తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. సింగరేణి ఎండీ మార్పు | IAS Transfers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. సింగరేణి ఎండీ మార్పు

Feb 11 2026 7:45 AM | Updated on Feb 11 2026 8:30 AM

IAS Transfers In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సింగరేణి ఎండీగా జ్యోతి బుద్ద ప్రకాశ్‌ బదిలీ అయ్యారు. అలాగే, కొత్తగా ఏర్పడనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లను ‍ప్రభుత్వం నియమించింది.

అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మూడు కా‍ర్పొరేషన్లకు కొత్తగా కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన నియామకం కాగా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇక, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతున్నారు. 

జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్‌ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు అయ్యి, కొత్త పాలక మండలి వచ్చే వరకు జయేష్‌ రంజన్‌ ప్రత్యేక అధికారిగా ఉండనున్నారు.

ఇక, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లతో కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్.. అలాగే, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది. 

  • టీజీఆర్‌ఏసీ డీజీగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా.
  • పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ కమినషర్‌గా దివ్య దేవరాజన్‌.
  • ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌గా కాత్యాయని దేవి.
  • హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్‌ ఎండీగా మయాంక్‌ మిట్టల్‌.
  • ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌ స్పెషల్‌ సీఎస్‌గా రఘురాం శర్మ. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement