breaking news
Congress Party
-
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం కోసం స్థలాలు మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించిన ఎజెండాను మంత్రివర్గం ఆమోదించింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కార్యాలయ భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు కోసం జారీ చేసిన జీవోకు అనుగుణంగా అప్పట్లో జిల్లా కాంగ్రెస్ పార్టీలు చేసిన దరఖాస్తుల మేరకు స్థలాలు కేటాయించడానికి మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.వరి బదులు రైతుల్ని ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా..వరి ధాన్యం సేకరణ అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. రికార్డు స్థాయిలో ఇప్పటికే రాష్ట్రంలో వరి దిగుబడి వస్తుండటం, ధాన్యం సేకరణ కూడా అదేస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో నిల్వలు పేరుకుపోయాయని, భవిష్యత్తులో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం.ప్రస్తావనకు రాని పరిషత్ ఎన్నికలు, రైతుభరోసా!ఈ మంత్రివర్గ సమావేశంలోనే పరిషత్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ అది జరగకపోవడంతో ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్టేనని, ఆ ఎన్నికలు కొంతకాలం వాయిదా పడ్డాయని తెలుస్తోంది. ఈ అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రాగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం పెండింగ్లో ఉన్నందున పార్లమెంటు సమావేశాల్లో మరోమారు ఈ అంశాన్ని లేవనెత్తాలని కేబినెట్ అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఖరీఫ్కు రైతు భరోసా అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాకపోవడం గమనార్హం. -
బీజేపీ కుట్రలను సాగనీయం
వికారాబాద్: రాజ్యాంగ మార్పు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనీయబోమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్గాంధీని ప్రధానిని చేసే వరకూ ఇరు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవివక్షను సమర్థవంతంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను సైతం వివక్షను ఎదుర్కొన్నానని తెలిపారు.దేశాన్ని అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం దీనికి ఆజ్యం పోస్తోందని తెలిపారు. రాహుల్గాంధీ ప్రధాని అయితే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కులవివక్ష కారణంగా బలవన్మరణానికి పాల్పడితే రాహుల్గాంధీ యూనివర్సిటీకి చేరుకొని, బాధితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమానంగా దూసుకుపోతోందన్నారు. కేవలం 50 రోజుల్లో కులగణన పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ సభ్యులు వంశీచంద్రెడ్డి, సచిన్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాహుల్.. తప్పుకో’.. ‘అయ్యర్’ వ్యాఖ్యల కలకలం
కోల్కతా: జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సారథ్య బాధ్యతలను ప్రాంతీయ పార్టీల నేతలకు అప్పగించాలని ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈ కూటమికి అసలైన నాయకురాలిగా అభివర్ణించిన అయ్యర్.. ఆమె లేకుంటే ‘ఇండియా’ కూటమి ఉనికికే ప్రమాదమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కోల్కతాలో మీడియాతో మాట్లాడిన మణిశంకర్ అయ్యర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నేతలకు పగ్గాలు అప్పగించి, రాహుల్ గాంధీ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గతంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అయ్యర్ బెంగాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల కోసమే మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ తెరచాటున బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించిన ఆయనకు పార్టీ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు స్పష్టం చేశారు.తృణమూల్ కాంగ్రెస్ ఈ పరిణామాలపై ఆచితూచి స్పందిస్తోంది. ప్రస్తుతం తమ దృష్టంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, నాలుగోసారి మమతా బెనర్జీ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో సైద్ధాంతిక పోరాటం చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న తరుణంలో అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు కూటమిలోనూ, ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అలజడి రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Mexico: డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం -
కామారెడ్డిలో అలర్ట్.. నేడు కలెక్టర్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతోంది. కామారెడ్డిలో బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.. నేడు కలెక్టర్ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తాను చేసిన ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. ఆయన సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ నేపథ్యంలో పక్కా సాక్ష్యాలతో కలెక్టర్ వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై స్పష్టత ఇవ్వాలని అధికారులను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో భూముల విషయంలో అవినీతి చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటన చేశారు. అయితే, రాజీనామాకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. నేతల సవాల్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు పార్టీల నేతలను కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. -
భారతీయులపై శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగ చీఫ్ శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. భారతీయులు కేవలం విదేశాలకు సేవ చేసే ముడి సరుకులుగా మారిపోయారని, స్వదేశం కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారుచేయలేదని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడారు.ఈ సందర్భంగా పిట్రోడా మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత్ యువతను ముడి సరకులుగా తయారుచేస్తోంది. దేశీయంగా నూతన ఆవిష్కరణల కోసం వాళ్లను భారత్ సద్వినియోగం చేసుకోవట్లేదు. మనం పెద్ద సంఖ్యలో యువ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్నాం కానీ అదంతా ముడిపదార్థంగా ఉండిపోతోంది. ఇది అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉపయోగపడుతోంది. మన యువతను వాళ్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లీగల్ సర్వీసులు, పరిశ్రమలు, తయారీరంగాలు, రవాణా వ్యవస్థల్లో విరివిగా వాడుకుంటున్నారు. భారత్ దేశీయంగా ఉపయోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను ఒక్కదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయింది’’ అని అన్నారు.పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘లష్కరే తోయిబా మాదిరిగా ‘లష్కరే కాంగ్రెస్’కు పిట్రోడా ప్రధాన సలహాదారుగా తయారయ్యారు. మరోసారి భారత్కు అబద్ధాల బురద పూయాలని చూస్తున్నారు. మొబైళ్ల కోసం కనీసం ఆపరేటింగ్ సిస్టమ్(ఓస్)ను భారతీయులు సృష్టించలేదని ఆయన అంటున్నాడు. ఆయన కనీసం బాస్ లైనక్స్, మాయా ఓఎస్, ప్రైమ్ ఓఎస్, భార్ ఓఎస్, ఇండస్ ఓఎస్, ఎన్ఎక్స్టీ క్వాంటమ్ ఓఎస్ పేర్లు వినలేదేమో. ఇవన్నీ భారతీయులు తయారుచేసిన ఓఎస్లే’’ అని అన్నారు. -
బీజేపీలో చేరిన భూపేన్ బోరా
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆదివారం అధికార బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకీయా ఆయనను పార్టీలోకి ఆహా్వనించారు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బోరాకు కీలక పదవి లభించింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కలి్పంచారు. కాంగ్రెస్ నేతలు సంజూ బోరా, రాజేశ్కుమార్ జోషీ, కంగన్ దాస్, గగన్చంద్ర బోరాతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భూపేన్ కుమార్ బోరా ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్కు రాజీనామా సమర్పించారు. రాహుల్ గాంధీ సహా పలు సీనియర్ నేతలు బోరాతో మాట్లాడి బుజ్జగించినా ఆయన మనసు మార్చుకోలేదు. అస్సాంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
సభకు వెళ్లే పెద్దలెవరు?
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రం నుంచి పెద్దల సభ కు ఎవరు వెళ్తారన్న చర్చ ఇప్పుడు అధికార కాంగ్రెస్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కేఆర్ సురేశ్రెడ్డి (బీఆర్ఎస్)ల పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలుండటంతో అధికార పార్టీ ఎవరిని రాజ్యసభకు పంపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ రెండింటిలో ఒకటి అధిష్టానం కోటాకు వెళ్లనుంది. తెలంగాణకు సంబంధించిన కీలక కేసుల్లో న్యాయవాదిగా ఉన్న ఆ పార్టీ నేత సింఘ్విని రాష్ట్రం నుంచి మరోమారు పెద్దల సభకు పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రెండో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్లోని పలువురు నేతలు ఎవరికి వారు రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఈసారి రెడ్డి, బీసీ, ఎస్టీ వర్గాల్లో ఒకరికి చాన్స్ ఉందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఎవరిని పంపుతారో?రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా ముగ్గురిని (రేణుకా చౌదరి, అనిల్కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వి) రాజ్యసభకు పంపింది. ఈ జాబితాలో రేణుకా చౌదరి, అనిల్కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వి ఉన్నారు. సింఘ్వికి రెన్యువల్ కావడం దాదాపు ఖరారు కాగా, రెండో సభ్యుడిగా రాష్ట్రం నుంచి రెడ్డి, బీసీ లేదంటే ఎస్టీ వర్గాల నేతల పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఓటర్లున్న లంబాడా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం, ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు చెందిన శంకర్నాయక్ను మాత్రమే ఎమ్మెల్సీగా నియమించడం, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో పెద్దగా ప్రాధాన్యం కల్పించని నేపథ్యంలో ఈసారి బంజారా నాయకుడిని పెద్దల సభకు పంపే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ చైర్మన్, ప్రస్తుత ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు అటు బంజారా సామాజిక వర్గంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ గుర్తింపు కూడా ఉంది. సీఎం రేవంత్ ఆశీస్సులు కూడా ఆయనకున్నాయని, రాహుల్ కోటరీలో తనకున్న సంబంధాలతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బెల్లయ్య ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. రేసులో పలువురుసామాజిక సమీకరణల్లో భాగంగా బీసీలకు మరో అవకాశం ఇచ్చే అంశాన్నీ కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న టీపీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని ఎజెండాగా చేసుకుని వెళుతున్న కాంగ్రెస్... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తోందని, ఇప్పటికే పలు కీలక స్థానాల్లో ఆయా వర్గాల నేతలను నియమించిన నేపథ్యంలో ఈసారి రాజ్యసభకు అగ్రవర్ణాలకు చెందిన నాయకులను పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రేవంత్కు అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారుడు వేం నరేందర్రెడ్డి పేరు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కూడా తన సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపుతారని ఆశిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిణామాల్లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత టి.జీవన్రెడ్డి పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నా ఆయన రాజకీయ అడుగు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఆయన్ను ఒప్పించేందుకు రేవంత్రెడ్డి యత్నిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక, మరో ట్విస్ట్ ఏమిటంటే.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మంత్రిగా అజహరుద్దీన్ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తోంది. మరో రెండు నెలల్లో ఆయన ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, ఆయనను ఎమ్మెల్సీగా నియమించే విషయం ఇప్పటివరకు ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే మహేశ్గౌడ్ను రాజ్యసభకు పంపి, ఆయన స్థానంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ను ఎంపిక చేసే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారు
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎనుముల రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని తాము అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్ విమర్శించారు.హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ‘ఎనుముల బ్రదర్స్’ పద్ధతి ప్రకారం లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం.. తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
ఉద్రిక్తంగా ‘చలో కామారెడ్డి’
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆదివారం తలపెట్టిన చలో కామారెడ్డి ఉద్రిక్తంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి నుంచే వారి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకత్వాన్ని కామారెడ్డికి వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రి నుంచి హౌస్ అరెస్టులో ఉన్న రాంచందర్రావు ఎలాగైనా సరే కామారెడ్డి పర్యటనకు వెళ్లాల్సిందేనంటూ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు రాంచందర్రావును అడ్డుకున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తార్నాకకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల తోపులాటల మధ్య రాంచందర్రావుతోపాటు మరికొందరిని అరెస్టు చేసి బొల్లారం, గాంధీనగర్ పోలీసు స్టేషన్లకు తరలించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను హౌస్ అరెస్టు చేశారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రౌడీ రాజ్యం: కేంద్రమంత్రి సంజయ్రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గం. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంకావాలి. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. బాన్సువాడలో 70 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యల్లేవు. గొంతునొక్కే కుట్ర: ఏలేటి మహేశ్వర్రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రను చేస్తోంది. నియంతృత్వంగా వ్యవహరించడంలో బీఆర్ఎస్ సర్కారును తలపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది. నిర్బంధ పాలన: ఎంపీ డీకే అరుణరాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిర్బంధ పాలన చేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు వెళ్లడం నేరమా? బీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. అక్రమ అరెస్టులు చేసి, నిర్బంధించడం హేయమైన చర్య. కేసీఆర్ ప్రభుత్వం తరహాలోనే..: ఎంపీ ఈటలరాంచందర్రావు అరెస్ట్ అప్రజాస్వామికం. కేసీఆర్ ప్రభుత్వంలో హౌస్ అరెస్టుల తీరు ఇప్పుడు పునరావృతమైనట్లు కనిపిస్తోంది. నాడు కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయగా.. నేడు రేవంత్రెడ్డి అదే పాటిస్తున్నారు. అధికార పార్టీ నేతలే గూండాయిజం చేస్తున్నారు.ఎమర్జెన్సీని గుర్తు చేశారు: రాంచందర్రావుఅరెస్ట్కు ముందు రాంచందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాం«ధీ హయాంలో విపక్ష నేతలను ఇష్టానుసారంగా అరెస్టు చేసి గొంతు నొక్కిన 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుచేసిందని మండిపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల అనంతరం ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేశారని దుయ్యబట్టారు.ప్రజాస్వామ్యం ఖూనీ: జి.కిషన్రెడ్డిబీజేపీ నేతల హౌస్ అరెస్టు కక్షసాధింపే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఖూనీ చేస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దౌర్భాగ్యకరం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ నాయకులు కారుతో గుద్ది ధ్వంసం చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటోంది. -
అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?
మీరట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. సొంత దేశాన్ని కించపరుస్తారా? ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయమా? కాంగ్రెస్ తీరుతో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి. మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఢిల్లీ–మీరట్ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్ కాలేఖాన్, న్యూ అశోక్నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి శతాబ్దినగర్ స్టేషన్ దాకా మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్ సౌత్ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. -
కాంగ్రెస్ ‘నగ్న’ రాజకీయాలు చేయాల్సిన పనేంటి? ప్రధాని మోదీ
లక్నో: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ నగ్న రాజకీయాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉందనే విషయం దేశ ప్రజలకు తెలుసు. మరీ దుస్తులు తీసివేయాల్సిన అవసరం ఏముంది?అని ప్రశ్నించారు.ఆదివారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మేట్రో సేవల్ని ప్రారంభించారు. అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో భారత్-ఆమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారత యువజన కాంగ్రెస్ కార్యకర్తలు (ఐవైసీ) చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనపై మీరట్ సభలో మోదీ ప్రస్తావించారు. ‘ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ మురికి, నగ్న రాజకీయాలు చేసింది. సైద్ధాంతికంగా దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్. దేశంలోని పురాతన పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన పనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ తన సొంత దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉంది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు దేశం విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ దేశంలో జరగడం మనం ఇప్పుడే చూశాము. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. దేశం కోసం నిర్వహించిన ప్రపంచ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, నగ్న రాజకీయాలకు వేదికగా మార్చింది. కాంగ్రెస్ నాయకులు నన్ను ద్వేషిస్తారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో బీజేపీ నాయకులు ఎవరూ అక్కడ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం నిర్వహిస్తున్న కార్యక్రమం. కానీ ఆ రోజు కాంగ్రెస్ మర్యాదను ఉల్లంఘించింది. కాంగ్రెస్ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది’అని వ్యాఖ్యానించారు. #WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "... The Congress turned a global event for India into a platform for its dirty and naked politics. Congress leaders reached the venue naked in front of the foreign guests. I ask the Congress people, the country… https://t.co/fa5yKag8oq pic.twitter.com/81zAr1Qsar— ANI (@ANI) February 22, 2026 -
రైతు భరోసా ఏదీ?
మహబూబ్నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించారు. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్లకు అనుగుణంగా సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గత యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేఏడాది వానాకాలం సీజన్లో రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు, 5–6 ఎకరాల చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది.● రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్లకు కాకుండా, ఒక్క సీజన్కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.● పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం మరోసారి చర్చనీయాంశమైంది. 2025 వానాకాలం సీజన్లో జిల్లాలో 2,54,059 మంది రైతులకు రూ. 255.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో బ్యాంకు ఖాతాలు అనుసంధానం ఉన్న మొత్తం 2,14,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.240 కోట్లు జమ అయ్యాయి. అయితే అదేవిధంగా యాసంగి సీజన్కు కూడా సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది.● ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమై పంటలు విత్తే సమయం దాటుతున్నా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం ఉంచి రావాల్సిన సాయం ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.● ఇప్పటికే పాత రుణాలు ఉన్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు ఆలస్యం రావడం మరింత ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. కొంతమంది రైతులు అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులు తీసుకుని సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తెలంగాణలో రౌడీ రాజ్యం.. ప్రశ్నిస్తే దాడులేంటి?: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్పీ రోజులు ప్రారంభమయ్యాయని.. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధకావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు...బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి?. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. -
నాపై కుట్రకు ప్లాన్.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా తన కులం, సామాజిక నేపథ్యం కారణంగా కొందరు టార్గెట్ చేసి తనను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో, కన్నడ రాజకీయంలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సైతం సిద్దరామయ్యను ప్రశ్నిస్తున్నారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా..‘నాలుగు దశాబ్దాలుగా నేడు రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితం ఏనాడూ పూల పాన్పు కాదు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా మంది పెద్ద నాయకులు నన్ను రాజకీయంగా అంతం చేయడానికి అనేక మోసపూరిత కుట్రలు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో నేను వాటన్నిటినీ అధిగమించాను. కానీ, కొందరు వ్యక్తులు ఇప్పుడు నాపై కులం, సామాజిక నేపథ్యం కారణంగా కుట్రలు చేస్తున్నారు. నా కులం కారణంగా నేను టార్గెట్ అవుతున్నాను.గొర్రెల కాపరి (కురుబ సామాజిక వర్గం) ముఖ్యమంత్రి అయ్యాడు. ఆర్థిక నిపుణులతో కలిసి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడని కొన్ని వర్గాలు నాపై కక్ష కట్టాయి. వారు నన్ను అంతం చేస్తే వారి మార్గం సజావుగా మారుతుందని ప్లాన్ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను అన్నీ గమనిస్తున్నాను.ఇది నా ఒక్కడిపై జరిగిన కుట్ర కాదని నాకు బాగా తెలుసు. ఇది నన్ను నమ్మిన మీపై జరిగిన కుట్ర. అందుకే, నేను ఊపిరి ఉన్నంత వరకు, ఈ రాజకీయ కుట్రకు, అసూయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతాను. ఇది నిజం. న్యాయం, ధర్మం కోసం పోరాటం చేస్తాను. మీ మద్దతుతో, నేను ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాను. నేను యుద్ధభూమి నుండి పారిపోయే పిరికివాడిని ఎప్పటికీ కాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో, సిద్దరామయ్య పోస్టుపై రాజకీయంగా చర్చ మొదలైంది. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కులం కార్డులో సిద్దరామయ్య కొత్త రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యలు చేస్తున్నారు. "ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನನ್ನ ಉಸಿರಿರುವ ವರೆಗೆ ಹೋರಾಡುತ್ತೇನೆ"ನನ್ನ ನಾಲ್ಕು ದಶಕಗಳ ರಾಜಕೀಯ ಜೀವನ ಎಂದಿಗೂ ಹೂವಿನ ಹಾಸಿಗೆ ಆಗಿರಲಿಲ್ಲ, ಅದು ಕಲ್ಲು - ಮುಳ್ಳುಗಳ ಹಾದಿಯಾಗಿತ್ತು. ನನ್ನನ್ನು ರಾಜಕೀಯವಾಗಿ ಮುಗಿಸಲು ಹಲವಾರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ನಾಯಕರು ಹಲವಾರು ಬಗೆಯ ಕುಟಿಲ ಕಾರಸ್ತಾನಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನೂ ಜನತೆಯ… pic.twitter.com/rA8XGFuuZL— Siddaramaiah (@siddaramaiah) February 20, 2026 -
ఉన్నది మెరిట్ కోటానే
వికారాబాద్: కాంగ్రెస్లో ఏ కోటా ఉండదు.. కేవలం మెరిట్ కోటా మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బాగా పనిచేసే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. దేశం ఆత్మనే కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీని దేశాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పారు. దేశ స్వాతంత్య్రానికి 140 ఏళ్ల ముందే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రం.. ఇచ్చిన రాజ్యాంగాన్ని వినియోగించుకొని ఉద్భవించిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నాయని ఎద్దేవా చేశారు. త్యాగాల పార్టీ కాంగ్రెస్ భారత దేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇటీవల కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, లేదంటే సమూలంగా మార్చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహాత్మాగాందీ, నెహ్రూ వంటి నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారన్నారు. గాంధీ బ్రిటిష్ వారిపై తిరగబడితే వారు ఆయనపై కనీసం లాఠీ కూడా ఎత్తలేదని, కానీ మన దేశానికి చెందిన ఓ పార్టీ నాయకుల తుపాకీ గుండ్లకు బలి కావాల్సి వచ్చిందని తెలిపారు. గాం«దీ, ఇందిరాగాందీ, రాజీవ్గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. త్యాగాల చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్గాంధీ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు.. ‘డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనవారు జిల్లాకు అధిపతులమని భావించొద్దు.. వ్యతిరేకించిన వారిని అణచివేసే ప్రయత్నాలు చేయొద్దు’అని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రతీ నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగానని గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి పనిచేయడంతోనే రెండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్లను 40 శాతానికి తెచ్చుకోవడంతోపాటు అధికారంలోకి రాగలిగామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేయించామన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవులను దుర్వినియోగం చేయొద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు శాతం తేడాతో అధికారంలోకి వచ్చిన మనం పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు పెంచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి చేరుకున్నామని, ప్రజల మనసు గెలవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. గొంతు నొక్కే కుట్ర బీజేపీ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటులో రాహుల్గాం«దీని మాట్లాడనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగులు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్వాలిటీ లీడర్íÙప్ను తయారు చేయటమే సంఘటన్ సృజన్ అభియాన్ లక్ష్యమని చెప్పారు. దేశంలో సంస్థాగత మార్పునకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, శిక్షణ నిర్వహణ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు. -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
AI సమ్మిట్ వద్ద.. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన
-
Kamareddy : కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
ఏఐ సమ్మిట్: దుమారం రేపుతున్న అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు భారీ కుట్ర ఉందని పోలీసులు ఆరోపించారు.శుక్రవారం ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ఐవైసీ (ఐవైసీ) నేతలను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపాల్లో గతంలో జరిగిన ఒక భారీ ఆందోళనను పోలి ఉందని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులు కోర్టుకు వివరించారు. భారత్ మండపంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.ఈ నిరసనల వెనుక ఉన్న కారణాలను వెలికితీసేందుకు తమకు ఐదు రోజుల రిమాండ్ కావాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల తరపు న్యాయవాది పోలీసుల వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన కోర్టులో వాదించారు. ‘ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు నిందితులకు ఉంది. ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి హింస జరిగినట్లు వీడియో ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులను పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది వాదించారు.ఇది కూడా చదవండి: కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ -
మోదీ నిర్ణయం తప్పే.. టారిఫ్ల రద్దుపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు యూఎస్ సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్.. పలు దేశాలపై విధించిన అధిక టారిఫ్లను తప్పుబట్టింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను కొట్టివేసింది. ఈ క్రమంలో ఇటీవల భారత్, అమెరికా చేసుక్ను వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా, అమెరికా విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికాతో ఏకపక్ష, భారత వ్యతిరేక వాణిజ్య ఒప్పందం చేసేందుకు కేంద్రం తొందరపడిందని ఆరోపించింది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కార్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలు కూడా చేశారు.మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?: సుర్జేవాలాఅమెరికాతో కుదిరిన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాల్ అన్నారు. అమెరికా కొత్తగా ప్రతిపాదించిన సుంకాల స్థిరత్వం, భారత్పై వాటి వర్తింపును ప్రశ్నించారు. 1977లో అమల్లోకి వచ్చిన ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122, 1962 ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232, 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్లు భారత్కు వర్తించవని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సుంకాలు భారత్పై చట్టబద్ధంగా అమలవుతాయా? అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం నిలబడుతుందా? రైతులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, ఇంధన, డేటా నిపుణులు, ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్న ఈ ఒప్పందం నుంచి బయటకు రావడానికి మోదీ ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?' అని ప్రశ్నించారు.Pursuant to the U.S Supreme Court judgment quashing Presidential powers to impose tariffs under IEEPA (International Emergency Economic Powers Act, 1977), President Trump has announced:• Imposition of 10% additional tariffs under Section 122 of the Trade Act, 1974.• Tariffs… https://t.co/UK24YTwdkm— Randeep Singh Surjewala (@rssurjewala) February 20, 2026 సెక్షన్ 122 (ట్రేడ్ యాక్ట్, 1974) ప్రకారం 150 రోజులపాటు మాత్రమే 10శాతం టారిఫ్ విధించవచ్చని సుర్జేవాలా తెలిపారు. తరువాత అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరమని, ఇది తాత్కాలిక చర్య మాత్రమే అని అన్నారు. ఇక సెక్షన్ 232 (ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్, 1962) జాతీయ భద్రతా కారణాలతో మాత్రమే టారిఫ్ విధించాలని పేర్కొన్నారు. 270 రోజుల్లో అమెరికా వాణిజ్య శాఖ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. భారత ఎగుమతులు జాతీయ భద్రతకు ముప్పు కాదని వివరించారు. అలాగే సెక్షన్ 301 (ట్రేడ్ యాక్ట్, 1974) సంబంధిత దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరించిందని దర్యాప్తు ద్వారా నిరూపించాలని చెప్పారు. భారత్పై అలాంటి దర్యాప్తు జరగలేదని ఆయన వివరించారు. ఇప్పుడు జాతీయ ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం సిద్ధమా? అంటూ ప్రశ్నలు సంధించారు.మోదీ రాజీ పడ్డారు: పవన్ ఖేడామరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసింది. భారత్ మరో 18 రోజులు వేచి చూసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్కు అర్థరాత్రి కాల్ ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎందుకు ఆగలేదు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ప్రకటనలే కారణమా? జెఫ్రీ ఎఫ్స్టీన్స్ ఫైళ్ల ప్రభావమా? గౌతమ్ అదానీకి సంబంధించిన అమెరికా క్రిమినల్ కేసా? లేక ఇవన్నీ కారణాలా? ఈ రోజు కాంగ్రెస్ వాదన నిజమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారు' అని ఆరోపించారు. -
కామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత కారుపై దాడి
కామారెడ్డి అప్డేట్స్.. తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తాకామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డినాణ్యత లేకుండా పనులు చేస్తుంటే అడ్డుకున్నానుమార్పు కోసం నా ప్రయత్నంప్రోటోకాల్ లేకపోయినా ఇంచార్జి మంత్రులతో కలిసి షబ్బీర్ అలీ రాజకీయం చేస్తున్నారుకాలేజి భూముల్లో 140 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయిభూములను ఎవరు అమ్మలేదు.. లీజ్ అగ్రిమెంట్ మాత్రమే ఉందిచంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారురక్షణ ఇవ్వాలని ఎస్పీ కి ఫిర్యాదు చేశానుఅవినీతి అక్రమాలు అడ్డుకున్నందుకే తన పై కక్షగట్టారుభూముల విషయంలో సోమవారం కలెక్టర్ను కలుస్తానేను తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తాఅక్కడి నుంచే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేక పంపిస్తాటీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకున్న పోలీసులుకామారెడ్డి వెళ్లకుండా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావును అడ్డుకున్న పోలీసులుహైదరాబాద్లోని ఆయన నివాసంలో అడ్డుకున్న పోలీసులుఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్ వద్ద అడ్డుకున్న పోలీసులుబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇద్దరి నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కామారెడ్డి వెళ్ళకుండా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుకామారెడ్డి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుకామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అరెస్ట్అనుచరులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుకామారెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరికాసేపట్లో కామారెడ్డికి చేరుకోనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కామారెడ్డి ఘటనపై మీడియాతో మాట్లాడనున్న రాంచందర్ రావుకామారెడ్డిలో హైటెన్షన్..కాంగ్రెస్ నేత కారుపై బీజేపీ కార్యకర్తల దాడి.కారుకు నిప్పు పెట్టిన బీజేపీ కార్యకర్తలు.కారు నుంచి మంటలు.తోపులాటలో పోలీసులకు గాయాలు.కామారెడ్డిలో టెన్షన్..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..ఆరోరా భూములపై చర్చకు రావాలన్న బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు.కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.కాంగ్రెస్ నేత కారు ధ్వంసం.ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలుమహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.శిశుమందిర్ స్కూల్ వద్ద హైటెన్షన్..బీజేపీ, కాంగ్రెస్ నేతల సవాల్తో శిశుమందిర్ స్కూల్ వద్ద హైటెన్షన్.పోలీస్ భారీ బందోబస్తు మధ్య బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అరెస్టు.పట్టణంలోని శిశు మందిర్ పాఠశాల వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుకామరెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హౌస్ అరెస్ట్.👉కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.👉కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దీంతో, కామారెడ్డి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
సుల్తాన్పూర్: 2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్లోని ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఎదుట హాజరయ్యారు. కోర్టు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మకు రాహుల్ తెలియజేశారు. తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతియాలన్నదే ప్రత్యర్థుల పన్నాగమని పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తనపై వచి్చన ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఏనాడూ ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. మాటలతో ఇతరుల పరువుకు నష్టం కలిగించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తప్పుడు ఫిర్యాదు చేశారని ఆక్షేపించారు. దాంతో న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ‘మీ వాదనను బలపర్చే సాక్ష్యాధారాలు సమర్పించండి’అంటూ రాహుల్కు సూచించింది. కోర్టు నుంచి రాహుల్ బయటకు వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ వారికి అభివాదం చేశారు. తమ నాయకుడి రాక సందర్బంగా సుల్తాన్పూర్లో కాంగ్రెస్ నేతలు ‘సత్యమేవ జయతే’అని రాసి ఉన్న పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఏమిటీ కేసు? రాహుల్ గాంధీ 2018లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హత్య కేసులో నిందితుడైన అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ నీతి నిజాయతీ అంటూ కబుర్లు చెబుతోందని విమర్శించారు. దీనిపై సుల్తాన్పూర్కు చెందిన జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రాహుల్పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రాహుల్పై పరువు నష్టం కేసు నమోదయ్యింది. 2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ కోర్టు ఎదుట లొంగిపోయారు. రూ.25,000 పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. -
ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ నిరసన.. బీజేపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది. ఈ సమ్మిట్ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి నినాదాలు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. చివరి రోజు సమ్మిట్లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం, చర్చలు-రాజనీతిలో ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. -
జీవన్రెడ్డికి తగిన గౌరవమివ్వండి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీ లోనే ఉన్నాడు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్తోనే ఉన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్ పెద్దలు చొరవ చూపాలి. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, జీవన్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిమ్స్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. -
ఎగిరి గంతులేసిన ఎమ్మెల్యే, ఎంపీ
-
‘వయనాడ్’ బాధితులకు రాహుల్ భారీ కానుక
వయనాడ్: కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన, ఇళ్లు కోల్పోయిన వారి కోసం పార్టీ ప్రకటించిన ‘100 ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు’కు లోక్సభ ప్రతిపక్ష నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 26న శంకుస్థాపన చేయనున్నారు. త్రిశూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఈ వివరాలను వెల్లడించారు.ఇప్పటికే కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం బాధితులకు 178 ఇళ్లను అప్పగించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కాంగ్రెస్ తన సొంత ప్రాజెక్టుతో ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం వయనాడ్ జిల్లాలోని మెప్పాడి కున్నంపట్టా వద్ద ఇప్పటికే 3.24 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసినట్లు సన్నీ జోసెఫ్ పేర్కొన్నారు. దీనికి అదనంగా ఎళంకిర వద్ద మరో 5.45 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. మొత్తం 100 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి దశలో భాగంగా 50 ఇళ్లను రాబోయే ఆరు నెలల్లోనే పూర్తి చేసి బాధితులకు అందజేయాలని కేపీసీసీ నిర్ణయించింది.ఒక్కో ఇంటిని ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో, సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. కేవలం ఇళ్లే కాకుండా, విపత్తు కారణంగా నష్టపోయిన వ్యాపార సంస్థలకు కూడా కాంగ్రెస్ అండగా నిలవనుంది. కొండచరియల విపత్తులో ఆస్తి నష్టాన్ని చవిచూసిన ఒక్కో వాణిజ్య సంస్థకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేపీసీసీ పంపిణీ చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సహకారంతో కేపీసీసీ సమీకరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రజల నుండి విరాళాల రూపంలో సేకరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: బట్టతలపై జుట్టు.. ‘మ్యాజిక్ క్యాప్’తో ఊహకందని అద్భుతం! -
2029 నాటికి దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పాలన ఉండదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కాదని...అది తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్ కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వివిధ దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారని, మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారని, అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టాతోపాటు ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామని సంజయ్ హెచ్చరించారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమరయ్య పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదన్నారు. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తే వారి సంగతి చూస్తామన్నారు. మంత్రుల మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలయ్యేలా చేస్తామన్నారు. తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారన్నారు. కరీంనగర్ స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాషాయ జెండాను ఎగరేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలతో పాలన గాలికి... బీజేపీ చీఫ్ రాంచందర్రావు ఢిల్లీ పర్యటనలు, చిట్ చాట్లతో పబ్బం గడుపుతూ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసారని బీజేపీ చీఫ్ రాంచందర్రావు విమర్శించారు.ఎన్నికలు రాగానే అమలు కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం చూస్తున్నా ఎలాంటి మార్పు లేదని, గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ డ్రామాలు ఆడుతూ విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమంటే భవిష్యత్ తెలంగాణ బీజేపీదేనని అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మేధావులు త్వరలో పార్టీలో చేరేందుకు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని రాంచందర్రావు తెలిపారు. -
ఆ పార్టీలతో జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ..ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ..జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. రెండు పార్టీల ను ఎప్పటికప్పుడు ఐకమత్యంతో సమర్థంగా ఎదుర్కోవాల ని సూచించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా.. ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిపి ఒకసారి, విడివిడిగా మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు, వాటి అమలుకు చేసిన ఖర్చు తదితరాలపై నేతలకు సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. బలం మరింత పెంచుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.. ‘ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లు రాబట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలి..’ అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. ఎంఐఎంపై విస్తృతంగా చర్చిద్దాం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్గాంధీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇటీవలి ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. పార్టీ చెబుతున్నట్టుగానే బీసీలకు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. ఇకపైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం..’ అని చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర నేతల చిత్తశుద్ధిని ప్రశంసిచిన హైకమాండ్ పెద్దలు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకున్న బీజేపీ తీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమని మీనాక్షి నటరాజన్ సూచించగా, దీనిపై పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. కాగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. తమతమ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. «రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని ఉత్తమ్ చెప్పారు.మార్చి 15 నాటికి పదవుల పంపకాలుఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్ పెద్దలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ, అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తిచేసి, ఆ తర్వాత మరో పది రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్ విప్, రెండు విప్ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని సమాచారం. రెడ్డి లేదా వెలమ సామాజికవర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యవర్గ కూర్పుపైనా చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గ నేతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.పిలిస్తే మేడారం వచ్చే వాళ్లం కదా..సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి వివరించగా..ఖర్గే, రాహుల్లు మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క, సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా జాతీయ స్థాయి సినిమా రూపొందించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్, ఖర్గే అనగా..సమయాభావంతో వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు సీతక్క వివరణ ఇచ్చారు. ఈసారి తప్పకుండా అధికారిక ఆహా్వనం అందజేస్తామని చెప్పారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్, ఖర్గే అన్నారు. కాగా అందరితో కలిసి చర్చించిన పార్టీ అగ్రనేతలు, అనంతరం మంత్రుల కోరిక మేరకు విడివిడిగా ఒక్కో నేతతో 5–10 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సురేఖ పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. -
మంత్రుల అవినీతి ఆడియోలు.. బాంబు పేల్చిన బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపేందుకు అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించిన చిట్టా, ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని త్వరలోనే బయటపెడతామని బాంబు పేల్చారు.కరీంనగర్ పదో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమురయ్య బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి తొలి మేయర్ను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్కి అభినందనలు తెలిపారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహకారంతో కరీంనగర్ గెలిచాం. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమిష్టిగా అగ్రెసివ్గా కొట్లాడం. బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్మకైంది. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కయ్యాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారి అధిష్టానం మాట ధిక్కరించి అవసరం వస్తే మాకు సపోర్ట్ ఇస్తామన్నారు. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ప్రజల కళ్లలో ఆనందం కంటే ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని రేవంత్ అనుకుంటారు. మజ్లిస్ కోసమే భాగ్యనగరాన్ని సీఎం రేవంత్రెడ్డి మూడు ముక్కలు చేశారు. మూడు ముక్కలు ఎందుకు ఎవరి కోసం చేశారో రేవంత్ చెప్పడం లేదు. భాగ్యనగరం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలను కూడా విభజించలేదు. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ ఉన్నాయి?. వచ్చిన పెట్టుబడులు అన్ని ఏఐసీసీకి పంపి దేశంలో పార్టీని బతికేస్తున్నారు. TPCC కాదు T4C అంటే తెలంగాణ కమీషన్ కలెక్షన్ కరప్షన్ కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు మోయడానికే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు కూడా వీటికి మధ్యవర్తులుగా సహకరిస్తున్నారు. మేము ఒక్కో మంత్రి ఇంటి వద్ద అవినీతిపై ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. -
నామినేటెడ్ ఇచ్చేద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో..పదవులు దక్కని నేతలు, పార్టీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు ఊరటనిచ్చేలా వివిధ కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ పెద్దలకు గట్టిగానే సిఫారసు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడితో గురువారం కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించనున్న కీలక భేటీకి ముందే పలువురు ఏఐసీసీ పెద్దలను కలిసిన మీనాక్షి.. పదవుల పందేరానికి సంబంధించి నివేదిక సమర్పించినట్లు సమాచారం. పదవులు భర్తీ చేస్తేనే నేతల్లో జోష్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి 2024 జూన్లో ఒకేసారి 37 కార్పొ రేషన్లకు చైర్మన్లను ప్రకటించింది. ఆ తర్వాత కూడా పలు పదవులను భర్తీ చేస్తూ వెళుతోంది. అయితే మరో 35–40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని గడిచిన కొన్ని నెలలుగా డిమాండ్లు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. డీసీసీ పదవులు నియామకం, ఇతర కార్యక్రమాల నిమిత్తం జిల్లాల్లో మీనాక్షి నటరాజన్ పర్యటించిన సందర్భాల్లో పదవుల అంశంపై నేతల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తుల ఆధారంగా ఇప్పటికే జిల్లాల వారీగా నేతల జాబితా సిద్ధం చేసినా, ఉప ఎన్నికలు, స్థానిక, మున్సిపల్ ఎన్నికలంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. వీటితో పాటు జిల్లాల స్థాయిలోæ డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లా నుంచి ఐదు నుంచి ఆరుగురి పేర్ల జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం డీసీసీల నియామకం పూర్తికావడంతో పాటు మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికావడం..నేతల సమష్టి కృషితో 70 శాతానికి పైగా విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ అభ్యన్నతికి కషి చేసిన వారిని పదవులతో సన్మానించాలన్నది నటరాజన్ ఉద్దేశంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా..పలు నామినేటెడ్ పదవులను ఇవ్వకపోవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకున్న దష్ట్యా, ప్రస్తుతం వాటిని భర్తీ చేస్తే నేతలను ప్రోత్సహించినట్లు అవుతుందని హైకమాండ్ పెద్దలకు మీనాక్షి స్పష్టం చేసినట్లు తెలిసింది. యువత, ఎమ్మెల్యేలకు సైతం పదవులు! పార్టీ బలోపేతానికి పని చేసిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు, కొందరు ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేలా మీనాక్షి సిఫారసులున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసింగ్, పరిశ్రమల అభివృధ్ధి, ఆరోగ్య వసతుల అభివృధ్ధి కార్పొరేషన్లు వంటి వాటిని ఎమ్మెల్యేలకు, లేక పార్టీ సీనియర్లకు ఇస్తారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు, యువతకు భాగస్వామ్యం కల్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. విద్య, ఉపాధి, నైపుణ్యాలతో ముడిపడ్డ కార్పొరేషన్లను యువతకు ఇచ్చే అవకాశాలు ఉండగా, కుల ఆధారిత కార్పొరేషన్లను సామాజిక న్యాయం ఆధారంగా ఇవ్వనున్నారని సమాచారం. ఉగాదికి ముందే పదవుల భర్తీ చేయాలన్న సిఫారసులపై గురువారం నాటి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. -
బాల్క సుమన్ అరెస్ట్.. కాంగ్రెస్, పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్లో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అలాగే, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్పై కేటీఆర్ స్పందిస్తూ..‘క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్పై అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేయించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.బాల్క సుమాన్ది పూర్తిగా అక్రమ అరెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఇది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బాల్క సుమన్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
గూడెం ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పారు: మహేష్ కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదన్నారు. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలే నిరూపించాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపటి మీటింగ్ అన్ని రాష్ట్రాలపై ఏఐసీసీ సమీక్ష జరుగుతుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష అయిపోయింది. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చ జరగనుంది. చిత్త శుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 67 శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారు. 87.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.ఇక్కడ జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీట్లు సర్వేల ఆధారంగా మున్సిపల్ చైర్మెన్ కౌన్సిలర్ల ఆధారంగా ఎంపిక జరిగింది. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదు. 94 మున్సిపాలిటీలు గెలిచామంటే అభివృద్ది, సంక్షేమం పట్ల ప్రజలకు సానుకూలతే నిదర్శనం. నిజామాబాద్లో ఐదు సీట్లలో ఏంఐఏం అభ్యర్థుల మీద గెలిచాం. మేయర్ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లు ఆ దిశగా ఆలోచించారు. ఈనెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్టులో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణ తరగతులు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒకరోజు అటెండ్ అవుతారు.వరుస ఓటముల కారణంగా బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడే ఆయనే చెప్పారు. దీనిపై మేము మాట్లాడటానికి ఏమీ లేదు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై పూర్తిగా స్పష్టతను ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
8లో 7 కాంగ్రెస్కే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో వాయిదా పడిన 11 చోట్ల మంగళవారం ఎన్నికలు నిర్వహించగా అందులో ఎనిమిది చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు చోట్ల వాయిదా పడింది. 8 మున్సిపాలిటీల్లో ఏడు చైర్పర్సన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే.. ఒక్కచోట బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించిన ఏడు మున్సిపాల్టీల్లో.. రెండింటిని టాస్తో గెలుపొందడం విశేషం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, తొర్రూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎక్స్అఫీ షియో ఓట్లతో కలుపుకొంటే సమానంగా ఓట్లు రావడంతో చైర్పర్సన్ పీఠం కోసం ఎన్నికల అధికారులు టాస్ వేయగా.. రెండుచోట్ల కూ డా కాంగ్రెస్కు చైర్పర్సన్ పీఠాలు దక్కా యి. ఇక కాగజ్నగర్లో బీజేపీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతునివ్వడంతో అక్కడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటే.. వైస్చైర్మన్ స్థానాన్ని బీజేపీ సాధించింది. కాగా ఇబ్రహీంపట్నం ము న్సిపాలిటీలో ఎన్నిక ప్రక్రియ సగం వరకు అయిన తరువాత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో.. ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇది కాకుండా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వా యిదా పడ్డాయి. ఈరోజు కూడా బద్ద శత్రువుల్లా వ్యవహరించే పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం విశేషం.ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ఇలా..ఇంద్రేశంలో బీఆర్ఎస్.. జహీరాబాద్లో కాంగ్రెస్.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక మంగళవారం జరిగింది. ఇందులో ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంద్రేశంలో 18 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, 9 బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానం ఇండిపెండెంట్కు వచ్చింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్ గూటికి చేరడంతో గులాబీ పార్టీకి చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులు దక్కాయి. చైర్పర్సన్గా కుశంగుల ప్రమీల ఎన్నికయ్యారు. » జహీరాబాద్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో హైడ్రామా కొనసాగింది. ఈ ఎన్నిక నిర్వహించిన అధికారుల తీరును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మొత్తం 37 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ షెట్కార్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు తమ ఎక్స్అఫీషియో ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు స్వతంత్రులు అనుకూలంగా ఓటేయడంతో చైర్మన్గా ఎండీ యూనూస్ ఎన్నికయ్యారు. వైస్చైర్పర్సన్ పదవి మాత్రం స్వతంత్ర కౌన్సిలర్కు వచ్చింది. ఓరుగల్లు హస్తం క్లీన్స్వీప్...! బీఆర్ఎస్ చేజారిన తొర్రూరు... డోర్నకల్, జనగామల్లోనూ కాంగ్రెస్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికే 9 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. లాటరీ తీసిన జనగామ, తొర్రూరులలో కూడా బీఆర్ఎస్కు ‘లక్కీ’ కలిసిరాలేదు. లాటరీలో అదృష్టం కలిసిరాక అవి ‘చేతి’కి చిక్కాయి. డోర్నకల్లో కూడా హస్తంపరమైంది. » జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగింది. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా...బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్కు సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను చైర్మన్గా అధికారులు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. » జనగామ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే పద్ధతితో బాలమణి, సుధాకర్లు ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో, లాటరీ ద్వారా ఎన్నిక నిర్వహించారు. మొదట కాంగ్రెస్ చేతులెత్తే ప్రక్రి య పూర్తికాగా, ఆ తర్వాత బీఆర్ఎస్ వంతు వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు మద్దతు గా 8వ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ మంజుల చేతిని పైకి ఎత్తగా, కాంగ్రెస్కు చెందిన కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు ఆమె చేయిని లాగు తూ ఓటు వేయొద్దని కిందికి అనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. దయాకర్రావు కన్నీటిపర్యంతం నర్సింహులపేట: ‘45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పాలన, చూడలేదని, కక్షసాధింపు, మోసం రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా.. తప్పుకోవాలా..అనిపిస్తుంది. నా ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లెందు కాంగ్రెస్కే... ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి 19 మంది కాంగ్రెస్ సభ్యులు, రెబల్, స్వతంత్ర సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా ప్రిసైడింగ్ అధికారి మధు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్పర్సన్గా, 17వ వార్డు నుంచి ఎన్నికైన పెండేలా రాజును వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. -
ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఏఐసీసీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కీలకమైన పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 19న ఢిల్లీకి రావాలంటూ కబురు అందింది. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయమైన ఇందిరాభవన్లో సమావేశానికి రావాలని సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం అందినట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ భేటీకి హాజరవుతారని తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశమవుతున్న క్రమంలోనే తెలంగాణ నాయకత్వాన్ని కూడా పిలిచారని వివరించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీలో కార్యదర్శులుగా ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం. పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష?: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాలనే కోణంలోనే అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఏఐసీసీ సమావేశమవుతోంది. సంస్థాగతంగా పార్టీని ఉత్తేజితం చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏఐసీసీలోని ముగ్గురు కీలక నేతలు నిర్వహించే ఈ సమావేశంలో.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీతో సమన్వయం, పదవుల పందేరం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఆరు గ్యారంటీలు, ఇతర పార్టీల పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యవర్గానికి చేస్తున్న పని విభజన తదితర అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరును గురించిన సమాచారం కూడా ఏఐసీసీ వద్ద ఉందని, ఎన్నికల్లో గెలుపోటములే కాకుండా ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాల గురించిన చర్చ కూడా ఈ సమావేశంలో జరుగుతుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై స్పష్టత? ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలా లేదా? మార్పులు చేర్పులుంటాయా? అనే అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పోస్టుల కేటాయింపు విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు అంశాల వారీగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఇప్పటికే పలు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. కాగా ఏఐసీసీకి అందజేసేందుకు గాను..గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు గురించి సీఎం రేవంత్రెడ్డి, తాను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత పార్టీని బలోపేతం చేస్తున్న తీరు, పీసీసీ కమిటీలు, ఏఐసీసీ ఇచ్చే ఆందోళనల విజయవంతం తదితర అంశాలపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నేడు ముంబైకి సీఎం సీఎం రేవంత్రెడ్డి ముంబైకి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత ముంబైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సతీమణి గీత.. మాతృమూర్తిని పరామర్శించనున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళతారు. గురువారం ఏఐ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐసీసీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం ఉదయానికి సీఎం హైదరాబాద్కు తిరిగి వస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రికి అభినందనలు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వీర్ల శంకరయ్య, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ కూడా పార్టీ నేతలను అభినందించారు. -
కాంగ్రెస్కు బుల్లెట్ దించి..!
సంగారెడ్డి జిల్లా: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడంతో స్థానిక రాజకీయాలు హాట్ టాపిక్గా మారా యి. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఎక్స్అఫీషియో ఓటు వినియోగించేందుకు ఒకే కారులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఎంపీ రఘునందన్రావులు కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్ల మార్పు లు కూడా ఎన్నికలో కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరగా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామాల తర్వాత బలాబలాలు మారా యి. బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్కు 13 సమానంగా వచ్చాయి. అయితే ఎక్స్ అఫీషియో లు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ బీఆర్ఎస్కు వేయడంతో బీఆర్ఎస్ సంఖ్య 15 కు చేరింది. ఎక్స్అఫీషియో ఓట్లతో ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ట్విస్ట్తో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బయటకు వెళ్తూ ‘ఎప్పుడొచ్చామన్నది కాదు..బుల్లెట్ దిగిందా? లేదా?’అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆస్ట్రేలియాకు 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడి సంఘర్షణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య నెలకొన్న నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో టూర్ పాలిటిక్స్కు తెరలేచింది. సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్కు పయనమవుతుండడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మంగళవారం రాత్రి పాతిక మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ఆ్రస్టేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారేనని సమాచారం. వీసా లభించని కారణంగా కొందరు ఎమ్మెల్యేలు పర్యటనను రద్దుచేసుకున్నారు. హైకమాండ్ ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతో పలువురు టూర్కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరికొందరు డైలమాలో ఉన్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ రాజకీయంగా అపోహలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం మధ్య మంగళవారం రాత్రి సుమారు 27 మంది పయనమవుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మార్చి 1న బెంగళూరుకు తిరిగి రానున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బయల్దేరుతున్నట్లు చెబుతున్నారు. అయితే, పశుసంవర్ధక శాఖ నుంచి ఈ పర్యటన ఖరారైనట్లు వార్తలు రాగా.. ఆ శాఖ మంత్రి కె. వెంకటేశ్ వీటిని తోసిపుచ్చారు. కొంతమంది ఇదొక ప్రైవేటు టూర్ అని, వ్యక్తిగత ఖర్చులతో విదేశీ టూర్కు వెళ్తే తప్పేంటని ప్రశి్నస్తున్నారు. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.. ఇదిలా ఉంటే.. సీఎం కుర్చీ పోరులో అభిప్రాయభేదాలు విడిచి కలసికట్టుగా సాగాలని ఆదివారం రాష్ట్ర నాయకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. అయితే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే అని ఆయన కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం నుంచి కౌంటర్లు వస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని ఎమ్మెల్యే గణిగ రవికుమార్ మద్దతు పలికారు. -
పురపాలికల్లో పై‘చేయి’
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లతోపాటు సింహభాగం మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను తన ఖాతాలో వేసుకుంది. కనీసం 90 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టణ స్థానిక సంస్థల్లో పట్టు సాధించగలిగింది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో భాగంగా 81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.వీటితోపాటు నలుగురు స్వతంత్రులు, ఒక ఏఐఎఫ్ బీ అభ్యర్థి గెలుపొందిన స్థానాలు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే వచ్చాయి. ఈక్రమంలో మరో 11 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్చైర్మన్ల ఎంపిక ప్రక్రియ మిగిలి ఉండగానే, 86 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక, పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ పీఠాలు తమవేననే ధీ మా అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం. ఆది నుంచీ ఆచితూచి పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ నాయకత్వం సమన్వయంతో వ్యవహరించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. వీరికి తోడు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు, పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారు పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.పీసీసీ ఏర్పాటు చేసిన వార్రూం కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికల దిశలో నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. ప్రతి రోజూ ఎన్నికల సరళిని పర్యవేక్షించిన ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేశారు. గత నెలలో తన విదేశీ పర్యటనకు ముందు, ఆ తర్వాత రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్లను నేరుగా తన మాటలతో ఢీ కొట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగలిగారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయం దిశగా ముందుకు నడిపించారు. మెదక్లోనే... ఓ మోస్తరు పోయిన దగ్గరే వెతుక్కోవాలనే నానుడి చందంగా.. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో కొంతమేరకు ప్రతికూల ఫలితాలు వచి్చన ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాని నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునే విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 90శాతానికి పైగా దక్కించుకోగా, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు, మెదక్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించగలిగింది.మరీ ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను పట్టుపట్టి మరీ అధికార పార్టీ చేజిక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత స్థానం కావడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠంపై కూర్చోగలిగింది. సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఒక మెట్టు తగ్గి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వడంలోనూ తాము చాకచక్యంగా వ్యవహరించామ ని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి.ఇక్కడ మేయర్ పీఠం సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్తులో చేసే రాజకీయ పదవుల డిమాండ్కు చెక్ పెట్టగలిగామని అంటున్నాయి. ఇక, పుర పీఠాలనూ ఎక్కువ శాతం బీసీ వర్గాలకు కేటాయించామని, ఆయా వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాలతోపాటు రిజర్వు చేయని మున్సిపాలిటీలను కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించామని చెబుతున్నాయి. తాము చెప్పిన విధంగా 50 శాతం కంటే ఎక్కువ బీసీలకు అవకాశం కలి్పంచామని కూడా పేర్కొంటున్నాయి. అయితే, ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలోనే వ్యూహాత్మక వైఫల్యం జరిగిందని, దీనిపై సమీక్ష చేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
పార్టీలో కొనసాగాలా?.. జీవన్రెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహానం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు..?కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఛైర్పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచీ తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్లో కొనసాగాలా అని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను సంజయ్ను ప్రశ్నించారు.కాంగ్రెస్లో అన్యాయం జరిగిన వారికే తాను మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తమ వర్గంపై ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు.ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి తనకు నెలకొందని జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీకి, ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయికాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు.స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. -
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తొర్రూరు మున్సిపల్ ఎన్నిక
-
నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
-
తోర్రూరులో కొట్టుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్
-
ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం
సాక్షి,జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యే సంజయ్ తరుఫు వర్గానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్ ఛైర్ పర్సన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి మొండి చేయిచూపించింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. జగిత్యాలలలో మున్సిపాలిటీ వార్డులు మొత్తం 50 ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఆయన వర్గానికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ పరిణామం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బగా మారింది.కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. వాణి అభ్యర్థిత్వం ఖరారవడంతో, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం బలపడింది. అయితే, ఈ నిర్ణయం వల్ల పార్టీ అంతర్గతంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు.. ఫార్చునర్ కారు ఆఫర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్బీ 02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు వరకు పర్యవేక్షించాల్సి వచ్చింది.రోజంతా హైడ్రామా15 డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది.జమ్మికుంటలోనూ హంగ్ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్లి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01, బీఆర్ఎస్ రెబల్1 కలిపి 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్ ఫిగర్ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.జగిత్యాల జిల్లా రాయికల్లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి.పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సు ల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో స్పష్టమైన మెజారి టీ రావడంతో కాంగ్రెస్ పాలకవర్గాలను ఏర్పా టు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది.ఇండిపెండెంట్ల జోరుహంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్ కారు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.కరీంనగర్ బల్దియాలో నేడు ప్రమాణ స్వీకారం: ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: మ.12.30 నుంచి 1.30 వరకు ప్రెసిడింగ్ అధికారి: ఆర్డీవో ఎన్నిక మొత్తం: వెబ్కాస్టింగ్, లైవ్స్ట్రీమింగ్ -
ఫోర్.. నెవర్ బిఫోర్
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన పాలమూరుతోపాటు బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ల మద్దతు, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారంతో కరీంనగర్, నిజామాబాద్లలో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటి కావడం గమనార్హం. మరోవైపు పాలమూరులో కాంగ్రెస్–ఎంఐఎంలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండగా, కొత్తగూడెంలో సీపీఐకి అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లలో పరిస్థితి ఇది.బీజేపీకి అధిక డివిజన్లు వచ్చినా..66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్ ఓటుతో ఆ పార్టీ బలం 35కు చేరింది. కానీ, ఇక్కడ బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు. దీంతో కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), స్వతంత్రులు (4), మజ్లిస్ (3), ఏఐఎఫ్బీ (2) తోపాటు ఎమ్మెల్యేలు కమలాకర్ (బీఆర్ఎస్), కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)ల ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ కూటమి బలం 34కు చేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్ కూటమికి రావడంతో కూటమి బలం 35కు పెరిగితే, బీజేపీ బలం 34కు తగ్గింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కమలం శిబిరం కలవరపాటుకు గురవుతోంది.కొత్తగూడెంలో కామ్రేడ్లుచెరో 22 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదరడంతో ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోనున్నాయి. తొలి రెండున్నరేళ్లు సీపీఐకి, మలి రెండున్నరేళ్లు కాంగ్రెస్కు మేయర్ పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.పాలమూరులో మేయర్ ఎవరో..!మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే..మేయర్ అభ్యర్థిత్వంపై ఈ పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు 31 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్ గెలుపొందిన 29తోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 37కు చేరింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 8 మంది చొప్పున బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొందరు కార్పొరేటర్లు క్యాంపు నుంచి శనివారం రాత్రే పాలమూరుకు చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది.నిజామాబాద్ కాంగ్రెస్దే...!ఇందూరు కార్పొరేషన్ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మేరకు ఆ పార్టీ బలం సమకూర్చుకుంది. ఇక్కడ బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్ ఫిగర్కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది. ⇒ నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం కావడం కూడా లాంఛన ప్రాయమే. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్తో టీ20 వరల్డ్కప్లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్తో మ్యాచ్ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
కరీంనగర్ మేయర్పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు
సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్ మేయర్ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్ఎస్ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకునేలా ప్లాన్ వేసింది. దీనికి గానూ ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి:ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’ -
బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన ప్రతిచోటా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్లో ఉన్నాయని సింగరేణిలో కొన్నిచోట్ల బీజేపీ, సీపీఐ సైతం కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. -
కాంగ్రెస్.. సీపీఐ ఒప్పందం మేయర్ పదవి షేరింగ్
-
Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై.. బీరు సీసాలతో దాడి..
-
కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరిన ఒప్పందం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఎన్నికలు జరగ్గా, 11న ఫలితాల్లు వెల్లడయ్యాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్కు 22, సీపీఐకి 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. మరోవైపు సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సీపీఐ 22, బీఆర్ఎస్ 8 కార్పొరేటర్ల బలం కలుపుకుంటే మేజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత అర్ధంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్పై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, పవర్ షేరింగ్పై ఇటు కాంగ్రెస్, అటు సీపీఐలో కొత్తగూడేనికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇక్కడితో సమసి పోతుందా లేక సోమవారం వరకు కొనసాగుతుందా అనేది చూడాలి. సీపీఐలో మేయర్ పదవి ఎవరిని వరించేనో... సీపీఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సీపీఐ తరఫున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ల నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్గా మార్చారు. ఇప్పుడు మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాతనగర్ పరిధిలోకి వచ్చే 20వ డివిజన్ నుంచి మూడు గణేశ్ 277 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాల్వంచ పరిధిలోకి వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు.ఆది నుంచీ ఆసక్తికొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూ ర్చునేది ఎవరనే అంశంపై ఆది నుంచీ ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 60 డివిజన్లలో 11 డివిజన్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో మేయర్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చాలా మంది అశావహులు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వైద్యులు సైతం ఖద్దరు బట్టలు తొడిగి రాజకీయ కదనరంగంలోకి దూకారు. వైద్యుడు భూక్యా శ్రీనివాసరావు జనరల్గా ఉన్న 6 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు. రికార్డు స్థాయిలో 608 ఓట్ల మెజార్టీ సాధించారు. కొత్తగూడెంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. సీనియర్ రాజకీయనేత శంకర్నాయక్ సతీమణి స్వప్నా నాయక్ 19వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కాకుండా మూడో డివిజన్ నుంచి గుగులోతు శ్రీను, 23 డివిజన్ నుంచి బానోతు అనిత, 33 డివిజన్ నుంచి బానోతు బాలు ఉన్నారు. -
ఇందూర్ మేయర్ ఎవరో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరపా లక సంస్థ (కార్పొరేషన్) మేయర్ ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఇందూ రు నగరంలో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మే యర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మేయర్ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకిలోనే మరికొందరు మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మే యర్ రేసులో ఉన్నారు. మొత్తం ఐదురుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీ పెద్దల టచ్లోకి వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో ఉత్కంఠగా మారింది. దీంతో ఇందూరు నగరపాలకలో రాజకీ యం రసకందాయంలో పడింది. 60 డివి జన్లు ఉండగా.. బీజేపీకి 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్కు ఒక సీటు వ చ్చింది. ఇక్కడ గతసారి మాదిరిగానే హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో మేయర్ చేజిక్కుంచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్కు రెండు ఓట్లు పెరిగినట్లైంది. బీఆర్ఎస్ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆ«దీనంలోనే ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్నవారు ఆ పదవి దక్కదనుకుంటే ఏమైనా తేడా చేస్తారా అనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ ఖాయమైతే సహకరించిన ఎంఐఎం పారీ్టకి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.బోధన్లో రసవత్తరంబోధన్టౌన్: ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 12, బీజేపీ 3 సీట్లు సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. స్వతంత్ర కౌన్సిలర్తోపాటు బీఆర్ఎస్కు చెందిన మరో కౌన్సిలర్ను సైతం కాంగ్రెస్ నాయకులు క్యాంప్నకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ లెక్కన కాంగ్రెస్ బలం 19కి చేరగా, ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
ఆయన ‘నరేంద్ర సరెండర్ మోదీ’
న్యూఢిల్లీ: దేశంలో పత్తి రైతులు, జౌళి ఎగుమతిదారులను మోదీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఆయా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఇది అమల్లోకి వస్తే మనదేశంలో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోతుందని, ఎగుమతులు ఆగిపోతాయని, కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా ప్రభుత్వం మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్లు ప్రకటించిందని, మోదీ సర్కార్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్లకు అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు, ఎగుమతిదారులు కచి్చతంగా నష్టపోతారని తేలి్చచెప్పారు. అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలన్న షరతుతో బంగ్లాదేశ్ వ్రస్తాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సున్నా టారిఫ్లు ప్రకటించిందని గుర్తుచేశారు. భారతీయ వ్రస్తాలపై 18 శాతం టారిఫ్లను ఖరారు చేసిందని పేర్కొన్నారు. మన వ్రస్తాలపై కూడా సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన వ్రస్తాలపై సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలని, దానివల్ల మన రైతులు నష్టపోతారని తెలిపారు. అమెరికా ఎదుట ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రిని ‘నరేంద్ర సరెండర్ మోదీ’గా అభివరి్ణంచారు. -
ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్ పుణ్యమే!
గువాహటి: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈశాన్య భారతదేశంలో అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేగాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించింది’’అంటూ దుయ్యబట్టారు. చొరబాటుదారులను కాపాడిన, కాపాడుతున్న చరిత్ర ఆ పార్టీదేనని ఆక్షేపించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. అస్సాంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదంలో నెట్టిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో అస్సాంలో నిత్యం భయం, అభద్రతలే రాజ్యమేలాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నిత్యం సమాజంలో విభజనను ప్రోత్సహించింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలింది. దేశ భద్రతను గాలికొదిలేసింది. చివరికి ఆయుధాల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణాలకు పాల్పడింది. గతంలో ముస్లిం లీగ్ వల్ల దేశ విభజన జరిగింది. కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ (ఎంఎంసీ)లతో దేశానికి ముప్పు పొంచి ఉంది. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’అని ప్రధాని సూచించారు. ‘డబుల్ ఇంజన్’కే ఓటెయ్యండి వచ్చే ఐదేళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారును కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఒక్కటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం తమకు ముఖ్యమని చెప్పారు. ‘‘70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేం పదేళ్లలోనే ఐదు బ్రిడ్జిలు కట్టి చూపించాం. మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది. అస్సాంను వేగంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అస్తిత్వాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మంది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు’’అని మోదీ చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువని, పార్టీకి ఎనలేని బలమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి పౌరునికీ చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘మేం విశ్వసించేది వ్యవస్థాగతమైన బలాన్నే. నేను బీజేపీ కార్యకర్తను. అది నాకు గర్వకారణం. అదే నా అతి పెద్ద అర్హత. అస్సాం ప్రజలు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటాను’’అని ప్రకటించారు. పలు ప్రాజెక్టులు ప్రారంభంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో రూ.5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీటిపై బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఐఐఎం, డేటా సెంటర్ తదితరాలున్నాయి. ఐఐఎం–గువాహటిని గువాహటి సమీపంలోని పలాస్బరిలో, హైటెక్ డేటా సెంటర్ను కామరూప్ జిల్లాలోని అమీన్గావ్లో నిర్మించారు. వీటితో పాటు పీఎం–ఇబస్ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మపుత్రపై భారీ బ్రిడ్జి బ్రహ్మపుత్రా నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు. అప్రోచ్ రోడ్లు, ఫ్లై ఓవర్లతో కలిపి ఇది 7.75 కి.మీ. పొడవుంటుంది. సువిశాలమైన ఈ ఆరు లేన్ల బ్రిడ్జి వల్ల గువాహటి, ఉత్తర గువాహటి నడుమ ప్రయాణ సమయం ఇకపై కేవలం ఏడు నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం సరాయ్ఘాట్ బ్రిడ్జి మాత్రమే వాటిని అనుసంధానిస్తోంది. దానిపై బ్రహ్మపుత్రను దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఎక్స్ట్రా డోస్డ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్తో నిర్మించారు. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. దీని నిర్మాణానికి 2019లో మోదీయే శంకుస్థాపన చేశారు. 2020 లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. -
‘మున్సిపోల్స్’లో కాంగ్రెస్కు 40% ఓట్లు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క తేలిపోయింది. ఈనెల 11న జరిగిన పోలింగ్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు, ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోల్ కాగా, అందులో అత్యధికంగా కాంగ్రెస్కు పోలయ్యాయి. ఈ పార్టీకి మొత్తం 39.8 (దాదాపు 40 శాతం)తో 15,05,006 ఓట్లు వచ్చాయి. గత (2020) మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 7లక్షల ఓట్లు ఆ పార్టీ కి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్కు గత ఎన్నికలతో పోలిస్తే 5 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 15.90 లక్షల ఓట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 10,87,347 (దాదాపు 29 శాతం) ఓట్లకు పరిమితమైంది.ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 11 శాతంగా నమోదైంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,17,659 ఓట్లు అదనంగా వచ్చాయి. మరో ప్రతిపక్షమైన బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే తగ్గలేదు. గత ఎన్నికల్లో వచ్చిన 15 శాతం ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 5.5 లక్షల ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి మరో 42 వేల ఓట్లు పెరిగి మొత్తం 5,92,823 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం కూడా తన 3% ఓట్లను పదిలపర్చుకుంది.2020 ఎన్నికల కంటే ఆ పార్టీ కి 3 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. కాగా, ఈసారి మూడు ప్రధాన పార్టీ ల తర్వాత అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంది స్వతంత్రులే. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లలో 8.3 శాతం ఓట్లు అంటే 3,14,096 ఓట్లు వచ్చా యని ఈసీ ప్రకటించింది. ఎంఐఎంతో సహా సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫా ర్వర్డ్ బ్లాక్, జేఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎంబీటీ, ఐయూఎంఎల్.. ఇలా అన్ని పార్టీ ల ఓట్లు కలిపినా ఇండిపెండెంట్ల కంటే తక్కువే కావడం గమనార్హం. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్లో మ్యాజిక్ ఫిగర్కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్కు వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
రాజులు వారే... తరాజులు వారే!
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది. వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది. కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్ఎస్కు మధ్య, ఒకచోట బీఆర్ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్ఐఎమ్లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది. 2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది.కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్కు 1,347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే! ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది. డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నంబర్ వన్గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్రెడ్డే!‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్ ఎన్నికల వ్యవహారం మరింత హీట్ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8 సీట్లు గెలవగా, ఫార్వర్డ్ బ్లాక్ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. -
ప్రజల రుణం తీర్చుకుంటా
అనంతగిరి: ‘మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు.. భారీ మెజారిటీతో గెలిపించారు.. వారి రుణం తీర్చుకునే సమయం వచి్చంది.. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించా.. ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. నాన్న స్పీకర్ ప్రసాద్కుమార్ సహకారం.. ప్రభుత్వ అండదండలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’ అని 17వ వార్డు కౌన్సిలర్.. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అనన్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మీ విజయానికి దోహదం చేసిన అంశాలు? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే నా విజయానికి దోహదం చేశాయి. 17వ వార్డు ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. నాన్న ఆశీర్వాదం ఫలించింది. అందరి ఆదరణతోనే విజయం సాధించా. ఏయే సమస్యలు గుర్తించారు? వార్డుల్లో పర్యటించినప్పుడు పలు చోట్ల డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉన్నట్లు గుర్తించాం. తొలుత వీటి పరిష్కారానికి కృషి చేస్తాం. అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ? వికారాబాద్ పట్టణంపై పూర్తి అవగాహన ఉంది. నాన్న రాజకీయాల్లో ఉండటంతో చాలా నేర్చుకున్నా.. మున్సిపల్, ప్రభుత్వ నిధులతో వికారాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిజామాబాద్పై ఉత్కంఠ.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. మొత్తం 7 కార్పొరేషన్లలో రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో పూర్తి మెజార్టీతో ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకోగా.. కొత్తగూడెం, నిజామాబాద్ పరిస్థితి ఉత్కంఠగా మారింది.కొత్తగూడెంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. 60 స్థానాలకు గాను కాంగ్రెస్ -22, బీఆర్ఎస్ -8, బీజేపీ -1, ఇతరులు -29 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు.. కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్లాన్ మార్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో సీపీఐ కలిసి వెళ్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఇక, నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ రావడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్లో మొత్తం డివిజన్లు 60 ఉండగా.. బీజేపీ-28, కాంగ్రెస్-18, ఎంఐఎం-13, బీఆర్ఎస్-1 స్థానాలను దక్కించుకున్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొలిటికల్ సస్పెన్స్ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారింది. అయితే, ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎంఐఎం కీలకం కావడంతో మేయర్గా ఆ పార్టీ మెంబర్ ఉంటారా? లేక కాంగ్రెస్ నుంచి ఎన్నుకుంటారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంటుంది.అటు మహబూబ్నగర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ -29, బీఆర్ఎస్ -15, బీజేపీ -7, ఇతరులు - 8 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు దక్కలేదు. అయితే, ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్లో చేరే అవకాశం ఉండటంతో మేయర్ పీఠం హస్తం పార్టీకే దక్కే చాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 66 స్థానాలకు గాను 30 సీట్లలో సొంతంగా విజయం సాధించింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే మరో నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ కార్పోరేటర్ బీజేపీలో చేరిపోయారు. దీంతో, బీజేపీ బలం 34కు చేరుకుంది. ఈరోజు లేదా రేపు మరో ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. హాంగ్ ఏర్పడ్డ 37 మున్సిపాలిటీలు , మూడు కార్పోరేషన్లలో పార్టీ వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్పై సూచనలు చేయనున్నారు. -
కొత్తగూడెంలో 50–50
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్ సీపీఎంతో జత కట్టి 58 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు ఆ పార్టీ 22 డివిజన్లకే పరిమితం కాగా, మిత్రపక్షమైన సీపీఎం రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచింది. ఆది నుంచీ చెబుతున్నట్టుగానే 22 స్థానాల్లో సీపీఐ గెలిచింది. 51 డివిజన్ నుంచి గెలిచిన అభ్యర్థి సీపీఐకి మద్దతుదారుగా ఉన్నారు. కింగ్ ఎవరో? కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు 31 డివిజన్లలో గెలవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీలుగా అవతరించినా సరిపడా మెజారిటీ సాధించలేకపోయాయి. అయితే కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేసేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కారద్యర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినట్టు తెలిసింది. సీపీఐ 23 స్థానాలకు తోడు బీఆర్ఎస్ సభ్యులు 8 మంది తోడైతే మేయర్ పదవి సీపీఐ ఖాతాలో పడుతుంది. అయితే, బీఆర్ఎస్ ఆఫర్పై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగూడెం విషయంలో సీఎం రేవంత్రెడ్డి సైతం కూనంనేనికి ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే సీపీఐ– కాంగ్రెస్లు కలిసి అధికారం పంచుకునే వీలుంది. కీలకంగా ఎక్స్అఫీషియో ఓట్లు మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి కాంగ్రెస్ బలం 23గా ఉంది. ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది. వారు కాంగ్రెస్ పక్షాన నిలిస్తే హస్తం ఖాతాలో 28 డివిజన్లు ఉంటాయి. మెజారిటీకి మరో మూడు ఓట్లు అవసరం పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ను చేరుకుంటుంది. అయితే, సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురించని పక్షంలోనే ఈ సమీకరణానికి చోటుంది. ఒక వేళ సీపీఐ అనుబంధ సభ్యుడు, ఒకరిద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం వైపు మొగ్గు చూపినా కాంగ్రెస్కు మేయర్ పదవి దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎక్స్అఫీషియో కోటాలో సీపీఐకి కూనంనేని సాంబశివరావుతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు ఓట్లు అండగా నిలిచే అవకాశముంది. కొత్తగూడెం మేయర్ మాకే!సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మేయర్ స్థానం సీపీఐకి వచ్చే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేయర్ స్థానం కమ్యూనిస్టులకు రావడం గొప్ప గౌరవమన్నారు. కమ్యూనిజంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విజయం కార్మికులకు అంకితమని, తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ఫోన్లో హామీ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ మాట్లాడలేదని వివరించారు. -
కాంగ్రెస్పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ‘సామ, భేద, దాన, దండోపాయాలు‘అన్నీ ప్రయోగించినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దురి్వనియోగం పరాకాష్టకు చేరినా ఓటర్లు భయపడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక ‘123 చోట్ల ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో ప్రత్యక్షంగా గెలిచాం. 30 చోట్ల హంగ్ పరిస్థితి నెలకొన్నది. మరో 10–15 చోట్ల బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 117 స్థానాల్లో బలమైన ఫలితాలు సాధించాం. అధికారంలో లేని పార్టీగా ఇదే ప్రజాభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి వన్సైడ్ అవుతాయి. మంచి పరిపాలన ఉంటే 80–90 శాతం స్థానాలు గెలుస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు కూడా నిండకముందే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. 4 వేల పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీఆర్ఎస్నే ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దించే శక్తి బీఆర్ఎస్కే ఉందని ఈ ఫలితాలు తేల్చాయి. హంగ్ వచ్చిన చోట్ల ఏ వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో చర్చించి, స్థానిక నాయకత్వ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ‘రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి చెన్నూరు, క్యాతనపల్లి ప్రాంతాల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాం. చాలామంది వచ్చారు..పోయారు నేనే రాజు, నేనే మంత్రి అనుకునే వారు చాలామంది వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే గాలి తీసుకుపోతుంది. ఇందిరాగాం«దీ, ఎన్టీ రామారావులనూ ఓడించిన దేశమిది. మీ ప్రభుత్వంపై అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ప్రజల తీర్పే అసలు ఇండికేటర్..’అని కేటీఆర్ సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రం చేస్తామని అన్నారు. సింగరేణి కంపెనీలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై మేము పోరాడుతున్నామని చెప్పారు. -
కాంగ్రెస్ ఫుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అంచనాలకు తగినట్టుగానే ఆధిక్యత సాధించడంతో అధికార కాంగ్రెస్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత, 2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పనితీరుతోనే మన్ననలు ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల మనసును గెలుచుకోవడానికి పార్టీ పనితీరే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత 26 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వా సం పెరిగిందని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సన్నబియ్యం, రేషన్కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కీలకపాత్ర పోషించాయని, సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా సాగిన ఎన్నికల ప్రచారం, వ్యూహాల అమలు కూడా ఫలితాన్నిచ్చాయని పేర్కొంటున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో స్వీప్ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తోన్న వారందరి సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు, కోస్గి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోని మధిరతో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి (హుజూర్నగర్, నేరేడుచర్ల), దామోదర రాజనర్సింహ (ఆంథోల్), వాకిటి శ్రీహరి (మక్తల్), సీత క్క (ములుగు), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (ఏదులాపురం), దుద్దిళ్ల శ్రీధర్బాబు (మంథని), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వివేక్ (చెన్నూరు), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)లలో కాంగ్రె స్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంది. మంత్రులు అజహరుద్దీన్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. వాటి కోసం స్వతంత్రుల సాయం సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాని ఐదు చోట్ల స్వతంత్రుల సాయంతో గెలిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గద్వాల, వేములవాడల్లో ఇద్దరు చొప్పున ఇండిపెండెంట్లు, మొయినాబాద్, బెల్లంపల్లిలో ఐదుగురు, పరిగిలో ఇద్దరు స్వతంత్రుల సహకారంతో ఆయా మున్సిపాలిటీ లు, జగిత్యాలలో రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కచి్చతంగా బీజేపీ, బీఆర్ఎస్లు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ రానున్న 10–12 స్థానాల్లో కూడా వీలున్న మున్సిపాలిటీలను స్థానిక పరిస్థితులను బట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఆ రెండు కార్పొరేషన్లపై గురి మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పరిశీలిస్తే ముందు నుంచీ ఊహించినట్టుగానే నల్లగొండ, రామగుండం, మంచిర్యాల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. నిజామాబాద్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఢిల్లీ నుంచి సీఎం ఆరా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడి నుంచే ఫలితాలపై ఆరా తీశారు. గెలిచిన చోట్ల ప్రజా ప్రతినిధులను, పార్టీ నేతలను అభినందించడంతో పాటు గెలుపునకు దగ్గరగా వచి్చన మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడంపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షిలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్స్ అఫీషియో ఓట్లు ఎక్కడ ఎన్ని అవసరమవుతాయో అంచనాలు వేశారు. కీలకంగా వార్ రూమ్ ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో కాంగ్రెస్ వార్ రూం కీలకంగా పనిచేసి సత్ఫలితాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్లిన తీరును గమనించడం బూత్ల వారీగా ప్రచారం సమన్వయం చేయడం, గడప గడపకూ సంక్షేమ పథకాలను చేరవేయడం, మహిళా సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించడం, క్లబ్బులతో సంప్రదింపులు జరపడం లాంటి కార్యక్రమాల ద్వారా వార్రూం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమన్వయం చేసిన ఈ వార్రూంను పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ముందుండి నడిపించారు. మిన్నంటిన సంబురాలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గాం«దీ భవన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, పీసీసీ నేత అల్లం భాస్కర్ తదితరులు నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకున్నారు. -
పురంలో పైచేయి
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం. 51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్న్ను దక్కించుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది. ఇక్కడ గులాబీ పరిమళం ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. 40 చోట్ల హంగ్! గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్పర్సన్లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్లో కూడా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. క్యాంపులు షురూ..! ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రిమున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
నల్లగొండ అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే నల్లగొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు.ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు.ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారుఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు -
ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం కార్పొరేషన్
ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ రేపుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెంలో సీపీఐ తన సత్తా చాటింది. మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 20, సీపీఐ 24 చోట్ల గెలుపు సాధించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్వీస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ (9) బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఐ.. బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా? కాంగ్రెస్తో జత కడుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెంలో బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నాయి.ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు. ‘‘కేటీఆర్ మాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం, మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తాం. మేం కాంగ్రెస్తో చర్చలు జరపలేదు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని.. మేయర్ సీట్ను త్యాగం చేయటం కుదరదంటూ కూనంనేని తేల్చి చెప్పారు. మరోవైపు, కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశామని.. సీపీఐ తమ మిత్ర పక్షం అని కాంగ్రెస్ అంటోంది. మాకు, సీపీఐకి కలిసి 44 స్థానాలు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 8 స్థానాలు అత్యంత కీలకంగా మారాయి. -
‘ఎన్ని విమర్శలు, వెటకారాలు చేసినా కాంగ్రెస్కే పట్టం కట్టారు’
నిజామాబాద్: తమ పార్టీపై ఎన్నో విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని, అదే ఇంతటి ఘన విజయానికి కారణమైంద్నార. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నిజమాబాబ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 70 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్ని ఆదరించారు. 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదు. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ, ఎంఐఎంలు లబ్ధిపొందాయి. సీఎం రేవంత్, మంత్రులు, ప్రజల కోరికలను నెరవేర్చేలా పాలిస్తున్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. -
మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్
-
వారికే ఈ విజయం అంకితం.. సీఎం రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026 -
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్.. కార్యకర్తల సంబరాలు
-
కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం : కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
సిరిసిల్లలో కారు జోరు BRS లో ఫుల్ జోష్
-
కరీంనగర్ లో కాంగ్రెస్ జోరు వెనకబడ్డ బీజేపీ, బీఆర్ఎస్
-
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
-
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. ఐదు చోట్ల హంగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.ఏఐఎఫ్బీ ప్రభంజనం.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.కాంగ్రెస్ హవా.. కారు జోరు.. కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి. -
మధిర, హాలియాలో కాంగ్రెస్ కైవసం
-
మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ విజయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.👉మరోవైపు.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. గడ్డపోతారంలో మొత్తం 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక, నందికొండలో 12 వార్డులకు గాను.. 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. కే. సముద్రం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.👉సుల్తానాబాద్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.👉డోర్నకల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది.మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరిపెడ 15 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-6 విజయం సాధించాయి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు(10) స్థానాల్లో కాంగ్రెస్-7, బీఆర్ఎస్-2, సీపీఐ-1 విజయం సాధించాయి.చిట్యాల కాంగ్రెస్ విజయం చోటుచేసుకుంది. చిట్యాల (12) స్థానాల్లో కాంగ్రెస్-9, బీఆర్ఎస్-2 విజయం. హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-2 విజయం. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. గుమ్మడిదల 22 స్థానాల్లో బీఆర్ఎస్-14, కాంగ్రెస్-4. బీజేపీ-2 విజయంచొప్పదండి కాంగ్రెస్ వశం.. చొప్పదండిలోని 14 స్థానాల్లో కాంగ్రెస్-10, బీజేపీ-3, బీఆర్ఎస్-1 స్థానం విజయం. -
మున్సిపల్ ఫలితాలు.. కాంగ్రెస్ హవా
Telangana Municipal Elections 2026 Results👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు👉వార్డుల వారీగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్లో ముగిసిన ఓట్ల లెక్కింపుఅతిపెద్ద పార్టీ గా బీజేపీ ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమిబీజేపీ 28కాంగ్రెస్ 18ఎంఐఎం 13బీఆర్ఎస్ 01తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్ విజయం15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ రామగుండంలో కాంగ్రెస్ విజయం వెనుక మంత్రి శ్రీధర్బాబు కీలక పాత్రపెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్బాబుమంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ స్కెచ్ నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులుకాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజఎంఐఎం 10 డివిజన్లలో ముందంజబీఆర్ఎస్ ఒక డివిజన్లో ముందంజ కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాంకాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందిఅధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారుకాంగ్రెస్, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్(మొత్తం 60 డివిజన్లు)ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీసీపీఐ -24చోట్ల గెలుపుకాంగ్రెస్-20చోట్ల గెలుపుబీఆర్ఎస్-09సీపీఎం -01బీజేపీ -01 నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంమంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్దే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసంకరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్బీజేపీ 33కాంగ్రెస్ 12బీఆర్ఎస్ 9ఇండిపెండెంట్స్ 6ఎంఐఎం 3ఆల్ ఇండియా ఫార్వబ్లాక్-3రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 3.17pmవరకు ఫలితాలు -48కాంగ్రెస్ 31బీఆర్ఎస్ 12బిజెపి 01ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03ఇండిపెండెంట్ 01సిద్ధిపేట జిల్లాహుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం మెదక్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనారాయణపేట: మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంవరంగల్: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమెదక్: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కైవసంమెదక్: తుప్రాన్మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ ఆధిక్యందాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్దేవరకద్ర, కేసముద్రం, జహీర్బాద్లో హంగ్అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామల్ హంగ్ఆసిఫాబాద్, జమ్మికుంట,జిన్నారంలో హంగ్మహబూబాబాద్,బోధన్, వేములవాడ, ఆలియాబాద్లో హంగ్ జగిత్యాల జిల్లా :ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసంమొత్తం స్థానాలు 1515స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులుఖమ్మం:వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్కరీంనగర్ జిల్లా:తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల్లో 30 స్థానాల్లో లీడ్లో దూసుకుపోతున్న బీజేపీరాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్ఈసీ రాణి కుమిదినిఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు సిద్దిపేటచేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్మహబూబాబాద్ జిల్లా;మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళనకౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్ జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపుజ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలుక్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పోలీసుల రంగ ప్రవేశంఆభ్యర్ధిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులుమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసనఖమ్మం జిల్లాకల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీరాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులుకౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులుబయటకు నెట్టేసిన పోలీసులు..కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమేడ్చల్ జిల్లా అలియాబాద్లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతస్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులుపోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, తోపులాట ధర్మపురిలో సంచలన ఫలితాలు..ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాభవం.15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు.. హంగ్ ఎఫెక్ట్.. స్వంత్రులకు గిరాకీ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ.దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్లో హంగ్.అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో హంగ్.ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్.బోధన్, వేములవాడ, అలియాబాద్లో హంగ్.ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. కాంగ్రెస్ ఆధిపత్యం.. మధిరలో కాంగ్రెస్ ఘన విజయంమధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్ కైవసం.ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్ఎస్మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంసంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంపెబ్బేరు కాంగ్రెస్ కైవసం. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంజమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యంఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంసిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం బీఆర్ఎస్ జోరు.. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం.క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం. కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మూడు చోట్ల హంగ్.. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్.కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం.అలంపూర్లో చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. సిరిసిల్లలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం.39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఘన్పూర్లో 18 స్థానాల్లో కాంగ్రెస్-13, బీఆర్ఎస్-5.హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.హుజురాబాద్ 30 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్.ఇస్నాపూర్లో 26 స్థానాల్లో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4జనగామలో బీఆర్ఎస్ ఆధిక్యం.జనగామలో 30 స్థానాల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-12, ఇతరులు-4గాంధీభవన్లో సంబురాలు..హైదరాబాద్..గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు.బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు. 👉ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా.👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం.ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం. ఖమ్మంలో కాంగ్రెస్ హవా..మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్ కైవసం. కొల్లాపూర్, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్ వశం..ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో కాంగ్రెస్ హవా..బాన్సువాడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.3 వార్డుల్లో బీజేపీ విజయం2 వార్డుల్లో స్వతంత్రులుఒక వార్డులో బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం.బోణీ కొట్టని బీజేపీ.కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. 👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అందించిన అధికారులు👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమొత్తం 20 వార్డులుకాంగ్రెస్-11బీఆర్ఎస్-6 ఇండిపెండెన్స్-2బీజేపీ-1 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయంచిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్ విజయం. మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరిపెడ 15..కాంగ్రెస్-8బీఆర్ఎస్-6 చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.చండూరు(10)కాంగ్రెస్-7బీఆర్ఎస్-2సీపీఐ-1చిట్యాల కాంగ్రెస్ విజయం.చిట్యాల (12)కాంగ్రెస్-9బీఆర్ఎస్-2 హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంహాలియా 12..కాంగ్రెస్-8బీఆర్ఎస్-2 గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.గుమ్మడిదల 22బీఆర్ఎస్-14కాంగ్రెస్-4బీజేపీ-2బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.22 వార్డుల్లో కాంగ్రెస్ 16 విజయం.వేములవాడలో బీజేపీ ఆధిక్యం.కోహిర్లో (16) ఇలా..కాంగ్రెస్-6బీఆర్ఎస్-5బీజేపీ-1 నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం.నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్నందికొండలో మొత్తం 12 వార్డులు.కాంగ్రెస్-11బీఆర్ఎస్-1 గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంసంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులుబీఆర్ఎస్-14కాంగ్రెస్-3ఇండిపెండెంట్-1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కిషోర్ గెలుపు13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపుమూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంహుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయంబీఆర్ఎస్ హవా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపుమేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపుసంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం... ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.విజయాలు ఇలా.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.వరంగల్ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.వైరా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో ఏడు వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.కొల్లాపూర్ 6,14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. అభ్యర్థుల విజయాలు..యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపుమరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం.సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు.100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్ఎస్ విజయం. ఆధిక్యం ఇలా.. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్ లీడ్.ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో బీజేపీ గెలుపు.ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్.నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. నల్లగొండ జిల్లాహాలియా మున్సిపాలిటీలోపోస్టల్ బ్యాలెట్ల ఫలితాలుకాంగ్రెస్ :32టీఆర్ఎస్ :8బీజేపీ : 1 ఇండిపెండెన్స్ :2నోటా: 1మొత్తం: 44చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుబీజేపీ:1కాంగ్రెస్:2టీఆర్ఎస్:1 ఆధిక్యాలు ఇలా.. ఆదిలాబాద్..పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజ.కాంగ్రెస్ -29బీఆర్ఎస్ -5నోటా -1 సంగారెడ్డిసంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలుమొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం3 వార్డుల్లో BRS ఆధిక్యంక్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుహైదరాబాద్..క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలునగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపుఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలుబీఆర్ఎస్ ఆగ్రహంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా..అశ్వారావుపేట కౌంటింగ్ హాల్లో అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం..అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్ఎస్ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనఅందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలుబీజేపీ అభ్యర్థి మృతి.. మంచిర్యాల..లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.బీజేపీ లీడ్.. కరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీ లీడ్.పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC. 👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుస్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.కరీంనగర్ జిల్లా:హుజురాబాద్లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠకౌంటింగ్ కేంద్రాల సందడి వాతావరణం,. క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలుఎన్నికల ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ఫలితాలపై అలర్ట్గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..ఇంకా క్యాంప్లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్కు అడగాలని సూచించిన మహేష్ కుమార్. ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపుఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులుఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికఅభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలుకట్టుదిట్టమైన భద్రత: డీజీపీకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్రెడ్డిలెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రతపోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాకమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణకౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలుఅన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?ఫలితాలపై సర్వత్రా ఆసక్తిమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. -
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: ‘‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. పదిన్నరేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అన్నారు. తానూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని..తనను అన్నవాళ్లనే తాను అంటున్నానన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని.. కేసీఆర్, హరీష్రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు.‘‘మున్సిపల్ ఎన్నికల్లో నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా. జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ విగ్రహం నేనే ఆవిష్కరిస్తా. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతా. సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వం వచ్చినట్టుకే సింగరేణి అప్పుల్లో ఉంది. మా ప్రభుత్వం ఎవరి ఫోన్లు టాపింగ్ చేయడం లేదు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు.ప్రభాకర్రావును విచారించేందుకే మాకు 20 నెలలు పట్టింది. ఫోన్ టాపింగ్ కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్రావును రప్పించాను. త్వరలో చార్జిషీట్ కూడా వేయమని ఆదేశాలు ఇచ్చా. ప్రభాకర్రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టుపైకి లేస్తుంది. గుంతలోకి కూరుకుపోదు. ఎన్డీఎస్ఎ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుగుతుంది’’ అని రేవంత్ వెల్లడించారు. -
మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా.. పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..!
-
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
ఎన్నికల కమిషన్ నిర్ణయం.. జగ్గారెడ్డి రియాక్షన్
సాక్షి, సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడే తానూ మీడియాలో చూశానని సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించిందన్నారు.‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారు.. దీంతో నేను అక్కడికి వెళ్ళాను.. గొడవ జరిగింది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమై.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
‘సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత…— KTR (@KTRBRS) February 11, 2026 -
Exit Poll: మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా!
హైదరాబాద్: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగిందని పీపుల్స్ పల్స్ పేర్కొంది.కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు’’ అని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.‘‘రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉందిమహబుబ్నగర్లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది’’ అని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. -
ఒంటరిగానే గెలుస్తాం.. స్టాలిన్
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ అంశంపైనే ఇటీవల DMK ఎంపీ MP కనిమెుళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సారి కాంగ్రెస్కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డీఎంకే ఒంటరిగానే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 2021 లో సాధించిన స్థానాల కంటే ఈ ఏడాది మరిన్ని అధిక సీట్లు గెలుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గతంతో పోలిస్తే మరిన్ని అధిక స్థానాలు కోరుతుందని తెలుస్తోంది. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ స్థానంకోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సీట్ల షేర్ అంశాలు ఈ నెల 22నుంచి ప్రారంభమవుతాయని డీఎంకే పార్టీ ప్రకటించింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సినీనటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. -
అలాంటి వాడింకా పుట్టలేదు!
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బుధవారం లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ‘‘భరతమాతను ఎవరూ విక్రయించలేరు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేరు. అలా మన దేశాన్ని అమ్మేయగల, కొనగల వాడెవడూ ఇంకా పుట్టలేదు’’అంటూ రాహుల్ వ్యాఖ్యలను సభలోనే తిప్పికొట్టారు. దేశం ఇప్పటిదాకా చూసిన అత్యంత బలమైన ప్రధాని మోదీయేనని మంత్రి పేర్కొన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పడం, వాటిపై సంబంధిత మంత్రి సమాధానం కూడా వినకుండా ని్రష్కమించడం రాహుల్కు అలవాటేనని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ ఏ ప్రపంచంలో విహరిస్తుంటారో తెలియదు! విపక్ష నేతకు ఉండాల్సిన సీరియస్నెస్ ఆయనలో ఇసుమంతైనా లేదు. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తున్నప్పుడు సభలో ఉండాల్సిందిగా సూచించినా ఆగకుండా వెళ్లిపోయారు. ఒక సభ్యుడు తన ప్రసంగం పూర్తవగానే సభ నుంచి నిష్క్రమించడం నిబంధనలకు విరుద్ధం’’అని దుయ్యబట్టారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రిజిజు మీడియాతో కూడా మాట్లాడారు. విపక్ష నేత ప్రసంగం పూర్తిగా అబద్ధాలమయమంటూ దుయ్యబట్టారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ను కోరతామని పేర్కొన్నారు. అంతేగాక సభలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ ధ్రువీకరించాలంటూ నోటీసిస్తామని కూడా చెప్పారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావిస్తానని రాహుల్ పట్టుబట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ నడుమ జరిగే సంభాషణలను బహిరంగంగా చర్చించడం నిషిద్ధం. అలా చేస్తే దేశ భద్రత పరిస్థితేమిటి? ఇలాంటి సున్నితమైన అంశంపై రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోజూశారు. దీన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తాను ఎంపీనని, దేశ ప్రజల పట్ల తనకు నిర్దిష్ట బాధ్యతలున్నాయని ఆయన గుర్తుంచుకుంటే మంచిది’’అన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని రిజిజు మండిపడ్డారు. స్పీకర్తో దుర్భాషలు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్లోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని రిజిజు ఆరోపించారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ వాద్రా వంటి సీనియర్ నేతలు వాళ్లను వారించకపోగా మరింతగా ప్రోత్సహించారని ఆక్షేపించారు. ‘‘ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. బిర్లాపై కాంగ్రెస్ ఎంపీలు ఎలాంటి దారుణమైన పదాలు వాడారో చెప్పలేను! దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సహృదయుడు కాట్టి ఊరుకున్నారు గానీ లేదంటే వారిపై కఠిన చర్య తీసుకునేవారే’’అని చెప్పారు. #WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X— ANI (@ANI) February 11, 2026 -
దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత
కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రైవేట్ పార్టీకి వెళుతున్న సందర్భంలో చేతిలో పిస్తోలు పట్టుకొని ఇటీవల సూపర్ హిట్టైన దురంధర్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అతనిపై విచారణ చేపట్టారు.మథీన్ పటేల్ అనే కాంగ్రెస్ నేత అక్కడి కల్బుర్గి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఫంక్షన్లోకి వస్తుండగా ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. గన్స్తో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మథీన్ పటేల్ సైతం చేతిలో రివాల్వార్తో ఫోజులిచ్చారు.ఇటీవల విడుదలై సూపర్ హిట్టైన దురందర్ చిత్రంలోనే ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలై పోలీసుల దాకా చేరడంతో ఆయనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కల్బుర్గి పోలీస్ కమిషనర్ శరణప్పా ఈ అంశంపై స్పందించారు.మథీన్ పటేల్ పట్టుకున్న ఆయుధాలు నకిలీవా లేదా లైసెన్స్డ్కు చెందినవా అనే విషయాలు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆ ఫంక్షన్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారా అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆ గన్స్ లైసన్స్ లేనివైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఆ వీడియోలో, మథీన్ పటేల్ బ్లాక్ కలర్ SUVలో ఎంట్రీ ఇస్తారు. ఆయన అనుచరులు గన్స్తో స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి గన్స్తో డాన్స్ చేస్తాడు. ఈ సన్నివేశం ఇటీవల రిలీజైన దురంధర్ చిత్రంలోని రెహమాన్ డకైట్ (అక్షయ్ ఖన్నే) ఎంట్రీ లాగానే ప్లాన్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A display of “gun culture” by a #Congress leader in #Kalaburagi district has now become a major topic of debate.A Congress leader named Mateen Patel, said to be a close associate of #Afzalpur Assembly constituency MLA #MYPatil, is at the center of the controversy after videos… pic.twitter.com/hFASTKkwuH— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2026 -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి అక్కడి నుంచి చెదరగొట్టారు.కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుపై చేయి చేసుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసిన కృష్ణ. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు.బీఆర్ఎస్ శ్రేణుల డబ్బుల పంపిణీభూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో, బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.👉జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, తోపులాట జరిగింది. నినాదాల విషయంలో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం చోటుచేసుకుంది.👉వరంగల్లోని నర్సంపేట పరిధి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా డబ్బులు పంచుతుండగా కార్యకర్తలను పట్టుకున్న పోలీసులు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ వద్ద రూ.10 వేలు స్వాధీనం.👉వికారాబాద్లోని పరిగిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల వాగ్వాదం నెలకొంది. 13వ వార్డు 27వ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. స్థానిక ఓటర్లే గుర్తింపు కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న కాంగ్రెస్ వర్గీయులు. నిరసనకారులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు. ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 13వ వార్డు ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. -
హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. 2007 ఏప్రిల్ 16న శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో 150 వార్డులుగా ఏర్పాటైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) రూపురేఖలు బుధవారం (2026 ఫిబ్రవరి11) నుంచి మారిపోతున్నాయి. జీహెచ్ఎంసీగానే 300 వార్డులకు విస్తరించి మహా కార్పొరేషన్గా అవతరించిన జీహెచ్ఎంసీ.. తిరిగి 150 వార్డులతోనే అయినప్పటికీ కొత్త రూపుతో కనిపించనుంది. అటు తొర్రూరు నుంచి ఇటు అడ్డగుట్ట దాకా విస్తరించినప్పటికీ, వనస్థలిపురం, పెద్దఅంబర్పేట, కూకట్పల్లి, హైటెక్సిటీ వంటి ప్రాంతాలను వదులుకోవాల్సి వచ్చింది. అవి కొత్తగా ఏర్పాటైన రెండు కార్పొరేషన్లలో కనిపించనున్నాయి. 5 జోన్లుగా అవతరించిన జీహెచ్ఎంసీ అనంతరం 6 జోన్లుగా మారింది. తిరిగి 12 జోన్లకు విస్తరించిన పరిధి మళ్లీ 6 జోన్లకు పరిమితమైంది. అలా.. మారిన నగరం.. అభివృద్ధి ఘనం.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడిన జీహెచ్ఎంసీ.. తిరిగి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రూపురేఖలు మార్చుకుంది. గడచిన పుష్కర కాలంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగాయి. విదేశాలను తలపించేలా బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం), ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) కింద వేల కోట్ల పనులు జరిగాయి. దాదాపు రూ.24వేల కోట్లతో 23 ఫ్లై ఓవర్లతో సహ దాదాపు 40 ప్రాజెక్టుల పనులు జరిగాయి. బాండ్ల ద్వారానూ రుణాలు సేకరించిన కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ పేరు తెచ్చుకుంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, పార్కుల ఏర్పాటు, పచ్చదనం, సుందరీకరణ వంటి పనులు జరిగాయి. నిర్వహణ తీరెలా ఉన్నా ఎల్ఈడీ స్ట్రీట్లైట్స్ వంటివి ఏర్పాటు చేశారు. దేశంలోని అగ్రనగరాలతో పోటీ పడుతూ నగరం ఎదిగేలా జీహెచ్ఎంసీ తనవంతు పాత్ర నిర్వహించింది. -
బల్దియాకు కొత్త రూపు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థానిక పరిపాలన మారనుంది. బుధవారం నుంచి నూతన రూపు రానుంది. కొత్త ఊపుతో కొత్త అధికారులు పరిపాలన సాగించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం వారిని సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ 150 వార్డులుగా ఉన్నప్పుడు ఎన్నికైన పాలక మండలి గడువు మంగళవారంతో ముగిసిపోవడంతో కొత్త పాలన ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ వార్డుల్ని 150 నుంచి 300కు పెంచిన ప్రభుత్వం మూడు కార్పొరేషన్ల విభజన, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన జీవోలను బుధవారం జారీ చేయనుంది. ఆ వెంటనే కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ 150 వార్డులతోనే ఉండనున్నప్పటికీ, ప్రాంతాలు, వార్డుల్లో మార్పులు చేర్పులుంటాయి. కొత్తగా సైబరాబాద్ కార్పొరేషన్ 76, మల్కాజిగిరి కార్పొరేషన్ 74 వార్డులతో ఏర్పాటు కానున్నాయి. సైబరాబాద్ కమిషనర్గా సృజన, మల్కాజిగిరి కమిషనర్గా వినయ్కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్ కొనసాగుతారు. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకే.. కొత్త కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ యాక్ట్, నిబంధనల మేరకే ఏర్పాటు చేస్తున్నందున.. ఈ పరిధిలో అమలయ్యే విధానాలే అనుసరిస్తారు. నగరంలో ఉండే మూడు కార్పొరేషన్లు పరస్పర సమన్వయంతో పని చేయనున్నాయి. మూడు కార్పొరేషన్లు, ముగ్గురు కమిషనర్లు స్వతంత్రంగానే పని చేయనున్నప్పటికీ, యూనిఫామ్గా పనులు జరగనున్నాయి. మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా నియామకం కానున్న మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ సూపర్బాస్గా వ్యవహరించనున్నారు. ఆస్తిపన్ను విధింపు విధానాలు, రేట్లు మూడు కార్పొరేషన్లలో ఒకే మాదిరిగా ఉంటాయి. ఎన్నికల దాకా.. కొత్త అధికారులు మూడు కార్పొరేషన్లకు పాలకమండళ్ల ఎన్నికలు జరిగేంత దాకా వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వనున్నారు. పౌరసేవల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి. వీలైనన్ని పనుల్ని ప్రజలు కార్యాలయాల దాకా రాకుండా ఆన్లైన్ ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ, తదితర పనులు సైతం ఒకేవిధంగా ఉంటాయి. దోమల నివారణ విభాగంలో ప్రస్తుతం సర్కిల్కు ఒక అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ ఉండగా, ఇకనుంచి అన్ని కార్పొరేషన్లలో కూడా రెండు వార్డులకు ఒకరు, పెద్ద వార్డులకైతే ఒకే వార్డుకు ఒకరు చొప్పున వార్డు ఎంటమాలజీ సూపర్వైజర్లుంటారు. పదంతస్తుల వరకు మాత్రమే అనుమతులు భవన నిర్మాణాలకు సంబంధించి 30 మీటర్ల ఎత్తు (పదంతస్తుల) వరకు ఆయా కార్పొరేషన్లే అనుమతులివ్వనుండగా, అంతకు మించిన భవనాలకు అనుమతుల అధికారం హెచ్ఎండీఏకు ఉంటుంది. నిర్మాణ అనుమతుల ఫీజుల్లో 5 నుంచి 10 శాతం వరకు సొమ్మును జీహెచ్ఎంసీ వాటాగా బదలాయించాల్సి ఉంటుందని సమాచారం. రోడ్ల నిర్వహణ కోసం ఈ మొత్తం బదలాయించనున్నారు. కొట్టు.. కొట్టు.. కొబ్బరి కాయసాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలకమండలి గడువుకు చివరి రోజైన మంగళవారం నగర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్, డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఐదేళ్లలో చివరి రోజుల్లో మాత్రమే కార్పొరేటర్ ఫండ్ కేటాయించడంతో వీలైనన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్పొరేటర్ ఫండ్గా రూ. 2 కోట్లు ఇచ్చినప్పటికీ, రూ.కోటికి జిల్లా ఇన్చార్జి మంత్రి సిఫారసు కావాలనడంతో చాలామంది కేవలం రూ.కోటి పనులు మాత్రమే పొందగలిగారు. డివిజన్లలో బిజీబిజీగా గడిపారు. ఆఖరి.. ఆట విడుపు చాదర్ఘాట్లో ఆధునికీకరించిన విక్టోరియా ప్లేగ్రౌండ్ను స్థానిక కార్పొరేటర్తో కలిసి మేయర్ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కాసేపు క్రికెట్, వాలీబాల్ ఆడారు.అప్పులపై ప్రభుత్వ సహకారం ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల కోసం జీహెచ్ఎంసీ చేసిన అప్పుల భారంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై చేయబోయే పనులకు ఏకార్పొరేషన్ పరిధిలోది ఆ కార్పొరేషన్ భరించాల్సి ఉంటుంది. పరిస్థితుల దృష్ట్యా కొంత కాలం వరకు ప్రభుత్వమే తగిన నిధుల్ని సమాకూర్చాల్సి ఉంటుంది. ఎవరి లెక్కలు వారివే.. ఏ కార్పొరేషన్ పరిధిలోని ఆదాయం, వ్యయం ఆ కార్పొరేషన్కే చెందుతాయి. ఇందుకుగాను వేటికవి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు నుంచే సంబంధిత వార్డుల ఆస్తిపన్ను ఆదాయంతో పాటు ఆయా అంశాలకు సంబంధించిన ఫీజులు ఆ కార్పొరేషన్ ఖాతాలోనే జమ అవుతాయి. వచి్చన ఆదాయంలోంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్.. -
కార్పొరేషన్ కహానీ
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన జాబితాలో మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్ ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం గతం నుంచి కార్పొరేషన్లుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండలో పోటీలో ఉంది. దీంతో ప్రధాన పార్టీల గెలుపోటములపై మజ్లిస్ ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ఫైట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీలగిరి కార్పొరేషన్పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అయితే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే కొనసాగుతోంది. ఇటీవల కార్పొరేషన్గా మారిన నల్లగొండలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. బీజేపీ మజ్లిస్ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.బీజేపీ– కాంగ్రెస్ హోరాహోరీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవు. అయితే ఫలితాల అనంతరం మాత్రం పొత్తులు నెలకొనే పరిస్థితులు ఉంటాయనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య అవసరాన్ని బట్టి పొత్తులు కుదిరే అవకాశముంది. కమలం – హస్తం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. అయితే కొన్ని డివిజన్ల పరిధిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల నడుమ త్రిముఖపోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, రెబెల్స్ మధ్య పోటీ ఉంది. ఎంఐఎం కూడా 15 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపింది. ఈ కార్పొరేషన్ పరిధిలో హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కూడా కాంగ్రెస్కే దక్కింది. మెజారిటీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులదే పైచేయిగా ఉంది. మొదటి సారిగా బీజేపీ అధిక డివిజన్లలో పోటీ చేస్తోంది.‘గూడెం’లో కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ వైరివర్గాలుగా మారి కొత్తగూడెంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టి 58 డివిజన్ల నుంచి బరిలోకి దిగింది. సీపీఐ, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని 57 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. రెండు పార్టీల రెబెల్స్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ చివరకు ఒంటరిగానే బరిలో నిలిచింది. మంచిర్యాలలో కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉండగా, పలు డివిజన్లలో బీజేపీ కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేషన్గా మారాక మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది. నగరంలో అన్నిపార్టీలకు బీసీల మద్దతే కీలకంగా మారింది. అన్ని పార్టీలు మహిళలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ అధికంగా బీసీలకే బీఫాంలు ఇచ్చాయి. పాలమూరు.. త్రిముఖ పోరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత ఇలాకా కావడం.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా పాలమూరు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, మరి కొన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు 16 డివిజన్లలో పోటీలో ఉన్నారు. వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. -
స్పీకర్ను తొలగించాలి
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసిచ్చింది. రాజ్యాంగంలోని 94–సి ఆర్టీకల్ కింద లోక్సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు దాన్ని అందజేసింది. ‘‘సభా వ్యవహారాల నిర్వహణలో ఓం బిర్లా పూర్తిగా ఏకపక్షంగా, విపక్షాల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు’’అని ఆరోపించింది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్, ఆ పార్టీ చీఫ్ విప్ కె.సురేశ్, విప్ మొహ్మద్ జావెద్ విపక్షాల తరఫున మంగళవారం మధ్యాహ్నం సెక్రెటరీ జనరల్కు నోటీసు అందజేశారు. ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ పదవి నుంచి తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ‘‘సభలో పలుమార్లు విపక్ష సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై విపక్ష నేత రాహుల్గాంధీ ప్రసంగాన్ని పూర్తి కూడా చేయనివ్వలేదు. స్పీకర్ వివక్షాపూరిత ధోరణికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. విపక్ష నేతను సభలో అసలు మాట్లాడనివ్వనే లేదు. ఫిబ్రవరి 4న ఒక బీజేపీ ఎంపీ మాజీ ప్రధానులపై అత్యంత అభ్యంతరకరంగా మాటల దాడి చేసేందుకు స్పీకర్ అనుమతించారు. పైగా అలా చేసినందుకు ఆయనను కనీసం ఒక్కసారైనా మందలించలేదు.ఇలాంటి ప్రవర్తనను అలవాటుగా మార్చుకున్న సదరు సభ్యునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదు’’అని నోటీసులో ఎంపీలు ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు వెళ్లి ‘అనూహ్య చర్య’కు దిగాలని భావించినట్టు కచ్చితమైన సమాచారం తన వద్ద ఉందని స్పీకర్ చేసిన ప్రకటనను కూడా వారు ప్రస్తావించారు. ‘‘స్పీకర్ చేసిన ఈ ఆరోపణలు పూర్తి నిరాధారం. అంతేగాక కాంగ్రెస్ ఎంపీల పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయి. పార్లమెంటరీ పద్ధతులను, నియమ నిబంధనలను పరిరక్షించాల్సిన స్పీకరే ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేసేందుకు నిండు సభను వాడుకోవడం దారుణం. ఇది రాజ్యాంగబద్ధ పదవిని పూర్తిగా దుర్వినియోగం చేయడమే. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా విపక్ష సభ్యులను స్పీకర్ పలుమార్లు అడ్డుకున్నారు’’అంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్ష సస్పెండ్ చేయడం తదితరాలను కూడా అవిశ్వాస తీర్మానానికి కారణాలుగా వారు పేర్కొన్నారు. ఈ తీర్మానం మార్చి 9న సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్టు లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. రెండోసారి నోటీసు! స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు యోచిస్తున్నట్టు సోమవారం ఉదయమే వార్తలు రావడం తెలిసిందే. దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని అనంతరం విపక్ష నేతలు తెలిపారు. మంగళవారం ఉదయమే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పీకర్పై నోటీసివ్వాలని ఈ సందర్భంగా వారంతా నిర్ణయించారు. అనంతరం చివరి ప్రయత్నంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజుతో విపక్ష నేతలు భేటీ అయి తమ డిమాండ్లపై మరోసారి చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన లేదంటూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత లోక్సభ సెక్రెటరీ జనరల్కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు. అయితే తేదీని తప్పుగా పేర్కొనడంతో సాయంత్రం దాన్ని వెనక్కు తీసుకుని మరో నోటీసు సమర్పించారు. సంతకం చేయని రాహుల్! అవిశ్వాస తీర్మానం నోటీసుపై పలు పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు విపక్షాలు తెలిపాయి. వారిలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, ఆర్జేడీ సభ్యులున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు సంతకాలు చేయకపోయినా అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీలు మద్దతు తెలిపాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నోటీసుపై సంతకం చేయకపోవడం గమనార్హం. విపక్ష నేత రాహుల్గాంధీ కూడా సంతకం చేయలేదని సమాచారం!తీర్మానంపై తేలేదాకా విధులకు దూరంస్పీకర్ ఓం బిర్లా నిర్ణయం కాంగ్రెస్ తదితర విపక్షాలు తనపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం అంశం పరిష్కారమయ్యేదాకా విధులకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ బిర్లా సన్నిహిత వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. నైతిక ప్రమాణాలకు కట్టుబడుతూ ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు వివరించాయి. స్పీకర్పై గానీ, డిప్యూటీ స్పీకర్పై గానీ అవిశ్వాస తీర్మానం సభ పరిశీలనలో ఉండగా కార్యకలాపాలకు వారు అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 96 కూడా నిర్దేశిస్తోంది. విపక్షాలు అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్ను స్పీకర్ ఆదేశించారు. దానిపై నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇప్పుడేం జరుగుతుంది?స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ విపక్షాలు నోటీసివ్వడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ, విపక్షాల మధ్య పార్లమెంటులో పది రోజులుగా సాగుతున్న రగడ కాస్తా ఈ ఉదంతంతో కొత్త మలుపు తిరిగింది. దాంతో ఇకపై ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది. స్పీకర్ తొలగింపు ప్రక్రియను ఆర్టీకల్ 94సి లో స్పష్టంగా పొందుపరిచారు. దానిప్రకారం అవిశ్వాస తీర్మానం సాధారణ మెజారిటీతో నెగ్గితే స్పీకర్ ఉద్వాసనకు గురవుతారు. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసివ్వడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.దానిపై కనీసం ఇద్దరు ఎంపీల సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో స్పీకర్పై నిర్దిష్టమైన అభియోగాలను పేర్కొనడం తప్పనిసరి. అప్పుడు మాత్రమే స్పీకర్కు అవిశ్వాస తీర్మానంపై స్పందించేందుకు అవకాశం ఉంటుందని లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి.ఆచారి తెలిపారు. ‘‘తర్వాత తీర్మానంలోని భాష ప్రమాణాల మేరకు ఉన్నదీ లేనిదీ డిప్యూటీ స్పీకర్ పరిశీలిస్తారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎవరూ లేరు గనుక చైర్పర్సన్ల ప్యానల్లోని సీనియర్ మోస్ట్ సభ్యుడు ఆ బాధ్యత చేపట్టే అవకాశముంది. నోటీసిచ్చిన 14 రోజుల అనంతరం తీర్మానం సభ పరిశీలనకు వస్తుంది. సభాపతి దాన్ని సభ పరిశీలనకు ఉంచుతారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా కోరతారు.కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడితే తీర్మానాన్ని పరిశీలిచేందుకు సభ అనుమతి లభించినట్టు ప్రకటిస్తారు. అనంతరం తీర్మానంపై చర్చ చేపడతారు. 10 రోజుల్లో దానిపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీర్మానంలో తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు ఆర్టీకల్ 96 స్పీకర్కు అవకాశం కలి్పస్తోంది’’అని ఆయన వివరించారు. స్పీకర్పై ఇప్పటికే దాకా మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా, రెండుసార్లు ఓటింగ్ దాకా వచ్చినా అవి వీగిపోయాయి.స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు అనుసరించే పద్ధతి భిన్నంగా ఉండటమే అందుకు కారణమని ఆచారి తెలిపారు. ‘‘మెజారిటీ లెక్కింపు విషయంలో ఓటింగ్కు హాజరైన ఎంపీలను మాత్రమే కాకుండా, ఖాళీలను మినహాయించి లోక్సభ సభ్యులుగా ఉన్న వారందరి సంఖ్యనూ పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాలక పక్షానిదే అవుతుంది. కనుక తీర్మానం వీగిపోతుందే తప్ప గట్టెక్కదు’’అని వివరించారు. గతంలో స్పీకర్లు జీవీ మౌలాంకర్ (1954), హుకుంసింగ్ (1966), బలరాం జాఖడ్ (1987)పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాలిచ్చినా అవి వీగిపోయాయి. -
లోక్ సభలో యుద్ధం మొదలు 100 ఎంపీలతో కాంగ్రెస్ సిద్ధం
-
లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం నోటీసు ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గగోయ్ వెల్లడించారు. ఇందుకోసం వందమందికి పైగా ఎంపీల సంతకాలను కాంగ్రెస్ సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని పై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మొత్తం 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం, స్పీకర్ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాల నేపథ్యంలో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు. కాగా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు సూచించినప్పటికీ, చివరికి అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు. -
డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
-
మెదక్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్ మున్సిపాలిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో అర్ధరాత్రి డబ్బులు పంచుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దొరికిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. డబ్బులు పంచుతున్నారంటూ కారుపై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. అర్ధరాత్రి పూట వార్డుల్లోకి రావాల్సిన అవసరం ఏంటి అని కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవకు దారి తీసింది.కాగా, బల్దియా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా మెదక్ మున్ని పాలిటీలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు వచ్చిన నిధులతో పాటు కొంత వారు కలిపి పంచుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 5 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.4 నుంచి రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. వాటిలో ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఆయా పార్టీలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది.ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు.. కానీ ఆ వార్డులో ప్రత్యర్థి ఓడిపోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. డబ్బుల పంపిణీలో కేవలం కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులకు ఇచ్చి నేరుగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుడా ఫోన్లలో సైతం రహస్య విషయాలు మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు రికార్డు చేసి బహిర్గతం చేస్తారనే భయంలో అభ్యర్థులు కనీసం వారి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లాలోని 74 వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
మమతతో కట్.. లెఫ్ట్తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్కు తెరదించుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతలతో రాష్ట్ర నాయకులు చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.సీట్ల సర్దుబాటుపై పేచీఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలే కాంగ్రెస్-టీఎంసీలు విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెండు స్థానాల కోసం పొత్తు పెట్టుకోవడం కంటే, అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే పార్టీకి శ్రేయస్కరమని ఏఐసీసీ ఇన్చార్జ్ గులాం అహ్మద్ మీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత అనుభవాల మేరకు..గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించి 12.25 శాతం ఓట్ల వాటాను పొందిన కాంగ్రెస్, 2021 నాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా, ఓట్ల శాతం 3 శాతానికి పడిపోవడం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. పొత్తుల కారణంగా సొంత బలాన్ని కోల్పోతున్నామనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా నాటుకుపోయింది.వామపక్షాలతోనూ..మరోవైపు, ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలతో కూడా కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుంది. గత వైఫల్యాలను అంగీకరిస్తూ, భవిష్యత్తులో పార్టీ మనుగడ సాగించాలంటే సొంతంగా ఎదగడం తప్ప మరో మార్గం లేదని పరిశీలకుడు సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ కూడా తాము దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే ప్రకటించకుండా, ఎన్నికల ఫలితాల తర్వాతే తేల్చాలని పార్టీ నిర్ణయించింది.ఓటు బ్యాంకు లేదని..కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ ఒక భారం అని, దానికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేదని సీపీఐ(ఎం) ఎద్దేవా చేసింది. బీజేపీ, టీఎంసీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, తెర వెనుక మమతా బెనర్జీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోందని మహ్మద్ సలీం ఆరోపించారు. ఈ విమర్శలతో విపక్షాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు బహిర్గతమయ్యింది.చివరికి ఎవరికి లబ్ధి?మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఒంటరి పోరుతో బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఆసక్తికరంగా మారింది. ఇటు అధికార టీఎంసీ, అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా బరిలోకి దిగుతుండటంతో చతుర్ముఖ పోటీ ఖాయమైంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? మమతా బెనర్జీ తన కోటను కాపాడుకుంటారా? లేక కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందా? అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.ఇది కూడా చదవండి: పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు.. -
భాగవత్ విందులో అద్నాన్ సమీ.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..
ముంబై: గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం ముంబైలో సల్మాన్ ఖాన్, వికీ కౌశల్, రవీనా టాండన్, శిల్పా షెట్టి తదితరులకు భాగవత్ విందు ఇచ్చారు. ఆయనతో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను అద్నాన్ సమీ పోస్ట్ చేశారు.‘‘భాగవత్ జీ అద్భుతమైన వ్యక్తి. నా అపోహలు, అపార్థాలను చక్కగా నివృత్తి చేశారు’’ అంటూ పొగడ్తలు కురిపించారు. దీనిపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లు తీవ్రంగా స్పందించాయి. ‘అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాకిస్తాన్ ఎయిర్ పోర్స్ పైలట్. 1965 యుద్ధంలో ఆయన మన పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఆర్ఎస్ఎస్ జాతి వ్యతిరేకి’ అని కాంగ్రెస్ ఎక్స్లో మండిపడింది. ఆర్థిక నేరారోపణలతో లుకౌట్ నోటీసు జారీ అయిన నటునికి విందు ఇచ్చిన భాగవత్ ఏం సందేశం ఇస్తున్నారని శివసేన (యూబీటీ) ప్రశ్నించింది. -
బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్ఎస్కు అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ ఇప్పుడు నిధులు తెస్తామంటే నమ్మాలా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఏ ఒక్క పథకం కిందనైనా అదనంగా నిధులు తీసుకుని వచ్చారా? అని నిలదీశారు. పదేళ్లు వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు అన్ని పదవులు అనుభవించిన బీఆర్ఎస్కు సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఓటు వేయాలని అడిగే అర్హత లేదని అన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్ఎస్ కారణమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వాన్ని పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటు వేయాలని కోరారు. కళ్లముందున్న గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పారు. సోమవారం సీఎం తన నివాసంలో సలహాదారు వేం నరేందర్రెడ్డి, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ నేత నీలం మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? ‘2014 ఎన్నికల ముందు మోదీ పాలమూరు సభలో రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు గడిచినా రాలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఆ విషయం ప్రస్తావిరని భావించా. కానీ దాని ఊసెత్తకుండా మోదీని చూసి ఓటేయండని అడిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తామంటూ చెప్తారని ఆశించా. అదేమీ లేకుండా మహారాష్ట్రలో భూమి మునిగితే తెలంగాణ కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటూ రాష్ట్రాన్ని అవమానించారు. హైదరాబాద్లో వరద సమయంలో బండి సంజయ్ ఆటోకు ఆటో, బండికి బండి, ఇంటికి ఇల్లు అని ప్రచారం చేశారు. వారి మాట నమ్మి ప్రజలు దాదాపు 50 డివిజన్లలో గెలిపించారు. ఎన్నికలయ్యాక..మీకు ఇన్సూరెన్స్ ఉంది అన్నీ వస్తాయని చెప్పారు. సత్రంలో భోజనం ఉచితమే.. దానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖలా ఉంది బండి సంజయ్ తీరు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే యత్నం చేస్తున్నారు. 12 ఏళ్లుగా అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని వారిని ఇప్పుడు నమ్మొచ్చా? రాజ్యాంగబద్ధంగా, ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే నిధులను తాము ఇచ్చినట్లు చెప్పుకోవడమేమిటి? కేంద్రం తన విచక్షణతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరైనా మోదీ దృష్టికి తీసుకెళ్లారా?..’అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు మాట్లాడతారా? ‘కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీకి, ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం ఏమి న్యాయం? మూసీకి, మెట్రోకు, సమ్మక్క సారక్కకు, ఇతర దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చారా? వరంగల్ విమానాశ్రయం కోసం వందల కోట్లు ఖర్చు చేసి భూములు కేంద్రానికి ఇచ్చాం. పక్కనున్న ఏపీలో ఆరేడు విమానాశ్రయాలు ఉంటే.. తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? అసదుద్దీన్ను భూతంగా చూపించి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? బీజేపీకి అసదుద్దీన్ లైఫ్లైన్గా మారారు..’అని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడగాలి ‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రారు. వచ్చిన వారు అభివృద్ధి కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి వస్తారు. సభల్లో వారిద్దరు అహంకారం, విద్వేషంతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ వారికి ఓటు వేస్తే వారు మునిసిపాలిటీలకు రారు. అభివృద్ధి పట్టించుకోరు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కారణం కాదా? ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దు..’అని సీఎం వ్యాఖ్యానించారు. మేం రెండేళ్లలో ఎన్నో చేశాం.. ‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించి లాభాల బాటలోకి తెచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం.70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..’అని రేవంత్ కోరారు. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం?
ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాల అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతకరం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెండ్ తో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా కేంద్రం గా రాజకీయం వేడెక్కింది. సభలో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయన వైఖరిపై నిరసన చేపట్టన ప్రతిపక్షాలు నేడు ఆయనకు నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాజ్యాంగంలో 94సీ ప్రకారం స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.Opposition to move no-confidence motion against Lok Sabha Speaker Om Birla: Sources pic.twitter.com/e8PsUKw2Wp— ANI (@ANI) February 9, 2026లోక్ సభలో చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన నిర్ణయం తీసుకోలేకపోయారని అంటున్న రాహుల్ ఆరోపించారు. ఆర్మీ జనరల్ నరవానే పుస్తకంలో ఉన్న విషయాలను రాహుల్ లోక్ సభలో ప్రస్తావించడాన్ని స్పీకర్ ఓం బిర్లా , బిజెపి ఎంపీలు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.గతంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దంకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేసిింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై అప్పీలుకు కోర్టు సమయం ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో కాంగ్రెస్ ఆందోళన చేసింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. #UPDATE | According to Sources, the opposition will move it in the second part of the budget session, as it needs 20 days' notice. The grounds identified for the move include: Lok Sabha LoP not allowed to speak; women MPs named by the Chair; certain Treasury Bench MPs always… https://t.co/GoEY5mpWlR— ANI (@ANI) February 9, 2026 -
హార్వర్డ్ కోర్సు తెచ్చిన మార్పు సున్నా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఓ కోర్సుకు హాజరు కావడం ఎంతైనా అభినందనీయం. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ.. నాయకత్వ లక్షణాలన్న అంశంపై సాగిన ఈ కోర్సులో ఆయన అంతర్జాతీయ పోకడల గురించి నేర్చుకుని ఉండవచ్చు. అయితే కోర్సు ముగించుకుని హైదరాబాద్ రావడంతోనే ఆయనలో పాత రాజకీయ నాయకుడు మళ్లీ ప్రత్యక్షమైనట్టు కనిపిస్తోంది. భాష, తీరులో రెండింటిలోనూ ఏ మాత్రం మార్పు కనిపించలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలు భిన్నంగా ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్పై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించడానికి, కాంగ్రెస్ కేడర్లో ఊపు తేవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు లోకల్ సమస్యల ఆధారంగా జరుగుతాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు దక్కినా, బీఆర్ఎస్ కూడా గణనీయ విజయాలు సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఫలితాలు నాయకత్వంపై ప్రభావం చూపుతుందన్న అంచనాతో రేవంత్ కాంగ్రెస్ 90 శాతం సీట్లు గెలుచుకోవాలని మంత్రులకు, నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో రేవంత్ చేస్తున్న ప్రసంగాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేసిన హామీలు మొదలైన వాటి గురించి కంటే కేసీఆర్, బీఆర్ఎస్లపై విమర్శలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.‘‘మొగుడు,పెళ్లాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు.. మాకు కాదు. సన్నాసి, దొంగ ఎప్పటికి జాతిపిత కాలేడు’’ అన్న వ్యాఖ్యలు ఆ కోవకు చెందినవే. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఫ్రొఫెసర్ జయశంకరే జాతిపిత అని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘జర్నలిస్టులు, సినీ తారలు జడ్జిల ఫోన్లు విన్నారు.. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు ముసుగు తొడిగి విచారణకు తీసుకురావల్సింది అని కూడా వ్యాఖ్యానించారట. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిపై ఆరోపణలకు ఆధారాలుంటే వాటిని జనానికి చూపించవచ్చు కాని ఇంతవరకు అలాంటివి ఏవీ ప్రజల దృష్టికి రాలేదు. తాజాగా ఫోరెన్సిక్ లాబ్ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఎన్ని కేసుల ఆధారాలు పోయాయో చెప్పలేని పరిస్థితి. ప్రజలు నిజానికి ఇలాంటి వాటిని పట్టించుకుని ఓట్లు వేసే పరిస్థితి ఉందా అన్నది సందేహం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆయన పై వచ్చిన కేసు కూడా తీవ్రమైనదే. జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. అయినా తర్వాత కాలంలో రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హామీలు అమలు చేయడం, నాలుగు మంచి పనులు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొనడానికి ప్రయత్నం చేస్తే కీర్తి వస్తుంది. అలా కాకుండా కేసీఆర్ను, బీఆర్ఎస్ను దూషించుకుంటూపోతే ఏమి కలిసి వస్తుంది? రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు.కాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ పార్టీల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్చంగా ఇదే తరహాగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేస్తూ అసలు విషయాలను పక్కదారిని పట్టించడానికి, జగన్పై విషం కక్కడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆయన శిష్యుడైన రేవంత్ కూడా అదే ధోరణిలో వెళుతున్నారా అన్న అనుమానం వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అంటూ ఆరోపణలు చేసి చంద్రబాబు అప్రతిష్టపాలయ్యారు. తెలంగాణలో రేవంత్ జడ్జిల ఫోన్లు, సినిమా తారల ఫోన్లు, చివరికి మొగుడు ,పెళ్లాల ఫోన్లు టాప్ అయ్యాయని అంటున్నారు. ఇది బట్టకాల్చి మీద వేయడమా? లేక వాస్తవాలు ఉన్నాయా? సినిమా తారల ఫోన్లు టాప్ కాలేదని పోలీసు అధికారులే స్పష్టం చేసినట్లు కేటీఆర్ అంటున్నారు. అలాగే అంతకన్నా సంచలనం జడ్జిల ఫోన్లు టాప్ అయ్యాయని ఒక ముఖ్యమంత్రి అంటే అది సీరియస్ అంశం అవుతుంది. బహుశా రాజకీయ ప్రసంగంగా పరిగణించి న్యాయ వ్యవస్థ పట్టించుకుని ఉండకపోవచ్చు. ఎదుటి వారిపై వ్యక్తిత్వ హననం అన్నది చంద్రబాబు విధానం. దానినే రేవంత్ కూడా ఫాలో అవుతున్నారా అన్న సంశయం కలుగుతుంది. కేసీఆర్ జాతిపిత కాదని విమర్శ చేసినంతవరకు ఫర్వాలేదు కాని, ‘‘నీ జాతికి పిత’’ అనడం బాగోలేదు. కేసీఆర్ను జైలులో వేశాక బీజేపీ ఓట్లు వేయాలని రేవంత్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసింది తెలంగాణ ప్రభుత్వం కదా!కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? దీనిని బీజేపీ తప్పుపడుతుంటే కేంద్రం సీబీఐ విచారణ చేయాలని రేవంత్ అంటున్నారు. ఇది ఒక గేమ్ గా మారింది.తెలంగాణలో ఎవరు ఎవరితో రహస్య అవగాహనతో ఉన్నారో తెలియని రీతిలో రాజకీయాలు సాగుతున్నాయన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన విమర్శలకు బదులుగా తనను రేవంతుద్దీన్ అంటే సంతోషమేనని బదులు ఇచ్చారు. దీనివల్ల కాంగ్రెస్కు కొంత నష్టం, కొంత లాభం ఉండవచ్చు. కేసీఆర్కు కేటీఆర్ దొంగపుత్రుడు అయితే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని విమర్శించారు. కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారి కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాటి డైలాగులనే వాడి ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేసేవారు. కాని సీన్ కట్ చేస్తే చంద్రబాబు వెళ్లి మోడీతో పొత్తు పెట్టుకున్నారు.తెలంగాణలో అలా జరుగుతుందని కాదు..రాజకీయ విమర్శల బదులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఇలాంటివి ప్రస్తావనకు వస్తాయి. ఈ రకమైన వ్యాఖ్యల వల్ల రేవంత్ అమెరికా వెళ్లి నేర్చుకువచ్చింది ఏమిటి అన్న ప్రశ్నకు తావిస్తున్నారు.రేవంత్పై కేటీఆర్ కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై రేవంత్ వివరణ ఏమిటో తెలియదు.అయితే కేటీఆర్ కూడా రేవంత్ ను ఘాటుగానే విమర్శిస్తున్నారు. దానిని కూడా సమర్ధించజాలం. అయినా, ముఖ్యమంత్రి గా ఉన్నది రేవంత్ కనుక ఆయన మరింత బాధ్యతగా ఉంటే రాజకీయాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.కాని ఓట్ల వేటలో రాజకీయాలలో ప్రమాణాలు ఆశించడం అత్యాశే అవుతుందా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గొగోయ్ దంపతులకు పాక్ ఏజెంట్తో బంధం
గౌహతి: కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్య ఎలిజబెత్ కాల్బర్న్కు పాకిస్తాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్తో బలమైన సంబంధాలు ఉన్నాయంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సేకరించిన సమాచారాన్ని వారు రహస్యంగా పాక్కు చేరవేశారన్నారు. గొగోయ్ దంపతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. ‘‘బ్రిటిష్ వనిత అయిన ఎలిజబెత్ భారత్లో పని చేసినప్పుడు అలీయే ఆమెకు వేతనం చెల్లించాడు. ఈ విషయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనల్ని ఉల్లంఘించారు. కాల్బర్న్ ఇండియా రావడానికి ముందు ఆలీ ఆధ్వర్యంలోని ‘లీడ్ పాకిస్తాన్’ సంస్థలో పనిచేశారు. ఇండియాకు బదిలీపై వచ్చి ‘లీడ్ ఇండియా’లో పని చేశారు. దీనికి లీడ్ పాకిస్తాన్ సంస్థే నిధులు బదిలీ చేసింది. ఇందుకు యూపీఏ ప్రభుత్వం సహకరించి ఉండొచ్చు’’ అన్నారు.గొగోయ్కి ధైర్యముందా: కాల్బర్న్ ఇండియాలో పని చేస్తుండగా దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆలీకి చేరవేశారని హిమంత చెప్పారు. ‘‘ఆమె ఆరుసార్లు పాక్ వెళ్లొచ్చారు. మరోఎన్జీఓలో చేరాక మూడుసార్లు వెళ్లారు. కాల్బర్న్ భారత్లో ఉండడం దేశానికి ప్రమాదకరం. ఆమె ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) గుర్తింపును రద్దు చేయాలి. గౌరవ్ గొగోయ్ కూడా 2013లో అత్యంత రహస్యంగా పాకిస్తాన్లో పర్యటించారు. అక్కడ శిక్షణ పొంది ఉండొచ్చు. ఆ తర్వాతే ఆయన ఎంపీగా గెలిచారు. తర్వాత సైన్యం సన్నద్ధత, భద్రత, ఆయుధాలు, రక్షణ సామగ్రి, అణ్వాయుధాల ప్లాంట్లు, గూఢచర్యం వంటి సున్నితమైన అంశాలపై లోక్సభలో ప్రశ్నలు అడిగారు. ఓ తొలిసారి ఎంపీ అలాంటి ప్రశ్నలు వేయడం వెనుక ఆంతర్యమేమిటి? పాక్ పర్యటన విషయంలో నిజాలు చెప్పే ధైర్యం గొగోయ్కి ఉందా?’’ అని హిమంత సవాలు విసిరారు. సచీ్ఛలత నిరూపించుకోవాలని, లేదంటే దేశద్రోహ అభియోగాలు ఎదుర్కోవాలని అన్నారు.సి–గ్రేడ్ సినిమా: గొగోయ్హిమంత చేసిన ఆరోపణలు సి–గ్రేడ్ సినిమా కంటే అధ్వాన్నమని గౌరవ్ గొగోయ్ ఎద్దేవా చేశారు. ఆయన మతిలేని, బోగస్ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ‘‘అస్సాంలో భూములను శర్మ, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. వారి బండారం బయటపెడతాం’’ అన్నారు. -
నీలగిరి.. నువ్వానేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు జిల్లా అంతటా వామపక్ష రాజకీయాలు బలంగా ఉంటే జిల్లా కేంద్రమైన నీలగిరి మాత్రం కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఇక్కడ మున్సిపల్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీపై తమ జెండా ఎగురవేసింది. 1951లో 8 వార్డులతో నీలగిరి మున్సిపాలిటీగా ఏర్పడగా, గత నెల 14వ తేదీన 48 డివిజన్లతో నల్లగొండ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. 1953లో మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరగ్గా, 2020లో చివరి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 14వసారి ఎన్నికలు జరుగుతుండగా, కార్పొరేషన్ అయ్యాయి మాత్రం ఇవి తొలిసారి. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ పదవిని 8 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ రెండుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీఆర్ఎస్ ఒకసారి దక్కించుకుంది. మొదటి చైర్మన్గా చిత్తలూరి వెంకట నర్సింహారావు (కాంగ్రెస్) 1961 వరకు సేవలు అందించగా, చివరి చైర్మన్గా 2024 నుంచి 2025 వరకు బుర్రి శ్రీనివాస్రెడ్డి సేవలు అందించారు. తొలి మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల దృష్టి కార్పొరేషన్ అయ్యాక జరిగే ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో నల్లగొండ తొలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండగా, బీఆర్ఎస్ కూడా అదే ధ్యేయంతో నడుస్తోంది. బీజేపీ కూడా మేయర్ పీఠం దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నా, గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆ తర్వాతే బీఆర్ఎస్ రెండు విడతల్లో 42 మందిని ప్రకటించింది. ఆ తర్వాత మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా చకిలం వసంతలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రచారంలో చెప్పడం లేదు. ఏ పార్టీ ఏం చెబుతుందంటే.... » ముందునుంచే కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు పూర్తయ్యాక ప్రతి రోజు నగరంలోని ఏడెనిమిది డివిజన్లలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా వెచి్చంచి పట్టణంలో అభివృద్ధి చేశామని, ప్రజలు తమను గెలిపించాలని కోరుతున్నారు. మరిన్ని నిధులు తెచ్చి నల్లగొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. » పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండలో ఎక్కువ అభివృద్ధి తామే చేశామని, దానిని చూసి తమను గెలిపించాలని బీఆర్ఎస్ చెబుతోంది. మాజీమంత్రి జగదీశ్రెడి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకొని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెబుతోంది. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఐటీ హబ్ వంటికి తామే చేశామని చెబుతోంది. » నల్లగొండ అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తామని, తమ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ చెబుతోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున అభివృద్ధి చేసిందని పేర్కొంటోంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందని చెబుతోంది. -
కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి కబడ్డీ ఆటను ప్రారంభించాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు ఖాయమని, కబడ్డీ కప్ బీజేపీ గెలుచుకోవడం తథ్యమని తేలడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ (మ్యాచ్ ఫిక్సింగ్) కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేసి, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ‘విజయ సంకల్ప ర్యాలీ’నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ గార్డెన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది కాషాయ పగిడీలు ధరించి పాల్గొన్నారు. టవర్ సర్కిల్ వద్ద బండి సంజయ్, నవనీత్ కౌర్ ప్రసంగించారు. అభివృద్ధి నినాదంతో తాము కరీంనగర్ ఎన్నికలకు వెళ్తున్నామని, బీజేపీ 50 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అందుకోబోతోందని సర్వేలన్నీ తేల్చడంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ఒవైసీ శనివారం రాత్రి కరీంనగర్కు వచ్చి ఎంఐఎం గేర్ మారుస్తుందని మాట్లాడారని గుర్తు చేశారు. రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో.. ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని అన్నారు. -
‘కేసీఆర్ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’
సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. -
అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్ సెటైర్లు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్మార్చి: సాండ్ స్కామ్ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్జూన్: ఫోర్త్ సిటీ స్కామ్జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్అక్టోబర్: పవర్ స్కామ్నవంబర్: సింగరేణి స్కామ్డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు చెప్పి రైతు బంధు వేయించాను’ అని చెప్పుకొచ్చారు. -
ఇది వంచనే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారతీయ రైతులు, సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు, ప్రజల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసేలా మోదీ సర్కార్ ట్రంప్ ప్రభుత్వం ఎదుట సాగిలపడిందని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగ సారథి పవన్ ఖేడా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘తాజాగా కుదిరింది ఎన్డీఏ ప్రభుత్వం, ట్రంప్ సర్కార్ల మధ్య వాణిజ్య ఒప్పందంగా లేదు. అగ్రరాజ్యం ముందు మోదీ ప్రభుత్వం ఒంగి సలామ్ చేసినట్లుగా ఉంది. ఈ ఒప్పందం అమలైతే అమెరికా నుంచి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు భారత్ను ముంచెత్తుతాయి. ఇవి మన రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలను నాశనంచేస్తాయి. గత 75 ఏళ్లుగా భారత్ అవలంభిస్తున్న విధానాలను పూర్తిగా తుంగలో తొక్కి వంచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంటే ఇరుపక్షాలు సమస్థాయిలో సమావేశమై కుదుర్చుకునేది. అంతేగానీ నీ తలపై తుపాకీ గురిపెట్టి, బ్లాక్మెయిల్ చేసి కుదుర్చుకునేది ఒప్పందం అనిపించుకోదు. అది కేవలం సరెండర్ అవడం అవుతుంది. భారత ప్రధాని విదేశం ఎదుట లొంగిపోవడాన్ని కాంగ్రెస్ ఏమాత్రం సహించట్లేదు. ఇది నిజంగా దురదృష్టం’’అని ఖేడా వ్యాఖ్యానించారు. రైతన్నల వెన్ను విరిచారు ‘‘అమెరికా నుంచి విపరీతంగా సాగు సంబంధ ఉత్పత్తుల దిగుమతికి మోదీ సర్కార్ ఇప్పుడు అనుమతించింది. దీంతో ఇక్కడ రైతుల వెన్ను విరగనుంది. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం అనేది కష్టాలపాలుకానుంది. ఈ ఒప్పందం భారత్లో వ్యవసాయాన్ని ఎంతగా నాశనం చేయనుందో త్వరలోనే కళ్లకుకడుతుంది. ఒప్పందం కారణంగా ఎన్ని రకాల ఉత్పత్తులు భారతీయ విపణికి విపరీతంగా పోటెత్తనున్నాయో వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ చెప్పట్లేరు. దిగుమతి కాబోయే వస్తూత్పత్తుల జాబితాను ఆయన తెలివిగా దాచేశారు. ఏఏ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయో అవి మాత్రమే ఘంటాపథంగా చెబుతున్నారు’’అని ఖేడా వెల్లడించారు. గోయల్నుద్దేశిస్తూ.. ‘‘మన రూపాయి భవితవ్యం, మన ఆర్థికవ్యవస్థ తాజా పరిస్థితి మీకు తెలుసా? ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతుల విలువ ఏటా 40 లేదా 42 బిలియన్ డాలర్లు ఉంటే ఇకపై ఏటా అది 100 బిలియన్ డాలర్లకు పెరిగిపోనుంది. అంతగా విదేశీమారకద్రవ్యాలను ఎక్కడి నుంచి తెచ్చి కడతాం?’’అని నిలదీశారు. హగ్లు, ఫొటోలు పనిచేయలేదు ‘‘ఏ దేశాధినేత, ప్రధాని, అగ్రనేతను కలిసినా మోదీ ఆలింగనం చేసుకుంటూ తెగ ఫొటోలు దిగుతారు. ఈ హగ్లు చేసుకునే హగ్లోమసీ, ఫొటోలు దిగే ఫొటో–ఆప్స్ ఏమాత్రం భారత అనుకూల ఒప్పందాన్ని సాకారంచేయలేదు. పేరుకే ఆయన నరేంద్ర మోదీ. పని మాత్రం సరెండ్ కావడం అంటూ ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్’అని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘హౌడీ మోదీ నినాదం కంటే నమస్తే ట్రంప్ నినాదమే ఆధిపత్యం కనబర్చింది’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికన్ రైతులపై భారత్ దిగుమతి సుంకం ఎత్తేసింది. దీంతో వాళ్లు భారత్లోకి విపరీతంగా తమ సరుకులను దిగుమతిచేయడం ఖాయం’’అని జైరాం అన్నారు. -
సై అంటే సై..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షా లుగా కొనసాగుతున్నాయి. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రత్యర్థులుగా మారాయి. బల్దియా పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పొడిచింది. అందులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సీపీఐ తర ఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు సీపీఐ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అనేక కీలక అంశాల్లో ప్రభుత్వ విధానాలకు కూనంనేని మద్దతుగా నిలిచారు. రెండేళ్లుగా సజావుగా కొనసాగుతున్న కాంగ్రెస్ – సీపీఐ దోస్తీకి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్పర్థలు మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త గూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉన్న విద్యానగర్ పంచాయతీని సీపీఐ ఏకగ్రీవం చేసుకుంది.సర్దుబాటు కాలేదంటూ...కొత్తగూడెంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఎక్కువ డివిజన్ల నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి హస్తం నేతలు వచ్చారు. దీంతో కొత్తగూడెంలోని 60 డివిజన్లలో మిత్రపక్షమైన సీపీఐకి 15 డివిజన్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కానీ పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో తమకు సంస్థాగతంగా బలం ఉన్నందున 25 డివిజన్లకు తక్కువ కాకుండా చూడాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ అంశంపై అనేకమార్లు చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్ – సీపీఐ స్నేహబంధానికి బీటలు వారినట్ట య్యింది. సీపీఎంతో జోడీ కట్టిన కాంగ్రెస్ 58 డివిజన్లలో పోటీకి నిలిచింది. ఇక టీడీపీతో దోస్తీ చేసిన సీపీఐ 57 డివిజన్ల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. మేమే చేస్తాం.. మేమే తెచ్చాంకూనంనేని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే కొత్తగూడెం కార్పొ రేషన్గా అప్గ్రేడ్ అయిందని, 20 ఏళ్లుగా ఎన్నికలు లేని పాల్వంచలో ఇప్పుడు పోలింగ్ జరుగుతోందని సీపీఐ ప్రచా రం చేస్తోంది. డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ కూడా మంజూరైందని, ఇదే వేగం కొనసాగాలంటే సీపీఐకే పట్టం కట్టాలనే నినాదంతో ఎర్రదండు ముందుకు కదులుతోంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి తన భుజాలకు ఎత్తుకు న్నారు. కొత్త పరి శ్రమలు రావాలన్నా, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కావా లన్నా అది కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన ప్రచారం చేస్తున్నారు. -
రాష్ట్రం దివాలా తీసింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని, ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల వరద రావాలంటే, కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సి పాలిటీల్లో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్ర: మున్సిపాలిటీల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రానివ్వబోనని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారు.. మీరేమంటారు?సీఎం రేవంత్రెడ్డిని చూస్తే జాలేస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయడానికి అణాపైసా లేక బిక్కమొహంతో దిక్కులు చూస్తున్నడు. ఢిల్లీకి మూటలు పంపలేక ఆపసోపాలు పడుతున్నడు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల గ్రూపు తగాదా లపై ఏమీ చేయలేని నిస్సహాయత ఆయనది. కాంగ్రెస్ హైకమాండ్తో కేసీఆర్కు ఉన్న ఆర్థిక లావాదేవీల మూలంగా అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతు న్నాననే బాధ ఆయన కళ్లలో కనిపిస్తోంది. జనం కాంగ్రెస్ను ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేయాలా అని ఎదురు చూస్తున్నరు. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్రెడ్డి ఏదో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను దారి మళ్లించాలనుకుంటున్నడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నరు. బీజేపీని ఆశీర్వదించబోతున్నారు.ప్ర: బీజేపీ ఎన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి?వందకు వందశాతం కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరేయబోతున్నం. ఒక్క నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే మరో మూడు మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. వివిధ సర్వే రిపోర్టులు, ప్రజాస్పందన చూస్తుంటే.. రాష్ట్రంలో మెజారిటీ కార్పొరేటర్, కౌన్సిలర్ల స్థానాలను సాధించుకుని తిరుగులేని శక్తిగా ఎదిగే అవకా శాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో వార్ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడో స్థానం కోసం పోటీ పడు తున్నాయి. ఈ విషయం తెలిసి మజ్లిస్కు మేయర్ సీటు ఇస్తామని కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకొని ముస్లింలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.ప్ర: ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏమని విజ్ఞ్ఞప్తి చేస్తున్నారు ? ఈ ఎన్నికల్లో గుణవంతులకు, ధనవంతులకు మధ్య పోటీ జరుగుతోంది. అవినీతిపరులకు, నిజాయితీగా మీ కోసం కొట్లాడే బీజేపీ అభ్యర్థుల మధ్య జరిగే యుద్ధమిది. అధికారంలో ఉన్నంతకాలం కబ్జాలు, దోపిడీలు, కమీషన్లతో దోచుకుంటే.... వాళ్ల అరాచకాలు, కబ్జాలపై బీజేపీ అభ్యర్థులు పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లారు. కబ్జాకోరులు, దోపిడీదారులు మళ్లీ మాయమాటలతో మీ ముందుకు వస్తున్నారు. నమ్మి ఓటేస్తే ఐదేళ్లు నరకయాతన తప్పదు. నిధులిచ్చేది కేంద్రం. ఆ నిధుల వరద కొనసాగాలంటే... అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్ర: రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏవిధంగా ఉంది? ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ఫలితాలే గీటురాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేకుండా చేతులెత్తేసింది. నా దృష్టిలో బీఆర్ఎస్ గతించిన పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో అరకొర బీఆర్ఎస్ సీట్లు గెలుచుకున్నా, ఎన్నికలయ్యాక వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్లోకే వెళ్లే అవకాశాలున్నాయి.ప్ర: నిత్యం హిందుత్వం మాట్లాడే మీరు ఈ ఎన్నికల్లో అభివృద్ధి అంశాన్నే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారెందుకు?హిందుత్వం మా శ్వాస. అందులో తగ్గేదేలే. బండి సంజయ్ హిందుత్వం తప్ప ఏమీ మాట్లాడరని, అభివృద్ధి కోసం నయాపైసా తేలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ వారు విష ప్రచారం చేశారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నేను ఏం చేశాను? ఎన్ని నిధులు తెచ్చా ను? ఏఏ అభివృద్ధి పనులు చేశాననే వివరాలతో బుక్లెట్ ప్రింటింగ్ చేసి ఇంటింటికీ పంపుతున్నా. నేను వాస్తవాలు చెప్పే సరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయితోంది. -
బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే ఏం వస్తుంది?: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ నేతలను గెలిపిస్తే ఏం ప్రయోజనమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిల్లో అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతుంది. కరోనా వచ్చినప్పుడు పేదలకు ఉపాధి లేకపోతే 80 కోట్ల మందికి అన్నం పెట్టింది నరేంద్ర మోదీ. కరోనా కాలంలో వాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడింది మోదీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు మంజూరైతే కేసీఆర్ కనీసం లక్షా70 వేల ఇళ్లు కట్టలేకపోయాడు. మోదీని తిట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఖతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే అంటున్నారు. వాళ్ల పరిస్థితి కూడా అదే అవుతుంది.నాకు తక్కువ టైంలో ఎక్కువ ఓట్లతో ఆశీర్వదించింది గజ్వేల్ ప్రజలే. నామినేషన్ వేసిన సమయంలో 5000 మంది వస్తారనుకుంటే 25వేల మంది వచ్చారు. ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్ అయితే నైతికంగా గెలిచింది గజ్వేల్ ప్రజలు. గజ్వేల్కు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. అభివృద్ధి మాత్రం జరగలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోలేని బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది?. తనను కోసినా 5 పైసల బిళ్ళ లేదు. నేను రైతు బంధు ఇవ్వను అని రేవంత్ అంటున్నాడు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మల్లా రెడ్డిపై దాడి... 150 మంది వచ్చి దబా దబా కొట్టారు
-
బదులిచ్చే ధైర్యం ప్రధానికి లేదు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానికి లేదన్నారు. ప్రభుత్వం సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలనుకోవడం లేదని ఆరోపించారు. పదేపదే అబద్ధాలు చెప్పడమే మోదీ పని అని ఆరోపించారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోదీ తన 97 నిమిషాల ప్రసంగంలో ముఖ్యమైన, అవసరమైన విషయం ఒక్కటీ చెప్పలేదు. ఇంకా వందేళ్లు, 75 ఏళ్లు, 50 ఏళ్ల కిందటి సంగతులే మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని అధికార పక్షం పార్లమెంటులో చెబుతోంది. తాము ఆ పుస్తకాన్ని బాహాటంగా చూపినా వారికి అర్థం కావడం లేదు. ముందుగా వాస్తవాలను శ్రద్ధగా విని, ఆపై సమాధానం చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. రాహుల్, కేంద్ర మంత్రి రవ్నీత్ బిట్టూ్ట వివాదంపైనా ఆయన స్పందించారు. సభ బయట ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను సిక్కులకు జరిగిన అవమానంగా ముద్ర వేశారని మండిపడ్డారు. ‘‘సిక్కులను కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేశారు’’ అని గుర్తు చేశారు. సిక్కులను, దళితులను, ఆదివాసీలను ఎవరినీ గౌరవించే అలవాటు లేనిది బీజేపీకేనన్నారు. ఇతరు లను ఎలా కించపరచాలా అనే మోదీ ఆలోచిస్తారని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. కానీ మోదీ మాత్రం వాటిని దివాలా తీసే కర్మాగారాలు అని పిలుస్తూ నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని నడిపే దార్శనికత మోదీకి లేదు’’ అన్నారు. రాహుల్ ఏం ప్రశ్నలు అడుగుతారో, ఎలాంటి వాస్తవాలు బయటపెడతా రోనని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘లోక్సభలో మోదీపై దాడి జరుగుతుందని నిఘా సమాచారముందని చెబుతున్నారు. అంత గొప్ప ఇంటలిజెన్స్ పుల్వామా వంటి ఉగ్ర దాడుల సమయంలో ఏమైంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడ్డ తరవాత మోదీ ఆందోళనగా ఉన్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లొంగిపోయి ఆ దేశంతో ఏకపక్ష వాణిజ్య ఒప్పందం కుదుర్చు కున్నారు. తద్వారా మన దేశ రైతులను బలిపశు వులను చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పాలనలో స్కామ్లే.. స్కీమ్లు లేవు
సిరిసిల్ల: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కామ్లే తప్ప.. కొత్త స్కీమ్లు లేవని.. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ దొంగమాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి పదవి ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో అమలు చేస్తానని హామీలతో రాసిచ్చిన బాండ్పేపర్ను ప్రజలకు కేటీఆర్ చూపించారు. తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, నాలుగుసార్లు ఓడిపోయానని చెప్పి సానుభూతి డైలాగులతో మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. మోసాలకు మద్దతిచ్చినట్టే... ఒకవేళ ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మేము చేస్తున్నదే సరైందని, ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారని రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని కేటీఆర్ చెప్పారు. హామీల అమలుపై భవిష్యత్లోనూ దృష్టి పెట్టే అవకాశమే ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు రూ.4 వేల పెన్షన్ నుంచి మొదలుకొని రైతు భరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , తులం బంగారం రావాలన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసిందేమీ లేదని కేటీఆర్ చెప్పారు. రూ.15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని విమర్శించారు. ప్రతీసారి ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు వేయించుకుంటుందన్నారు. ఈసారి కూడా బీజేపీ దొంగమాటలకు మోసపోవద్దని కోరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటుతో మరోసారి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో జరిగిన ప్రచార సభల్లో బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, తుల ఉమ, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి పాల్గొన్నారు. -
సభాపర్వం నిరాశాజనకం
‘మీ స్వరాన్ని పెంచకండి... చట్టసభల్లో మెరుగుపరుచుకోవాల్సింది మీ వాదనను మాత్రమే’ అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా హక్కుల యోధుడు డెస్మండ్ టుటు. దేశంలో చట్టసభల తీరుతెన్నులు చూస్తున్నవారికి ఎప్పుడూ ఖేదమే మిగులుతోంది. చట్టసభల పేరుచెబితే వాగ్యుద్ధాలూ, వాకౌట్లూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పటిలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ఆ ధోరణిలోనే సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు లోపలే కాదు, వెలుపల కూడా ఆధిక్యతా ప్రదర్శన కనబడుతోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు, అధికార విపక్షాలు ప్రత్యర్థుల్లాకాక శత్రుపక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. చివరకు ఎక్కడివరకూ పోయిందంటే... కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవాంఛ నీయ చర్యకు పాల్పడే అవకాశం ఉందంటూ తనకు సమాచారం అందటంతో ఆయన్ను సభకు రావొద్దంటూ తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్ వాదన. నిజానిజాల సంగతలా ఉంచి లోక్సభ స్పీకర్ ప్రధానిని సభకు రావద్దని సూచించటం ఊహకందనిది. ఇలాంటి పరిణామాలు ప్రపంచం దృష్టిలో మన ప్రజాస్వామ్యాన్ని పలచబారుస్తాయి. కాంగ్రెస్ తీరుచూస్తే సభను సాగనివ్వకపోవటమే దాని ఏకైక వ్యూహంగా కనబడు తోంది. దీనిద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం పంపదల్చుకున్నదోగానీ, కీలకమైన బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. పద్దులు గిలెటిన్ అవుతున్నాయి. పాలక పక్షం పని సులభమవుతోంది. సభలో మెజారిటీయే దేన్నయినా నిర్ణయిస్తుంది. విపక్షాలు దాన్ని అడ్డుకోలేవు. కనీసం అర్థవంత మైన చర్చంటూ జరిగితే ఎలాంటి బిల్లులు వస్తున్నాయో, వాటి లోటుపాట్లేమిటో,అందువల్ల కలిగే పరిణామాలేమిటో సామాన్యులు అర్థం చేసుకునే వీలుంటుంది. తమ వ్యూహం సామాన్య పౌరులకు ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్నదని కాంగ్రెస్ గ్రహించటం లేదు. యూపీఏ హయాంలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. దాన్నే తామూ ప్రయోగించి పైచేయి సాధించాలని చూడటం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనమేమిటో అర్థంకాదు. తోచింది చేసుకుంటూ పోవటం, జరిగే ఘటనలపై అప్పటికప్పుడు అనాలోచితంగా స్పందించటం తప్ప కాంగ్రెస్కు పకడ్బందీ వ్యూహం ఉన్నట్టు కనబడదు. బుధవారం పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగడం నివారించదగింది. బిట్టూ అక్కడ ధర్నాకు కూర్చున్న కాంగ్రెస్ ఎంపీలనుద్దేశించి అవహేళనగా వ్యాఖ్యానించి ఉండొచ్చు. కానీ అవి యథాలాపంగా అన్న మాటలు కాదు. ఇరుపక్షాల మధ్యా యుద్ధం సాగుతున్న వేళ వ్యూహాత్మకంగా మాట్లాడినవి. రాహుల్ గాంధీ ఆయన్ను కాస్తా ద్రోహి అంటూ నిందించటం ద్వారా బీజేపీకి పదునైన ఆయుధం ఇచ్చారు. పార్టీ మారటం ద్రోహమైతే, అలాంటివారు కాంగ్రెస్లో లేరా? అసలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి పట్ల అధినేతలుగా తాము చేసిన, చేస్తున్న ద్రోహం మాటేమిటి? అవసరార్థం పక్క పార్టీలతో కుమ్మక్కవుతూ మొత్తంగా పార్టీలో ఉన్నవారందరికీ చేస్తున్న ద్రోహమెంత? రాహుల్గాంధీ ఆలోచించారా? పరిస్థితులు మళ్లీ చక్కబడితే బిట్టూ లాంటివారు తిరిగి కాంగ్రెస్ లోకి రారనీ, రాహుల్ తీసుకోబోరనీ ఎవరైనా చెప్పగలరా?ఎందుకో ఈసారి పార్లమెంటులోనూ, వెలుపలా ‘పుస్తక ప్రదర్శన’ జరిగింది. చైనా నుంచి ముప్పు ముంచుకొస్తున్నవేళ బాధ్యతంతా రాజకీయ నాయకత్వం అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ నరవణేపై వదిలేసి, చేతులు దులుపుకొన్నదని రాహుల్ ఆరోపించారు. జనరల్ నరవణే పుస్తక సారాంశాన్ని సభలో చెబుతానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అన్నారు. దీనికి పోటీగా బీజేపీ సభ్యులు సభలో పుస్తకాలు ప్రదర్శించారు. ఈ దఫా పుస్తకాల ప్రస్తావన రావటం బాగున్నా, వాటిని ప్రదర్శించటంతో సరిపెట్టక ఇరుపక్షాలవారూ ఎవరికివారు చదువుకోవాలి. అప్పుడు మన చట్టసభల తీరు ఇంత అధ్వాన్నంగా అయితే ఉండదు. కనీసం సభల నిర్వహణకయ్యే వ్యయాన్నయినా దృష్టిలో ఉంచుకుని సమావేశాలను వృథా కానీయరాదని రెండు పక్షాలూ గ్రహించటం అవసరం. -
కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.. మేడ్చల్లో ఉద్రిక్తత
మేడ్చల్: కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య మేడ్చల్లోని ఆలియాబాద్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ అనుచరులు దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరికి ఒకరికి ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకున్నట్లు సమాచారం. -
వారిది ఫెవికాల్ బంధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ– బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. రెండింటి మధ్య చీకటి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ నేతల నుంచి ప్రొటెక్షన్ మనీ పేరిట మామూళ్లు వసూలు చేసి.. రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై బీజేపీ ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతిబాట’బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. అరెస్టు చేయరు..విచారణ సాగదు ‘2014లో మోదీ పాలమూరుకు వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాళేశ్వరం, మెట్రో, మూసీ, రీజినల్ రింగ్రోడ్డు అనుమతులు వేటికీ మోక్షం లేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం తరహాలో ఓట్లు దానం చేసి 8 స్థానాల్లో బీజేపీని గెలిపించింది. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం కార్డు అయిందన్న మోదీ, అమిత్షాలు ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినా పట్టించుకోరు.. కేసీఆర్, హరీశ్లను అరెస్టు చేయరు.. సీబీఐ విచారణ ముందుకు సాగదు. ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్ను అరెస్టు చేయరు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్లు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. సంతోష్ రావు మిడ్మానేరులో భూములు, ఇసుక, కంకర, గాలి, నీరు దేన్నీ వదలకుండా దోచుకున్నాడు..’అని రేవంత్రెడ్డి ఆరోపించారు పాల పిట్టల్లా ఆడపడుచులు ‘2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని మాటిచ్చారు. ఏపీ, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చి న మాటకు కట్టుబడి 60 ఏళ్ల తెలంగాణ ప్రజాకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాది. ప్రజలు కేసీఆర్కు పదేళ్లు అధికారమిస్తే.. ఆస్తులు, కాంట్రాక్టులు, టీవీలు, పేపర్లు, ఫామ్హౌస్లు కూడబెట్టారు. 2004 నుంచి 2014 వరకు మేము తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. రైతు కష్టాలు చూసి చలించి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అసలు ఉచిత కరెంటు అంటేనే కాంగ్రెస్ పేటెంట్. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలు తెచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తదితర పథకాలు అమలు చేస్తోంది. గతంలో బతుకమ్మ చీరల్లో కుంభకోణాలకు పాల్పడ్డారు. వాటిని ఎవరూ కట్టుకోలేదు. మేం ఇచ్చిన ఇందిరమ్మచీరలు కట్టుకుని నా ఆడపడుచులుపాల పిట్టల్లా కనిపిస్తున్నారు..’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్నిచోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలి ‘రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇస్తే.. అందులో పాత కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2,778 కోట్లు ఇచ్చాం. మరిన్ని పనులు సజావుగా జరగాలంటే మీ కౌన్సిలర్, కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్లే అయి ఉండాలి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. గతంలో వేములవాడకు వెళితే పదవులు పోతాయన్న అపవాదును మేం అధిగమించాం. అక్కడే సభ పెట్టి రూ.150 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం. కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తా. కరీంనగర్ ఔటర్ రింగు రోడ్డు, వరంగల్ ఔటర్ రింగు రోడ్డులకు మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తాం. బండి, గుండులను మోదీ గుర్తుపట్టడు బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఢిల్లీ నుంచి నిధులు తేవడం చేతకాదు. అసలు బండి, గుండులను మోదీ గుర్తే పట్టడు. కరీంనగర్ కార్పొరేషన్ను చేజిక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఢిల్లీ నుంచి మోదీ, అమిత్షాలు వచ్చినా ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవకుండా కాంగ్రెస్ సత్తా చూపిస్తాం..’అని సీఎం అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ఠాకూర్, విజయరమణా రావు, కవ్వంపల్లి సత్యనారాయణ సభలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే..
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి రెండేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం చెబుతున్నారని, కానీ ఇప్పటికి ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని అన్నారు. రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకుఆశ చూపించి, మరోసారి మోసం చేయడానికే రేవంత్రెడ్డి ఈ మాట చెబుతున్నారని ఆరోపించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ హించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.. కేసీఆర్ను తిట్టడం దేనికి? ‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్న ప్పుడు చేతనైతే ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ గత సీఎం కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలి. గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచి్చన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మీ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కరికైనా రేవంత్రెడ్డి తులం బంగారం ఇచ్చారా? (బంగారం కొనలేదని, నా భార్య నన్ను తిడుతోందంటూ కేటీఆర్ నవ్వులు పూయించారు) నేతన్నల బతుకులను బజారున పడేశారు.బతుకమ్మ చీరలతో ఉపాధి పొందిన కార్మికులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. 12 ఏళ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు గుడిముందు బిచ్చగాళ్లలాగా.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు’అని కేటీఆర్ అన్నారు. ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. చిన్నారిని బుజ్జగిస్తూ, ఆడిస్తూ.. సిరిసిల్లలో ఒకటో వార్డు జ్యోతినగర్లో నిర్వహించిన భేటీలో ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని కేటీఆర్ తీసుకుని బుజ్జగించి, ఆడించారు. -
కార్యక్షేత్రంలోకి కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పజెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, రెబల్స్ ఉపసంహరణ లాంటి కార్యక్రమాలను స్క్రీనింగ్ కమిటీల సాయంతో పూర్తిచేసిన అధికార పార్టీ ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పరిశీలకులను నియమించింది. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఒకరి నుంచి నలుగురిని పరిశీలకులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 140మందితో కూడిన పరిశీలకుల జాబితాను విడుదల చేశారు. ఈ పరిశీలకుల జాబితాలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఏకంగా నలుగురు పరిశీలకులను నియమించింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కూడా స్థానం లభించడం విశేషం. గాం«దీతో పాటు సీనియర్ నేత జీవన్రెడ్డిని కూడా నిజామాబాద్కు పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగూడెంకు ముగ్గురు పరిశీలకులను నియమించగా, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలకుడిగా పార్టీ సీనియర్ నేత ఎం.ఆర్.జీ వినోద్రెడ్డిని నియమించింది. వీరంతా వెంటనే కార్య క్షేత్రంలోకి వెళ్తారని, వార్డుల వారీగా ఎన్నికల ప్రచారం గెలుపు వ్యూహాలపై అభ్యర్థులు, స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిశీలకులతో శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్లు జూమ్ సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తారని, 90 శాతం స్థానాల్లో గెలుపే ధ్యేయంగా రూపొందించాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో మార్గదర్శనం చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. -
26 నెలల్లో ఫోన్ట్యాపింగ్పై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలనలో సీఎం కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై దర్యాప్తు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత 26 నెలల పాలనలో ఏం చేసిందో చెప్పాలని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 26 నెలలు పాలన పూర్తయినా ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంలో నిజమైన బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు లేవన్నారు. దీనికి కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ అవగాహన ఒప్పందమే కారణమని చెప్పారు. ఢిల్లీ స్థాయిలో రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే– కేసీఆర్ మధ్య ఒప్పందం, అవగాహన కుదిరింది కాబట్టే తెలంగాణలో ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డా ఎవరి మీదా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 26 నెలల్లో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ ఫంక్షన్ హాల్లో ‘సేవ్ తెలంగాణ–సపోర్ట్ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఎంఐఎం కనుసన్నల్లో నడుస్తున్న బానిస ప్రభుత్వాల పాలన తెలంగాణలో కొనసాగుతోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు, ఎంఐఎం మద్దతుకోసం దారుసలాం, ఒవైసీ బ్రదర్స్కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ది కూడా ప్రజా ప్రభుత్వం కాదని మజ్లిస్ కనుసన్నల్లో మెదిలే బానిస ప్రభుత్వమని మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడు తున్నా యన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లుగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, చివరకు తీసుకున్న ఏకైక చర్య ఏమిటంటే ఓ డీఎస్పీ స్థాయి అధికారిని సీఐగా డిమోట్ చేయడమేనన్నారు. ఈ 26 నెలల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు, దర్యాప్తుల పేరుతో సీరియల్స్ కొనసాగి ంచినప్పటికీ, సాధించిన ‘గొప్ప విజయం’ఇదొక్కటేనని ఎద్దేవా చేశారు. -
ఓం బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సభకు రాకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెనుక దాక్కున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ధ్వజమెత్తారు. మోదీ సభకు వస్తే కాంగ్రెస్ ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని, అందుకే రావొద్దని చెప్పానంటూ బిర్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బిర్లా చెప్పిందంతా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. గురువారం లోక్సభ వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. సభకు వచ్చి విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి ఎంతమాత్రం లేదన్నారు. అందుకే స్పీకర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారని విమర్శించారు. సభలో మోదీపై దాడి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. మోదీపై చేతులెత్తే ప్రసక్తే లేదన్నారు. లేని ఆలోచన ఉన్నట్లు కల్పించవద్దని సూచించారు. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి స్థానం వద్ద ముగ్గురు మహిళా ఎంపీలు నిల్చున్నారని, అంతకు మించి ఏమీ జరగలేదని ప్రియాంక గాంధీ తేలి్చచెప్పారు. సభలో ఏదైనా మాట్లాడేందుకు అధికారపక్ష ఎంపీలకు స్పీకర్ అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తమను మాత్రం మాట్లాడనివ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలను ఎందుకు మాట్లానివ్వడం లేదో మోదీని, అమిత్ షాను అడగాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని సైతం అనుమతించడం లేదని ఆమె ఆక్షేపించారు. -
రాష్ట్రపతిని కించపర్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోందని అన్నారు. తనపై ఎంత విద్వేషం గుమ్మరించినా తనను సమాధి చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదని తేలి్చచెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడం పట్ల విచారం వ్యక్తంచేశారు. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్న పేద గిరిజన మహిళను, రాజ్యాంగబద్ధమైన పదవిని, భారత రాజ్యాంగాన్ని ఆ పార్టీ కించపర్చిందని మండిపడ్డారు. దళితులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కించపర్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూను ద్రోహి అని నిందించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను నిస్సిగ్గుగా కాపాడుతోందని మండిపడ్డారు. ‘ప్రేమ దుకాణం’ అంటూ కల్ల»ొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోదీ.. తేరీ ఖబర్ ఖుదేగీ(మోదీ.. నీ సమాధి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అది వారి తరం కాదని అన్నారు. పేద కుటుంబంలో జని్మంచిన తాను ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఈ పదవి ఇంకా కొనసాగుతుండడం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందుకే నిత్యం తనను దూషిస్తోందని విమర్శించారు. ప్రధానమంత్రి పదవిని వారి కుటుంబ హక్కుగా భావిస్తున్నారని సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతిపక్షాల వల్లే లోక్సభకు వెళ్లలేకపోయా.. ‘‘దేశంలో కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు నాకున్నాయి. వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నా. ప్రజల అండదండలున్న నన్ను ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఒక సమస్యగా పరిగణిస్తోంది. కానీ, మేము ప్రజలను ఒక బలంగా, సవాళ్లకు పరిష్కారంగా భావిస్తున్నాం. బుధవారం లోక్సభలో జరిగిన పరిణామాలు నిజంగా బాధాకరం. ప్రతిపక్షాలు అలజడి సృష్టించడం వల్లనే సభకు వెళ్లలేకపోయా. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సభాపతి స్థానంలో ఉన్న అస్సాం ఎంపీపై, ఆంధ్రప్రదేశ్ దళిత ఎంపీపై పేపర్లు విసిరేశారు. అస్సాం ప్రజలను.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను అవమానించారు. దళితులను అవమానించారు. కాంగ్రెస్ వల్ల అస్సాం గాయకుడు భూపేన్ హజారికా ఎన్నో అవమానాలకు గురయ్యారు. సదానందన్ మాస్టర్ను అవమానించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బిట్టూను కాంగ్రెస్ నాయకుడొకరు(రాహుల్ గాం«దీ) బుధవారం ద్రోహి అంటూ దూషించారు. ఆ పార్టీకి సిక్కులంటే ద్వేషం. కాంగ్రెస్ నుంచి ఎన్నో గ్రూప్లు విడిపోయాయి. ఎంతోమంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. బిట్టూ సిక్కు కాబట్టి ద్రోహి అని నిందించారు. ఇది సిక్కులకు, గురువులకు జరిగిన అవమానం. సిక్కుల పట్ల విద్వేషాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుంది. నిన్న రాజ్యసభలో స్వతంత్ర సభ్యుడు సదానందన్ మాస్టర్ తన కృత్రిమ కాలును ప్రదర్శిస్తే ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి. రాజకీయ గొడవల వల్ల మూడు దశాబ్దాల క్రితం కాలు పోగొట్టుకున్నారు. ఆయనను అవమానించడం మొత్తం దేశానికి బాధ కలిగించింది. అందుకు విపక్ష ఇండియా కూటమి బాధ్యత వహించాలి. ఓట్ల కోసం చొరబాటుదార్లను రక్షిస్తున్నారు ‘‘పశ్చిమ బెంగాల్లో దయలేని ప్రభుత్వం అధికారం చెలాయిస్తోంది. పతనం కావడంతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఓట్ల కోసం చొరబాటుదార్లను కాపాడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం దేశాన్ని నాశనం చేయొద్దు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం చొరబాటుదార్లను సహించవు. వారిని బయటకు వెళ్లగొడతాయి. మనదేశంలో మాత్రం చొరబాటుదార్లను రక్షించే పరిస్థితులున్నాయి. అందుకోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నారు. మన యువత హక్కులను లాక్కొని, గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నవారిని కాపాడడం ఏమిటి? మన ఆడబిడ్డలు, కుమారుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నవారిని రక్షించడం తగదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు దశాబ్దాలపాటు అధికారం అనుభవించాయి. అధికారంలో ఉన్నప్పుడు సొంత లాభం చూసుకోవడం తప్ప ప్రజల బాగు కోసం చేసిందేమీ లేదు. నేడు మనం డీల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. గతంలో డీల్ అంటే బోఫోర్స్ డీల్ మాత్రమే. ప్రజల జీవితాలను మార్చడం వారికి ముఖ్యం కాదు. సొంత జేబులు నింపుకోవడమే ముఖ్యం’’ అని మోదీ ధ్వజమెత్తారు. .నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలి ‘‘అన్ని రంగాల్లో నూతన స్ఫూర్తి, శక్తితో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిపై మనం దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్’ ప్రపంచమంతటా వినిపించాలి. మన నాణ్యమైన ఉత్పత్తులు అన్ని చోట్లకూ వెళ్లాలి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐ, అరుదైన ఖనిజాల రంగాల్లో ముందడుగు వేస్తున్నాం. సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు సంస్కరణల వల్ల లాభాల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు చేపట్టాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన నిర్వాకాలకు ఇప్పుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికి మా శక్తిని ఖర్చు పెడుతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించడానికి తన స్థానం నుంచి లేవగానే విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో మోదీ ప్రసంగం ప్రారంభించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలతో హోరెత్తించారు. నిరసన వ్యక్తంచేశారు. లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవమానాలు సహించబోమని అన్నారు. కూర్చొని నినాదాలు ఇవ్వొచ్చంటూ ఖర్గేకు ప్రధాని మోదీ సూచించారు. కొద్ది సేపటి తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మోదీ ప్రసంగం కొనసాగింది. విపక్ష సభ్యులు బయటకు వచ్చి మకరద్వారం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు. ఆ ఒప్పందాలతో ప్రపంచంలో గొప్ప విశ్వాసం ‘‘యూరోపియన్ యూనియన్తో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత అమెరికాతో ఒప్పందానికి వచ్చాం. ఇవి ఫ్యూచర్ రెడీ ఒప్పందాలు. ప్రపంచంలో గొప్ప విశ్వాసం నింపాయి. ప్రపంచ స్థిరత్వానికి ఈ ఒప్పందాలు తోడ్పడుతాయి. గత కొన్నేళ్లలో తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఇది ఈయూతో కుదిరిన ఒప్పందం ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’. మనం ఇక వెనక్కి చూడాల్సిన అవసరం గానీ, పరుగు ఆపాల్సిన అవసరం గానీ లేదు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా వేగంగా దూసుకెళ్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రపంచమంతటా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత నూతన ప్రపంచ క్రమం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇప్పుడు భారత్ పట్ల ప్రపంచదేశాల్లో గొప్ప విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నో దేశాలకు మన దేశం విశ్వసనీయ భాగస్వామిగా మారింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తులో పాలుపంచుకోవాలని ఇతర దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మనతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. దక్షిణార్ధ గోళ దేశాలకు(గ్లోబల్ సౌత్) నేడు మనమే బలమైన గొంతుకగా మారాం’’ అని మోదీ అన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకూ పోరాటం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరును తొలగించారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గతంలో ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, వారిపై పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవని గుర్తుచేశారు.ఈ దారుణమైన పరిస్థితులను పారదోలేందుకు మానవీయకోణంతో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో.. దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కూలీలకు 100 రోజుల పాటు పనికి గ్యారంటీ కల్పిస్తూ, ఉపాధి అనేది వ్యవసాయ కార్మికుల హక్కు అనే భావనతో ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని పేర్కొన్నారు. గురువారం చెన్నైలో ఉపాధి హామీ పథకంలో మార్పులు, గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు.పథకంలోని ఆత్మనూ తొలగించారు..‘దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ తన న్యాయవాద వృత్తిని వదిలి దేశానికి వచ్చారు. అధికారం కోసమో, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఆయన రాలేదు. తన సహచరులతో కలిసి గొప్ప స్వాతంత్య్ర పోరాటం నిర్వహించాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి పేరిట తీసుకొచ్చిన పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. కోట్లాది వ్యవసాయ కార్మికులు ఏం తప్పు చేశారని పథకంలో మార్పులు చేశారు?..’ అని భట్టి ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ కూలీల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతోంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం–2005ను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ శ్రేణులు పోరాటం కొనసాగిస్తాయి’ అని చెప్పారు. -
దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు: మోదీ
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక విజన్ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.భారత్ తొమ్మిది దేశాల్లో ట్రేడ్ డీల్ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | In Rajya Sabha, PM Modi says, "...India is signing future-ready trade deals with several countries. In the past few days, we signed trade deals with 9 big and important countries of the world. Mother of all deals with 27 countries, with European Union is one of them..." pic.twitter.com/qpOcOpVUks— ANI (@ANI) February 5, 2026రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అత్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే సూపర్.. ఇదే జనం మాట: కేటీఆర్
సాక్షి,రాజన్న: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురికి అనర్హత వివాదంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు. ఈ తరుణంలో.. నెక్ట్స్ ఏం జరగనుందో చూడాలి. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్ తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు. -
వడ్డించే వాడు.. అడిగే వాడు.. మనోడై ఉండాలి: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందాలంటే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మున్సిపాలిటీల్లో రూ.17,472 కోట్లు ఖర్చు పెట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కనీసం రేషన్కార్డులు ఇవ్వలేదు.. ‘మున్సిపల్ శాఖ నా వద్దే ఉంది. మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత. వడ్డించే వాడు మనవాడు. అడిగే వాడు కూడా మనోడై ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వెళ్లే వారినే గెలిపించాలి. ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉంటాం. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. గత ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. దేశ«ంలో ఎక్కడాలేని విధంగా 3.17 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరేసుకోవాలని, ధాన్యం తీసుకోమని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక సన్న వడ్లు పండించాలని చెప్పాం. రూ.500 బోనస్ కూడా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్తో పాటు 54 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం’ అని సీఎం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ‘రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లతో రుణమాఫీ చేసి అప్పుల నుంచి విముక్తి కల్పించాం. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నాం. గతంలో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ఇచ్చాం. ఈ మున్సిపల్ ఎన్నికలు ముగియగానే మరో రూ.9 వేల కోట్లు ఇస్తాం. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 1000 బస్సులను మహిళలకు ఇచ్చి యజమానులను చేశాం. రూ.25 వేల కోట్లను మహిళా సంఘాలకు ఇచ్చాం. పెట్రోల్ బంకులు పెట్టించాం. ప్రజా ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా కాంగ్రెస్కు ఓటు వేయాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్కే ఓటేయాలి. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలి..’ అని సీఎం అన్నారు. మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ‘వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారు. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేదలను ఊరించి తాను మాత్రం వందల ఎకరాల్లో ఫామ్హౌస్ కట్టుకున్నారు. పంజాగుట్టలో రూ.2 వేల కోట్లతో గడీని కట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వచ్చే బడ్జెట్లో మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. మరింత మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..’ అని రేవంత్ చెప్పారు. మొగుడూ పెళ్లాల ఫోన్లు విన్నారు ‘పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ తన దుర్మార్గ పాలనతో తెలంగాణను దోచుకున్నారు. అయినా పోనీలే అనుకుంటే.. పెళ్లాం, మొగుడు మాట్లాడుకుంటుంటే ఫోన్లు విన్నారు. జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు.. అందరి ఫోన్లు విన్నారు. అలాంటి వ్యక్తికి పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని అంటున్నారు. భార్యభర్తల మాటలు విన్న నువ్వు జాతిపితవు ఎలా అవుతావు? కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చేనట్లే అంటున్నారు. అలాగైతే జన్వాడ, ఎర్రవల్లి, మొయినాబాద్ ఫాంహౌస్లను, టీవీలు, పేపర్లను, దోచుకున్న వేలాది కోట్లను తెలంగాణ సమాజానికి ఇస్తారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి..అన్ని పదవులూ వారే తీసుకున్నారు. తెలంగాణ కోసం మొదటగా ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు చిన్న పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు. ఏపీలో పార్టీ చనిపోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పరవాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అవుతుంది. నీలాంటి వాళ్లు ఎలా జాతిపిత అవుతారు?..’ అంటూ సీఎం తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, జైవీర్రెడ్డి, బాలునాయక్, మందుల సామేలు, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కేవీ రెడ్డి, డీసీసీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు, ముఖాముఖి సభకు ముందు రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. నేడు గుమ్లాపూర్లో సభ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గుమ్లాపూర్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అక్కడి నుంచే రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్డ్ శిక్షణా కేంద్రానికి, దత్తోజిపేటలో సోలార్ ప్లాంట్కు, గంగాధరలో డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తారు. కాగా బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు సభాస్థలిని పరిశీలించారు. -
మున్సిపల్ ఎన్నికలు.. 14 వార్డుల్లో ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖాతాలోకి ఏకగ్రీవ వార్డులు చేరాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి.వివరాల ప్రకారం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం కాగా.. బీఆర్ఎస్ నుంచి రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయం అందుకున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. కొడాదలో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవ ఫలితాలు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెరో విజయం దక్కింది. అలాగే, మహబూబ్నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహిళా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఏకగ్రీవ విజయం అందుతున్నాయి.వివరాలు ఇలా.. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు–10 (ST జనరల్)లో పీ.విక్రమ్ (BRS) ఏకగ్రీవ విజయంయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డు–17 (SC మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నికఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు–15 (UR మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) విజయంనల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపుసూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ వార్డు–3 (BC మహిళ)లో సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయంసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–11 (UR మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఎన్నికసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–21 (BC మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) గెలుపుసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–31 (UR మహిళ)లో యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయంమహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–58 (UR మహిళ)లో బి.రమాదేవి (కాంగ్రెస్) ఎన్నికమెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు–32 (UR మహిళ)లో గోదల మానస (కాంగ్రెస్) గెలుపుపెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–1 (UR మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) విజయంవికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–1 (UR జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నికవికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–15 (SC జనరల్)లో పీ.విజయలక్ష్మి (BRS) విజయంయాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు -
నేనేం పాపం చేసిన?
జగిత్యాల: ‘నేనేం పాపం చేసిన.. తినే ముందు పల్లెం ఎత్తుకెళ్లారు.. బీఆర్ఎస్ కార్యకర్తల కడుపు నింపారు. రాహుల్గాంధీ నాయకత్వాన్ని బలపర్చడమే నేను చేసిన తప్పా. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి వలసవాదులకు పెద్దపీట వేశారు.. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించారు? నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నా’అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్కుమార్కు పెద్దపీట వేస్తూ అధిష్టానం బీఫామ్లు కట్టబెట్టడంతో జీవన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు. జాబితాను కార్యకర్తల అభిప్రాయం మేరకు సర్వే చేపట్టి ఇచ్చాం. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని జాబితాను రూపొందించి నిజమైన కార్యకర్తలకు టికెట్లు రాకుండా చేశారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనకు ఎదురీదిన.. ప్రవాహానికి అనుగుణంగా ఉన్నప్పుడు నన్ను తోసేశారు. జాబితాను రూపొందించినా పరిశీలించకుండానే జెండా మోసిన వారిని పక్కనపెట్టారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టనోనికి బీఫామ్లు కట్టబెట్టారు. నేను చేసిన తప్పేంటి? నిబద్ధత గల నాయకుడిగా కేసీఆర్పైనా పోటీచేసిన. గాం«దీభవన్లో ఇంటర్నల్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారని మాట్లాడిన. అందుకు కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలపై ఎందుకు ? ఓ ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.. ఎవరు అతిక్రమిస్తున్నారో చెప్పాలి’అని అన్నారు. ఇది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వలసవాదులకు జరుగుతున్న పోటీ అని, తాను జెండా మోసిన వారికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. ప్రజలే న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు. ఎవరు కాంగ్రెస్, ఎవరు కాదు అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. జెండా మోసిన వారి కోసం ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. -
లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్కుమార్రెడ్డి ఉన్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో సస్పెండ్ అయిన ఎంపీల ఆందోళనకు దిగారు.రాహుల్ గాంధీ ‘చైనా’ కామెంట్స్పై ఉదయం నుంచి లోక్సభలో చర్చ జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ఇంకా ప్రచురించని పుస్తకం ఆధారంగా వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది.విపక్ష సభ్యులు.. సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేయడంతో గందరగోళం నెలకొంది. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం లోక్సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని.. 8 మందిలో తానూ ఉన్నానని తెలిపారు. స్పీకర్.. రాహుల్ గాంధీ మైక్ను కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తున్నారు.నరేంద్ర మోదీ ట్రంప్కు సరెండర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారు. ఆయన మైక్ కట్ చేస్తే మేము ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లాం. 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారు. మా నోరు మూయించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మిగతా ఎంపీలందరూ మా తరఫున రేపు సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. రేపు పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ గురైన ఎనిమిది మంది ఎంపీలం ఆందోళన చేస్తాం.స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారనేది మేము చూడలేదు. మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశాం. మేం మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది’’ అని కిరణ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. -
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు.మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వీడిన ఉత్కంఠ.. జగిత్యాలలో హైవోల్టేజ్ పొలిటికల్ డ్రామా
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో అధికార పార్టీలో కొనసాగుతున్న రగడ.. హైవోల్టే పొలిటికల్ థ్రిల్లర్ను తలపించింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజయ్ వర్గానికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో.. సీనియర్ నేత జీవన్రెడ్డి అలకబూనారు.అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్యర్థుల ఖరారు చేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 (జగిత్యాలలో 30, రాయికల్లో 6), జీవన్రెడ్డి వర్గానికి 26 సీట్లు (జగిత్యాలలో 20, రాయికల్లో 6) కేటాయించింది. ఫ్లాష్ సర్వే, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న సీఎం రేవంత్ మాటకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో.. ఎమ్మెల్యే సంజయ్ను బహిరంగంగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. తమకు బీఫామ్లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ నివాసం, ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్లో సంజయ్ సక్సెస్ అయ్యారు. అయితే అధిష్టానం ఫార్ములాను జీవన్రెడ్డి రిజెక్ట్ చేస్తున్నారు. పంపకాల ప్రసక్తే లేదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్లు వరుస ఫోన్కాల్స్తో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.నన్ను, నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నా గొంతు కోశారు. నా కోసం కార్యకర్తలను పార్టీ బలి చేస్తోంది. నాకు వర్గమంటూ ఏదీ లేదు. పార్టీ జెండా మోసిన వారే నా వర్గం. క్రమశిక్షణ పేరుతో కట్టడి చస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేన్నారాయన. జగిత్యాల హస్తం పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవన్రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయన తదుపరి అడుగులపై ఏంటనే చర్చ నడుస్తోంది. ఈ అలకను అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
మున్సిపాలిటీల్లో రెండున్నర వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండున్నర వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లతో పాటు, మిగతా మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా అవి అభివృద్ధి పనులకు ఖర్చుచేయకుండా ఎక్కడికి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి, మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరాల్లో, మరీ ముఖ్యంగా ప్రజల బతుకుల్లో మార్పులొచ్చాయా? అని ప్రశ్నించారు. సోమవారం టూరిజం ప్లాజాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్, సహ ఇన్చార్జి అశోక్ పర్ణామి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మీడియా ఇన్చార్జి ఎన్వీ సుభాష్లతో కలిసి రామచందర్రావు రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్ను విడుదల చేశారు. ‘బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు’పేరిట కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తిచూపేందుకే ఈ చార్జిషీట్ను రాష్ట్ర బీజేపీ విడుదల చేస్తోందన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు, పథకాలు తీసుకురావడంతో పాటు పురపాలికల్లో అవినీతిరహిత, సమర్థవంతమైన పాలనను అందిస్తామని హామీనిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్కు అవకాశమిచ్చినందున, ఇప్పుడు బీజేపీకి అవకాశమిస్తే పట్టణాల్లో అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చి చూపుతామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్దనున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలు పూర్తిగా విఫలం కావడంతో సీఎం కూడా పాలనలో వైఫల్యం చెందారన్నారు. ఒక మంత్రికి మరో మంత్రికి పడదని, కలెక్షన్లు, కమీషన్లతో మునిగితేలుతున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం, టెండర్లలో అక్రమాలు తదితరాలతో, కాంగ్రెస్ సర్కార్ 40 శాతం కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటూ ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్ పారీ్టకి, సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా ప్రజలను వంచించే మోసపూరిత పార్టీలేనన్నారు. ఈ చార్జిషీట్లో ఏముందంటే.. ⇒ ఉద్యోగులకు మోసం : అన్ని పెండింగ్ డీఏలు ఇవ్వకుండా, పీఆర్సీ అమలు చేయకుండా, హెల్త్కార్డులు ఇవ్వకుండా, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకురాకుండా మోసం. ⇒ అన్నదాతల అరిగోసలు : కొందరికే రుణమాఫీ, రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామని దానికీ మంగళం, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వలేదు, భూ భారతితో కొత్త వివాదాలకు ఆజ్యం. ⇒ ఆగమైన విద్యా రంగం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదు, మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు మరిచారు. ⇒ వైద్యం అగమ్యగోచరం : రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలు అని మరిచారు. బిల్లులు చెల్లించక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం నిలిపివేత, ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ, అన్ని మున్సిపాలిటీల్లో వంద పడకల ఆస్పత్రులు తదితరాలు అమలు కాలేదు ⇒ మహిళలకు మహా మోసం: ప్రతీ నెల రూ.రెండున్నర వేలు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతీ మహిళకు రూ.లక్ష చొప్పున సర్కార్ బాకీ పడింది. కళ్యాణమస్తులో తులం బంగారం ఇస్తామని మొండిచేయి. ⇒ కార్మీకులపై కక్ష : అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పన చట్టం అమలు జాడలేదు. వారి కోసం సంక్షేమ బోర్డు, హమాలీల బోర్డు ఏర్పాటు కాలేదు.హెల్త్కార్డులు ఇవ్వలేదు ⇒ యువత ఆశలు ఆవిరి: ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు.యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, ప్రతీ ఏడాది జూన్2న నోటిఫికేషన్లు, సెపె్టంబర్ 17కు నియామకాల పూర్తి హామీకి తిలోదకాలు. ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన : అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీ అమలు మరిచారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని పెంచలేదు. ⇒ పారిశ్రామికాభివృద్ధిపై నిర్లక్ష్యం : పూచీకత్తు లేని రుణాలకు ఎమ్మెస్ఎంఈల కోసం రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారెంటీ పథకం హామీ మరిచారు. ⇒ సింగరేణిపై సిగపట్టు: సింగరేణి కార్మీకుల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి భద్రతకు చేపడతామన్న పటిష్టమైన చర్యలు తీసుకోలేదు, సింగరేణిలో ఆధునిక విద్యాలయాల ఏర్పాటుపై ఒక్క అడుగూ పడలేదు. -
పాలిటిక్స్కు బ్రాండ్నేమ్
నిర్మల్టౌన్: రాజకీయాల్లో ఒకతరం గెలవాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడిన పదవి భరిస్తుందని గ్యారంటీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నిర్మల్ మున్సిపల్ చైర్మన్లు పనిచేశారు. నిర్మల్ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘనత వారికే దక్కింది. తాతబాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన మనుమడు ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ..మున్సిపాలిటీ పరిపాలనలో కీలకపాత్ర పోషించారు. వేరువేరు కాలాల్లో చైర్మన్లుగా పనిచేస్తూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో తమదైన ముద్రవేశారు. ఒక్క కుటుంబానికి వరుసగా ప్రజలు అవకాశవిువ్వడం, వారిపై నమ్మకానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.మొదటగా అప్పాల నర్సయ్య..మొదటిగా అప్పాల నర్సయ్య 1981 నుంచి 1982 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. చేసిన రెండేళ్లలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడమై పోరాడారు. మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత 2006లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ రావడంతో నర్సయ్య కుమారుడు అప్పాల మహేశ్ భార్య అనురాధ కౌన్సిలర్గా గెలిచి చైర్మన్ పదవిని అధిరోహించింది. ఐదేళ్లు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు భూకబ్జాల నియంత్రణ వంటి సున్నిత అంశాల్లో వీరి నిర్ణయాలు ప్రశంసలు పొందాయి.మూడోసారి అప్పాల గణేశ్ చక్రవర్తినర్సయ్య పెద్ద కుమారుడైన చక్రపాణి కొడుకు అప్పాల గణేశ్ చక్రవర్తి తాత బాటలో నిర్మల్పై పట్టు సాధించాడు. తాత వేసిన పునాదులపై నిలబడి రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు. నిర్మల్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ బలం, క్యాడర్పై పట్టు పెంచుకున్నారు. ఈయన 2014 నుంచి 2019 వరకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు.మళ్లీ ఈసారి బరిలో..2026 మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ చైర్మన్ (జనరల్ బీసీ మహిళ) రిజర్వేషన్ కావడంతో.. మరోసారి బరిలో దిగారు. మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి భార్య కావ్యను అధికార కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థులు ఎంత వ్యూహాలు రచించిన ఈ కుటుంబ రాజకీయ పట్టు చదరకపోవడం, మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్గా మారింది. ఈ కుటుంబ ప్రత్యేకత అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడైన పోరాటంతో మున్సిపాలిటీ పనుల్లో తనదైన ముద్రవేసింది. ఇలాంటి రాజకీయ వారసత్వం నిర్మల్ మున్సిపల్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. -
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హత్యానేరం కన్నా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్న వేళ.. మరోవైపు సీఎల్పీ మీడియా హాల్లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారుఅన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్ఎస్లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్లోనే లేడు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. కేసీఆర్ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు. -
రెబెల్స్ ఉండొద్దు..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంత్రుల నుంచి బూత్స్థాయి కార్యకర్త వరకు సమష్టిగా పనిచేసి ఘన విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో జూమ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్కుమార్గౌడ్తోపాటు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రేవంత్ పురపాలక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రేవంత్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించిన నేపథ్యంలో ఎవరికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఆ మంత్రులు ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడాలని చెప్పారు. సమన్వయలోపం ఉండొద్దు.. పంచాయతీ ఎన్నికల్లో కొంత సమన్వయ లోపం కనిపించిందని, ఈ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ చేశారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ రెబెల్స్ కారణంగా కొంత నష్టం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో అలా జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పార్టీ నుంచి ఎన్నికల సమాచారం కోసం వార్రూంను ఏర్పాటు చేశామని, ఈ వార్రూంతో సంప్రదింపులు జరపాలని, అవసరమైనప్పుడు వార్రూం సహాయం తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడా అనైక్యత కనిపించకూడదన్నారు. పార్టీ నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే గెలుపు తథ్యమని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిరూపిస్తోందని, అంతకంటే ముందు జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ ఇదే సూత్రం పనిచేసిందని చెప్పారు. ఇప్పుడు కూడా ఐక్యతా సూత్రాన్ని పాటించి నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గెలిచే అభ్యర్థులకే బీఫారాలివ్వాలని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇక ముందు అలా చేయొద్దని చెప్పారు. ఎన్నికలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చాకే సామాజిక, స్థానిక సమీకరణల ఆధారంగా మేయర్లు, చైర్మన్లను ఎంపిక చేద్దామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు ఏజెన్సీలతో నిర్వహించిన సర్వే వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ మున్సిపాలిటీల వారీగా వివరించారని సమాచారం. రాష్ట్రంలోని 90 శాతం స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితులున్నాయని, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగలేదని, అక్కడక్కడా బీజేపీ ప్రభావం చూపినా మొత్తం పాలకవర్గాలను గెలిచే పరిస్థితి ఆ రెండు పార్టీలకు లేదని చెప్పినట్టు తెలిసింది. -
కాంగ్రెస్ వైఫల్యాలపై రేపు బీజేపీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ సోమవారం చార్జిషీట్ విడుదల చేయనుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, విద్య, వైద్య వ్యవస్థల్లో వైఫల్యాలు, నిరుద్యోగ భృతి హామీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అమలు చేయకపోవడం తదితర అంశాలను అభియోగపత్రంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ సర్కార్గా మారిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఆర్థిక అరాచకానికి పాల్పడుతోందని.. ఒక వర్గం వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ హిందూ వ్యతిరేకిగా మారిందని ఆరోపిస్తూ ఆయా అంశాలను పొందుపరచనున్నట్లు తెలిసింది. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ నినాదంతో... మున్సిపల్ ఎన్నికలకు సేవ్ తెలంగాణ–ఓట్ ఫర్ బీజేపీ అనే ప్రధాన నినాదంతోపాటు కాంగ్రెస్ పాలనలో మార్పు రాలే... తెలంగాణ బతుకులు మారలే, పట్టణ ప్రగతి బీజేపీతోనే పురోగతి అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 48 డివిజన్లలో గెలిచేందుకు అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అమలు చేయనుంది.జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల సుడి గాలి పర్యటనలు, ముఖ్యనేతల రోడ్ షోలు, చార్జిషీట్ల విడుదలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఒక్కోరోజు ఒక్కో మున్సిపాలిటీలోని అన్ని స్థానాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి ప్రచారం (కార్పెట్ బాంబింగ్ తరహాలో)నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలతోపాటు ఆయా పార్టీలపై వచ్చిన అవినీతి ఆరోపణలే ప్రచారాస్త్రంగా మొత్తంగా పురపాలిక ఎన్నికల కోసం ఒక మేనిఫెస్టోను.. ఒక్కో కార్పొరేషన్, ఒక్కో మున్సిపాలిటీకి వేర్వేరుగా మేనిఫెస్టోలను ప్రకటించనుంది. స్థానికంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలకు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఎన్నికల ఇన్చార్జీలు బీఫారాలు అందించారు. 4న పాలమూరుకు నితిన్ నబీన్... ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం నాలుగు పెద్ద బహిరంగ సభలు, ఎక్కడికక్కడ రోడ్డు షోలను బీజేపీ నిర్వహించనుంది. ఈ నెల 4న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ఆయన.. అక్కడి మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిసింది. ఈ నెల 8న నిర్మల్లో నిర్వహించే మరో బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 3, 4 కార్పొరేషన్లు, సగానికిపైగా మున్సిపాలిటీల్లో గెలిచి సత్తా చాటాలని కమలనాథులు ఉవి్వళ్లూరుతున్నారు. -
మార్చి 2న రాష్ట్రానికి రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్చి 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్స్లో ఈనెల 21 నుంచి నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున ఆయన హాజరవుతారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు పది రోజులపాటు హరిత రిసార్ట్స్లో తెలంగాణ, ఏపీకి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి (టీఆర్ఆర్) ఈ శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్కు ఏఐసీసీ అనుమతి లభించడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రామ్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం హరిత రిసార్ట్స్లో శిక్షణ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై తెలంగాణ, ఏపీలకు చెందిన డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపుతో సహా పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాల్లో పీసీసీ అధ్యక్షులను క్రియాశీలం చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇందుకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 14 రాష్ట్రాలకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. అందులో గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ డీసీసీ అధ్యక్షులకు పది రోజుల రెసిడెన్షియల్ శిక్షణను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ దఫా అనంతగిరి కొండలు వేదికగా తెలంగాణ, ఏపీ జిల్లాల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. -
బావమరిది కోసం ఈ కుంభకోణం..! మౌనవ్రతంలో కాంగ్రెస్ మంత్రులు
-
Shashi Tharoor: నేనెప్పుడూ కాంగ్రెస్లోనే..!
-
ముగిసిన విచారణ.. వచ్చే నెల 18న మహేశ్వర్ రెడ్డి విచారణ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు.ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్పై దానంను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. సుమారు రెండు గంటల పాటు విచారించినట్టు తెలిసింది. మరోవైపు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే, దానం అనర్హత పిటిషన్ విచారణకు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి తన లాయర్లను పంపించారు. ఈరోజు విచారణకు సంబంధించి ఎవిడెన్స్ అఫిడవిట్ను లాయర్తో పంపించారు. కాగా, తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎవిడెన్స్ అఫిడవిట్లో దానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా 2024 పోటీ చేసిన డాక్యుమెంట్స్ పొందుపరిచారు. తాను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరడంలో స్పీకర్ అనుమతి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ఫిబ్రవరి 18న విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. ఇందు కోసం కౌశిక్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ రమన్నారు. దానం నాగేందర్ను స్పీకర్ సస్పెండ్ చేస్తాడని నమ్ముతున్నాం. దానం బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేశారు. దానం పోటీ చేసిన దాని కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకి వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లు స్పీకర్కు ఇస్తాను అని చెప్పుకొచ్చారు. ఈరోజు విచారణలో భాగంగా కాసేపటి క్రితమే దానం నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డి విచారణ ముగిసింది. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
సాక్షి,చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలని ఆకాంక్షించారు.తమిళనాడు తిరువాయూర్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎస్.ఏ. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్తో పొత్తు సాధ్యమని, విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా కొత్త చర్చలు మొదలయ్యాయి. టీవీకే పొత్తు ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించాలని ఆయన కోరారు.కాంగ్రెస్కు ఒక చరిత్ర, వారసత్వం ఉంది. విజయ్ ఆ పార్టీకి మద్దతు ఇచ్చి వారి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యం కోసం పోరాడుతోంది. వారి ప్రాభవం తగ్గుతుంటే రక్షించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారు’ అని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అటు టీవీకే అధికార ప్రతినిధులు కానీ.. ఇటు విజయ్ కానీ ధృవీకరించరించలేదు. ఖండించలేదు.అయితే, చంద్రశేఖర్ ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై తోసిపుచ్చారు. ‘మా పార్టీ కార్యకర్తలకు విజయ్ నుండి ఎలాంటి ఉత్తేజం అవసరం లేదు. మా కార్యకర్తలను చూడండి, వాళ్లలోనే ఉత్తేజం కనబడుతోంది. మా నాయకుడు రాహుల్ గాంధీ మాకు అవసరమైన ‘బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా’ ఇస్తున్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. -
‘90 నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో’..
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సింధూర్తో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ శశి థరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ ప్రచారానికి శశి థరూర్ చెక్ పెట్టారు.పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో సుమారు 90 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర వ్యక్తిగత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ద్వారా పార్టీతో తన అనుబంధం బలంగా ఉందని, విభేదాల ఊహాగానాలకు తావు లేదని థరూర్ స్పష్టంచేశారు.శశి థరూర్ ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను సమర్ధించినట్లు చెప్పారు.ఆ తర్వాత పలు పత్రికల్లోని గెస్టు కాలమ్స్లో ఆపరేషన్ సిందూర్ను కీర్తించారు.దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో విభేదాలు మరింత పెరిగాయని, ముఖ్యంగా కేరళ యూనిట్లో అసమ్మతి ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన రాహుల్, ఖర్గేలను కలవడం ద్వారా పార్టీ లోపల ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. సమావేశం అనంతరం థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లోపల ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని, పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ భేటీని సానుకూలంగా చూస్తున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలు థరూర్తో చర్చలు జరిపి, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం అత్యవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం.ముఖ్యంగా కేరళలలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్లోని అన్ని వర్గాలు ఒకే దిశగా కదలాలని ఈ సమావేశం సంకేతం ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీఆర్ఎస్ను అందుకే వీడుతున్నా.. దానం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో తనను విస్మరించిన కారణంగానే పార్టీని వదుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘పోస్టుల కోసం పదవుల కోసం నేను ఎక్కడికిపోలేదు. విస్మరించారు కాబట్టే నేను వదలాల్సి వచ్చింది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. నా ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు.ఎంతవరకు అయితే అంత వరకు పోరాటం చేస్తాను. స్పీకర్ నోటీసులు నాకు ఇంకా అందలేదు. పిటిషనర్కి నోటీసులు అంది ఉండవచ్చు. ఉన్న విషయాలను సమర్థవంతం చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాను. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్తాం. స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు ఉంటాయి. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వాళ్లు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమీ భయపడను’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని కౌంటర్ దాఖలు చేసిన దానం.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టి వేయాలని విన్నవించారు.‘‘నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాకు సమాచారం లేదు. నేను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. కాంగ్రెస్ పార్టీకి సమావేశానికి నేను వ్యక్తిగత హోదాలో వెళ్లాను. మీడియా కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోంది’’ అని దానం నాగేందర్ అన్నారు. -
ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్లైన్లు, వార్నింగ్లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. -
కర్ణాటకలో బిగ్ ట్విస్ట్.. సిద్దరామయ్య సర్కార్కు ఝలక్?
బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై రాజకీయం నడుస్తున్న వేళ సిద్దరామయ్యపై సర్కార్కు మరో ఝలక్ తగిలింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి దాదాపు 6000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో, మద్యం కుంభకోణం విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఖర్గే, రాహుల్కు లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. వివరాల మేరకు.. కర్ణాటకలో మద్యం అమ్మకాలకు సంబంధించిన సీఎల్-7 లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఒక్కో లైసెన్స్ జారీకి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేశారని, అలా మొత్తంగా దాదాపు 6000 కోట్లు తిన్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు భాగమైనట్టు వారు చెప్పుకొచ్చారు. కాగా, మద్యం అమ్మకాల్లో అవినీతినిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది. మరోవైపు.. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్పై కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల సిద్ధరామయ్య పాలన అవినీతికి కేరాఫ్గా మారిందన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రూ. 700 కోట్ల స్కాం జరుగుతోందని 2024లోనే సీఎం సిద్ధరామయ్యకు, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే, మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధూ సర్కారు ముందుకు రాలేదని.. దీంతో స్కాం తీవ్రత పెరిగిపోయిందని వాపోయారు. దీంతో, మద్యం వ్యవహారం కర్ణాటకలో కొత్త చర్చకు దారి తీసింది.ఇదిలాఉండగా తమ కస్టమర్లకు మద్యాన్ని ఇవ్వడానికి బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాల్లోని హోటల్స్, బోర్డింగ్ హౌజ్ల యజమానులు సీఎల్-7 పేరిట ప్రత్యేక లైసెన్సులను తీసుకొంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ లైసెన్స్ రూ. కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, ఎక్సైజ్ శాఖ స్కాం వార్తలను మంత్రి తిమ్మాపూర్ కొట్టివేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన.. దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడుతానన్నారు. ఈ స్కామ్పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. పాలనను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుంభకోణాల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. -
ఏదోరోజు బాంబు పేలుస్తా..
సాక్షి, నల్గొండ జిల్లా: ‘మరికొద్ది రోజులు వేచిచూస్తా.. ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా’.. అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయకుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు లేకుండా సీఎం, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను సగానికి పైగా పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో అనేకమంది కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారన్నారు. ఈ విషయాన్ని నెల రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. వారం రోజుల్లో పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించేలా చొరవ చూపుతానన్నారని తెలిపారు. ఆయన హామీ ఇచ్చి మూడు వారాలు గడుస్తున్నా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


