Congress Party
-
పరారీలో ఖేడా : హైదరాబాద్లో పవన్ ఇంటి వద్ద బారికేడ్లతో భద్రత
సాక్షి, హైదరాబాద్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికీ భూయాన్ శర్మపై ఆరోపణల కేసులో అస్సాం పోలీసులు ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న పవన్ ఖేరా, ఆయన భార్య నీలిమ ఇంటి బయట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమను అస్సాం పోలీసులు ఇంకా సంప్రదించలేదని నగర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అస్సాం పోలీసులు వచ్చి నోటీసు ఇస్తే తాము సహకరిస్తామని వారు తెలిపారు.మరోవైపు పవన్ ఖేడా ఆచూకీ కోసం తాము ఇంకా ప్రయత్నిస్తున్నామని అస్సాం పోలీసులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఖేడా నివాసంలో నిజాముద్దీన్ ఈస్ట్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి ఇంటికి అస్సాం పోలీసుల బృందం దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం, పోలీసులు "కొన్ని నేరారోపణ సాక్ష్యాలు" ఎలక్ట్రానిక్ పరికరాలతో వెనుదిరిగారు. హిమంత భార్యకు మూడు పాస్పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదని ఖేడా తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేడాపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు మంగళవారం ఢిల్లీలో పవన్ ఖేడా నివాసానికి చేరుకొని సోదాలు చేశారు.అయితే, ఆ సమయంలో ఇంట్లో పవన్ ఖేడా లేరని, ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని అస్సాం డీజీపీ దేబజిత్ నాథ్ చెప్పారు. ఎక్కడున్నా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖేడాపై నేరారోపణలకు దారితీసే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. అస్సాం పోలీసులు ఉదయం 11 గంటలకు పవన్ ఖేడా నివాసానికి చేరుకున్నారు. రెండు గంటల తర్వాత వెళ్లిపోయారు. ఈ సోదాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో హిమంత ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. హిమంత భార్యపై ఖేడా చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించారు. సీఎం భార్యపై ఈడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖేడాపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. హిమంత, ఆయన కుటుంబ తప్పిదాలను బయటపెడతామన్నారు.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!పరారైన ఖేడా: హిమంత తనపై, తన కుటుంబంపై ఆరోపణలకు ఆధారమైన పత్రాలను కాంగ్రెస్ సరిచూసుకోలేదని హిమంత ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. వృద్ధాప్యంతో ఆయన పిచి్చగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘మాపై ఆరోపణలు చేసిన పవన్ ఖేడా హైదరాబాద్ పారిపోయారు. ఆయన పాతాళంలో దాక్కున్నా పట్టుకోవడం తథ్యం’’ అని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, వాటిని కాంగ్రెస్ నాయకత్వం సమర్థించడం ఏమిటని సీఎం నిలదీశారు. ‘‘ఆరోపణల డాక్యుమెంట్లను ఖేడాకు రాహుల్ గాంధీ ఇచ్చి ఉంటారు. కనుక ఈ కేసులో రాహుల్ గాందీని చేర్చాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.ఇదీ సంగతి : సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత! -
కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తీరని విషాదం నెలకొంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తదితర ఉద్దండులతో కలిపి పనిచేసిన కాంగ్రెస్ కురువృద్ధురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ (94) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మోహ్సినా కిద్వాయ్ మరణవార్తను ఆమె బంధువు రజి ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ మీడియాకు వెల్లడించారు. ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నోయిడా సెక్టార్-40లోని స్వగృహం నుంచి అంతిమ యాత్రగా తీసుకెళ్లి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త ఖలీల్ ఆర్ కిద్వాయ్ గతంలో మృతి చెందారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో 1930, జనవరి 1న జన్మించిన మోహ్సినా.. దశాబ్దాల పాటు భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1977లో మీరట్ నుంచి లోక్సభకు ఎన్నికై పార్లమెంటరీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏడు, ఎనిమిదో లోక్సభలకు ఎన్నికైన ఆమె, 2004 నుంచి 2016 వరకు ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందించారు. అంతకుముందు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ పౌరసరఫరాలు, సాంఘిక సంక్షేమం, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు.పార్టీకి పెద్ద దిక్కుగా..1982లో తొలిసారిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోహ్సినా.. ఆ తర్వాత వైద్య ఆరోగ్య (1983–84), గ్రామీణాభివృద్ధి (1984), రవాణా (1986), పట్టణాభివృద్ధి (1986–89) తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో చురుకైన సభ్యురాలిగా వ్యవహరించారు. సోనియా గాంధీకి సైతం అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన ఆమె.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, కేరళ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
దేశంలో మరో కొత్త పార్టీ.. నవజ్యోత్ కౌర్ సిద్ధూ ప్రకటన
చండీగఢ్: కాంగ్రెస్ బహిష్కృత నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధూ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఎక్స్లో తెలిపారు. పంజాబ్ మాజీ మంత్రి, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యనే నవజ్యోత్ కౌర్ సిద్ధూ. ఆమె బీజేపీలో చేరవచ్చని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, భారతీయ రాష్ట్రవాది పార్టీ (బీఆర్పీ)ని స్థాపిస్తున్నట్లు ఓ ఫొటో ద్వారా వెల్లడించారు. పార్టీ పేరుతో ఉన్న ఫొటోతో పాటు ఆమె ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు.ఎంతోకాలంగా ఈ ప్రకటన చేయాలని ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఆలోచన కొంతకాలంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల పనితీరును సమీక్షించిన తర్వాత కొత్త ప్రత్యామ్నాయ పార్టీ అవసరమనిపించిందని తెలిపారు.తన కొత్త పార్టీ ప్రజాసేవ, న్యాయం, బాధ్యతల నిర్వహణపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలకు నిజంగా ఏం కావాలో దాన్ని తిరిగి అందించడం లక్ష్యమని, దేశంపై బాధ్యతా భావంతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఒకే లక్ష్యంతో శాంతి, న్యాయం కోసం అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కలిసి పనిచేయడానికి నమ్మకంతో చేరారని తెలిపారు.పంజాబ్ కోల్పోయిన కీర్తిపై దృష్టి పెడతా..పంజాబ్ కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురావడం, ప్రేమ, స్వేచ్ఛ, నిస్వార్థ సేవ వంటి విలువలపై ఆధారపడి రాష్ట్రాన్ని “సువర్ణ రాష్ట్రం”గా మార్చడమే లక్ష్యమని నవజ్యోత్ కౌర్ సిద్ధూ చెప్పారు. ప్రజలతో, ప్రజల కోసం అనే విధంగా ప్రభుత్వాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పాటు పౌరుల్లో ఆధ్యాత్మిక వికాసం వంటివి పెంపొందించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. ఉన్నత చైతన్యంతో పని చేయడం, సత్యం, ప్రేమ మార్గంలో నడవడం గురించి ఆమె చెప్పారు. గాయపడిన ప్రజల మనసులను నయం చేయడంపై ఈ ఉద్యమం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఆమె చేసిన ఈ ప్రకటనలో స్పష్టత అంతగా లేదు. పార్టీ నిర్మాణం, నాయకత్వం, అధికారికంగా పార్టీని ప్రారంభించేది ఎప్పుడు? వంటి కీలక వివరాలు ఇంకా వెల్లడించలేదు. -
కాంగ్రెస్ నోట పాక్ పాట
బార్పేట/హోజాయ్/దిబ్రూగఢ్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శల జడి కురిపించారు. ‘‘పాకిస్తాన్కు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తాజా ఘటనలే ఇందుకు సాక్ష్యం’’ అన్నారు. సోమవారం అస్సాంలోని బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్లలో మోదీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘2016 సర్జికల్ దాడులు మొదలు సిందూర్ దాకా మనం చేపట్టిన ప్రతి ఆపరేషన్లోనూ కాంగ్రెస్ పాక్కే వంతపాడుతోంది. పాక్ ఎజెండాకే విలువిస్తోంది. దశాబ్దాల తరబడి మాజీ సైనికులకు వన్ర్యాంక్–వన్ పెన్షన్ విధానం అమలు చేయకుండా కాంగ్రెస్ మాజీ సైనికులకు ద్రోహంచేసింది. మేం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లను నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమచేశాం. రాహుల్గాంధీ ప్రేమ దుకాణాలు తెరిచానని గొప్పగా చెప్పుకుంటారుకానీ వాస్తవానికి ఆయన అబద్ధాల దుకాణాలు, అవమానకర షాప్లు తెరిచారు. ప్రజల నుంచి బీజేపీ భూములు లాక్కుందని ఆరోపిస్తారుగానీ నేషనల్ హెరాల్డ్, రాజీవ్గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తదితరాల గుప్పిట్లో ఎంత భూమి ఉందో చెప్పరు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో గుంతలు పడ్డ రోడ్లపై వాహనాలు కూడా సరిగా నడపలేని దుస్థితి. మేం ఏకంగా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత పటిష్టంగా రోడ్లు నిర్మించాం’’అంటూ మొరాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రహదారిని ఉద్దేశించి మోదీ చెప్పారు.మోదీ మెచ్చిన స్ఫటిక కమలం ఇటీవల కేరళలోని తిరువళ్లలో ప్రచార సభలో మోదీ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీజీ కమెండోలను పిలిచారు. ‘‘స్ఫటిక కమలం ఆకృతిలోని పేపర్వెయిట్ను ఈ సభలో చూశా. అలాంటిది ఒకటి కావాలి. కుదిరితే తెప్పించండి’’ అని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన నిర్వాహకులు సభలో క్రిస్టిల్ కమలం ఎవరి వద్ద ఉందా అని ఆరా తీశారు. దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కున్నారు. తిరువళ్ల ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆ దుకాణానికి వెళ్లి రెండింటిని కొని ప్రజాపనుల శాఖ గెస్ట్హౌస్ వద్ద ఎస్పీజీ అధికారులకు అందజేశారు. అదే రాత్రి వాటిని ఢిల్లీకి పంపించారు. మోదీ మెచ్చిన ఆ పేపర్ వెయిట్ను ప్రాచీన ఫెంగ్ షుయీ విధానంలో తయారు చేశారు. దాంట్లో 16 పూల రేకులు ఒక ఆధారానికి అతికించి ఉన్నాయి. దాన్ని తిప్పితే అందమైన పూల రేకులన్నీ తిరుగుతాయి. -
‘ప్రాంతీయ’ వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ‘ఐక్య’మంత్రం 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్ గొగోయ్ సారథ్యంలోని రైజోర్ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్జ్యోతి గొగోయ్ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్ నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓట్ల బదిలీపైనే ఆశలు ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ‘హిమంత’కోట పదిలమేనా? గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు. -
రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్గుల్లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. భూములను కొల్లగొట్టేందుకే‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్ 11 తీసుకొచ్చి మార్కెట్ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్ 216 ద్వారా మార్కెట్ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్ యార్డ్కు డీపీఆర్ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. ‘దిల్’భూములను మార్కెట్కెలా కేటాయిస్తారు?ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్ భూములను మార్కెట్కు ఎలా కేటాయిస్తారు? రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. ఇప్పటికే లీలా హోటల్ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్రావు స్పష్టం చేశారు. -
2034 వరకు మా సర్కారే: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా? ‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్లో, నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుకు శంకుస్థాపన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ ‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు. పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం ‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎస్హెచ్జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బంద్.. గజ్వేల్లో ఉద్రిక్తత..
గజ్వేల్ బంద్ అప్డేట్స్..గజ్వేల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.కాగా, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేడు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఇక, రెండ్రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాము సీఎం ఫోటో పెట్టడానికే వెళ్ళాం.. దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకుల వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సునేత్ర పవార్కు కాంగ్రెస్ ఝలక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సునేత్ర పవార్ విజ్ఞప్తిని కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. దీంతో, ఉన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. అనంతరం, బారామతి నుంచి సునేత్ర.. ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆమె చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ను కలిశారు. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయం తీసుకుంది.ఇక, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునేత్ర పవార్పై కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు, ఆమె ఉద్ధవ్ థాక్రేను కూడా సంప్రదించారు. అయితే, ఇప్పటికీ శివసేన యూబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆమె బీజేపీతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా.. నేడు సునేత్ర పవార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ మరణంతో సునేత్ర పవార్కు సింపతీ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని పోటీలో నిలుపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వివాదరహితుడు
వి.వైతిలింగం... పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో వివాద రహితుడు. నిష్కళంక నాయకుడు. పార్టీ అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్థుడు. ఎంతటి రాజకీయ గందరగోళంలో అయినా.. నిబ్బరంగా, సౌమ్యంగా ఉండటం ఆయన విలక్షణ శైలి. సరళంగా, సూటిగా మాట్లాడటంలో ఆయనకు ఆయనేసాటి. ఒకప్పుడు సహచరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో తట్టంచవాడి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. సుస్థిర పాలన... వైతిలింగం తండ్రి వి.వెంకటసుభ రెడ్డియార్ పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన స్ఫూర్తితో 1971లో యూత్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల వయసులో నెట్టపాక్కం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. 1996 నుంచి 2001 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయసు్కలలో ఒకరు. తాను ముఖ్యమంత్రికాగానే బడ్జెట్ లోటుపై దృష్టి సారించారు. ఆర్థిక వృద్ధి తోడ్పాటుకోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. పొత్తుల విషయంలో పార్టీ హైకమాండ్తో విభేదాల కారణంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో, 2008లో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పుదుచ్చేరి శాసనసభకు ఎనిమిది సార్లు ఎన్నికైన సీనియర్ నేత. తాను అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు స్థిరమైన పాలనను అందించిన నాయకుడు. అసెంబ్లీ నుంచి లోక్సభకు... 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. 2016 జూన్లో అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో మరోసారి పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అధికార కూటమిపై ప్రతిపక్షం విజయం సాధించడం పుదుచ్చేరి లోక్సభ చరిత్రలో అదే మొదటిసారి. 2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని, పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ ఓటమితో కేడర్లో నైతిక స్థైర్యం తగ్గడం, వర్గపోరాటాల నేపథ్యంలో, 75 ఏళ్ల వైతిలింగం జూన్ 2023లో పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి... పార్టీని చక్కబెట్టే పనిలో పడ్డారు. పుదుచ్చేరి ఏకైక లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను ఈసారి అనూహ్యంగా బరిలోకి దిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిపై తట్టంచవాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ... 1950లో అక్టోబర్ 5న తమిళనాడులోని కడలూరులో జన్మించారు. పుదుచ్చేరిలోని మదుక్కరైలో పెరిగారు. అక్కడ పాఠశాల విద్య పూర్తి చేశాక, చెన్నైలోని లయోలా కళాశాలలో చేరారు. మదుక్కరైలో కుటుంబ వ్యవసాయం మధ్య పెరిగిన ఆయనకు చిన్న వయస్సు నుండే వ్యవసాయ పనులంటే ఆసక్తి. తన మాధ్యమిక విద్యను పూర్తిచేసి వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆ తరువాత డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. పుదుచ్చేరికి వైద్య సేవల సంచాలకుడిగా విశేష సేవలు అందించిన డాక్టర్ సాంబశివం కుమార్తె అయిన శశికళను 1969లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో వైతిలింగంతోపాటు సహ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్ఎల్పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్గుల్కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
అస్సాం సీఎం హిమంత భార్యకు మూడు పాస్పోర్టులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ మూడు దేశాల పాస్పోర్టులు కలిగి ఉన్నారని, దుబాయ్లో ఆమె పేరిట ఆస్తులు, అమెరికాలో కంపెనీ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ఆదివారం మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ఆమెకు దుబాయ్, అంటిగ్వా బార్బుడా, ఈజిప్టు పాస్పోర్టులున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారా? అంటూ ఖేరా ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపారు. సీఎం శర్మ భార్య పేరుతో అమెరికాలో ఓ కంపెనీ ఉందని చెప్పారు. ఈ వివరాలను దాచినందుకు గాను ఎన్నికల కమిషన్ సీఎం శర్మ నామినేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. వచ్చే 48 గంటల్లోగా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖేరా చూపుతున్న పత్రాల్లోని వివరాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి నిస్పృహతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం శర్మ ఆరోపించారు. -
గుజరాతీలు నిరక్షరాస్యులు!
ఇడుక్కి/న్యూఢిల్లీ: గుజరాతీలు నిరక్షరాస్యులంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆదివారం ఆయన కేరళలోని ఇడుక్కిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘గుజరాత్ ప్రజలు నిరక్షరాస్యులైనందున ప్రధాని మోదీ వారిని నమ్మించి మోసగించారు. కానీ కేరళ ప్రజలు ఎంతో తెలివైనవారు. అక్షరాస్యులు. వారిని మోదీ, కేరళ సీఎం విజయన్ ఏమాత్రం మోసం చేయలేరు’’ అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులను ఆయన అవమానిస్తున్నారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్కు ఓట్లేయడం లేదనే అక్కసుతోనే గుజరాత్, యూపీవాసులను ఖర్గే అవమానిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ నేతలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సమర్థిస్తారా అని ప్రశ్నించింది. విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్) నిబంధనలు మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దీన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్జీవోలు, పౌర సంఘాలపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్సీఆర్ఏ సవరణలతో బీజేపీ, మోదీ నిజంస్వరూపం బట్టబయలైందన్నారు. ‘‘సీఎం విజయన్ స్వతంత్రుడు కారు. మోదీ చెప్పినట్లే నడుచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
గజ్వేల్లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి
-
కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
-
బీఆర్ఎస్దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది.రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. -
20 గుంటల భూమిలో 8 స్తంభాలు.. నాగలి ఎలా తిరుగుతుంది?
జగిత్యాల జిల్లా: మల్లాపూర్కు చెందిన వృద్ధురాలు ముష్కరి గంగామణి గ్రామసభలో నా 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 8 విద్యుత్ స్తంభాలు వేసిండ్రు అంటూ తన ఆవేదనను వెల్లడిస్తూ ట్రాన్స్కో ఏఈ వినీత్రెడ్డిని వేడుకుంటున్న కథనం శుక్రవారం ‘సాక్షి’లో ‘‘కాల్మొక్త సారూ.. కనికరించండి’ శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ట్విట్ చేశారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి గారూ.. ఈ సమస్యకు పరిష్కారం చూపండి అంటూ 20 గుంటల భూమిలో ఇష్టరీతిన స్తంభాలు వేస్తే సాగుకి నాగలి ఎట్టా తిరుగుతది? పంట ఎట్ల పండుతది? అంటూ డిప్యూటీ సీఎం బట్టితో పాటు మాజీ మంత్రి కేటీఆర్కు, సీఎంవో కార్యలయానికి పోస్టు చేశారు. https://t.co/DVI3Vih9iy pic.twitter.com/RxNNnb7QLj— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) April 4, 2026 -
ఇరాన్ ఎఫెక్ట్.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్?
ఇరాన్ యుద్ధం కాస్తా కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా, పెట్రోల్ అంశాల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయాలతో సీనియర్ లీడర్లు విభేదించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని విభేదిస్తూ మోదీ ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అనంతర పరిస్థితులపై మోదీ ప్రభుత్వ దౌత్య వైఖరిని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే విమర్శించారు. మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం రాజీ పడుతోందని ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమనీ మృతి విషయంలో కూడా భారత వైఖరిని రాహుల్ తప్పు పట్టారు. ఖమేనీ హత్యను ఖండించాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. అలాగే, గ్యాస్, పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని బహిరంగంగానే రాహుల్ మాట్లాడారు.అయితే, రాహుల్ వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు పరోక్షంగా తప్పు పడుతున్నారు. రాహుల్కు మద్దతు ఇవ్వకుండా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ విషయంలో భారత విదేశాంగ శాఖ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్నాథ్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మనీష్ తివారీ వంటి నేతులు బీజేపీ సర్కార్కు మద్దతుగా మాట్లాడారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రభుత్వ విధానాన్ని బాధ్యతాయుతమైన రాజనీతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ప్రభుత్వం సరైన పనే చేస్తున్నట్లుందని అని అన్నారు. మరోనేత ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని భారతదేశం దౌత్యపరంగా నిర్వహించిన తీరును ఆయన... పరిణతి చెందినది మరియు నైపుణ్యంతో కూడినది అని ప్రశంసించారు. కమల్నాథ్ స్పందిస్తూ.. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏమీ లేదన్నారు. కొరత ఉందన్న వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ అంతర్గత కలహాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. ఈ సందర్బంగా.. "రాహుల్ గాంధీ ఒక అవకాశవాది.. దేశద్రోహి అని కాంగ్రెస్ నాయకులకు తెలుసు!" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కేంద్రం చర్యలను రాహుల్ గాంధీ తప్పుపడితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కేంద్రాన్ని ప్రశంసించారు. నాడు శశిథరూర్ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
మూడేళ్ల జైలు శిక్ష పడినందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు. 1998–2011 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన రాజేంద్ర భారతి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరిట బ్యాంక్ రికార్డులను ఫోర్జరీ చేసి వడ్డీ రూపంలో రూ.18.5 లక్షలు కాజేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో గురువారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం తెల్సిందే. ఈ నేరంలో పాలుపంచుకున్న బ్యాంకు క్యాషియర్ రఘువీర్కు కూడా రూ.లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి రాష్ట్ర విధాన సభ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దాటియా ఎమ్మెల్యే భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో గతేడాది అక్టోబర్లో ఈ కేసును మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం అర్ధరాత్రి హడావుడిగా అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై రాజేంద్ర భారతి విజయం సాధించడం గమనార్హం. -
ఆరు గ్యారంటీలేవీ?
నారాయణపేట: ‘ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతున్నాయి. పిల్లలు పుడితే గానీ కల్యాణలక్ష్మి రావడం లేదు. ‘పాలమూరు బిడ్డలను మోసం చేసి గద్దెనెక్కావు. నీ సొంత నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేపట్టావా.. కొడంగల్కు రా చర్చించుకుందాం’అంటూ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకా మసంద్ బావాజీని శుక్రవారం ఆయన దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎక్కామెడ్ శివారులో మీడియాతో మాట్లాడారు.రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తే ఇచ్చింది 16 వేల ఉద్యోగాలేనని చెప్పారన్నారు. ఇప్పటికే రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టావని, వడ్లకు బోనస్ రెండుసార్లు ఇవ్వలేదని.. కూట్లో రాయి తీయనోడు.. ఏట్లే రాళ్లు తీశాడంటా అన్నట్టుంది నీ పరిస్థితి అంటూ రేవంత్రెడ్డిపై సెటైర్లు వేశారు. ‘మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మళ్లీ కేరళలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. రేవంత్.. నీది ఐరన్ లెగ్ అక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం’అంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు చేపడితే, మిగిలిన 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు కావొస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. మూడవ ఫేజ్లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకంలోని కాల్వలను తవి్వతే కొడంగల్కు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.90 శాతం పనులు పూర్తి చేసిన పాలమూరును పక్కనపెట్టి కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అందాల పోటీలు, ఫుట్బాల్ షో అంటూ వేల కోట్లు ఖర్చు చేశావు గానీ.. లంబాడ సోదరులకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పాల్గొన్నారు. -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
అమరావతి కాదు.. కమ్మరావతి ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
-
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు. -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు -
అస్సాంలో మూడోసారి.. మేమే!
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదార్ల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధెమా జీ జిల్లాలోని గోగాముఖ్, బిశ్వనాథ్ జిల్లాలోని బెహాలీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మెజార్టీ ప్రజల ను మైనార్టిలుగా మార్చేసి, చొరబాటుదార్లను శాశ్వతంగా ఓటుబ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదార్ల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయతి్నంచిందని గుర్తుచేశారు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీయే అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదార్లను కాపాడుతామంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసినట్టుగానే నేడు కాంగ్రెస్ సైతం సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.భ్రష్టాచార్ కీ జనని కాంగ్రెస్ ‘‘ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్కా సాత్, సబ్కా వికాస్ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలి. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాదే. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)కి వందోసారి కూడా ఓటమి తప్పదు. యువతకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాం. అస్సాంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని ఉపయోగించుకోలేదు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక్కడి వనరుతోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం. అది అవినీతికి తల్లిలాంటిది(భ్రష్టాచార్ కీ జనని). అస్సాం ఆత్మగౌరవాన్ని, భద్రతను కాపాడే విషయంలో రాజీపడింది’’ అని మోదీ ధ్వజమెత్తారు.ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం ‘‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తాం. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణలు కల్పిస్తాం. అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుతాం. రాష్ట్రంలో పదేళ్ల బీజేపీ పాలన సేవ, సుశాసన్కు బాటలు వేసింది. తేయాకు సాగుకు ప్రసిద్ధి పొందిన అస్సాం నేడు సెమీకండక్టర్ల తయారీ హబ్గా మారడం సంతోషంగా ఉంది’’అని మోదీ ఉద్ఘాటించారు. తేయాకు తోటలో కార్మికుడిగా మోదీ అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్ను ప్రధాని మోదీ సందర్శించారు. 19 మంది మహిళా కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. స్వయంగా తోటలోకి దిగి తేయాకు తెంపి, సంప్రదాయ బుట్టలోకి సేకరించారు. తేయాకు తోటలో పనిచేయడం మర్చిపోలేని అనుభవమని మోదీ పేర్కొన్నారు. తన జీవితం ఛాయ్తో ముడిపడి ఉందన్నారు. టీ చెట్ల నుంచి తేయాకు ఎలా తెంచాలన్నది మహిళలను చూసి నేర్చుకున్నానని తెలిపారు. మహిళలతో మాట్లాడారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. అలాగే వంటల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళను తన గురువుగా మోదీ అభివరి్ణంచారు. మరో మహిళ పాట పాడి వినిపించారు. తేయాకు అస్సాం అత్మ అంటూ మోదీ ఎక్స్లో పోస్టుచేశారు. ఇక్కడ సాగవుతున్న టీ ప్రపంచమంతటా సరఫరా అవుతోందని వివరించారు. టీ కార్మికుల శ్రమ, పట్టుదల అస్సాంకు గర్వకారణమని స్పష్టంచేశారు. -
‘యువరాజు’ సెంచరీ: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
గోగాముఖ్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ‘ఈ ఎన్నికలు కేవలం విజయం కోసం కాదు వికసిత భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రజా తీర్పు’ అంటూ గోగాముఖ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసి, ఘనమైన ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలుప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు ఆ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం సాధిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటములలో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా, వారి ‘యువరాజు’ ఓటముల్లో సెంచరీని పూర్తి చేసుకోబోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత జరిగిన తన మొదటి సభకు భారీగా తరలివచ్చిన జనసందోహమే ఎన్డీఏ విజయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. Assam has seen rapid development over the past decade. The people are ready to reaffirm their faith in the BJP-NDA. Watch from Gogamukh.https://t.co/UN20VAYJoS— Narendra Modi (@narendramodi) April 1, 2026మేనిఫెస్టోలో వరాల జల్లుఅస్సాం అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక హామీలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. 15 లక్షల కుటుంబాలకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా ఇప్పటికే మూడు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారని, రానున్న కాలంలో ఈ సంఖ్యను 40 లక్షలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘అరుణోదయ’ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.ఏప్రిల్ 9న పోలింగ్అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. గత పదేళ్ల అభివృద్ధి మళ్లీ తమను అధికారంలోకి కూర్చోబెడుతుందని బీజేపీ భావిస్తుండగా, అధికారపక్షాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మోదీ పర్యటనతో అస్సాం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇది కూడా చదవండి: Iran war : మృత్యు నీడలో భారత మత్స్యకారులు -
బీజేపీ మేనిఫెస్టో.. 3,000 పెన్షన్, ఉచిత సిలిండర్!
తిరువనంతపురం: కేరళలో అధికారమే లక్ష్యంగా యూడీఎఫ్, ఎల్డీఎఫ్లతో పాటు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది.కేరళలో అధికారంలోకి వస్తే నిరుపేద మహిళలు, వితంతువులు, 70 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. పేద కుటుంబాలకు ఏటా రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు పలు వరాలు గుప్పించింది. రాష్ట్రానికి ఎయిమ్స్, ప్రార్థనా స్థలాల పరిరక్షణకు చట్టం తదితర హామీలు ఇచ్చింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఎన్డీఏ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హామీలు ఇవే..నిరుపేద కుటుంబాల్లో ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.3,000 పెన్షన్వితంతువులకు, 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులకు కూడా నెలకు రూ.3,000 పెన్షన్ఓనం, క్రిస్మస్ పండుగలకు ఒక్కోటి చొప్పున నిరుపేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్మెడికల్, కిరాణా దుకాణాల్లో నెలకు రూ.2,500 మేరకు కొనుగోళ్లకు వీలుగా ప్రతి పేద మహిళకూ భక్ష్య, ఆరోగ్య సురక్ష కార్డు. -
‘జుబీన్’ చుట్టూ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి ప్రధానాంశంగా మారుతోంది. దీనిపై పారీ్టల పరస్పర ఆరోపణలు, దూషణలతో వాతావరణం వేడెక్కింది. ఈ అంశానికి కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోనే చోటిచి్చంది! తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా గార్గ్ మృతిపై నిజాలు వెలికితీసి న్యాయం చేస్తామని హామీ ఇచి్చంది. అస్సాంలో గార్గ్కు లక్షల్లో అభిమానులున్నారు. దాంతో వారి ఓట్ల కోసం పార్టీలన్నీ యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ దుమారం 52 ఏళ్ల జుబీన్ గార్గ్ 2025 సెపె్టంబర్ 19న సింగపూర్లో ఒక ద్వీపం వద్ద ఈత కొడుతూ మరణించారు. అది కాస్తా రాజకీయంగా వివాదాంశంగా మారింది. గార్గ్ను కుట్రలో భాగంగా హత్య చేశారని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. అది ప్రమాద మరణమేనని సింగపూర్ కోర్టు నిర్ధారించినా, ఆయనకు బలవంతంగా మద్యం తాగించారని హిమంత వాదించారు. దీనిపై విచారణకు సిట్ కూడా ఏర్పాటు చేశారు. గార్గ్ మేనేజర్, ఈవెంట్ నిర్వాహకుడు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు సహా ఏడుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఉదంతాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకునేందుకు పారీ్టలన్నీ ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన హామీలలో గార్గ్ కేసుకూ స్థానం కలి్పంచింది! గార్గ్ హత్య ఎలా జరిగింది, బాధ్యులెవరన్నది తాము అధికారంలోకి వచి్చన 100 రోజుల్లో వెలికి తీసి నిజానిజాలను ప్రజల ముందుంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గార్గ్ కుటుంబానికి న్యాయం చేయలేకపోతే బీజేపీకి ఓటేయొద్దని హిమంత పలుమార్లు ప్రకటించడాన్ని పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఎన్నికల ర్యాలీల్లో పదేపదే గుర్తు చేస్తున్నారు. విచారణలో విపరీత జాప్యం జరుగుతోందంటూ గార్గ్ భార్య గరిమ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గార్గ్ మృతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలవనుంది. స్మారకం చుట్టూ నేతల చక్కర్లు గువాహటి సమీపంలో నిర్మిస్తున్న గార్గ్ స్మారక కేంద్రం వద్ద నేతలు బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర, జాతీయ నాయకులు నిత్యం పోటెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ వాద్రా మొదలుకుని ఆ పారీ్టకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాకా ఈ జాబితాలో ఉండటం విశేషం! ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల రాక మరింత పెరిగింది. రాజకీయాలను ఆజన్మాంతం ద్వేషించిన జుబీన్ పేరు ఇప్పుడు రాజకీయంగా మారుమోగుతుండటం విచిత్రంగా ఉందంటూ ప్రజలు విస్తుపోతున్నారు! -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
కాంగ్రెస్.. రాజకీయ రాబందు
థరాడ్/గాందీనగర్: కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందులా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి పశ్చిమాసియా పరిణామాలను వాడుకుంటోందని మండిపడ్డారు. ఆ ఉద్రిక్తతలు మనపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. మంగళవారం గుజరాత్లోని వావ్ థరాడ్ జిల్లా నానీ గ్రామంలో మోదీ పర్యటించారు.రూ.19,806 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఖేడ్బ్రహ్మ–హిమ్మత్నగర్–అసర్వా రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చింన్న రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితులు అదుపు తప్పితే దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి కాంగ్రెస్ కాచుకొని ఉంది’’ అని దుయ్యబట్టారు. ఇంధన భారం పడకుండా చర్యలుపలు దేశాలు యుద్ధం, అశాంతి, అస్థిరతలో కూరుకుని ఉంటే భారత్ మాత్రం సుస్థిరత, ఐక్యతను ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పశి్చమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం కొరత పెరిగిందని గుర్తుచేశారు. ఇంతటి సంక్షోభంలోనూ మన బలమైన విదేశాంగ విధానం, పౌరుల సమష్టి కృషితో ప్రతికూల పరిస్థితిని విజయవంతంగా నియంత్రిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచమంతటా ఇంధనం ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయన్నారు. ఈ భారం మన ప్రజలపై పడకుండా చర్యల చేపటినట్లు వెల్లడించారు. శాంతి, అహింస సందేశం ప్రపంచ అస్థిరత, అశాంతి మంటల్లో చిక్కుకున్న నేటి తరుణంలో సామ్రాట్ సంప్రాతి మ్యూజియం శాంతి, అహింస సందేశాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ సమీపంలో శ్రీమహావీర్ జైన్ ఆరాధన కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మ్యూజియం వారసత్వం, సందేశం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. విశ్వసనీయ సరఫరాదారు భారత్ గుజరాత్లోని సనంద్లో కేనెస్ సెమీకాన్ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను మోదీ ప్రారంభించారు. సెమీకండక్టర్లలో మనదేశం విశ్వసనీయ సరఫరాదారుగా మారిందని చెప్పారు. ‘‘21వ శతాబ్దం పలు సవాళ్లు తెచి్చంది. సంఘర్షణల వల్ల ప్రపంచ సప్లై చైన్లు ప్రభావితమయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత, ఇంధన భద్రతకు మా ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది’’ అని వివరించారు. -
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..
-
CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను
-
కాంగ్రెస్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి
-
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, కవితారావు, సంతోశ్రావు, వినోద్రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
‘ఎండాకాలం.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత’
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎండాకాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతోందని చెప్పారు. 86 శాతం ప్రజలకు (3 కోట్ల 36 లక్షల మందికి) సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 60 లక్షల జనాభాకు రేషన్ కార్డులు ఇస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, కమర్షల్ సిలిండర్ల కొరత ఉందని తెలిపారు. కొన్ని రోజుల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా తగ్గుతుందని చెప్పారు.మరోవైపు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ఫోకస్ పెట్టింది. దిండి ప్రాజెక్ట్ వచ్చే రెండేళ్లలో పూర్తి చేయబోతున్నామని హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం చేసిన లోన్స్ వల్ల ఇప్పుడు సమస్య ఏర్పడింది. 97 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఇరిగేషన్ పై ఖర్చు చేసింది. కాళేశ్వరం - పాలమూరు ప్రాజెక్ట్ పై మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ పై ఒక్క ఎకరా కొత్త ఆయకట్టు రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలందరికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నాం. ఇరిగేషన్ శాఖలో ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రాజెక్ట్ ల భూ సేకరణ కోసం 5వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టాం’ అని అన్నారు. -
‘ కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే’
హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్కు కేటీఆర్ అంటే ప్రేమని, అందుకే ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన బండి సంజయ్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై విచారణ ఒక్కటే కనబడుతోందని విమర్శించారు. హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ మీద ఎందుకు తగ్గిందన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ప్రయత్నాలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయని, కేటీఆర్ను కవితను కలిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్కు, రేవంత్కు మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపించారు. -
అనుమతుల్లేకుండా ‘రాఘవ’ మైనింగ్: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతుల్లేకుండానే హైదరాబాద్లో మైనింగ్ చేస్తోందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యుడి ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని పట్టుబట్టారు. హరీశ్కు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ వెల్లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలతో సభను హోరెత్తించారు. తప్పు చేయ కపోతే పొంగులేటికి భయం ఎందుకన్నారు. దాడుల్లో దొరికినా ప్రభుత్వ చర్యలేవీ? బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శనివారం శాసనసభలో గనుల శాఖపై చర్చలో సాగర్ ఎమ్మెల్యే జయవీర్రెడ్డి మాట్లాడిన తర్వాత హరీశ్రావు మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతో ఖనిజ సంపద ఉంది, దాన్ని రక్షించే రక్షకులే భక్షకులయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేకుండా దర్జాగా దందా చేస్తున్నారు. జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ బరితెగించి మైనింగ్ చేస్తోంది. అక్కడ ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టొద్దు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్లపై నడుపుతోంది. జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలి. పరిశ్రమల శాఖ అనుమతి తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సరి్టఫికెట్లు తీసుకోవాలి. కానీ ఆ సంస్థ విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా దొంగచాటుగా డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తోంది. 2025 మే 21న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్ తనిఖీకి ఆదేశించారు. రెవెన్యూ, పీసీబీ, ఎస్పీడీసీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసు జారీ చేసి రూ. 24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మార్చి 4న మళ్లీ తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. మార్చి 13న మరో షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీజిల్ జనరేటర్లతో కాలుష్యంపై స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం ఎండీఎల్, లైసెన్స్ లేకుండా క్వారీ నిర్వహిస్తే మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడ్డా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?’అని హరీశ్రావు నిలదీశారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన సంస్థ కావడంతోనే ప్రభుత్వం చర్యలకు వెనకడుగు వేసింది. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయం చేస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పేరు ప్రస్తావనపై మంత్రుల అభ్యంతరం.. హరీశ్రావు చేసిన ఆరోపణలపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సంబంధం లేని విషయంలో మంత్రి పొంగులేటి పేరు ప్రస్తావించారంటూ మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్తోపాటు విప్ ఆది శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హరీశ్రావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని, హరీశ్రావు అభూత కల్పనలతో సభను తప్పుదోవ పట్టించడం సరికాదని మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. వెంటనే హరీశ్రావు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో దళితులపై అరాచకాలు జరిగినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. లారీలను నిలిపివేయాలని అడిగిన ప్రజలను కొట్టి హింసించిన ఘటనలు మర్చిపోయారా?.. అప్పుడు సభాసంఘం ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్గూడ మైనింగ్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉంటే తప్పకుండా విచారణ చేపడతామని... తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మహబూబ్నగర్లో ఇసుక మాఫియా లారీల కింద పడి పిల్లలు చనిపోతే కనీసం అటువైపు చూడని నేతలు ఇప్పుడు సభాసంఘం ఏర్పాటు చేయాలని మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల వాదప్రతివాదనలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకొని హరీశ్రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చను కొనసాగించారు. -
భర్తీ చేస్తున్నా.. ఖాళీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్సీలు, సీహెచ్సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నియంత్రణలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్ పోస్టులు ఉండడం గమనార్హం. వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్/ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డాక్టర్లు తయారవుతున్నా.... ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంటర్న్షిప్ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. -
తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు ఇలా..
చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ బరిలోకి దిగుతుండగా, చెపాక్ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్ సౌత్ నుంచి బరిలోకి సెంథిల్ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. -
ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..
-
కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ?
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి.బీజేపీ వ్యూహం: మోదీ సుడిగాలి పర్యటనలుకేరళపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దించుతోంది. ప్రధాని ఇప్పటికే రెండుసార్లు కేరళలో పర్యటించగా, ఈ ఆదివారం మరోసారి ప్రచారానికి రానున్నారు. బీజేపీ విడుదల చేసిన 40 మంది సభ్యుల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తదితర హేమాహేమీలు ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ ఆశలన్నీ గాంధీ కుటుంబంపైనే..కాంగ్రెస్ పార్టీ కూడా భారీ తారాగణంతో ప్రచార బరిలోకి దిగుతోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కేరళలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంకలు ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, సచిన్ పైలట్ తదితర కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్లను స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ ఎంపిక చేయడం విశేషం.రేసులో ఇతర పార్టీలుఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించనున్నారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , బహుజన్ సమాజ్ పార్టీలు కూడా తమ అగ్రనేతల పేర్లను ఎన్నికల సంఘానికి అందజేశాయి. మొత్తానికి జాతీయ స్థాయి నేతల రాకతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ల హవా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ! -
తెలంగాణకు మాత్రమే రేవంత్ సీఎం.. ఉత్తరాదికి కాదు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు అంటూ చురకలు అంటించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలు అయినా పెట్టుకోవచ్చు. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కూలిపోవడానికి అప్పుడున్న బీఆర్ఎస్ బాధ్యత వహించాలి. కేసీఆర్తో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారు. రేవంత్, కేసీఆర్ కలిసే రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి.. ఉత్తరాది రాష్ట్రాలకు కాదు.మొదట ఆరు గ్యారంటీలు అమలు చేయాలి. కేంద్రం ఏం ఇస్తున్నాదో.. ఏం చేస్తుందో తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగాలేదు. రైతులకి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
YS కుటుంబాన్ని కొట్టేందుకు.. నాపై 5 CBI కేసులు పెట్టిన కాంగ్రెస్
-
వైఎస్ కుటుంబాన్ని కొట్టేందుకు... నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టారు..
సాక్షి, హైదరాబాద్: ‘నేను కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు పార్టీకి సేవ చేసిన. పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది. సోనియా గాందీకి, ఆ రోజు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కి .. మొన్న మంత్రిపదవి ఇచ్చిన కేసీఆర్కు థ్యాంక్స్. పార్టీ మంచి చేసిందని చెప్పుకున్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నాపై ఐదు సీబీఐ కేసులు పెట్టలేదా? అసెంబ్లీలో సీఎం రేవంత్ నాపై మాట్లాడే వరకు నేను కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆవేదనతోనే మాట్లాడుతున్న. నిజాయితీగా ఉన్నందుకే కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నం’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యులు పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ పద్దులపై శాసనసభలో గురువారం రాత్రి జరిగిన చర్చలో మంత్రి సీతక్క చేసిన విమర్శలకు స్పందిస్తూ సబిత పైవిధంగా స్పందించారు. ‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మంత్రి సీతక్క మొన్న నా మీద పడ్డారు. ఇప్పుడు సునీతా రెడ్డిపై పడ్డారు. నేను తనకు పోటీ కాదు. తను కాంగ్రెస్లో.. నేను బీఆర్ఎస్లో ఉన్నాం. మొన్న హరీశ్రావు మాట్లాడుతున్నప్పుడు.. నేను అయ్యో అన్నందుకే నన్ను దొరసాని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, సబితమ్మను తిడితే సీఎం సంతోషపడతారేమో’అని సబిత ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ వారికి ఇష్టం లేదు: సీతక్క అంతకు ముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పల్లెల్లో నీటి సరఫరా జరగడం లేదని అసత్య ఆరోపణలు చేశారంటూ సబితను తప్పుబట్టారు. ‘నాలాంటి వాళ్లు పంచాయతీరాజ్ శాఖను నిర్వహించడం వారికి ఎట్లానూ ఇష్టం లేదు. ఆదివాసీల నుంచి మంత్రి కావడం బీఆర్ఎస్ వారికి ఏమాత్రం ఇష్టం లేదు..’అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసులు పెట్టిన తర్వాత కూడా సబిత కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారని, ఆ తర్వాత ఆమెను ఓడించడానికి ప్రయత్నించిన వారి పార్టీలో చేరారని విమర్శించారు. సబిత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలను బీఆర్ఎస్ వారు విమర్శిస్తున్నప్పుడు ఆమె.. అవును.. అవును అని మద్దతు తెలపడంతోనే ఆవేశం వచ్చి ఆ రోజు ..‘అయ్యో దొరసాని’అన్నానని సీతక్క వివరణ ఇచ్చారు. సబితకు తనపై ద్వేషం ఉండొచ్చని, ఆమె బీఆర్ఎస్లోకి పోవడంతో తనకు మంత్రి పదవి వచి్చందని ఆమె భావిస్తుండవచ్చని సీతక్క పేర్కొన్నారు. ‘ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. వాళ్లది హైదరాబాద్ సిటీ. వాళ్లు ఉన్నత వర్గాలు. మేము అడవి బిడ్డలం. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు’అని సబితను ఉద్దేశించి సీతక్క వ్యాఖ్యానించగా, కులం ప్రస్తావన ఎందుకు? అని బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సబిత స్పందిస్తూ తాము వ్యవస్థలో లోపాలు ఎత్తిచూపుతామని, కులం, మతం చూడమని స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీలో కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం సభను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. గురువారం శాసనసభ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 జూన్ 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుండగా, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరిందని చెప్పారు.ప్రస్తుతం నెలకు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోందని, దీన్నిబట్టి చూస్తే ఆరోగ్యశ్రీపై చేస్తున్న ఖర్చులో సహజ పెరుగుదల మాత్రమే ఉందని, కొత్తగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు బకాయిలు పెరిగాయన్నారు. ఆస్పత్రుల నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ విషయంలో వాస్తవాలు వివరించేందుకు తమకు సభలో అనుమతి ఇవ్వడం లేదని హరీశ్రావు అన్నారు. వాయిదా తీర్మానాలు తిరస్కరణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లోలో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ బారిన పడటంపై చర్చించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ స్కీమ్, జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ తదితర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వా యిదా తీర్మానం ఇచ్చారు. వీటన్నిటినీ స్పీకర్ తిరస్కరించారు. ఈ మేరకు సభలో ప్రకటన చేశారు. -
జగన్ ను వదులుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు.. జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
విధి లేకే వీడుతున్నా: జీవన్రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్కు ఎదిరించే వారు వద్దని, రాహుల్గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రేవంత్పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. -
‘అనర్హత’పై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ను, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలకు పిటిషనర్లు వ్యక్తిగతంగా స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు అందించేందుకు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కు తాజా పిటిషన్లు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్లు కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ పిటిషన్లు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్.. వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. దీనిపై రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశ్గౌడ్, వెంకట్రావు, గాం«దీ, దానం నాగేందర్, కృష్ణమోహన్రెడ్డి, కాలే యాదయ్య, శ్రీనివాస్రెడ్డికి సంబంధించి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. స్పీకర్ ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. ‘2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి విజయం సాధించిన సదరు ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్లో చేరడం, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడం ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో కూడా ప్రసారమైంది. దానం నాగేందర్ ఏకంగా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వీటన్నిటిపై బీఆర్ఎస్ అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. అవేవీ పరిశీలించకుండానే పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. పిటిషన్లపై సత్వరమే విచారణ చేపట్టాలి..’అని కోరారు. దీంతో సీజే ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేసి గెలిచే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. ‘ఎవరో ఎందుకు.. నువ్వే పోటీచెయ్.. సిద్దిపేటలో నా మీద పోటీ చేయాల్సిందిగా రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి సీఎం కాలేడన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ పనితనం చూసి ఓటు వేసేందుకు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో హరీశ్రావు బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్రెడ్డి చేరికపై వేచిచూడండి మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా, బీఆర్ఎస్లో చేరికకు సంబంధించి స్పందిస్తూ ‘వేచి చూడండి.. కొన్ని చెప్తే బాగుండవు.. చూస్తేనే బాగుంటాయి’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తాం. మహిళా రిజర్వేషన్లపై గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదికి ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి, ప్రగతి దిశగా పనిచేస్తూ నష్టపోతున్నాయి’అని హరీశ్రావు చెప్పారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పీకర్ను మరోమారు కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు తాము 15 అంశాలు ప్రతిపాదించినా ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ల ద్వారా 50,785 ఉద్యోగాలు నోటిఫై చేసి 16,978 మాత్రమే భర్తీ చేసినట్లు ఒప్పుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 36 సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి తొమ్మిదింటికి మాత్రమే అధ్యక్షులను నియమించింది. 17 బోర్డులకు కనీసం కార్యాలయాలు కూడా లేవు’అని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. -
‘జీవన్ రెడ్డి మనసు మార్చుకొని కాంగ్రెస్లో కొనసాగాలి’
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని అన్నారు.‘పార్టీలో ఉండి అడగాలి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చాలా మందికి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, గొప్ప వ్యూహకర్త. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ఈ దేశం ఎన్నడూ మరిచిపోదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ఆచరిస్తూ హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన బాగా పని చేశారు. జీవన్ రెడ్డిలాంటి క్రమశిక్షణతో ఉన్న నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. ప్రభుత్వం పటిష్ఠమైన పాలన చేయాలంటే కొంత సర్దుకుపోవాలి. నాకు కూడా అవకాశాలు చాలా మిస్సయ్యాయి. నేను పార్టీలోనే ఉండి పోరాటం చేశాను. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలి. పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయి. వేచి చూడాలి.. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. ఆయన లాంటి వారు ఓపికగా రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అండగా ప్రజాపాలనకు సహకారాన్ని అందిస్తే బాగుండేది’ అని చెప్పారు. -
KCR మంచి దోస్త్ నాకు..
-
BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
-
కాంగ్రెస్ కోసం కష్టపడ్డా.. కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం
-
కాంగ్రెస్కు గుడ్బై.. రేవంత్పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
నేడు జీవన్ రెడ్డి రాజీనామా.. చెరిగిపోతున్న ఆనవాళ్లు
-
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే.. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. అధి ష్టానం హామీ ఇచ్చింది. ఇస్తుందో లేదో తెలియదు. వారికి ఉండే సమీకరణాలు ఏమిటో?’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవి లేకున్నా తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి పదవి ఇవ్వడం వల్ల తనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తాము ఇద్దరం సోదరులమని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్య మకారుల సేవలు అవసరమన్నారు. సీఎం రేవంత్రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేద ని, తాను సోమవారం సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఎదురుపడితే పలకరించుకున్నామే తప్ప ఎలాంటి భేటీ జరగలేదన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్రెడ్డి అంటేనే తాను అభ్యంతరం చెప్పానని, అలా అనడం శాసనసభ్యులను అవమానించడమే అవుతుందని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని చెప్పారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే వారి పతనం ప్రారంభమైందని తాను కేటీఆర్తో అన్నట్లు చెప్పారు. కాగా భోజన సమయంలో రెండుగంటలపాటు కేటీఆర్తో భేటీలో సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రాధా న్యత లేదని, ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా రని రాజగోపాల్రెడ్డి తెలిపారు. -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
నేడు కాంగ్రెస్కు రాజీనామా.. జీవన్ పయనమెటు?
సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.కాంగ్రెస్తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్రెడ్డితో చర్చించారు. వారు జీవన్రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్తో చేతులు కలపడంతో జీవన్రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్రెడ్డి జీవన్రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జీవన్రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్కుమార్గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అఫిడవిట్లో రాజీవ్ చంద్రశేఖర్ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. Dear @Ceokerala,BJP candidate from Nemom constituency, Rajeev Chandrasekhar, has not disclosed his residence, a 49,000 sq.ft mansion in Koramangala 3rd Block, Bengaluru, in his affidavit.This is a 1.07 acre property in one of the most expensive locations in the country, where… pic.twitter.com/pyyzD5Sft7— Congress Kerala (@INCKerala) March 23, 2026 -
కాంగ్రెస్ విడిచి వెళ్లడం అంటే జీవన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
-
మహేష్ కుమార్తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. సంచలన ప్రకటన
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై ఉన్న “ఇందిరా భవన్” ఫ్లెక్సీని తొలగించడం గమనార్హం.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. ఈ క్రమంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అనంతరం, మహేష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్..‘పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని పనులు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. అదే జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు ఉంది. జీవన్ రెడ్డితో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారవద్దని చెప్పి వచ్చాం. మొన్ననే నేను శ్రీధర్ బాబుతో కలిసి రావాల్సింది. మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడించాం. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నాం. ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లో ఆయన అనుభవానికి తగిన న్యాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలగించారు. అయితే, ఇందిరా గాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్బై చెబుతున్నట్టు అనుచరులు సంకేతాలు ఇచ్చారు. -
ఫలించని బుజ్జగింపులు! రేపే జీవన్ రెడ్డి రాజీనామా?
-
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడైంది.2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్, యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.అయితే, ఈ ఎన్నికల్లో ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా, ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని ఇస్తోంది.అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి. సిబ్సాగర్లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్కి అవకాశాలు కల్పిస్తోంది.దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా, ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల కాంగ్రెస్–రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు.అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం. సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి.మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో... అవి ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్ చేశారు.మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!- ఆర్. దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
కాంగ్రెస్కు జీవన్రెడ్డి రాజీనామా వేళ బిగ్ ట్విస్ట్!
సాక్షి,జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, అవమానాలు భరించలేక మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రంగంలోకి దిగింది. మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఆయనను కాంగ్రెస్లో కొనసాగాలని కోరనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా, రాజీనామా ప్రకటించే కొన్ని గంటల ముందు పీసీసీ చీఫ్ రాకతో జీవన్ రెడ్డి నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు..గత ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవమానం భరించలేక కాంగ్రెస్ను వీడనున్నట్లు జీవన్రెడ్డి తెలిపారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జీవన్రెడ్డి ప్రకటన అనంతరం, ఆయన ఇంటి వద్ద ఓ పోస్టర్ వెలసింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? విఫలమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
గౌరవ్ గొగొయ్ నామినేషన్
జోర్హాత్: లోక్సభ సభ్యుడు, అస్సాం కాంగెస్ర్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సోమవారం జోర్హాట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జోర్హాట్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో అట్టహాసంగా జిల్లా కమిషనర్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. గొగొయ్ మద్దతుదారులతోపాటు కాంగ్రెస్ కూటమిలోని ఆరుపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోర్హాట్ ఎంపీగా ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష ఉపనేతగా గొగోయ్ కొనసాగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నామినేషన్కు ముందు మీడియాతో మాట్లాడుతూ అస్సాం రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు దీనినో అవకాశంగా భావిస్తున్నానన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని, రాజకీయాలను శుద్ధి చేసేందుకు తనతో చేతులు కలపాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు. పార్టీ ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొన్న వారికే పథకాలను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ మహిళలను అవమానిస్తోందని గొగొయ్ విమర్శించారు. జోర్హాట్ స్థానం నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్రనాథ్ గోస్వామితో గొగొయ్ తలపడనున్నారు. గోస్వామి 1991 నుంచి ఏజీపీ తరఫున, అనంతరం 2016 నుంచి బీజేపీ తరఫున వరుసగా ఐదు పర్యాయాలు జోర్హాట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్ చేశారు. బడ్జెట్పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. ‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్ బోగస్ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులకూ దగా.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న సర్కార్ బడ్జెట్లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్నగర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్ కవిత చదివారు)..’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాగునీటిపై నిర్లక్ష్యం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్రావు విమర్శించారు. -
అది భస్మాసుర హస్తంగా మారింది: హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్ రావు అన్నారు. -
అలా విడిపోయాం!
కాంగ్రెస్ పార్టీలో సెక్యులర్ భావాలతో తిరుగులేని నాయకుడిగా ఉన్న బారిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా ప్రాముఖ్యత... మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశంతో అనూహ్యంగా తగ్గింది. తర్వాత రాజకీయాలు వదులుకుని ఆయన లండన్కెళ్లి వకాలతు మొదలెట్టారు. కానీ, ముస్లిం లీగ్ నాయకులు ఆయన్ని తిరిగి ఇండియాకు రప్పించారు. యునైటెడ్ ప్రావిన్స్లో ముస్లిం లీగ్ – కాంగ్రెస్ కలిసి బ్రిటిష్ రాజ్ను ఎదుర్కోవటానికి జిన్నా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. 1936లో బాంబేలో జరిగిన సదస్సులో ముస్లిం లీగ్ పార్టీ పగ్గాలు జిన్నా కైవసం చేసుకున్నారు. 1937 ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంతో, భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకోవటం దుర్లభం అని భావించిన లీగ్ ప్రాథమిక చర్యగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీల ముస్లిం నాయకులను క్రమంగా లీగ్ లోకి చేర్చుకుంది. ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కేవలం ముస్లిం లీగ్ ద్వారానే సాధ్యమని ప్రచారం చేశారు జిన్నా. అప్పటివరకూ ముస్లిం ధనిక, జమీందారులకే పరిమితమైన లీగ్లోకి నిమ్నవర్గం ముస్లింలను సైతం చేర్చి, ఇరవై లక్షల సభ్యులతో జాతీయ నాయకుడిగా, ముస్లింల ‘మసీహా’ అయ్యారాయన. కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ, ముస్లిం మెంబర్షిప్ డ్రైవ్ ఆరంభించారు కానీ హిందువుల కోసమే కాంగ్రెస్ అనే అభిప్రాయం ప్రబలంగా ఉండటంతో అనుకూల స్పందన రాలేదు. దేశ రాజకీయంలో రిలిజి యస్ పోలరైజేషన్ మొదటి సారి అలా జరిగిందన్నమాట. ఇక లీగ్ నాయకులు, ముస్లింలకు అధికార ప్రాతినిధ్యం కోసం బ్రిటిష్ పాలకులతో చేసిన ప్రయత్నం కొలిక్కి వచ్చే తరుణంలో, దేశ విభజనకు ఊతమిస్తూ మార్చి 1940లో లాహోర్లో ముస్లిం లీగ్ సదస్సు నిర్వహించారు. ఇదే అదనుగా, ఇండియన్ ముస్లింలకు ‘సెపరేట్ హోమ్ ల్యాండ్’ అజెండాను నాటకీయంగా తెరపైకి తెచ్చారు జిన్నా. 1940 మార్చి 22–24 మధ్య జరిగిన సదస్సులో, భారత ఉపఖండంలో ‘ముస్లిం జోన్స్’ గుర్తించి వేర్పాటు చేసే తీర్మానాన్ని మార్చి 23 నాటి సమావేశంలో చేశారు. ఈ లాహోర్ రిజొల్యూషన్ వార్తను మరుసటి ఉదయం వార్తా పత్రికలు ‘పాకిస్తాన్ రిజొల్యూషన్’ శీర్షికతో ప్రచురించాయి. అలా మార్చి 23 ‘పాకిస్తాన్ డే’గా రూపు దిద్దుకుంది. ఈ సదస్సుకు ప్రతీకగా తర్వాత లాహోర్లో ‘మినార్–ఎ–పాకిస్తాన్’ నిర్మించు కున్నారు. 1947లో దేశ విభజన జరిగి పాక్ ఏర్పడ్డాక, ఇండియన్ ముస్లింలకు ప్రత్యేక హోమ్ ల్యాండ్ అని ప్రగల్భాలు పలికిన ముస్లిం లీగ్... రెండు నెలలకే అదే ఇండియన్ ముస్లింలను నిషేధిస్తూ సరిహద్దులు మూసి వేయడం గమ నార్హం. (జస్వంత్ సింగ్ ‘జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్ ’ ఆధారంగా)– జిల్లా గోవర్ధన్ ‘ విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై -
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.టికెట్ దక్కకపోవడమే కారణమా?2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహంనందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.సీఎం చర్చలు విఫలం?నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది. -
ప్రభుత్వాలు లేకున్నా పార్టీ ఉంటుంది
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది..కార్యకర్తలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వాలు ఉండవు.. పార్టీయే శాశ్వతం.. ఎందరో ప్రాణ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ కాంగ్రెస్.. ఇది ప్రజల పార్టీ.. పార్టీ కోసం మనం కష్టపడితే ఫలితాలు దక్కుతాయి’అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడారు.ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ గెలవదని, ఏదైనా పోటీ ఉంటుందంటే అది బీజేపీతోనే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని, డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఏప్రిల్ చివరి లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ చైర్మన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీకనీకి వచ్చిండ్రా.. కార్యకర్తలపై ఎంపీ చామల ఫైర్భువనగిరి ఎంపీ చామల కాంగ్రెస్ పార్టీ కేడ ర్పై సీరియస్ అయ్యారు. సభలో ఎంపీ మా ట్లాడుతున్న సమయంలో కొందరు కార్యక ర్తలు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆగ్ర హించిన ఎంపీ ఏయ్ మాట్లాడకండయ్యా. మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లా డుకోండి.. ఇక్కడ సీరియస్గా మాట్లాడు తుంటే పీకనీకి వచ్చిండ్రా ఈడ అని అన్నా రు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. -
రైతే రాజు కావాలి: సీఎం రేవంత్
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.ఆదివారం సెలవు కావడంతో సోమవారంఅన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి ‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం. యూరియా కొరత వచ్చేలా ఉంది.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు.. ‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. -
25న రాజీనామా చేస్తున్నా..
జగిత్యాల టౌన్: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కూడా ఒక కారణమన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు. నేను ఒక్కసారి చెబితే..!జీవన్రెడ్డి, రజినీకాంత్తో పోస్టర్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మాది పీపుల్స్ బడ్జెట్
ఖమ్మం మయూరి సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పొందుపరిచినవి కేవలం అంకెలు కావని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక నమ్మకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమది పీపుల్స్ బడ్జెట్ అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో పుట్టడం మా అదృష్టం’అని ప్రతి పౌరుడూ గర్వపడేలా తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. కులమతాలు, ప్రాంతాల భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశామని.. జీవిత బీమా పథకం కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు క్యాలెండర్ను ఏర్పాటు చేశామని.. నిర్మాణ దశను బట్టి వారానికోసారి బిల్లు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది అదనంగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మరో లక్ష ఇళ్లను మంజూరు చేయాలని యోచిస్తున్నామని భట్టి చెప్పారు. విద్యార్థులే రేపటి సంపద.. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మే తమ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు పౌష్టికాహారం అందిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు వారంలో రెండు రోజులు పాలు, రెండు రోజులు రాగి జావ అందిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట.. రాష్ట్రంలో 68,89,955 మంది పట్టాదారులకు రైతుభరోసా కింద రూ. 3,446.94 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే 45 రోజుల్లో మూడు విడతల్లో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని స్పష్టం చేశారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు రెండు సీజన్లలో కలిపి బోనస్ అందించామన్నారు. ఈ సందర్భంగా తాజా బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల గురించి భట్టి వివరించారు. సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
కూటముల కోలాటం
కేరళలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు అగ్నిపరీక్షగా, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్కు అస్తిత్వ పరీక్షగా మారాయి. దేశంలో మిగిలిన తమ ఏకైక కంచు కోటను వామపక్షాలు ఏ మేరకు కాపాడు కోగలవన్నది ఆసక్తికరం. కేరళలో ఐదేళ్లకోసారి పారీ్టలను గద్దె దింపే 40 ఏళ్ల ఆనవాయితీని బద్దలు కొడుతూ ఎల్డీఎఫ్ ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచింది. సీఎం పినరయి విజయన్ సారథ్యంలో ఈసారీ విజయ బావుటా ఎగరేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం, ఇటు యూడీఎఫ్ కూటమిని, అటు రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీని నిలువరించడం అధికార కూటమికి అగి్నపరీక్షే కానుంది.కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఎల్డీఎఫ్ తమ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సామాజిక భద్రత పెన్షన్ పథకం వంటివాటినే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తోంది. కానీ నిరుద్యోగం, ప్రజల్లో అసంతృప్తి, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజల్లో సీఎం విజయన్కు ఉన్న ఆదరణపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. విపక్ష యూడీఎఫ్ మరో రకం సవాళ్లకు ఎదురీదుతోంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ కూటమి ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇది ప్రచారంపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఈసారీ నెగ్గని పక్షంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. దాంతో యూడీఎఫ్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విజయన్ సర్కారు అవినీతిని ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగం తదితరాలనూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే నేతల కుమ్ములాటలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారాయి. ఇక బీజేపీ కొన్నేళ్లుగా కేరళలో తన బలాన్ని, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అధికార, విపక్ష కూటములకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎల్డీఎఫ్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, యూడీఎఫ్ పక్షాల్లో అనైక్యతకు ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి, హిందూత్వ కార్డు తోడై మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. బీజేపీ సానుకూలతలు → రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న సంకేతాలు → 2016తో పోలిస్తే పెరిగిన ఓట్ల శాతం → మోదీ కరిష్మా, హిందూత్వ కార్డు → ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ప్రచారం ప్రతికూలతలు → సానుకూలతను ఓట్లుగా మలచడంలో వైఫల్యం → రాష్ట్రంలో సమర్థమైన నాయకులు లేకపోవడం → కరడుగట్టిన హిందూత్వ ముద్రఎల్డీఎఫ్ సానుకూలతలు → బూత్ స్థాయి దాకా పటిష్ట నిర్మాణం → ప్రజల్లో సీఎం విజయన్కు ఉన్న ఆదరణ → సంక్షేమ పథకాలు → యూడీఎఫ్ కూటమి పక్షాల అనైక్యత ప్రతికూలతలు → ఉద్యోగ కల్పన హామీల అమల్లో వైఫల్యం → నానాటికీ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత → ద్వితీయ శ్రేణిలో నాయకత్వ లేమి → శబరిమల వివాదాలతో అప్రతిష్టయూడీఎఫ్ సానుకూలతలు → సెంట్రల్ కేరళపై తిరుగులేని పట్టు → క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ఓటర్ల దన్ను → తాజా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన → ఎల్డీఎఫ్పై ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలతలు→ కూటమి పార్టీల్లో పెచ్చరిల్లిన వర్గ పోరు → ఓమెన్ చాందీ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజీ ఉన్న నాయకుడు లేకపోవడం → సీపీఎంతో పోలిస్తే బూత్ స్థాయిలో బలహీన నిర్మాణం → గత అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన → ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చే ప్రమాదం – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దాదాపు 37 ఏళ్లుగా తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిష్కార మార్గం దొరికినా మోక్షం మాత్రం కలగట్లేదు. భూభారతి చట్టంలో సాదాబైనామాలను చట్టబద్ధం చేసే ప్రక్రియకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా లక్షలాది సాదాబైనామా దరఖాస్తులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అడ్డంకిగా అఫిడవిట్ నిబంధన.. సాదాబైనామాల సమస్యకు పరిష్కారం చూపించే భూభారతి చట్టం గతేడాది ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులో హైకోర్టు అందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇచి్చన ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించింది. అంతవరకూ బాగానే ఉన్నా చట్టంలో పేర్కొన్న విధంగా సాదాబైనామాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ రూపొందించిన నిబంధనలు మళ్లీ సమస్యను జటిలం చేశాయి. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని 2014 జూన్ 2లోగా తెల్లకాగితం (సాదాబైనామా)తో కొని ఉంటే అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలని.. అప్పుడే సాదాబైనామా సరి్టఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు.దీంతో ఎప్పుడో దశాబ్దాల క్రితం తమకు అమ్మిన వారి నుంచి అఫిడవిట్లు తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తేసే దిశగా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా వస్తాయని.. అమ్మినవారి అఫిడవిట్తో సంబంధం లేకుండా గతంలో లాగానే స్థానిక విచారణ ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కానీ ఈ అఫిడవిట్కు మించిన సమస్యలు సాదాబైనామా దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాకపోవడం గమనార్హం.సాదాబైనామా దరఖాస్తును పరిష్కరించాలంటే ఆ భూమికి సంబంధించి భూభారతి పోర్టల్లో ఉన్న వివరాల్లో అమ్మిన వ్యక్తి పేరుపై పట్టా ఉండాలన్న నిబంధన ఈ సమస్యకు పీటముడి వేస్తోంది. ఎప్పుడో భూమి అమ్మినా ధరణి పోర్టల్ వచ్చాక తన పేరిట పట్టా రావడంతో అప్పట్లో అమ్మిన వ్యక్తి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడం లేదంటే కుటుంబ సభ్యుల పేర్లపై పట్టా బదిలీ చేయడం లాంటివి జరిగిపోయాయి. చాలా చోట్ల సర్వే నంబర్లు సరిపోలట్లేదు. భూమి ఒకచోట ఉంటే మరో సర్వే నంబర్పై కాగితం ఉండటంతో ఆ దరఖాస్తులను కూడా రెవెన్యూ అధికారులు పరిష్కరించట్లేదు. కాగితాలపై రాసుకున్న విస్తీర్ణం, భూభారతి పోర్టల్లో ఉన్న విస్తీర్ణంలో తేడా ఉన్నా పరిష్కరించలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.ఇలా చాలా దరఖాస్తులను తిరస్కరించామంటున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలన్నింటికీ వివరణ ఇస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి ఆర్డీవోలకు ప్రత్యేక ఉత్తర్వులు రావాలని.. అప్పుడే సాదాబైనామాలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. సాదాబైనామాలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో అఫిడవిట్ నిబంధన ఎత్తేయడంతోపాటు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు అలా... ఇప్పుడు ఇలా వాస్తవానికి సాదాబైనామాలను పరిష్కరించే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. కానీ సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించిన అప్పటి ప్రభుత్వం ధరణి చట్టంలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని విస్మరించింది. దీంతో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత విషయం కోర్టు మెట్లెక్కింది. కోర్టు కూడా చట్టంలో లేనందున పరిష్కారం ఎలా చేస్తారని ప్రశ్నించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్ రూపొందించడంతో కోర్టు కూడా వాటి పరిష్కారానికి అనుమతినిచ్చింది. దీంతో ఇక సమస్య పరిష్కారమైనట్టేనని 9.2 లక్షల మంది దరఖాస్తుదారులు ఆశించారు. కానీ నేటికీ సమస్య అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే.. ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలి. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసిది ఆర్డీవో అయినప్పటికీ కలెక్టర్కు అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే తిరస్కారానికి గురైన రైతులు కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవడం ద్వారా సాదాబైనామాల దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది. – భూమి సునీల్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు -
చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
-
కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా.. ముహూర్తం ఫిక్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. -
అస్సాంలో బీజేపీ దూకుడు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), రభా హసోంగ్ జతా మంచ్ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్ మరోసారి వామపక్షాలు, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్ను కుంగదీస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ భూపేన్ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేషన్కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్జోన్లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్రావు చెబుతుండడం తప్పు. చక్రధర్గౌడ్ పంజగుట్ట పీఎస్లో తనను హరీశ్రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్రావు బెదిరించినట్టు చక్రధర్గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా
-
బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్
-
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
కేరళ కాంగ్రెస్లో ‘కుంపటి’?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు. -
కేరళ సీఎం రేసులో లేను
న్యూఢిల్లీ: కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలయ్యింది. పార్టీలు గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) మధ్య ప్రధాన పోటీ సాగుతోంది. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని ఆయన తేలి్చచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు సీఎంగా ఎన్నికయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన నాయకుడే సీఎంగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని సూచించారు. శశి థరూర్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం లేదు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండాపోయిందన్నారు. కేరళ ఎన్నికల్లో తన పాత్ర మిక్స్డ్ బ్యాగ్ లాంటిదని చెప్పారు. రాష్ట్రమంతటా తిరుగుతూ తమ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని సంకేతాలిచ్చారు. యూడీఎఫ్ విజయమే లక్ష్యంగా పని చేస్తానని ఉద్ఘాటించారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నాం రాష్ట్రంలో కూటమి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలంటూ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఆదేశించారని శశి థరూర్ వివరించారు. క్షేత్రస్థాయిలో రాహుల్ ఆదేశాలను పాటిస్తున్నామని, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా, ఎన్నికల్లో యూడీఎఫ్కు 85 నుంచి 100 స్థానాలు లభిస్తే చాలా సంతోషిస్తానని థరూర్ వ్యాఖ్యానించారు. తమకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నామంటూ క్రికెట్ పరిభాషలో చెప్పారు. వామపక్ష కూటమిని కచ్చితంగా ఇంటికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల కంటే ముందు ప్రకటించే విధానాన్ని వ్యక్తిగతం తాను సమర్థిస్తానని చెప్పారు. కేరళలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే గెలిచే సత్తా కాంగ్రెస్కు ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు, అజెండా, లోగోతోనే గెలుస్తామని అన్నారు. సీఎం అభ్యరి్థని ప్రకటించకపోయినా విజయావకాశాలపై ఎలాటి ప్రభావం ఉండదని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎం అభ్యరి్థని ఎంపిక చేస్తుందన్నారు. అస్సాంలో ఆ నిర్ణయమే కరెక్టు దేశంలో ఎన్నికల పరిణామ క్రమాన్ని చాలా ఏళ్లుగా దగ్గరగా గమనిస్తున్నానని థరూర్ తెలిపారు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రాజకీయా పార్టీలు అధ్యక్ష తరహా విధానాన్ని పాటిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు కూడా అదే తరహాలో జరుగుతున్నాయని పేర్నొన్నారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల కోసం పార్టీలు తమ అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్నాయని గుర్తుచేశారు. కేరళలో యూడీఎఫ్కు సీఎం అభ్యర్థి లేకపోవడం అందరికీ వింతగా కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు.ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కాంగ్రెస్కు ఓటర్లు ఉన్నారని చెప్పారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఇదే సూత్రం అన్నిచోట్లా పని చేయదని అభిప్రాయపడ్డారు. అస్సాంలో గౌరవ్ గొగోయ్ని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ అలాంటి నిర్ణయమే సముచితమని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థులను ముందే ప్రకటించాల్సిన అవసరం రావొచ్చన్నారు. కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని శశి థరూర్ చెప్పారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్కు పట్టం గట్టడం తథ్యమని పేర్కొన్నారు. ఆర్భాటాలు సహాయపడవుఇరాన్ యుద్ధంపై ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతుకాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన పార్టీతో విభేదించారు. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరిని సమరి్థంచారు. ప్రభుత్వ మౌనం బాధ్యతాయుతమైన రాజనీతిజ్ఞతని అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సంఘర్షణను సమర్థించలేమని, సార్వ¿ౌమాధికారం, అహింస వంటి భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న సూత్రాలను ఇది ఉల్లంఘిస్తోందని థరూర్ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రభుత్వ సంయమనం వ్యూహాత్మక తెలివిని ప్రతిబింబిస్తుందన్నారు. ‘ఈ సందర్భంలో మౌనం పిరికితనం కాదు. ఇది మన జాతీయ ప్రయోజనాలకు, ఈ ప్రాంత వాస్తవాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని గంభీరంగా గుర్తించడమే’నని వ్యాఖ్యానించారు. ఖమేనీ హత్యపై ఆలస్యంగా సంతాపం తెలిపి దేశం తన స్పందనలో తడబడిందని థరూర్ పేర్కొన్నారు. అయితే, మౌనాన్ని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని ఆయన వాదించారు. విదేశాంగ విధానం ఒక విద్యా సదస్సు కాదని, పరిణామాలను పట్టించుకోకుండా ఖండించాలని పట్టుబట్టడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో నెహ్రూ, గాంధీ సూత్రాలను స్వీకరించి, అమలు చేయాలని థరూర్ వాదించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. అదే తర్కం ఈ రోజు కూడా వర్తిస్తుందని, ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి, ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి కూడా ఇది వర్తిస్తుందని ఆయన జోడించారు. చంచల స్వభావి అయిన ట్రంప్ నాయకత్వంలో వ్యతిరేకత ఎదురైతే విరుచుకుపడే స్వభావం ఉన్న అమెరికా, మనదేశానికి నమ్మకమైన మిత్రదేశం కాదని హెచ్చరించారు. రక్షణ సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, చైనాకు ప్రతిఘటనగా నిలవడానికి భారత్కు అమెరికాతో స్థిరమైన సంబంధాలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. అన్ని పక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సంయమనం పాటించడంతో దేశం తన ప్రయోజనాలను కాపాడుకోగలదని ఆయన వాదించారు. ఆయన వైఖరి తన పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉంది. కీలకమైన అంశాలపై థరూర్ ప్రభుత్వంతో ఏకీభవించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రధాని మోదీ ఉగ్రవాద వ్యతిరేక అజెండానూ ప్రశంసించారు. ఆయన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించడంతో పాటు, పార్టీ అధినేతలతో ఆయన సంబంధాలనూ మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. -
రూ.3.35 లక్షల కోట్లు?
సాక్షి, హైదరాబాద్: ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం. స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. ఈసారి దూకుడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే గత రెండు బడ్జెట్లలోనూ ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. అనేక అంచనాలు, ఆశలతో ఈసారి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా, 2025–26లో 5 శాతం పెంచి రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. అదే ఒరవడి కొనసాగితే 2026–27కు రూ.3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముంది. కానీ ఏకంగా 10 శాతం పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకశాముందనే అంచనాలు, భూముల అమ్మకాలు, భూముల విలువల సవరణల ద్వారా మరిన్ని నిధులు సమకూరతాయనే ఆలోచనతో రూ.3.35 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుల పద్దూ భారీగానే..! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ ద్వారా రూ. 64,539 కోట్లు సేకరించాలని నిర్ణయించగా, ఈసారి దాన్ని రూ.80 వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత రెండు బడ్జెట్లలో భూముల అమ్మకాల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదనలు లేవు. కానీ ఈసారి అనివార్యమవుతోందని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ.3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రతిపాదన కూడా చేయనున్నట్టు సమాచారం. రూ.50 వేల కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలు విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. అదే విధంగా మూలధన వ్యయాన్ని కూడా పెంచనున్నారు. 2025–26లో రూ.36 వేల కోట్ల మూల ధన వ్యయం అంచనా వేసినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ.50 వేల కోట్లను చేరింది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపాదనలే రూ.50 వేల కోట్లకు చేరనున్నట్టు సమాచారం. 2025–26లో రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్కు గాను రూ.2.90 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలుంటాయని భావిస్తూ ఈ మొత్తానికి మరో రూ.45 వేల కోట్లు కలిపి ఈసారి బడ్జెట్ను ప్రతిపాదించనున్నట్టు సమాచారం. అభిజిత్ లగ్నం..రేవతి నక్షత్రం విజయ ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశలో ఈసారి బడ్జెట్కు రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రేవతి నక్షత్ర అభిజిత్ లగ్నం సమయంలో అసెంబ్లీ ముందుంచనున్నారు. దీనికి ముందు ఉదయం ప్రజాభవన్లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి.. మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 9:30 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అదే సమయంలో శాసనమండలిలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి సాయం పెంపుఈసారి బడ్జెట్లో ఎప్పటిలాగే సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు యంగ్ ఇండియా స్కూల్స్ వరకు అన్నిటి బడ్జెట్ రూ.లక్ష కోట్లు దాటనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, సన్న బియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అన్ని పథకాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. అదే సమయంలో చేయూత పింఛన్లు రూ.500 చొప్పున పెంపు, కల్యాణలక్ష్మికి రూ.50 వేల అదనపు లబ్ధి ప్రతిపాదనలు చేసే అవకాశాలున్నాయి. వీటికి తోడు మరో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటిస్తారని సమాచారం. రాష్ట్రంలోని దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రకటిస్తారని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, యంగ్ ఇండియా కిట్స్, పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, వృద్ధ అర్చకులకు పింఛన్లకు తోడు ఎన్నికల హామీలో భాగంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు అందించే కార్యక్రమానికి కూడా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. -
ఈపీఎస్ పెన్షన్ వెయ్యి రూపాయలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్)–1995 కింద ఇస్తున్న కనీస నెలవారీ పింఛను రూ.1,000ను నేటి అవసరాలకు అను గుణంగా తక్షణమే పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వం హయాంలో గత 12 ఏళ్లలో అనేక సామాజిక భద్రతా పథకాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవు తున్నాయని ఆరోపించింది.ఈపీఎస్–1995 కింద ఇస్తున్న రూ.1,000 నెలవారీ పింఛను నేటి పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక స్పష్టంగా తెలిపిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ బుధవారం ‘ఎక్స్’లో తెలిపారు. జీవనోపాధికి, గౌరవప్రదమైన జీవన స్థాయికి తగ్గట్టుగా పింఛను మొత్తాన్ని, నెలకు కనీసం రూ.7,500 వరకు పెంచాలని స్వయానా బీజేపీ ఎంపీ సారథ్యంలోని కార్మిక, వస్త్ర, నైపుణ్యాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీయే ఈ నివేదిక ఇచ్చిందని తెలిపారు. 1995 సంవత్సరంతో పోలిస్తే నేడు జీవన వ్యయం అనేక రెట్లుగా పెరిగిందని, పింఛను మాత్రం రూ. వెయ్యిగానే కొనసాగుతోందని పేర్కొన్నారు.‘ప్రభుత్వ వైఫల్యంతో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. వైద్యచికిత్సల ఖర్చులు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతు న్నాయి. ఇప్పుడు కూడా నెలకు ఈపీఎఫ్ పింఛను వేయి ఇవ్వడమంటే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకున్నట్లు అగుపి స్తోంది. అత్యంత నిస్సహాయులైన వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన పెన్షనర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. -
కాంగ్రెస్తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు. తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
పొత్తుల కుమ్ములాట.. అభ్యర్థుల వేట!
బంగాళాఖాతం తీరంలో ఉన్న పుదుచ్చేరిలో రాజకీయ వేడి పారాకాష్టకు చేరింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్కు గడువు సమీపిస్తున్నా ఇక్కడ ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు ఇండియా కూటమిలో మిత్ర భేదాలు రచ్చకెక్కుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైనా అభ్యర్థులెవరో తేల్చుకోలేని అయోమయంలో పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.ఇండియా కూటమిలో ఇలా..డీఎంకే, కాంగ్రెస్ మధ్య సాగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. స్థానిక అభ్యర్థులను పొత్తు విషయం అడిగితే ‘అధిష్టానంతో మాట్లాడి చెబుతాం’ అనే సమాధానాలతోనే ముగిస్తున్నారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి 18 నుంచి 20 సీట్లలో తామే పోటీ చేస్తామని డీఎంకే పట్టుబడుతోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి మిత్రపక్షాలకు 4 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.కాంగ్రెస్ వాదనతమిళనాడులో డీఎంకే పెద్దన్న పాత్ర పోషించినట్లే పుదుచ్చేరిలో తమకే అగ్రతాంబూలం దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ తన పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. డీఎంకే దారికి రాకపోతే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కజగం (టీవీకే) వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామనే సంకేతాలను పంపడం గమనార్హం.ఎన్డీఏలో స్థానాల కోసం ఘర్షణఅధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం (బీజేపీకి 14, ఏఐఎన్ఆర్సీకి 16) పూర్తయినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అసలు చిక్కులు మొదలయ్యాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ ఆధీనంలో ఉన్న స్థానాలను బీజేపీ కోరుతుండటంతో పేచీ మొదలైంది. కొన్నిచోట్ల పొత్తు తేలకముందే ఆశావహులు తమకు కేటాయించని స్థానాల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది కూటమిలో అంతర్గత గందరగోళానికి దారితీస్తోంది. రంగస్వామికి ఉన్న పీపుల్స్ సీఎం ఇమేజ్తో పాటు కేంద్రంలోని బీజేపీ బలాన్ని వాడుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది.గెలుపు గుర్రాలను మార్చే మార్చే ఇతర శక్తులుపుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి మూడో పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళగ వెట్టి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ పార్టీ బహిరంగ సభలకు యువత భారీగా తరలివస్తుండటం ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టిస్తోంది. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఇప్పటికే 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతోంది.సంక్షిప్త విశ్లేషణ.. 2021 ఫలితాలు (మొత్తం 30 సీట్లు)కూటమి/పార్టీ గెలిచిన స్థానాలుఏఐఎన్ఆర్సీ 10బీజేపీ 06 డీఎంకే 06కాంగ్రెస్ 02ఇతరులు/స్వతంత్రులు 06నామినేషన్ల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మరోసారి మంత్రిపదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘అధికారం శాశ్వతం కాదు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. నేను కూడా చాలా ఓపికతో ఉన్నాను. వివిధ కారణాలతో అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది’ అని ఆయన అన్నారు." -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్గా, సీఎంగా విజయన్కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్కు బిగ్ షాక్
గువాహటి: అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో విపక్ష కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ మంగళవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపారు.ఈ సందర్భంగా లేఖలో..‘తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నా’ అని ప్రద్యుత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ..‘ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియా ద్వారా ప్రద్యుత్ను రాజకీయంగా మభ్యపెట్టారు. అదీ కాకుండా ఆయనకు కుటుంబ విబేధాలు ఉన్నాయి’ అని అన్నారు. మరోవైపు ప్రద్యుత్ కుమారుడు ప్రతీక్ ఏప్రిల్ 9న జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మార్గేరీటీ స్థానం కాంగ్రెస్ తరఫున పోటీపడుతున్నారు. కాగా, ఎంపీ ప్రద్యుత్ బోర్దోలీ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఎమ్మెల్యేలను కొనేసి గెల్చారు
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో అధికార పక్షాలు గెలుపే లక్ష్యంగా తమ చట్టసభల సభ్యులను కొనేశాయని, క్రాస్–ఓటింగ్కు పాల్పడ్డాయని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బేరసారాలు జరిగాయన్న ప్రాథమిక సమాచారంతో ఒడిశాలో ముగ్గురు సభ్యులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటువేసింది. హరియాణాలోనూ కఠిన చర్యలు తప్పవని పార్టీ హెచ్చరించింది. రాజ్యసభలో 37 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గతంలోనే 26 చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. దాంతో మిగిలిన 11 స్థానాలకే బిహార్, ఒడిశా, హరియాణాల్లో ఎన్నికలు జరపగా తొమ్మిది చోట్ల ఎన్డీఏ అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్, బీజేడీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. మొత్తంగా చూస్తే 37 స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 22 చోట్ల విజయం సాధించింది.రహస్య ఓటింగ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోమవారం హరియాణాలో రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు సోమవారం ఆగిపోగా మంగళవారం ఆరంభించారు. బీజేపీ తరఫున సంజయ్ భాటియా, కాంగ్రెస్ తరఫున కరమ్వీర్ సింగ్ బౌధ్ విజయం సాధించారు. వాస్తవ మెజారిటీ ప్రకారం బౌధ్ గెలుపు నల్లేరుపై నడకే. కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా అత్యంత స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మా ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీస్లు పంపబోతున్నామని హరియాణా కాంగ్రెస్ ఇన్చార్జ్ బీకే హరిప్రసాద్ తెలిపారు.‘‘ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్ను ఎలాగైనా గెలిపించాలని ఎన్డీఏ కూటమి కుట్ర పన్నింది. అయినాసరే మా అభ్యర్థి బౌధ్ గెలిచారు. అగి్నపరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది. ప్రజాస్వామ్యమే గెలిచింది. ఓటు చోరీ ఓడిపోయింది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారు. వారిలో నలుగురి ఓట్లు చెల్లలేదు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది’’అని హరియాణా శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్ సింగ్ హూడా అన్నారు. షోకాజ్ నోటీస్లు జారీచేస్తాం.. మరోవైపు ఒడిశాలో స్వతంత్ర అభ్యరి్థ, బీజేపీ మద్దతున్న దిలీప్ రాయ్ను గెలిపించేందుకు ప్రయత్నించిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఒడిశా చీఫ్ భక్త చరణ్ దాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సనఖేముండి ఎమ్మెల్యే రమేశ్ చంద్ర జెనా, మోహన నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరథి గోమంగో, బారాబటి–కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఒడిశా అసెంబ్లీ మహిళా స్పీకర్ సురమా పథేకు కాంగ్రెస్ పక్షనేత రామచంద్ర కదమ్ మంగళవారం లేఖ రాశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది.‘‘తమ సభ్యులకు స్పష్టంగా విప్జారీచేయడం కూడా కాంగ్రెస్కు తెలీదు. ప్రామాణిక పద్ధతిలో మూడు లైన్లలో విప్ను జారీచేయాలి. కానీ రాహుల్గాంధీ కాంబోడియాలో, తేజస్వీ యాదవ్ యూరప్లో విహారయాత్రలో బిజీగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర నేతలేమో అంతకన్నా బిజీగాఉన్నారు. ఇక ఎమ్మెల్యేలకు కఠిన విప్ జారీచేసేదెవరు?. అంతా అయిపోయాక వాళ్లకెందుక ఓటేశారు? అని షోకాజ్ నోటీస్లు జారీచేయడంలో ప్రయోజనం ఏముంటుంది?’’అని బిహార్లో పశి్చమచంపారన్ బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. -
డ్రగ్స్ టెస్ట్కు సీఎం వస్తారు... మీ నేతలను తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చాక్లెట్ల రూపంలో కొకైన్ ఎక్కడపడితే అక్కడ దొరికిందని ఆరోపించారు. డ్రగ్స్తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేశారని, చిన్నపిల్లలు కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని, తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకునేందుకు ఎంతో ఆందోళన చెందారన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో కృతజ్ఞత తీర్మానాన్ని మహేశ్ గౌడ్ ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు అద్దంకి దయాకర్ ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తిస్థాయిలో అమలయ్యాయని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మరో మూడేళ్ల సమయం ఉందని, ఈ లోపు ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు తగ్గకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముహూర్తం ఖరారు చేస్తా.. ఇటీవల మొయినాబాద్ ఫామ్హౌస్లో పరిస్థితి చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా చట్టసభలకు ఎన్నికైన వాళ్లే మాదకద్రవ్యాలు వాడుతూ బహిరంగంగా దొరకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా డ్రగ్స్ తీసుకోవడంతో సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఇంత ఘోరం జరిగినా ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు కలగజేసుకునే ప్రయత్నం చేయగా, మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ను, యువనేత కేటీఆర్ను అసెంబ్లీకి తీసుకొచ్చి డ్రగ్స్ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. రేపే ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒప్పించి పరీక్ష చేయిస్తామన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ బీఫామ్పై పోటీ చేసిన వాళ్లందరికీ డ్రగ్స్ టెస్టు చేయించాలని, కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఈ పరీక్షలు చేయించుకుంటారని సవాలు విసిరారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారని, అందుకే రేవంత్రెడ్డి డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చివేశారని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేశారు: మధుసూదనాచారి అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రెండేళ్లు గడిచినా హామీల అమలును దాటవేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ కామారెడ్డి డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన హామీలు ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్వయం ఉపాధి రుణాలు అంటూ గతేడాది చేసిన ఆర్భాటం ఇప్పుడు జాడలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఏవర్గం కూడా సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్డ్యామ్ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం
-
కూలేశ్వరం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
-
10 ఏళ్లు మినిస్టర్ చేశావ్.. అసెంబ్లీలో KTR సెటైర్లకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
-
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ.. కేటీఆర్ Vs కాంగ్రెస్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్..కేటీఆర్ కామెంట్స్..మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు.మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.రూ.16వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయవచ్చు.ఎరువులు అడిగితే రైతులపై దాడులు చేస్తున్నారు.షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్లో ఇస్తామంటున్నారు.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఈసారైనా బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు చేయాలి.దళిత బంధును బొందపెట్టారు.. ఇప్పటికైనా ఇవ్వాలి.హిల్ట్ పాలసీలో పెద్దపెద్ద కుంభకోణాలు జరగబోతున్నాయి.20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్నారు? ఏమైంది?.రాజకీయం, అధికారం శాశ్వతం కాదు.. కానీ, తెలంగాణ శాశ్వతం.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే.మా మీద కోసం రైతుల మీద చూపెట్టకండి.మేము ఏ ప్రాజెక్ట్ కట్టినా దేవుళ్ల పేర్లు పెట్టాం.మీలా పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదు.సింగరేణిలో పెద్దపెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి.నైనీ టెండర్ రద్దు చేశారు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయాలి.మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిద్దాం.బస్తీ దవాఖానాలు మూతపడుతున్నాయి.బస్తీ దవాఖానాల్లో మందులు లేవు.మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు. కేటీఆర్ కామెంట్స్..మహిళలకు న్యాయం చేస్తున్నాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ ఇంగ్లాండ్ ఇండియా వదిలి వెళ్లారు.మిస్ ఇంగ్లాండ్ పట్ల అసభ్య ప్రవర్తన చేసి తెలంగాణ పరువు అంతర్జాతీయంగా చేశారు.మిస్ ఇంగ్లాండ్ ఘటనపై సిట్ వేయాలి. మంత్రి సీతక్క కామెంట్స్..కేటీఆర్కు మహిళలు అంటే అంత కోపం ఎందుకు?ఉచిత బస్సు ఇచ్చినా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశారు.మేడారంలో మహిళలు 9 కోట్లు సంపాదించారు.పదేళ్లు మహిళలకు ఎందుకు న్యాయం చేయలేదు.పథకాలు ఎందుకు ఇవ్వలేదు.మహిళల అభయహస్తం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది.మహిళలను ఎదుగనివ్వండి.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..మాది జాతీయ పార్టీ.పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్లింది.రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఢిల్లీకి వెళ్తాం.సోనియా గాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పాటు జరిగింది.తెలంగాణ ఏర్పాటులో అందరిని ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది.సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎక్కడ ఉండేది.ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.బీఆర్ఎస్ పాలనను ముందుకు తీసుకెళ్లడం తప్పా?మహిళలు కోటీశ్వరులు కావడం తప్పా?తెలంగాణ ప్రజల విశ్వాసాలపై వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కేటీఆర్ విమర్శలు..గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ, డిక్లరేషన్ పదం రాకుండా చూసుకున్నారురెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో డైవర్షన్లు, కమీషన్లు మాత్రమే ఉన్నాయి.మొన్న ఇండియా టీ-20 గెలిచింది కానీ కాంగ్రెస్ పోటీలో ఉంటే 420 గెలుస్తారు.కాంగ్రెస్ పాలన అంటే పని చారానా.. ప్రచారం బారానా..గ్రాఫిక్స్ మాయాజాలంలో కాంగ్రెస్ కనికట్టు చేస్తోంది.కాంగ్రెస్ సినిమా బయట అభయహస్తం.. లోపల చూస్తే భస్మాసుర హస్తం!మీరు ఢిల్లీకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు.ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.కానీ, నిధులు ఇచ్చి వస్తున్నారు.మొన్న రూ. వెయ్యి కోట్లు ఇస్తాం అన్నారు.కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలోనూ విశ్వసనీయత లేదు. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత మందికి వచ్చాయి??మేము 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు కట్టిస్తున్నాం.వీటి కోసం రూ.22500 కోట్లు ఖర్చు చేశాం. హామీల అమలుపై కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు.కోటీ ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం.రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ శాసన సభలో గందరగోళంకేటీఆర్ కామెంట్స్..అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు కానందుకు ధన్యవాదాలు చెప్పాలా?గ్యారెంటీ కార్డు పేరుతో మోసం చేస్తే ధన్యవాదాలు చెప్పాలా?ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న కేటీఆర్ స్పీచ్ను అడ్డుకున్న మంత్రి కోమటిరెడ్డికోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్కేటీఆర్ మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పాలి.మీలాగా దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పలేదు.కేటీఆర్ ఓపికతో వినాలి.బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాంఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి.కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.తలసాని కామెంట్స్..సభలో సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకర్ప్రతీసారి ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదు. రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలురైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలువినతిపత్రాలు లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుఅసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్న పోలీసులుతామే అసెంబ్లీలోనికి దరఖాస్తులు పంపిస్తామని తెలిపిన పోలీసులుపోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 20న అసెంబ్లీలో బడ్జెట్..గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చఇవాళ, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చబీఆర్ఎస్ తరపున శాసనసభలో మాట్లాడనున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డిబీఆర్ఎస్ తరపున మండలిలో మాట్లాడనున్న మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంరెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుఅసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చతీర్మానాన్ని ప్రతిపాదించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్తీర్మానాన్ని బలపరచనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సభ ముందుకు ఇన్ఫర్మేషన్ కమిషన్ పెండింగ్ నివేదికలుబీఏసీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్న సీఎం రేవంత్రెడ్డిసభ టేబుల్పై తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ వార్షిక నివేదికలుబీజేపీ వాయిదా తీర్మానంశాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానంఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలని వాయిదా తీర్మానంబీఆర్ఎస్, సీపీఐ వాయిదా తీర్మానంఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపు జాప్యంపై వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్పై అసెంబ్లీలో చర్చించాలని సీపీఐ వాయిదా తీర్మానం -
అధికారం పోతే.. అందరికీ పోతుంది
సాక్షి, హైదరాబాద్: ‘అధికారంలో ఉంటేనే అందరికీ గౌరవం ఉంటుంది. అధికారం పోతే ఏ ఒక్కరిదో పోదు. అందరికీ పోతుంది. నన్ను అనలేదు కదా అని ఏమీ మాట్లాడకుండా ఉంటే అందరం నష్టపోతాం. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు. వ్యవస్థ మొత్తం డ్యామేజీ అవుతుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ లైన్లోనే అందరూ స్పందించాలి. ఇప్పుడు మనం వేసుకునే రోడ్మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్లపాటు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు చెప్పుకున్నామని, ఇప్పుడు ఆ టైం అయిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పుకునే సమయం వచ్చిందని, చేసింది చెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సోమవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశ మందిరంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వ పరంగా సమష్టిగా ముందుకెళ్లాల్సిన తీరును వారికి వివరిస్తూనే వ్యక్తిగత వ్యవహారశైలిపైనా ఆయన క్లాస్ తీసుకున్నారు. జీవిత లక్ష్యం వృధా చేసుకోవద్దు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు గురించి రేవంత్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా మీరు చట్టసభలకు వచ్చారు. కానీ ఆ పదవికి న్యాయం చేయనప్పుడు ఎందుకు? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీనియర్లు ఉండేవారు. నాకు మాట్లాడటానికి మైక్ ఇచ్చేవారు కాదు. అయినా కొట్లాడి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు సభకు కూడా రావడం లేదు. వచి్చనా సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే ఎందుకు కావాలి? కొందరు సీఎల్పీ సమావేశానికి కూడా రాలేదు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా? కష్టపడి సాధించుకున్న ఎమ్మెల్యే పదవికి అన్యాయం చేయొద్దు. సభకు రాకపోయినా, ఏం చేసినా ఏం కాదులే అనుకోవద్దు. ఇప్పటికిప్పుడే ఏమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. బీఫారం ఇచ్చేటప్పుడు అన్ని లెక్కలూ చూస్తారు’అని చెప్పారు. సమర్థవంతంగా తిప్పికొట్టాలి అసెంబ్లీ, మండలిలో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించా రు. బాగా చదువుకున్న మహిళా ఎమ్మెల్యేలున్నారని, వారంతా సభకు హాజరు కావడమే కాకుండా చర్చల్లో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను గవర్నర్ ప్రసంగంలో వివరించారని సీఎం చెప్పారు. ఈ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. మన భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించాలి. మూడో బడ్జెట్తోపాటు మిగిలిన సంవత్సరాల బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ప్రజారంజకంగా ఉండబోతున్నాయి. ఈ విషయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలి. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాల ను అధ్యయనం చేయాలి. అవసరమైతే చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకూ వెళ్లి రావాలి’అని దిశానిర్దేశం చేశారు. మంత్రులు సమయం ఇవ్వాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలుగా తాము మంత్రులు, అధికారులకు ఇచి్చన వినతులకు సరిగా స్పందన ఉండడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలకు మంత్రులతోపాటు సీఎం టైం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మంత్రులు తమను కలిసేందుకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వా లని సూచించారు. తాను కూడా ఇస్తానని చెప్పారు. ఏదో ఒక సమయం ఇందుకోసం ఫిక్స్ చేసుకోవాలని, ఎమ్మెల్యేలిచ్చే వినతిపత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తన దగ్గరకు వచి్చ న ఎమ్మెల్యేలే మళ్లీ వచ్చి కలుస్తున్నారని, అలా కలవడం ఎందుకని ప్రశ్నించారు. ప్యానెల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ బాగా హ్యాండిల్ చేస్తున్నారని కొనియాడారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్లు పట్టిందని, అంత కష్టపడితే లభించిన పదవికి అడ్లూరి లక్ష్మణ్తో సహా అందరు ఎమ్మెల్యేలు న్యాయం చేయాలని సూచించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీడియాతో చిట్చాట్లు చేయొద్దని, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడవద్దని చెప్పినట్టు తెలిసింది. విలేకరులు అడిగే ప్రశ్నలు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రేమతో కాదని, వార్తల కోసం మాత్రమే వారు ప్రశ్నలు అడుగుతారని చెప్పినట్లు సమాచారం. అబద్ధాలను తిప్పికొట్టండి: పీసీసీ చీఫ్ గత రెండేళ్లలో ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేశామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిప క్షాల అబద్ధపు ప్రచారాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని సీఎల్పీ అభినందించింది. -
జీవన్రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం
-
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై BJYM కార్యకర్తలు దాడి
-
చండూరులో తీవ్ర ఉద్రిక్తత కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ
-
తీవ్ర ఉత్కంఠ మధ్య రాజ్యసభ ఎన్నికలు
దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది.ఇప్పటికే 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బిహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, హరియాణా నుంచి 2 స్థానాలు ఉన్నాయి.ఏకగ్రీవంగా గెలిచిన 26 మందిలో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, క్రాస్ ఓటింగ్ భయంతో తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికలు జరున్నాయి.హరియాణాలో 2 స్థానాలకు ముగ్గురి పోటీహర్యానా అసెంబ్లీ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయం కోసం 31 ఓట్లు అవసరం. భారతీయ జనతా పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం ఖాయమైంది. 17 ఓట్లు మిగులుతాయి. అవి స్వతంత్ర అభ్యర్థి సతీశ్ నందాల్కు పడతాయి. ముగ్గురు స్వతంత్రులు తప్ప ఇనెలో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సంఖ్య 22 అవుతుంది. అంటే విజయవానడికి తొమ్మిది ఓట్లు తక్కువ అవుతాయి. కాంగ్రెస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐక్యంగా ఉంటే పార్టీ అభ్యర్థి కర్మవీర్ బౌద్ధకు 31 కంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా అభ్యర్థి ఓడిపోయారు. 2016, 2022లో ఇలా జరిగింది.బిహార్లో 4 స్థానాలకు ఓటింగ్బిహార్ అసెంబ్లీ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఎన్డీఏకు 202 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాఘట్బంధన్కు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎన్డీఏకు 4 స్థానాలు సులభంగా వస్తాయి. ఒక్కో స్థానానికి 41 ఓట్ల లెక్కలో నాలుగు స్థానాలు గెలవడానికి 164 మంది ఎమ్మెల్యేలు అవసరం. తర్వాత ఎన్డీఏ వద్ద 38 ఎమ్మెల్యేలు మిగులుతారు. 5వ స్థానానికి గెలవడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. ఒడిశాలో 4 స్థానాలకు 5 అభ్యర్థుల మధ్య పోటీఒడిశా అసెంబ్లీ 147 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ 4 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ 5 అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానానికి విజయం కోసం 30 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. భారతీయ జనతా పార్టీ రెండు అభ్యర్థులు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ విజయం ఖాయం. బీజేడీ వద్ద 48 ఓట్లు ఉన్నాయి. రెండు అభ్యర్థులు నిలబెట్టింది — సంత్రుప్త మిశ్రా, దత్తేశ్వర్ హోతా. మిశ్రా విజయం ఖాయం. చిక్కు నాలుగో స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దిలీప్ రాయ్కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ 14 ఎమ్మెల్యేలు, మాకపా ఒక ఎమ్మెల్యే హోతా వద్ద ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు.ముఖ్యాంశాలుబిహార్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు, ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు.హరియాణా, బిహార్, ఒడిశా నుంచి 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ భయం ఉంది.తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ ఒక ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తోంది. ఆయన కూడా ఇప్పటివరకు ఓటు వేయడానికి రాలేదు.బిహార్లో ఇప్పటివరకు ఎన్డీఏ తరఫున 201 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహాఘట్బంధన్ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికల్లో 70 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ కసౌలి నుంచి బయలుదేరి చండీగఢ్లో భూపేందర్ హుడ్డా ఇంటి వద్ద చేరారు. తర్వాత అందరూ కలిసి బస్సులో అసెంబ్లీకి వద్దకు చేరుకున్నారు. -
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అధికార పక్షంవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న కాలే యాదయ్యఅసెంబ్లీలో ఆసక్తికర పరిణామంఅసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామంBJLP చాంబర్ లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్అదే సమయంలో బయటికి వెళ్తూ గమనించిన కేటీఆర్సస్పెండ్ అయిన వ్యక్తి BJLPలోకి ఎలా అంటూ సెటైర్ వేసిన కేటీఆర్BJLP నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా అన్న కేటీఆర్మీరు కూడా BJLP చాంబర్లోకి రండి అంటూ ఆహ్వానించిన పాయల్ శంకర్నేను వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన కేటీఆర్ తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదాతెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్.వందేమాతరం గీతం అసెంబ్లీలో ప్రదర్శించినందుకు వాకౌట్ముగిసిన గవర్నర్ ప్రసంగం.. తెలంగాణ శాసనసభలో ముగిసిన గవర్నర్ స్పీచ్.గంట పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో సాగిన ప్రసంగం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం.రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది.క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు.రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం.2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా.జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం.హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.హైడ్రా ద్వారా 60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.23వ బయోఆసియా సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది.సేవారంగం 13.5 శాతం వృద్ధితో దోహదపడుతోంది.జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారింది.ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్య స్థానంగా కొనసాగుతోంది.ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది.వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించాం. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నిరసన.జూట్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ప్రసంగంలో పథకాల అమలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జూట్ అంటూ నిరసన.గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉభయ సభలను ఉద్దేశించి మొదలైన గవర్నర్ ప్రసంగంతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంతెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు.అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి.కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ.మధ్యాహ్నం రెండు గంటలకు బీఏసీ సమావేశం.పని దినాలు, అజెండాపై బీఏసీలో చర్చ. అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. గన్పార్క్కు బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలురైతులకు వెన్నుపోటు.. రాహుల్కు వెయ్యి కోట్లు అంటూ నినాదులురాహుల్ బందు కాదు.. రైతుబందు కావాలి అంటూ నినాదులుఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ప్లకార్డులతో నిరసనకాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు. అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు..తెలంగాణ శాసనసభలో మారిన పలువురు మంత్రుల చాంబర్లు.లాబీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు మంత్రుల చాంబర్లను షిఫ్ట్ చేసిన అధికారులు.మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్కు తరలింపు.ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి సీతక్క చాంబర్ మార్పు.సీతక్క చాంబర్ను మంత్రి తుమ్మలకు కేటాయింపు.సీతక్కకు సీపీఐ ఛాంబర్ పక్కన బ్యాక్ సైడ్ కేటాయింపు.చాంబర్ల మార్పు స్పీకర్ నిర్ణయం అంటున్న అసెంబ్లీ అధికారులు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..తెలంగాణ శాసనసభ నిబంధనలపై బులిటెన్ విడుదలఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభంఎమ్మెల్యేలు గేట్ నెం.2, గేట్ నెం.4 ద్వారా ప్రవేశంవాహనాలపై అసెంబ్లీ కార్ పాస్ తప్పనిసరిగేట్ నెం.1, 2, 4 వద్ద వాహనాల సెక్యూరిటీ చెకింగ్స్వయంగా నడిపే వాహనాలకు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతిడ్రైవర్తో వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ఎమ్మెల్యేలు ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధంఅసెంబ్లీ లోపల మొబైల్తో ఫొటోలు, వీడియోలు నిషేధంస్పీకర్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిషేధంఅసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, నిరసనలు పూర్తిగా నిషేధంసమావేశం జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వినియోగం నిషేధంటీ/లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వినియోగంఅసెంబ్లీ లాబీల్లో అధికారిక ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతిమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు లోపల లాబీల్లో ప్రవేశం లేదుమండలి చైర్మన్ కీలక ఆదేశాలుతెలంగాణ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో చైర్మన్ కీలక ఆదేశాలుఉదయం 11:45కి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 26వ సెషన్ ప్రారంభంకౌన్సిల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ నిషేధంఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం నిషేధంనినాదాలు, ప్రసంగాలు చేయడం నిషేధంప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధంఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదుచైర్మన్ అనుమతి లేకుండా మొబైల్, ల్యాప్ టాప్లలో వీడియోలు లేదా ఫొటోలు చూపరాదుకౌన్సిల్ ప్రాంగణంలో సభ్యులు సందర్శకులను తీసుకురావద్దని ఆదేశంకౌన్సిల్ లోపలికి సభ్యుల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదుసభ్యులు తమ సెక్యూరిటీ సిబ్బందిని బయటే ఉంచాలని సూచనకార్ పాస్ తప్పనిసరిగా వాహనం ముందు ప్రదర్శించాలిసభ్యుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్ ఏర్పాటుసభ్యుల పీఏలు తమ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి -
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఎర
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కర్నాటక నేతలు ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల చొప్పున ఇస్తామంటూ కొందరు ప్రయత్నించారని తెలిపారు.దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బిడది రిసార్టులో ఉంచిన తమ ఎమ్మెల్యేల వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి నగదు ఆఫర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డ్రగ్స్ టెస్టులు చేయించుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘మాదకద్రవ్యాలు మనుషులుని రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. రాజకీయంగా ఎంతటి వారైనా మాదక ద్రవ్యాల్ని వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నాను. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం మీ రాజకీయాల ప్రతిబింబం. నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అలాగే, ప్రతి డ్రగ్స్ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం’అని హెచ్చరించారు. Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usageI personally am strictly against drugs and usage of illicit substances. My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…— KTR (@KTRBRS) March 15, 2026హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో వీకెండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఏపీ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాం హౌస్ జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. -
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
-
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
TG: కాంగ్రెస్ నేత దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. గౌరారం వద్ద కాంగ్రెస్ నేత గోపిని దుండగులు కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వలేదు
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు. అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజుఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్విప్ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసేందుకే.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్లోనూ బీఆర్ఎస్ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. ముగిసిన అవగాహన కార్యక్రమం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. -
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టుఅధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలులోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇరాన్ యుద్ధం పై చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షంవిపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులోక్సభ మరోసారి వాయిదా..మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్సభ వాయిదా.స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.గల్ఫ్ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ వాయిదా. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటనపశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.రాజ్యసభలో జైశంకర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్.మంత్రి జైశంకర్ కామెంట్స్..మార్చి ఒకటో తేదీ సీసీఎస్ సమావేశం నిర్వహించాం.ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు.పెట్రోల్, గ్యాస్ ధరలపై దృష్టి సారించాం.ఇరాన్కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.ఇరాన్లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. గల్ఫ్లో చిక్కుకున్న వారిని భారత్ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది.ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.హింస దేనికీ పరిష్కారం కాదు.తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలిఇంధన భద్రతకు, కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నాంఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాంEAM Dr S Jaishankar makes a statement in the Rajya Sabha on the situation in West Asia, amid sloganeering by Opposition MPsEAM says," Our government had issued a statement on 20th February expressing deep concerns and urging all sides to exercise restraint. We continue to… pic.twitter.com/whk4pOE259— ANI (@ANI) March 9, 2026లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన.పార్లమెంట్ ఆవరణలో సస్పెండ అయిన ఎంపీల ఆందోళనలు.పార్లమెంట్లో ఇండియా బ్లాక్ ఎంపీల సమావేశం. After making obituary references, the Lok Sabha adjourned to meet again at 12 Noon today. pic.twitter.com/7Twxxz1HUP— ANI (@ANI) March 9, 2026 👉పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఅందుకే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కామెంట్స్..ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారుబీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారుస్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదురాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారుదేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారుమహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారుఅందుకే లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాముఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలినరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారుఅమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారుపార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారుమోదీ ఎందుకు ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలిలోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలిలోక్సభ స్పీకర్పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలిప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాముప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలిలోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుందిగ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.దీనిపై లోక్సభలో చర్చ చేపట్టాలి. పార్లమెంట్కు చేరుకున్న ప్రియాంక, రాహుల్పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. #WATCH | Delhi: On EAM Dr S Jaishankar to make a statement in Parliament today on the situation in West Asia, Congress MP Priyanka Gandhi Vadra says, "I am keen to hear what he will say." pic.twitter.com/gc26kjlKuJ— ANI (@ANI) March 9, 2026బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చనేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలుఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలునేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్సభతీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవిఅవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా తొలి విడత సమావేశాల్లో లోక్సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలుస్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలుతమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలుతప్పనిసరిగా లోక్సభకు హాజరుకావాలని ఆదేశం#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress President Mallikarjun Kharge, arrive at the ParliamentThe second phase of the budget session of Parliament will commence today and will continue till the 2nd of April pic.twitter.com/GFIWWyVSMG— ANI (@ANI) March 9, 2026 -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
రైతు భరోసా వస్తుందా.. రాదా?
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాసంగి సీజన్ ముగిసి నెలరోజులు దాటింది. మరో 10, 15 రోజుల్లో నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరి కోతలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుంది. గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. 5,16,327 ఎకరాల్లో యాసంగి సాగు..ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. రైతు భరోసా డబ్బులు వస్తే కొంత ఆసరాగా ఉండేది. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.5,65,803 మంది రైతులు..జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులు ఉన్నరు. ఎకరాలకు 6 వేల చొప్పున రూ.738.67 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.పెట్టుబడి సాయం ఇస్తే అప్పులు తీర్చుకుంటాంప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలి. యాసంగి సీజన్ సాగు కోసం పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాం. రైతు భరోసా నిధులు జమ చేస్తే అప్పులు తీర్చుకుంటాం. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి. – చిమట భిక్షమయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
నెరవేరిన సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్నేహితుడు వేం నరేందర్రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి అందజేశారు.సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాలా, జుల్పికర్ అలీ ఒక సెట్ నామిషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం వేం నరేందర్రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వచ్చిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్రెడ్డి, మహేశ్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
చిట్టక్క ఎంట్రీతో పరకాల పాలిటిక్స్కి కొత్త ట్విస్ట్..!
సాక్షి, వరంగల్: గీసుకొండ నుంచి పరకాల టార్గెట్గా ‘కొండా’ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గతంలోనే పరకాల నుంచి ఎమ్మెల్యే అవుతానని ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ (చిట్టక్క).. తాజాగా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సాక్షిగా తన తండ్రి మురళీధర్రావు దీవెనలు, గీసుకొండ మండల ప్రజల అండతో ఎమ్మెల్యే అవుతానని మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కాక రేపినట్లయ్యింది. ఆమె మాటలకు అనుకూలంగానే కొండా కుటుంబాన్ని గతంలో ఆశీర్వదించినట్లుగా భవిష్యత్లో కూడా ఆదరించాలని కొండా మురళి మాట్లాడడంతో పొలిటికల్ హీట్ పుట్టించినట్లయ్యింది. ఎవరు అడ్డొచ్చినా కొండా సుస్మిత అదరదు బెదరదని, ఇది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. తప్పకుండా పరకాల నుంచే తన కుటుంబం రేసులో ఉంటుందని ఆయన విస్పష్టంగా ప్రకటించడంతో మరోసారి పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వార్ తెరమీదకు వచ్చినట్లయ్యింది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ సుస్మితాపటేల్ బ్యానర్లు వెలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కొండా, రేవూరి వర్గాలతో కాంగ్రెస్ పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొండా చేసిన ఈ వ్యాఖ్యల మర్మం వెనుక రాజకీయ మతలబు దాగి ఉందని, వరంగల్ తూర్పులో కూడా కొండా వ్యతిరేక వర్గాలు ఉండడంతో అదే సిద్ధాంతాన్ని పరకాలలో ప్రయోగించి.. పార్టీలో తమ పట్టు నిలుపుకోవాలన్న ఎత్తుగడలో భాగమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుడు దసరా.. ఇప్పుడు హోలీ● 2024 మే 8న గీసుకొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఫోన్లో వాగ్వాదం సోషల్ మీడియాలో వైరలైంది. తన మనిషిని కాదని ఇతరులకు పదవుల్లో ఎలా ప్రాధాన్యమిచ్చారంటూ రేవూరిని ఆమె ప్రశ్నించారు. మా వల్లే మీరు గెలిచారు.. నియోజకవర్గంలోని సొంత మండలం గీసుకొండలో మేం చెప్పినట్లే నడవాలని అప్పట్లో ఫోన్లో మాట్లాడిన మాటలు ఆడియో లీక్ అవడం సంచలనంగా మారింది. అంతకుముందే తనకు తెలియకుండా పలు మండలాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై గీసుకొండ మండలంలోని కొండా వర్గానికి చెందిన ఒకరిపై పరకాలలో కేసు కూడా నమోదైంది. మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్యపై మంత్రి బాహాటంగానే అప్పుడు విమర్శలు గుప్పించారు.● 2024 అక్టోబర్ 13న దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని ఆయన వర్గీయులు దాన్ని ధ్వంసం చేశారు. ఈక్రమంలో కొండా వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్కు వచ్చిన మంత్రి కొండా సురేఖ సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొండా వర్గీయులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకొని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, స్థానికతకు సంబంధించిన విషయమన్న సంగతి తెలిసిందే.● 2026 మార్చి 3న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కుమార్తె, కొండా సుస్మితాపటేల్ మాట్లాడుతూ కొండా కుటుంబాన్ని గీసుకొండ ప్రజలు ఆదరించారని, భవిష్యత్లోనూ బాసటగా ఉండాలని సుస్మితాపటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలను ఇవ్వడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే ఉప్పునిప్పులా ఉంటున్న కొండా, రేవూరి వర్గాలు మరింత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచింది. కొండా వర్గం 7 స్థానాలు, రేవూరి వర్గం 9 స్థానాలు దక్కించుకుంది. ఇలా గీసుకొండ మండల కేంద్రంగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు తమ ప్రాబల్యాన్ని చూపుతుండడం గమనార్హం. -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.Phulo Devi Netam from Chhattisgarh.Karamvir Singh Boudh from Haryana.Anurag Sharma from Himachal Pradesh.M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026 -
పెద్దలు 'వేం' చేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో మల్లగుల్లాలు, సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి బరిలో నిలిచే ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీతోపాటు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వేం నరేందర్రెడ్డికి అవకాశం ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కిరాగానే, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు స్వయంగా వేం నరేందర్రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు అభినందనలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లను దాఖలు చేస్తారు. ఆ మూడు పేర్ల చుట్టే తిరిగిన చర్చ అభ్యర్థుల ఖరారుకు ముందు ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థి ఎంపికకు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఢిల్లీకి చేరుకున్నా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర కీలక నేతలు అందుబాటులో లేరు. దీంతో సీఎం వారితో జూమ్ యాప్ ద్వారా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వర్చువల్ మీటింగ్లో ప్రధానంగా మూడు పేర్ల చుట్టే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వేం నరేందర్రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, వినయ్కుమార్ పేర్లను అధిష్టానం తీవ్రంగా పరిశీలించింది. నెగ్గిన రేవంత్ పట్టు ! ఈ జూమ్ మీటింగ్లో అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వినయ్కుమార్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే వైఖరితో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పార్టీలో ఆయన సీనియారిటీని ఈ సందర్భంగా సీఎం వివరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం సీఎం పట్టుదలకే అధిష్టానం గౌరవం ఇచ్చింది. వేం నరేందర్రెడ్డి వైపే మొగ్గుచూపి, జాతీయ కోటాలో అభిషేక్ మను సింఘ్వీతో కలిపి ఆయన పేరును ఖరారు చేసింది. అభ్యర్థుల బయోడేటా: వేం నరేందర్రెడ్డి జననం: 1960 తల్లిదండ్రులు: వేం వెంకటమ్మ– చెన్న కృష్ణారెడ్డి విద్యార్హతలు: బీఏ కుటుంబ నేపథ్యం: భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు (కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్) రాజకీయ ప్రస్థానం: ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు మహబూబూబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ, పార్టీలో ట్రబుల్ షూటర్గా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అభిషేక్ మను సింఘ్వీ జననం: 24 ఫిబ్రవరి 1959 స్వస్థలం: జోధ్పూర్ (రాజస్తాన్) తల్లిదండ్రులు: లక్ష్మీమాల్ సింఘ్వీ, కమల్ సింఘ్వీ కుటుంబ నేపథ్యం: ఇద్దరు పిల్లలు విద్యార్హతలు: ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ, కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు. రాజకీయ ప్రస్థానం: గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అపార అనుభవం ఉంది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానం నుంచి 2024 ఆగస్టు 28న రాజ్యసభకు వెళ్లారు. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
డీఎంకే.. కాంగ్రెస్ మధ్య కుదిరిన పంచాయితీ
సాక్షి చెన్నై: తమిళనాడు కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. కాంగ్రెస్కు 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఇరుపార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. రెండు పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.గత కొంతకాలంగా తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కాంగ్రెస్కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని పట్టుబట్టింది. అయితే తాజాగా ఇరుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. తాజాగా మరో మూడుసీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెసుకు కేటాయించారు. ఆ రాష్ట్రంలో మెుత్తం 234 సీట్లున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలీం స్టార్ విజయ్ పార్టీ, దివంగత నేత మాజీ సీఎం జయలలిత మిత్రురాలు శశికళ నూతన పార్టీ పెట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సారి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
సేవాగ్రామ్కు వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 8 మంది డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ నుంచి ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందలేదు. వికారాబాద్లో 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో రెండు, మూడు రోజులు పాల్గొనలేదన్న కారణంతో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ముగ్గురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఈ సర్టిఫికెట్లను ఏఐసీసీ జారీ చేయలేదని సమాచారం. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన డీసీసీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, బీర్ల అయిలయ్య, మేడిపల్లి సత్యం, చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యేలు)తోపాటు వజ్రేశ్ యాదవ్ (మేడ్చల్) ఉన్నారు. పది రోజుల శిక్షణలో భాగంగా వీరు రెండు, మూడు రోజులు గైర్హాజరైన కారణంగానే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఎన్ని రోజులు గైర్హాజయ్యారో అన్ని రోజులపాటు మహారాష్ట్రలోని సేవాగ్రామ్కు వెళ్లి అక్కడ శిక్షణతోపాటు సర్టిఫికెట్లు తీసుకోవాలని ఏఐసీసీ నుంచి శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించిన ఇన్చార్జ్లు స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే శిక్షణకు వెళ్లలేదని, ఎమ్మెల్యేలుగా తమకుండే అనివార్య ప్రాధాన్యతలే ఇందుకు కారణమని, త్వరలోనే సేవాగ్రామ్కు వెళ్లి శిక్షణ తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. పలువురు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ సర్టిఫికెట్లు ఇవ్వని విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా ధ్రువీకరించారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని పనుల వల్ల శిక్షణకు రెండు రోజుల పాటు హాజరు కాని వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పారు. కనీస సహకారం లేదు : రాహుల్తో డీసీసీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా తమను నియమించారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ సహకారం అందించడం లేదని రాహుల్గాందీకి ఫిర్యాదు అందింది. సోమవారం వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఈ ఫిర్యాదును నేరుగా రాహుల్కు చెప్పడం గమనార్హం. ‘మంత్రులే జిల్లాల్లో పెత్తనం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించడం లేదు. ప్రభుత్వ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ వ్యవహారాల్లోనూ వారి ఇష్టారాజ్యమే నడుస్తోంది. కనీసం డీసీసీ అధ్యక్షులుగా ఎక్కడ ప్రెస్మీట్ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఆర్థికంగా సహకరించే వారు కూడా లేరు.’అని ఓ నేత అందరి సమక్షంలోనే రాహుల్కు చెప్పినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన రాహుల్ డీసీసీ అధ్యక్షులే చొచ్చుకుపోవాలని సూచించారు. ఎవరికీ భయపడొద్దని చెబుతూ పార్టీ బలోపేతానికి డీసీసీ అధ్యక్షులు ఏం చేయాలనుకున్నా చేయొచ్చని, ఈ క్రమంలో ఏ సమస్య వచి్చనా తన వద్దకే వస్తుందని, తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
రాజ్యసభ రేసులో 16 మంది
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని, మొత్తం 16 మంది ఆశిస్తున్నారని, సామాజిక వర్గాల వారీగా వారి జాబితాను హైకమాండ్ ఇచి్చనట్టు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. రాజ్యసభ అభ్యరి్థత్వాల గురించి రాహుల్గాంధీ వచ్చిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చినా, ఖరారు కాలేదని తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు ఒకవేళ ఢిల్లీ వెళ్లాల్సి వస్తే బుధవారం వెళతామని, లేదంటే అధిష్టానం పెద్దలతో ఫోన్లో మాట్లాడతామని వెల్లడించారు.మంగళవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి నలుగురు సమర్థవంతమైన బీసీ నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఉన్నారన్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల గురించి ఏఐసీసీ అన్ని అంశాలను బేరీజు వేస్తోందని, ముఖ్యంగా సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటోందని, సామాజిక కూర్పుతోనే అభ్యరి్థత్వాలు ఖరారయ్యే అవకాశముందని చెప్పారు. జస్టిస్. బి.సుదర్శన్రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. రెండింటి విధానాలూ ఒకటే మావోయిస్టు ఎజెండా, కాంగ్రెస్ విధానం ఒకటేనని, పేదల సంక్షేమం, దేశ అభివృద్ధే ధ్యేయమని మహేశ్గౌడ్ చెప్పారు. అయితే, వారు ఆయుధాలు పట్టుకున్నారని, తాము ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేస్తామని, ఇదే తేడా అని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని, మాజీ మావోయిస్టులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, తాము ఎవరినీ పారీ్టలోకి రావాలని అడగలేదని, మాజీ మావోయిస్టులు కూడా తమను సంప్రదించలేదన్నారు.జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు తీసుకుంటామని మహేశ్గౌడ్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాశామని, మార్కెట్ విలువ ఎంత ఉందో అంత చెల్లించి ఎకరం స్థలం తీసుకుంటామని, ఇందుకోసం ఏడు జిల్లాల్లో స్థలాల ఎంపిక కూడా జరిగిందన్నారు. బీఆర్ఎస్ తరహాలో పుక్కటికిమాత్రం ప్రభుత్వ స్థలాలు తీసుకోబోమని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి చెప్పారని, అలాంటి చోట్ల అందరు నేతలను పిలిపించి మాట్లాడుతామన్నారు. -
సీఎం రేవంత్కు కేందమంత్రి కిషన్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బడ్జెట్ సమావేశాల కంటే ముందే పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో జీతాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాల అమలు.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.సాస్కి (SASCI) పథకం కింద తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలను కేంద్రం అందించిందని కిషన్రెడ్డి వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ఖజానా ఖాళీ అని నెపం నెట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో ఆయన స్పష్టీకరించారు.‘‘2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో ద్వారా 6 ప్రధాన గ్యారంటీలతో పాటుగా 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఈ హామీలను నమ్మిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మీరు, ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు...రాష్ట్ర ఖజానా గురించి ఇలా మాట్లాడిన మీరే, ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా గాంధీ-రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరు మాట్లాడిన తీరును చూస్తుంటే, రాష్ట్ర ఖజానా నిల్ - కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అన్న విషయం అర్థమవుతోంది...2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తూ వస్తోంది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరెన్నో మూలధన పెట్టుబడులు మొదలైనవాటి రూపంలో గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది...అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50,000 కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40,000 కోట్లకు పైగా నిధులు, రూ.12,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లకు పైగా నిధులు, విద్య & క్రీడలకు రూ.21,000 కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9,000 కోట్ల ఆరోగ్య సంరక్షణ నిధులు మొదలైనవి ఉన్నాయి...అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించింది. మరో రూ.60,000 కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించి, తెలంగాణ రైతుల నుంచి పత్తిని సేకరించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను ఇవ్వడమే కాకుండా, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల ఋణాలను కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించింది.వీటికి అదనంగా రాష్ట్రాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మూలధన పెట్టుబడి నిధుల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల కాలపరిమితితో కూడిన వడ్డీ రహిత ఋణాలను అందించి ఆయా రాష్ట్రాల అభివృద్ధికి అదనపు సహకారాన్ని అందించాలనే ప్రధానమంత్రి మోదీ గారి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం “స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(SASCI)” పేరిట ఒక నూతన పథకాన్ని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన ఈ సౌలభ్యాన్ని సానుకూలంగా అందిపుచ్చుకున్న రాష్ట్రాలు 2020-21 నుండి నేటి వరకూ మూలధన పెట్టుబడితో కూడిన అనేక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఈ ఋణాల ద్వారా సమకూర్చుకున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది. SASCI పథకం కింద 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత ఋణాలను అందించడం జరిగింది. ఈ ఋణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూలధన పెట్టుబడితో కూడిన కొన్ని వందల ప్రాజెక్టులు అమలుకు నోచుకున్నాయి...మురుగునీటి నాళాలు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల విస్తరణ, బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఆసుపత్రులు, మెడికల్ & నర్సింగ్ కాలేజీలు, సంక్షేమ, మైనారిటీ పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి-మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్ లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఖర్చు చేశారు. ..ముఖ్యంగా MMTS ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ. 114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ. 315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ORR & RRR మధ్యన రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ. 200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత ఋణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ఋణాలకు వడ్డీలు చెల్లించడానికి ఋణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఋణాలు, రైతు భరోసా నిధులకు ఋణాలు, సంక్షేమ పథకాల అమలుకు ఋణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఋణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉంది. ..2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోంది...ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి, మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. -
గులాంగిరీ చేయొద్దు: రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులే భవిష్యత్తులో మంచి నాయకులు అవుతారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా అయ్యే అవకాశం కూడా వస్తుందని అన్నారు. డీసీసీల అధ్యక్షులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికీ గులాంగిరీ చేయొద్దని, పార్టీకి కళ్లు, చెవులు మీరేనని స్పష్టం చేశారు. సాధారణంగా (సింపుల్గా) ఉంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల్లో పార్టీని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేహీ అంటే పదవులు రావని, డీసీసీ అధ్యక్షుల కార్యాచరణ పదవులే పరమావధిగా ఉండకూడదని, ప్రజల కోణంలో ఉండాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కలిగించేలా పని చేయాలని, పార్టీకి ప్రజల్లో మంచి పేరు తేవాలని కోరారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరితా రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ 4 గంటల పాటు వారితో సమావేశమై పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. బీజేపీ ప్రజల గురించి ఆలోచించదు.. ‘పార్టీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే సుప్రీం. మీరంతా నా టీమ్. భవిష్యత్తు అంతా మనదే. పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకునే బాధ్యత మీది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు సర్వాధికారాలు ఇచ్చాం. మీరు పదవిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజలతో మమేకం కండి. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది మనమే. మన వల్లనే ప్రజలకు ఎక్కువ లబ్ది కలిగింది. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు. కానీ మనం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాం. అప్పుడే రాజకీయాలు చేస్తున్నాం. ప్రత్యర్థి పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎలా నష్టం కలిగించాలన్నదే బీజేపీ, మోదీ ఉద్దేశం. ఎలాగైనా అధికారంలో ఉండాలన్నదే వారి లక్ష్యం. వాళ్లు ఓట్ల కోసం స్వార్థంతో ఆలోచిస్తారే తప్ప ప్రజల గురించి ఆలోచించరు. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లేలా మనం పనిచేయాలి. మీరు నిలబడండి. పార్టీని నిలబెట్టండి..’ అని రాహుల్ విజ్ఞప్తి చేశారు. ఉన్నోడి వైపు బీజేపీ..లేనోడి వైపు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయం మన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది. జనాభా దామాషా ప్రకారం వనరుల పంపిణీ గురించి చర్చ చేసింది, దేశంలో కులగణన చర్చను ప్రారంభించింది మనమే. ఆ వర్గాల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంది. అందుకే తెలంగాణలో బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు, మైనార్టీల పక్షం వహిస్తున్నాం. దేశంలో రెండే వర్గాలున్నాయి. ఉన్నోడు.. లేనోడు. ఉన్నోడి వైపు బీజేపీ ఉంటే లేనోడి వైపు కాంగ్రెస్ ఉంది. బీజేపీది విభజన సిద్ధాంతం అయితే, మనది ఐక్యతా దృక్పథం. మనది అహింసా వాదం, వారిది మతం కోసం రాజకీయ వాదం. మనది గాంధేయవాదం, వారిది హింసా వాదం. మనం అన్ని మతాలు, కులాల గురించి, వారి సంక్షేమం గురించి ఆలోచిస్తాం. కానీ బీజేపీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయదు. శివుడిలా మనం సామాన్యంగా ఉండాలి హిందువులు ఆరాధించే శివుడు సామాన్యుడిలా కనిపిస్తాడు. ఆయన లాగానే మనమూ సామాన్యంగానే ఉండాలి. ఆయన అందరికీ తానున్నానని అభయహస్తం ఇస్తాడు. మన పార్టీ గుర్తు కూడా హస్తమే. మనం అందరినీ కలుపుకొని వెళ్లి ప్రజలకు తామున్నామనే అభయం ఇవ్వాలి. ప్రజలను మెప్పించి, వారి సమ్మతితోనే అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచన. అదే మన సిద్ధాంతం. పార్టీలో మహిళలను గౌరవించాలి. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య వాక్కు. వీటితోనే మనం ప్రజల్లోకి వెళ్ళాలి. బీజేపీ ద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ ఆగడాలను అడ్డుకుని దేశాన్ని రక్షించాలి..’ అని రాహుల్ చెప్పారు. ట్రేడ్ డీల్ పెద్ద కుట్ర ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. మోదీ అమెరికాకు లొంగిపోయేందుకు ప్రధాన కారణం ట్రేడ్ డీల్. ఇదో పెద్ద కుట్ర. ఈ కుట్రలో మోదీ అనేక తప్పులు చేశారు. అందుకే దేశాన్ని దారాధత్తం చేసి అమెరికా ముందు మోకరిల్లే పరిస్థితి ఏర్పడింది. కోట్లాది మంది రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసమే పనిచేయడం వెనుక కూడా కుట్ర ఉంది. మోదీ విధానాలతో రూ. 9 లక్షల కోట్ల విలువైన నష్టం దేశ రైతులకు జరుగుతోంది. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు వివరించండి. రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ఫుల్ లీడర్. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ముందుకు తీసుకెళుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ముఖ్యం. పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అందరూ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించండి..’ అంటూ రాహుల్ దిశానిర్దేశం చేశారు. శుభాకాంక్షలు..ఫొటోసెషన్ డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి ముందు వికారాబాద్లోని డిగ్రీ కళాశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. అందరూ బాగున్నారా అంటూ నేతలను పలకరించారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీ ఈ సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశానికి వెళ్లిన రాహుల్గాంధీ అక్కడ వారి కుటుంబసభ్యులను కూడా ఆత్మీయంగా పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆత్రం సుగుణ (ఆసిఫాబాద్), ఇ.వెంకట్రామిరెడ్డి (హనుమకొండ), సంజీవ్ ముదిరాజ్ (మహబూబ్నగర్).. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీ అధ్యక్షుల సమస్యలు, పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇరు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు బి. మహేశ్కుమార్గౌడ్, వైఎస్ షరి్మల, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సంగతన్ సృజన్ అభియాన్ ఇన్చార్జి చల్లా వంశీచందర్రెడ్డి, టీపీసీసీ శిక్షణ విభాగం చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం బ్యారేజీలు.. రూల్స్కు పాతరేసి ఇసుక మాఫియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా?. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు.నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్’ అంటూ హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్… pic.twitter.com/TvCYPMcn2M— KTR (@KTRBRS) March 2, 2026 -
సింఘ్వీ రెన్యువల్.. రెండో బెర్తు నేడు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు సోమవారం ఖరారయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి ఈసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఇద్దరికి అవకాశముండగా, అందులో ఒక స్థానం సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ కానుందని సమాచారం. రెండో బెర్తు కోసం తీవ్రమైన పోటీ ఉండగా, సీఎం రేవంత్రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్రెడ్డిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక సమీకరణల నేపథ్యంలో వేం లేదా వంశీలలో ఒకరికి ఈ సీటు దక్కుతుందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నలుగురిలో ఎవరో? రెండు రాజ్యసభ సీట్లల్లో ఒకటి సింఘ్వీకి ఖరాయిందనే చర్చ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే జరుగుతోంది. ఆయన నామినేషన్కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా రెండో స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎంతో పాటు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేశాయి. రెడ్డి సామాజిక వర్గానికి లేదంటే బీసీలకు ఇచ్చే కోణంలో పేర్లను పరిశీలించారు. మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే పీసీసీ నేతలతో చర్చ సందర్భంగా ఈసారి రాజ్యసభకు కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్. పి.వినయ్కుమార్ పేరును అధిష్టానం ప్రతిపాదించినట్టు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హన్మంతరావు కోరిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడింది. మరోవైపు ఈసారి ఓసీలకు అవకాశం ఇవ్వాలని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒకరిని రాజ్యసభకు పంపాలనే చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే వంశీచందర్రెడ్డి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. అయితే వంశీ.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని సీనియర్లను ఈసారి రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం మరికొంత కాలం ఆయన సేవలు అవసరమనే కోణంలో కూడా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చే పక్షంలో వేం నరేందర్రెడ్డిని ఎంపిక చేయాలని రేవంత్రెడ్డి కోరుతున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి పేరును సీఎం ప్రతిపాదించారు. కానీ సుదర్శన్రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్రెడ్డిని ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా ఈ నలుగురిలో ఒకరిని ఎంపిక చేస్తారా? అనూహ్యంగా ఇంకెవరికైనా అవకాశమిస్తారా? అనేది సోమవారం తేలుతుందని అంటున్నారు. డిప్యూటీ సీఎం వద్ద బ్రేక్ఫాస్ట్ భేటీ రాజ్యసభ రెండో బెర్తు ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిగింది. ఆదివారం ఉదయం ప్రజాభవన్లో జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ భేటీకి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్, కొండా సురేఖ, అజహరుద్దీన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా హాజరయ్యారు. అలాగైతే రెండు సీట్లూ రాష్ట్ర నేతలకే..! రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అభిషేక్ మను సింఘ్వీని తమిళనాడు నుంచి ఎంపిక చేసే అంశం కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రెండు స్థానాలూ రాష్ట్రానికి చెందిన నాయకులకే దక్కే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. తమిళనాడులో డీఎంకే మద్దతుతో ఒక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించిన పేరుపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సుముఖంగా లేరని, సింఘ్వీ విషయంలో సానుకూలంగా స్పందించారని అంటున్నారు. సింఘ్వీ తమిళనాడుకు వెళితే సమీకరణలు ఆసక్తికరంగా మారతాయని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. -
అది ముస్లిం లీగ్–మావోయిస్టు కాంగ్రెస్
జైపూర్/సనంద్: విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాల ఎదుట మనదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదని మండిపడ్డారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్సీ) నేడు ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందంటూ ధ్వజమెత్తారు. ముస్లిం లీగ్ వల్ల భారతదేశం ముక్కలైందని చెప్పారు. నేడు కాంగ్రెస్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. మావోయిస్టుల దారిలోనే నడుస్తూ దేశంపై దాడి చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్లోని అజీ్మర్లో పర్యటించారు. రూ.16,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా జరిగే హ్యూమన్ ప్యాపిలో మా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు మన దేశం గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం విదేశీయుల ఎదుట భారతదేశాన్ని కించపర్చడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఆ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే ఉందన్నారు. అది తట్టుకోలేక దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూ ప్రతీకా రం తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. దేశాన్ని కించపర్చడం, సైనిక దళాలను బలహీనపర్చడం కాంగ్రెస్కు అలవాటేనని పేర్కొన్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, పేపర్ లీక్ వార్తలు నిత్యం వచ్చేవని గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని, ప్రజలకు ఎనలేని మేలు చేస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేడు పేపర్ లీక్లు లేవని, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. నేడు తిరుప్పరకుండ్రంలో మోదీ పూజలు ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఆదివారం మదురై, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. తిరుప్పరకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలోని సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్వేర్ రంగంలో భారత్ తన సత్తాను ఇప్పటికే నిరూపించుకుందని ఆయన చెప్పారు. అలాగే హార్డ్వేర్ రంగంలోనూ శరవేగంగా దూసుకెళ్తోందని, ప్రత్యేక గుర్తింపును సాధిస్తోందని తెలిపారు. అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్లాంట్ను నిర్మించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య బలమైన మైత్రికి ఇదొక ఉదాహరణ అని వివరించారు. ఇది ఏటీఎంపీ(అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్. భారత్లో ఈ తరహా ప్లాంట్లలో ఇదే మొదటిది కావడం విశేషం. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వ్యాపార వృద్ధికి ఇక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయని సూచించారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. గత శతాబ్దాన్ని చమురు శాసించిందని, ఇప్పుటి శతాబ్దాన్ని మైక్రోచిప్ శాసించబోతోందని తేలి్చచెప్పారు. -
చేయూత కోసం చాన్నాళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ‘చేయూత’పింఛన్ల మంజూరు కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త పింఛన్ల దరఖాస్తునకు సంబంధించి 2022 ఆగస్టు నుంచే ఆసరా పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా వివిధ కేటగిరీల కింద కొత్త పింఛన్ల కోసం దాదాపు 19 లక్షల దాకా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. దాదాపు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం వివిధ కేటగిరీల వారు నిరీక్షిస్తున్నారు. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, నాలుగు లక్షల దాకా వితంతు, మూడులక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే 70 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న దరఖాస్తులన్నీ కలిపితే 19 లక్షలు ఉన్నట్టుగా సమాచారం. చేయూత ఇలా... చేయూత పథకం... వృద్ధులతోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కారి్మకులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు భరోసానిస్తోంది. ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్య పదేళ్ల కాలంలో పింఛన్ల కోసం రూ.5,558 కోట్లు ఖర్చుచేయగా... తెలంగాణ ఏర్పడ్డాక... 2014–23 ఏళ్ల మధ్య ఆసరా పథకం కింద రూ.61,526 కోట్లు వ్యయం చేశారు. ప్రస్తుతం వృద్ధాప్య ఇతర కేటగిరీల పింఛనుదారులకు నెలకు రూ.2,016 చెల్లిస్తుండగా, దివ్యాంగులకు రూ.4,016 అందజేస్తున్నారు. 2014 వరకు పింఛన్లు పొందే లబ్ధిదారులు 29,21,828 మంది ఉన్నారు. 2023 డిసెంబర్ నాటికి వివిధ కేటగిరీల ఆసరా పింఛ¯న్దారుల సంఖ్య 43,20,551కు పెరిగింది. వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాల వల్ల 3.05 లక్షల పింఛన్లను తొలగించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారు 41,02,818 ఉన్నట్టుగా తెలుస్తోంది. -
నీకు దమ్ముంటే.. రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్
-
TS: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
-
నా హత్యకు ప్రయత్నాలు.. మంత్రి వాకిటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నారాయణపేట : తెలంగాణలో మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు తన మీద వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వాకిటి శ్రీహరి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘దేవుడు మనకు మరణం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే చనిపోతాం. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. చావుకు నేను భయపడను. అవమానాలు పడినందుకే రాజకీయాల్లో వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పని చేసుకుంటూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడుపడుతున్నాను. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు నా మీద వేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్ మున్సిపల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.72 సంవత్సరాల్లు 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గానికి తెచ్చింది రూ.296 కోట్లు మాత్రమే. రెండేళ్లలో మాత్రం రూ. 1035 కోట్లు తెచ్చాను. ప్రశ్నించడం మంచిదే కానీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను అవమానించవద్దు. అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు, అయినా ముందుకు పోతున్నాం. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఈ ప్రాంతం అనేక రంగాల్లో ఆర్ధికంగా ఎదగలేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తాను. ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను’ అని అన్నారు. -
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు.


