. తోక ముడిచారు.గురుకులాలపై చర్చలకు గన్పార్క్కు రమ్మన్నారు.మేము వస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారు.చర్చకు రావాలని పిలిచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?.అసెంబ్లీలో కూడా చర్చకు సిద్దమే.పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.ప్రభుత్వ అవినీతిని ప్రజలు, అసెంబ్లీ ముందు పెడతాం. మరోవైపు.. మంత్రి పొంగులేటి సీఎల్పీకి చేరుకున్నారు. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోవద్దు..గన్పార్క్ బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పాదయాత్రగా గన్పార్క్ వెళ్లేందుకు సిద్దమైన హరీష్.హరీష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు.పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని హరీష్ ఆగ్రహం.ప్రభుత్వానికి దమ్ముంటే తమను అడ్డుకోవద్దని సవాల్మంత్రి జూపల్లి కామెంట్స్గాంధీ భవన్లో మంత్రి జూపల్లిహరీష్ రావు గన్ పార్క్ వస్తున్నానని చెప్పారుబావ బామ్మర్దులు ఇద్దరు రండినేను సైతం గన్ పార్క్ దగ్గరికి వస్తున్నానువారి సవాల్కు సమాధానం అక్కడే ఇస్తానుబావ ఒక దగ్గర బామ్మర్ది ఒక దగ్గర ఎందుకు?.ఇద్దరూ గన్ పార్క్ రండి ఇద్దరికీ అక్కడే సమాధానం ఇస్తాను.హరీష్ రావు, కేటీఆర్ వస్తే చర్చకు సిద్ధం అంటున్న మంత్రులు..ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపించండి అంటూ మంత్రుల వ్యాఖ్యలు... తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా..కారులో నుంచే మంత్రి పొన్నంకు హరీష్ ఫోన్ కాల్.మంత్రి పొన్నం తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్న హరీష్.పోలీసుల తీరుపై మాజీ మంత్రి హరీష్ సీరియస్.మంత్రులకు ఫోన్ చేసినా తీయడం లేదని వ్యాఖ్యలు..పోలీసులతో హరీష్ వాగ్వాదం..పోలీసుల అదుపులో హరీష్. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. హరీష్రావు అడ్డగింత.. గన్పార్క్కు బయలుదేరిన హరీష్రావును అడ్డుకున్న పోలీసులు.పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంమంత్రులే గన్పార్క్ వద్దకు తనను రమ్మనారంటూ హరీష్ వాగ్వాదంమా కోసం మంత్రులు ఎదురుచూస్తున్నారు. గన్పార్క్కు బయలుదేరిన హరీష్మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చకోసం అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలుమంత్రి జూపల్లితో చర్చ కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎదురుచూస్తున్న మరో బృందంతెలంగాణభవన్లోనే కేటీఆర్ ఉంటారు.ఎక్కడైనా మేం చర్చకు సిద్దం.గురుకులాలపై అన్ని ఆధారాలతో మేము వస్తున్నాం.చర్చకు మేం సిద్ధం.మంత్రులు అక్కడే ఉండాలి.మీ చాలెంజ్లు, బహిరంగ సవాళ్లకు మేం భయపడం: మంత్రి అడ్లూరిఆర్ఎస్ ప్రవీణ్కుమార్ వద్ద ఆధారాలుంటే చూపించాలి: మంత్రి పొన్నంఅవినీతి చేసినట్టు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తాం: పొన్నం తెలంగాణలో పొలిటికల్ హీట్.. తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు..సమావేశమైన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపుకాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్గురుకులాల్లో అవినీతి జరిగిందంటోన్న బీఆర్ఎస్మంత్రులు అడ్లూరి, అజహారుద్దీన్, పొన్నం చర్చకు రావాలంటోన్న బీఆర్ఎస్దీంతో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసుల మోహరింపు గన్పార్క్ చేరుకున్న మంత్రులు..గన్ పార్క్కి చేరుకున్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలుచర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్..కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. తెలంగాణ భవన్ వద్ద మోహరించిన పోలీసులు లు.తెలంగాణ భవన్కు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలుమినిస్టర్ క్వార్టర్స్ నుంచి గన్ పార్క్కి బయలుదేరిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్రాష్ట్ర అప్పులపై సవాళ్లు..రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు.10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి.రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమంటున్న బీఆర్ఎస్కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్న కేటీఆర్ , హరీష్ రావు.మంత్రులు వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధమా అంటూ మంత్రులకు సవాల్ విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.గురుకుల టెండర్స్ కుంభకోణంపై చర్చించేందుకు తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు రావాలంటున్న మంత్రులు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలు.మంత్రి అడ్లూరి కౌంటర్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్.ఆరోపణలు చేసి తొక ముడవడం కాదు.. నిరూపించాలని డిమాండ్.ఆర్ఎస్ ప్రవీణ్ చిట్టా మా దగ్గర ఉందిఅందరి లెక్కలు తేలుస్తాం. -
కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల ఖని
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధి ఎంఎన్ఆర్ గార్డెన్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై రెండు గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాక ఓబీ టెండర్లలో సైట్ విజిట్ విధానంతో గతంలో మైనస్లో వెళ్లే కాంట్రాక్టులు 13 శాతం అధికంతో సీఎం బామ్మర్ది సృజన్రెడ్డి శోధ కన్సస్ట్రక్షన్కు కాంట్రాక్టు దక్కిందన్నారు. నైనీ బ్లాక్ టెండర్ను రద్దు చేసిన డిప్యూటీ సీఎం, వీటిని ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. ‘నిజం కాకపోతే రాజీనామా’ ఆరు నెలలుగా ఇవన్నీ అడుగుతున్నా డిప్యూటీ సీఎం, సీఎం నోరు విప్పడం లేదని హరీశ్రావు దుయ్యబట్టారు. తాను చెప్పేవి నిజం కాకపోతే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. సౌర విద్యుత్కు ఎన్టీపీసీ, హెచ్సీఎల్ ఒక మెగావాట్కు రూ.3 కోట్లు వెచ్చిస్తుంటే, సింగరేణి మాత్రం 67 మెగావాట్లలో ఒక మెగావాట్కు రూ.7 కోట్ల చొప్పున, మరో 107 మెగావాట్లలో రూ.5 కోట్ల చొప్పున అదనంగా రూ.500 కోట్లు కమీషన్ల కోసం చెల్లించారని విమర్శించారు. జైపూర్ పవర్ ప్లాంట్కు కేబినెట్ ఆమోదం, డీపీఆర్ లేకున్నా టెండర్లు పిలిచి అడ్వాన్సులకు కమీషన్ల కోసం పవర్ మేక్ సంస్థకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. లేని బొగ్గు ఉన్నట్టు చూపిస్తూ.. కంపెనీ 40 లక్షల టన్నుల బొగ్గుపై ఆదాయ పన్ను, డివిడెంట్లు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ, కోల్ సెస్సుల కింద రూ.1600 కోట్లు కట్టారని హరీశ్రావు మండిపడ్డారు. అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి లేకున్నా, 1.81లక్షల టన్నులు, మందమర్రిలో 5.68లక్షల మెట్రిక్ బొగ్గు ఉన్నట్లు, శ్రీరాంపూర్లో 4.64లక్షల టన్నులు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సదస్సు కంటే ముందు హరీశ్రావు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కోల్మైన్ ఆఫీసర్స్ పీఆచ్చి, పీఆర్సీ అమలుపై చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సదస్సుకు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, పుట్ట మధు తదితరులు హాజరయ్యారు. -
కాంగ్రెస్లో ‘గుట్ట’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి నియామకం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. కొందరు మంత్రులతో సహా, ఎమ్మెల్యేల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. కనీసం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్లో ఉన్నారు. మంత్రికి కూడా తెలియకుండానే యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకం జరిగిందన్న ప్రచారం గాందీభవన్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలున్న కుటుంబంలోని వ్యక్తిని చైర్మన్గా నియమించారని, బీజేపీతో అంటకాగుతున్న చిరంజీవి కుటుంబానికి చెందిన వారిని, మాజీమంత్రి దేవేందర్గౌడ్ తనయుడు విజయేందర్ను సభ్యులుగా నియమించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీని నియమించడానికి రెండు రోజుల ముందు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించినా.. ఆ సమయంలోనూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనీసం మాటమాత్రంగా కూడా పాలక మండలి నియామకం గురించి ప్రస్తావించలేదని వారు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాలక మండలి నియామకం విషయంపై ఇద్దరు మంత్రులు పార్టీ అధిష్టానానికి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాందీకి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దేవస్థాన పాలక మండలిలో సభ్యుల నియామకానికి సంబంధించి మంత్రులు చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేశారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అసలైన కాంగ్రెస్ నాయకులు కనుమరుగు అవుతున్నారని, పార్టీలో నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, ఓ సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్వయంగా లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ వారు కనుమరుగు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలలి. షో అప్స్ చేస్తే..ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. ఇప్పుడు కాంగ్రెస్లో అందరూ కొత్తవారు వచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ వారు, ఒరిజినల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా రోజురోజుకు కనుమరుగై పోతున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కొత్త బ్యాచ్ వచ్చారు. అంతా కొత్త వారే నడిపిస్తున్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను. యాదాద్రి జిల్లాలో నా మునుగోడు నియోజకవర్గం ఉంది. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. అస్సలు కరెక్ట్ కాదు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదు. వీరి వ్యవహారశైలి నచ్చకనే నల్లగొండ మీటింగ్కు వెళ్లలేదు. నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని అయినా వేయించుకునే వాణ్ణి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఖర్మ. చైర్మన్ విషయం నేను మాట్లాడ దలుచుకోలేదు. సభ్యుల విషయమైనా చెప్పాలి కదా. వాళ్లకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఇటీవల రాహుల్గాంధీని కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను. త్వరలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్లను కలిసి మాట్లాడతా’అని అన్నారు. ‘మా బ్రదర్ వెంకట్రెడ్డి నన్ను ఉద్దేశించి దాన కర్ణుడని పాజిటివ్గానే మాట్లాడారు. మంచి ఉద్దేశంతో’నే అని తెలిపారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూపై విధంగా స్పందించారు. మాట్లాడాల్సింది కానీ...! ఈ విషయమై బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ కూడా స్పందించారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడి యాదగిరిగుట్ట బోర్డును నియమిస్తే బాగుండేదని చెప్పారు. అయినా, అన్ని విషయాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేమని, అలా చేస్తే ఏదీ ముందుకు పోదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్తో మాట్లాడతానని మహేశ్గౌడ్ వెల్లడించారు. -
నేను రెడీ.. మీరు రెడీనా?
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. అప్పులు, పాలనా వైఫల్యాలు, రైతుల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక పరిస్థితి దేనిపైనైనా సరే చర్చకు వరంగల్ చౌరస్తానా? అశోక్నగర్ చౌరస్తానా? అసెంబ్లీ, ప్రెస్క్లబ్, కొత్తగా రూ.200 కోట్లతో కట్టుకున్న సీఎం ఇంద్రభవనంలో అయినా చర్చకు సిద్ధమని అందుకు తేదీ, సమయం, ప్రాంతం సీఎం చెప్పాలని ఏ టాపిక్ అయినా సరే చర్చకు సిద్ధమని, ప్రభుత్వం వైఫల్యాలను గణాంకాలతో నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్యాదవ్, వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి నల్లగొండ సభ, శిల్పకళావేదిక సభలో బీఆర్ఎస్, కేసీఆర్ను విమర్శించడంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే సంఖ్యలో తేడాలున్నాయని, వీరిద్దరూ చెప్పే దానికి పార్లమెంట్లో వీరి చీకటి మిత్రుడు రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్రం కాగ్, ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చిన లెక్కలకు చాలా తేడాలున్నాయన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు అయితే.. తాము దిగిపోయేనాటికి ఉన్న అప్పులు మొత్తం రూ.3.5 లక్షల కోట్లు అని, తమ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.2.78 లక్షల కోట్లు అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు రూ.1.75 లక్షల కోట్లు వ్యయం చేశారంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1.56 లక్షల కోట్లు వ్యయం చేశారంటున్నారని, ఇద్దరి మధ్య ఐదు నిమిషాల వ్యవధిలోనే రూ.20 వేల కోట్ల తేడా చెబితే ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. నెలకు అప్పులు, అసలు కింద ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.2,500 కోట్లలోపు ఉంటుందని కాగ్ నివేదిక చెబుతుంటే.. వీరు బయట మాత్రం రూ.6,000 కోట్లు చెల్లిస్తున్నారని అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం కుటుంబం, మంత్రుల దోపిడీతోనే... సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాలా తీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్రెడ్డి భావదారి్రద్యంతో మాట్లాడుతూ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దివాలా, ఎయిడ్స్ రోగి, కేన్సర్ పేషెంట్ అంటూ తాను పాలించే రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత నీచంగా మాట్లాడరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగం తీవ్ర సంక్షోభంలో.. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, అట్లాంటి పరిపాలనకు సంబరాల పేరిట బలవంతపు కార్యక్రమాలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మొన్నటికి మొన్ననే సంపూర్ణంగా రైతుబంధు వేస్తాను..అందరికీ ఇస్తాను అని చెప్పి కేవలం ఒక ఎకరానికి ఇచ్చి, ఒక్కొక్క ఎకరానికి డబ్బులు వేసిన ప్రతిసారి సంబరాలు చేసుకుంటూ ఉత్త మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ... రాహుల్గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెబుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్రెడ్డి పాలన మాత్రం పాతాళానికి పడిపోతుందని చెప్పారు. అది రాష్ట్ర ఆదాయం అయినా కావొచ్చు...రియల్ ఎస్టేట్ రంగం కావొచ్చు...చివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జీఎస్టీ వసూలు ఇలా ప్రతి ఒక్క రంగంలో మందగమనం ఉందన్నారు. రేవంత్రెడ్డి పాలనలో మిగిలింది మందగమనం, మందు గమనం తప్పించి ఇంకేమీ లేదన్నారు. రేవంత్రెడ్డి ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిజంగానే రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు. నాలుక మడత తిప్పిన రేవంత్రెడ్డి ధాన్యం ప్రతి గింజా కొంటాం..తాము సేకరించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే కేంద్రంపై పోరాడుతాం అన్న సీఎం రేవంత్రెడ్డి..ఇప్పుడు కేంద్రం ఎంత కోటా ఇస్తే అంతే కొంటాం అంటూ నాలుక మడత తిప్పారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ అంగుష్ట మాత్రుడని, ఆయన నోరు మూసీ కంపుకంటే ఘోరం అని వ్యాఖ్యానించారుం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఎత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు ఆదాయం పెంచాం రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు వచ్చే నెలసరి ఆదాయం రూ.4 వేల కోట్లు అయితే, తాము దిగిపోయేనాటికి ఆ ఆదాయాన్ని రూ.18,500 కోట్లకు పెంచామని కేటీఆర్ అన్నారు. జీఎస్డీపీని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు చేర్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు గడిచిన 30 నెలల్లోనే రూ.1.13 లక్షల కోట్ల బకాయి పడిందన్నారు. రైతుబంధు కింద రూ.30 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.22వేల కోట్లు, రుణమాఫీ రూ.29 వేల కోట్లు, ధాన్యానికి బోనస్ రూ.16 వేల కోట్లు, కూలీలకు రూ.15 వేల కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. -
రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆధారాలతో వస్తాను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు గుప్పించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆధారాలతో పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మంత్రులు వస్తారా? పారిపోతారా? తేలేది రేపే అని వ్యాఖ్యానించారు.‘‘జీవో నం 17 చట్ట విరుద్దమంటూ హై కోర్టు మార్పులు చేయాలని సూచించినా, ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? కాంట్రాక్టుల్లో సెంట్రలైజ్డ్ పద్ధతిని ఎందుకు తెచ్చారు? స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ సంపద దోచి పెడుతున్నారు. మఫత్ లాల్ ఎవరు? ఆయనకు యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ కాంట్రాక్ట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులను మోసం చేసింది నిజం కాదా? నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? టోనీ అనే డ్రగ్ సప్లయర్, నిరంజన్ కుమార్ జైన్ కు ఏంటి సంబంధం? డ్రగ్స్ సప్లయ్ చేసే కంపెనీకి, ట్రంకు బాక్సుల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? రాజేశ్ అగర్వాల్ ఎవరు? షూ సప్లయ్ టెండర్ కాంట్రాక్ట్ అతనికి ఎలా ఇచ్చారు? తెలంగాణలో తోలు వ్యాపారం చేసే మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? రూ.2,041 కోట్ల టెండర్లు ఖరారైనా ఇప్పటికీ విద్యార్థులకు ఎందుకు వస్తువులు అందడం లేదు? పిల్లలకు సప్లయ్ చేసే నోట్ బుక్ పేపర్ పై వాటర్ మార్క్ నిబంధన ఎలా వచ్చింది? కరెన్సీ పేపర్, రెవెన్యూ స్టాంప్ పేపర్లకు వాడే వాటర్ మార్క్... పిల్లల నోట్ బుక్స్ కి ఎందుకు? ఈ నిబంధన ఎవరి కోసం చేర్చారు? ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ ఎందుకు? మా ఆరోపణల్లో అవాస్తవాలు ఉంటే గురువారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి,ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ అందరూ ఆధారాలతో వచ్చి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. కాంగ్రెస్ వస్తుందా? అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా తప్పిస్తుందా? చూద్దాం’’ అని చెప్పారు. -
టాపిక్.. ప్లేస్.. డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. -
‘సర్’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు బహిరంగ లేఖ రాశాయి. సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ పాత్ర, తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సర్ ప్రక్రియ ప్రభావం ఎలా ఉందో వివరిస్తూనే అందులో ఎన్నికల కమిషన్ పాత్రను కూడా వివరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు ఆప్, డీఎంకే కూడా ఈ లేఖపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘సర్’పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఉమ్మడిగా నిరసన తెలుపుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 8న ఇండియా కూటమి పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖపై కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వామపక్ష పార్టీ నేతలు, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సంతకాలు చేసినట్లు తెలిపారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇండియా కూటమి పార్టీల ఉమ్మడి కృషి ఫలితం ఇది’ అని లేఖపై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలోని అన్ని ఇతర వ్యవస్థలు విఫలమైన నేపథ్యంలో న్యాయ వ్యవస్థే శరణ్యమన్న ఆలోచన నుంచే ఈ లేఖ పుట్టుకొచ్చిందని కీలక ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. ఇది న్యాయవ్యవస్థ ఆత్మను స్పృశించే అంశమని, దేశంలో ఏం జరుగుతోందో న్యాయవ్యవస్థ కూడా పట్టించుకోవాలని ఆ నేత వ్యాఖ్యానించారు. -
త్రిలింగ భూమిపై కమలం వికసించాలి
సాక్షి, హైదరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కల సాకారం చేయాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం వెంటనే సడక్ సే సన్సద్ తక్ (గల్లీ నుంచి చట్టసభల దాకా) పోరుబాటకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ లక్ష్యాలను వివరించాలని సూచించారు. తెలంగాణలో పరివర్తన, ప్రజల గొంతుకగా వారి సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాడితేనే అధికారం సాధ్యమని.. ఈ త్రిలింగ భూమిపై కమలం వికసించేలా పోరాడాలని కోరారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నితిన్ నబీన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ల పాలనను తూర్పారబట్టడంతోపాటు తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సొమ్ము రాహుల్ యాత్రలకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని నితిన్ నబీన్ విమర్శించారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట లూటీకి తలుపులు తెరిచిందని దుయ్యబట్టారు. అవినీతి, నేరమయ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిందని.. దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్లతో చేతులు కలిపి పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన డబ్బును ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి తరలిస్తోందని.. ప్రజల డబ్బును, రైతులకు ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సొమ్మును రాహుల్ గాంధీ విదేశీ యాత్రలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే అవినీతి, అక్రమాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ లెక్కలన్నీ తేలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, పార్టీ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, రేఖా శర్మ, పొంగులేటి సుధాకర్రెడ్డి, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. విభేదాలు వీడండి: సునీల్ బన్సల్ ‘తెలంగాణలో ఫైర్ ఉన్నా దానిని ఎలా ఉపయోగించుకోవడమే సమస్యగా మారుతోంది. మీలో మీరు కొట్టుకుంటున్నారు. దీంతో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితిని పక్కనపెట్టి అన్ని శక్తులను ఒకే దిశలో పెట్టే ప్రక్రియ అవసరం ’అని రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగింపు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పేర్కొన్నట్లు సమాచారం. నేతలంతా టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ‘రాష్ట్రంలో బీజేపీకి మరో శుత్రువు లేదు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులు ఉన్నారు. ఇదే పెద్ద సమస్య. దీన్ని అధిగమిస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయం’అని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.తీర్మానాలు ఇవే...» కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కోసం రాష్ట్ర పార్టీ కృషి చేయాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాడాలని రాష్ట్ర కార్యవర్గం రాజకీయ తీర్మానం ఆమోదించింది. » నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరో తీర్మానం. » రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాడాలని వ్యవసాయ రంగ తీర్మానం ఆమోదం. » ప్రధాని మోదీ పన్నెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ప్రశంసిస్తూ మరో తీర్మానం. » తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి ఎంతో సహకరిస్తోందని ఇంకో తీర్మానానికి ఆమోదముద్ర. గ్రూపులను సహించం.. కలిసి పనిచేయాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో భేటీలో నితిన్ నబీన్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవడాన్ని, సమన్వయ లేమి వల్ల పార్టీలో సమస్యలు తలెత్తడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపక్షించే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా కొందరు నేతలు పద్ధతి మార్చుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని ఆయన సూచించారని తెలిసింది. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ భేటీ సందర్భంగా విడిగా ముఖ్య నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, వైఫల్యాలు ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది.రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారు: రాంచందర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరిట కూల్చివేతలతో సర్కార్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంగళవారం ఘట్కేసర్ సమీపంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ మనలో మనం పోరాడకుండా, విభేదించుకోకుండా ‘టీమ్ బీజేపీ’గా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాంచందర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. నితిన్ నబీన్ నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనానికి పాజిటివ్గా చర్చలు
శరద్ పవార్(85)కు చెందిన ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.ఇందుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. విలీనంపై అధిష్ఠానంతో చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. "కాంగ్రెస్, శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి మా పార్టీలోకి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం" అని ఆయన చెప్పారు.శరద్ పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా అదే విధంగా ఎన్సీపీని చీల్చారు. అజిత్ పవార్ తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ రాజకీయ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కాంగ్రెస్తో విలీనం జరిగే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి. ఆయా పార్టీల్లో కీలక నేతలు ఇటీవల ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సొంత పార్టీల నుంచి దూరమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపిందని కూడా సమాచారం. ఎన్డీఏలో చేరదాం శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఒక వర్గం ఎన్డీఏలో చేరాలని భావిస్తోంది. పార్టీకి ఉన్న పార్లమెంటు బలం ఆధారంగా ఎన్డీఏలో భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కష్టంగా మారిందని కూడా ఆ వర్గ నాయకులు భావిస్తున్నారని సమాచారం.పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏలోనే కొనసాగాలని దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోరుకున్నారని కూడా సమాచారం. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం తగ్గిపోయిందని సమాచారం. అయినప్పటికీ స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని ఆ వర్గం భావిస్తోంది. అయితే పార్టీలోని మరో వర్గం కాంగ్రెస్లో విలీనం కావాలని కోరుకుంటోందని సమాచారం. -
నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షో: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన పూర్తిగా ఫ్లాప్ షోగా ముగిసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు చిన్న సమావేశాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, అలాంటి పరిస్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటనపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ..‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను ఇప్పటికే తిరస్కరించారు. జీహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా?. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నితిన్ నబీన్ సమాధానం చెప్పాలి.తెలంగాణలో బూత్లు గెలుస్తాం, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం అని ప్రగల్భాలు పలికే ముందు గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. తెలంగాణలో బెంగాల్ తరహా విభజన రాజకీయాలు సాగవని హెచ్చరించిన ఆయన, నగరాల పేర్లు మార్చడంపైనే బీజేపీ దృష్టి ఉందని, ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి ప్రణాళిక మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. సుష్మా స్వరాజ్పై తమకు గౌరవం ఉన్నప్పటికీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని అన్నారు. వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం వారసత్వ నాయకులను పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రాజెక్టుల వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ జాతీయవాదం పేరును ఉపయోగిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. -
రేవంత్ ఫెయిల్యూర్ సీఎం
సాక్షి,సిద్ధిపేట: సీఎం రేవంత్రెడ్డి గుప్పు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్ధపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి, ఫెయిల్యూర్ సీఎం రేవంత్.రైతు బంధ మీద శాసన సభలో చర్చకు రేవంత్రెడ్డి సిద్ధమా?. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మా ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నున ధాన్యం కొన్నాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని రేవంత్ చెప్పుకోవడం విచిత్రం.ఈ రోజు ప్రతి రైతు కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారు.బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ టన్నెల్స్ను 12 కిలోమీటర్లు తవ్వింది. ఎస్ల్బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు. -
‘తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశారు’
సాక్షి,నల్గొండ: మూసీలో ఉండే కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులో ఉండే కంపే ఎక్కువ’ అంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం నల్గొండలో రూ.13వేల కోట్ల రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు.అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ తలెత్తుకునేలా చేసిన నాయకుడు కోమటిరెడ్డి. త్యాగమంటే ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు చేసుకోవడమేనా?. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో త్యాగం చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది బిడ్డలు త్యాగం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలోనే వందేళ్లకు సరిపోయే విధ్వసం చేసింది. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశారు. తెలంగాణ అభివృద్ధిపై శాసన సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్రెలకు పెట్టుకునేవారు.ఏడాదికి రూ.16వేల కోట్ల వ్యయంతో సన్న బియ్యం ఇస్తున్నాం. కేసీఆర్ తింటున్న సన్న బియ్యాన్నే ఈ రోజుల పేదలు కూడా తింటున్నారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు.. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీకు కడుపు మంట ఎందుకు? అని ప్రశ్నించారు. -
చంద్రబాబుకు గురుదక్షిణగా మన నీటి హక్కులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కు లను తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతూ ‘ముంపు మేస్త్రీ’లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర భవిష్యత్ను కేంద్రం చేతుల్లో పెట్టే చీకటి ఒప్పందం జరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్తోపాటు 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్లు, ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల మొత్తం 55 టీఎంసీల నీరు నిల్వ అవుతుందని, శ్రీశైలానికి ప్రవాహం తగ్గి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు ఆర్డీఎస్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. రహస్య ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ముఖ్యమంత్రుల సమావేశంలో మంత్రి ఉత్తమ్, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులను బయటే ఉంచి కేవలం ముగ్గురు సీఎంలు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి మాత్రమే పాల్గొనడం అనుమానాలకు తావిస్తోందని హరీశ్రావు అన్నారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల వాటా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటి భద్రత, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్పై సమావేశంలో ఎలాంటి హామీ సాధించారో సీఎం వెల్లడించాలన్నారు. నదీ జలాలపై సరైన అవగాహన లేకపోవడంతోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యల వల్ల చివరకు నష్టపోయేది తెలంగాణేనని, అయినా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయకపోవడం విచారకరమని చెప్పారు. సమ్మక్క సాగర్ను బలి చేయొద్దు గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నికర జలహక్కులను పూర్తిగా సాధించకుండా నదుల అనుసంధానం పేరుతో ఏపీకి అనుకూలంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 830 టీఎంసీలకు అనుమతులు సాధించగా, మిగిలిన 138 టీఎంసీల కోసం సమ్మక్క సాగర్, వాద్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమ్మక్క సాగర్ ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల పేరుతో సమ్మక్క సాగర్ను బలిపెడుతున్నారన్న వార్తలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ముందు తెలంగాణ హక్కులను బలంగా వినిపించాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని, మూడు రాష్ట్రాల సమావేశంలో చర్చించిన అంశాలను శాసనసభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్కనీరు తగ్గినా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
అందుకే విష ప్రచారం చేస్తున్నారు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘‘సర్’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా చాలాసార్లు జరిగిందని.. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్వహించే సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియగా కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘అర్హులైన వారికి ఓటు కల్పించాలి.. కానీ దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ‘సర్’పై సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. భారత పౌరుల విలువ పెంచే ప్రక్రియ ‘సర్’. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి.. స్వచ్ఛందంగా పాల్గొనాలి. బోగస్ ఓట్లు ఉండకూడదు. ‘‘సర్’ వచ్చాక ఓటు పర్సంటేజ్ పెరగడం అందరం చూశాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటు శాతం పెరగడానికి కారణం ‘సర్’ అని కిషన్రెడ్డి చెప్పారు.‘‘ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిది.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఎన్నికల కమిషన్ ఎవరి కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదు. కాంగ్రెస్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్పై బురద చల్లాలని చూస్తున్నారు. ఆటం బాంబులు వేస్తా.. ప్రళయం సృష్టిస్తా అని చెప్పి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ‘సర్’ వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి?. ఓటర్లను అవగాహన, చైతన్యం కల్పించాల్సిన పార్టీలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి’’ అంటూ కిషన్రెడ్డి ప్రశ్నించారు.‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు.. రేషన్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందారు. లోన్లు కూడా తీసుకున్నారు. వీటిపై ఎందుకు ఈ పార్టీలు మాట్లాడటం లేదు. ‘సర్’ను మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలా బస్తీల్లో రోహింగ్యాలు ఉన్నది వాస్తవం కాదా?. ఎవరు గుండెలు బాదుకున్నా? ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు. కానీ రేవంత్ మాత్రం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ‘సర్’ చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. కాంగ్రెస్కు ప్రభుత్వ ఉద్యోగులపై విశ్వాసం లేదు. అందుకే అబద్ధపు, విష ప్రచారం చేస్తున్నారు.. రెచ్చగొడుతున్నారు..కాంగ్రెస్ నేతలు బీఎల్ఓలను బెదిరిస్తున్నారు. మజ్లిస్ కూడా ఎవరి ఇళ్లకు వెళ్లొద్దు.. మా వద్దకు వస్తే మేము చెప్పిన డేటా తీసుకోవాలని బెదిరిస్తున్నారు. మజ్లిస్ కనుసైగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తోంది. ఉద్యోగులు బెదరవద్దు.. మేము అండగా ఉంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారి వ్యవహరిస్తున్నాయి. పౌరసత్వంతో కూడా ఓటు హక్కుకు ముడిపెట్టారు. ఓటు ఎక్కడున్నా సరే.. దానికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. అలాగే పౌరసత్వంతో కూడా ‘సర్’కు సంబంధం లేదు. ఇవే మాటలు కేరళలో ఎందుకు మాట్లాడటం లేదు...బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాలోనే ఈ ప్రక్రియ జరిగింది. దీనిపై అక్కడ ఎందుకు మాట్లాడలేదు. ఇవన్నీ నిరాధారమైన విమర్శలు మాత్రమే. ప్రజల్లో ఆందోళన రేకెత్తించి ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారు. ఓటర్ లిస్టును చెక్ చేసి ఎక్కడ నివాసముంటే అక్కడకు ఓటు హక్కు పొందేలా చూడాలి. అలాగే తప్పుల సవరణ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంటోన్మెంట్లో ‘సర్’కు వెళ్ళిన బీఎల్ఓలతో ఇందిరమ్మ చీరలు అందించాలని కాంగ్రెస్ నీచంగా వ్యవహరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫోటోతో సహా ఫిర్యాదు చేశాం. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి‘సర్’కు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అడిగారా?. అదే నిజమైతే కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఇంటికి కూడా సిబ్బంది వెళతారు.. వారు కూడా సభ్యత్వం తీసుకుంటారా మరి?. అసదుద్దీన్ బారిస్టర్లో రాజ్యాంగం గురించి సరిగ్గా చదవలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలా అబద్ధాలు మాట్లాడాలో నేర్చుకున్నాడు. పాత బస్తీలో దొంగ ఓట్లు ఉన్నాయి.. నగరంలో కూడా చాలా ఉన్నాయి.. అవి తొలగిస్తే వారి పప్పులు ఉడకవని భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు.. ఇక్కడే ఓటు హక్కు తీసుకోవాలి’’ అని కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం
పరిగి: ‘మోసపోతే గోస పడుతామని పరిగి గడ్డపై నిలబడి కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు నరకం చూస్తున్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ‘సర్’పై నిర్వహించిన శిక్షణ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ రైతులకు పట్టాలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల పేరిట వేలాది ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ధాన్యం కూడా పూర్తిగా కొనలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఆరిపోయే దీపం లాంటివారని ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. కమీషన్ల కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి చేశామని.. కానీ రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు పూర్తి చేయలేదని కేటీఆర్ నిలదీశారు. ఉద్దండాపూర్ నుంచి గ్రావిటీ ద్వారా వికారాబాద్ జిల్లాకు కాల్వల ద్వారా నీటిని తీసుకురావచ్చని సిద్ధం చేస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ. 440 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని.. రైతులకు పరిగితోపాటు కొడంగల్, జిల్లా మొత్తానికి సాగు నీరు అందించే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పార్టీ నేతలు అనిల్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్, రాజిరెడ్డి, సురేందర్, అశోక్కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్పై బీజేపీ ‘మీమ్స్’ వార్.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ మరో డిజిటల్ వార్ మొదలుపెట్టింది. రాహుల్ విదేశీ పర్యటనలపై మీమ్స్తో పోస్టులు పెడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన తరచూ చేసే విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందంటూ నిలదీసింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ గ్లోబల్ లీడర్ అని.. అనేక దేశాలు, సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయంటూ పేర్కొంది.ప్రముఖ సినిమా టైటిళ్ల ఆధారంగా రూపొందించిన 'ఛడ్ దే ఇండియా' (ఇండియాను వదిలేయ్), 'లాపతా రాహుల్' (కనిపించకుండా పోయిన రాహుల్) పోస్టర్లతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గో రాహుల్ గాన్, టూరిస్ట్ జిందా హై, పరదేశ్ వంటి మరికొన్ని పోస్టర్లు కూడా వైరల్గా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను కలవాలని అనుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన చాలా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలరు కాబట్టి, ఆయన పర్యటనలు చిన్నవిగా, తరచుగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు."రాహుల్ గాంధీ కేవలం మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. చాలా మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరుస ఆహ్వానాల కారణంగా ఆయన కేవలం రెండు రోజులు, నాలుగు, ఐదు రోజులు మాత్రమే సమయం కేటాయించి ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీతో ఏకీభవించరని గ్రహించాలి. ప్రజలు భారతదేశాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు, ఆ కోణంలోనే వారు రాహుల్ గాంధీని కూడా చూస్తారు" అని ఖుర్షీద్ పేర్కొన్నారు.విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేంటి? విదేశాలకు వెళ్లవద్దన్నా ప్రధాని.. ఆ తర్వాత తనే స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్తారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడంటూ ఆయన సమర్థించారు. -
మీ తండ్రిని జైలులో పెడితే... పారిపోయింది నువ్వు మిస్టర్ లోకేశ్..!
-
కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి రాజకీయం బట్టబయలు.. ఢిల్లీకి లోకేష్ పరుగు.!
-
కాంగ్రెస్ వస్తే.. బీజేపీ నేతలు సెక్యూరిటీతో తిరగాలి
న్యూఢిల్లీ: సీనియర్ నేత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలో అధికార మార్పు జరిగితే.. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 12-15 ఏళ్ల పరిణామాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొంటూ.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నాయకులు ప్రజల్లోకి భద్రత లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతుండగా, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ఖేరా.. గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అధికార దుర్వినియోగం, దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్షాలపై రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు భద్రత లేకుండా రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.A very strong statement by Congress MP @Pawankhera ji to BJP, “Let our government come to power. When we recount these 12–15 years, BJP leaders will not be able to step out on the streets without security. I am telling you this, they will even need protection to come out in… pic.twitter.com/YrpIHF96Ch— Harmeet Kaur K 🇮🇳 (@iamharmeetK) June 25, 2026మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం పవన్ ఖేరా వ్యాఖ్యలను వేరే కోణంలో చూడాలని అంటున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వివరిస్తున్నాయి.అయితే పవన్ ఖేరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాటిని రాజకీయ వ్యాఖ్యలుగానే అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. -
మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్తో 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
అహ్మదాబాద్/భోపాల్/నాగ్పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది. నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు. పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్వర్క్ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్వర్క్ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్ పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్లో ఆ రోపించారు. -
పరువు నష్టం కేసులో రాహుల్ ‘సారీ’
జబల్పూర్: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్పై చేసిన అనుచిత వ్యాఖ్యల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ కోరారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ బుధవారం పిటిషన్ వేశారు. గురువారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రమోద్కుమార్ అగర్వాల్ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 2018లో ఝబువాలో జరిగిన ర్యాలీలో పనామా పత్రాల లీక్ కుంభకోణంతో సంబంధముందంటూ రాహుల్ తన పేరును ప్రస్తావించారంటూ కార్తికేయ ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ భోపాల్లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు రాహుల్కు సమన్లు పంపింది. దీంతో, రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడి పేరుకు బదులుగా పొరపాటున కార్తికేయ పేరును ప్రస్తావించానని పిటిషన్లో తెలిపారు. పరువునష్టం కేసుతోపాటు సమన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై, కార్తికేయ సానుకూలంగా స్పందించారు. రాహుల్ క్షమాపణను స్వీకరిస్తున్నానని, భోపాల్ కోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీంతో, హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయనకిలాంటివి అలవాటే: బీజేపీ తప్పుడు ఆరోపణలు పదేపదే చేయడం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి రాహుల్ గాం«దీకి అలవాటై పోయాయని బీజేపీ ఆరోపించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తూ ఆయన అబద్ధాల కోరుగా మారారని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదు..దు్రష్పచార నేత’అంటూ అభివర్ణించింది. -
రిజర్వేషన్ల అంతమే బీజేపీ అసలు లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలో రిజర్వేషన్లను రద్దుకే భారతీయ జనతా పార్టీ లోక్సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ లక్ష్యంగా పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. దేశ యువత నిరాశా నిస్పృహలే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వ్యక్తమవుతున్నాయన్న ఆయన వారు లేవనెత్తిన అంశాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు. బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ యువ నేతలను మళ్లీ కాంగ్రెస్లోకి చేర్చుకోరాదని, మాలాంటి వారికి అది అవమానకరమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. పీటీఐ వీడియోస్కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రమేశ్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ల బిల్లు నెపంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు జరిగిన ప్రయత్నం కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకేనని ఆరోపించారు చిత్తశుద్ధి ఉంటే 2029 ఎన్నికల్లో ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల ఆధారంగానే, ’నారీ శక్తి వందన్’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో ‘‘అబ్ కి బార్... 400 పార్’’అని బీజేపీ నినదించినప్పుడే తాము అది రిజర్వేషన్లను అంతం చేసేందుకు ఉద్దేశించిందని చెప్పామని, అప్పటి నుంచి ఇప్పటివరకూ టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు ఆ మాటలను నిజం చేస్తున్నాయని వివరించారు. రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఆర్ఎస్ఎస్తోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తున్న విషయంపై మాట్లాడుతూ ‘దీనికి కారణం ఒక్కటే. ఏప్రిల్ 17న ‘చాణక్యుడు’(అమిత్ షా) ఎదుర్కొన్న అవమానం. నియోజకవర్గ పునరి్వభజన బిల్లులు మూడూ ఆమోదింపజేస్తానని ఆయన మోడీకి మాటిచ్చారు. కానీ 298 కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయారు’’అని వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఆయన వ్యూహం ఫలించకపోవడంతో ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో పార్టీలను చీల్చే రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అయితే.. విపక్షాలు పునరి్వభజన యత్నాన్ని మాత్రమే వ్యతిరేకించాయని, మహిళా రిజర్వేషన్లను కాదని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగంపై నమ్మకం లేదని, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. మోజార్టీ అసాధ్యం.. టీఎంసీ, శివసేన (యూబీటీ)లను చీల్చడం ద్వారా బీజేపీ బలం 298 నుంచి 324కు చేరుకున్నా ప్రస్తుత లోక్సభలో మూడింట రెండొంతుల మెజార్టీ మార్కు అందుకోవడం ఆ పార్టీకి అసాధ్యమని జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా వారికి ఈ మెజార్టీ రాదని, రాజ్యాంగ సవరణే వారి లక్ష్యమన్నది దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు బాగా తెలుసునని రమేశ్ వివరించారు. నియోజకవర్గాల పునరి్వభజన ద్వారా ఎంపీల సంఖ్యను 815కు పెంచాలని అనుకుంటున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. కుల గణన తర్వాతే పునిర్వభజన జరగాలని, వచ్చే లోక్సభ ఎన్నికలను 543 స్థానాలతోనే నిర్వహించి, అందులో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయాలను ప్రస్తావించిన జైరామ్ రమేశ్.. అవన్నీ దేశ యువతలో పేరుకుపోయిన నిరాశ, నిస్పృహల అభివ్యక్తీకరణ మాత్రమేనని అన్నారు. యువత ఈ రకమైన సందేశం ఇవ్వడంలో తప్పులేదు కానీ చివరకు రాజకీయ పార్టీలే ఆయా అంశాలను అజెండాగా మార్చుకోవాలని చెప్పారు. సీజేపీ ఉద్యమాన్ని ఎవరో స్పాన్సర్ చేస్తున్నారనడం సరికాదన్న ఆయన అది రాజకీయ పార్టీ కూడా కాదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో మంచి గుర్తింపు మాత్రం లభించిందని చెప్పారు. ఉద్యమాల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలతో ముఖ్య భూమికని గుర్తుచేశారు. -
‘సర్’..వెరీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే వారి స్థానంలో కొత్తవారిని పార్టీ ఇన్చార్జులుగా నియమిస్తామని హెచ్చరించారు. ‘మీరు ఈసారి గెలుస్తారో, ఓడతారో మీ ఇష్టం. కానీ ‘సర్’లో పేదల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. మళ్లీ ఎమ్మెల్యే కావాలనుకున్నా, కొత్తగా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నా ఎస్ఐఆర్ను సీరియస్గా తీసుకోవాల్సిందే.మీరేం చేస్తున్నారనే దానికి సంబంధించిన అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి. 10 రోజుల సమయమిస్తున్నా. మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ స్థానంలో కొత్త వారు వస్తారు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జులతో బుధవారం ఉదయం టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఓట్లు తీసేసే వాళ్లు విస్తృతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లూ మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు.ఓట్లను కాపాడాల్సిన పార్టీగా మనం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదు? అధికారంలో ఉన్న పార్టీగా అన్ని హంగులూ అందుబాటులో ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు? కేడర్ కూడా లేని కొత్తగూడెంలో బీజేపీ సమావేశాలు పెట్టింది. కనీసం కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉండే సూర్యాపేట జిల్లాలో మనం అవగాహన సమావేశాలు పెట్టుకోలేకపోయాం. ప్రజలకు అవగాహన కల్పించండి ఓట్లు పోయిన తర్వాత పేదలు చాలా ఇబ్బంది పడతారు. కేవలం ఓట్లు మాత్రమే పోవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. వెంటనే డీడీలు కట్టండి. 2002 ఓటరు లిస్టు, ఇప్పటి ఓటరు లిస్టు తెప్పించుకుని సరి చూసుకోండి.అర్హులైన వారి ఓట్లు పోవడానికి వీల్లేకుండా ప్రతి 10 పోలింగ్ బూత్లకు ఒక ఇన్చార్జిని నియమించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉండాలి. ఈ నెల రోజులూ ఎస్ఐఆర్ కార్యక్రమం మీదనే పనిచేయాలి. మనకు గ్రామాల్లో సర్పంచ్లున్నారు. వారి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్ఐఆర్ గురించి గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించాలి..’ అని రేవంత్ సూచించారు. హైదరాబాద్లో ఓకే ఎస్ఐఆర్ కార్యక్రమంపై 33 జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్ని సమావేశాలు నిర్వహించాయో ప్రతి జిల్లా వారీగా సీఎం చదివి విన్పించారు. ‘హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు బాగా జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో జరగడం లేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్, నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి.పోలింగ్ బూత్ వారీగా ఓట్లను సరిచూసుకోవాలి..’ అని చెప్పారు. జిల్లాల వారీగా ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ ఆదేశాలు అమలయ్యేలా ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. చొరవ తీసుకోకపోతే ఇన్చార్జి మంత్రులను కూడా మారుస్తాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందరూ చురుగ్గా పాల్గొనాలి: మీనాక్షి గురువారం నుంచి జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ కోరారు. గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఓట్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. అర్హులైన వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే టీఎంసీ ఓడిపోయింది: మహేశ్గౌడ్ మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో చేస్తున్న రాజకీయాలను చూసిన తర్వాతైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు ‘సర్’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమబెంగాల్లో కేవలం ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. అక్కడ టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడంతోనే అధికారం కోల్పోయిందని అన్నారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. -
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ఫీల్డ్తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
ఇంత అలసత్వమా?.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అల్టిమేటం!
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.కొంతమంది నాయకులు ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్లో సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. -
ట్రాన్స్ఫర్ నుంచి టెండర్ దాకా స్కామ్లే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్లు మొదలు టెండర్ల వరకు అన్నింటా స్కాములే జరుగు తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వా త సింగరేణి నష్టాలబాటలో నడుస్తోందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంలో అన్ని విషయాల్లో స్కామ్లు జరుగుతున్నా యని, కమీషన్ల కోసం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్రావు పలు అంశాలపై మాట్లాడారు.తప్పు చేస్తే చట్టపరమైన చర్యలుసింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతూ ఆ మేరకు సెస్, ట్యాక్సులు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ తదితర పన్నులు కట్టారని.. కానీ క్షేత్రస్థాయిలో అసలు బొగ్గును తవ్వి తీయలేదన్నారు. బొగ్గు నిల్వలు చూపించాలని తాము గనుల దగ్గరికి వెళ్తే అనుమతి ఇవ్వట్లేదని.. అదే సమయంలో పనికిరాని షెల్ బొగ్గును మట్టికుప్పలపై పోస్తూ అదే అసలైన బొగ్గుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణ చేపట్టి తప్పుడు వివరాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్రావు హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే ఉత్పత్తి నిలిచిపోయిన అడ్రియాల గనిలో 1.69 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.సీఎం బావమరిదికే లాభంఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో కమీషన్లు దండుకోవడం కోసమే సైట్ విజిట్ విధానం అమల్లోకి తెచ్చారని హరీశ్రావు ఆరోపించారు. సైట్ విజిట్ తెచ్చిన తర్వాత ప్రతిసారీ ఎక్సెస్కే టెండర్లు వెళ్తున్నాయని.. ఇలా ఎక్స్స్ టెండర్ దక్కించుకున్న తొలి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ఓనర్ సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి అని హరీశ్రావు పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధన అమల్లోకి వచ్చాక ఎక్సెస్ టెండర్ల వల్ల సింగరేణిపై రూ. 1,000 కోట్లకుపైగా అదనపు భారం పడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ బ్యాంకుల్లో సింగరేణికి రూ.3,200 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని.. ప్రస్తుతం రూ. 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి సింగరేణి వెళ్లిందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ, వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్సీలు టి.రవీందర్రావు, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
కాంగ్రెస్లో మళ్లీ ‘థరూర్’ మంటలు
న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.గవర్నర్తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలుశ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు. In Srinagar! Had the honour of an excellent meeting with Lieutenant-Governor Shri @manojsinha_ at Lok Bhavan today. We discussed the situation in the state and the encouraging progress towards normalcy. When I arrived he was chatting to the President of the Kashmiri Writers’… pic.twitter.com/hm1lz3qDGF— Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2026సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదంశశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’
సాక్షి, సూర్యాపేట: దేశాన్ని కుదిపేసిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని.. బండి సంజయ్, సంగప్పలను కనీసం విచారించకుండానే.. రాత్రికి రాత్రే నిందితునికి బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.పోక్సో చట్టం అత్యంత బలమైన చట్టమని.. చట్టంలో 2020 లో వచ్చిన మార్పుల ప్రకారం సెక్షన్ 4లోని క్లాస్ 2(ఎఫ్) ప్రకారం, బెయిల్ ఇచ్చే ముందు, బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వాలని,బాధితురాలి అభిప్రాయాలను సేకరించాలని కానీ, సైబరాబాద్ పోలీసులు మరియు ప్రభుత్వ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలికి న్యాయం చేయడంలో విఫలమయ్యారన్నారు.తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఏడాది పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడితే.. కేసు పెట్టిన మొదటి రోజే అరెస్ట్ చేయకుండా.. స్టేషన్ బెయిల్ ఇద్దామని చూశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటం తర్వాత 9 రోజులు దాచిపెట్టి తర్వాత లొంగుబాటు చూపెట్టారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రం బాల్క సుమన్, అశోక్ అనే వ్యక్తిని మాత్రం అన్యాయంగా నెలల తరబడి జైలులోనే ఉంచుతున్నారని మండిపడ్డారు. బాలికకు న్యాయం జరిగేవరకు చివరివరకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్లనే నిందితుడు అరెస్టయ్యాడని గుర్తు చేశారు. తెలంగాణ బడేభాయ్ చోటే భాయ్ల బంధం ప్రజలకు అర్థమైందన్నారు. పోక్సో కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితుడు బండి భగీరథ్కు రాత్రికి రాత్రే బెయిల్ మంజూరు చేయించి.. ఇంటికి పంపించేందుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. -
2024లో శరద్ పవార్ ఏమన్నారో ఇప్పుడదే..
ఒకప్పుడు కాంగ్రెస్కు దాదాపు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రాజకీయంగా బలహీనపడుతున్నాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. ప్రతిపక్ష ఐక్యత మరోసారి ప్రధాన చర్చగా మారింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో మరింత దగ్గరయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్లో ఆయా పార్టీల విలీనం జరుగుతుందా? లేక సీట్ల సర్దుబాటుతోనే కలిసి ముందుకెళ్తారా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, కాంగ్రెస్తో వాటి సంబంధాలు, ప్రతిపక్ష రాజకీయాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన "ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది" అనే వ్యాఖ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు వంటి అనేక అంశాలు కాంగ్రెస్కు తలనొప్పి తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనపడుతోంది. విలీనం అయినా కాకపోయినా, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్తో మరింత సన్నిహిత సంబంధం ఏర్పడటం, నియోజకవర్గాల వారీగా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం మరింత సులభం కావచ్చు.2024లో శరద్ పవార్ ఏమన్నారు? ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో మహారాష్ట్రలోని సాతారాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో మరింత సన్నిహితంగా కలిసిపోతాయని అన్నారు. లేదంటే కాంగ్రెస్లో విలీనం అయ్యే మార్గాన్ని పరిశీలిస్తాయని ఆయన అన్నారు. ఆయన సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) గురించి మాట్లాడుతూ.. తన పార్టీకి, కాంగ్రెస్కు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదని చెప్పారు.పవార్ గురించి చాలా మందికి తెలుసు. ఆయన ఆలోచించకుండా మాట్లాడరు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ లోతైన అర్థం ఉంటుంది. సరైన సమయంలోనే మాట్లాడతారు. ఆ సమయంలో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే పవార్ అలా మాట్లాడి ఉండొచ్చని విశ్లేషకులు చెప్పారు.ఏడాది క్రితమే ఎన్సీపీ చీలిపోయింది. చాలా మంది నేతలు శరద్ పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ వైపు వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల వేళ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, అలాగే జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించే అవకాశాన్ని పరిశీలించాలని సీనియర్ పవార్ భావించి ఉండవచ్చు. ఆ తర్వాత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు దక్కాయి. శరద్ పవార్తో పాటు ఆయన ద్వారా ఇతర ప్రాంతీయ నాయకులను సంప్రదించి మరింత సమన్వయం పెంచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఆ తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయాల వల్ల బీజేపీకి మళ్లీ బలం లభించింది.ఆ అంచనాకు మళ్లీ ప్రాధాన్యం సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు పవార్ చెప్పిన అంచనాకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్లో 2/3 మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను ప్రోత్సహిస్తోంది.పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నాయకురాలిగా ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓటమి పాలయ్యారు. ఆమె పార్టీ వేగంగా ముక్కలవుతోంది. ఆమె ఎమ్మెల్యేలలో, లోక్సభ సభ్యుల్లో దాదాపు 2/3 మంది ఆమెను వీడిపోయారు. రెబల్స్ ఎన్సీపీఐ అనే చిన్న పార్టీలో విలీనమై, ఇప్పుడు తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.ఇటు మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) మరో చీలిక ఊహాగానాలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ జూన్ 8న రెండేళ్ల తర్వాత ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఈ కూటమిపై ఆసక్తి చూపని మమతా బెనర్జీ.. ఈ సారి మాత్రం సోనియా గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.ఆ వెంటనే మమ, పవార్ తమ బలహీనపడిన పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయవచ్చనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఆ వార్తలను ఖండించినా మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వారందరూ "ఘర్ వాపసీ" చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రాంతీయ పార్టీలు నిజంగా కాంగ్రెస్లో విలీనం అవుతాయా? లేక తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూనే చేతులు కలుపుతాయా? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో ప్రతిపక్షం మనుగడ కోసం కొత్త వ్యూహాలు తప్పనిసరి అవుతున్నాయి. శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం కూడా అదే సంకేతాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో విలీనాలు జరుగుతాయా, లేక సీట్ల పొత్తులతోనే ప్రతిపక్షం కొత్త రూపం దాల్చుతుందా అన్నది భారత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారనుంది. -
ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?
సాక్షి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరంటారు.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అదే విషయం మరోసారి రుజువయ్యేలా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేకు... రాహుల్ గాంధీ మరోసారి కలిసి పనిచేసేలా రాయబారం పంపినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే ...?ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అధికార ఎన్టీఏ కూటమిని మరింత బలీయంగా మార్చగా అదే సమయంలో ఇండియా కూటమిని బలహీన పరిచాయి. కూటమిలో ప్రధానంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం.. అదే విధంగా టీవీకేకు మద్ధతిచ్చి మిత్ర ధర్మాన్ని పాటించలేదని ఆగ్రహం చెంది.. ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఈ పరిస్థితులు నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా డీఎంకే అధినేత స్టాలిన్ "గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు తిరు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని సాధారణంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ "భారతదేశ భావనను, మన రాజ్యాంగాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా కొనసాగుతుంది - ఇది మన ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసే పోరాటం, మనం గెలిచే వరకు దీన్ని కలిసికట్టుగా పోరాడతాం." అని ప్రత్యత్తరమిచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్టాఫిక్గా మారాయి. ఇండియా కూటమిలోకి మళ్లీ రావాలని రాహుల్ స్టాలిన్కు రాయభారం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గతేడాది రాహుల్ గాంధీకి స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ "రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్య సాధన ద్వారా బంధించబడిన నా ఆదర్శ సోదరుడు మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నాయకత్వం వహించాలి. ఉజ్వల భారతదేశం వైపు మన పయనించే ఈ ప్రయాణంలో విజయం మనదే అవుతుంది." అని రాహుల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మాత్రం నామమాత్రంగా విషెస్ చెప్పారు. -
‘తలరాతను మార్చేది చదువొక్కటే.. మీకేం కావాలో నాకు చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర,దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం.విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు.పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం.ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారువిద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నా. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం.ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరుఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం.యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం .ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందిసోషల్ వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి.రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది..మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి… మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం . తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’అని స్పష్టం చేశారు. -
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
విజయ్ బిగ్ మూవ్.. ఇరకాటంలో కాంగ్రెస్!
కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. కేంద్రం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తన రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే దిశగా గట్టి వైఖరి ప్రదర్శించారు.కర్ణాటక ప్రభుత్వం రూ. 9,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జలాశయ ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా ఉందని ఆ తీర్మానంలో తమిళనాడు ఆరోపించింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తీర్పు (2007).. అలాగే సుప్రీంకోర్టు తీర్పు (2018)ను ఉల్లంఘించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తీర్మానంలో సీఎం విజయ్ పేర్కొన్నారు.ఈ తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య పంచబడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేకెదాటు ప్రాజెక్ట్కు ఎలాంటి అనుమతులు, సాంకేతిక లేదంటే పర్యావరణ క్లియరెన్స్లు ఇవ్వకూడదని తమిళనాడు అసెంబ్లీ తరఫున కోరారాయన. కేంద్ర జల సంఘం కూడా ఈ ప్రాజెక్ట్ వివరాల నివేదికను పరిశీలించకూడదని తీర్మానంలో సూచించారు.నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్చలో డీఎంకే, ఇతర పక్షాలు సైతం తీర్మానానికి మద్దతుగా మాట్లాడాయి.#TamilNadu CM Joseph #Vijay passed a resolution in assembly opposing Karnataka’s Mekedatu dam on Cauvery, citing tribunal and #SupremeCourt violations.#20xSubscribedSMEIPO pic.twitter.com/WaMKj7isb7— News Update (@NewsNew1578) June 19, 2026బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతోంది. అయితే.. తమిళనాడు మాత్రం ఇది తమ రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. కర్ణాటక సమర్పించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తిరస్కరించాలని కోరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో మేకెదాటు వివాదం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా వేడెక్కింది.👉ఈ తీర్మానంలో అత్యంత కీలక అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలిక. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మాత్రం విజయ్ సర్కార్ తీసుకున్న తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా విభేదాలకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్ను చిక్కుల్లోకి పడేసింది.కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేకెదాటు ప్రాజెక్ట్ తమ రాష్ట్ర అభివృద్ధి, బెంగళూరు తాగునీటి అవసరాలకు అవసరమని వాదిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తూ, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడలేమని వారు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ నేతలు భిన్న భిన్న వైఖరులు తీసుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్కు పరిస్థితి ఇరకాటంగా మారింది. ఈ ప్రాజెక్టు నేపథ్యం.. మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్ట్. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. ఇక్కడ నది సన్నని లోయలో వేగంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం బెంగళూరుకు తాగునీరు అందించడం మరియు జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.కావేరీ నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదన. ఇదేం కొత్తది కాదు. 1940 నుంచే ఉంది. అయితే 2017లో అప్పటి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అయితే మేకెదాటు వల్ల దిగువ రాష్ట్రం తమిళనాడు నీటి ప్రవాహం తగ్గుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అంశం మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది. -
రేవంత్కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్కు, రేవంత్కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్లో పడితే అది కాంగ్రెస్తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: పంట బోనస్కు కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డిజిటల్ కేబినెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.కేసీఆర్ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. -
హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే ఇలా చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్ అని చెప్పారు. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. పేదల జోలికి హైడ్రా వెళ్లదు, కబ్జాదారుల భరతం పడుతుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాజకీయ కుట్ర వల్ల కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది ఇక ఏమీకాడని నవ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండగా నిలబడి మల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవకాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రశ్నించే గొంతును నిలబెట్టారు. పార్లమెంటులో పార్టీ, ప్రజల తరుపున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు సోనియా, రాహుల్ గాంధీ నన్ను గుర్తించి పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. -
కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు ఇద్దరు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెట్ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ, కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం వ్యూహాలు పన్నుతున్నారా? వీరి వ్యూహాల్లో ఒక చోట రాజ్యసభ సభ్యుడు, మరోచోట లోక్సభ సభ్యుడు పాలుపంచుకుంటున్నారా? వీరి సహకారం వెనుక మరో తంత్రం ఉందా? అంటే.. పాలకుర్తి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. తన అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కుమారుడు అర్జున్రెడ్డి కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాలకుర్తిపై, తన కుమార్తె త్రిష కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై గురి పెట్టారని స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సులభంగా టికెట్ తెచ్చుకోగలమని, ఒకవేళ జరగకపోతే రేసులో గట్టిగా ఉండాలనే ఆలోచనతో ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని వివాదాల వ్యవహారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ముందుకు రావడం గమనార్హం. పాలకుర్తిలో కదులుతున్న పావులుపాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్వినిరెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్వినిరెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా, ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలకు ఆపన్న హస్తం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు కూడా టీపీసీసీ వెనుకాడుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా మరోవైపు ఈ అసమ్మతి నేతలకు సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి మద్దతు కూడా ఉందని, తన కుమారుడు కృష్ణభార్గవ్ రెడ్డి వేం కోసం పాలకుర్తిపై కన్నేసిన నరేందర్రెడ్డి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.జహీరాబాద్లో దామోదర వ్యూహంఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి తన కుమార్తె త్రిషకు ఆయన టికెట్ అడిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్కు పొగ పెడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా సహకరిస్తున్నారని తెలస్తుండగా, మరోవైపు ఆయన కూడా ఆ స్థానం తనకు కావాలని అడిగే ఆలోచనలో ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారైనా ఎమ్మెల్యే కావాలనే వ్యూహంతో షెట్కార్ ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి సహకారంతోనే మాజీ మంత్రి చంద్రశేఖర్పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వరకు వచ్చారని చెబుతున్నారు. -
తమిళ పాలిటిక్స్.. స్టాలిన్కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళానాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్లు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా డీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. దీంతో తమిళనాట కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే అనే విధంగా పొలిటికల్ హీట్ పెరిగింది. విజయ్ నాయకత్వానికే ప్రజల మొగ్గుఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన 27 నెలల్లోనే 108 స్థానాలు గెలుచుకుని తమిళగ వెట్రి కళగం(టీవీకే) చరిత్ర సృష్టించిందని మంత్రులు పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సీఎం కావాలన్నదే తమిళనాడు ప్రజల తీర్పు అని వారు స్పష్టం చేశారు. టీవీకేకు మెజారిటీకి 10 సీట్లు తక్కువైనప్పటికీ, అన్నాడీఎంకే మద్దతుతో సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లౌకిక విలువల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని కొనియాడారు. అధికారంలో వాటా.. ఇదే నిజమైన కూటమి ధర్మం అని వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 సీట్లున్న కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు విజయ్ ఇచ్చారని, అలాగే వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకోలేదని విమర్శించారు.బీజేపీ కుట్రను అడ్డుకున్నాం..ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పన్నిన కుట్రకు డీఎంకే కూడా సహకరించిందని, అయితే లౌకిక శక్తులు బలంగా నిలబడటం వల్ల ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే, డీఎంకే అధికారిక పత్రిక ’మురసోలి’లో కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని కించపరుస్తూ రాస్తున్న వ్యాసాలపై మండిపడ్డారు. తమకు కూడా తిట్టడం తెలుసనని, అయితే, తమ నాయకులు తమకు రాజకీయం నేర్పారన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఒకవేళ తాము హద్దులు దాటితే డీఎంకే తట్టుకోలేదని హెచ్చరించారు. మైనారిటీలు, దళితులు డీఎంకేకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అది వదిలేసి మిత్రపక్షాలపై పడి ఏడిస్తే, వచ్చే ఎన్నికల్లో తమరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.పుదుచ్చేరిలోనూ పొత్తే.. ఇదిలా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్మద్దతు కీలకంగా మారిందన్నారు. -
కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. 12 రోజుల్లో 4 సమావేశాలు..
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర నేతల మధ్య పెరుగుతున్న అసమ్మతి, నాయకత్వ పోరు, వర్గపోరును చల్లార్చేందుకు పార్టీ అధిష్ఠానం గత 12 రోజుల్లో నాలుగు కీలక సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల ముందు పార్టీ ఐక్యత దెబ్బతింటే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన కాంగ్రెస్లో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన ఆధిపత్యాన్ని కొనసాగించగా, కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ఇదే సమయంలో పంజాబ్లో ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలను మరింత వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పంజాబ్కు చెందిన సీనియర్ నేతలు వరుసగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర యూనిట్లో ఉన్న విభేదాలను వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలని నేతలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం.పంజాబ్ కాంగ్రెస్లో గత కొంతకాలంగా నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎన్నికల వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల నాటికి మరింత తీవ్రమైతే ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. పంజాబ్లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ముందుగా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. అందుకే వరుస సమావేశాల ద్వారా నేతల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, పార్టీ అంతర్గత విభేదాలు కొనసాగితే ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. హైకమాండ్ జోక్యంతో విభేదాలు సద్దుమణుగుతాయా? లేక ఎన్నికల సమయానికి మరోసారి బహిరంగంగా బయటపడతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
పెన్షను..పేదల్లో టెన్షను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల కోసం పేదలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మీకులు..ఇలా అనేక కేటగిరీలకు చెందినవారు పింఛన్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కరుణిస్తుందన్న ఆశతో కార్యాల యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు కలిపి.. దాదా పు నాలుగేళ్లుగా చేయూత కోసం నిరీక్షిస్తున్నా రు. సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అంచనా కాగా..వీటి పరి ష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖ లాలు కన్పించక పోవడంతో పింఛన్ల అంశం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. పెంపు సరే.. మంజూరేదీ? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల నుంచి), వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల పింఛను రూ.4 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల నుంచి) పెంచుతామని హామీ ఇచ్చింది. 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు.. కొత్తగా వివిధ కేటగిరీలకు చెందిన 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు (ఎలాంటి పెంపుదల లేకుండా) మంజూరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యత కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తుల స్వీకరణే..స్రూ్కటినీ లేదు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో వివిధ కేటగిరీల వారి నుంచి దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ వాటి పరిశీలనే (స్క్రూటినీ) పూర్తి చేయడం లేదు. దరఖాస్తులను స్క్రూటినీ చేయాలనే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు అందలేదు. అసలు ఎప్పటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఉన్నతాధికారులు..అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపవద్దంటూ జిల్లా, మండల అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ముందుగా ఆయా కేటగిరీల కింద అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అర్హులను గుర్తించాక పరిశీలనకు క్షేత్రస్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి పింఛన్దారుడు అర్హుడనే నివేదిక అందాక డేటా ఎంట్రీ చేసి ఆమోదం తెలుపుతారు. కానీ ఈ ప్రక్రియలో ఎలాంటి ముందడుగూ పడటం లేదని ఎక్కడికక్కడే మూలుగుతున్న దరఖాస్తులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మొత్తంగా 20 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉంటే.. రెండులక్షలు మాత్రమే కొత్త పింఛన్లు ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిని, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అన్న సందిగ్ధంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న ఆశావహుల సంఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద చేయూత పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 41,48,071గా ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్ చివరినాటికి వివిధ కేటగిరీల పింఛ¯న్దారుల సంఖ్య 43,55,649 కాగా.. అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు వివిధ కేటగిరీల కింద పింఛను పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాలతో 3.5 లక్షల పించన్లు తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 2 లక్షల మందికి పాత మొత్తంతోనే పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రజా పాలనలో లక్షల్లో దరఖాస్తులు కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా ప్రజాపాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా, ఇతర రూపాల్లో..పింఛన్ల కోసం 19 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, 4 లక్షల దాకా వితంతు, 3 లక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. వీటన్నింటినీ చేయూత పింఛన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే ఎంతమంది అర్హులనేది తేలుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడ్జెట్ కొరత, సాంకేతిక కారణాల వల్ల కొత్త పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. వారం వారం తిరుగుతూనే ఉన్నా.. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఐదేళ్లు అయింది. గత ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా. వారం వారం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా ఇప్పటివరకు రాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. – చంద్రకళ, మరికల్, నారాయణపేట నాలుగేళ్లలో మూడుసార్లు దరఖాస్తు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నాకు ఒక కాలు పూర్తిగా తీసేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సదరం సర్టిఫికెట్ తీసుకున్నా. నాలుగేళ్లలో మూడుసార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతీసారి ఎంక్వయిరీ చేసి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు నాకు పెన్షన్ అందలేదు. – మీర్జా ఇస్మాయిల్, దివ్యాంగుడు, సుభాష్నగర్ (కరీంనగర్) -
అమృతం బదులు విషం.. ఆయనో 'పెద్ద జోక్'!
ఒకప్పుడు కలిసి ఎన్నికలు పోరాడిన మిత్రపక్షాలు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రతిపక్ష ఐక్యతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. మాజీ మిత్రపక్షం డీఎంకే ఊహించని స్థాయిలో ఎదురుదాడికి దిగింది. అలాంటి పాఠాలు చెప్పే హక్కు అసలు రాహుల్కు ఉందా?" అంటూ ప్రశ్నించిన డీఎంకే.. 'ఇండియా' కూటమిలో ఏర్పడిన విభేదాలకు కాంగ్రెస్నే బాధ్యురాలిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. రాహుల్ గాంధీపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటు డీఎంకే సోషల్ మీడియా విభాగం.. అటు అధికార పత్రిక మురసొలిలో వచ్చిన సంపాదకీయం కాంగ్రెస్ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్నప్పుడు తమ పార్టీ కాంగ్రెస్కు అండగా నిలిచిందని, కానీ అవకాశం దొరకగానే కాంగ్రెస్ తమను వదిలేసిందని డీఎంకే సోషల్ మీడియా పేజీలు వరుస పోస్టులు పెడుతున్నాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీని "పెద్ద జోక్.. రాజకీయ అపరిపక్వుడు"గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేసింది.ఇక డీఎంకే అధికార పత్రిక మురసొలి సంపాదకీయంలో ఆ డోస్ మరింత ఎక్కువే కనిపించింది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే ముందు వివిధ రాష్ట్రాల్లో ఆ ఐక్యతను దెబ్బతీసింది ఎవరో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా కేరళలో వామపక్షాలపై కాంగ్రెస్ వైఖరిని ప్రస్తావిస్తూ.. అక్కడి నేతలు గతంలో రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే.. తమిళనాడులో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను కూడా డీఎంకే ప్రస్తావించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్.. అనంతరం ఆ కూటమి నుంచి బయటకు వచ్చి నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామి కావడాన్ని డీఎంకే "ద్రోహం"గా అభివర్ణించింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలిపిందని ఆరోపించింది. అలాగే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఏర్పడుతున్న విభేదాలకు బీజేపీ కంటే కాంగ్రెస్ వైఖరే ఎక్కువ కారణమని మురసొలి సంపాదకీయం పేర్కొంది. రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత లోపం, స్థిరమైన వ్యూహం లేకపోవడమే ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తికి దారితీస్తోందని డీఎంకే విమర్శించింది. ప్రతిపక్ష కూటమిలో అమృతం బదులు విషం కలిపింది ఎవరు? అంటూ ఆ వ్యాసాన్ని ముగించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. తమిళనాడులో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగానే పార్టీ నిర్ణయాలు తీసుకుందని, డీఎంకేను గానీ, ఇండియా కూటమిని గానీ బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి.ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కలిసిన మిత్రపక్షాలు ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఇండియా కూటమి భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీసు స్టేషన్ లోనే రక్షక భటులకు వార్నింగ్ ఇచ్చారు. నా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారా అని పోలీసులను బెదిరించారు. ఒళ్లు పగులుతుంది నీ సంగతేంటో చూస్తానని పోలీస్ స్టేషన్లో నానా హంగామా సృష్టించాడు. కాగా గత కొంతకాలంగా ఆలేరు, బిక్కేరు వాగు, రాజపేట, మోటకొండూరు ప్రాంతల నుంచి ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మోటకొండూరు మండలం వర్టూరు చెరువు నుంచి కూడా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇసుక రవాణాను అడ్డుకున్న వారిని సైతం కొంతమంది నేతలు ఇలానే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆలేరు కాంగ్రెస్ నాయకుడే ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది.స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్అవుట్ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. -
‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’
హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్రావు. బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్ పెట్టిన గురుకులాలే కారణమన్నారు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. హనుమకొండలో హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ యువనేత రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలలో హరీష్రావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు చేయూత, స్కూల్ బాగ్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది,. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. -
‘మీనాక్షికి సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారు’
సాక్షి, హైదరాబాద్: మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్పై రేవంత్ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.‘‘రేవంత్ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్లో బీఆర్ఎస్దే విజయం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
మాట జారిన రాహుల్.. ఇండియా కూటమిలో దుమారం
తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై విజయన్తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పినరాయి ఘాటు స్పందన..రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.Mr Rahul Gandhi said in INDIA alliance meeting that he cannot hug his alliance partner CPM’s ex-CM Mr Pinarayi Vijayan because he has an ongoing political fight with him. pic.twitter.com/8G9OE0npcm— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 14, 2026కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులేఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.కూటమికి కొత్త తలనొప్పి..ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. -
ఫస్ట్ హాఫ్ ఫెయిల్
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) విఫలమైందని చెప్పారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్పై ఎలాంటి ఆశలు ఉండవో.. ప్రభుత్వ ప్రస్తుత పనితీరు కూడా అలాగే ఉందని అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడల్లో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బూత్ లెవల్ ఏజెంట్లతో బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యంలో తరుగు పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. ఎరువుల దుకాణాల వద్ద మళ్లీ క్యూలైన్లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్గాందీకి మాత్రం సంచుల కొద్దీ డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్బంధు’మొదలుపెట్టారని విమర్శించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికలకు ముందు బాండ్ పేపర్ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పుతో చేసిందేమిటో చెప్పాలి హిట్లర్ స్ఫూర్తి అయితే పాలన గిట్లనే ఉంటదని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్రెడ్డేనని ఆరోపించారు. ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, కేసీఆర్పై ప్రజల అభిమానం తగ్గలేదని చెప్పారు. రేవంత్రెడ్డి ప్రతిసారీ కేసీఆర్ అప్పు చేశారంటుంటారని..అయితే కేసీఆర్ అప్పు చేసినా అభివృద్ధి చేశారని, రైతుల ఖాతాల్లో రూ.77వేల కోట్లు వేశారని, 15 లక్షల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ ఇచ్చారని, కొత్త జిల్లాలు, కొత్త కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టారని వివరించారు. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. సభ్యత్వ నమోదు, ‘సర్’పై పాఠాలు ‘నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే. ఒక్క రూపాయి.. చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినందుకు గర్వపడుతున్నా..’అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్లను జిల్లా చేసి రూపురేఖలు మార్చామని, ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 25 తర్వాత వేములవాడలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ప్రకటించారు. కాగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్పై పాఠం మాదిరి అవగాహన కల్పించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్రెడ్డి, నేతలు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ‘ఆడియో’ కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏముందా ఆడియోలో.. ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది. నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్గౌడ్ ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు. పీసీపీ చీఫ్ను టార్గెట్ చేశారా? పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్కుమార్గౌడ్ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు. -
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్మోడల్గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్చాట్ చేశారు. ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్కే.. ‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది. బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు.. ‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్ఎఫ్సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్ఆర్ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. కేబినెట్ భేటీకి రానని చెప్పాలి.. మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పేరు వస్తుందని కిషన్రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి. జూలైలో మహారాష్ట్రతో చర్చలు.. గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా? హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం.. రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు. వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా? ‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు. రాహుల్గాంధీతో భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శక్రవారం ఉదయం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది. -
‘బీజేపీ వైఖరి కిమ్ జాంగ్ను తలపిస్తుంది’
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్ జాంగ్లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్. ‘నార్త్ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.‘శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా?, హిట్లర్ నాకు ఆదర్శం కాదు. నా మాటలను మీడియా వక్రీకరించింది. హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో అప్పుడే విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే నరేంద్ర మోదీతో ఉన్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారా?, కేంద్ర మంత్రుల వద్దకు కిషన్ రెడ్డితో పాటే నేను వస్తా. జూలైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సమావేశం ఉంటుంది. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సహకరించాలి. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఢిల్లీలో డాన్స్ చేస్తున్నారు. 8 మంది ఎంపీలు కేంద్రంతో పట్టుపడితే ప్రాజెక్టులు ఎందుకు రావు. ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి మెట్రో రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి అనుచరులే ఫ్లెక్సీలు కట్టారు. కిషన్ రెడ్డి నెగటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీ. స్కూలు ఫీజుల నియంత్రణపై మీడియా గట్టిగా రాస్తే నేను చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు. -
మీనాక్షి నటరాజన్.. నాంపల్లి కోర్టు ఏం చెప్పనుంది?
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విషయమై ఈరోజు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, మీనాక్షితోపాటు మిగిలిన ప్రతివాదుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.కాగా, తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత తనపై వేధింపుల కారణంగా నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటుగా 2023 బెంగళూరులో చేసిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనంతరం, ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీకి శ్రీలత ఫిర్యాదు చేశారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గతేడాది ఆగస్టు 20న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.ఫిర్యాదులో తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు, నేరపూరిత కుట్ర, బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు 16 పేజీలతో కూడిన ఫిర్యాదును కోర్టుకు అందించారు. ఆ కేసులో ప్రతివాదులుగా కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎంఎల్ఏ చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డితో పాటు పార్టీ తెలంగాణ మీనాక్షి నటరాజన్ పేరు కూడా చేర్చారు. అలాగే, బాధ్యులైన వారి నుంచి తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కాగా, శ్రీలత పిటీషన్కు కోర్టులో ఎస్ఆర్ నంబర్ కేటాయించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు వాదనల అనంతరం పిటిషన్పై విచారణ చేపట్టాలా? వద్దా? అనే విషయమై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. సమావేశంలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ జైరాం రమేశ్, భూపేశ్ బఘెల్లతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్ ఇంజన్. ఇందులో ఒక ఇంజన్ ఓట్ చోరీ కాగా, మరోటి సీట్ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఓటు చోరీ.. ఇప్పుడు సీటు చోరీ: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తోందని చెప్పారు.అలాగే, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత బీజేపీ-ఈసీ జుగల్బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు. After Vote Chori and Sarkar Chori - the BJP-EC jugalbandi has finished the contest before it has even begun with Seat Chori.Look at what happened in the recent Rajya Sabha elections.Congress candidate Meenakshi Natarajan ji submitted every document. No pending cases. The EC…— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2026 -
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. తరుణ్చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఒక కేసును అఫిడవిట్లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
దేశ రాజకీయాల్లో ట్విస్ట్..కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?
-
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ గురువారం కీలక అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే ప్రజలకు జరిగిన నష్టమే ఎక్కువని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆ అంశాలను చార్జ్ షీట్ రూపంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. యువత ఉపాధి అవకాశాలను కోల్పోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యంపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం సైతం గురువారం నాటి సమావేవంలో చర్చకురానుంది. -
ఆయన దేశానికి గుదిబండ
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన ఘనతపై బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ సాధించింది మైలురాయి కాదని, ఆయన ఈ దేశం మెడకు చుట్టుకున్న గుదిబండ అంటూ విరుచుకుపడింది. ‘సుదీర్ఘకాల ప్రధాని అంటూ ఒక్కరే ఉంటారు. ఎన్నికల ద్వారా, ఎన్నికలు కాకుండా అంటూ రెండు రకాల నిర్వచనాలు ఉండవు. కానీ స్వీయ ప్రకటిత, కొత్తగా సృష్టించిన ‘సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని’ అనే మైలురాయిని మోదీ మెడకు తగిలించుకున్నారు. అది మైలురాయికాదు దేశం మెడకు చుట్టుకున్న మోయలేని గుదిబండ’’ అని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జై రామ్ రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్చేశాశారు. ‘‘1947 ఆగస్ట్ 15న స్వతంత్రభారతంలోని దిగ్గజ నేతల సమ్మతితో, నాడు కొలువుదీరిన కేబినెట్కు సారథ్యం వహిస్తూ జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానిగా సేవలు ఆరంభించారు. 1947 నుంచి 1952 దాకా ప్రధానిగా నెహ్రూ హయాంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది. అంతటికీలక సమయం లెక్కలోకి రాదన్నట్లు నేడు మోదీ వ్యవహరిస్తూ చరిత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. 1952 తర్వాత పాలనే నెహ్రూ ప్రధానిగా లెక్కలోకి వస్తుందని మోదీ కొత్త భాష్యం చెబుతున్నారు. ఇది ఆయన సంకుచిత ఆలోచనకు ప్రబల నిదర్శనం’’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట మసకబారింది’’ అని జైరాం ఆరోపించారు.నెహ్రూతో మోదీని పోల్చలేం: పవార్ మోదీకి సరితూగగల నేత ఎవరూ లేరు అని బీజేపీ చెప్పుకోవడాన్ని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ చీఫ్ శరద్ పవార్ తప్పుబట్టారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో మోదీని పోల్చడం సరికాదని ఆయన తెలిపారు. నెహ్రూ దేశానికి అందించిన అద్వితీయమైన సేవలను ఎన్నటికీ మర్చిపోజాలమని పేర్కొన్నారు. ‘నెహ్రూను మరెవరితోనూ పోల్చలేం. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఎన్నో ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు’అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందలు
న్యూఢిల్లీ: దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సహాయతలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన కాలాన్ని ‘హిందూ వృద్ధి రేటు’గా తప్పుగా అభివర్ణిచారని ఆక్షేపించారు. వాస్తవానికి దానిని ‘కాంగ్రెస్ వృద్ధి రేటు’గా అని పిలవాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుందని, ఇక్కడ వేగవంతమైన ప్రగతి సాధ్యం కాదని ప్రజలు భావించేలా చేశారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాల నిందలను హిందువులపై అన్యాయంగా మోపారని, కాంగ్రెస్ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆ పార్టీ రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని చిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వారసత్వ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన సంకల్పంతో భారీ స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం వచి్చనప్పుడు సామాన్య పౌరుడికి ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్రోహం తర్వాత దేశ ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారని తెలిపారు. 12 ఏళ్లలో తమ కూటమి ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజలే నాకు దేవుళ్లు ‘‘అవినీతికి తావులేని పాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నిజంగా నా దృష్టిలో అద్భుతమైన క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. అధికారాన్ని సేవగానే ఎల్లప్పుడూ భావించాం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చాక కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోంది. స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగం పుంజుకుంది. 2014కి ముందు దేశంలో అస్థిరత ఉండేది. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములే. మా పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు చేరింది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి చెప్పడానికి ఇదొక తార్కాణం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.ఉగ్ర దాడులపై దేశం మౌనంగా ఉండదు సామాన్యులపై భారం తగ్గించాలన్నదే మా సంకల్పం. పన్ను మినహాయింపులు, పాలనాపరమైన సంస్కరణలతో సహా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించాం. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చాం. నేడు దేశం సరళమైన పన్ను విధానంతో ప్రయోజనం పొందుతోంది. దేశమే ప్రథమం(నేషన్ ఫస్ట్) అనే నినాదంతో పనిచేస్తున్నాం. దేశంలో మావోయిస్టుల సమస్యను అంతం చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని నెలకొల్పాం. ఇలాంటి నిర్ణయాలను తీసుకొనే సాహసాన్ని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తున్నాం. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో మన సంకల్పాన్ని, బలాన్ని ప్రదర్శించాం’’ అని అన్నారు.విదేశాలపై ఆధార పడొద్దు నా దృష్టిలో పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వచ్చింది. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ‘2047 నాటికి వికసిత్ భారత్’ మన లక్ష్యం. అందుకోసం మరింత వేగంగా, క్రియాశీలకంగా పని చేయాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పం సాకారమవుతుండడం ఆనందంగా ఉంది. మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం స్వావలంబన సాధిస్తోంది. అదే సమయంలో జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో విదేశాలపై ఆధారపడకూడదు. 2014లో ఉదయించిన ఆశాకిరణం నేడు నూతన ఆత్మవిశ్వాసపు కాంతిరేఖగా మారింది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తనను సత్కరించినందుకు ఎన్డీయే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతంగా తనది మాత్రమే కాదని, మొత్తం కూటమికి, బీజేపీ కార్యకర్తలందరికీ చెందుతుందని వివరించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా కాకుండా.. తమ సమిష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సుదీర్ఘ పదవీకాలాన్ని ఒక గొప్ప గౌరవంగా అభివర్ణిచారు. దేశ సేవ ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధన వంటిదని అన్నారు. -
ఇదే 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి ఓ దిక్సూచిగా మారబోతోంది. గ్రీన్ఫార్మా, స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషనల్, డేటా సెంటర్లు, ఏఐ, ఫార్చ్యూన్– 500 కంపెనీలతో విరాజిల్లబోతోంది. టోక్యో, సింగపూర్, న్యూయార్క్ వంటి గొప్ప నగరాలతో పోటీ పడబోతోంది. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వేదికగా నిలవబోతోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట వేదికగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఎఫ్సీడీఏ విజన్ ఇన్ యాక్షన్ ప్లాన్ పోర్టల్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. ‘150 రోజుల్లో ఎఫ్సీడీఏ భవనాన్ని పూర్తి చేసుకున్నాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. అభివృద్ధి పథం వైపు నడవాలి. స్థానికుల అభ్యర్థన మేరకు కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. భవిష్యత్తులో ఈ నగరం మరింత రాణిస్తుంది. అడ్డుపడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహితనగరంగా రాణిస్తుంది చిన్న వర్షానికే వరదలు నగరంలోని వీధులను తరచూ ముంచెత్తుతున్న వరదలకు, ట్రాఫిక్ అంతరాయానికి నాటి పాలకుల పాపమే కారణం. నగరంలో పెద్ద వర్షం పడలేదు. చిన్నపాటి వర్షానికే వరద ఏరులై పారింది. ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటలు పట్టింది. పదేళ్లలో అభివృద్ధి చేశాం. వంద కోట్లకు ఎకరం అమ్మామని చెప్పడం కాదు. నిన్నటి ట్రాపిక్ సమస్యకు కారణం ఎవరో చెప్పాలి. కబ్జాలపై మరింత కఠినంగా.. గత ప్రభుత్వంలోని దుర్మార్గులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. చెరువులను చెరబట్టి, అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే చెరువులు, కుంటలోŠల్ ఉండాల్సిన వరద నీరు రోడ్లపైకి వస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్కు కారణమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆక్రమణలు తొలగించి, చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తున్నాం. వాటి చుట్టూ పార్కులు, మార్కెట్లు తీసుకొచ్చి లేక్ ఎకానామీ సృష్టించబోతున్నాం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నాం. కబ్జాలకు పాల్పడిన వాళ్లను వదలం. వారి వెనుక ఉన్నవాళ్ల తోకలు కట్ చేయడానికి కూడా వెనకాడం. అదేమైనా మీ తాత జాగీరా? బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్రెడ్డి 15 ఎకరాలు కబ్జా చేశాడు. దీన్ని కేసీఆర్ ఆయనకు రాసిచ్చాడు. అదేమైనా మీ తాతా జాగీరా? ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే నిర్దాక్షిణ్యంగా ఆక్రమణలను తొలగించాం. కుంటకు మళ్లీ జీవం పోశాం. గండిపేట, హిమాయత్సాగర్ ఆక్రమణలను తొలగించే పని చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసమే..’ అని సీఎం చెప్పారు. తెలంగాణ ముఖ చిత్రమే మారింది ‘హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది. ఆనాటి కులీకుతుబ్షాలు, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని విస్తరింపజేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్కు ఒక మంచి గుర్తింపు వచ్చింది. చార్మినార్ నుంచి గుల్జార్హౌస్ వరకు, మొజాంజాహీ మార్కెట్ నుంచి ఖబూతర్ఖానా వరకు విస్తరించకపోతే చరిత్రలో గుర్తింపు వచ్చేదా? 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ విస్తరణతో జంటనగరాలుగా వెలుగొందుతున్నాయి. సైబరాబాద్ సాంకేతిక విప్లవం. 60 శాతం ఆదాయం అందిస్తుంది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లు పలుకుతోంది. తెలంగాణ ముఖ చిత్రమే మారింది. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ అధికం. కుట్రలు, కుతంత్రాలు చేసినవాళ్లూ ఉన్నారు.. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తి వేలాది మంది చనిపోతే నిజాం చలించారు. మూసీ, ఈసీలు ఉప్పెనై కమ్మేయకుండా జంట జలాశయాలు నిర్మించారు. ఆనాడు సైబరాబాద్, హైటెక్సిటీ అంటే నవ్వినోళ్లు ఉన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రాయాన్ని అడ్డుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దు అన్నోళ్లూ ఉన్నారు. ఈ నగరం అభివృద్ధి చెందకూడదని కుట్రలు, కుతంత్రాలు చేశారు. కానీ ఆనాటి ముఖ్యÐమంత్రులు హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీ, ఐటీ సంస్థలు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలను తీసుకురాకపోతే.. పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవా?..’ అని రేవంత్ ప్రశ్నించారు. వచ్చేసారి ప్రతిపక్ష హోదాకూడా రాదు.. ‘ఆనాడు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు.. నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహుడు, శుక్రాచార్యుడు ఉన్నారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్లో పండిండు. మారీచుడు, సుబాహులను మనపై వదిలాడు. పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు కలిసి ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామంటున్నారు. అమెరికా వెళ్లి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్నారు. కానీ మీకు గతమే ఉంది. భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..’ అని సీఎం ఎద్దేవా చేశారు. విషం చిమ్ముతున్న బీఆర్ఎస్: భట్టి ఆనాటి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి, గ్రీన్ ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చిందని అన్నారు. కానీ ఓటమితో నిరాశా నిస్పృహలతో ఉన్న బీఆర్ఎస్ విషం చిమ్ముతోందని విమర్శించారు. కొన్ని గ్రామాలను ఎఫ్సీడీఏలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.హైటెక్ సిటీకి దీటుగా..: శ్రీధర్బాబు హైటెక్ సిటీకి దీటుగా కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో రెండున్నరేళ్లుగా అహరి్నశలు శ్రమిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ ప్రాంతవాసుల జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయని, కాలుష్యం లేని పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక తదితరులు మాట్లాడారు. కొత్త శక్తిని నింపుకోవడానికి కలిసి రండి – ‘ఎక్స్’లో సీఎం రేవంత్రెడ్డి ‘భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఒక నిజం. మనం విదేశాలకు వెళ్లి గొప్ప నగరాలను చూసినప్పుడల్లా.. ఇంతటి ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, అద్భుతంగా నిర్వహించే నగరం మన దేశంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాం. భారతీయులందరి సామూహిక కోరికకు సమాధానమే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. దీని కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోనే ప్రారంభించుకున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో దీని ప్రాముఖ్యత కారణంగా ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని భూగోళంపైనే అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే వరకు శ్రమించేలా కొత్త శక్తిని నింపుకోవడానికి నాతో కలిసి రండి..’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటే?
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.టీఎంసీ అంతర్గత అసంతృప్తి, ప్రముఖ నేతల నిష్క్రమణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనను సోనియా గాంధీ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుందని ఆమె సూచించినట్టు చెబుతున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ, మమతా బెనర్జీ మధ్య చర్చ జరిగినట్టు సోర్సెస్ పేర్కొన్నాయి. టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి, వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.మమత ఏమన్నారు? మమతా బెనర్జీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్లో టీఎంసీ విలీనం జరిగితే అనుసరించాల్సిన విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. ఆ ప్రతిపాదన ప్రకారం.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వవచ్చని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.అయితే, ఇలాంటి ప్రతిపాదన నిజంగా ఉందా? లేదా? అన్న విషయంపై కాంగ్రెస్, టీఎంసీ నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. పార్టీ భవిష్యత్ దిశ, అభిషేక్ బెనర్జీ పాత్రపై టీఎంసీలో అసంతృప్తి ఉన్నట్టు వస్తున్న వార్తల మధ్య ఈ ఊహాగానాలు వెలువడ్డాయి.అభిషేక్ బెనర్జీ-రాహుల్ గాంధీ భేటీపై ఆసక్తిఈ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి రేపేలా అభిషేక్ బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం సానుకూలంగా సాగిందని తెలుస్తోంది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశం గంటన్నర కంటే అధిక సమయం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. -
నామినేషన్ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్లో ఆర్వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మన్వు సంఘ్వీ అన్నారు.కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది. ఈసారైనా జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నేనావత్ బాలునాయక్లలో ఎవరిని మినిస్ట్రీ వరిస్తుందన్న చర్చ సాగుతోంది. ఎప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా.. మొదట జిల్లా నేతలకు మంత్రి పదవిపైనే చర్చ జరగడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్రెడ్డికి సంకేతాలు!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీని కలువడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అప్పడు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్రెడ్డి పక్కా బెర్త్ లభిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన రాహుల్గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ తనకు అధిష్టానం ఏం హామీ ఇచ్చింది... తనకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా ఎలా నిర్వర్తించారు.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై రాహుల్గాంధీకి వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్రెడ్డి మాత్రం.. తాను రాహుల్గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు.బాలునాయక్కు అవకాశందేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జిల్లా నుంచి బలహీనవర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదీ పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమ్ము పాపయ్య, రవీంద్రనాయక్కు 1985కు ముందు మంత్రి పదవులు దక్కగా, ఆ తరువాత బలహీనవర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా, లంబాడా కోటాలో బాలునాయక్కు ఇస్తారని, సీఎం రేవంత్రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది.నెలాఖరులో కేబినెట్ విస్తరణ?ఈ నెల 18వ తేదీతో రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తరువాత రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని, ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి రాజగోపాల్రెడ్డి, బాలునాయక్లలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
మీనాక్షి కి కోర్టు నోటీసులు.. MP నామినేషన్ రిజెక్ట్ కు అసలు కారణం ఇదే..
-
కాంగ్రెస్కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
హామీలు తప్ప అమలేదీ?
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మోదీ సర్కార్ 3.0కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘హామీ వర్సెస్ వాస్తవం’ పేరిట మంగళవారం ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి గత 12 ఏళ్లుగా అనేక హామీలు, భారీ ప్రకటనలు, గొప్ప మాటలు, వార్తా శీర్షికలు వెలువడినప్పటికీ వాస్తవానికి ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేలా వాటిలో ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. ఏఐసీసీ రీసెర్చ్ డిపార్టుమెంట్ రూపొందించిన ఈ 75 పేజీల పత్రాన్ని కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, అమితాబ్ దూబే విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విదేశాంగ విధానం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, సామాజిక రంగం, పౌర స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, చట్టాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని 4 సిలిండర్లకు కుదించారని మండిపడ్డారు. మహిళలను, వారి కుటుంబాలను దగా చేశారని ఆరోపించారు. భారత్ను ప్రపంచ ఉపాధి కల్పన కేంద్రంగా మారుస్తామంటూ వాగ్దానం చేశారని తెలిపారు. వాస్తవానికి ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. పట్టణ ప్రాంత యువతలో నిరుద్యోగిత రేటు 18.4 శాతంగా ఉందన్నారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లలో 7 శాతం మంది మాత్రమే ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగాన్ని పొందుతున్నారని చెప్పారు. -
ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్క్ లు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్ నుంచి వీలును బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలని హస్తిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా, మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్ నుంచి కబురు వస్తుందని, ఈ నెలాఖరులోపే మార్పులు జరగవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంకేతాలిస్తున్న ఇటీవలి పరిణామాలు.. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దలను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాహుల్గాం«దీని ఇటీవల కలవడం లాంటి ఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుందనే దానికి ఊతమిస్తున్నాయి. పలు కోణాలు.. పలువురు ఆశావహులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం పలు కోణాలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు ఈసారికి పీసీసీ అధ్యక్ష పదవి తోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్రెడ్డి, ఎస్టీ లంబాడా కోటాలో బాలూనాయక్లో కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.కానీ రాజగోపాల్రెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎస్టీ కోటాలో బాలూనాయక్ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా లంబాడా వర్గానికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారనే సమీకరణం బాలూనాయక్కు ఆటంకంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.ఒకవేళ లంబాడా వర్గానికి కేబినెట్లో అవకాశం ఇస్తే బాలూనాయక్కే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్గా ఆయన్ను నియమించే అవకాశముందని కూడా సమాచారం. ఇక బీసీ సామాజికవర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పించే అంశం కూడా ఇటు సీఎం, అటు అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్లో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. కేబినెట్లోకి స్పీకర్! అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఈసారి కేబినెట్లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్కు మంత్రిగా అవకాశమివ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజికవర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్ పెట్టవచ్చనే ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఆయన ఇటీవల పార్టీ పెద్దలను కలవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పని భారం తగ్గించుకునే యోచనలో సీఎం ఎన్నికల కేబినెట్ రానున్న నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఈ శాఖలను కూర్చే పనిలో భాగంగా ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖలు కూడా మారతాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లుగా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని, సీఎంను కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి శాఖలు మారుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకరిపై వేటు తప్పదా?ప్రస్తుత మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్ మంత్రిని తప్పిస్తారనేది కూడా గాం«దీభవన్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. రాజకీయంగా మంత్రుల వ్యవహారశైలితో పాటు ఆయా శాఖల్లో వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలున్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపునకు ప్రాతిపదికగా మారతాయని, అన్నీ కుదిరితేనే ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం. -
మీనాక్షి నటరాజన్కు షాక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్కు షాక్ తగిలింది. ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అపిడవిట్లో వెల్లడించలేదని, ఆస్తుల వివరాలు తెలపలేదని బీజేపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ నామినేషన్ను తిరస్కరించింది. కాగా మధ్యప్రదేశ్నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేశారు.కాగా తొలినుంచి మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ సాగింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. అయితే కాంగ్రెస్ ఓట్లతో సులువుగా ఒక రాజ్యసభ సీటు గెలువగలదు. అయితే బీజేపీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ఈ ఉత్కంఠల నడుమ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడింది. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం రద్దవడం సంచలనంగా మారింది. -
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్! NDAకు లాభమేనా?
-
మీనాక్షికి అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. మూడో సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మూడో సీటుపై కన్నేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటూ మాదే. ఇంకెక్కడికి వెళ్తుంది?’ అంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మత్స్యకార నేత మహేష్ కేవత్ను ఆదివారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో 228 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన రెండు సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో పది ఓట్లుంటే సరిపోతుంది. కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షీ నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు. -
‘‘అందుకే హైడ్రా గురించి ‘హిట్లర్’ అంటూ రేవంత్ మాట్లాడారు’’
హైదరాబాద్: బీఆర్ఎస్పై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోందని, దీన్ని ఓర్వలేకే కొంతమంది దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని చెప్పారు.‘‘సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన ‘The Hindu Conclave’లో ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక పదాన్ని పట్టుకుని కొందరు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం అత్యంత సిగ్గుచేటు. అక్కడ సీఎం మాట్లాడిన పరిపాలనా తత్వశాస్త్రం, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ ను అర్థం చేసుకునే ప్రాథమిక మేధో పరిపక్వత వారికి లేదు. సీఎం ప్రస్తావించింది కేవలం Execution Speed, Decisiveness గురించి మాత్రమే తప్ప... హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదు.హైదరాబాద్లోని చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఆ మాత్రం ఉక్కు సంకల్పం ఉండాలనే ఉద్దేశంతోనే ‘హిట్లర్’ గురించి సీఎం చెప్పారు. తెలంగాణలో ఓ సామెత ఉంది... ‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే... గోడ కూల్చినట్టుంది’ అని. అచ్చం కేటీఆర్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. అక్కడ చర్చ జరిగిన సందర్భం ఏంటో తెలియదు, ఆ సదస్సు సారాంశం ఏంటో తెలియదు. కానీ.. ‘హిట్లర్’ ఒక పదాన్ని పట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.హైడ్రా స్పీడ్ కు కబ్జాదారుల గుండెల్లో పుడుతున్న వణుకు చూసి... తట్టుకోలేక... ఓర్వలేక... ఎక్కడ ఏడ్వాలో తెలియక... ఈ ‘హిట్లర్’ ముసుగు వేసుకుని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. కేటీఆర్ నోట ప్రజాస్వామ్య విలువలు అనే మాట వింటే... ‘గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అన్న సామెత గుర్తొస్తుంది.హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోంది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోంది. కాకపోతే, గతంలో లాగా కబ్జాదారులకు కొమ్ము కాయకుండా, వారితో కుమ్మక్కు అవ్వకుండా... ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ మార్పు తెలంగాణకు అవసరం. దీన్ని ప్రతి మేధావీ, ప్రతి సామాన్యుడూ స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిట్లర్ క్రూరత్వాన్ని, ఆ హింసాత్మక ఫాసిజాన్ని ఎప్పటికీ సమర్థించదు. అది మా డీఎన్ఏలోనే లేదు’’ అని తెలిపారు.‘వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అనడమేంటి? హరీశ్ రావుపై కూడా శ్రీధర్ బాబు మండిపడ్డారు. ‘‘మీ గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో మీరిచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తోందదని హరీశ్ రావు ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ భూముల ధరలు కృత్రిమంగా పెంచింది. బీఆర్ఎస్ హాయాంలో ప్రగతి భవన్లో ఉన్నవారికే ఫ్రెండ్లీ పోలిసింగ్. వచ్చేది మేమే మీ అంతుచూస్తామని కేటీఆర్, హరీశ్ రావు బెదిరిస్తున్నారు... మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విషం చిమ్ముతుంది. మీ తాటాకు చప్పుళ్ల కు భయపడేది లేదు. కొత్త డిస్కం వల్ల రైతులకు లాభమే. ధాన్యం కొనుగోలులో మా ప్రభుత్వం రాజీపడదు. బీఆర్ఎస్ హాయాంలో పెంచని ఛార్జీలు ఉన్నాయా? అయినా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సింగరేణిని బీఆర్ఎస్ నేతలు సర్వం దోచుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ.40 వేల కోట్ల అప్పు పెట్టింది. ప్రైవేటు బొగ్గు డిపోలకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో భయంతో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సింగరేణి విషయంలో హరీశ్ రావు ఆరోపణలు తప్పు’’ అని తెలిపారు. -
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
-
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మీనాక్షికి క్రాస్ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్లో ఆందోళనను మరింత పెంచింది. -
నేడే ఇండియా జనబంధన్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా జనబంధన్’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశి్చమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి . కూటమిలో రచ్చరచ్చ 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ హాజరు కానున్నట్లు సమాచారం. ఐక్యతపై అనుమానాలు: బీజేపీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.కేజ్రీవాల్తో మమత భేటీ భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్ చీఫ్తో టీఎంసీ చీఫ్ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ వచ్చారు. -
అభివృద్ధికి కలసిరండి
సాక్షి, హైదరాబాద్: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. శనివారం ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం, టీకేఆర్ జంక్షన్ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. కనీస కనికరం ఉండొద్దా? ‘గుజరాత్ అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్ఫ్రంట్ దగ్గర ఒక్కో అపార్ట్మెంట్ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు. సింగపూర్, న్యూయార్క్తో పోటీ నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్ జంక్షన్– ఎల్బీనగర్ –ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్–ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్బీనగర్ – హయత్నగర్ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్ఆర్ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్ రింగ్రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్లాంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్–1 యాప్ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కిషన్రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... ‘హైదరాబాద్కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్ ఆర్కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్రెడ్డి గారూ..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. -
న్యూఢిల్లీలో ఇండి కూటమి నేతలు.. భేటీపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఇండి కూటమి సమావేశంలో పాల్గొనడానికి కీలక నేతలు ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జూన్ 8న జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఇండియా బ్లాక్ సమావేశం ఇదే.కొన్ని రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇండి కూటమి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో స్పందిస్తూ.. ప్రతిపక్ష కూటమి ఐక్యంగానే ఉందని, కొన్ని పార్టీలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోయినా ఐక్యత దెబ్బతినలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనున్న సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని ప్రకటించారు. సమావేశానికి రాకపోయినా, ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయని రమేశ్ చెప్పారు."మోదీ ప్రభుత్వం కోట్లాది భారతీయుల ఓటు హక్కును హరించే చర్యలు చేపడుతోంది. రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోట్లాది ప్రజల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిరంతర ద్రవ్యోల్బణంతో కుటుంబాల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోంది. పెట్టుబడి వాతావరణాన్ని బలహీనపరుస్తోంది. విదేశాంగ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. భారత్ మాదిరిగానే ఇండియా జనబంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.ఇండియా బ్లాక్ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, కూటమిలోని అంతర్గత విభేదాలు మరోవైపు ఉన్నాయి.తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమావేశానికి హాజరుకాబోమని తెలియజేస్తూ రాసిన లేఖలో.. దేశ సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఇతర పార్టీలు లేవనెత్తే విషయాలకు తాము ఎప్పటిలాగే మద్దతుగా ఇస్తామని డీఎంకే పేర్కొంది. -
హిట్లర్, తుగ్లక్ కలిస్తే ఆయనే..: ఏలేటి మహేశ్వర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హిట్లర్, తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.‘సాక్షి’తో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్ ప్లస్ తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్ రెడ్డి.పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. -
షర్మిలకు బిగ్ షాక్..! పార్టీని వీడనున్న రఘువీరా రెడ్డి
-
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
-
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
-
మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు లేదా శాఖల కేటాయింపు సమయంలో ఎప్పుడూ పదేపదే వినిపించే పేరు ‘బెంగళూరు నగరాభివృద్ధి శాఖ’. ఇప్పటివరకు ఈ శాఖను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్ చూసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ కేబినెట్లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అవును.. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రోజులైంది. శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణభైరేగౌడకు డీకే శివకుమార్ అప్పగించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖపై కొండంత ఆశతో ఉన్న రామలింగారెడ్డికి ఇది అసలు నచ్చలేదు.. తనకు ఆ శాఖ కేటాయించలేదనే కారణంతో అసంతృప్తికి లోనై మనస్తాపానికి గురై ఏకంగా మంత్రి పదవికే రామలింగారెడ్డి రాజీనామా చేశారు. అసలు ఆ బెంగళూరు నగరాభివృద్ధి శాఖలో ఏముంది ఇంతకీ? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.. ఎందుకింత పోటీ నెలకొంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్థిక ఇంజిన్గా బెంగళూరు బెంగళూరు అంటే కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో ఐటీ హబ్గా పేరు గాంచింది. అధికారానికి అక్షయపాత్ర ఈ బెంగళూరు మహానగరం. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా బంగారు ఖనిజంగా చెప్పొచ్చు. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి అత్యధిక రెవెన్యూ అందించే ఆర్థిక ఇంజిన్ ఈ బెంగళూరు నగరం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో బ్రాండ్ బెంగళూరు ఇమేజ్పై ప్రభావం చూపుతాయి. ఈ శాఖ బాధ్యతలు నిర్వహించే నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత స్థానం దక్కినట్లుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు అధిక డిమాండ్ ఏర్పడింది. బడ్జెట్లో అధిక కేటాయింపులు బెంగళూరు కేవలం రాజధాని మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక శక్తి కేంద్రం. దేశంలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానగరం నుంచి ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైతే ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు పొందవచ్చు. అత్యున్నత రాజకీయ గౌరవం, శక్తి లభిస్తుంది. అందుకే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తారు. అలాగే ఈ బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు లభించే బడ్జెట్ కూడా సామాన్యమైనది కాదు. వేలాది కోట్ల రూపాయల మేర భారీ బడ్జెట్ కేటాయింపులు ఈ శాఖకు దక్కుతాయి. అనేకానేక పథకాలు, ప్రాజెక్టులు ఈ శాఖకు బడ్జెట్లో లభిస్తాయి. నమ్మ మెట్రో విస్తరణ, ఫ్లై ఓవర్లు, సొరంగ మార్గాలు, రాజ కాలువలు, చెరువుల అభివృద్ధి, నగర ట్రాఫిక్ నిర్వహణ తదితర కోట్లాది రూపాయల ప్రాజెక్టుల పరిశీలన, బాధ్యత నేరుగా సంబంధిత శాఖ మంత్రిపై ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యేలకే ప్రేమ ఎక్కువ.. వాస్తవానికి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖపై కేవలం బెంగళూరు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కన్ను వేస్తుంటారు. ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక ఎమ్మెల్యేలు ఎవరూ ఈ శాఖను నిర్వహించేందుకు ఇష్టపడరు. ఈ శాఖ కేవలం బెంగళూరు నగరానికే పరిమితం కావడంతో వారు దీన్ని స్వీకరించేందుకు ముందుకు రారు. బెంగళూరు నగర ఎమ్మెల్యేలు ఎక్కువగా ఈ శాఖను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటివరకు ఈ శాఖకు మంత్రులుగా చేసిన వారు కూడా చాలా మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం లేకపోవడం, సొంత నియోజకవర్గంలో ఉంటూ ఈ శాఖ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు ఉండడంతో బెంగళూరు ఎమ్మెల్యేలు దీనికోసం పట్టుబడుతున్నారు. ఆఖరికి కొత్తగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కృష్ణబైరేగౌడ సైతం బెంగళూరు వాసి కావడం గమనార్హం.ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే.. బెంగళూరు అభివృద్ధిని, భవిష్యత్తును రూపొందించే, అత్యంత ప్రభావవంతమైన ప్రముఖ ప్రభుత్వ సంస్థలు కూడా ఈ శాఖ కిందకే వస్తాయి. బీడీఏ (బెంగళూరు అభివృద్ధి ప్రాధికార, బీడబ్ల్యూఎస్ఎస్బీ (బెంగళూరు జలమండలి), జీబీఏ (గ్రేటర్ బెంగళూరు అథారిటీ) తదితర ప్రభుత్వ రంగ పెద్ద సంస్థలు, వాటి కార్యాలయాలు బెంగళూరులోనే ఉంటాయి. ఆ సంస్థల నిర్ణయాలు, నియామకాలు మొత్తానికి పాలన పూర్తిగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. బెంగళూరులో మౌలిక వసతుల పెంపుదల కోసం ఏటికేడాది ప్రభుత్వాలు కేటాయింపులను పెంచుతూ పోతున్నాయి. దీనికితోడు బెంగళూరులో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా ఈ మహానగరం నిలుస్తోంది. -
పాలమూరు, డిండికి ఏపీ ఒప్పుకుంటేనే..
సాక్షి, హైదరాబాద్: ‘పక్క రాష్ట్రం (ఏపీ)తో చర్చలు జరుగుతున్నాయి. తొందర్లోనే వాటిని (జల వివాదాలను) పరిష్కరించుకుంటాం. మీకు తొందర్లోనే మంచి వార్త వినపించబోతున్నా. ముందు మాకు పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నూటికి నూరు శాతం నికర జలాలను ఇస్తే సముద్రంలో పోయే నీళ్ల గురించి ఏపీతో మాట్లాడతాం. కృష్ణా జలాల పంపిణీ అంశం బచావత్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలు.. మీరు (ఏపీ) 512 టీఎంసీలు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకాలు చేసి కృష్ణా పరీవాహక ప్రాంతానికి శాశ్వతంగా మరణశాసనం రాసిండు.ఆ మరణశాసనాన్ని తిరగరాయడం చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులకు అంగీకరిస్తూ ఏపీ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఏపీ ప్రాజెక్టులపై చర్చిస్తాం. లేకపోతే చర్చించే సమస్యే లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ శుక్రవారం కరివేన రిజర్వాయర్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నికర జలాల్లో ఒక చుక్కకూ రాజీపడం...‘గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల్లో ఒక చుక్కకే రాజీపడం. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతి చుక్క నీటి హక్కునూ కాపాడే బాధ్యత నేను, మంత్రి ఉత్తమ్ తీసుకుంటాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇస్తేనే పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై మాట్లాడటానికి ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీకి చెప్పించాం. పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపులను సైతం తీసుకొస్తాం.డిసెంబర్లోగా చర్చల ద్వారా జిల్లాకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో మెజారిటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రాజెక్టులు కట్టుకొని మనం 968 టీఎంసీలను వాడుకున్న తర్వాతే సముద్రంలో పోయే నీళ్ల లెక్క తేలుతుంది. 968 టీఎంసీలను మనం భద్రం చేసుకొని మిగిలిన దాని (వరద జలాలు) గురించి మళ్లీ చర్చ చేస్తాం. గోదావరిలో ఏపీకి ఉన్న 516 టీఎంసీలను వాళ్లు ఎక్కడ వాడుకుంటారో వారిష్టం. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.కమీషన్ల కోసమే లిఫ్టులు, పంపులు...‘కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్ల ఖర్చు చేసిండు. అందులో అధిక భాగం పంపులు, లిఫ్టులకే ఇచ్చి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసిపోయిండు. వాళ్లలాగా కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పనిచేసే వాడిని కాదు. 20 ఏళ్లలో జెడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు జిల్లాలో రూ. వేల కోట్ల పనులు జరిగినా ఒక్క రోజైనా నాపై చిన్న ఆరోపణ అయినా వచ్చిందా?’ అని రేవంత్ ప్రశ్నించారు.పంచె కట్టుకున్నోళ్లంతా రాజశేఖరరెడ్డి కాదు..‘పాలమూరు’ ప్రాజెక్టును కొలిక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటే రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వారు (బీఆర్ఎస్) బయలుదేరారు. ఒకాయన పంచె కట్టుకొని రాజశేఖరరెడ్డి అనుకుంటడు. పంచె కట్టుకున్నోళ్లంతా రాజ శేఖరరెడ్డి అయితే బానే ఉండే. ఇంటి పేరు మార్చుకున్నడు ఇంకొకాయన. ప్రజలు చీదరించుకుంటారనే సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.జూన్కల్లా పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలు..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. తక్కువ భూసేకరణతో ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలను జూన్ వరకు పూర్తి చేస్తాం. బ్రాంచి కాల్వలు, మిగతా పనులకు ఆ తర్వాత టెండర్లు. పంపులు, లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్లను 2027 జూన్లోగా పూర్తి చేసి ఉదాండాపూర్ వరకు నీళ్లను తరలిస్తాం. లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలి? డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఎలా చేయాలో 6 నెలల తర్వాత సమీక్షిస్తాం’ అని సీఎం తెలిపారు.కర్ణాటక సరిహద్దులో బరాజ్లు‘కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చిన్న బ్రిడ్జీ కమ్ బరాజ్లు కట్టి దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకుంటోంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జి కమ్ బరాజ్లు కట్టుకుంటే నిల్వతోపాటు భూగర్భ జలాలూ పెరుగుతాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చెరి సగం ఖర్చు భరించేలా 60–70 శాతం నీళ్లు మనం వాడుకునేలా కార్యాచరణ తీసుకున్నం’ అని సీఎం రేవంత్ చెప్పారు.మోదీనే దిగిపోమనండి..‘ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఏం వెలగబెట్టిండో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు వేశాడా? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసిండా? అందుకే తక్షణమే మోదీని గద్దెదిగమనండి. రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ నెరవేరేలా చేయిస్తా. పాలమూరు–రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయిస్తా. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కేంద్రంతో కొనిపిస్తా. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఆర్నెల్లలో సమస్యలన్నీ పరిష్కారం: మంత్రి ఉత్తమ్ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాసం, పునర్నివాసం సమస్యలతోపాటు పర్యావరణ, అటవీ అనుమతులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్తో కలిసి కరివేన రిజర్వాయర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం గూడెందొడ్డి, భూత్పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడంతోపాటు భీమా, కృష్ణా నదులపై కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత సర్కారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ. 1.81 లక్షల కోట్ల అప్పులు చేసి ఎలాంటి సాగునీటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. తమ పాలన పూర్తయ్యేలోగా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్నారు. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత
సాక్షి,భువనగిరి: అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా గత 20 రోజుల నుండి నిమ్స్ దవాఖానలో డైరెక్టర్ డా.బీరప్ప పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డిని పరామర్శించి నిమ్స్ డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించారు. కొమ్మిడి నర్సింహారెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుండి రెండు దఫాలుగా 1978లో, 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
కర్ణాటక మంత్రి వర్గంలో కలకలం.. రంగంలోకి దిగిన డీకే
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే ఆయనకు షాక్ తగిలింది. నూతన మంత్రి వర్గంలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ చర్యలతో శివకుమార్కు ఆదిలోనే హంసపాదు తగిలినట్లయింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్... సీఎం కుర్చీ కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివరలో మెుదలైన ఈ రాజకీయ రగడ ఎట్టకేలకు శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో శాంతించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన క్యాబినెట్ విస్తరణలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో శివకూమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.ఈ అంశమై డీకేశివకుమార్ మాట్లాడుతూ.. "ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కేబినెట్లో మేమే అత్యంత సన్నిహిత మిత్రులం. ఈ సమస్యను పరిష్కరిస్తాం. రామలింగారెడ్డి నా సహచరుడు, మా సీనియర్ నాయకుడు. ఆయన గ్రామానికి వెళ్లి పని చేయలేనని చెప్పారు. నాకు వేరే మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. నేను రామలింగారెడ్డితో మాట్లాడి అంతా సరిచేస్తాను," అని డీకే చెప్పుకొచ్చారు.కాగా బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని వివరణ ఇచ్చారు. తాజాగా డీకే సీనియర్ నేతను బుజ్జగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం. -
డీకే కేబినెట్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విభజన ప్రక్రియ మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తన శాఖపై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను పదవులు ఆశించలేదు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్లో పదవులు కోరలేదు. నాకు బెంగళూరు డెవలప్మెంట్ శాఖ ఇస్తామని డీకేనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ బాంబు పేల్చారు. మంత్రివర్గంలో అసంతృప్తి..అయితే, అంతకుముందు శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్) శాఖను కృష్ణ బైరెగౌడకు కేటాయించడంపై మంత్రి రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖకు బదులుగా రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించడంతో ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివకుమార్, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడల మధ్య విధాన సౌధలో సుదీర్ఘంగా అత్యవసర చర్చలు జరిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. కాగా, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే శాఖల సర్దుబాటు వ్యవహారం బెంగళూరు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.🔴#BREAKING | Ramalinga Reddy unhappy with allocated portfolio, likely to resign from Karnataka cabinet: SourcesNDTV's @reethu_journo joins @reetksahni with more details pic.twitter.com/B2SRLdG7g5— NDTV (@ndtv) June 5, 2026మరోవైపు.. గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు ఆయనను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజీనామా చేసిన సందర్భాల్లో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా.. సీఎంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన కేబినెట్లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఇక రాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత జి. పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఈ కేబినెట్లో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా) బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ పోర్ట్ఫోలియోలను కూడా ఆయనే చూసుకోనున్నారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్మెంట్) శాఖను కేటాయించారు. -
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగీ, తమిళనాడు నుంచి ప్రవీన్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రవీన్ ఝా కు అవకాశం కల్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేనుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇండి కూటమిలో కలకలం.. మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది?
చెన్నై: ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో తాము పాల్గొనబోమని డీఎంకే గురువారం తెలిపింది. ముఖ్యంగా "కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం" కావడంతో హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని డీఎంకే తెలిపింది."తమిళనాడు శాసనసభ ఎన్నికల తర్వాత డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్ల మా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ.. జూన్ 8న న్యూఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాదు" అని పార్టీ తెలిపింది.అయితే ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే పేర్కొంది.డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, లోక్సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డీఎంకే అధికారికంగా కోరింది. దీంతో దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్కు దూరంగా నిలిచింది.మరోవైపు, పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఇండి కూటమి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. -
టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్కల్ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.ఓటు బ్యాంక్ మొత్తం..గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్కే పరిమితం. కానీ కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్లో గణనీయమైన భాగం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.అందుకే చేరికలకు విముఖత?టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.ఒడిశా మోడల్ ఇప్పుడు బెంగాల్లోనా?ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.అసలు పోరాటం ఇప్పుడే మొదలైందిప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
కన్నడ సమ్రాట్ డీకే శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో అధికార మార్పిడి సజావుగా పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ట్రబుల్ షూటర్, కింగ్ మేకర్ డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరులోని లోక్భవన్ గ్లాస్హౌజ్లో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు నూతన సీఎంగా డీకే శివకుమార్తో రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. హోంశాఖ మాజీ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కేబినెట్లో చోటు దక్కడంతో స్పీకర్ యూటీ ఖాదర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు అదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్ శ్రీ నిర్మలానందనాథ స్వామీజీతోపాటు పలువురు మఠాధిపతుల ఆశీస్సులను డీకే శివకుమార్ స్వీకరించారు. తొలి కేబినెట్ సమావేశం కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం డీకే శివకుమార్ విధానసౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బసవణ్ణ, మహాత్మ గాంధీతోపాటు పలువురు మహనీయుల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధానసౌధ ఆవరణలో ఉన్న మునేశ్వర దేవస్థానంలో పూజలు చేశారు. తర్వాత విధానసౌధ మెట్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉత్తరనంది ద్వారం గుండా విధానసౌధలోకి ప్రవేశించారు. అనంతరం నూతన మంత్రులతో మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన డీకే ప్రమాణ స్వీకారంలో డీకే శివకుమార్ సంప్రదాయ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. పట్టు పంచ, పట్టు జుబ్బా, శాలువా ధరించారు. భారత రాజ్యాంగాన్ని చేతబూని వీరగంగాధర అజ్జయ్య పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై అజ్జయ్య చిత్రపటానికి నమస్కరించారు. అంతకంటే ముందు తనకు సీఎంగా అవకాశం కల్పించిన కర్ణాటక ప్రజలకు వేదికపై సాష్టాంగ నమస్కారం చేశారు. సీఎం కార్యాలయానికి మార్పులు డీకే శివకుమార్ ప్రమాణం చేయటానికి ముందే విధానసౌధలోని కార్యాలయంలో వాస్తు ప్రకారం సీఎం సీటును అధికారులు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికమైన మార్పులు సైతం చేశారు. సీఎం ఆఫీసును ప్రఖ్యాత జ్యోతిషులు, వాస్తు నిపుణుల బృందం సూక్ష్మంగా పరిశీలించింది. డీకే శివకుమార్ కుర్చీ స్థానాన్ని వాస్తుకు అనుగుణంగా మార్పు చేశారు. సీఎం గదిలో డీకే శివకుమార్కు ఇష్టమైన నోణవినకెరె అజ్జయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. హాజరైన ప్రముఖులు ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేరళ సీఎం సతీశన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, బీకే హరిప్రసాద్, తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, మొహమ్మద్ అజారుద్దీన్ తదితరులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు తరలివచ్చారు. దేవెగౌడ, యడ్యూరప్పతో భేటీ డీకే శివకుమార్ బుధవారం ఉదయం విపక్ష నాయకులతో భేటీ కావడం ఆసక్తి రేపింది. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) పార్టీ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూప్పను కలుసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరిపాలన నిర్వహణలో వారి సలహాలు, సూచనలు కోరినట్లు డీకే తెలిపారు. అలాగే కనకపురలో నివసిస్తున్న తన తల్లి గౌరమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత డీకే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల పురోగతి, సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తారన్న నమ్మకం తమకు ఉందని భార్య ఉష, కుమార్తె ఐశ్వర్య పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడంలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిద్ధరామయ్య కుమారుడికి మంత్రి పదవిమాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కింది. కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జార్కిహొళి, కృష్ణ బైరేగౌడ, బైరతి సురేశ్, శరణ ప్రకాష్ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, ప్రియాంక్ ఖర్గే మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరందరూ గత కేబినెట్లో మంత్రులే. కొత్తగా యూటీ ఖాదర్, యతీంద్ర మంత్రులయ్యారు. సీఎం డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. అది పవిత్రమైన బాధ్యత ముఖ్యమంత్రి పదవి కేవలం రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే కాదని.. అది రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన ఒక పవిత్రమైన బాధ్యత అని తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు సీఎం డీకే శివకుమార్ చెప్పారు. మునుపెన్నడూ లేనంత కరుణామయమైన, సమానత్వంతో కూడిన, సుసంపన్నమైన కర్ణాటకను నిర్మించడానికి ప్రజలందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్ తరాలు గర్వపడేలా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఈ క్షణం కేవలం నాది మాత్రమే కాదు. కర్ణాటక ప్రజలది. నా ప్రయాణంలోని ప్రతి సవాలులో, ప్రతి మైలురాయిలో నాకు మార్గనిర్దేశం చేసిన లక్షలాది అంకితభావం గల కార్యకర్తలది కూడా. ఎన్నో ఒడిదుడుకులలో వారే నా బలం, నా స్ఫూర్తి. నన్ను నమ్మి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కోట్లాది కన్నడిగుల ఆశలు, ఆకాంక్షలు, కలలను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది. నా సీనియర్లకు, గురువులకు, మార్గనిర్దేశం చేసి, ప్రోత్సహించి, పట్టుదలతో ముందుకు సాగేందుకు బలాన్నిచ్చిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటా. కర్ణాటక ఎల్లప్పుడూ అవకాశాలు, ఆవిష్కరణలు, పురోగతికి ఒక కేంద్రస్థానంగా నిలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని లిఖించడంలో ప్రతి రైతు, కార్మికుడు, పారిశ్రామికవేత్త, మహిళ, విద్యార్థి, యువత కీలక పాత్ర పోషించాలి. మనం మరింత బలమైన, సుసంపన్నమైన, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించడానికి నూతన ఆలోచనలు, సాంకేతికత, సామూహిక శక్తిని ఉపయోగించుకోవాలి. ఏ ఒక్క నాయకుడూ ఒంటరిగా మార్పును తీసుకురాలేడు. ప్రజలందరూ ఒకే దృక్పథంతో, ఉమ్మడి లక్ష్యంతో ఏకమైనప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. మనం కలిసి నడిస్తే.. చేరుకోలేని లక్ష్యం గానీ, అధిగమించలేని సవాలు గానీ ఉండదు’’ అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. -
రేవంత్ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీశ్రావు చేసిన విమర్శల్లో తప్పేమీ లేదు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీపై తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాం. రేవంత్ సీఎం కాగానే తెలంగాణ తల్లి రూపం మార్చి, సెక్రటేరియట్ ముందు రాజీవ్గాంధీ విగ్రహం పెట్టాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ విగ్రహాలను గాందీభవన్కు పంపుతాం. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలపై రుద్దింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి తిరోగమనంలోకి నెడుతోంది. మోదీ– రేవంత్ భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. మోదీ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోంది. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం సాగుతోంది. మొదటి అర్ధభాగం ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ పాలనలో ట్రైలర్ కాదు, ఇంటర్వెల్ కూడా పూర్తయింది. మిగతా అర్ధభాగం మరింత అధ్వానంగా ఉంటుంది. ఆయన తెలంగాణను పాతాళంలోకి తొక్కుతున్నారు. మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీని రేవంత్ బొంద పెడతారు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రవికాంత్రెడ్డి వ్యవహరించగా.. ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.విజయ్కుమార్రెడ్డి, వరికుప్పల రమేష్ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే.. పదేళ్లలో సాధించిన ప్రగతి క్షీణించింది.. తెలంగాణ రైజింగ్ నినాదం పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్ జరుగుతోంది. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పురోగతి ప్రస్తుతం క్షీణించింది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు కాంగ్రెస్ హామీలతో మోసపోయారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఉచిత విద్యుత్ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్రెడ్డి సిద్ధాంతం. లేని అప్పులను ఉన్నదిగా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆర్బీఐ తన నివేదికతో చెంపదెబ్బ కొట్టింది. తెలంగాణాకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్ మాకు పొలిటికల్ గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 90కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి ఓడిపోతారు. దుమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ ఉప ఎన్నికలకు రావాలి. 2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నా. బీజేపీతో పొత్తు ఉంటుందన్నది పూర్తిగా ఊహాజనిత ప్రచారం. బీఆర్ఎస్కు కేసీఆర్ ట్రంప్ కార్డు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్. ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు. పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? తెలంగాణ ఖచ్ఛితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అనడంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. ఈ నేల.. పోరాటాలు, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిచింది. మీరు వచ్చి మీ కుటుంబాలతో ఉండండి. మీ భూములు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదం అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నాడు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయేందుకు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? మోదీ ఆర్థిక ప్రాంతీయ వాదం సరైనదేనా? ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తీసుకెళ్తున్నారు. జాతీయ వాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం, గుజరాత్కు ప్రధానమంత్రి మాదిరి వ్యహరిస్తున్న తీరు సరైనదేనా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. జనగణమన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. మాకు జాతీయ భావన, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్ కళ్యాణ్ను నటుడిగా అభిమానిస్తాం, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం. పవన్ వ్యాఖ్యల వెనుక రేవంత్ ఉన్నట్టు అనుమానం ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో 2018లో చంద్రబాబు టీడీపీ, 2023లో పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసింది. తెలంగాణలో కొత్తగా జనసేన పోటీ చేసేదేం ఉంది? తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇక్కడకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు వచ్చి ఇక్కడ సభ పెట్టి విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. మరొకాయన ంతల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. జనసేన సభకు అనుమతి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారనే అనుమానం వస్తోంది. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చట్టం చేయాలి ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే.. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తాం. రేవంత్రెడ్డి హయాంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని అన్ని కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లకే దక్కుతున్నాయి. సుంకిశాల నిర్మాణం కూలిన ఘటనలో కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టు చేయాలని జలమండలి కోరితే.. చేయలేని దమ్ములేని సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. సెక్షన్ 8ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర గతంలో కొంత జరిగింది. మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ నేతృత్వంలో మరో బలమైన ఉద్యమం వస్తుంది. -
‘‘ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నాం’’
హైదరాబాద్: తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుంటోందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి ముఖ్యమంత్రా? లేక బీజేపీ 'కోవర్ట్' మిత్రుడా? అని నిలదీస్తూ ట్వీట్ చేశారు.‘‘ఒకవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా బహిరంగంగానే రేవంత్ రెడ్డిని "ఛోటే భాయ్" (తమ్ముడు) అని సంబోధిస్తూ, “హమ్సే జుడ్ జావో" (మాతో కలిసిపోండి) అంటూ అప్యాయంగా ఆహ్వానిస్తారు. మరోవైపు, అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో కూర్చుని.. "రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా వాడుకుంటోంది" అంటూ ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చదువుతారు!అసలు ఇది మీ జాతీయ విధానమా? లేక రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్తో కలిసి మీరు ఆడుతున్న కుమ్మక్కు రాజకీయ నాటకమా (మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా)? పరస్పర విరుద్ధంగా పదే పదే మారుతున్న ఈ ప్రకటనలు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, బీజేపీ- తెలంగాణ కాంగ్రెస్ లోపాయికారీగా ఒకరితో ఒకరు చేతులు కలిపారనే నిజాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తున్నాయి.ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ వ్యూహానికి అద్దం పడుతోంది. బయట ప్రపంచానికి తాము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ, నాటకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం ఆయనను రేపు పొద్దున తమ వైపు తిప్పుకోబోయే ఒక సంభావ్య ఫిరాయింపుదారుడిగా (Turncoat), అస్సాంలో హిమంత బిస్వా శర్మ లేదా పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తరహా నాయకుడిగా బీజేపీ సిద్ధం చేస్తోంది.తెలంగాణ సమాజం, ఈ దేశ ప్రజలు బీజేపీని సూటిగా ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మీ దృష్టిలో జైలుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ముఖ్యమంత్రా? లేక మీ పార్టీలో చేరాల్సిందిగా మీరు బహిరంగంగా ఆహ్వానిస్తున్న (హమ్సే జుడ్ జావో) మీ 'కోవర్ట్ మిత్రుడా ' (Covert Friend)? దేశ ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు!’’ అని అన్నారు. -
డీకేకు సీఎం కిరీటం.. 2028 ఎన్నికలే లక్ష్యంగా మాస్టర్స్ట్రోక్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేలా చేసి, డీకే శివకుమార్కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సక్సెస్ఫుల్గా అధికార మార్పిడి చేసింది. అయితే, 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండనుంది? డీకే శివకుమార్కు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయి?కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్కు అత్యంత కీలక నాయకుడిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న తన ఎన్నో ఏళ్ల ఆకాంక్షను జూన్ 3న నెరవేర్చుకున్నారు.కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిద్ధరామయ్యది. ఆయన నుంచి బాధ్యతలను శివకుమార్కు అప్పగించడం ద్వారా కాంగ్రెస్.. కొత్త ముఖ్యమంత్రి అనుచరుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారాన్ని నడిపిన శివకుమారే ఈ పదవికి అర్హుడని ఆయన అనుచరులు భావించారు.రాజస్థాన్, పంజాబ్ పరిణామాలు ఇలా.. పైకి కనిపిస్తున్న దాని ప్రకారం.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2020లో రాజస్థాన్, 2021లో పంజాబ్లో జరిగిన పరిణామాల కంటే మెరుగ్గా నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పటికీ 2020లో అశోక్ గెహ్లాట్ను కొనసాగించారు. అంటే, సచిన్ పైలట్ సీఎం పదవి కోసం ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ను మార్చకుండా పదవిలోనే కొనసాగించింది. పంజాబ్లో 2021లో అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్జిత్ సింగ్ చన్నీని తీసుకొచ్చారు. అయితే ఆ మార్పులు అన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం ఇవ్వలేదు.కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ వంటి వొక్కలిగ (కర్ణాటకలోని ఒక ప్రముఖ సామాజిక వర్గం) నాయకుడిని ఎంపిక చేసింది. బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అన్ని వర్గాలను కలుపుకోవాలి.. జేడీఎస్ అగ్ర నాయకులు కూడా వొక్కలిగ వర్గానికే చెందినవారు. పాత మైసూరు ప్రాంతంలో ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు శివకుమార్ వారితో దశాబ్దాలుగా పోటీపడుతున్నారు. సాధారణంగా కర్ణాటకలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 35 ఏళ్ల ఈ రాజకీయ సంప్రదాయాన్ని కాంగ్రెస్, శివకుమార్ సరైన వ్యూహంతో ముందుకు సాగితే చెరిపివేసే అవకాశం ఉంది.రాజకీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న శివకుమార్ ఇప్పుడు 2028 ఎన్నికల్లో విజయానికి ప్రణాళిక రూపొందించాలి. పార్టీకి చెందిన అన్ని వర్గాలను కలుపుకుని నడవాలి. కీలక విధాన నిర్ణయాల సమయంలో సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.అనేక సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను అమలు చేసినప్పటికీ కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.19,500 కోట్లు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది అతి తక్కువ స్థాయి.ఇది కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, కర్ణాటక మొత్తం ఆదాయ వసూళ్లలో పెరుగుదల కేవలం 6.3% మాత్రమే నమోదైంది. ప్రాంతాల మధ్య స్పష్టంగా కనిపిస్తున్న అసమానతలను తగ్గించడం ప్రాధాన్యంగా ఉండాలి. 2024-25లో బెంగళూరు నగర జిల్లా కర్ణాటక జీఎస్డీపీకి దాదాపు 40% వాటా అందించింది. దక్షిణ కన్నడ, బెలగావి జిల్లాలు వరుసగా 5.3%, 3.9% వాటా అందించాయి.ప్రస్తుతం రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక వనరులు, అభివృద్ధి అవకాశాలు తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ముఖ్యమంత్రులు వెనుకబడిన వర్గాలపై ప్రభావం చూపుతున్న క్లిష్ట సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. శివకుమార్కు ఉన్న అనుభవం ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడవచ్చు. -
DK శివ కుమార్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్
-
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని లోక్ భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసినవారుడీకే శివకుమార్ జీ పరమేశ్వర్కె హెచ్ మునియప్పకె జే జార్జ్ఎం బీ పాటిల్రామలింగ రెడ్డిసతీశ్ జరకిహోళికృష్ణ బైరెగౌడప్రియాంక్ ఖర్గేయూటీ ఖాదర్ఈశ్వర్ ఖండ్రేయతీంద్ర సిద్ధరామయ్యబైరతి సురేశ్శరణ ప్రకాశ్ పాటిల్భద్రత కట్టుదిట్టంలోక్ భవన్లో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో డీకే శివకుమార్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. శివకుమార్ను అభినందిస్తూ నగరమంతా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న సిద్ధరామయ్యకు శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కాంగ్రెస్లో కీలక బాధ్యత లభించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కర్ణాటకలో దీర్ఘకాలంగా సాగిన పోరు తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2023 మేలో అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ సందేశండీకే శివకుమార్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. “అందరినీ కలుపుకుని ముందుకు సాగండి. మీరు కర్ణాటకకు విజయవంతంగా నాయకత్వం వహిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీ కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించండి” అని ఆమె చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖులు డీకే శివకుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. -
డీకే శివకుమార్ అనే నేను..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి.. -
ఎమ్మెల్సీ ఐదో సీటు ఎవరిది.. క్రాస్ ఓటింగ్?
శివాజీనగర: కర్ణాటక విధానసభ కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్లలోని అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో సీటు పొందాలంటే 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంది. 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ నుంచి నలుగురు సునాయాసంగా గెలుస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 135 కాగా, ఇంకా 23 ఓట్లు మిగిలి ఉంటాయి. దీంతో ఐదో సీటు మీద కూడా హస్తం నేతలు కన్నేశారు. సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టణ్ణయ్య కాంగ్రెస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఎస్.టీ.సోమశేఖర్, శివరామ్ హెబ్బార్కు కాంగ్రెస్తో సత్సంబంధాలున్నాయి. మరో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో ఐదో సీటును స్వాధీనం చేసుకోవచ్చని కేపీసీసీ నేతలు నిశ్చయించారు.క్రాస్ ఓటింగ్ జరిగేనా?బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 62 కాగా, 2 ఎమ్మెల్సీ సీట్లు పొందగలదు. ఇంకా 6 ఓట్లు మిగులుతాయి. జేడీఎస్ శిబిరంలో 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మద్దతు కోరుతోంది. ఈ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ జరుగుతుంది. అందుచేత క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా కనిపెట్టడం కష్టమని పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్లు క్రాస్ ఓటింగ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఐదో స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. మొత్తం 7 స్థానాలకు అంతేమంది నామినేషన్ వేస్తే పోలింగ్ జరగదు. ఎనిమిది మంది బరిలో నిలిస్తే పోలింగ్ యుద్ధం తప్పదు. -
యూత్ కాంగ్రెస్ నుంచి సీఎం పీఠం దాకా..
నాలుగు దశాబ్దాలపాటు పార్టీ పదవుల్లో క్రమంగా ఎదుగుతూ వచ్చిన డి.కె. శివకుమార్, యువ కాంగ్రెస్ నాయకుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరుకున్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. ఈ నేపథ్యంలో శివకుమార్ జీవితంలోని ప్రధాన ఘట్టాల సమాహారం ఇలా.. – సాక్షి సెంట్రల్ డెస్క్1962డొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ డొడ్డా అలహ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుత బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపుర సమీపంలో ఉంది. ఆయన ప్రభావవంతమైన వొక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారు.1980 తొలినాళ్లలో.. రేణుకాచార్య కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు.1983ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1985 మాజీ ప్రధాని దేవెగౌడపై కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో రెండు కుటుంబాల మధ్య దీర్ఘకాల రాజకీయ పోటీ ప్రారంభమైంది.198927 ఏళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ నిరాకరించడంతో సాతనూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1991 ముఖ్యమంత్రి బంగారప్ప ప్రభుత్వంలో జైళ్లు, హోంగార్డుల శాఖ జూనియర్ మంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు.1994 సాతనూర్ నుంచి రెండోసారి స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం. కృష్ణకు సన్నిహితుడిగా, ఆయన కుడిభుజంగా నిలిచారు.1999వరుసగా మూడో ఎన్నికల్లోనూ గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి హెచ్.డి. కుమారస్వామిని ఓడించారు. తొలుత సహకార శాఖ, ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2004 మరోసారి ఎన్నికల్లో గెలిచారు. జేడీఎస్– బీజేపీతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో చేరకుండా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగారు.2008నియోజకవర్గాల పునరి్వభజన వల్ల సాతనూరు నియోజకవర్గం కనుమరుగు కావడంతో కనకపుర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.2013 మళ్లీ గెలిచినప్పటికీ అవినీతి ఆరోపణల కారణంగా తొలుత సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించలేదు. కానీ ఆ తర్వాత హైకమాండ్ జోక్యంతో ఆయన్నుతీసుకోవడంతో మంత్రి అయ్యారు.2017ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడైన అహ్మద్ పటేల్ను తిరిగి రాజ్యసభకు పంపేందుకు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడటం ద్వారా పార్టీకి ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన వెంటనే ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి.2018ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జల వనరులు, వైద్యవిద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 మనీలాండరింగ్ ఆరోపణలపై 50 రోజులు జైలుపాలై.. బెయిల్పై విడుదలయ్యారు. ఆ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీ ఆయన్ను పరామర్శించారు. ప్రజలు తనకు రాజకీయ అధికారం కట్టబెట్టేదాకా గడ్డం తీయనంటూ శపథం చేశారు.2020కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తాను సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్నారు.2022 కోవిడ్ కాలంలో మేకేదాటు పాదయాత్ర ప్రారంభించారు. కావేరి జలాల అంశంపై దక్షిణ కర్ణాటకలో బలమైన ప్రజా మద్దతు కూడగట్టారు.2023కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. కానీ అంతర్గతంగా కుదిరిన అధికార పంపిణీ ఒప్పందం దృష్ట్యా అధిష్టానం ఓపిక పట్టాలని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. 2026 ముఖ్యమంత్రి కావాలనే కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. -
నేడే డీకే ప్రమాణ స్వీకారం
బెంగళూరు: డీకే శివకుమార్ బుధవారం కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లోక్భవన్లో సాయంత్రం 4.05 గంటలకు నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీకే శివకుమార్తోపాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత గత నెల 30న డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే.ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సూర్జేవాలా హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి పాలి త రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలను కూడా ఆహ్వానించారు. మంత్రివర్గం కూర్పుపై.... డీకే శివకుమార్, సిద్ధరామయ్య మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కేబినెట్ కూర్పుపై వారు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో వారిద్దరూ భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. తర్వాత వేణుగోపాల్, సూర్జేవాలాను సిద్ధరామయ్య, శివకుమార్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలన్న దానిపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.తన రాజకీయ ప్రస్థానానికి సోనియా గాంధీ కుటుంబం అందించిన సహకారానికి డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాత, కొత్త కలయికగా మంత్రివర్గం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీనియర్ నేతలు కేజే జార్జ్, రామలింగారెడ్డి, ఎంబీ పాటిల్, ఈశ్వర ఖండ్రె, జి.పరమేశ్వర్, సతీశ్ జార్కిహొళి, కేహెచ్ మునియప్ప, ఎస్ఎస్ మల్లికార్జున్, యూటీ ఖాదర్, హెచ్కే పాటిల్, హెచ్సీ మహదేవప్ప, శివానంద పాటిల్, భైరతి సురేశ్, చెలువరాయస్వామిల పేర్లు వినిపిస్తున్నా యి.ఒక్కరి కంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక దళిత నేతను తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టబోతున్నట్లు సమాచారం. జి.పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గేలో ఒకరికి ఈ పదవి దక్కేందుకు ఆస్కారం ఉంది. సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కొత్త స్పీకర్గా ఆర్వీ దేశపాండే, హెచ్కే పాటిల్ పేర్లు ప్రస్తావనకు వచ్చా యి. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని సతీశ్ జార్కిహొళికి ఇస్తామని ప్రతిపాదించగా, ఆయన మంత్రి పదవిని కోరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందు సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించడం విశేషం. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార మార్పిడికి వీలుగా సిద్ధరామయ్య ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. ‘కావేరి’లోనే సిద్ధరామయ్యసిద్ధరామయ్య బెంగళూరులోని సీఎం అధికారిక నివాసమైన ‘కావేరి’లోనే నివసించనున్నారు. నూతన సీఎం డీకేకు మరో ప్రభుత్వ నివాసాన్ని కేటాయించబోతున్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్య 2028 దాకా ‘కావేరి’లోనే ఉంటారు. డీకే శివకుమార్ కొన్నిరోజుల పాటు తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు సాగిస్తారు. తర్వాత ప్రభుత్వం కేటాయించే నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నాయకుడు ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉండడం ఇదే మొదటిసారి కాదు. 2021లో అప్పటి సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. అయినప్పటికీ ‘కావేరి’లోనే చాలారోజులు నివసించారు. -
కాంగ్రెస్ ఏటీఎంగా తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు..అమరవీరుల స్వప్నాలను సాకారం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన సొంత ఏటీఎంగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వికసిత్ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: నితిన్ నబీన్ ‘జై తెలంగాణ‘నినాదంతో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కాంగ్రెస్ అవినీతి పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఒక అవినీతి ప్రభుత్వం పోయిందనుకుంటే, ఇప్పుడు అంతకంటే ఘోరమైన మరో అవినీతి సర్కార్ కొలువు దీరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్కు కప్పంగా కడుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా నిలబడ్డారని, వాజ్పేయి హయాం నుంచే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతుగా ఉందన్నారు. తెలంగాణ వికాసం, సమృద్ధి కేవలం మోదీ నేతృత్వంలోని ‘వికసిత్ తెలంగాణ’తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది ఊసరవెల్లి రాజకీయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి, వెనుక నుంచి మిర్చి పౌడర్లు, పెప్పర్ స్ప్రేలు కొట్టించిన ఊసరవెళ్లి రాజకీయాల చరిత్ర కాంగ్రెస్దని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. వందలాది మంది అమాయకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. నాడు బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ‘బంగారు తెలంగాణ’పేరుతో కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకొని, తీవ్ర అవినీతితో దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు వచి్చన రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా దానికి మినహాయింపు ఏమీ కాదన్నారు. సహకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రగతి: రాంచందర్రావు తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు..అది అసంఖ్యాక త్యాగాల ఆత్మగౌరవ ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పేర్కొన్నారు. ‘వికసిత్ తెలంగాణ’–‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’లు పరస్పర స్నేహం, సంపూర్ణ సహకారంతో కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ‘వికసిత్ భారత్’స్వప్నం సాకారమవుతుందని, రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎమర్జెన్సీ మైండ్ సెట్ను బయటపెట్టుకుందని రాంచందర్రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులకు, అర్బన్ నక్సలైట్ల సభలకు అనుమతులిచ్చే ఈ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. సెంటిమెంట్ రాజకీయం సాగదు: ఎంపీ రఘునందన్రావు ఏపీకి వెళ్లి మాజీమంత్రి రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైందని ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయొచ్చు కానీ, పవన్ కల్యాణ్ వస్తే తప్పా? అని నిలదీశారు. ఉడత ఊపులకు బీజేపీ భయపడదని, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనేదే తమ నినాదమని స్పష్టం చేశారు. -
ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన పోరాటం అధికారం కోసం కాదు.. తెలంగాణ కోసం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసం.. తెలంగాణ తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతోంది. తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగిలించుకు పోతోంది. అందుకే మరోసారి ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. విష ప్రచారాలతో అధికారంలోకి కాంగ్రెస్ ‘గత ప్రభుత్వం పైనా, కేసీఆర్ పైనా చిల్లర ప్రచారాలు చేశారు. అబద్ధాలతో కూడిన విష ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 హామీలతో ప్రజలను మోసం చేసింది. దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు వచ్చింది. అడ్డదారిలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టింది. రైతుబంధు లేదు..ఎరువుల్లేవు ⇒ సంతోషంగా సాగిన తెలంగాణ వ్యవసాయం ఈ రోజు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుబంధు లేదు.. ఎరువులు ఇచ్చేవాళ్లు లేరు.. పండించిన పంట రెండు నెలలైనా కొనేవాళ్లు లేరు. ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు. నాలుగు సార్లు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారు. 70 లక్షల మంది రైతన్నలు బాధతో, ఆవేదనతో రేవంత్రెడ్డిని తిడుతున్నారు. గురువు గారికి నదీజలాల సమర్పణ ⇒ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. కేసీఆర్ను బద్నామ్ చేయాలనే పగతో ప్రాజెక్టులపై దాడి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ హక్కులుగా కాపాడాల్సింది పోయి గురువు గారికి సంతర్పణ చేసే పరిస్థితి తీసుకొచ్చారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి.. ⇒ ‘నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసింది. అశోక్నగర్లో యువతను కూర్చోబెట్టి ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టారు. రెండున్నరేళ్లలో కనీసం నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్గాం«దీకి ఇప్పుడు తెలంగాణకు రావడానికి మొహం చెల్లడం లేదా? దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్నగర్ చౌరస్తాకు పోలీసుల్లేకుండా రావాలి. క్షీణించిన శాంతి భద్రతలు తెలంగాణను మేం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చాం. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గనుల పేరుతో దోపిడీలు సాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయింది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో వినిపిస్తున్న నినాదం ఒక్కటే. అదే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కత్తులతో పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్
-
పర్మిషన్ ఇవ్వు లేకపోతే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా..
-
పవన్ ప్రెస్మీట్ రగడ.. తన్నుకున్న కాంగ్రెస్-జనసేన కేడర్!
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలితో తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ నుంచే ప్రెస్మీట్కు సిద్ధం కావడం.. ఈ అంశాల చుట్టే వివాదం నడుస్తోంది. అయితే.. జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో గన్పార్క్ వద్ద నివాళులర్పిస్తుండగా.. ఇరు పార్టీల నాయకులు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా, కాంగ్రెస్ నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరవైపులా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా.. పిడిగుద్దులు గుప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటికి సర్దుమణిగింది. ఇక పవన్ కల్యాణ్ తీరుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు అక్కడే రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు.తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదని, మనుగడ లేని పార్టీలు ఇక్కడ విజయవంతం కావడం కష్టమని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించరని విమర్శించారు.పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన వ్యాఖ్యలు, వాటిపై కాంగ్రెస్ ప్రతిస్పందనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులపై బూతులు
-
రెండు పడవలపై రేవంత్ ప్రయాణం!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.కాంగ్రెస్పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్కు ఎలా స్పూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు కదా! అంటే ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్ ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక హార్స్ పవర్కు ఏభై రూపాయలకే రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్కు ఏమి సంబంధం. వైఎస్సార్ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.బహుశా సోనియాగాంధీ ఆయన అంటే పడదు కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్కు ఉండగా, ఎన్టీఆర్ పేరును అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్లోకి వచ్చాక ఎన్టీఆర్ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన ఒక్కరే అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే, విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్తో పోల్చి రేవంత్ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.అలాగే కాంగ్రెస్ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్కు పడి ఉండవచ్చు. కాని భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే రేవంత్రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ సోమవారం తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకు పడింది. ‘మంత్రి ప్రధాన్’అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమని ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. రాజధర్మం పాటించి పదవికి రాజీనామా చేయడం మేలని సలహా ఇచ్చింది. ఎక్స్ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్రమేశ్ సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల సాయంతో స్కాన్ చేయాలని సీబీఎస్ఈ 2025 మే నెలలో జారీ చేసిన టెండర్ స్పష్టం చేసిందని, ఈ స్కాన్ల స్పష్టత 300 డీపీఐ వరకూ ఉండాలని కూడా నిర్దేశించిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. అయితే ఆగస్టులో ‘స్కానర్లు’అన్న నిబంధనను నిశ్శబ్ధంగా తొలగించారని, స్పష్టతను కూడా 200 డీపీఐకి తగ్గించారని రాహుల్ ఆరోపించారు. ఫలితంగా జవాబు పత్రాల నాణ్యత బాగా తగ్గిపోయిందని, చాలా పత్రాలు అస్పష్టంగా ఉండటంతోపాటు, కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని దీనివల్లే మార్కుల జారీలో గందరగోళం ఏర్పడిందని రాహుల్ గాంధీ ‘నిసర్గ’ఎథికల్ హ్యాకర్ పోస్టును షేర్ చేశారు. ‘‘ఇది కచ్చితంగా మోసమే. తప్పుడు మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థీ బాధితుడే’’అని స్పష్టం చేశారు. మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు సమయమున్న ప్రధానమంత్రి 18.5 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్షీట్లకు సంబంధించి మాత్రం నోరు మెదపలేకపోయారని విమర్శించారు. కోఎంప్ట్ పై చర్యలెందుకు లేవు: జైరామ్ రమేశ్ సీబీఎస్ఈ వివాదంలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తప్పు పట్టారు. ఎక్స్లో ఆయన ఒక పోస్టు పెడుతూ ఓఎస్ఎం సాఫ్ట్వేర్లో భద్రత లోపాలను వారాలపాటు నిరాకరించిన సీబీఎస్ఈ ఎట్టకేలకు అంగీకరించిందని, బహుశా ఈ విషయం ముందుగానే తెలియడం వల్లనే కోంఎప్ట్కు అనుగుణంగా నిబంధనలను మార్చి ఉంటారని విమర్శించారు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టు సంస్థలను బ్లాక్లిస్ట్ చేస్తామని 2025 ఆగస్టు టెండర్ నిబంధనలు స్పష్టం చేయగా సెపె్టంబర్ నెలలో సవరణల పేరుతో ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని రమేశ్ ఎత్తిచూపారు. కోఎంప్ట్ను రక్షించేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమిదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి ప్రధాన్ అసమర్థతకు, అహానికి నిలువెత్తు నిదర్శనం. తన రాజకీయ అజెండాను అన్ని రకాల బాధ్యతలకు అతీతంగా ముందుకు నడిపించాలని చూసే వ్యక్తి’’అని ఆరోపించారు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం కేంద్ర విద్యా శాఖ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా జైరామ్ రమేశ్ ఇంకో ఎక్స్ పోస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఇది (ప్రమాద ఘటన) కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థ పునాదులు ధ్వంసం: పవన్ ఖేరాపన్నెండేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా సోమవారం విమర్శించారు. ‘‘సీబీఎస్ఈ కాంప్రమైజ్ అయిపోయింది. యూజీసీ ధ్వంసమైపోయింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు కాషాయమైపోయాయి. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లను ఆర్ఎస్ఎస్ నియమిస్తోంది. విద్యార్థులు ఎవరైనా ప్రతిఘటిస్తే అణచివేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ యవత హక్కులు కాలరాస్తున్నారు. నిరుద్యోగం ప్రబలిపోయింది. శాస్త్రీయ దృక్పథం కొరవడింది.’’అని ఆయన మోదీ హయాంపై విమర్శలు వెల్లువెత్తించారు. భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు. పరీక్ష పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో ప్రధాని తన ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూంటే... పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రం రోజూ ఎంతో వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. ఓఎస్ఎంపై ఉపాధ్యాయులు, నిపుణులు సుమారు 36 ప్రధాన లోపాలను ఎత్తిచూపినా సీబీఎస్ఈ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. -
పనికిమాలిన వెధవ..తోడకలు తీస్తాం బిడ్డా.. పవన్ కళ్యాణ్ కు పొన్నం మాస్ వార్నింగ్
-
ప్లీజ్.. పూలు చల్లొద్దు!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జూన్ 3న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు చర్చల కోసం మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ పర్యటనకు ముందు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.ప్రమాణ స్వీకార వేడుకలను అతి హంగులుగా కాకుండా నియంత్రితంగా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు, తన అభిమానులకు సూచించారు. ముఖ్యంగా తనపై పలు జల్లొద్దని.. పూలమాలలతో, శాలువాలతో సత్కరించకుండా ఉండాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన శివకుమార్.. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే భారీ జనసందోహం, అతిగా జరిగే సంబరాలు తనకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని పేర్కొన్నారు. అందుకే కార్యకర్తలు పరిమితుల్లోనే వేడుకలు జరపాలని, దూరం నుంచే అభినందనలు తెలిపినా తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు.తన విజ్ఞప్తికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యేనని ఆయన వెల్లడించారు. తనకు పూలమాలలపై అలర్జీ ఉందని, అందువల్ల ఎవ్వరూ వాటిని తీసుకురావద్దని స్పష్టంగా చెప్పారు. “ప్లీజ్… నాకు పూలమాలలు వద్దు. నేను వాటిని స్వీకరించలేను” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ప్లాస్టిక్ పూలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన గుర్తు చేశారు. పూలతో పాటు శాలువాలు కూడా తేవొద్దంటూ ఆయన సూచించారు.అలాగని ఈ విజ్ఞప్తితో ఆయన కార్యకర్తల ఉత్సాహాన్ని తగ్గించలేదు. కాంగ్రెస్ విజయాన్ని సాధారణ కార్యకర్తల విజయం అని అభివర్ణిస్తూ, “ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నది నేను మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 1979–80లో విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తన రాజకీయ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దశలవారీగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ ఎదుగుదల సాధారణ కార్యకర్తల కష్టం, నిబద్ధతకు ప్రతిబింబమని తెలిపారు.మొత్తంగా చూస్తే, శివకుమార్ విజ్ఞప్తి సంబరాల మధ్య కూడా నియంత్రణ అవసరాన్ని సూచిస్తోంది. వ్యక్తిగత ఆరోగ్య కారణాలు, అలాగే అతిగా ఆర్భాటం వద్దన్న తన స్వభావం ఈ నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ వేడుకల్లో హంగు తగ్గించి సింపుల్గా నిర్వహించాలని ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. -
పాస్పోర్టుకు డబ్బులు లేక..
బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుబడిన డీకే శివకుమార్ సాధారణ స్థాయి నుంచి నేడు కాబోయే సీఎంగా మారారు. ఇప్పుడు ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి కావచ్చు. అయితే ఒకప్పుడు పాస్పోర్టు కోసం బంగారు గొలుసు కుదువ పెట్టారు. వివరాల్లోకెళ్తే.. 1989లో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ బెంగళూరుకు వచ్చినప్పుడు భారీ సభ జరిగింది. బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న డీకే శివకుమార్ పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఎయిర్పోర్టులో డీకేని రాజీవ్గాంధీ చూసి ఆరా తీశారు. ఆ తరువాత కొన్ని రోజులకే డీకేకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాస్పోర్టుకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పీఎంఓ ఆదేశించినట్లు తెలిపారు. అప్పుడు పాస్ పోర్టు కోసం డీకే వద్ద రూ.3 వేలు లేకపోవడంతో మెడలోని బంగారు గొలుసును తాకట్టు పెట్టి అవసరం తీర్చుకున్నాడు. విదేశాల్లో జరిగే యువజన ఉత్సవాలకు డీకేను రాజీవ్గాంధీ పంపించారు. -
డబ్బుల్లేవ్.. ఓపిక పట్టండి!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రతి నెలా అవుతున్న ఖర్చులకు ఖజానాకు వచ్చే రాబడులు సరిపోవడం లేదు. అనివార్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలను అమలు చేయలేకపోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా సామాజిక పింఛన్లు పెంచేందుకు ఎంత ప్రయత్నించినా నిధులు సమకూరడం లేదు. మీమీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం డబ్బులు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్నాళ్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తాం..’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆర్థిక పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులకు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే, ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ప్రజలపై పన్నులు వేయకుండా నెట్టుకొస్తున్నాం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి భట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ ఇస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన రాబడులు, చేసిన అప్పులు, కాంగ్రెస్ హయాంలో ఆదాయ, వ్యయాలను సంవత్సరాల వారీగా తెలియజేస్తున్నారు. ‘ప్రస్తుతం ప్రతి నెలా రూ.16–17 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంటే రూ.18–20వేల కోట్ల వరకు ఖర్చులవుతున్నాయి. ఆదాయం కంటే ప్రతి నెలా రూ.2,200 కోట్ల వరకు అధికంగా వ్యయమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాల అమలు అసాధ్యం. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై రూపాయి కూడా అదనంగా పన్ను వేయకుండా నెట్టుకొస్తున్నాం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాహనాలకు పన్నులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ఆదాయంతో సర్దుకుంటున్నాం. పాత పథకాలేవీ తీసేసే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల అమలుకు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ప్రతి నెలా నిధులిస్తున్నాం. పాత అప్పులే పీకల దాకా.. కొత్త అప్పులు తెచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాత అప్పులే పీకల వరకు ఉన్న నేపథ్యంలో తెచ్చిన దాని కంటే ఎక్కువగా అప్పులు కట్టాల్సి వస్తోంది. వీటికి తోడు అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు, పరిపాలనా వ్యయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల నిర్వహణ కోసం కష్టపడాల్సి వస్తోంది. ఏరోజుకారోజు సర్దుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మీమీ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల కోసం కొంచెం ఓపిక పట్టండి. పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి..’ అని భట్టి చెబుతున్నట్టు తెలిసింది. ఏం చేయొచ్చో చెప్పండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం కోరుతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న కరీంనగర్కు చెందిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తెలియజేయడం మంచిదే. మేం కూడా కొన్ని సలహాలిచ్చాం. పాత పథకాలేవీ తీసేయవద్దని చెబుతూనే కొంతమేరకు క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకతను వివరించాం. రైతు భరోసాను కుదించాలని, పింఛన్లు ప్రతి యేటా కొంత పెంచాలని, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా లాంటి పథకాలు ప్రజల్లో మంచి పేరు తెస్తాయని, అవసరమైతే నిరుపయోగమైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ఆదాయ వనరులు పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించాం. పార్టీ కార్యకర్తలు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని అడిగాం. మా నియోజకవర్గాల్లోని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రిజి్రస్టేషన్ల రేట్లు పెంచినా పర్వాలేదని చెప్పాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్ల కోసం వచ్చామనే భావన ప్రజల్లో కలిగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించాం..’ అని వెల్లడించారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం...సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు -
డీకే శివకుమార్కు సీఎం పీఠం.. ఒకే దెబ్బకు రెండు లక్ష్యాలు!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పునకు తెరలేచింది. కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న సీఎం పదవి రేసుకు ఇది ముగింపు పలికినట్లైంది. అయితే, ఈ పరిణామం సాధారణ సీఎం మార్పు కంటే చాలా పెద్ద రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీ ఫార్ములా అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి నుంచే ప్రభుత్వం సగకాలం తర్వాత సీఎం మార్పుపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, శివకుమార్ కాంగ్రెస్కు కర్ణాటకలో అత్యంత కీలకమైన నిర్వాహక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతున్న సమయంలో ఎమ్మెల్యేలను కాపాడటం నుంచి, 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ హైకమాండ్కు చాలా కాలంగా డీకే శివకుమార్ను సీఎం చేయాలనే ఒత్తిడి ఉండేది. 2023లో సిద్ధరామయ్యను సీఎం చేసినప్పుడు కూడా డీకే వర్గం అసంతృప్తిగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు నాయకత్వ మార్పు ద్వారా ఆ అసంతృప్తిని తగ్గించాలనే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల అనంతరం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సీఎల్పీ సమావేశంలో ఏమైంది?బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును కొత్త నాయకుడిగా ప్రతిపాదించారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సేవలను కొనియాడారు. మీ సేవలు కేవలం కర్ణాటకకే పరిమితం కావు అనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యను కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సిద్ధరామయ్యకు భవిష్యత్తులో జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఒకవైపు డీకే శివకుమార్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూనే, మరోవైపు సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలో వినియోగించాలనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సిద్ధరామయ్యకు ఏ పదవి రావచ్చు?కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో పెద్ద బాధ్యత.ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో జాతీయ పదవి.ఓబీసీ వర్గాల్లో పార్టీ బలోపేతానికి జాతీయ ప్రచార బాధ్యతలు ఇవ్వవచ్చు.2029 లోక్సభ ఎన్నికల వ్యూహరచనలో కీలక పాత్ర కల్పించవచ్చు.రాజ్యసభకు పంపించే అవకాశం. అయితే, ఈ అంశాలపై కాంగ్రెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.డీకే శివకుమార్ ముందున్న సవాళ్లు..ఇదిలా ఉండగా.. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కు పలు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి.కాంగ్రెస్ అంతర్గత వర్గపోరును సమతుల్యం చేయడం.సిద్ధరామయ్య అనుచరులను సంతృప్తిపరచడం.ఐదు గ్యారంటీ పథకాల అమలు కొనసాగించడం.2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడం.బీజేపీ, జేడీఎస్ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవడం. -
ఉచిత విద్యుత్ ఎత్తేయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్ఎస్ నా సవాల్ను స్వీకరించాలి. అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్సే. 2017, జూన్ 30న అజయ్మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా. మోదీకి కిషన్రెడ్డి చెప్పాలి కదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా? సోయి తప్పిన మాటలు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు? ప్రధానికి కనపడడం లేదా? గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్ఐఆర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం. మహిళా సమాఖ్యలతో గోదాములు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్ఏనే అబద్ధాల డీఎన్ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. హరీశ్.. ఓ బబుల్ షూటర్ అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్రావు బీఆర్ఎస్లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్రావు మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది? కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో నాది, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వడ్లు కొనంది ఎవరు?అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?. -
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
తమిళనాడు కాంగ్రెస్లో భారీ ట్విస్ట్..
సాక్షి, చైన్నె: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు కాంగ్రెస్(టీఎన్సీసీ)లో రచ్చకెక్కింది. ఎన్నికలలో సీట్ల కేటాయింపులో భారీ స్కాం జరిగినట్టుగా ఆమె కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కూటమితో సీట్ల పందేరం అన్నది పెద్ద వివాదం నడుమే జరిగింది. డీఎంకే అధికారం కోల్పోవడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పక్షాన కాంగ్రెస్ చేరింది. ఈ కేబినెట్లో రెండు మంత్రి పదవులు సైతం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్పై ఎంపీ జ్యోతిమణి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. ఆమె ఎక్స్ పేజీలో అన్ని వివరాలను ప్రకటించారు.కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం.. టికెట్ల కేటాయింపుపై అసలు విచారణ జరపకుండా, కేవలం ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే విచారించడానికి కమిటీని వేయడం అనేది తప్పు చేసిన వారిని కాపాడడానికి చేసిన ఏర్పాటు మాత్రమేనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆ కమిటీపై ఉన్న ఆరోపణలను కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాత్రమే విచారించగలదన్నారు.సర్వేల పేరిట భారీ అవినీతిఅసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వివరించారు. ముందే కొందరు అభ్యర్థులను ఖరారు చేసి, ఆ తర్వాత వారికి అనుకూలమైన నియోజకవర్గాలను కూటమి నుంచి అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సర్వేల పేరుతో పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని, గెలిచే అవకాశం ఉన్న నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. కొత్తవారికి, అసలు గెలుపు అవకాశాలు లేని చాలామందికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది పార్టీని వీడారని, ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? దేని ఆధారంగా ఇచ్చారు? తప్పు చేసిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు.పార్టీ సంస్కరణల కోసం పిలుపు ఈ దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి కాపాడాల్సిన చారిత్రక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఇలాంటి తప్పులు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, చాలాచోట్ల ఇది పార్టీ ఓటమికి కూడా కారణమవుతోందన్నారు. అయితే, విచారణ జరపడానికి బదులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు అభ్యర్థుల ఎంపికను తాను చాలా దగ్గర నుంచి చూశానని, ఇంత బహిరంగంగా తప్పులు జరగడం పార్టీ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అవుతుందని హెచ్చరించారు. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలంటే జిల్లా, ప్రాంతీయ స్థాయి నాయకుల, కార్యకర్తల గళానికి విలువ ఇవ్వాలని సూచించారు. పార్టీ పారదర్శకంగా పనిచేయాలని, అందువల్ల కాంగ్రెస్లో అంతర్గత ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే మొదలవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై జోతిమణి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం చర్చకు దారి తీసింది. -
పవన్ ప్యాకేజీ స్టార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జడ్చర్ల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత పవన్ కల్యాణ్కు లేదని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. నాగేశ్వర్ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ అని.. ఆయన గోటికి కూడా పవన్ సరిపోరని పేర్కొన్నారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఆయనతో ఉన్నారని, అదేవిధంగా అమిత్షా దగ్గరకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారేమో అన్నారు. పవర్ కోసం ఆయన ఏ పార్టీతోనా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి వస్తే తానే ఆయన ఇంటి ఎదుట నిలబడతానని, మొదట తనను అరెస్ట్ చేసిన తరువాతే ప్రొఫెసర్ను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతికి అంత బడ్జెట్ ఎందుకుని ప్రశ్నించారు. ఏపీ పాలకులంతా హైదరాబాద్లోనే ఉన్నారని, వారికి ఇక్కడే రాజధాని కోసం 5 వేల ఎకరాల భూమి కేటాయిస్తామని.. వారు ఇక్కడి నుంచే పాలన సాగించుకోవచ్చని సూచించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ తమకు నోటీసులు పంపిందని, తనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి సోమవారం విచారణకు హాజరవుతామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తన ఫోన్తో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను, తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. విచారణ అనంతరం సీఎలీ్పలో జరిగే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బాగోతాలను ఎండగడుతామన్నారు. -
బిగ్ ప్లాన్.. సిద్ధరామయ్య కొత్త మెలిక
సీఎంగా రాజీనామా చేసినా కానీ.. పార్టీపై పట్టు కోసం సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా సిద్ధరామయ్య చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో వరుసగా పార్టీ పెద్దలతో సుదీర్ఘ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా కోఆర్డినేషన్ కమిటీ వేయాలంటూ సిద్ధరామయ్య కొత్త మెలిక పెట్టారు.కేబినెట్లో తన వర్గానికి చెందిన 15 మంది ఉండేలా సిద్ధరామయ్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన మనుషులకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన కొడుక్కి వైద్య, విద్య వంటి ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలంటున్న సిద్ధరామయ్య.. కర్ణాటక కాంగ్రెస్లో తన ప్రాధాన్యం తగ్గకుండా రాజ్యసభకు వెళితే రాష్ట్రంలో తన పట్టుపోతుందని భయం పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉంటేనే అహిందా వర్గాలు.. పార్టీకి అండగా ఉంటాయని హైకమాండ్ను సిద్ధరామయ్య ఒప్పించారు.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆఫర్ వచ్చిందని.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.ఇదిలా ఉండగా, సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆది శ్రీనివాస్కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రోనాగేశ్వర్ ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చెయ్యి పవన్ కి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వార్నింగ్


