Singareni Collieries Company
-
రాజస్తాన్లో సింగరేణి పాగా
గోదావరిఖని: విద్యుదుత్పత్తి.. వ్యాపార విస్తరణ కోసం సింగరేణి కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలో ముందుకు సాగుతోంది. 3,100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రాజస్తాన్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలోని నైనీబ్లాక్లో బొగ్గు ఉత్పత్తికి నడుం బిగించింది. తాజాగా రాజస్తాన్లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్, 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తోంది. తాజా ఒప్పందంతో మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ (Solar Power) అందుబాటులోకి వస్తుంది.మరో మైలురాయి పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణపై సింగరేణి దృష్టి పెట్టింది. రాజస్తాన్ విద్యుత్ సంస్థతో కలిసి సింగరేణి 74 శాతం, రాజస్తాన్ 26 శాతం పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. లాభాల్లో కూడా ఇవే వాటాలు ఉంటాయి. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్కు కేంద్రంగా నిలిచింది. ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ (Thermal Power) ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడిలో సింగరేణి 74 శాతం, రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి.రాజస్తాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం సొమ్మును సౌర, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో అందించనుంది. సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్తాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా చేపట్టేలా అంగీకరించారు.మారిపోనున్న సింగరేణి ముఖచిత్రం సింగరేణి ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై తన బొగ్గు ఉత్పత్తి, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో అడుగుపెట్టి విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేయగా.. అదే ప్రదేశంలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి.. 2026 నాటికి 450 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బొగ్గు సంస్థల్లో నెట్ జీరో కంపెనీగా నిలవాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.చదవండి: చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్వ్యాపార విస్తరణలో భాగంగా.. ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది మరో 30 రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.200 ఏళ్ల భవిష్యత్ దిశగా.. సింగరేణి సంస్థకు మరో 200 ఏళ్ల భవిష్యత్ దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. 2070 నాటి జీరోనెట్ దిశగా ప్రపంచం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు, థర్మల్ విద్యుదుత్పత్తి కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొత్తవ్యాపారాల దిశగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకు సాగుతాం.– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
27 రోజులు.. 12.16 మిలియన్ టన్నులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టంగానే కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇందులో 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 64.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 59.84 మిలియన్ టన్నులే(93 శాతం) ఉత్పత్తి నమోదైంది. మిగిలిన నెలలో (మార్చి 3వ తేదీ వరకు అందిన గణాంకాల ప్రకారం) ఇంకా 12.16 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలి. అంటే సగటున రోజుకు సుమారు 4 లక్షల టన్నుల ఉత్పత్తి తప్పనిసరి. కానీ 11 ఏరియాల్లో రోజువారీ ఉత్పత్తి లక్ష్యమైన 2.80 లక్షల టన్నుల్లో 2.50 లక్షల టన్నులే నమోదవుతోంది. భూగర్భ గనుల్లో వెనుకంజసింగరేణివ్యాప్తంగా 11 ఏరియాల్లో 18 ఓపెన్కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఓపెన్కాస్ట్ గనుల్లో 58.57 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 55.56 మిలియన్ టన్నులు(95 శాతం), భూగర్భ గనుల్లో 54.83 లక్షల టన్నులకు 42.73 లక్షల టన్నుల(78 శాతం) ఉత్పత్తి నమోదైంది. వాస్తవంగా భూగర్భ గనుల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, ఓసీల కంటే తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించినా, 100 శాతం ఉత్పత్తి సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యం తోడవుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓసీల్లో రోజుకు సుమారు 2.40 లక్షల టన్నులు సాధిస్తుంటే, భూగర్భగనుల్లో రోజుకు 16 వేల టన్నులే నమోదవుతోంది. వంద శాతం ఐదు ఏరియాల్లోనే.. గడిచిన ఫిబ్రవరిలో సింగరేణివ్యాప్తంగా ఐదు ఏరియాల్లోనే 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. బెల్లంపల్లి ఏరియా 114 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, శ్రీరాంపూర్ ఏరియాలో 112 శాతం, మణుగూరు ఏరియాలో 111 శాతం, ఆర్జీ–1 ఏరియాలో 110 శాతం, ఆర్జీ–3లో 103 శాతం ఉత్పత్తి సాధించారు. మిగిలిన వాటిల్లో ఆర్జీ–2 ఏరియా 99 శాతం, మందమర్రి ఏరియా 95, భూపాలపల్లి 86 శాతం, కొత్తగూడెం ఏరియా 80 శాతం, ఏఎల్పీ 67, ఇల్లెందు ఏరియా 51 శాతంతో సరిపెట్టుకున్నాయి. 11 మాసాల్లో రెండు ఏరియాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన 11 నెలల్లో పరిశీలిస్తే 100 శాతం లక్ష్యాన్ని రెండు ఏరియాలే సాధించాయి. ఇల్లెందు ఏరియా(కొత్తగూడెం రీజియన్) 110 శాతం, ఆండ్రియాల ప్రాజెక్ట్ (రామగుండం రీజియన్) 111 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక కొత్తగూడెం ఏరియా 96, మణుగురు ఏరియా 97, బెల్లంపల్లి ఏరియా 95, మందమర్రి 77, శ్రీరాంపూర్ 86, ఆర్జీ–1 ఏరియా 94, ఆర్జీ–2 ఏరియా 94, ఆర్జీ–3 ఏరియా 98, భూపాలపల్లి ఏరియా 74 శాతం సాధించి వెనుకంజలో ఉన్నాయి. సమష్టిగా లక్ష్యసాధనకు కృషిప్రతీ ఉద్యోగి, అధికారి సమష్టిగా పనిచేసి వార్షిక లక్ష్యసాధనకు కృషి చేయాలి. అందరూ రోజుకు ఎనిమిది గంటలు కచి్చతంగా బాధ్యతగా పనిచేయాలి. మస్టర్ నమోదు చేయించుకొని బయటకు వెళ్లే వారిపై చర్యలు తీసుకోవడమేకాక ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలి. సంస్థ అభివృద్ధికి పనిచేస్తున్నామా లేదా అని అంతా ఆత్మపరిశీలన చేసుకుంటే ఫలితం ఉంటుంది. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ -
ఏడేళ్ల నిరీక్షణ ఫలించేనా?
గోదావరిఖని: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి(Singareni) బొగ్గు గనుల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన స్ట్రక్చరల్ సమావేశం 15 నెలలు గడిచినా జాడ లేకుండా పోయింది. గతేడాది నవంబర్ 28న డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహించింది.విధానాల నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కావడంతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి సమావేశంలోనే తేల్చుకోవాలని డైరెక్టర్లు చేతులెత్తేశారు. అప్పటి నుంచి అనేక కారణాలతో సీఎండీ స్థాయి సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 5న స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పేరిట వాయిదా..గత ఫిబ్రవరి 5న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తామని యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలకు సమాచారం ఇచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా వేసింది. గతంలో కూడా జనవరి 27న నిర్వహిస్తామని చెప్పినా.. వాయిదా పడింది.ఈసారైనా మోక్షం లభించేనా?సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈసారైనా మోక్షం లభించేనా? అని ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జీతభత్యాలపై ఆదాయపన్ను మాఫీ, సొంతింటి పథకం, మారుపేర్ల కార్మికులకు ఉద్యోగాలు తదితర సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటి పరిష్కారం కోసం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించగా.. గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి.ఎట్టకేలకు 2024 సెప్టెంబర్ 9న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం అందజేశారు. అక్టోబర్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు సాగాలనే తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో వివరించారు. ఆరేళ్ల తర్వాత తొలి సమావేశం..సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు యూని యన్గా రెండోసారి గెలిచిన తర్వాత ఒకటి రెండు సమావేశాలు జరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చరల్ సమావేశాలు లేకుండా పోయాయి.ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్గా గెలిచిన తర్వాత స్ట్రక్చ రల్ సమావేశం నిర్వహించాలని యాజమా న్యంతో పట్టుబట్టింది. దీంతో ఏడాది ఆల స్యంగానైనా సంస్థ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని గతేడాది నవంబర్లో నిర్వ హించింది. కానీ అందులో సమస్యల పరి ష్కారానికి మోక్షం లభించలేదు. ⇒ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గతేడాది డిసెంబర్ 23న జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సీఎండీ స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరగలేదు⇒ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్య లకు ఇప్పటికీ మోక్షం లభించలేదు⇒ ప్రధానంగా మారుపేర్ల బాధితులు, విజి లెన్స్ కేసులతో చాలామందికి ఉద్యోగా లు రాక కార్యాలయాల చుట్టూ తిరు గుతున్నారు. ⇒ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశం గతేడాది నవంబర్ 28న జరిగింది.⇒ ప్రధాన సమస్యలన్నీ సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలోనే తేల్చుకోవాల ని డైరెక్టర్లు చేతులెత్తేశారు.⇒ ఇప్పటివరకు మళ్లీ సమావేశం లేదు.⇒ స్ట్రక్చరల్ సమావేశం కోసం సుమారు 42 వేల మంది కార్మికుల నిరీక్షణప్రధాన డిమాండ్లు ఇవే..⇒ కోల్–ఇండియా మాదిరిగా జీత భత్యాలపై ఆదాయ పన్ను మాఫీ చేయాలి⇒ మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. ⇒ విజిలెన్స్ పేరిట పెండింగ్లో ఉన్న కార్మికుల పిల్లలకు వన్టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి. ⇒ సంస్థ వ్యాప్తంగా సుమారు 500 మంది మారుపేర్ల కార్మికులున్నారు. ⇒ గైర్హాజరు పేరుతో తొలగించిన కార్మికులను కూడా వన్టైం సెటిల్మెంట్ కింద విధుల్లోకి తీసుకోవాలి ⇒ కోల్ ఇండియాలో లేని సింగరేణిలో ఉన్న 14 రకాల అలవెన్స్లు పెంచాలి ⇒ కార్మికుల పదోన్నతి విధానం అమలు చేయాలి⇒ ట్రేడ్స్మెన్లకు గనిలో పనిచేసే పరిధి నిర్ధారించాలి.⇒ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి ⇒ గనులపై కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం కల్పించాలి⇒ వైద్య సౌకర్యం మెరుగుపరచి కార్పొరేట్స్థాయి సౌకర్యాలు కల్పించాలి⇒ కొత్త గనులు ఏర్పాటు చేసి నూతన ఉద్యోగాలు కల్పించాలి⇒ కొన్ని శతాబ్దాలపాటు సంస్థ భవిష్యత్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి ⇒సీఎస్ఆర్ నిధులు ప్రభావిత, నిర్వాసిత గ్రామాల్లోనే వినియోగించాలి. -
క్రిటికల్ మినరల్పై సింగరేణి ఆసక్తి
గోదావరిఖని: క్రిటికల్ మినరల్స్పై సింగరేణి ఆసక్తి చూపుతోంది. కీలక ఖనిజాలు, మైనింగ్ రంగంలో సింగరేణికి సహకరించేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్తో అవగాహన కుదుర్చుకుంది. బొగ్గు వెలికితీతతో పాటు థర్మల్, సౌర విద్యుదుత్పత్తి చేస్తూ సింగరేణి అపార అనుభవం గడించింది. కొద్దిరోజుల్లో పవన, జల విద్యుదుత్పత్తి సాధించనుంది. ఇతర రంగాల్లోనూ వివిధ సంస్థలకు శిక్షణ ఇస్తోంది. ఈనెల 24న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి శిక్షణ మంత్రి రోస్బేట్స్తో సింగరేణి ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ పలు అంశాలపై పరస్పర అవగాహనకు వచ్చారు. దేశంలో విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. క్రిటికల్ మినరల్స్కు మంచి భవిష్యత్ ఏర్పడింది. ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలకు ప్రా«ధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా, ఇక్కడే తయారు చేయడమా లేక ముడిసరుకు దిగుమతి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించడమా? అనే ఆలోచనలో సింగరేణి ఉంది. కీలక ఖనిజాల లభ్యత క్వీన్స్లాండ్లో అధికంగా ఉంది. వీటి ఉత్పత్తి, విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరే వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. 2029–30 నాటికి తెలంగాణ రాష్ట్రం 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తెలంగాణ – క్వీన్స్లాండ్ మధ్య సంయుక్త మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణి ఒక నోడల్ ఏజెన్సీగా ఐఐటీ సంస్థతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.క్వీన్స్లాండ్స్తో వ్యాపార బంధంసింగరేణి ఇప్పటికే క్వీన్స్లాండ్స్తో రక్షణకు సంబంధించి పలు యంత్రాలు, విడిభాగాల కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది. సరఫరా కూడా చేస్తోంది. సిమ్టార్స్ సంస్థతో మైనింగ్, టెక్నాలజీకి, సీఎస్ఐ, ఆర్వో తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొంది. ప్రస్తుతం క్వీన్స్లాండ్ మంత్రి సమక్షంలో కీలక ఖనిజాల వెలికితీత, భారీఖనిజ ఉత్పత్తి యంత్రాలు సాంకేతికత, రక్షణ పెంపు, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి ఆధునిక సాంకేతికత అంశాలపై ముందుకు సాగుతోంది.త్వరలో క్వీన్స్లాండ్కు సింగరేణి బృందంక్రిటికల్ మినరల్స్పై లోతుగా అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి బృందాన్ని క్వీన్స్లాండ్కు పంపుతున్నారు. సింగరేణితో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి క్వీన్స్లాండ్ మంత్రి ఆసక్తి కనబరిచారు. కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. సౌర విద్యుత్, పవన విద్యుత్ రంగాల్లో పూర్తి సహకారానికి ఉభయులూ అంగీకరించారు.సదస్సుకు ఆహ్వానంఈఏడాది మార్చిలో క్వీన్స్లాండ్లో పెద్దఎత్తున నిర్వహించే వ్యాపార సదస్సుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వీన్స్లాండ్ మంత్రి ఆహ్వానించారు. ఈ క్రమంలో వ్యాపార అనుబంధం మరింత పెరిగే అవకాశాలున్నాయి. -
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్కు చెందిన పెట్రోబ్రాస్తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
కష్టానికి తగ్గ ఫలితం
సింగరేణి (కొత్తగూడెం): వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సింగరేణి కార్మికులకు ఆ సంస్థ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, గత పది నెలల్లో 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. మిగిలిన 18.27 మిలియన్ టన్నులను మార్చి 31లోగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఓపెన్ కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులతో పాటు సీహెచ్పీ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)లను కేటగిరీ 1, 2గా విభజించారు. ఆయా పని ప్రాంతాల్లో రానున్న రెండు నెలల్లో సెలవులు తీసుకోకుండా నెలకు 20 మస్టర్లు చేసే కార్మికులకు ప్రోత్సాహకాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ప్రోత్సాహకాలు ఇలా... » భూగర్భ గనుల్లో నెలకు 20 వేల టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే గనులను కేటగిరి – 1గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి జరిగితే, అక్కడ పనిచేసే కార్మికులకు రెండు నెలల్లో రూ.1,500 ప్రోత్సాహకంగా ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేసిన వారికి రూ.2,500 చెల్లిస్తారు. » భూగర్భ గనుల్లో 20 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే గనులను కేటగిరీ–2గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700.. 110 కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చొప్పున సంస్థ చెల్లించనుంది. » రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ గనులను కేటగిరీ–1గా పరిగణిస్తారు. వీరు 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,500 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా చేసిన వారికి రూ.2,500 ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. »కేటగిరీ–2లో రోజుకు 30 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే ఓసీలు ఉన్నాయి. వీటిల్లో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200.. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చెల్లించనున్నారు. »రోజుకు 8 రేక్లు (32 వేల టన్నులు) రవాణా చేసే సీహెచ్పీలను కేటగిరీ–1గా, అంతకంటే తక్కువ రవాణా చేసేవాటిని కేటగిరీ–2గా పరిగణిస్తారు. ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగులకు రవాణాకు అనుగుణంగా ప్రోత్సాహక నగదు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.రక్షణ, హాజరుతో లక్ష్యసాధన సింగరేణి యాజమాన్యం రెండు నెలల కోసం కేటగిరీ – 1, 2లను ప్రకటించింది. ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు(సర్పేస్, అండర్ గ్రౌండ్) లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. ఇదే సమయాన రక్షణ సూత్రాలు పాటిస్తూ హాజరు శాతం తగ్గకుండా పనిచేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. – శాలేం రాజు, కొత్తగూడెం ఏరియా జీఎం అందరికీ పని కల్పిస్తే ఫలితం భూగర్భగనుల్లో చాలా మంది ఉద్యోగులకు మైనింగ్ అధికారులు పని ప్రదేశాలను చూపెట్టడం లేదు. దీంతో ఖాళీగా ఉండి వెనుదిరుగుతున్నారు. అలాగే, మైన్స్ కమిటీ అలంకారప్రాయంగా మారింది. కొందరు గనుల మేనేజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే వాట్సాప్ నివేదికలు ఇస్తారు. ఇలాంటివి సరిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చు. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శిసమస్యల పరిష్కారానికి సమరం» సింగరేణి అధికారుల కార్యాచరణ » వెంటనే డైరెక్టర్ల నియామకానికి డిమాండ్గోదావరిఖని: తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు.. అనిశ్చితికి కారణమైన డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్తో సింగరేణి అధికారులు సమరానికి సిద్ధమయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సీఎంవోఏఐ కార్యాలయంలో సమావేశమైన అధికారుల సంఘం నేతలు.. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశారు.మొత్తం 11 ఏరియాలకు చెందిన సుమారు 2,500 మంది అధికారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. తొలుత ఏరియా జీఎంలకు వినతిపత్రాలు అందజేసి, రోజూ సాయంత్రం జీఎం కార్యాలయాల ఎదుట సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఫెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లించాలని కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. » గతేడాది రావలసిన పీఆర్పీ (పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) చెల్లించాలి » కీలకమైన డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్, డైరెక్టర్ ఆపరేషన్ పోస్టులు భర్తీ చేయాలి » ఏడేళ్ల పీఆర్పీతోపాటు 2007 – 2014 వరకు బకాయిలు చెల్లించాలి » పదోన్నతుల విధానాన్ని సరిచేయాలి » ఎస్సీడబ్ల్యూఏ నుంచి అధికారిగా పదోన్నతి పొందిన వారికి ఈ–2 నుంచి ఏడాదికే ఈ–3 ఇవ్వాలి » ఎన్సీడబ్ల్యూఏ నుంచి ఈ–1కు వచ్చే జేఎంవో, జేటీవో అధికారులకు ఈ–5 వరకు పదోన్నతి విధానాన్ని వర్తింపజేయాలి » ఈ–6 గ్రేడ్ ఏడేళ్లు దాటిన వారికి డీజీఎంగా పదోన్నతి కలి్పంచాలి » డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ఏడాదిలో రెండు ఏర్పాటు చేయాలి » ఎఫ్ఎంఎంసీ (ఫస్ట్క్లాస్ మైన్ మేనేజ్మెంట్) సరి్టఫికెట్ ఉండి 12 ఏళ్ల సరీ్వసు నిండిన వారికి ఎస్వోఎం హోదా ఇవ్వాలి » కన్వేయన్స్, హెచ్వోడీ వాహనాలకు, ఆఫీస్ కార్యాలయాలకు ఏసీ సౌకర్యం కలి్పంచాలి » సత్తుపల్లి ఏరియాలో మాదిరిగా మూడు బెడ్రూంలతో కూడిన నూతన క్వార్టర్లు నిర్మించాలి » ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లింపుల్లో ఆటంకం లేకుండా సీడీఏ నిబంధనలు మార్చాలి » కాలపరిమితితో విచారణలు పూర్తిచేయాలి » కోల్ ఇండియాలో మాదిరిగా టీఏ, డీఏ నిబంధనలు అమలు చేయాలి » రిటైర్డ్ అధికారులకు మెడికల్ బిల్లు పరిమితి పెంచాలి » కోల్ ఇండియా మాదిరిగా హోదా ఇవ్వాలి » ఖాళీలను పూరించాలి, పదోన్నతులు కల్పించాలిప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం పదోన్నతులు, పీఆర్పీ చెల్లింపులో అధికారులకు అన్యాయం జరిగింది. మా సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాం. సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – పొనుగోటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ -
కొత్తగూడెంలో ఎకో అడ్వెంచర్ పార్క్
లోతైన క్వారీలు, ఎత్తైన మట్టి దిబ్బలు, రాకాసి బొగ్గు, దుమ్మూ ధూళి.. సింగరేణి గనులు (Singareni Mines) అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇవే.. కానీ ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, సీతాకోక చిలుకల పార్కులకు (Butterfly Park) సింగరేణి పాత గనులు చిరునామాలుగా మారుతున్నాయి. మైనింగ్లో జరిగే నష్టాలను ఆయా సంస్థలే పూరించాలని కేంద్ర పర్యావరణ శాఖ తెచ్చిన నిబంధన మేరకు మూసివేసిన గనుల వద్ద సింగరేణి సంస్థ కొన్నాళ్లుగా భారీగా మొక్కలు నాటి అడవులు (Forests) పెంచుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందమైన ఎకో పార్కులను అభివృద్ధి చేయటం మొదలుపెట్టింది. కొత్తగూడెంలో ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఎకో పార్క్ను ఇప్పటికే సిద్ధం చేసింది. - సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅందమైన వనాలు సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రూ.3 కోట్లతో ఏర్పాటుచేసిన ఎకో పార్క్లో బటర్ఫ్లై గార్డెన్ను ఏర్పాటుచేశారు. ఎడారి, ఔషధ మొక్కలు, తాళ్లవనం (వివిధ దేశాలకు చెందిన తాటి చెట్లు), బోన్సాయ్ వంటి వివిధ దేశాల అరుదైన మొక్కలతో వేర్వేరు థీమ్లతో ఈ పార్క్ను అభివృద్ధి చేశారు. పార్క్ ప్రాంగణంలోనే సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు కొలనులు ఉన్నాయి. సందర్శకులు ధ్యానం చేసుకునేందుకు బుద్ధవనం సిద్ధంగా ఉంది. వీటితోపాటు బర్డ్వాచ్ సెంటర్, వ్యూ పాయింట్, టాయిలెట్లు, కెఫటేరియాలు సిద్ధమయ్యాయి. పట్టణానికి దూరంగా నలువైపులా ఎత్తయిన కొండలు, దట్టంగా పరుచుకున్న చెట్ల నడుమ ఆధునిక సౌకర్యాలతో ఈ ఎకో పార్క్ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి స్టడీ టూర్ల కోసం విద్యార్థులు వస్తున్నారు. టూరిజం శాఖకు అప్పగించే యోచనశ్రీరాంపూర్ ఏరియాలో మరో ఎకో పార్క్ (Eco Park) నిర్మా ణం జరుగుతోంది. ఈ రెండింటి తరహాలోనే సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఎకో పార్క్లను రెండుమూడేళ్లలో ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత భవిష్యత్లో మూతపడే ప్రతీ గని వద్ద ఇలాంటి పార్కులు నెలకొల్పుతారు. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక టూరిజం శాఖకు అప్పగించే యోచనలో సింగరేణి ఉంది. ఇప్పుడిప్పుడే ఎకో టూరిజం పుంజుకుంటుండటం,ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండడంతో సింగరేణి సహకారం పర్యాటకరంగానికి మరిన్ని వన్నెలు అద్దనుంది.మైనింగ్పై అవగాహన కల్పించేలా.. ఎకో పార్క్ పక్కనే ఉన్న గౌతం ఖని ఓపెన్కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి దిబ్బలపై పెంచిన వనంలో సైక్లింగ్ ట్రాక్, నాలుగు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ పాత్లను అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఎకో అడ్వెంచర్ పార్క్గా అప్గ్రేడ్ చేయనున్నారు. పార్క్ సమీపంలో వెంకటేశ్ ఖని మెగా ఓపెన్కాస్ట్ త్వరలో మొదలుకానుంది. దీంతో ఓపెన్కాస్ట్ ఉపరితలంపై మరో వ్యూ పాయింట్ (View Point) సిద్ధం చేసి.. ప్రతీరోజు నిర్ణీత సమయంలో గనుల్లో జరిగే బ్లాస్టింగ్ను సందర్శకులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా మైనింగ్ ప్రక్రియలో అడవులు, భూమి, జలవనరులకు జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? వాటిని భర్తీ చేయడంలో సింగరేణి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి -
సింగరేణి.. సినర్జీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ కీర్తి దశదిశలా వ్యాపిస్తోంది. వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి.. ఇప్పుడు బహుముఖంగా విస్తరిస్తోంది. థర్మల్, సోలార్, రియల్టీ.. ఇలా బహుముఖంగా విస్తరిస్తూ సింగరేణి సినర్జీగా మారుతోంది. ఈ సంస్థ ఏటా డిసెంబర్ 23న సింగరేణి డే జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం.. థర్మల్తో మొదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు దగ్గర 1870లో మొదలైన బొగ్గు తవ్వకం.. ఆ తర్వాత గోదావరి లోయ ప్రాంతాలకు విస్తరించింది. అయితే, 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ పేరుతో లాంఛనంగా ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 ఓపెన్కాస్ట్, 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ పరిధిలో 39,600 మంది కారి్మకులు పని చేస్తున్నారు. సింగేణి బొగ్గులో 80 శాతం మేరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా అవుతోంది. బయట సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు సొంతంగా విద్యుత్ తయారు చేయాలని 2010లో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు 1,200 మెగావాట్ల సామర్థ్యంతోæ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) మంచిర్యాల జిల్లా జైపూర్లో 2016లో ప్రారంభమైంది. అనతి కాలంలోనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో అనేక రికార్డులు ఎస్టీపీపీ సొంతమయ్యాయి. దీంతో ఇక్కడే మరో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టింది. ఎస్టీపీపీ నుంచి వచ్చిన సానుకూల ఫలితాల కారణంగా కొత్తగా రామగుండంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఒడిశాలోని నైనీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత అక్కడ కూడా 1,200 మెగావాట్ల సామర్థ్యంతో పిట్ హెడ్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. నెట్ జీరో దిశగా.. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా 2018లో తొలిసారిగా రామగుండం 3 ఏరియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను సింగరేణి ప్రారంభించింది. ఆ తర్వాత సంస్థ విస్తరించిన 11 ఏరియాల పరిధిలో విరివిగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 272 మెగావాట్లకు చేరుకుంది. మరో 22 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే సింగరేణి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 810 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. మరోవైపు 750 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సంస్థ ఉపయోగిస్తోంది. దీంతో అతి త్వరలో నెట్ జీరో సంస్థగా సింగరేణి మారనుంది. మరో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఫ్లోటింగ్ సోలార్ మంచిర్యాల జిల్లా జైపూర్లో ఉన్న వాటర్ రిజర్వాయర్పై 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను 2023 జనవరిలో సంస్థ ప్రారంభించింది. త్వరలోనే మానేరు జలాశయం (300 మెగావాట్లు), మల్లన్నసాగర్ (2 ్ఠ250 మెగావాట్లు) మొత్తంగా కొత్తగా మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు సంస్థ సిద్ధమవుతోంది. మరిన్ని ప్రయోగాలు రామగుండం, ఇల్లెందులో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. మందమర్రిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మణుగూరు ఏరియాలో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తోంది. థార్ ఏడాది ప్రాంతంలో సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల స్థాపన విషయంలో రాజస్థాన్ ప్రభుత్వంతో సంపద్రింపులు జరుపుతోంది. ఇవే కాకుండా లిథియం మైనింగ్పై కూడా సింగరేణి దృష్టి సారించింది. రియల్టీ రంగంలో అడుగు పెడుతూ గోదావరిఖనిలో రూ.12 కోట్లు, కొత్తగూడెంలో రూ.4.5 కోట్ల వ్యయంతో కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. గ్రీన్హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్ తయారీ, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెంలో వెంకటేశ్ గని, ఇల్లందులో జవహర్ గని తవ్వకానికి అనుమతులు సాధించింది. పెరుగుతున్న కాంట్రాక్టీకరణ.. సింగరేణిలో ఏటా పరి్మనెంట్ కారి్మకుల సంఖ్య తగ్గుతోంది. 1990కి ముందు రెగ్యులర్ కార్మికుల సంఖ్య సుమారు 1.20 లక్షలకు పైగా ఉంటే.. ఈ ఏడాది 39,600కు పడిపోయింది. ఇదే సమయంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కారి్మకుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఈ ఏడాది సంస్థ 2,165 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో 798 ఎక్స్టర్నల్, 1,367 కారుణ్య నియామకాలు ఉన్నాయి. కార్మికుల డిపెండెంట్ల వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచటంతో దాదాపు 200 మందికి తక్షణమే లబ్ధి చేకూరింది. సివిల్, ఓవర్ బర్డెన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 80 శాతానికి పైగా స్థానికులకు అవకాశం కల్పించారు. పంచ్ ఎంట్రీ పద్ధతి ద్వారా అడ్రియాల గని జీవితకాలాన్ని మరో 30 ఏళ్లకు పెంచారు. రూ.కోటి ప్రమాద బీమా కారి్మకులకు సింగరేణి సంస్థ రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీతో ఒప్పందం చేసుకుంది. కాంట్రాక్టు కారి్మకుడికి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం అందించేలా ఒప్పందం చేసుకుంది. రామగుండం, మందమర్రిలో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.40 కోట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయిచింది. కారి్మకుల పిల్లలకు సీబీఎస్ఈ విధానంలో విద్యాబోధన చేసేందుకు ఆర్జీ–2, శ్రీరాంపూర్ ఏరియాల్లోని సింగరేణి పాఠశాలలను ఎంపికచేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కొత్తగూడెం, గోదావరిఖని ఏరియా ఆస్పత్రులను ఆధునీకరిస్తోంది. గుండె వ్యాధిగ్రస్తుల కోసం క్యాథ్ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంతంగా 10 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తోంది. రూ.796 కోట్ల లాభాల వాటా సింగరేణి ఈ ఏడాది సాధించిన లాభాల్లో రూ.796 కోట్లను ఉద్యోగులకు వాటాగా అందించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి కాంట్రాక్టు కారి్మకులకూ రూ.5 వేల చొప్పున అందజేశారు. -
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్.వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. -
సీఓ2 నుంచి మిథనాల్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంట్ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును మండించడంతో పెద్ద మొత్తంలో కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ సేకరించి, హైడ్రోజన్తో రసాయన చర్యకు గురిచేయడం ద్వారా మిథనాల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ కేంద్రం చిమ్నీకి అనుసంధానం చేసి మిథనాల్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఇది పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతా వరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపి టేటర్స్ (ఈఎస్పీ)ను ఏర్పాటు చేశామని ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో అనుమతించిన పరిమితులకు లోబడే కర్బన ఉద్గారాలను విద్యుత్ కేంద్రం విడుదల చేస్తుండగా, వాటినీ రీసైకిల్ చేసి మిథనాల్ను తయారు చేయనున్నట్లు వివరించారు. విజయవంతమైతే భారీ ప్లాంట్మిథనాల్ ప్లాంట్కి సంబంధించిన సివిల్ పనులు పూర్తి కాగా..కార్బన్డయాక్సైడ్ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుబంధ పరిశోధన సంస్థ ‘సీఎంపీడీఐఎల్’ ఆర్థిక సహకారంతో ఇథనాల్ ప్లాంట్ను చేపట్టారు. నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ సంస్థలకు అప్పగించారు. ప్లాంట్ రోజుకి 180 కేజీల మిథనాల్ను ఉత్పత్తి చేయనుండగా, సింగరేణి సంస్థ విక్రయించడం లేదు. ప్రయోగాత్మక ప్లాంట్ విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా భారీ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్ను నిర్మించి వాణిజ్య విక్రయాలు జరపాలని సంస్థ భావిస్తోంది. మిథనాల్ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్ను వినియోగిస్తుండగా, 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్లోని మేడిపల్లి ఓపెన్కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
సింగరేణికి ‘భూగర్భ’ శోకం
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు సింగరేణి సంస్థకు గుదిబండగా మారాయి. ఈ గనులతో సంస్థ గత ఐదేళ్లలో రికార్డుస్థాయిలో రూ.13,093 కోట్ల నష్టాలను మూటగట్టు కుంది. ఈ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10,394 ఖర్చు అవుతుండగా, అమ్మకం ద్వారా రూ.4854 మాత్ర మే ఆదాయం వస్తోంది. భూగర్భ గనుల్లో 2019–20లో 86.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగగా, 2023–24లో 59 లక్షల టన్నులకు తగ్గిపోవడం సంస్థను మరింత కుంగదీస్తోంది.మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 2019–20లో రూ.5413 ఉండగా, 2024–25 నాటికి రూ.10,394కు పెరిగింది. అందులో రూ.7901 ఉద్యోగుల జీతభత్యాల వ్యయమే ఉండటం గమనార్హం. ఇదే కాలంలో అమ్మకం ధర టన్నుకు రూ.3135 నుంచి రూ.4854కు మాత్రమే పెరగడంతో ఏటేటా నష్టాల శాతం పెరిగిపోతోంది. ఉపరితల గనులు, బ్యాంకు డిపాజిట్ల వడ్డీలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో వస్తున్న లాభాలతో భూగర్భ గనుల నష్టాలను పూడ్చుకొని సంస్థ నికర లాభాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆదేశాలతో దసరా పండుగ సందర్భంగా సింగరేణివ్యాప్తంగా 40వేల మంది కార్మికులకు గత రెండు రోజులుగా సామూహిక విందు భోజనం ఏర్పాటు చేసి వారికీ ఈ విషయాలను అధికారులు వివరిస్తున్నారు. ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర....‘ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర’అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, మార్కెట్లో తక్కువ ధరకు బొగ్గు అమ్ముతున్న ఇతర కంపెనీలతో ఎదుర్కొంటున్న సవాళ్లు, సింగరేణిలో ఉత్పత్తి ఖర్చును తగ్గించాల్సిన అవసరం, యంత్రాలను సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత, డ్యూటీ సమయం సద్వినియోగం అనే అంశాలపై గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి గనిలో వివరిస్తున్నారు. సింగరేణి బొగ్గుధర... కోల్ ఇండియా, ఇతర ప్రైవేట్ కంపెనీల కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ⇒ మొత్తం 22 భూగర్భ గనులుండగా, 16 గనుల్లో ఎస్డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఈ 16 గనుల్లోనే ఉంటోంది. భూగర్భ గనుల ఉద్యోగుల్లో 75 శాతం అనగా, 17,286 మంది ఈ గనుల్లోనే పనిచేస్తున్నారు. ఎస్డీఎల్ యంత్రాల పనిని రోజుకు 2 గంటలు పెంచితే 30 టన్నుల ఉత్పత్తి పెరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు చేరుతుంది. దీంతో నెలకు రూ.104 కోట్ల నష్టాలు తగ్గుతాయి.⇒ 2008–09లో భూగర్భ గనుల్లో అత్యధికంగా రోజుకు 142 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 2023–24లో 102 టన్నులకు తగ్గింది. కార్మికుల పనిగంటలూ 8.5 నుంచి 6.7కి పడిపోయాయి. ఈ రెండు గంటల ఉత్పత్తిని మళ్లీ పెంచితే రోజుకి 30 టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు పెరుగుతుంది. ఉత్పత్తి కనీసం 20శాతం పెరిగినా నెలకు రూ.155 కోట్ల నష్టాలు తగ్గుతాయి. ⇒ వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎంసీఎల్) విక్రయిస్తున్న బొగ్గు ధరలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధరలు రెండింతలు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు టన్ను గ్రేడ్–5 బొగ్గును సింగరేణి రూ.5,685కు విక్రయిస్తుండగా, డబ్ల్యూసీఎల్, ఎంసీఎల్ సంస్థలు కేవలం రూ.2,970కే విక్రయిస్తున్నాయి. ⇒ రాబోయే ఏళ్లలో సింగరేణి సంస్థ కొత్తగా ఒక భూగర్భ గని, 6 భూ ఉపరితల గనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటి నుంచి ఏటా 21.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీకే, జీడీకే 10, జేకే(రొంపేడు), గోలేటి, ఎంవీకే, పీవీఎన్ఆర్(వెంకటాపూర్) అనే ఉపరితల గనులతో పాటు కేటీకే ఓసీ–2 అనే భూగర్భ గని ఇందులో ఉంది. ఒడిశాలోని నైనీ బ్లాక్లో ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. -
‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్టెన్ వీరే
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాటా సాధించిన టాప్టెన్ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ–1కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు. మందమర్రి కేకే–5కు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎస్ఆర్పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్కు చెందిన ఫోర్మెన్ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్కట్టర్ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనికి చెందిన ఓవర్మెన్ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రూ.2.88 లక్షలు సాధించారు. వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి సోమవారం సీఅండ్ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. -
సింగరేణిలో ‘వర్చువల్ రియాలిటీ’!
సాక్షి, హైదరాబాద్: కార్మికుల రక్షణ దృష్ట్యా సింగరేణి ప్రస్తుత, భవిష్యత్ గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న అంతర్జాతీయ గనుల ప్రదర్శన (మైనెక్స్)–2024లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్ను గురువారం ఆయన సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రంతోపాటు వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని వెలుపలి నుంచి ప్రత్యక్షంగా చూస్తూ యంత్రాలను నడపొచ్చని కంపెనీ నిర్వాహకులు వివరించారు. యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. గని లోపలికి యంత్రాన్ని పంపించి వెలుపల నుంచే వాటిని ఆపరేట్ చేస్తూ బొగ్గు తవ్వొచ్చని చెప్పారు. భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే యంత్రానికి సంబంధించిన హెడ్గేర్ను ధరించి దాని పనితీరును పరిశీలించారు. ఈ పరిజ్ఞానం అద్భుతంగా పనిచేస్తోందని, కారి్మకులకు చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. హూవర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలి అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల మధ్య ఉన్న హూవర్ డ్యామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి నీటి వినియోగం, రక్షణ చర్యలు ఆచరించదగినవని ప్రశంసించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికా రులు ఆయనకు ప్రాజెక్టు గురించి వివరించారు. 17 జనరేటర్ యూనిట్ల ద్వారా 2,080 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందన్నారు. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. హువర్ డ్యామ్ జలవిద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ భట్టి వెంట ఉన్నారు. -
సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభు త్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో మూడోవంతు సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నామని, దీని ప్రకారం సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులందరికీ సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందని, వీరితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు కూడా తొలిసారి బోనస్ కింద రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రు లు, సింగరేణి అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ వివరాలను ప్రకటించారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు: ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనే సింగరేణి యాజమాన్యం, మంత్రివర్గంతో కలిసి బోనస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడ్డ సింగరేణి గని కార్మికులు ఉద్యమాన్ని పతాక స్థాయికి కెళ్లారు. వారి పోరాట పటిమ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది. అలాంటి సంస్థ వ్యాపార లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి యాజమాన్యంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన మేరకు బోనస్ ప్రకటిస్తున్నాం’అని రేవంత్ వెల్లడించారు. సింగరేణితో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సంస్థ కార్మికుల శ్రమశక్తి కారణంగా ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను కార్మికులకు పంచడం సంతోషంగా ఉందన్నారు. పన్నులన్నీ మినహాయించుకున్న తర్వాత ఈ ఏడాది సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వచి్చందని, అందులో పెట్టుబడి కింద రూ.2,289 కోట్లు పోను మిగిలిన రూ.2,412 కోట్లలో 33 శాతం అంటే రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ కింద ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా సగటున ప్రతి ఉద్యోగికి రూ.1.90లక్షల బోనస్ లభిస్తుందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.20 వేలు అధికమని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న 41,837 మంది శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 25 వేల మంది పనిచేస్తున్నారని, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. విస్తరణ కార్యాచరణ కూడా... సింగరేణి కార్మికులకు బోనస్తోపాటు సంస్థ విస్తరణ కార్యాచరణ కూడా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలోని 100 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్ విస్తరణ చేపడతామని, 500 మెగావాట్ల పంప్ స్టోరేజీ (రామగుండం ఏరియా) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, జైపూర్లో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ జెన్కోతో కలిసి మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ప్రారంభిస్తామని, ఒడిశాలోని నైనీ బ్లాక్పైన అంగూల్ జిల్లాలో 2,400 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.వీకే, గోలేటీ, నైనీ ఓపెన్కాస్ట్ల విస్తరణ చేపడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆస్పత్రుల ఆధునీకరణతోపాటు హైదరాబాద్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి,హైదరాబాద్:సింగరేణి సంస్థలో పనిచేసే ఒక్కో కార్మికునికి లక్షా 90 వేల రూపాయల దసరా బోనస్ను ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్20) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇస్తున్న బోనస్ గతేడాది ఇచ్చిన బోనస్ కంటే రూ.20 వేలు అధికం అని భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈసారి వారికి కూడా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. కొత్త రేషన్కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు -
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్లోని రాణీగంజ్లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్షాప్లో 1940లో టర్నర్గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని వస్తావ్?: భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి: రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోనే రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన మీరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే.. మీ మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్ కేలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తారా? .. అని కేసీఆర్ను నిలదీశారు. ‘నీవు, నీ కొడుకు పదేళ్లు తెలంగాణను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు’ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రులు శ్రీధర్బాబు, పోన్నం ప్రభాకర్తో కలిసి భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాట్సప్ గ్రూప్ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి, ఉద్యోగల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతోపాటు, ప్రతీ నియోజకవర్గంలో యువతకు పోటీ పరీక్షలకు తరీ్ఫదు ఇచ్చేందుకు అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ రామగుండం థర్మల్ బీ పవర్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రులు, అక్కడ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత ఆర్టీఎస్–బీ ప్లాంట్ స్థలంలోనే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ప్లాంట్ను జెన్కో, సింగరేణి సంయుక్త సహకారంతో స్థాపిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి, త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే పవర్ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2031నాటికి గరిష్టంగా తెలంగాణకి 27,059 మెగావాట్ల విద్యుత్, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశామని వివరించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో మరో 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందులో ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ప్రాధన్యత కల్పిస్తామని భట్టి చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్, విజయరమణారావు, గడ్డం వివేక్, వినోద్, ప్రేమ్సాగర్రావు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు పాల్గొన్నారు. -
సింగరేణిలో 2,364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్/ గోదావరిఖని: సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. సంస్థలో చేరిన తర్వాత ఒక కేలండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం వెల్లడించారు.ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్ను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో బలరాం తెలిపారు. సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని, సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. వీరు ఎవరంటే..!సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. వీరు ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తారు. వీరిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉంటే పదోన్నతులు పొందడానికి అర్హులవుతారు. క్వార్టర్ల కేటాయింపులో కూడా ఈ జనరల్ మజ్దూర్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి క్రమబద్ధీకరణ ద్వారా 234 మంది మహిళలు శాశ్వత ఉద్యోగాలు పొందనున్నారు. ఏరియాల వారీగా పరిశీలిస్తే కార్పొరేట్ ఏరియా (25), కొత్తగూడెం (17), ఇల్లందు (9), మణుగూరు (21), భూపాలపల్లి (476), రామగుండం–1 (563), రామగుండం–2 (50), రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్టు (240), శ్రీరాంపూర్ (655), మందమర్రి (299), బెల్లంపల్లి (9) మంది రెగ్యులరైజ్ కానున్నారు. -
అసెంబ్లీలో తీర్మానానికి సిద్ధమా..!
ఆదిలాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీలో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సోమవారం సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను బెల్లంపల్లి లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడారు. సింగరేణి సంస్థలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే చాపకింద నీరులాగా బొగ్గు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అంత్యత సన్నిహితుడైన అదానికి దేశంలోని కోలిండియా, సింగరేణి సంస్థల్లోని బొగ్గు బ్లాక్లను అప్పగించడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అన్నా రు. శ్రావణ్పల్లి బొగ్గు బ్లాక్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేలం పాట నిర్వహిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం వెనుక మర్మమేంటో స మాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర భుత్వాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాల శ్రేణులు పో రాటంలో కలిసి రావాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం డెప్యూటీ కార్యదర్శి నాగరాజ్గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ప్రకాష్, నాయకులు రాజన్న, శ్రీనివాస్, రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఐక్యంగా ఉద్యమించాలి..రామకృష్ణాపూర్: ప్రైవేటీకరణ బారి నుంచి సింగరే ణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ప క్షాలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. బస్సుయాత్ర సోమవారం సాయంత్రం ఆర్కేపీకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిరక్షణకు చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్, ఆశన్న, శంకర్, రవి, వెంకట స్వామి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణికే కేటాయించాలి..మందమర్రిరూరల్: రాష్ట్రంలోని నూతన బొగ్గు గనులను సింగరేణికి కేటాయించి సంస్థను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం బస్సుయాత్ర మందమర్రికి చేరుకోగా.. ఏరియాలోని కేకే–5గనిపై ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్, పలు వీధుల గుండా బస్సుయాత్ర సాగింది.ఇవి చదవండి: ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ -
సింగరేణికే కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ.. ⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్పూర్ రహదారి (ఎన్హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. ⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. ⇒ భారత్మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి. ⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం) – రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలి. – తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. – ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. – హైదరాబాద్లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చాలి. – 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. – తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి. -
రాజస్తాన్లో సింగరేణి సోలార్ ప్లాంట్
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్కో సీఎండీ అలోక్ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం రాజస్తాన్ జెన్కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు. సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. -
బీఆర్ఎస్ పార్టీకి గోల్డెన్ ఛాన్స్
-
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
-
కష్టాల గనిలో రాజేష్
-
మీ అబద్ధాలకు సమాధిలో గోబెల్స్ సిగ్గుపడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి అబద్ధాల ప్రచార సృష్టికర్త జోసెఫ్ గోబెల్స్ కూడా సమాధిలో సిగ్గుతో తలదించుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం విషయంలో రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని కేసీఆర్ వ్యతిరేకించినందునే గత ప్రభుత్వం ఎన్నడూ వేలంలో పాల్గొనలేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతోందని ఆరోపించారు. గతంలో నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే ఆ గనుల నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేకపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ పేర్కొన్న రెండు కంపెనీలు 2021లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనులు దక్కించుకున్న విషయాన్ని రేవంత్ మర్చిపోరాదన్నారు.కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలుతెలంగాణ ప్రజల ఆకాంక్షలను క్రూరంగా అణచి వేసి వేల మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాల ను కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తాకట్టు పెడు తున్న తీరును తెలంగాణ పౌరులు గమనిస్తున్నా రన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికే నదీజలాల వాటాను వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.పెట్టుబడుల్లో తెలంగాణ అగ్రస్థానంగత ఆర్థిక సంవత్సరం 2023–24లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తగ్గినా బీఆర్ఎస్ సాగించిన పాలన వల్లే తెలంగాణ మాత్రం 100 శాతానికి మించి ఎఫ్డీఐలను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2022–23తో పోలిస్తే 2023–24లో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించగా తెలంగాణ ఏకంగా 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో రావడంతో ఇది సాధ్యమైందన్నారు. -
సింగరేణిలో ఆర్థిక విధ్వంసంపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్రెడ్డి తెలిపారు.పారదర్శకంగా బొగ్గు గనుల వేలం‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు. సింగరేణికి కేసీఆర్ మరణశాసనం‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్జెన్కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.నీట్తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు. నాగర్కర్నూల్ ఘటన దారుణం ఇల్లందకుంట: నాగర్కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండికేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
బొగ్గు గనుల కేటాయింపు..అవసరమైతే ప్రధానితో భేటీ అవుతాం : భట్టి
సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కబొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు. -
సింగరేణి వివాదం.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్రెడ్డి తెలిపారు. -
2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ప్రభుత్వ సంస్థ.. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది అంటూ భట్టి కామెంట్స్ చేశారు.కాగా, హైదరాబాద్లో శుక్రవారం పదో రౌండ్లో కోల్మైన్ యాక్షన్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిషన్రెడ్డికి విజ్ఞప్తి లేఖను అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటిసారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసు.సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగు బంగారం. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉంది.2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయింది. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్స్ వెళ్లాయి. రిజర్వేషన్లు పక్కన పెట్టీ ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది.రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాక్లు కేటాయించాలి. రిజర్వేషన్ల అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలి. కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిలపక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తాం. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరం. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్ల పాత లీజు రద్దు చేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాం. సింగరేణి భవిషత్ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
సింగరేణిని ముంచే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసేందుకే... ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాడు అంధకారంలోకి దక్షిణాదిసింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
సాక్షి, నూఢిల్లీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదని తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బుధవారం కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదు. అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానిది ఏమీ ఉండదు. దేశంలో 12 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) ఉన్నాయి. దేనినైనా ప్రైవేట్ పరం చేశామా? అలాంటిది సింగరేణిని ఎలా చేస్తాం? ఎలాంటి పక్షపాతం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ మేరకే నడుచుకుంటాం. సింగరేణిలో జరిగే అవినీతిని బోర్డు మీటింగుల్లో లేవనెత్తుతాం. దేశంలో బొగ్గు మాఫియా చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చాక మాఫియా ఆగడాలు, అవినీతి తగ్గాయి. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు. అక్కడ లభించే ఇనుప ఖనిజంలో పరిశ్రమలకు సరిపడే నాణ్యత లేదు. ఫీజిబులిటీ లేకే ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, ఆలి్వన్, హెచ్ఎంటీ బేరింగ్స్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడ్డాయి. తెలిసి కూడా మరో ఫ్యాక్టరీ ఎలా పెడతాం? ఇది కోపంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ ఆరోపించారు. బయ్యారంలో దొరికే ఖనిజాన్ని ఇంకే అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే దానిపై అధికారులతో చర్చిస్తా. గనుల వేలంలో పాల్గొనక రాష్ట్రానికి నష్టం గనులు జాతీయ సంపద. అవి ప్రజలకే చెందాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ క్రమంలో గనుల వేలం పారదర్శకంగా జరుగుతోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు. దాంతో రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. అది ఎంతనే వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి కొందరు రాష్ట్ర పోలీసులు తప్పు చేశారు. జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తే ఎలా? న్యాయం జరగదు. సీబీఐ లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. ఇలాంటి అంశాలపై సమాజంలోని వ్యక్తులు పిటిషన్లు వేయాలి. పార్టీపరంగా మేం వేయం. నయీం ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఏమున్నాయి? చట్టపరంగా ఎంత వసూలు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇక మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ రెండు అంశాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. కాళేశ్వరంపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదు. ఈ విషయం ఇంకా పెండింగ్లోనే ఉందని, రాద్ధాంతం చేయవద్దని గతంలోనే చెప్పాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థన మేరకు మరో రూ.3 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్పై ఇంకా అధికారికంగా రివ్యూ చేయలేదు. దీనిపై అధికారులతో చర్చిస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని బొగ్గు గనులు కొనుక్కోవచ్చు. పోలవరం మాది. అంటే కేంద్రానిది. దానిని పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ నిర్ణయం. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవికే ఎక్కువ ప్రాధాన్యం. మంత్రివర్గంలో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా మంత్రివర్గంలో ఉంటే.. రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. శివరాజ్ సింగ్కు ఇవ్వాలనుకుంటే రాజీనామా చేయిస్తారు. అందులో ఇష్యూ ఏమీ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తాత్కాలికంగానే ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న వేళ నేను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడి పరిస్థితులపై పనిచేశా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని అనుకుంటున్నా. -
సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు
గోదావరిఖని: సింగరేణిలోని డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల్లో వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ మంగళవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఇప్పటివరకు 35ఏళ్లే. కరోనా, విజిలెన్స్ విచారణ, మెడికల్ బోర్డులో పొరపాట్లు తదితర కారణాలతో చాలామంది వారసుల వయసు 35ఏళ్లకు మించిపోయింది. ఇలాంటివారు నిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు అయితే, సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఇటీవల ఇచ్చిన హామీ మే రకు కారుణ్య నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సమయంలో రెండేళ్లపాటు మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.సింగరేణిలో పనిచేస్తూ మృతి చెందితే వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామక ప్రక్రియ ప్ర స్తుతం కొనసాగుతోంది. అనారోగ్యంతో ఉద్యోగానికి అనర్హుడని మెడికల్ బోర్డు నిర్ధారించినా వారసుడికి ఉద్యోగావకాశం క ల్పిస్తోంది. వయో పరిమితి పెంపుపై ఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హర్షం వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ లేనివారికే.. కారుణ్య నియామకాల్లో కార్మిక వారసుల గరిష్ట వయో పరిమితి 40ఏళ్లకు పెంచాం. ఇది 2018 మార్చి 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఆయా ఏరియాల్లో దరఖాస్తు చేయాలి. అయితే, గరిష్ట వయో పరిమితితో ఉద్యోగం పొందలేని, వన్టైం సెటిల్మెంట్ జరగని వారికే కొత్త స్కీం వర్తిస్తుంది. – బలరామ్, సింగరేణి సీఎండీ -
‘నల్లసూరీడు’పై నజర్
● మూడు దశాబ్దాలుగా స్పష్టతలేని ఆదాయపు పన్ను మాఫీ ● మోక్షం లభించని కొత్తగనుల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కల్పన ● అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాజకీయ నేతల హామీలు గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. దీంతో వారిని మచ్చిక చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. రెండు జిల్లాలు.. రెండు లక్షల ఓట్లు.. ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధి విస్తరించిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ● రామగుండం రీజియన్లో రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో సుమారు 12వేలకు పైగా పర్మినెంట్, 8వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● బెల్లంపల్లి రీజియన్లోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి నియోజవర్గాల్లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో 16వేలకుపైగా పర్మినెంట్ కార్మికులు, మరో 7వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ● వీరి కుటుంబాలతో సహా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున లెక్కించినా సుమారు రెండులక్షలకుపైగా ఓట్లు ఉంటాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ● దీంతో వీరి ఓట్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు. ● ఉదయం బొగ్గుగనులపై గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ, సాయంత్రం కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ● మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నేతల తాకిడి ఈప్రాంతాల్లో పెరుగుతోంది. ● ఈనెల 3న మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నలుగుతున్న ఆదాయపు పన్ను మాఫీ.. సింగరేణి కార్మికులను సైనికులతో సమానంగా గుర్తిస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాము గెలిచిన వెంటనే ఆదాయపు పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే, గెలిచాక పార్లమెంట్లో కొద్దిరోజులు పోరాటం చేయడం, ఆ తర్వాత హామీ అటకెక్కించడం సర్వసాధారణంగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోంది. నూతన భూగర్భగనులు.. తాము గెలిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కొత్తగా భూగర్భ గనులు తవ్విస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అంటున్నాయి. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లపై దృష్టి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా.. నిరుద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తామని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయగా, రామగుండం నియోజవర్గంలోని గోదావరిఖనిలో మరో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. జాడలేని మారుపేర్ల మార్పు.. సుమారు 20ఏళ్లుగా నలుగుతున్న మారుపేర్ల మార్పుపై గత పాలకులు హామీలు ఇచ్చినా సింగరేణి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 400మందికి పైగా కార్మిక కుటుంబాల డిపెండెంట్ కేసులు కార్పొరేట్ కార్యాలయంలో నాలుగేళ్లుగా ముందుకు కదలడంలేదు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారిన ఈ సమస్యలకు గెలిచిన పార్టీలు పరిష్కారం చూపాలని కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
సింగరేణి ఉద్యోగుల రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గతంలో బీజేపీతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి సింగరేణి సంస్థ భవిష్యత్ను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘నేటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 7 లక్షల కోట్లు. ప్రతీ సంవత్సరం రూ. 70 వేల కోట్ల అప్పు కట్టాల్సిన ఆర్థిక సంక్షోభం కేసీఆర్ తీసుకొచ్చారు. పదేళ్ల లో అన్ని వ్యవస్థ లను విధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు వేశారు. మేము మార్చి 31 లోపు పూర్తి చేస్తామని చెప్పాం. కేటీఆర్, హరీష్రావులు అబద్దాలతోనే ఇంకా మోసం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకోకరు మాట్లాడడం లేదు. రోజు వారి ఆదాయాన్ని అంచనా వేసి చెల్లింపులు చేస్తున్నాం. ఉద్యోగ నియామకాలు చేపడుతే.. నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు. 70 రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మార్చి 6 న మరో 6 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ...అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగిపోయాక నీళ్లు ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా. కృష్ణా నది జలాలు ఎవరు కేంద్రానికి అప్పగించారో ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ,బీజేపీ పదేళ్ల లో ఇచ్చిన హామీలు, మా గ్యారెంటీలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించేందుకు సిద్దమా. బీఆర్ఎస్ నేతల మాటలనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, సంవంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమైంది. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిశాం. రాష్ట్ర బీజేపీ నేతలు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కలవడం లేదు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఢిల్లీలో కాల్చి చంపారు. హైదరాబాద్ వరదలు వస్తే కేంద్రం సహాయం ఎందుకు చేయలేదు. రేపు సాయంత్రం 500లకు గ్యాస్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించబోతున్నాం. బీజేపీ, బీఆర్ఎస్లకు రాజకీయ స్వార్థం ఉంది . ...రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ,రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్. మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. వడ్డీ కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. పోటీ పరిక్షలకు సిద్ధం అయ్యే వారికి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తాం. వైట్ రేషన్ కార్డు ప్రమానికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైవేలకు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కేటీఆర్ ఔట్ సోర్సింగ్ పర్సన్’అని సీఏం రేవంత్రెడ్డి అన్నారు. -
సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139, మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22, మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో–జియాలజిస్ట్) పోస్టులు 2, మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30, సబ్–ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నా యి. మార్చి 1 నుంచి 18 వరకు ఆన్లైన్లో దర ఖాస్తులను స్వీకరించనున్నారు. వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు. పూర్తి వివరాల కోసం మార్చి 1 నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్ (https://scclmin es.com) లోని ‘కెరీర్’విండోను సందర్శించాలని సంస్థ యాజమాన్యం సూచించింది. -
పీడితుల కోసమే జీవితం అంకితం
తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్ని అభినందించి, తన శాంతినికేతన్కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్ు హైదర్, రాజ బహు దూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు. మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్ఖాన్’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్ భవన్’ అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్’ నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు మఖ్దూమ్ జయంతి) -
హైడ్రో పవర్పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్కాస్ట్ మైన్స్లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్కాస్ట్లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు
-
SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాల్లో అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో, పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల ప్రకారం.. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండీ బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్టు స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా, ఎండీ బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో, ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తోంది. -
సౌర వెలుగుల దిశగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు. ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి
-
ప్రశాంతంగా సింగరేణి ఎన్నికల పోలింగ్
-
కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
-
సింగరేణి ఎన్నికలు..గెలుపెవరిది ?
-
సింగరేణి సమరం.. కొనసాగుతున్న కౌంటింగ్
Singareni Elections 2023.. Updates రామగుండంలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. ఆర్జీ-1కౌంటర్లో పోలైన 5044 ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-2 కౌంటర్లో పోలైన 3369 ఓట్ల లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-3 కౌంటర్లో పోలైన 3612 ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. అర్ధరాత్రి వరకూ కొనసాగనున్న లెక్కింపు. ఆర్జీ-1కు సంబంధించి పోలైన 32 ఓట్ల బ్యాలెట్ బాక్స్ రావడం ఆలస్యం కావడంతో లేట్ గా ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. రామగుండం పరిధిలో ముందుగా వెలువడనున్న ఆర్జీ-2 ఫలితం. తుది ఫలితాల కోసం నెలకొన్న ఉత్కంఠ. అర్ధరాత్రి తర్వాత అధికార గుర్తింపు సంఘం ఎవరనేది తేలనున్న ఫలితం. కౌంటింగ్ ప్రారంభం మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491 పోలింగ్ శాతం 93.03 % నమోదు అయ్యింది.. బెల్లంపల్లి డివిజన్లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు... 96.29 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835 మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.. ముందుగా ఓట్లను యూనియన్ల వారీగా ఏర్పాటు చేసిన బాక్స్లో వేస్తారు. శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు. 13 యూనియన్ లకు 13 బాక్సులు ఏర్పాటు. 25 చొప్పున ఓట్లు కట్టలు కడతారు.. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ఐదుగురు.. మొత్తం తొమ్మిది టేబుల్ లకు 45 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా లో పారంభమైన సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ల్లో 96 శాతంపైగా నమోదైన పోలింగ్. ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ సెంటర్కు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు రంగం సిద్ధం. ఆర్జీ-1లో 5 టేబుల్స్, ఆర్జీ-2లో 3 టేబుల్స్, ఆర్జీ-3 లో 4 టేబుల్స్ పై కొనసాగనున్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు. రాత్రి 12 గంటలకల్లా వెల్లడి కానున్న ఫలితాలు.. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 95 శాతంకు పైగా నమోదైన పోలింగ్. అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్. 95 శాతం పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 37 వేల మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. గెలుపు పై ధీమాతో ఉన్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్లు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది.. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు... మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి గెలిచిన ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సాయంత్రం 5.00 గంటల వరకు మొత్తం 95 శాతం పోలింగ్ నమోదు 9127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8491. బెల్లంపల్లి డివిజన్లలో 985 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు. 96.3 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491.. పోలింగ్ శాతం 95% నమోదు.. మరికొద్ది సేపట్లో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 85.80 శాతం పోలింగ్ నమోదు. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న 34128 మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు. మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య రసవత్తరంగా జరిగిన ఎన్నికల పోరు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది. భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 3 గం. వరకు 86.15% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 4661 మంది ఓటర్లు. మంచిర్యాల: బెల్లంపల్లి ఏరియాలో 3 గంటల వరకు 88.4% పోలింగ్ నమోదు. శ్రీరామ్ పూర్లో 86.7 శాతం మందమర్రి 86.19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో 2pm గంటల వరకు 83.1 శాతం నమోదు... మొత్తం 985 ఓట్లకు గాను 819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఔ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లో మధ్యాహ్నం 3.00 గంటల వరకు 86.19 శాతం పోలింగ్ నమోదు. మొత్తం 4835 ఓట్లకు గాను 4166 ఓట్లు పోలయ్యాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓట్లు 26,815. పోలైన ఓటింగ్ శాతం 67.42 శాతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా: కొత్తగూడెం కార్పొరేట్ 887 ఓట్లు, నమోదైన పోలింగ్ 74.47%. కొత్తగూడెం ఏరియా 1,540 ఓట్లు నమోదైన పోలింగ్ 66.06%. ఇల్లందు 500 ఓట్లు, నమోదైన పోలింగ్ 81.56%. మణుగూరు 1,716 ఓట్లు నమోదైన పోలింగ్ 69.98% సింగరేణి వ్యాప్తంగా మధ్యాహ్నాం 12గం. వరకు నమోదు అయిన ఓట్లు 23,613 సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ 12 గంటల వరకు ఆర్జీ రీజియన్లో.. రామగుండం- 1లో 11 పోలింగ్ కేంద్రాల్లో 58.4 శాతం RG -2లో 6 పోలింగ్ కేంద్రాల్లో 50.09 శాతం RG-3 లో 6 పోలింగ్ కేంద్రాల్లో 60.24 శాతం మొత్తం 57 శాతం పోలింగ్ నమోదు భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 12 గం.ల వరకు 61% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 3,300 కార్మికులు ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు నమోదైన ఓట్లు 4,830 10 గంటలకు పోలింగ్ ఇలా.. ఇల్లందు ఏరియాలో 45 శాతంపైగా పోలింగ్ మణుగూరులో 36 శాతం జయశంకర్ భూపాలపల్లిలో 45 శాతం పోలింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో 42 శాతం పోలింగ్ మందమర్రి డివిజన్ లో 10 గంటల వరకు 34.93 శాతం పోలీంగ్ నమోదు మందమర్రిలో 4835 ఓట్లకు గాను 1689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు బెల్లంపల్లి ఏరియాలో అత్యధికంగా.. 10.00 గంటల దాకా 48.99 శాతం పోలింగ్ నమోదు రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ పరిధిలో.. 48.99 శాతం పోలింగ్ నమోదు సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులను కలుసుకుని మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటేసేందుకు కార్మికుల క్యూ ఉదయం విధులకు హాజరయ్యే కార్మికులతో మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకే పోలింగ్ ఓటేసేందుకు క్యూ కడుతున్న కార్మికులు రాత్రి 7గం. మొదలుకానున్న కౌంటింగ్ రాత్రి 11గం. కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం పెద్దపెల్లి రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఉదయం 9 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు. 8 గంటలకు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 8 గంటల వరకు ... తొలి గంటలో నమోదైన పోలింగ్ 21% పెద్దపల్లిజిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 13.5% మొత్తం 3884 ఓట్లకు గాను 528 మంది కార్మికుల ఓటు హక్కు వినియోగం కొమురం భీంలో 144 సెక్షన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి.. బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఎన్నికల హడావిడి మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఓటు హక్కు వినియోగించుకొనున్న 985 మంది సింగరేణి కార్మికులు నిరసన.. ఫిర్యాదు మంచిర్యాల శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గని నిరసన ఒక అధికారి ప్రచారం నిర్వహిస్తున్నాడని ఓ యూనియన్ నేత ఆరోపణ అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం పని? అంటూ ప్రశ్న పోలింగ్ హెల్ప్ డెస్క్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సదరు యూనియన్ లీడర్ జీఎం కార్యాలయం నుంచి ఐడెంటిటీ కార్డులు కొనసాగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి ఐడెంటిటీ కార్డ్ లేనివారు జీఎం కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచిస్తున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లా లో 11 ఏరియాల్లో పని చేస్తున్న 39వేల మంది మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఖమ్మంలో.. సింగరేణి ఎన్నికల్లో.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరి యాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కొత్తగూడెం ఏరియా రుద్రం పూర్, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లో మూడు చొప్పు న పోలింగ్ కేంద్రాలు.. ఐదు ఏరియాల్లో 6,587 మంది కార్మికులకు ఓటు హక్కు గట్టి పోటీ ఈ రెండు యూనియన్ల నడుమే! భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఐదువేల మంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా వివిధ గనులపై 09 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పోలింగ్ ను బ్యాలెట్ పేపర్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహణ పోలింగ్ అనంతరం కృష్ణ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్కు బ్యాలెట్ బాక్సుల తరలింపు రాత్రి 7 గంటల నుండి రౌండ్ కు 2,500 చోప్పున ఓట్ల లెక్కింపు చివరకు.. ఫలితాల వెల్లడి బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుందన్న ప్రచారంతో.. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే గట్టి పోటీ సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభం సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రారంభం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 84 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5గం. వరకు కొనసాగనున్న పోలింగ్ సాయంత్రం 7గం. నుంచి కౌంటింగ్ మొత్తం 39,809 మంది ఓటర్లు శ్రీరాంపూర్లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో ఐదు పోలింగ్ కేంద్రాలు బరిలో 13 కార్మిక సంఘాలు ఎన్నికల నుంచి తప్పుకున్న టీజీబీకేఎస్ AITUCకి మద్ధతు ప్రకటించిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ TBGKS(Telangana Boggu Ghani Karimka Sangham) కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని ప్రకటన నేడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ భూపాలపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,410 మంది కార్మికులు మొత్తం 09 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు బ్యాలెట్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ పోటీలో 13 గుర్తింపు యూనియన్లు ఎన్నికల్లో ఇలా.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిధులు, నియామకాల్లో నంబర్వన్గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఏరియాల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. తాజా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(బీఆర్ఎస్ టీజీబీకేఎస్ సపోర్ట్) మధ్య జరుగుతున్నాయి. సింగరేణి ఎన్నికల చరిత్ర ఇది.. సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ప్రభుత్వం.. సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుత) అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. -
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్వన్గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి. -
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
-
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్బాబు తెలిపారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
బీఆర్ఎస్ కు షాక్..టీబీజీకేఎస్ కు అగ్రనేతల రాజీనామా
-
సింగరేణి ఎన్నికల వాయిదాకు నో
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గురింపు సంఘం ఎన్నికల వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిన విధంగా డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని స్పష్టంచేసింది. ఎన్నికల వాయిదా కోరుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్ర స్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావా లంటూ యాజమాన్యం సెపె్టంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని చెప్పింది. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల సంఘం పలు భేటీలు నిర్వహించనుందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఎన్నికల వాయిదాకు నిరాకరిస్తూ అక్టోబర్ 28న నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్సీసీఎల్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీనిపై నాడు విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. వాయిదాకు అంగీకరిస్తూ, డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున నాడు విచారణకు హాజరైన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) కూడా ఎన్నికలు డిసెంబర్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ప్రభుత్వం అక్టోబర్లో సమ్మతించింది.. డిసెంబర్ 27న కూడా ఎన్నికలు నిర్వహించలేమని, మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ గత వారం ప్రభుత్వం ప్రధాన పిటిషన్లో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. కేంద్ర కార్మిక శాఖ ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొద్ది రోజుల క్రితమే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పోలీస్ అధికారుల బదిలీలు చేపడుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు అత్యంత కీలకమని, ఈ క్రమంలో ఇప్పటికిప్పుడే కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమంటూ వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్టోబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు నిరాకరించింది. అక్టోబర్లో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సమ్మతిస్తూ తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ హామీ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. -
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరిపేందుకు వీలు కలిపిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను కొట్టేసింది. సింగరేణికి నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏడాది నుంచి హైకోర్ట్లో సింగరేణి ఎన్నిక వివాదం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్టు.. ఇప్పటికే పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కేంద్ర కార్మిక శాఖ ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. ఆపై పిటిషన్పై విచారణ జరుపుతూ వచ్చింది. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. చివరకు.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. -
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. కంటిన్యూ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి. అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. -
సింగరేణిలో పోలింగ్ కేంద్రాలు ఖరారు
గోదావరిఖని: సింగరేణిలో ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం–1లో 11, రామగుండం–2లో ఆరు, రామగుండం–3లో ఆరు, భూపాల్పల్లిలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఐదు, మందమర్రిలో 11, శ్రీరాంపూర్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజే రాత్రి ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికోసం కూడా ఎన్నికల లెక్కింపు కేంద్రాలను కార్మిక శాఖ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే..: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేకంగా 10 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొ త్తగూడెం ఏరియాలోని ఓట్లను రుద్రంపూర్ ఆర్సీవోఏ క్లబ్, ఇల్లెందు ఏరియా ఓ ట్లను ఇల్లెందు ఏరియా కమ్యూనిటీహాల్, మణుగూరు ఏరియాలో పీవీకాలనీ కమ్యూనిటీహాల్, రామగుండం రీజియన్లోని ఆర్జీ–1,2, 3 ఏరియాల ఓట్లను గో దావరిఖని సెక్టార్–1 కమ్యూనిటీ హాల్, భూపాల్పల్లి ఏరియా ఓట్లను కృష్ణ కాల నీ మినీ ఫంక్షన్హాల్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్షిప్, సీఈఆర్క్లబ్, మందమర్రి ఏరియా ఓట్లను మందమర్రి సీఈఆర్ క్లబ్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఓ ట్లను సీసీసీ ఎస్సీవోఏ క్లబ్, కార్పొరేట్లో హెడ్డాఫీస్ న్యూకాన్ఫరెన్స్హాల్, కార్పొరేట్ బూత్–5 ఓట్లను సింగరేణి భవన్ మూడో ఫ్లోర్లో లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. -
తిరుమలలో ఎమ్మెల్యే వివేక్.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వివేక్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. పది సంవత్సరాలలో ప్రజాధనం దుర్వినియోగంపై శ్వేతపత్రం తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది అని కామెంట్స్ చేశారు. -
యువ సారథ్యానికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కా ర్మి క సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్లో కవితను కలసి సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తమ యూనియన్లో యువతకు 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారన్నారు. జాతీయ సంఘాల కారణంగా కారుణ్య నియామకాలకు గండి పడిందని, కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని, ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని వివరించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచామని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించారని, క్వార్టర్స్లో నివసించే వారు బేసిక్లో 1% సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకున్నారని కవిత పేర్కొన్నారు. -
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
సొల్యూషన్ లేని ‘అలియాస్’ సమస్య
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో అలియా స్(పేరు మార్పిడి) సమస్య చిక్కుముడిగా మారింది. ఈ సమస్య కారణంగా సంస్థ వ్యాప్తంగా సుమా రు వెయ్యి మందికి పైగా కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఏళ్ల తరబడి కా ర్యాలయం చుట్టూ తిరిగినా పని జరగక, స్పౌస్లకు పెన్షన్ రాక అవస్థ పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క కార్మికుల సమస్యలు తెలిసినప్పటికీ గుర్తింపు సంఘం నాయకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమిటీ సమస్య? సింగరేణి సంస్థలో కార్మికులు అవసరమైన సందర్భాల్లో నియమ నిబంధనలు పక్కనపెట్టి... వచ్చిన వారిని వచ్చినట్లుగా నియమించారు. నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేస్తే ఎవరూ రారనే భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోగా, ఉద్యోగం వస్తుందనే ఆశ, కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందనే భావనతో చాలామంది మారు పేర్లతో చేరారు. ఈ ప్రక్రియలో అటు అధికారులు.. ఇటు కార్మికుల తప్పిదం కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఉద్యోగం చేరాక రెండేళ్లకు కార్మికులను పర్మనెంట్ చేయడం పరిపాటి. కనీసం అప్పుడైనా కార్మికుల పూర్తి వివరాలు సేకరించి సరైన పేర్లతో పర్మనెంట్ చేయాల్సి ఉన్నా.... ఆనా టి సింగరేణి రిక్రూట్మెంట్ సెల్, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ విభాగాల అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సీఎం చెప్పినా అంతే 2018 ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ సమస్యపై మాట్లాడారు. కార్మికులకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్చి, వారసత్వ ఉద్యోగాల ద్వారా కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ప్రక్రియను వేగవంతం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇది జరిగి ఐదేళ్లు కావొస్తున్నా ప్రక్రియ పూర్తికాకపోవడంతో సుమారు వేయి మంది కార్మికులు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు శ్రద్ధ కనబర్చకపోవడంతో ఉద్యోగుల పేర్లు మార్చకపోగా, ఇంటి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతరత్రా సమాచారం తప్పుగా నమోదవుతోంది. దీంతో పెన్షన్లు మంజూరు కాక, అర్హులైన కార్మికుల్లో కుటుంబీకులకు వారసత్వ ఉద్యోగాలు లభించక నానా అవస్థలు పడుతున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకుంటాం: బలరామ్ సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరామ్ను ఈ విషయమై వివరణ కోరగా... బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్మికుల పూర్తి వివరాల సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. -
సింగరేణి సెగ ఎవరికి?
ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చే సింగరేణి ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోనని రాజకీయపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో గోదావరి లోయ పరిధిలో 6 జిల్లాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణిలో మొత్తంగా 11 డివిజన్లలో 70వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 42 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో 28వేల మంది కాంట్రాక్టు కార్మికులు. వీరి కుటుంబసభ్యులతో సహా మూడున్నర లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు. ఈ 11 నియోజకవర్గాల్లో సింగరేణి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతే ఫలితం అటు వైపే అన్న విషయం గత అనుభవాల నేపథ్యంలో అన్ని పక్షాలకు తెలుసు. దీంతో సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్నర్ మీటింగ్లు, దావత్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సింగరేణి పరి ధిలోని పలు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాదసభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నాయకులు సింగరేణి బెల్ట్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా ఉన్న టీబీజీకేఎస్ (బీఆర్ఎస్), ఐఎన్టీయూసీ (కాంగ్రెస్), ఏఐటీయూసీ (సీపీఐ)ల బలం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. 2018లో విలక్షణ తీర్పు గత శాసనసభా ఎన్నికల్లో సింగరేణి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. 11 శాసనసభా నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్కు కేవలం మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందగా, రామగుండంలో బీఆర్ఎస్ రెబెల్ కోరుకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. సత్తుపల్లిలో టీడీపీ గెలుపొందగా, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాకల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన వారితో పాటు భూపాలపల్లి , ఆసిఫాబాద్ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి , ఆత్రం సక్కు కూడా తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు వారిలో ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆత్రం సక్కు మినహా మిగతా వారంతా బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. ఆసిఫాబాద్లో టీఆర్ఎస్ నుంచి గతంలో ఓడిపోయిన కోవా లక్ష్మికే మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఈసారి సింగరేణి కార్మికులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మద్దతు పలుకుతారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి. కాగా, మంథని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రభావం కనిపిస్తోంది మిగిలిన చోట్ల ఆ పార్టీ పోటీ నామమాత్రంగానే ఉంది. మిగతా హామీల సంగతేంటంటున్న కాంగ్రెస్, సీపీఐ గత సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలతో పాటు కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.10లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చా రు. కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు హామీని కూడా అమలు చేయిస్తామని చెప్పారు. గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం రూ. 20 లక్షలకు పెంపు హామీ ఇంకా నెరవేరలేదు. భూగర్భ బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడం, కొత్త గనులు తెరవకపోవడం, సింగరేణికి ప్రభుత్వ సంస్థలు రూ. వేల కోట్లు బాకీపడడం, సింగ రేణిలో పెరిగిన రాజకీయ జో క్యం, ప్రైవేటీకరణ వంటి అంశాలను కాంగ్రెస్, సీపీఐ తప్పు పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలపై బీఆర్ఎస్ ఆశలు 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో తమ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పలు హామీలు నెరవేరుస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తదనుగుణంగా పావులు కదిపి సింగరేణి కారుణ్య నియామకాల ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇప్పటి వరకు 18వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. ఎప్పుడో చంద్రబాబు హయాంలో 1998లో రద్దయిన వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను పునః ప్రారంభించి, సింగరేణి కార్మికుల కలలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని ఆపార్టీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చే క్వార్టర్స్ విషయంలో నిబంధనల సడలింపు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీతాలు, మరమ్మతుల కల్పన, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పన వంటివి అందించడంతో బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉందని తెలుస్తోంది. లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చడం, దసరా, దీపావళి పేరిట కార్మికులకు ఇచ్చే బోనస్, అడ్వాన్స్ పెంపు కూడా తమ విజయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ వెంట నడుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -పోలంపల్లి ఆంజనేయులు -
చట్టసభల్లో నల్ల సూరీళ్లు
సింగరేణి సంస్థలో పనిచేసి ఆ తర్వాత చట్టసభలకు ఎన్నికై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు. నేరుగా బొగ్గు గనుల్లోకి దిగి పనిచేసిన కా ర్మికులు కొందరైతే, క్లరికల్ ఉద్యోగం చేస్తూ చట్టసభలకు ఎంపికైనవారు మరికొందరున్నారు. – గోదావరిఖని కొప్పుల ఈశ్వర్.. కొప్పుల ఈశ్వర్ 1976లో కా ర్మిక జీవితాన్ని ప్రారంభించారు.తొలిసారిగా 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి మేడిపల్లి ఓసీపీలో 8 ఏళ్ల పాటు పనిచేశారు. ఈశ్వర్ ఆ తర్వాత వరుసగా జరిగిన 2004 నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుత కేసీఆర్ కేబినెట్లో మంత్రి. మాలెం మల్లేశం 1974లో కోల్ఫిల్లర్గా జీడీకే–2ఏ గనిలో కా ర్మికుడిగా చేరిన మల్లేశం..1985లో క్లర్క్గా పదోన్నతి పొందారు. 1985లో టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో ఇండిపెండెంట్గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కోదాటి రాయమల్లు.. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కోదాటి రాయమల్లు బెల్లంపల్లి ఏరియాలో గనుల్లో క్లర్క్గా పనిచేశారు. చెన్నూరి నుంచి 1952లో మొదటి సారిగా ప్రజాసోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1972 వరకు వరసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1980లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. 1972 నుంచి 1978 వరకు ఆరోగ్యశాఖమంత్రిగా పనిచేసి దాసరి నర్సయ్య.. బెల్లంపల్లి పట్టణానికి చెందిన నర్సయ్య బెల్లంపల్లి ఏరియాలో వివిధ గనుల్లో సర్వే మజ్దూర్గా, మైనింగ్ సర్దార్గా 1974 నుంచి 1978 వరకు పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1989లో కూడా గెలిచారు. ఎస్.సంజీవరావు.. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సొత్కు సంజీవరావు మందమర్రి ఏరియాలోని గనిలో 1978 నుంచి 1981 వరకు పనిచేశారు. 1983లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. సంభాని చంద్రశేఖర్.. చంద్రశేఖర్ కొత్తగూడెం ఏరియాలో క్లర్క్గా పనిచేశారు. 1985లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2004లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. బోడ జనార్దన్.. 1977–1982 వరకు శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే–5లో గనిలో సర్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. టీడీపీ నుంచి 1985, 1989, 1994, 1999లో వరుసగా చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ హయాంలో ఓ దఫా కా ర్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీఎల్ఎఫ్ కూటమి నుంచి చెన్నూరు అభ్యరి్థగా బరిలో ఉన్నారు. పాటి సుభద్ర.. పాటి సుభద్ర సొంతగ్రామం ఖమ్మం జిల్లా కొత్తగూడెం. 1978లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుభద్ర 1981 నుంచి సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి, సీసీసీ, శ్రీరాంపూర్, గోదావరిఖని, ఆస్పత్రుల్లో పనిచేశారు. 1999లో ఆసిఫాబాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బి.వెంకట్రావ్ ఖమ్మం జిల్లా బూర్గంపాడ్కు చెందిన వెంకట్రావ్ ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2009 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కోరుకంటి చందర్ రామగుండం ఏరియాకు చెందిన కోరుకంటి చందర్ సింగరేణి కా ర్మికుని బిడ్డ. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ నుండి పోటీ చేసి 26 వేల మెజార్టీతో గెలుపొందారు. -
సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా జోష్ నెలకొంది. సింగరేణి లాభాల వాటాను కార్మికుల ఖాతాలో జమ చేసేందుకు అడ్డంకి తొలగింది. పండుగకు మూడు రోజుల ముందే కార్మిక ఖాతాల్లో సింగరేణి యాజమాన్యం నగదు జమ చేయనుంది. ఒక్కొక్కరికి రూ. 1.53 లక్షల చొప్పున 42 వేల మంది కార్మికులకు లాభాల వాటాను జమ చేయనుంది. ఈ మేరకు దసరా బోనస్గా రూ. 711 కోట్లు విడుదల చేసింది. శనివారం దసరా పండగ అడ్వాన్స్ కూడా సింగరేణి సంస్థ చెల్లించనుంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా సింగరేణి సంస్థ గతేడాది సాధించిన రూ.2,222.46 కోట్ల లాభంలో 32 శాతాన్ని దసరా పండుగకు ముందే చెల్లించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: Video: చెక్పోస్టు కారు బీభత్సం.. కానిస్టేబుల్ను ఢీకొట్టి.. -
సింగరేణి ఎన్నికలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గురింపు సంఘం ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న యాజమాన్యం అభ్యర్థనకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని, నవంబర్ 30లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఎన్నికలకు సహకరించాలని, ఆ మేరకు కార్మిక సంఘాలకు స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమన్న యాజమాన్యం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, గడువు కావాలంటూ యాజమాన్యం గత నెల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. వరుస పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వానికి అధికారులు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేమని వారు పేర్కొన్నట్లు వివరించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. గతంలో అక్టోబర్లో నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని తేల్చిచెప్పారు. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్కు వెళ్లింది. అలాగే సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్(ఐఏ) దాఖలు చేసింది. ఈ అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రక్రియ మాత్రం కొనసాగించండి.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాల(కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి) పరిధిలోని 13 నియోజకవర్గాల్లోని 15 ట్రేడ్ యూనియన్లకు ఎలక్షన్లు అక్టోబర్లో నిర్వహించడం సాధ్యం కాదు. ఇందులో మూడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. దాదాపు 43,000 మంది ఓటర్లు ఉంటారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్తో పాటు ఇతర పలు శాఖల అధికారులు అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. వీరి సహకారం లేకుండా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. 700 మంది అధికారులు, సిబ్బంది సాయం కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిల్లో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు మరి కొంత సమయం ఇవ్వాలి’ అని సింగరేణి యాజమాన్యం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్ 27 వరకు సమయం ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియను మాత్రం కొనసాగించాలని, నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. -
సింగరేణి ఎన్నికలు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను ఎన్నికలు వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. ఈమేరకు ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబరు 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ చేయాలని పేర్కొంది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అవ్వగా, ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. గత ఏడాది నుంచి హైకోర్ట్లో సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్ట్.. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో సింగరేణి అప్పీల్ చేసింది. ఈ రోజు సింగరేణి ఎన్నికలపై విచారణ జరిపిన హైకోర్టు.. సింగరేణి ఎన్నికలను డిసెంబరు 27కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. చదవండి: 17 రోజులు.. 41 సభలు -
సింగరేణి ఎన్నికలు.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడంలేదని కేంద్ర కార్మిక శాఖ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. సింగరేణి ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు సంస్థ యాజమాన్యం సహకరించడంలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. గత నెల 27న మీటింగ్కు సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదని కేంద్రం పిటిషన్లో పేర్కొంది. సింగరేణి తుది ఓటర్ల జాబితాను ప్రకటించలేదని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశామని కేంద్రం వెల్లడించింది. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సింగరేణి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం పిటిషన్లో కోరింది. ఇక, సింగరేణి అప్పీల్తో కలిపి కేంద్ర కార్మికశాఖ పిటిషన్పై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు తెలిపింది. అంతకుముందు.. కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. అయితే, ఈ నెలాఖరులోగా కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సింగరేణి డివిజన్ బెంచ్ను సింగరేణి సంస్థ కోరింది. సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ సింగరేణి అప్పీలుపై తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కార్మిక శాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఇది కూడా చదవండి: దసరా హాలీడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఏరోజున అంటే? -
సింగరేణి కార్మికులకు దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్కు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరామ్ గురువారం సర్క్యులర్ను జారీ చేశారు. చదవండి: ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ
గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఏడాదిలో భూగర్భగనుల్లో 190 మస్టర్లు, ఉపరితలంలో 240 మస్టర్లు పనిచేసిన బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఎన్.బలరాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తొలిసారి 2017 అక్టోబర్లో ఒకేసారి 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు. 2022 డిసెంబర్ 31వ తేదీకి ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరినవారిలో కనీసం 190/240 మస్టర్ల అర్హత కలిగిన వారిని ఇప్పుడు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసినట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేసినట్లు వివరించారు. ఏరియాల వారీగా ఇలా.. జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరణ అయినవారిలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరాంపూర్లో 677 మంది, ఆర్జీ–1లో 522, ఆర్జీ–2లో 51, ఆర్జీ–3, అడ్రియాలలో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, బెల్లంపల్లిలో 32, ఇల్లెందు, కార్పొరేట్లో 38, కొత్త్తగూడెంలో 9 మందిని రెగ్యులరైజ్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పనిచేసే వారికి గుర్తింపు సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. గతంలో జనరల్ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్లు అందుకోవాలి. – ఎన్ బలరామ్, డైరెక్టర్ -
ఏటేటా.. ఉద్యోగులకు టాటా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మిక, ఉద్యోగ భాగస్వామ్యం ఏటేటా భారీగా తగ్గుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా కొత్తగా గనులు ఏర్పడక క్రమేపి ప్రైవేటీకరణ పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికులసంఖ్య 39 వేలకు చేరింది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో కాంట్రాక్టు వ్యవస్థ పెరిగిపోయింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం గోల్డెన్ షేక్హ్యాండ్ పథకం కింద, విధుల్లో నిర్లక్ష్యం పేరిట 1997 నుంచి 2014 వరకు వందలాది కార్మికులను తొలగించారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతమంది కార్మికులు ఉంటారనే చర్చ మొదలైంది. కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ప్రక్రియ మొదలై వచ్చే నెల 5న ఓటర్ల జాబితా వెలువడితే పూర్తిస్థాయిలో సంఖ్య తేలనుంది. కార్మిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే 1998లో 1,08,212 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 39 వేలకు చేరింది. వీటితోపాటు రెండు వేల వరకు ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగులు ఉంటారు. గత 25 ఏళ్లలో 68 వేల మంది కార్మికులు తగ్గారు. కంపెనీలో ఇప్పటివరకు ఆరుసార్లు కార్మిక ఎన్నికలు జరిగాయి. నాటికీ, నేటికీ ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. గత ఆరేళ్లలోనే 13 వేలకుపైగా కార్మికులు తగ్గారు. -
సింగరేణిలో పోరు సైరన్
ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం/కరీంనగర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సింగరేణి కార్మిక సంఘాలు, యాజమాన్యం ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ సమావేశమైంది. తీవ్ర ఉత్కంఠల నడుమ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్కమిషనర్ (సెంట్రల్) శ్రీనివాసులు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ ఇలా: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 30న ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, మార్పులుచేర్పుల తర్వాత తుది జాబితా అక్టోబర్ 5న విడుదల చేస్తారు. 6, 7 తేదీల్లో సాయంత్రం 5గంటల వరకు హైదరాబాద్లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 10న గుర్తులు కేటాయిస్తారు. 28న సింగరేణి సంస్థ విస్తరించిన 11 ఏరియాలు, కార్పొరేట్ లో పోలింగ్ జరుగుతుంది. సింగరేణిలో ప్రస్తుతం 42,390 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాయిదాకు ససేమిరా: హైకోర్టు తీర్పు అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలపై బుధవారం హై దరాబాద్లో జరిగిన సమావేశంలో హైడ్రామా చో టు చేసుకుంది. మొత్తం 16 కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఏఐటీయూసీ, బీఎంఎస్ కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వ హించాలని తమ అభిప్రాయం తెలిపాయి. టీబీజీకేఎస్తో పాటు మరికొన్ని సంఘాలు ఎన్నికలు వాయిదా వేయాలన్నాయి. కొందరు కార్మిక సంఘాల ప్రతినిధులు తటస్థంగా ఉన్నా రు. దీంతో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసేందుకు యాజమాన్యం తరఫున హాజరైన ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. వాయిదాపై ఏకాభిప్రాయం వస్తే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దామంటూ మంతనాలు సాగించారు. అయితే సమావేశం చివరివరకు కూడా ఎన్నికల వాయిదాకు ఏఐటీయూ సీ, బీఎంఎస్లు అంగీకరించలేదు. ఎన్నికలు నిర్వహించాల్సిందేన ని పట్టుబట్టాయి. దీంతో కోర్టు తీర్పు ప్రకారం ఎ న్నికల షెడ్యూల్ జారీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలై ఉంది. సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమే అంటూ ఇదివరకే ఆ జిల్లాల పరిదిలోని అధికారులు చేతులెత్తేశారు. మెజారిటీ సంఘాలు కూడా ఎన్నికల వాయిదాకే పట్టుబట్టాయి. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్లో ఉంది. 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించే అవకాశం సింగరేణికి లభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 20కిపైగా బొగ్గుగనుల బృందాలు రానున్నాయి. ఇదే కాకుండా అతి కీలకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతోంది. -
సింగరేణిలో ‘బోనస్’ బొనాంజా
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అర్జించిన రూ.2222 కోట్ల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే రూ.711 కోట్లు సంస్థ ఉద్యోగులకు బోనస్గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్గా చెల్లించగా, ఈసారి రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్రావు మంగళవారం రాష్ట్ర ఇంధనశాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.60లక్షల నుంచి రూ1.70లక్షల వరకు లాభాల్లో వాటాగా చెల్లించే అవకాశముందని సంస్థ వర్గాలు అంచనా వేశాయి. ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వచ్చే దసరా పండుగకు ముందే బోనస్ చెల్లిస్తారు. 11వ వేతన సవరణ సంఘం బకాయిల కింద ఈ నెలలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.1450 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. దీపావళి బోనస్ చెల్లింపులపై సైతం త్వరలో సంస్థ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోనుంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో లాభాల బోనస్ చెల్లించనుండడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్గా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1998లో తొలిసారిగా లాభాల్లో పది శాతాన్ని కార్మికులకు అందించారు. ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 42 వేల మంది కార్మికులు/ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి వచ్చే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేప థ్యంలోనే ఎరియర్స్, బోనస్ చెల్లింపులు చకచకా సాగుతున్నాయనే భావన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
‘సింగరేణి’ నియామకాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేశారు. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీ క్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలీ, జస్టిస్ జె.అనిల్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగరేణి తరఫున స్పెషల్ జీపీ ఎ.సంజీవ్కుమా ర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ని యామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. -
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఆదేశాలపై కార్మికుల అకౌంట్లలో గురువారం మధ్యాహ్నం ఈ నగదు జమ చేసింది. ప్రస్తుత 39, 413 మంది ఉద్యోగుల కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేసిన చేశారు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఎరియర్స్ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీ&ఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్ బలరామ్కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వరలో దసరా, దీపావళి బోనస్ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్ బలరామ్ వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు రూ. 1726 కోట్లు.. ఒక్కొక్కరికి 2 నుంచి 6 లక్షలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన బకాయిలపై సింగరేణి సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. సింగరేణిలో జాతీయ బొగ్గు గనుల వేతన ఒప్పందం అమలు అవుతున్న విషయం తెలిసిందే. పదో వేజ్బోర్డు కాలపరిమితి 2021 జూలై 1తో ముగిసింది. అప్పటి నుంచి 11వ బోర్డు అమల్లోకి వచ్చింది. ఈ మేరకు 2021 జూలై నుంచి 2023 మే 31 వరకు మొత్తం 22 నెలలకు సంబంధించి ఉద్యోగులు, కార్మికులకు పెరిగిన వేతన బకా యిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై కార్మిక సంఘాలు క్రమం తప్పకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో 11వ వేజ్బోర్డు వేతన బకాయిలు ఈనెల 21న చెల్లిస్తామని సింగరేణి ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో పని చేస్తున్న 42 వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ బకాయిల మొత్తం జమచేస్తారు. ఇందుకు సంస్థ రూ.1,720 కోట్లు కేటాయించింది. కనిష్టంగా రూ.2.60 లక్షలు సింగరేణిలో ప్రారంభ వేతనం పదో వేజ్బో ర్డులో రూ. 25,000 ఉండగా 11వ వేజ్బోర్డ్లో ఇది రూ. 37,000కు చేరుకుంది. సీనియర్ విభాగంలో గరిష్ట వేతనం రూ.76వేల నుంచి రూ.90 వేలకు పైగా చేరుకుంది. దీంతో ఒక్కో కార్మికుడు పొందే వేతనాల బకాయిల మొత్తం కనిష్టంగా రూ. 2.64 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ.3.08 లక్షల వరకు ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయంలో గరిష్టంగా రూ.6 లక్షల వరకు వేతన బకాయిలు అందనున్నాయి. చదవండి: జమిలీ ఎన్నికలపై గుత్తా సుఖేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్హెచ్డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
సింగరేణిలో గులాబీజెండా ఎగరాలి: కవిత
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలో గులాబీ జెండా మాత్రమే ఎగరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆ ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లోని కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం హైదరాబాద్లో కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే ఆ ప్రమాదాన్ని కేసీఆర్ తప్పించారని చెప్పారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. సింగరేణిలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతలో అనాసక్తి .. సింగరేణిలో ఈ గనుల్లోనే గైర్హాజరీలు ఎక్కువ
చిన్నచిన్న అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ విధులకు డుమ్మా. వీరిలోనూ ఉన్నత విద్యావంతులే అధికం.. ఒక్క వకీల్పల్లిగనిలోనే 60 మంది దాకా గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దంటున్న అధికారులు గోదావరిఖని: సింగరేణి భూగర్భగనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారే గైర్హాజరు అవుతున్న వారిలో అధికంగా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం వచ్చిన ఉద్యోగాన్ని నామోషిగా భావించేవారు కొందరయితే, ఇక్కడ వర్క్ కల్చర్ ఇష్టం లేక, సిగరేణి ఆఫీసుల్లో అవకాశం రాక, లైట్ జాబ్ల కోసం పరుగులు తీసేవారు మరికొందరు. మూడు షిఫ్ట్ల విధానానికి ఇష్టపడినవారు ఇంకొందరు. సింగరేణిలో చేరిన కొద్దిరోజులకే విధులకు డుమ్మా కొట్టేవారి సంఖ్యా క్రమక్రమంగా పెరుగుతోంది. పలువురు కుటుంబసభ్యులు,తల్లిదండ్రుల అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ గైర్హాజరవుతున్నారు. ఒక్క వకీల్పల్లిగనిలో గైర్హాజరు అయిన వారు 60 మంది దాకా ఉన్నారు. ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఓ యువ కార్మికుడు 2022 ఏప్రిల్లో ఉద్యోగంలో చేరాడు. 15 నెలల్లో 19రోజులు మాత్రమే డ్యూటీ చేశాడు. గైర్హాజర్ కౌన్సెలింగ్కు హాజరై తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రావడం లేదని కారణంగా చెప్పాడు. దీంతో గైర్హాజర్ కార్మికుల జాబితాలో ఆయన చేరాడు. జీడీకే–11గనిలో బదిలీ వర్కర్గా 2015లో సింగరేణి విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి కనీసం వంద మస్టర్లు చేయలేదు. దీంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకే తాను డ్యూటీకి రావడం లేదని చెబుతున్నాడు. ‘ఆర్జీ–2 ఏరియా వకీల్పల్లిగనిలో పనిచేస్తున్న యువ కార్మికుడు 2015లో కారుణ్య నియామకం ద్వారా సంస్థలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడికి సంబంధించి గడిచిన 8 ఏళ్లలో వంద మçస్టర్లు మాత్రమే నమోదయ్యాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే డ్యూటీకి రాలేకపోతున్నానని అంటున్నాడు. ..ఆర్జీ–2 లో వకీల్పల్లిగనికి చెందిన ఒకరు 2018లో ఉద్యోగంలో చేరారు. కనీసం అతను 60 డ్యూటీలు కూడా చేయలేదు. దీంతో సింగరేణి యాజమాన్యం గైర్హాజర్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఇటీవల గనిలో నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. కారుణ్య నియామకాలు ఇలా సింగరేణిలో పనిచేసే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణం)తో విధుల నుంచి తప్పుకుంటే వారి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2015 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 11,541మంది యువత ఉద్యోగాల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి మూడేళ్ల పాటు పనిచేస్తే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అయితే సింగరేణిలో 12 ఏరియాల్లో గత మూడేళ్లలో కనీసం 100 మస్టర్లు కూడా చేయని కార్మికులు 1377 మంది ఉన్నారు. పూర్తిస్థాయి యాంత్రీకరణ ఉన్నా.. పదేళ్ల కిందట అయితే భూగర్భగనిలోకి దిగి పైకి ఎక్కడమే ఎంతో శ్రమగా ఉండేది. తట్టాచెమ్మస్ పూర్తిగా కనుమరుగైపోయింది. సెమీ మెకనైజ్డ్, ప్రస్తుతం పూర్తిస్థాయి యాంత్రీకరణ కొనసాగుతోంది. మ్యాన్రైడిండ్, చైర్కార్, చైర్లిఫ్ట్లాంటి విధానం ద్వారా భూగర్భగనిలోని పనిస్థలాల వద్దకు కార్మికులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నారు. దీంతో కార్మికులకు నడక శ్రమ చాలా తగ్గింది. అయినా చాలామంది యువ కార్మికులు ఆఫీస్ కార్యాలయాలు, ఓసీపీలు, గనిపైన ఉన్న లైట్జాబ్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఏటా వంద మస్టర్లు తప్పనిసరి సంస్థలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఏటా భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, సర్ఫేజ్లో అయితే 240 మస్టర్లు ఉండాలి. అవి ఉంటేనే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఏటా వంద మస్టర్ల చొప్పున మూడేళ్ల పాటు 300 మస్టర్లుంటే ఉద్యోగానికి గ్యారెంటీ. లేనిపక్షంలో యాజమాన్యం నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తుంది. వాస్తవ కారణాలు ఉంటే సంస్థ సహకరిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. సింగరేణిలో చేరిన యువత చిన్నకారణాలతో విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఏవైనా వాస్తవ కారణాలుంటే సంస్థ కూడా సహకరిస్తుంది. సంస్థలో యువకార్మికులు పెరుగుతున్న క్రమంలో సంస్థ మరింత లాభాల బాటలో పయనించాలి. కారణాలేవైనా సంస్థ ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగితో పాటు కుటుంబం వీధిన పడటం సరికాదు. –బలరాం, డైరెక్టర్(పా), సింగరేణి -
బొగ్గు గనుల వేలం అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో మూడో స్థానం.. తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
ఏటా వంద మిలియన్ టన్నులు..
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 78 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ప్రణాళికలను రూపొందించిన సంస్థ, నూతన ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తూ.. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను విస్తరించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల ద్వారా సుమారు 26 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని భావిస్తోంది. ఈ ఐదు ప్రాజెక్టుల్లో నైనీ బ్లాక్ కొత్త ప్రాజెక్టు కాగా, మిగతా నాలుగు ప్రాజెక్టుల జీవితకాలం పొడిగింపునకు వెళ్తున్నాయి. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు 11నుంచి 43 ఏళ్ల వరకు జీవితకాలం పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు శనివారం సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ సంస్థ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ఏరియాల నుంచి ప్రాజెక్టు నివేదికలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఒడిశాలోని నైనీబ్లాక్ కోల్మైన్ ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా పెరగనుంది. నాలుగు పాత ప్రాజెక్టుల విస్తరణ వల్ల మరో 16.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో మరో 4.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా ముందుకు విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం బొగ్గు నిల్వలు ముగిసిన ప్రాజెక్టులకు ఎక్స్టెన్షన్ పేరుతో అనుమతులు పొందాం. వచ్చే ఏడాది మరో రెండు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నాం. పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్, సింగరేణి సంస్థ -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
రామప్పపై ఏఎస్ఐ మంట!
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్ కాస్ట్ మైన్)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్జీఆర్ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లను పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. మూడు కీలక అంశాలతో.. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. శాండ్ బాక్స్ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది. రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్ గ్రేడియంట్స్) ఏర్పడుతాయి. రామప్ప ఆలయం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్ గ్రేడియంట్స్ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. -
సింగరేణి నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది: కిషన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణలో ప్రభుత్వం మారాలని అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలడుతోందని ఫైరయ్యారు. కాగా, మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సింగరేణి కార్మికులు ఎన్నికల సమయంలో మాత్రమే బీఆర్ఎస్కు గుర్తుకువస్తారు. సింగరేణి కార్మికులకు సొంతిల్లు కట్టిస్తామన్న హామీ ఏమైంది?. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం లేదు. సింగరేణిని రక్షించడం లేదు.. భక్షిస్తున్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణలో ప్రభుత్వం మారాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమే. కోల్ ఇండియాలో కార్మికులకు 930 రూపాయలు వేతనం ఉంటే సింగరేణిలో 420 మాత్రమే ఉంది. ఎందుకింత విపక్ష?. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు. సింగరేణి నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం రెడ్ కార్పెట్ వేసింది. కార్మికుల షిఫ్టులు మార్చాలన్నా అధికారపార్టీ నేతలు జోక్యం చేసుకోవడం దారుణం. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. అయినప్పటికీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: రేవంత్ వర్గం దూకుడు -
కేసీఆర్పై కిషన్రెడ్డి ఫైర్.. రాజ్యాంగంలో రాసి ఉందా? అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి విషయంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలోనూ నిరసనలు తెలిపారని ఫైరయ్యారు. ప్రైవేటీకరణ వద్దంటూనే స్టీల్ప్లాంట్ విషయంలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కాగా, కిషన్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా? కేసీఆర్ చెప్పాలి. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు అవుతున్నా నిజాం షుగర్స్కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని నిలదీశారు. ముఖ్యమంత్రికి ఇఫ్తార్ విందుకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. భద్రాచలానికి మాత్రం రారు. భద్రాచలం సీతారాముల కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదు?. అవినీతిపై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపవద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? అన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టం తనపని చేసుకుంటూ పోతుంది అందులో ఎవరి జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాడు తరహాలో మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్ బ్లాకులను వేలం నుంచి మినహాయించిన రీతిలోనే సింగరేణి బొగ్గు బ్లాక్లను కూడా వేలం నుంచి మినహాయించాలని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు శనివారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రాంతీయ పార్టీల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని లిగ్నైట్ గనులను వేలం నుంచి మినహాయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్లు వచ్చిన ఓ వార్తను తన పోస్టుకు జత చేశారు. ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. -
గనుల వేలం ఆపకుంటే యుద్ధమే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో శనివారం బొగ్గు గనుల ప్రాంతాల్లో మహాధర్నాలు నిర్వహించారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ హటావో.. సింగరేణి బచావో పేరిట నిర్వహించిన ఈ ధర్నాల్లో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. కొత్తగూడెంలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన మహాధర్నాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కేంద్రంపై జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. సింగరేణిని కాపాడుకునేందుకు సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా ఇప్పటికే వేలం వేసిన బ్లాక్లను సింగరేణికి కేటాయించాలన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భూపాలపల్లిలో... సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్లను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నస్పూర్లో... అదానీకి కట్టబెట్టేందుకే లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేసేందుకు చూస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం సీసీసీ కార్నర్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పది శాతంగా ఉన్న సింగరేణి లాభాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎన్.దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్లు రాథోడ్ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి , కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్రావు, సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, టీబీజీకేఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో... సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ గతేడాది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారం¿ోత్సవం సందర్భంగా చెప్పిన ప్రధాని మోదీ ఆ మాట తప్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ.. నీకు అదానీ కా వాలో.. సింగరేణి కార్మికులు కావాలో తేల్చుకో..’అంటూ డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే అందులో పనిచేసే 45 లక్షల మంది కార్మికులు ఏం కావాలని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ. 4,500కు లభిస్తుంటే ప్రధాని తన దోస్త్ అయిన అదానీకి ఇండోనేసియాలో ఉన్న బొగ్గు కంపెనీ నుంచి టన్నుకు రూ. 24,500 చొ ప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన..బొగ్గు గనుల్లో కార్మికుల నిరసన
-
కేసీఆర్ సింగరేణిని 10వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారు
-
సింగరేణి ఏరియాలో బీజేపీ నేతలను తిరగనివ్వం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఓ వైపు చెప్తూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసి పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించాలని కేంద్రం చూస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించేలా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో సింగరేణి ఏరియాలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ బీజేపీ నేతల హస్తం ఉందని, అందులో తెలంగాణ బీజేపీ నాయకులు కేవలం పాత్రధారులేనని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విజయోత్సవ ర్యాలీలా? ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ విజయోత్సవ ర్యాలీలు ఎందుకు తీస్తుందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఎస్సెస్సీ హిందీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దోషి కాదని, ఆయన తప్పు చేసినందునే పోలీసులకు తన ఫోన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని బ్రోకర్, జుమ్లా, పేపర్ లీక్ పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. -
సింగరేణిపై చర్చకు రెడీ.. దమ్ముంటే రండి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి విషయంలో ఏ వేదికపై అయినా చర్చకు తాము సిద్ధమని, బీఆర్ఎస్ నేతలకు నిజాయతీ ఉంటే ముందుకు రావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ప్రధాని మోదీ రూ.11 వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారానికి దిగారని ఆరోపించారు. ప్రధాని పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్రావు, పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్రెడ్డి, అశ్వత్థామరెడ్డి, ఎన్వీ సుభాష్ తదితరులతో కలసి ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతకానితనాన్ని పక్కవారిపైకి నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధాని స్పష్టత ఇచ్చినా అదే తీరా? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన సందర్భంగా సింగరేణి విషయంలో ప్రధాని మోదీ స్పష్టతనిచ్చారని ఈటల చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా 51 శాతం వాటా, కేంద్రానికి తక్కువగా 49 శాతం వాటానే ఉన్నప్పుడు.. కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుందని మోదీ ప్రశ్నించారని గుర్తు చేశారు. అయినా బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. గనుల పాలసీకి బీఆర్ఎస్ మద్దతిచ్చి కూడా.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం గనుల కేటాయింపుతో రూ.లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇవ్వడం.. 216 గనుల కేటాయింపులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతోనే మోదీ సర్కారు 2015లో గనుల చట్టాన్ని సవరించిందని ఈటల గుర్తు చేశారు. దానికి అప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కొత్త చట్టం ప్రకారమే దేశంలో బొగ్గుగనుల కేటాయింపులు చేస్తున్నా కేంద్రాన్ని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసలు తెలంగాణలోని నాలుగు గనుల కోసం సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా అడగలేదని.. 2019 తర్వాత సింగరేణి గనుల వేలంలో పాల్గొననే లేదని వివరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. కాగా.. బీజేపీ నేతల పట్ల బీఆర్ఎస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. సింగరేణిపై ప్రధాని మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చినా.. కేసీఆర్ మళ్లీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరో వాట్సాప్ చేస్తే.. నాకు నోటీసులా: ఈటల పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఈటల రాజేందర్ తప్పుపట్టారు. తాను టెక్నాలజీకి అప్డేట్ కాలేదని, మెసేజీలకు రిప్లై కూడా ఇవ్వనని చెప్పారు. ‘‘ఎవరో ఒక వ్యక్తి నాకు వాట్సాప్ చేస్తే.. అది నేను చూడకపోయినా నోటీసులు ఇచ్చారు. ఈ కేసుతో నాకు సంబంధం లేకున్నా నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నా. నాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి.. నోటీసులకు వివరణ ఇస్తా..’’ అని ఈటల వివరించారు. బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని వ్యాఖ్యానించారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధభేరి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న ‘మహాధర్నా’నిర్వహించాలని అధికార బీఆర్ఎస్ నిర్ణయించింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో ఈ మహధర్నాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాధర్నాకు సంబంధించి సింగరేణి పరిధిలోని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రకటించిన ప్రధాని మోదీ మాట తప్పారు. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని అటు కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరినా పట్టించుకోవట్లేదు. తాజాగా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కుట్రలపై జంగ్ సైరన్ ‘తెలంగాణను దెబ్బకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కూడా గనులు కేటాయించకుండా కేంద్రం దివాలా తీయించింది. అదే విషప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతాం. గుజరాత్ ఖానిజాభివృద్ధి సంస్థకు నామినేషన్ పద్ధతిలో లిగ్నైట్ గనులను కేటాయించిన రీతిలోనే సింగరేణికి గనులు కేటాయించాలి. సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం 6 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరుగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణతో తెలంగాణలో అంధకారంతోపాటు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల బోనస్లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జంగ్ సైరన్ పూరించాం’అని కేటీఆర్ తెలిపారు. 10న వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికులతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. స్టీల్ ప్లాంటును కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందంటూ ఈ నెల 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ నెల 10న వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రికార్డు సృష్టించిన సింగరేణి.. చరిత్రలోనే తొలిసారి..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్టైం రికార్డుగా ఉంది. అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది. -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
సింగరేణి ఎన్నికల టెన్షన్.. ప్రీ ఫైనల్గా భావిస్తున్న రాజకీయ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు సింగరేణి ఎన్నికల గుబులు పట్టుకుందా.. త్వరలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. ఈఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న అధికార పార్టీ బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘ టిబిజికెఎస్ తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. గతంలో సింగరేణికి అన్నితానై వ్యవహరించిన గౌవర అధ్యక్షురాలు కవిత రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండడం టిబిజికెఎస్ కు సవాల్ గా మారుతుంది. ఆరు జిల్లాలు 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సిరుల మాగాణి సింగరేణి ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రీ ఫైనల్ గా మారనున్న వైనంపై సాక్షి ప్రత్యేక కథనం. ఎన్నికల పండుగ.. సత్తా చాటేందుకు శ్రమిస్తున్న పార్టీలు నల్లబంగారు లోకం సింగరేణికి ఎన్నికల పండుగ వచ్చింది. రెండేళ్ళకోసారి జరగాల్సిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కోవిడ్ ఎఫెక్ట్, కార్మిక సంఘాలు కోర్టు మెట్లు ఎక్కడంతో మూడేళ్ళు ఆలస్యమయ్యింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడంతో ఏఐటీయూసీతోపాటు మరికొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశంతో కేంద్ర కార్మికశాఖ,సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఎప్రిల్ లో నోటిపికేషన్ జారీ చేసి మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీతోపాటు విపక్షపార్టీల అనుబంధకార్మిక సంఘాలు అస్తశస్త్రాలు ప్రయోగించేందుకు సన్నహాలు చేస్తున్నాయి. 2017 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార పార్టీ టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ కు తాజా ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను గుర్తింపు కార్మిక సంఘం నెరవేర్చకపోవడం ఆపార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశాలున్నాయి. ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాల్లో అక్రమాలు, ఆదాయపన్ను పరిమితి పెంపు విషయంలో పట్టించుకోకపోవడం ఆ సంఘానికి మైనస్ గా మారుతుంది. పనిబారం విషయంలో గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కుకావడంతో కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారు. వాటితోపాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో టిబిజికెఎస్ కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంతో విపక్షాలు ప్రచార అస్త్రాలుగా చేసుకుని రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ముందుగా జరుగుతున్న సింగరేణి ఎన్నికలు అధికార పార్టీతోపాటు విపక్షాలు కాంగ్రెస్, బిజేపి, వామపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సన్నహాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ కు సవాల్ గా మారనున్నాయి సింగరేణి ఎన్నికలు. 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి సింగరేణి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. గత 2017 అక్టోబరు 5న జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ 11 స్థానాలకుగాను 9స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మందమర్రి, భూపాలపల్లి మినహా అన్ని డివిజన్ లలో టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పోటీకి దూరంగా ఉండి, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి మద్దతిచ్చింది. సింగరేణిలో మొత్తం 52,543 ఓట్లు ఉండగా గత ఎన్నికల్లో 49,877 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీటిలో టీబీజీకేఎస్ కు 23,848 ఓట్లు పోలు కాగా ఏఐటీయూసీ కూటమికి 19,631 ఓట్లు వచ్చాయి. 4,217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా అధికారం దక్కించుకుంది. 2020 ఫిబ్రవరితో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. 2017కు ముందు నాలుగేళ్ల కాల పరిమితి ఉండగా, కేంద్ర కార్మిక శాఖ రెండేళ్లకు కుదించటంపై టీబీజీకేఎస్ కోర్టుకెక్కింది. తీర్పు ఆలస్యం కావటంతో ఆనాలుగేళ్ల పదవీ కాలం కూడా 2021 ఫిబ్రవరిలోనే ముగిసింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశంతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఎప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేసి మేనెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ప్రచారం సాగించే పనిలో నిమగ్నమయ్యాయి. హామీలు ఇచ్చారు.. కానీ 2017లో జరిగిన సింగరేణి ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సింగరేణి కార్మికులను ప్రగతి భవన్ కు పిలుపించుకుని అనేక హామీలిచ్చారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత సింగరేణి వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొని హామీలు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో దళారులు లక్షల్లో వసూలు చేసి అనర్హులకు అవకాశాలిస్తున్నారని కార్మికుల్లో అగ్రహం వ్యక్తమవుతోంది. వేల మంది పేర్లను సరిచేసేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలుకు నోచుకోలేదు. ప్రతి కార్మికుడికి 200 గజాల ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 10లక్షల రూపాయలు వడ్డీలేని రుణం ఇస్తామని మాటిచ్చారు. కొత్తగా 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుని భూగర్భ గనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని, భవిష్యత్తులో సింగరేణిలో డిస్మిస్ అనేదే ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయినా డిస్మిస్ లు ఆగటం లేదు. మరోవైపు తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణిలో 3వేల 800 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం 10వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని కార్మికులు అంటున్నారు. ఇలా నష్టాల్లో కొనసాగటానికి కేసీఆర్ పాలనే కారణమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఝలక్ ఇస్తున్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ కేసు రాజకీయ పరిణామాల నేపద్యలో కోల్ బెల్ట్ లో గులాబీ సంఘానికి తీవ్ర నష్టంవాటిల్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ లో ఆరు జిల్లాల్లో 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే సింగరేణి ఏరియాలోని కార్మికులు మొదటి నుంచి అధికార పార్టీకి ఝలక్ ఇస్తూనే ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. మూడు స్థానాల్లో మాత్రమే టిఆర్ఎస్ గెలిచినప్పటికి తర్వాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏడుగురు ఇతర పార్టీల నుంచి గెలిచినవారు గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇప్పుడు పది స్థానాల్లో ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో కార్మికలోకంలో టిబిజికెఎస్ వీక్ గానే ఉందనే ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా మునుగోడు ఉపఎన్నికల నాటి నుంచి అధికారపార్టీతో దోస్తాన్ చేస్తున్న కమ్యూనిష్టులు కాస్త సింగరేణి ఎన్నికల విషయంలో మాత్రం పొత్తులేకుండా ఒంటరిగాన పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గులాబీతో కలిసివచ్చే వారుకానరాక కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం, మావోయిస్ట్ ప్రాబల్యంగల ఏరియా కావడంతో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?
‘సిన్మా తీయాలంటే ఏ హైదరాబాద్కే పోకుండా.. గీ గోదావరిఖనిల తీసుడు ఎందుకే బావా?..’.. ‘ఏతులు గొట్టకుండా సింగిల్ లైన్లో ఒక్కటి చెప్పన్నారా? గోదావరి ఖనిల సిన్మా తియ్యాల్నంటే 100 దళపతులు, 100 రక్తచరిత్రలు తీయొచ్చు..’ .. ఇటీవల గోదావరిఖని నేపథ్యంలో వచ్చింన ‘కొత్త సినిమా’ చిత్రం ట్రైలర్లోని సంభాషణలివి.. ఇవి కేవలం సినిమాలో డైలాగులు మాత్రమే కాదు. జరుగుతున్న వాస్తవం కూడా. ఒకప్పుడు కేవలం బొగ్గు వెలికితీతకు కేంద్రంగా మాత్రమే సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు ఉండేది. అడపాదడపా సినిమాల షూటింగులు జరిగినా.. కార్మిక హక్కుల కోసం తీసిన సినిమాల్లో ఒకట్రెండు సన్నివేశాలనే చిత్రీకరించారు. కాలక్రమంలో పరిస్థితి మారింది. నాలుగేళ్ల కింద గనుల నేపథ్యంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా మంచి జనాదరణ దక్కించుకుంది. ఓపెన్ మైన్లలో పోరాట సన్నివేశాలు ఆ చిత్రానికి హైలైట్గా నిలిచాయి. అలాంటి సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఉండాలని కొందరు సినీహీరోలు, దర్శకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గనులకు నిలయమైన గోదావరిఖనికి ఆదరణ పెరిగింది. ఎన్నో ప్రత్యేకతలతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) గోదావరి లోయను ఆనుకుని సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉంది. విశాలమైన గోదావరి నది, దాని లోయను ఆనుకుని ఏర్పడిన సింగరేణి గనులు, ఎన్టీపీసీ, బొగ్గురవాణా కోసం ఏర్పాటైన ప్రత్యేక రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీలు, కన్వేయర్ బెల్టులు, 40 నుంచి 50 అడుగుల ఎత్తయిన భారీ డంపర్లు, క్రేన్లు ఇలా భారీ యంత్రాలు, హంగామా వంటివి ఇక్కడ కనిపిస్తాయి. రెండు రకాల గనులతో.. ఇక్కడి గనుల్లో రెండు రకాలు ఉంటాయి. బొగ్గు నిక్షేపాలను గుర్తించిన కొత్తలో ఏటవాలుగా క్రమపద్ధతిలో లోపలికి తవ్వి బొగ్గు తీస్తే అది భూగర్భ మైనింగ్. నిల్వలు చివరిదశకు వచ్చాక పేలుళ్లతో మిగతా బొగ్గును వెలికితీసి, భారీ యంత్రాలతో తరలిస్తే ఓపెన్కాస్ట్ (ఉపరితల మైనింగ్). ఇవి వందల మీటర్ల లోతు వరకు ఉంటాయి. బొగ్గు కోసం నిత్యం జరిపే పేలుళ్లతో బొగ్గు పెళ్లలు వందల అడుగులు పైకెగిరి పడుతూ ఉంటాయి. ఆ బొగ్గును తరలించేందుకు భారీ క్రేన్లు, డంపర్లు ఉంటాయి. బయటి ప్రాంతాల వారికి ఇదంతా కొత్త ప్రపంచం. కేజీఎఫ్ సినిమా కూడా ఇలాంటి ఓపెన్ కాస్ట్ ఇనుప ఖనిజం గనుల్లో తీసిందే కావడం గమనార్హం. మెల్లగా పెరుగుతున్నషూటింగ్లు.. భారీ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో షూటింగులు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే సెంటినరీ కాలనీ సమీపంలోని ఓపెన్కాస్టుల్లో షూట్ చేశారు. నాని నటించిన ‘దసరా’ సినిమా పూర్తిగా గోదావరిఖని పట్టణానికి ఆనుకుని ఉన్న ‘వీర్లపల్లె’ నేపథ్యంగా వచ్చింనదే. ఆ చిత్రాన్ని కూడా ఓపెన్కాస్టు గనుల్లోనే చిత్రీకరించారు. ఇక జాతిరత్నాలు సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ తొలిచిత్రం ‘పిట్టగోడ’ కూడా గోదావరిఖని నేపథ్యంలో తీసినదే. ఇక ఇటీవల విడుదలైన క్రైం థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ‘సిరోంచ’ పేరుతో తీసిన సినిమాను నేరుగా యూట్యూబ్లో విడుదల చేశారు. ఆ సినిమా నచ్చింనవారు దర్శకుడికి ఇప్పటికీ డబ్బులు పంపుతున్నారు. ఇవే కాకుండా ‘కొత్త సినిమా’ పేరుతో ఒక చిత్రం, మరికొన్ని సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకొంటున్నాయి. గతంలో ఆర్.నారాయణమూర్తి చీకటిసూర్యులు, రానా నటించిన లీడర్ వంటి సినిమాల్లోని పలు సీన్లను ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా షూటింగ్లకు అనుకూలం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సినిమా షూటింగ్లకు ఎంతగానో అనుకూలం. సలార్ సినిమా షూటింగ్ ఓసీపీ–2లో రెండువారాల పాటు సాగింది. భూగర్భగనులు, ఓసీపీలు, ఓబీ ప్రాంతాల్లో షూటింగ్లు చేయవచ్చు. సినిమాలతోపాటు టెలిఫిల్్మలు, చిన్న సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. – కె.నారాయణ, ఆర్జీ–1 గని జనరల్ మేనేజర్ -
థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విషవాయువులకు చెక్!
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ను కాలుష్యరహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిద్ధమైంది. రూ. 696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి గాలిలోకి విడుదలయ్యే సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ శాతం ప్రతి ఘనపు మీటర్కు 2000 మిల్లీగ్రాములులోపు ఉండాల్సి ఉండగా 200 మిల్లీగ్రాములకు తగ్గిస్తూ 2015లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఎఫ్జీడీల నిర్మాణం తప్పనిసరైంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ఎఫ్జీడీ ప్లాంట్ ఇదే. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతతో నీటిని ఆవిరిగా మార్చి దానితో టర్బైన్లను తిప్పు తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించ డం ద్వారా బూడిద, విషవాయువులు విడుదలవుతాయి. బూడిదను శుద్ధి చేసేందుకు సింగరేణి థర్మ ల్ విద్యుత్ కేంద్రంలో ‘ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటే టర్స్’అనే అనుబంధ విభాగాన్ని వినియోగిస్తున్నా రు. సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ శుద్ధికి ఎఫ్జీడీ రానుంది. 20 శాతం పనులు పూర్తి... సింగరేణిలో ఎఫ్జీడీ నిర్మాణ పనులను పీఈఎస్ ఇంజనీర్స్ సంస్థకు అప్పగించగా ఇప్పటికే 20% ప నులను పూర్తి చేసింది. మొత్తం పనులను 2024 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఎఫ్జీడీ నిర్మాణంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎఫ్జీడీ పనితీరు ఇలా... బొగ్గు మండించినప్పుడు వెలువడే వాయువుల్లోంచి సల్ఫర్, అనుబంధ వాయువులను ఎఫ్జీడీ ప్లాంట్ వేరు చేస్తుంది. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీనీ ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నీలో కింది నుంచి పైకి వచ్చే వాయువుపై క్యాల్షియం కార్బొనేట్ (తడి సున్నం)ను పైనుంచి బలంగా పంపి స్తారు. దీంతో వాయువుల్లోని సల్ఫర్ డై ఆక్సైడ్తో తడి సున్నం రసాయనిక చర్యకు లోనవుతుంది. సల్ఫర్, అనుబంధ వాయువులన్నీ తడి సున్నంలో కలుస్తాయి. ఫలితంగా బయటకు విడుదలయ్యే వా యువుల్లో సల్ఫర్ అనుబంధ వాయువుల శాతం ఘ నపు మీటర్కు 200 మిల్లీగ్రాములకు తగ్గిపోతుంది. ఈ ప్రక్రియలో అంతిమంగా ఏర్పడే క్యాల్షియం సల్ఫేట్ (జిప్సం) అనే ఘన పదార్థాన్ని ఎరువులు, సిమెంట్, పేపర్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణ రంగానికి సరఫరా చేయనున్నారు. జిప్సం అమ్మకాలతో థర్మల్ ప్లాంట్ నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. -
సిరుల సింగరేణిపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరుల సింగరేణిని పరులపాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రజలు, ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా సింగరేణి బొగ్గుగనుల సంస్థను ఖాయిలా పడేట్టుగా చేసి దానిని తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అక్కడి గనులను నామినేషన్పై ఇచ్చిన విధంగా సింగరేణికి చెందిన నాలుగు గనులను కూడా తెలంగాణకే ఇవ్వాలని కోరితే కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. వీటిని రాష్ట్రానికి కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానికి, కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు. ఈ నాలుగు గనులను వేలానికి పెడతామని, అందులో రాష్ట్రప్రభుత్వం కూడా పాల్గొనాలని కేంద్రం సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. గురువారం అసెంబ్లీలో గనుల రాబడిలో పెరుగుదలపై సభ్యులు బాల్క సుమన్, కోరుకంటి చందర్, రోహిత్రెడ్డి వేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. బయ్యారం స్టీల్ఫా్యక్టరీ ఏర్పాటు విషయమై కేంద్రాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్రం ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రమే ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తోందని కేటీఆర్ చెప్పారు. ఇటీవల దావోస్లో దీనిపై జిందాల్, మిత్తల్ సంస్థల ప్రతినిధులతో ప్రాథమికంగా చర్చించామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా రూ.39.40 కోట్ల ఆదాయమొస్తే, తెలంగాణ ఏర్పడ్డాక రూపొందించిన ఇసుక పాలసీ వల్ల ఏడాదికే రూ.800 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రహదారులపై ప్రార్థనాస్థలాల తొలగింపునకు చట్టం హైదరాబాద్లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనాస్థలాల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చే యోచనలో ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఏ దేవుడూ లేదా భక్తులూ దుమ్ము, ధూళీలో ఉండాలని అనుకోరని అన్నారు. నరేంద్రమోదీ సీఎంగా ఉండగా గుజరాత్లో రోడ్లకు అడ్డంగా ఉన్న మతపరమైన కట్టడాలను తొలగించేందుకు చట్టం తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం అసెంబ్లీలో నగరంలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ)పై నగర ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరెకపూడి గాంధీ వేసిన ప్రశ్నల సందర్భంగా డి.సుధీర్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రస్తావనపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు. రక్షణ భూములపై కేంద్రం తీరు సిగ్గుచేటు నగరంలోని కొన్నిచోట్ల రోడ్ల విస్తరణ, అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని ఎనిమిదిన్నరేళ్లుగా కోరుతున్నా కేంద్రం సహకరించకపోవడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా చూస్తే ఈ రక్షణ భూములను ఆ శాఖకు కేటాయించలేదని, రాష్ట్రం అనుకుంటే వీటి విషయంలో న్యాయపరమైన చిచ్చుపెట్టే అవకాశమున్నా దేశరక్షణ దృష్ట్యా తమకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. జూబ్లీ బస్స్టాండ్ వైపు, ఇతర చోట్ల రక్షణ శాఖ భూముల కారణంగా రోడ్ల విస్తరణ సాధ్యం కావడం లేదని, కేంద్రం ఈ భూములు ఇవ్వకపోతే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. త్వరలో రెండోదశ ఎస్ఆర్డీపీ నగరంలో త్వరలోనే రెండోదశ ఎస్ఆర్డీపీ కిందరూ.4,305 కోట్ల వ్యయంతో 36 రోడ్ల పనులు చేపడుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. మొదటిదశలో ఇప్పటికే 48 పనులకుగాను 11 మినహా మిగతా పూర్తయ్యాయని చెప్పారు. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు స్కైవే నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, కానీ కేంద్రం దీనికి అనుమతించడం లేదని చెప్పారు. దావోస్ పర్యటనతో రూ.21,400 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రగతిశీల నిర్ణయాలకు సంకేతంగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ ఏడాది రూ. 21,400 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్టు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, లైఫ్సైన్సెస్, బ్యాటరీ తయారీ, ఎఫ్ఎంసీజీ, జీసీసీ వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులను రాబట్టినట్లు తెలిపారు. మొత్తం ఐదు పర్యాయాల దావోస్ పర్యటనలు కలిపి దాదాపు 47 బిలియన్ డాలర్ల మేర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. వివిధ విదేశీ కంపెనీల పెట్టుబడులకు అదనంగా నాలుగవ పారిశ్రామిక విప్లవంలో భాగంగా హైదరాబాద్లో ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. -
రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో రెండు డైరెక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ సోమవారం హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో జరిగింది. పోటీ పడుతున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకున్నాక ఇద్దరి ని ఎంపిక చేశారు. మణుగూరు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్గా, ఆండ్రియాల ప్రాజెక్ట్ జీఎం ఎన్వీకే శ్రీనివాస్ను డైరెక్టర్(ఆపరేషన్స్)గా నియ మిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం రెండేళ్లు. కాగా, సింగరేణిలో డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగానే ఉంది. -
సింగరేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
జైపూర్ (చెన్నూర్)/ సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ (ఎస్టీపీపీ) కేంద్రానికి సంబంధించిన జలాశయంపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్ను శనివారం ప్రారంభించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ డి.సత్యనారాయణరావు ఈ ప్లాంట్ను ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్న మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, 3 దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కు సింగరేణి సంస్థ మూడేళ్ల కార్యాచరణ ప్రారంభించింది. మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం–3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది. వీటి ద్వారా 540 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, సంస్థ విద్యుత్ ఖర్చుల్లో రూ.300 కోట్లను సింగరేణి సంస్థ ఆదా చేసింది. మూడో దశ కింద 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించే బాధ్యతలను నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్ట మ్స్ సంస్థకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీటీసీ సంజయ్కుమార్, జీఎం డీవీఎస్ఎన్ సూర్యనారాయణ రాజు, జీఎం (సోలార్) జానకి రాం, ఎస్వోటు డైరెక్టర్ సూర్యకు మార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, జీఎం పీసీఎస్ రాజశేఖర్రెడ్డి, ఏజీఎం సత్యనారాయణప్రసాద్, సీఎంవో ఏఐ కేంద్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీబీజీ కేఎస్ ఉపా«ధ్యక్షుడు చుక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
15న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును ఈనెల 15న ప్రారంభించను న్నారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవా రం సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల కాలంలో 8 చోట్ల ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఇప్పటి వరకు 505 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో సంస్థకు రూ.300 కోట్లు ఆదా అయ్యాయి. మూడో దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రిజర్వాయర్పై 15 మెగావాట్ల సామ ర్థ్యంతో 2 ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మిస్తుండగా, అందులో సిద్ధమైన 5 మెగా వాట్ల ప్లాంట్లను సంక్రాంతి సందర్భంగా 15న ప్రారంభిస్తారు. తొలి, రెండు దశల్లో 219 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన సింగరేణి మూడో దశ కింద 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మిస్తోంది. -
2023లో 4 కొత్త గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులపై బుధవారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. కొత్తగూడెంలోని వీకే బ్లాక్లో జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లెందులోని జేకే ఓసీ విస్తరణలో జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని శ్రీధర్ సూచించారు. 2023–24లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్ట్ గనుల వార్షిక లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీడీకే గని నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. రికార్డుస్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి రికార్డు స్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్తో పోల్చితే 23 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2021–22లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.26,619 కోట్లు కాగా, 2022–23లో రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
Warangal: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు
తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడూ, భారతీయుడూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందటంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడ పరిరక్షణలో చూపడం లేదు. 2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి విలవిల లాడి గోడలు బీటలు వారిన విషయం సర్వదా విశదమే. ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచానికి వెల్లడి చేసినా ఏఎస్ఐ అంతగా ప్రతిస్పందించ లేదనే విమర్శ ఉంది. దీంతో కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల వారు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి చుట్టూ ఇరవై కి.మీ.ల దూరంలోని వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరుపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వేచేసి స్వాధీనం చేసుకునే దిశలో సింగరేణి ఉండగా ‘రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఇదే సమయంలో ఏఎస్ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోకు వెళ్లడం, రెండు సార్లు తిరస్కరణకు గురికావడం... చివరికి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు పొందడం తెలిసిందే. కాగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్త వచ్చింది. రామప్ప పరిరక్షణ కమిటీ , ఇతర ప్రజా సంఘాలూ తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని మీడియా ద్వారా హామీ ఇచ్చింది. అయితే మళ్ళీ రామప్పగుడికి ఓపెన్ ముప్పు రానున్నదనీ, పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబం ధించిన సర్వేలు చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అందుకే ఈ ప్రయత్నాలను పత్రికా ముఖంగా కమిటీ ఖండిస్తున్నది. (క్లిక్ చేయండి: వేయి రేఖల వినూత్న సౌందర్యం) – నల్లెల్ల రాజయ్య తదితర ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ సభ్యులు -
సింగరేణిపై ప్రధాని మాట తప్పారు
బెల్లంపల్లి/కాగజ్నగర్ టౌన్: సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు సాక్షిగా నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేస్తామని ప్రకటించడం.. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రధాన మంత్రి సింగరేణిపై మాట తప్పారని, బొగ్గు గనులు, విశాఖ ఉక్కుతోపాటు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేల వంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని విమర్శించారు. కాగా, కోల్బెల్ట్ ప్రాంతాల్లో ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని హరీశ్రావు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కానుందని చెప్పారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, కుమురంభీం జిల్లా కాగజ్నగర్లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంత్రులు నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని, వారంరోజుల్లోగా కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆసిఫాబాద్లో 340 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు వైద్య కళాశాల ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సిర్పూర్ (టీ), ఆసిఫాబాద్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్భవన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు ఎలా తవ్వుతారు..? కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు?
బొగ్గు ఎలా తవ్వుతారు.. అసలు నేలలో బొగ్గు నిక్షేపాలు ఎలా ఉంటాయి.. తోడిన బొగ్గును బయటకు ఎలా తీస్తారు.. బొగ్గులో రకాలెన్నుంటాయి.. ఆ బొగ్గుతో కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు.. ఈ ప్రశ్నలకు ఎవరో సమాధానాలు చెప్పడం కంటే, ప్రత్యక్షంగా ఆ ప్రక్రియలను తిలకిస్తే ఎంత బాగుంటుంది. కానీ, అలా నేరుగా చూసే భాగ్యం సామాన్యులకు దక్కడం కుదరదు. దాన్ని సాకారం చేసేలా ఇప్పుడు ఆర్టీసీ–సింగరేణి సంయుక్తంగా ఓ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. రూ.1,600 చెల్లిస్తే చాలు.. వీటన్నింటినీ దగ్గరుండి నేరుగా చూసి మధురానుభూతిని మూటగట్టుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని ఇదీ ఆ ప్రాజెక్టు.. దేశంలో ఉత్పత్తయ్యే బొగ్గులో 10 శాతానికిపైగా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తూ వెలుగులు ప్రసాదిస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బొగ్గు–పర్యాటకానికి తెర తీశారు. ఇందులోభాగంగా ఇటీవలే ఆయన సింగరేణి అధికారులతో మాట్లాడి సంయుక్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. బుక్ చేసుకునే పర్యాటకుల తొలి బస్సు ఈనెల 28న సింగరేణికి వెళ్లనుంది. జనవరి నుంచి ప్రతీ శనివారం ఒక సూపర్లగ్జరీ బస్సు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండు నుంచి బయలుదేరుతుంది. పర్యాటకుల రద్దీ పెరిగితే ఈ ట్రిప్పుల సంఖ్య పెంచుతారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.1,600గా నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి దాన్ని రూ.1,850గా సవరించాలని భావిస్తున్నారు. ఉదయం జూబ్లీ బస్టాండులో బయలుదేరే బస్సు నేరుగా గోదావరి ఖనిలోని 7 ఇంక్లైన్ బొగ్గుగనికి చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తొలుత భూగర్భ గనిలో బొగ్గు తవ్వే విధానాన్ని చూపుతారు. ప్రత్యేక కన్వేయర్ ద్వారా వందల అడుగుల లోతులోని భూగర్భ గనిలోకి తీసుకెళ్లి చూపుతారు. మధ్యాహ్న భోజనం తర్వాత అక్కడి ఓపెన్కాస్ట్ గని వద్దకు తీసుకెళ్తారు. బొగ్గు తవ్వేందుకే జరిపే పేలుళ్లు మొదలు తవ్వి పైకి తెచ్చే వరకు చూపుతూ వివరిస్తారు. తర్వాత అక్కడికి చేరువలో ఉన్న జైపూర్ పవర్ప్లాంట్లో విద్యుదుత్పత్తి తీరును ప్రత్యక్షంగా చూపుతారు. జీడీకే–7ఎల్ఈపీ గని స్వాగత ద్వారం బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చార్జి అదనం నగరం నుంచి బయలుదేరాక సిద్దిపేట సమీపంలో ఓ హోటల్ వద్ద బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అందుకయ్యే రూ.99ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి అండర్గ్రౌండ్ బొగ్గుగనిలోకి వెళ్లేటప్పుడు ఉచితంగా టీ, స్నాక్స్ ఇస్తారు. మధ్యాహ్నం అక్కడి గెస్ట్హౌజ్లో ఉచితంగా లంచ్ ఏర్పాటు చేస్తారు. తిరుగుప్రయాణంలో మళ్లీ సిద్దిపేట సమీపంలోని హోటల్లో డిన్నర్ ఉంటుంది. ఆ చార్జీని ప్రయాణికులే భరించాలి. ప్రస్తుతం ఈ ట్రిప్ చార్జీగా వసూలు చేసే రూ.1,600 నుంచి సింగరేణికి రూ.300 చెల్లిస్తారని సమాచారం. అందులో ఎంట్రి టికెట్, లంచ్ చార్జీ కలిసి ఉంటాయి. నేడు లాంఛనంగా ప్రారంభం సింగరేణి దర్శన్ యాత్రను మంగళవారం ఉదయం బస్భవన్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సింగరేణి డైరెక్టర్లు ఎస్,చంద్రశేఖర్, ఎన్.బలరాం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిసి ప్రారంభిస్తారు. తొలి ట్రిప్పు ఈనెల 28న ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. చైర్కార్ ద్వారా గనిలోకి.. పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సంస్థ గురించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మ్యాన్రైడింగ్ చైర్కార్ ద్వారా గనిలోకి తీసుకెళ్లి బొగ్గు ఉత్పత్తి, యాంత్రీకరణ, అంశాలను చూపిస్తాం. గని ముందున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పర్యాటకులు పెరిగితే అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడైతే వారంలో ఒకసారి సందర్శన ఉండేలా నిర్ణయించాం. – ఎ.మనోహర్, జీఎం, ఆర్జీ–2 -
సింగరేణికి మరో వందేళ్ల ఉజ్వల భవిష్యత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకుంటున్న సింగరేణికి మరో వందేళ్లకుపైగా ఉజ్వల భవిష్యత్ ఉందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. మరో ఐదేళ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్.. సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందని, టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఇదే ఒరవడితో తదుపరి రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతంపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలవడం సింగరేణి కార్మికుల పనితీరుకు, అంకితభావానికి నిదర్శనని పేర్కొన్నారు. సింగరేణి పనితీరుకు మెచ్చి సీఎం కేసీఆర్.. మరో 800 మెగావాట్ల ప్లాంట్ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందని, అలాగే ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. పలువురికి సన్మానాలు ఈ సందర్భంగా సింగరేణి భవన్ నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు.. డీజీఎం(ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్ఓఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, సీఎంవోఏఐ సాధారణ కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు, అడ్వైజర్(లా) లక్ష్మణ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ పాల్గొన్నారు. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్ను, 1950లో క్యాప్ ల్యాంప్లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
Singareni Day 2022: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ పారిశ్రామిక అవసరాలు తీరుస్తోన్న సింగరేణి సంస్థ కాలానుగుణంగా మారుతూ వస్తోంది. మానవ వనరులను క్రమంగా తగ్గించుకుంటూ యాంత్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో విద్యార్హతలు కలిగిన కార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆధునిక హంగులతో సంస్థ పురోగమిస్తోంది. శుక్రవారం సింగరేణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఫిట్నెస్ ఉంటే చాలు ఒకప్పుడు బొగ్గు వెలికి తీసేందుకు కార్మికులు భూగర్భంలోకి వెళ్లేవారు. విపరీతమైన వేడి, చాలినంతగా ఉండని గాలి, అడుగు తీసి అడుగు వేస్తే గుచ్చుకునే బొగ్గు పెళ్లలు, విష వాయువుల మధ్య కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేసేవారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గనుల్లో పని చేయాల్సి ఉండటంతో విద్యార్హతలకు కాకుండా 35 ఏళ్లలోపు వయసు ఉండి, శారీరక దారుఢ్యమే ప్రధాన అర్హతగా గనుల్లో పనులు లభించేవి. తట్టా, చెమ్మాస్ పట్టుకుని బొగ్గు వెలికితీతలో మునిగిపోయేవారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ఏర్పాటుతో శ్రమకు తగ్గ వేతనం, వసతి, బోనస్, అలవెన్సుల వంటివి కార్మికులకు లభించాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 90వ దశకంలో లక్షా ఇరవై వేల మంది కార్మికులు సింగరేణిలో ఉండేవారు. ఇందులో నూటికి తొంభై శాతం మంది కార్మికులకు కనీస విద్యార్హతలు ఉండేవి కావు. రాయడం, చదవడం కూడా తెలిసేది కాదు. అయినప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికులు పెద్ద హోదాగల ఉద్యోగుల తరహాలో వేతనాలు పొందుతుండటాన్ని అంతా ఆశ్చర్యంగా చూసేవారు. కాలానుగుణంగా విద్యార్హతలకు పెద్దపీట మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా బొగ్గు గనుల్లో బాస్కెట్ లోడింగ్ (తట్టల్లో బొగ్గును టబ్బుల్లోకి ఎత్తిపోయడం) విధానాన్ని ఎత్తి వేయాలని 2003లో సింగరేణి సంస్థ నిర్ణయించింది. అప్పటి నుంచి మానవ వనరుల వినియోగం తగ్గిపోయి ఆ స్థానంలో యంత్రాల ఉపయోగం పెరిగిపోయింది. గనుల్లో పని చేయాలంటే యంత్రాలను ఆపరేట్ చేయడం, ఉత్పత్తికి అనుగుణంగా మెషినరీని సిద్ధం చేయడం తప్పనిసరిగా మారాయి. ఫలితంగా సాంకేతికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్.., పరిపాలన విభాగాల్లో ఎంబీఏ, రెగ్యులర్ డిగ్రీలు తప్పనిసరి అర్హతలుగా మారాయి. ఫలితంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణి కార్మికుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నూటికి తొంభైశాతం.. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 43 వేలమంది కార్మికులు/ఉద్యోగులు పని చేస్తుండగా ఇందులో నూటికి తొంభైశాతం మంది విద్యావంతులే కావడం విశేషం. వీరిలో యాభైశాతం మంది డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకప్పుడు బొగ్గు బావుల్లో పనులంటే యువత ఎంతో ఆసక్తి చూపించేంది. కానీ ఇప్పటి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. ఓపెన్కాస్ట్, ఇతర ఉపరితల పనుల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. భూగర్భ గనుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే కారణంతో కొందరు ప్రమోషన్లు సైతం నిరాకరిస్తున్నారు. సింగరేణి డే స్వాతంత్రానికి పూర్వమే నిజాం జమానాలో బ్రిటీషర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ లిమిటెడ్గా మార్చారు. అప్పటి నుంచి ఇదే పేరు మీద బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖాజా డిసెంబర్ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డేను నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో ఏరియాలో ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వేడుకలు జరగనున్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––– సింగరేణి కార్మికుల్లో అక్షరాస్యత ఇలా (2022 డిసెంబర్ 19 నాటికి) –––––––––––––––––––––––––––––––––– నిరక్షరాస్యులు 2,080 పదో తరగతిలోపు 3,950 ఎస్ఎస్సీ 8,587 ఇంటర్మీడియట్ 2,424 ఐటీఐ/డిప్లొమా 5,020 గ్రాడ్యుయేషన్ 5,208 మాస్టర్స్ డిగ్రీ 2,986 విద్యార్హత సరిగా నమోదు చేయని వారు 12,707 ................................................ మొత్తం 42,962 ............................................................ -
గోదావరిఖని.. ఇక పర్యాటక గని!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యాటక శోభను సంతరించుకుంటోంది. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనికి సింగరేణి అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఈ నెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మూడు ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, టి.వెంకటేశ్వర్రావుతో కలిసి 7 ఎల్ఈïపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భ గనిలోకి కార్మికులు ఎలా వెళ్తారు..? ఉత్పత్తి ఎలా తీస్తారు..? రక్షణ చర్యలు ఎలా ఉంటాయి..? ఇలా అనేక సందేహాలను పర్యాటకులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే మొదటిసారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్ధం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్జీ–2 ఏరియాలోని వకీల్పల్లి గనిని కుటుంబసభ్యులతో సందర్శించారు. బొగ్గు గనులు, ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని, ఓసీపీ, పవర్ ప్లాంట్తోపాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటకస్థలాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండీ శ్రీధర్కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. టూర్ ఇలా.. హైదరాబాద్ నుంచి బయల్దేరే టూరిస్టులు మార్గమధ్యంలో లోయర్ మానేర్ డ్యాం సందర్శిస్తారు. ళీ అక్కడి నుంచి జీడీకే–7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు. ళీ ఇందుకు యైటింక్లయిన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్కు పర్యాటకులను తీసుకెళ్తారు. ళీ అక్కడ భోజనాలు ముగిసిన తర్వాత ఓసీపీ–3 వ్యూపాయింట్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓసీపీ–3లో జరిగే బ్లాస్టింగ్ చూపిస్తారు. ళీ అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్కు తీసుకెళ్లి విద్యుదుత్పత్తి తీరును వివరిస్తారు. -
సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవం..
సాక్షి.హైదరాబాద్: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ పూర్తిగా అవాస్తవమని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలంపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ వద్దంటున్న రాష్ట్ర సర్కారు.. జెన్కోకు కేటాయించిన తాడిచర్ల గనిని ఏఎంఆర్కు ఎందుకు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, కాసం వెంకటేశ్వర్లు, డా.ఎస్.ప్రకాష్రెడ్డిలతో కలిసి కిషన్రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కల్వకుంట్ల అధికారిక ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఏర్పాటు, కార్మి కుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి హామీల అమలును గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి అభద్రతా భావంతో కేంద్రాన్ని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్రెడ్ది ధ్వజమెత్తారు. ‘గుజరాత్కు ఒక నీతి.. మాకో నీతా’అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ‘మీ సిద్దిపేటకు ఒక నీతి, దుబ్బాకకు ఒక నీతా? సిరిసిల్లకు ఒకనీతి, కల్వకుర్తికి ఒక నీతా? గజ్వేల్కు ఒక నీతి, హుజూరాబాద్కు ఒక నీతా?’అని ప్రశ్నించారు. బొగ్గు కొరతతో పాటు విద్యుత్ కోతలను అధిగమించేందుకు బొగ్గుగనులను ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్కు బహిరంగ వేలంలోనే కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ‘2015లో తెలంగాణకు మూడు కోల్ బ్లాకులను కేటాయిస్తే.. అందులో పెలగడప్ప, న్యూ పట్రపార కోల్బ్లాకును సింగరేణి సంస్థనే వెనక్కి ఇచ్చేసింది. నైని గనిలో తవ్వకాల అనుమతులకు కేంద్రం సాయం చేసింది. తాడిచర్ల బ్లాక్ 1ను సింగరేణి, జెన్కోలకు ఇస్తే.. సింగరేణితో తప్పుడు రిపోర్టులిచ్చి, ఆ బ్లాక్ను ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే కట్టబెట్టింది. అందులోని ఒక కంపెనీలో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉంది. దీనిపై విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు. -
సింగరేణి ప్రైవేటీకరణ .. తెలంగాణను కుప్పకూల్చడమే!
సాక్షి, హైదరాబాద్: సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణను కుప్పకూల్చడమేనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చే స్తోందని, అందులో భాగంగానే బొగ్గు గనులను ప్రైవేటీకరించే ప్రయత్నంలో ఉందని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు. తక్కువ కా లంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణపై బీజేపీ కక్ష కట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్లమెంటులో బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు తాజాగా చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న కేంద్రం.. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు మాత్రం నామినేషన్ పద్ధతిన గుజరాత్లో లిగ్నైట్ గనులు కేటాయించిందని తెలిపారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేంద్రం అప్పజెప్పిన గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతుల ప్రక్రియ తాలూకు పత్రాలను కేటీఆర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణపై ఈర్ష్యతోనే వేలం ‘గుజరాత్ మాదిరే తెలంగాణలోని సింగరేణికి సై తం బొగ్గు గనులను కేటాయించాలని గత కొంతకాలంగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెడుతోంది. సొంత రా ష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పక్కన పెట్టిన ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణ సమాజంపై ఈర‡్ష్యతో సింగరేణి గనులను వేలం వేస్తున్నారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో సింగరేణి బొగ్గు గనులను వేలానికి పెట్టారు. ఉత్పత్తిలో, లాభాల్లో ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ, దేశంలోనే అత్యధికంగా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించిన సింగరేణికి చెందిన బ్లాకులను ఎలా వేలం వేస్తారు? బొగ్గు తవ్వకమే ప్రధాన విధిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా వేలం పేరుతో సంస్థపై భారీగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించకుండా నష్టాల పాల్జేసి, అమ్మకానికి పెట్టినట్లుగానే సింగరేణిని కూడా అంతిమంగా తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పే కుట్రలను చేస్తోంది. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత ఏడాది డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు. అయినా కేంద్రం కార్మికుల ఆందోళనలను, తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతోంది. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరిస్తే తెలంగాణలో చీకటే.. ‘సింగరేణి ప్రైవేటీకరణ సమస్య బొగ్గు గనులు ఉ న్న ఏడెనిమిది జిల్లాలది కాదు. ఇది సమస్త తెలంగా ణకు సంబంధించిన అంశం. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించాలనే కుట్రలకు కేంద్రం తెరలేపింది. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కుల వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వంటి పథకాలపై అక్కసు కూడా ఈ కుట్ర లో భాగమే. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నా ల్లో కేంద్రం విజయం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుంది. సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు..’అని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఎంపీ గొంతు ఎత్తాలి ‘గనుల వేలంపై కేంద్రం మొండిగా ముందుకు వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం తప్పదు. తెలంగాణ ఉద్యమం ఎగిసినట్టుగానే, మరోసారి సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలి. సింగరేణి భుజంపై నుంచి తెలంగాణ ప్రజలపై గన్ను పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. సింగరేణి మెడపై కేంద్రం ప్రైవేట్ కత్తి పెడితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై వేటు వేయడం ఖాయం. 150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమేసే కుట్రలు కేంద్రం ఇకనైనా ఆపాలి..’అని కేటీఆర్ కోరారు. -
బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర ఎంపీలు బుధవారం లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయా లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కే బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. లోక్సభలో సింగరేణి అంశాన్ని ‘అత్యవసర’ అంశంగా లేవనెత్తిన ఉత్తమ్.. కల్యాణ ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్– 3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వరంగ బొగ్గు గనుల సంస్థ ఎస్సీసీఎల్కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలసి ఉన్నాయన్నారు. మోదీ ప్రైవేటీక రణ చేయబోమని హామీ ఇచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకే ముందుకు వెళుతోందన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్పరం చేస్తోంది సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీలు రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డిలతో కలసి నామా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణనే తీసుకుంటుందని నామా అన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని పేర్కొన్నారు. రంజిత్రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ.. విధానపరమైన నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకుంటోందన్నారు. కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభు త్వానికే కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు. ఆరోపణలు నిరాధారం: కేంద్ర మంత్రి జోషి సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీల ఆరోపణలు నిరాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీల ఆరోపణల నేపథ్యంలో లోక్సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉండగా, 49% వాటా కలిగిన కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే గనుల వేలం విష యంలో కేంద్రం.. ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం –1957 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో కళ్యాణఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి గనుల వేలం ప్రక్రియలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లోక్సభలో ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, వాటిని ఎస్సీసీఎల్కు కేటాయించాలని తెలంగాణ అభ్యర్థించినా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి అన్ని కోల్ బ్లాకులను వేలం పద్ధ తిలోకి తెచ్చామన్నారు. గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళుతుందని, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని మంత్రి విమర్శించారు. -
ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
ఇదెక్కడి విడ్డూరం..! ఎద్దు మూత్రం పోసిందని కేసు పెట్టడమేంటి?
సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్ లాల్ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్ లాల్ను స్టేషన్కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ ముఖం చూడని సుందర్ లాల్ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్ లాల్ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్లాల్కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ రూ.100 ఇచ్చి ఫైన్ చెల్లించడం గమనార్హం. . అసలు విషయం వేరే ఉందా? రైతు సుందర్ లాల్ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్ లాల్ డిమాండ్ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్ లాల్. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హైదరాబాద్ పోలీస్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ! @CPHydCity @TelanganaDGP@shohumayunnagar @DCPCZHyd సాధారణ రైతు తన ఎడ్ల బండిని తోలుకుంటూ వెళ్తుంటే, ఎద్దు తమ ఆఫీస్ ముందు పాస్ పోసుకుందని, సింగరేణి యాజమాన్యం Brown మేనేజర్, ఆ రైతు మీద పోలీస్ కేసు నమోదు చేయించారట. తెలంగాణ (1/2) pic.twitter.com/pjlvgIHbuY — Vijay Gopal (@VijayGopal_) December 6, 2022 జీఎం ఏమన్నారంటే? సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్ కాస్ట్ మైన్ కోసం భూములు తీసుకున్నాం. సుందర్ లాల్కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్ లాల్ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు. #Telangana: Bull urinates at SCCL GM office, owner bookedhttps://t.co/16yO4iRn7n pic.twitter.com/NtR2fi4Are — TOI Hyderabad (@TOIHyderabad) December 6, 2022 ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ -
సింగరేణిపై కేంద్రం దొంగదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం సింగరేణిని బ్లాకుల వారీగా విక్రయిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఇటీవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని సింగరేణిని విక్రయించబోమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈ వేలం వేశారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. శనివారం బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో సింగరేణిలోని 4 బ్లాకులతో పాటు దేశంలోని 141 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గోదావరిఖని, మందమర్రి, బెల్లంపల్లిలో శనివారం ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు. -
ఆ 4 నెలలే ఎంతో కీలకం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఆ 4 నెలలు ఎంతో కీలకమని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నులకుగానూ రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని రేకులను సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ రైల్వే వారిని సమన్వయపరచుకుంటూ ముందుకువెళ్లాలని శ్రీధర్ సూచించారు. సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్, పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్), డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్ ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్ డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్ జీ.ఎం. (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) సీహెచ్. నర్సింహారావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు. -
సింగరేణి గనిలో కూలిన బండ
సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్లో 36 డిప్, 121 లెవల్లో సీఎమ్మార్తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది. -
సింగరేణి ప్రైవేటీకరణ అబద్ధం.. ఆయన మాటలే నిజం కావాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 నవంబర్ 12న ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేశారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధమని తేల్చిచెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే గతంలో జరిగిన మీడియా ఇంటర్వ్యూలో ప్రభుత్వ పరిశ్రమల భవిష్యత్తు గురించీ, ప్రభుత్వం అవలంబించే కార్యాచరణను కూడా ప్రకటిస్తూ... ప్రభుత్వ పరిశ్రమలను అమ్మివేస్తామని లేదా బంద్ పెడతామని కరాఖండిగా తెలిపారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణ చర్యలు వేగిరమైనాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో 2015 మార్చిలో ‘బొగ్గు గనుల నిబంధనల ప్రత్యేక చట్టం 2015’ను ఆమోదింపజేసి అక్టోబర్ 21 (బ్యాక్ డేట్) నుండి అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన ‘కోల్ ఇండియా లిమిటెడ్’ (సీఐఎల్), ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ (ఎస్సీసీఎల్)లకు అండగా ఉన్న ‘1973 బొగ్గు గనుల జాతీయీకరణ చట్టం’ను 2018 జనవరి 8న రద్దు చేశారు. 2019 ఫిబ్రవరి 20న ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రి వర్గ సంఘం (సీసీఈఏ) పెద్ద, మధ్య, చిన్న స్థాయి బొగ్గుగనులను ప్రైవేటుకు ఇవ్వడానికి అనుమతించింది. 2019 ఆగస్ట్ 28న కేంద్ర క్యాబినెట్ బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది. 2019 సెప్టెంబర్ 13న రెవెన్యూ, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ పాల్గొన్న సమావేశం బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించే సంస్కరణలను సిఫారసు చేసింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది. ప్రధాని అసత్యం మాట్లాడారనే కదా! ఆయన అన్నట్టుగానే సింగరేణి ప్రైవేటీకరణ పూర్తిగా అబద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలంగా తెచ్చిన కొత్త చట్టాలను రద్దుచేసి ‘బొగ్గుగనుల జాతీ యీకరణ చట్టం 1973’ను యధాతథంగా కొనసాగించాలి. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) – మేరుగు రాజయ్య, గోదావరిఖని -
రామగుండం వేదికగా రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ
(రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘తెలంగాణలో కొందరు రాజకీయ స్వార్థంతో వదంతులు పుట్టిస్తున్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు వారికే ఇబ్బంది అవుతాయని తెలియదేమో. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49%. అలాంటప్పుడు కేంద్రం ఎలా విక్రయిస్తుంది? ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. ఇలా అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లోనే ఉంచండి..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్’ బ్రాండ్తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శనివారం రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తర్వాత హిందీలో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రామగుండం నేల నుంచి యావత్ తెలంగాణకు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భాగస్వాములైన రైతులకు స్వాగతం. ఇక్కడ ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ, రైలు, రోడ్డు మార్గాలతో వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులు, యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తాం. మూడు జాతీయ రహదారుల విస్తరణతో చెరుకు, పసుపు, ఇతర రైతులకు మేలు చేకూరుతుంది. ఒకే బ్రాండ్ యూరియాతో.. దశాబ్దాలుగా వివిధ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు, నల్ల బజారులో విక్రయాలతో దేశంలోని రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి దేశంలో కేవలం ఒకే ‘భారత్’ బ్రాండ్ యూరియాను నాణ్యత, తక్కువ ధరతో కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. రామగుండం ప్లాంట్ ద్వారా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రామగుండం ప్రాంతంలో రవాణా, లాజిస్టిక్ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెంచలేదు. ప్రతి యూరియా బస్తాపై రూ.1,472, డీఏపీ బస్తాపై రూ.2,500 కేంద్రం సబ్సిడీగా అందిస్తోంది. ఎరువుల కోసం 8 ఏళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్లు, ఈ ఏడాది రెండున్నర లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నాం. శరవేగంగా అభివృద్ధి కరోనా, యుద్ధాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉద్భవించే దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకుముందటి 30 ఏళ్లతో పోలిస్తే గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతే ఇందుకు సాక్ష్యం. దేశంలో పాలన తీరు మారింది. సర్కారీ ప్రక్రియలు, ఆలోచనలు మారాయి. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయి. దేశాభివృద్ధికి దోహదపడే మరో ముఖ్యమైన అంశం రవాణా సదుపాయాల పెంపు. అందుకే అన్ని రాష్ట్రాల్లో రహదారులు, రైల్వే, ఎయిర్ వే, వాటర్ వే అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎనిమిదేళ్లలో రెట్టింపైన జాతీయ రహదారుల కనెక్టివిటీ.. అన్ని రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం చేసింది. భద్రాద్రి–సత్తుపల్లి రైల్వేలైన్ను రూ.990 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేశాం. తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా వల్ల విద్యుత్ రంగంలో, వ్యాపార రంగంలో అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్సై్టల్ పార్క్, పసుపు, మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక రైలు మార్గం.. మూడు హైవేలు శనివారం రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ప్రజల సమక్షంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, భద్రాచలం– సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రూ.2,268 కోట్లతో నూతనంగా విస్తరిస్తున్న మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు (హైవే నంబర్ 765డీజీ), బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా వరకు (హైవే నంబర్ 161 బీబీ), సిరోంచ నుంచి మహదేవ్పూర్ వరకు (హైవే నంబర్ 353 సి) మూడు నేషనల్ హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లో ఉన్న కొందరికి ఈ రాత్రి నిద్రపట్టదేమో! ‘రామగుండం సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకావడంతో హైదరాబాద్లో కొందరికి ఇవాళ నిద్ర పట్టదేమో’ అని టీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
గోదావరిఖని: ఉద్రిక్తతల మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలో పర్యావరణ ఉల్లంఘన కింద మూసివేసిన మేడిపల్లి ఓసీపీ శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ ఇంజనీర్ భిక్షపతి ఆధ్వర్యంలో సభ కొనసాగింది. ప్రభావిత గ్రామాలైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని లింగాపూర్, మేడిపల్లి, పాములపేట, రామగుండం గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, వన్టౌన్ రెండో సీఐ ప్రసాద్రావు, మంథని సీఐ సతీశ్తో బలగాలు మోహరించాయి. -
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్కాస్ట్ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
సింగరేణి సిగలో ఒడిశా నైనీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ కేంద్రంగా బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోనూ ఉత్పత్తికి సిద్ధమైంది. ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తికి తాజాగా సింగరేణికి గ్రీన్సిగ్నల్ లభించింది. గతేడాది డిసెంబర్ 1న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నుంచి నైనీ బ్లాకుకు పర్యావరణ అనుమతులు లభించగా, తాజాగా బుధవారం అటవీ అనుమతులు సైతం లభించాయి. ఒడిశాలోని చెండిపాడ, కంకురుపల్ రిజర్వ్ ఫారెస్టుతో పాటు విలేజ్ ఫారెస్టుకు సంబంధించిన 783.275 హెక్టార్ల అటవీ భూములను ఈ గనికి కేంద్ర పర్యావరణ శాఖ కేటాయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కీలక అనుమతులన్నీ లభించినట్టయింది. మరో మూడు నెలల్లో నైనీలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది. తెలంగాణ బయట శ్రీకారం.. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా వందేళ్లకుపైగా రికార్డు సింగరేణి సంస్థ సొంతం. బ్రిటీష్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందులో మొదలైన బొగ్గు ఉత్పత్తి.. ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగ ర్, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. పెరుగుతున్న అవస రాలను దృష్టిలో ఉంచుకుని ఇ తర రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలపై సింగరేణి దృష్టి సారించింది. 912 హెక్టార్లలో తవ్వకాలు మంచిర్యాల జిల్లా జైపూర్లో 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును 2016లో కేంద్రం కేటాయించింది. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో చంఢీపాద, కంకురూప గ్రామాల సమీపంలోని 912 హెక్టార్లలో నైనీ బొగ్గుబ్లాకు విస్తరించి ఉండగా, అందులో 783.275 హెక్టార్ల అటవీ భూములున్నాయి. నిబంధనల ప్రకారం ఒడిశాలోని అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా.. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 794.63 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ఏడాదికి పది మిలియన్ టన్నులు.. నైనీ బ్లాకులో మొత్తం 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తొలిదశలో సర్ఫేస్ మైనర్ యంత్రాలతో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానం ద్వారా బొగ్గు వెలికి తీయనున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ గనుల జీవితకాలం 38 నుంచి 40 ఏళ్ల పాటు ఉంటుందని అంచనా. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పది మిలియన్ టన్నులుగా ఉంది. బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి సంస్థ నుంచి 100 మంది ఉద్యోగులను నైనీకి తీసుకెళ్తారు. మరో 2,400 మందిని అక్కడ కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. స్థానికంగా పరిస్థితులు అనుకూలిస్తే మరో ఉపరితల గని కూడా ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి ఉంది. శుభ పరిణామం.. – ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్(పా), సింగరేణి సంస్థ ఆరేళ్లుగా నైనీ బ్లాక్లో స్టేజీ–1, 2 అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఎట్టకేలకు బుధవారం పర్యావరణ శాఖ అనుమతి లభించడం శుభ పరిణామం. మరో 3–4 నెలల్లో నైనీబ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తాం. 2023 మార్చి 31 నాటికి సుమారు 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్రయత్నిస్తాం. కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే రానున్న కాలంలో అక్కడ మరికొన్ని బ్లాక్లు ప్రారంభిస్తాం. -
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనస్ అందించనుంది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ. 76,500 బోనస్ అందనుంది. ఈ మొత్తం ఈనెల 21న వారి ఖాతాల్లో జమ కానుంది. ఇదిలా ఉండగా సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా, దీపావళి బోనస్లకు చెల్లింపునకు సింగరేణి రూ. 379 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున లక్షా 15 వేల వరకూ రానున్నాయి. చదవండి: మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు -
సింగరేణి లాభాలు రూ.1,500 కోట్లు?
శ్రీరాంపూర్(మంచిర్యాల): సింగరేణి సంస్థ 2021–22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,500 కోట్ల లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది. మార్కెట్లో కోల్ డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత సంవత్సరం సాధించిన బొగ్గు ఉత్పత్తి, అమ్మకాల దృష్ట్యా ఈసారి కూడా అంత మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అంతకుముందు 2020–21లో కంపెనీ రూ.273 కోట్ల లాభాలు సాధించింది. మార్కెట్లో బొగ్గు డిమాండ్ను సింగరేణి సద్వినియోగం చేసుకోవడంతో ఈసారి లాభాలు అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాలు ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో కంపెనీ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన బుధవారం జరిగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఉత్కంఠకు తెరపడనుంది. ఈ సమావేశానికి కోల్ సెక్రెటరీలు, సింగరేణి డైరెక్టర్లు, కోలిండియా డైరెక్టర్లు హాజరు కానున్నారు. దీనికి ముందుగా సోమవారం ప్రీబోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాభాలతోపాటు ఓసీపీ ఓబీ పనుల టెండర్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. లాభాల ప్రకటన తర్వాత కంపెనీ అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు, టీఆర్ఎస్ కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతాన్ని ప్రకటించాలని కోరతారని తెలిసింది. క్రితంసారి 29శాతం లాభాల వాటా ప్రకటించిన సీఎం ఈసారి గతం కంటే ఎక్కువ శాతమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
సింగరేణి సంస్థకు షాకిచ్చిన హైకోర్టు.. ఆ పోస్టుల భర్తీ నిలిపివేయండి!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్– 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని సంస్థ ఉన్నతాధికారులను హైకోర్టు శనివారం ఆదేశించింది. పరీక్షలో అవకతవకలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లు వాదనకు సరిపడా ఆధారాలు చూపించారని, తదుపరి నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని సింగరేణి రిక్రూట్మెంట్ సెల్కు ఆదేశాలు జారీచేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్తో సహా 8 జిల్లాలోని 187 కేంద్రాల్లో ఈనెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలు సజావుగానే నిర్వహించామని సింగరేణి, జేఏన్టీయూ అధికారులు చెబుతున్నా.. కొందరు అభ్యర్థులను గోవా తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడ పేపర్ లీకైందని ఆరోపణలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి, జేఎన్టీయూ అధికారులు హడావిడిగా ఫలితాలు విడుదల చేశారు. 78 వేల మంది పరీక్ష రాయగా, 49 వేల మంది అర్హత సాధించారని పేర్కొంటూ వారి మార్కులు, ర్యాంకులు వెల్లడించారు. అయితే, పరీక్ష రాసిన అభ్యర్థులంతా తమకెన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారని, కానీ సింగరేణి అధికారులు అలా విడుదల చేయలేదని, అందరి మార్కులు వెల్లడించిన తర్వాతే ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా అర్హత పేరుతో 49 వేల మంది ఫలితాలు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ పరిశీలించకుండా ఫలితాలు విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పపట్టింది. అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ మొదలైన పేర్లతో హాల్టికెట్లు ఎలా పంపిణీ చేశారని, పరీక్ష సమయంలో అభ్యర్థి పేరు రాస్తే ఎలా పరిగణనలోకి తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. కాగా, పరీక్షకు 15 రోజుల ముందే సింగరేణిలో కీలకమైన డైరెక్టర్(పా) పోస్టును చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చారని, ఐదు నెలల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఆ వ్యక్తికి ఇప్పుడా పదవి కట్టబెట్టడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారింది. -
ఆజాద్ హైదరాబాద్: సాయుధ పోరులో చేయి కలిపిన సింగరేణి
దేశమంతా స్వాతంత్య్ర సంబురాలు జరుపుకొంటున్న వేళ... తెలంగాణ మాత్రం నిజాం రాజు ఏలుబడిలోనే కొనసాగింది. ఎందరో వీరుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వదిలి వెళ్లాక కూడా హైదరాబాద్ సంస్థానాదీశుడైన నిజాం ఆధ్వర్యాన రజాకారులు హైదరాబాద్ సంస్థానం పరిధిలో అరాచకాలు సాగించారు. కొంతకాలం పంటి బిగువున భరించిన ప్రజలు... దుర్మార్గాలు పెచ్చరిల్లడంతో తిరుగుబాటుకు దిగారు. యువత ఏకమై సాయుధపోరాటాలు సాగించి నిజాం సైన్యాలను తిప్పికొట్టింది. ఈ పోరాటంలో పలువురు అమరులైనా మిగతా వారు వెనక్కి తగ్గకుండా చేసిన పోరాటంతో తెలంగాణకు సైతం స్వాతంత్య్రం లభించింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట గాధలను స్థానికులు గుర్తు చేసుకుంటుంటారు. ఆనాటి అమరులకు గుర్తుగా నిర్మించిన స్థూపాలు సాక్షిగా నిలుస్తున్నాయి. ఈమేరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలు గ్రామాలపై కథనాలు.. ఈటెలతో తిరగబడిన మీనవోలు ఎర్రుపాలెం : తెలంగాణ సంస్థానాన్ని ఏలుతున్న నైజాం పాలనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సాయుధ పోరాటంలో ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయ్యారు. పోరాటాల పురిటిగడ్డగా మీనవోలు గ్రామం చరిత్ర పుటలకెక్కింది. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నైజాంలు అప్పట్లో పోలీస్ క్యాంపు నిర్వహించేవారు. అందులో బ్రిటీష్ ప్రభుత్వ అధికారి లెఫ్టినెంట్ సార్జంట్ తరచూ మీనవోలు గ్రామంపై దాడులు చేసి ప్రజల సొమ్మును అపహరించేవాడు. సార్జంట్ తీరుకు తోడు రజాకారులు కూడా ప్రజలను చిత్రహింసలు పెడుతుండగా... 1948 సంవత్సరం జనవరి 15న గ్రామస్తులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఈక్రమంలో సార్జంట్ తన బలగాలే కాకుండా రజాకార్లతో కలిసి మీనవోలుకు వస్తున్నాడన్న సమాచారంతో గ్రామస్తులు ఈటెలతో దండెత్తారు. ప్రజల తిరుగుబాటును ఊహించని సార్జంట్ అప్పటికప్పుడు విచక్షణా రహితంగా తుపాకీతో కాల్పులు జరపగా రాంపల్లి రామయ్య, సుఖబోగి ముత్తయ్య, తోట బాలయ్య, పిల్లి కాటయ్య, బండి వీరయ్య, మెట్టెల శ్రీరాములు, తోట వెంకయ్య ప్రాణాలు కోల్పోయారు. అయినా కోపం చల్లారని సార్జెంట్.. నైజాం నవాబు సాయంతో రజాకార్లను రైలులో రప్పించి పలువురి ఇళ్లను తగలబెట్టారు. అలా పరిస్థితి విషమించడంతో పలువురు గ్రామస్తులు మీనవోలు విడిచివెళ్లారు. అనంతర కాలంలో పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రామాలకు చేరుకున్నారు. కాగా, రజాకార్లను ఎదురొడ్డి పోరాడి అమరులైన వారికి గుర్తుగా గ్రామస్తులు 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన స్థూపాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఈ స్థూపం శిథిలం కావడంతో మరమ్మత్తులు చేయించడంతో పాటు అదే రీతిలో ప్రధాన రహదారిపై మరో స్థూపాన్ని నిర్మించారు. గుర్రాలతో తొక్కించినా నోరువిప్పని పోరాటపటిమ కొణిజర్ల : నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో యువకులు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడగా... అందులో కొణిజర్ల మండలంలోని తనికెళ్లకూ స్థానముంది. తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, గడల రామకృష్ణయ్య, గడల సుబ్బయ్య, గడల నర్సయ్య తుళ్లూరి అప్పయ్య, కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య తాళ్లపల్లి రాములు ఆనాడు మల్లెల వెంకటేశ్వరరావు దళంలో పనిచేశారు. నాటి సాయుధ పోరాటంలో నల్లమల వెంకటేశ్వరరావు, షేక్ రజబ్అలీ నేతృత్వంలో తుపాకులు చేతబట్టి కదన రంగంలో కాలుమోపి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. దళంలో పనిచేసిన వీరికి ఇదే గ్రామానికి చెందిన గడల ముత్తయ్య, పేరసాని అప్పయ్య, యాసా వెంకటలాలయ్య, పిన్నం సత్యం, యాసా మాణిక్యమ్మ సాయం చేసేవారు. ఓ సమయాన రజాకార్లు గ్రామాలపై విచక్షణారహితంగా దాడి జరిపి మహిళలు, చిన్నారులను చిత్రహింసలకు గురిచేయడమే కాక పురుషులను పట్టుకుని జైలులో పెట్టారు. అందులో పలువురిని కాల్చి చంపడం ద్వారా గ్రామస్తులకు భయాందోళనకు గురిచేసేవారని చెబుతారు. ఆ సమయాన గడల సీతారామయ్య ఆచూకీ తెలపమని రజాకార్లు గుర్రాలతో తొక్కించినా గ్రామస్తులెవరూ నోరు విప్పలేదట! నాటి తెలంగాణ సాయుధ పోరాట ఆద్యుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పలువురు పోరాటంలో పాల్గొనగా, గ్రామానికి చెందిన యాసా మాణిక్యమ్మ అడవుల్లో తలదాచుకుంటున్న పోరాటవీరులకు భోజనం సమకూర్చేది. ఆమెను గుర్తించి రజాకార్లు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినా ఎవరి వివరాలు తెలియనివ్వలేదు. మండలంలోని లాలాపురానికి చెందిన సంక్రాంతి రామనర్సయ్య గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఆరికాయలపాడు దళం ఆర్గనైజర్గా పనిచేశారు. 1945 ప్రాంతంలో సింగరాయపాలెం జాగీర్దార్, నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం నిర్వహించాడు. వివాహమైన ఏడాదికే దళంలో చేరిన రామనర్సయ్య చేసిన పోరాట పటిమను తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1947లో ఆయనతో పాటు మరికొందనిని గుబ్బగుర్తి అడవుల్లో పట్టుకుంది. ఆతర్వాత మున్నేరువాగు వద్దకు తీసుకెళ్లి ఎవరి గోతులు వారినే తవ్వుకోమని చెప్పి కాల్చి చంపి పూడ్చి పెట్టారు. ఆయన స్ఫూర్తితోనే రామనర్సయ్య సోదరుడు సంక్రాంతి మధుసూదన్రావు కమ్యూనిస్టు నాయకుడిగా కొనసాగుతున్నారు. పోరాటాల గడ్డ మేదేపల్లి ఏన్కూరు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామస్తులు ఎందరో రజాకార్లను ఎదురొడ్డి పోరాటం చేశారు. తద్వారా పోరాటాల గడ్డగా మేడేపల్లి చరిత్రకెక్కింది. మేడేపల్లి గ్రామంలో గిరిజనులు రజాకార్లను ఎదిరించి పోరాటాలు చేశారు. తాటి సీతమ్మ, తాటి సత్యం, ముక్తి ఎర్రయ్య, బండ్ల పెద్ద జోగయ్య, ముక్తి రాములు తుపాకులు పట్టి అడవుల్లో తలదాచుకుంటూ రజాకార్లను తుదముట్టించారు. నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలో వీరు పోరాటం చేసినట్లు చెబుతారు. తాటి సీతమ్మ, తాటి సత్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్మృతిచిహ్నాలుగా గ్రామంలో స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీస్ చర్య తర్వాతా యుద్ధమే.. సత్తుపల్లి : సత్తుపల్లి నుంచి పది కి.మీ. దూరంలో ఉన్న ఆంధ్రా ప్రాంతంలోని గురుభట్లగూడెం, కృష్ణారావుపాలెం తదితర ప్రాంతాలపై రజాకార్ల నిర్బంధం కొనసాగేది. ఆ సమయంలో దమ్మపేట మండలం జమేదారుబంజరు ప్రాంతం నుంచి సోయం గంగులు నాయకత్వంలో సాయుధ పోరాటం మొదలైంది. ఆయనకు మద్దతుగా గిరిజనులు, గిరిజనేతరులు రజాకారులపై గెరిల్లా దాడులు పాల్పడుతుండేవారు. అనంతర కాలంలో పోలీసు చర్యతో తెలంగాణకు విముక్తి లభించింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు – భారత మిలటరీకి 1948 నుంచి 1950 వరకు రెండేళ్ల పాటు హోరాహోరీ పోరు నడిచింది. గ్రామాల్లోకి భారత సైన్యం వస్తుంటే కమ్యూనిస్టులు సాయుధులై తిరుగుబాటు చేసేవారు. క్షేత్ర స్థాయిలో పరిపాలనను అందించేందుకు ఆ సమయానభారత మిలటరీకి మద్దతుగా గ్రామాల్లో రక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాల్లోని సభ్యులకు తుపాకీతో శిక్షణ ఇచ్చేవారు. వీరు ఉదయమంతా గ్రామాల్లో గస్తీ తిరగటం.. చీకటిపడే సమయానికి సత్తుపల్లి పాత సెంటర్లోని జెండా చింతచెట్టు వద్ద సమావేశ కావటం జరుగుతుండేది. భారత మిలటరీని మలబార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో రక్షణ దళం ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులను హోంగార్డులుగా కూడా వ్యవహరించేవారు. ఇందులోభాగంగా 1948లో సత్తుపల్లి గ్రామ రక్షణ దళం ఏర్పాటు కాగా.. చల్లగుళ్ల సీతారామయ్య, నరుకుళ్ల వెంకయ్య, దిరిశాల సత్యం, మట్టా రామయ్య, చల్లగుండ్ల వీరయ్య, మట్టా వెంకయ్య, మొరిశెట్టి సత్యం, నరుకుళ్ల రామయ్య, పల్లబోతు నాగభూషణం, కొత్తూరు సుబ్బారావు, సీతారామయ్య, మహాదేవ రామలింగం, వల్లభనేని సకలయ్య తదితరులు సభ్యులుగా ఉండే వారని పెద్దలు చెబుతుంటారు. నాకు గర్వంగా ఉంటుంది.. 18 ఏళ్ల వయస్సులో మా నాన్న చల్లగుళ్ల వీరయ్య సత్తుపల్లి గ్రామ రక్షణ దళంలో పని చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాటం విరమించే వరకు రక్షణ దళం భారత మిలటరీ మద్దతుతో పని చేసేదని మానాన్న చెప్పేవారు. సత్తుపల్లి చరిత్రలో మా కుటుంబం పేరు కూడా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. – చల్లగుళ్ల నర్సింహారావు, సత్తుపల్లి -
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని (రామగుండం)/సింగరేణి(కొత్తగూడెం): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని కార్మికులు విధులు బహిష్కరించారు. మరోమూడు రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తామని.. సమ్మె యోచన విరమించాలని యాజమాన్యం గురువారం కోరినా కాంట్రాక్టు కార్మిక సంఘాలు ససేమిరా అన్నాయి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 23 వేల మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, ఆర్జీ–1,2,3, ఏపీఏ, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పలు విభాగాల్లో పనులు నిలిచిపోయాయి. అత్యవసర విభాగాల్లో మాత్రం పనులు కొనసాగాయి. డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె.. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమను యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలని, సీఎంపీఎఫ్ అమలు చేయాలని, లాభాల్లో వాటా ఇవ్వాలి, కార్మికశాఖ వద్ద పెండింగ్లో ఉన్న అన్నీ సమస్యలు పరిష్కరించాలని, కేటగిరీ ఆధారంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని, రామగుండం, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. భూపాలపల్లిలో రాస్తారోకో, మణుగూరులో ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా సింగరేణి ఉద్యోగ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలోని 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం తెలంగాణలోనివివిధజిల్లాల్లో ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డైరెక్టర్(పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినవారిలో 79 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 98,882 మంది అభ్యర్థుల హాల్టికెట్లను సింగరేణి వెబ్సైట్లో ఉంచగా 90,928 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వారిలో 77,907 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో 7,875 (88.62 శాతం), భద్రాద్రి కొత్తగూడెం 12,079(87.31 శాతం), వరంగల్ 9,221(84.6 శాతం), కరీంనగర్ 16,286(82.09 శాతం), ఖమ్మం 9,915 (81.35 శాతం), హైదరాబాద్ 12,672(72.63 శాతం) మంది హాజరుకాగా, తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 2,718(64.42 శాతం) మంది హాజరయ్యారు. డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ కరీంనగర్ జిల్లాలోని పలు పరీక్షాకేంద్రాల్లోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. హైదరాబాద్లో జనరల్ మేనేజర్(కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ పరీక్షాకేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొన్నికేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. 7న అభ్యంతరాలు సమర్పించాలి ఆదివారం జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఏ, బీ, సీ, డీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన ‘కీ’ని సోమవారం(సెపె్టంబర్ 5వ తేదీ) ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్సైట్ https://scclmines.com/ లో ఉంచనున్నట్లు డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం(సెపె్టంబర్ 7న) ఉదయం 11 గంటల లోపు సింగరేణి వెబ్ సైట్ ద్వారానే అభ్యంతరాలు సమర్పించాలని కోరారు. చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు -
పదో గనిలో విషవాయువులు
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా(ఏపీఏ)లోని పదో గనిలో సోమవారంరాత్రి నైట్షిఫ్టు నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. ఆ సమయంలో గని లోపల కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బొగ్గునిల్వలు పూర్తిగా వెలికితీయడంతో ఆ గనిని ఇటీవలే మూసివేశారు. సింగరేణి సంస్థ ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1 విస్తరణకు అనుసంధానం చేసేందుకు గని లోపల డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అత్యవసర విధుల నిమిత్తం కొద్దిమంది కార్మికులు మాత్రమే హాజరవుతున్నారు. ఈ క్రమంలో గనిలోని 4 సీమ్, 27 డిప్, 51 లెవెల్ ప్రాంతంలో విషవాయువులు వెలువడడాన్ని వారు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత గని అధికారులు ఈ విషయాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, జీఎం సేఫ్టీ (కార్పొరేట్) కె.గురవయ్య, ఏపీఏ జీఎం ఎన్.వి.కె. శ్రీనివాస్, జీఎం సేఫ్టీ(రామగుండం రీజియన్)కు వివరించారు. -
సెప్టెంబర్లో సింగరేణి లాభాలు ప్రకటిస్తాం: డైరెక్టర్ ఎన్.బలరాం
శ్రీరాంపూర్: ఆర్థిక సంవత్సరం 2021–22లో సింగరేణి సాధించిన లాభాలను సెప్టెంబర్లో ప్రకటిస్తామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడు లాభాలు పెరిగాయని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సింగరేణి ఎస్సీఓఏ క్లబ్ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన ఏసీ హాల్ను ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ సంస్థ లాభాలపై సెంట్రల్ ఆడిట్ కావాల్సి ఉందని, సెప్టెంబర్లో లాభాల లెక్క తేలుస్తామన్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మల్లన్నసాగర్లో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలోని నైనీబొగ్గు బ్లాక్ను ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పలేదని, ఓబీ పనులు, కోల్ ఆపరేషన్స్ అవుట్ సోర్సింగ్తో చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల, అధికారుల పిల్లలకోసం 15 శాతం సీట్లు కేటాయించాలని ఆరోగ్యశాఖను కోరామన్నారు. సింగరేణికి వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటూ డైరెక్టర్ రవిప్రసాద్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ఖాదిర్, ఏరియా ఇన్చార్జి ఎస్ఓటూ జీఎం గోపాల్సింగ్, క్లబ్ సెక్రెటరీ సంతోష్కుమార్, డీజీఎంలు శివరావు, గోవిందరాజు, ఓసీపీ పీవో రాజేశ్వర్రెడ్డి, ఏజెంట్ సత్యనారాయణ, ఎస్టేట్స్ అధికారి స్వప్న పాల్గొన్నారు. -
రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్పై వెంట తెచ్చుకున్న పిస్తోల్తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్వెపన్తో కాల్చారు.. షార్ట్వెపన్తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా..సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్పై వెంట తెచ్చుకున్న పిస్తోల్తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా..త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్వెపన్తో కాల్చారు.. షార్ట్వెపన్తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
జూనియర్ అసిస్టెంట్ నియామకాల్లో సింగరేణికి ‘పరీక్ష’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉద్యోగ నియామకాల విషయంలో తరచుగా విమర్శల పాలయ్యే సింగరేణికి మరో విషమ ‘పరీక్ష’ఎదురైంది. ఇటీవల సంస్థ.. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ తేదీ విషయమై డోలాయమానంలో పడినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత సింగరేణి సంస్థ 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ – 2 (క్లరికల్) పోస్టుల భర్తీకి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ముగిసే సరికి రికార్డు స్థాయిలో లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్లోనే సెప్టెంబర్ 4న రాత పరీక్ష నిర్వహిస్తామని సింగరేణి ప్రకటించినా, తేదీ సమీపిస్తున్నప్పటికీ సంస్థ తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. థర్డ్ పార్టీకి బాధ్యతలు నియామకాల్లో పారదర్శకత పాటించేందుకు సింగరేణి సంస్థ థర్డ్పార్టీకి పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోంది. అందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షల బాధ్యతను జేఎన్టీయూకి అప్పగించాలని నిర్ణయించింది. హాల్టికెట్ల జారీ మొదలు, జవాబుపత్రాల మూల్యాంకనం, మెరిట్ జాబితా రూపకల్పన అంశాలన్నీ థర్డ్ పార్టీగా జేఎన్టీయూనే నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందస్తు అంచనాల ప్రకారం పరీక్షల నిర్వహణకు రూ.కోటి వరకు చెల్లించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే, జేఎన్టీయూ రూ.3 కోట్లు చెల్లించాలని అంటోంది. దీంతో ఫీజు విషయమై ఎటూ తేల్చుకోలేక సింగరేణి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆరోపణలు సింగరేణి ఆధ్వర్యంలో 2015లో చేపట్టిన నియామకాలు సంస్థకు చెడ్డపేరు తెచ్చాయి. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, కొందరు ఉద్యోగార్థులు ముందుగానే ప్రశ్నపత్రాలు సంపాదించి హోటల్ గదుల్లో సిద్ధమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సింగరేణి సంస్థ కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ పరీక్షల నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూకే అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఏ పరీక్ష జరిగినా బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించొద్దంటూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడం ఆనవాయితీగా మారింది. రంగంలోకి దళారులు తాజాగా సింగరేణి నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం.. దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తుదారులకు ఫోన్లుచేసి ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో బేరం మాట్లాడటం మొదలెట్టారు. ఇది బయటపడటంతో సింగరేణి సంస్థ అంతర్గతంగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను నియమించి విచారణ చేపట్టింది. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే అభ్యర్థుల ఫోన్ నంబర్లు బయటకు రావడం, దళారుల నుంచి ఫోన్లు వస్తున్నట్లు తెలియడంతో సింగరేణి అ«ధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే సమయంలో పరీక్షల నిర్వహణ ఫీజు విషయంలో సింగరేణి, జేఎన్టీయూ మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో సమస్య మరింత జటిలంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంపై సింగరేణి సంస్థ దృష్టి సారించినట్టు సమాచారం. ఇదీ చదవండి: SCCL Recruitment 2022 Notification: సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ -
దశాబ్దం కల సాకారమైన వేళ
గోదావరిఖని: సింగరేణి పరిధిలోని గిరిజన ప్రాంతాల యువత జీవితాల్లో వెలుగులు నిండాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 665 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో 309 మంది యువకులకు ఆదివారం ఉద్యోగ పత్రాలను అందించింది. సింగరేణి గనుల విస్తరణతో భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులను సంస్థ యాజమాన్యం ఆదుకోవాలని దశాబ్దకాలంగా పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల గిరిజన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం 2018లో రాత పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కొంతమంది దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడంతో ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేసింది. కాగా, గిరిజన యువతకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు కూడా 27 డిసెంబర్ 2021న సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడగా.. కోల్బెల్ట్ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంస్థ సీఎండీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా చేశారు. దీంతో సమస్యలను పరిష్కరించి ఇటీవల పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 665 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదివారం ఒక్కరోజే 309 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దశలవారీగా మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంగరేణి వర్గాలు తెలిపాయి. తమ పోరాటం ఫలించిందని, దశాబ్దాల కల నెరవేరిందని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేస్తూ బతుకుతున్నా.. సింగరేణి ఉద్యోగం రావ డం సంతోషంగా ఉంది. డిగ్రీ చదివినా ఉద్యోగం లేక కూలీ పనిచేసుకుంటున్న. 2018లో సింగరేణిలో పరీక్ష రాశా. గిరిజనులకు ఉద్యోగాలను ప్రకటించడం ఆనందంగా ఉంది. – మూడు రఘు, చౌడవరంతండా, సత్తుపల్లి సంతోషంగా ఉంది మాది పేద కుటుంబం. బీ ఫార్మసీ పూర్తి చేశా. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్కు హాజరైనా ఉద్యోగం రాలే దు. సింగరేణి పరీక్షలో పాల్గొన్నా. ఫలితాలు ఆలస్యమైనా, సంస్థలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. – లూనావత్ రమేశ్, నర్సింహులపేట, మహబూబాబాద్ ఊహించలేదు.. సింగరేణిలో ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలు పెండింగ్లో పె ట్టారు. ఉద్యోగం రావడం మర్చిపో లేని రోజు. – ఇస్లావత్ రాజ్కుమార్, రాజీవ్నగర్తండా, యైటింక్లయిన్కాలనీ చిక్కులు అధిగమించి గిరిజన యువతకు ఉద్యోగాలిచ్చే విషయంలో అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఇబ్బందులను అధిగమించి 309 మందికి ఒకేరోజు ఉద్యోగాలివ్వ డం సంతృప్తినిచ్చింది. మిగతా వారికి కూడా దశల వారీగా ఉద్యోగాలిస్తాం. – బలరాంనాయక్, డైరెక్టర్, సింగరేణి -
వేడిజలం వెలుగులీను!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సరికొత్త వెలుగుల సృష్టికి సన్నద్ధమవుతోంది. తొలిసారిగా జియోథర్మల్ పవర్ప్లాంట్ స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రోటోటైప్ ప్రయోగాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వేదికగా చేసుకుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రయోగం కొలిక్కి వస్తుందని సింగరేణి భావిస్తోంది. సంప్రదాయ థర్మల్, హైడల్ సిస్టమ్లో ఇప్పటికే విద్యుదుత్పత్తి జరుగుతోంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో బొగ్గును మండించి సృష్టించే నీటిఆవిరి టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జలవిద్యుత్ కేంద్రాల్లో వేగంగా ప్రవహించే నీరు టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. కానీ, జియో థర్మల్పవర్ ప్రాజెక్టులో మాత్రం వేడినీరు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఇంధన వనరుగా మారనుంది. 30 ఏళ్ల కిందటే భూగర్భపొరల్లో జరిగే భౌతిక, రసాయనిక చర్యల కారణంగా అరుదుగా అక్కడక్కడా భూగర్భజలాలు చాలావేడిగా ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని 30 ఏళ్ల క్రితం అధికారులు అంచనా వేసి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సింగరేణి ఎక్స్ప్లోరేషన్ విభాగం మణుగూరు ప్రాంతంలో 1989లో బొగ్గు అన్వేషణ చేపట్టి వేడి భూగర్భజలాలను కనుగొంది. జియో థర్మల్ పద్ధతిలో తేలికగా విద్యుదుత్పత్తి చేయడానికి భూగర్భజలాల ఉష్ణోగ్రత 140 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉండాలి. కానీ, మణుగూరు దగ్గర వెలుగులోకి వచ్చిన వేడి భూగర్భజలాల ఉష్ణోగ్రత 67 సెల్సియస్ డిగ్రీలు మాత్రమే నమోదైంది. దీంతో అప్పటి నుంచి జియో థర్మల్ ప్లాంట్ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల జియోథర్మల్ పవర్ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. ఫ్లాష్ స్ట్రీమ్ ప్లాంట్లు, బైనరీ సైకిల్ పవర్ ప్లాంట్ల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్న భూగర్భజలాలకు ఇతర ద్రావకాలను జతచేయడం ద్వారా వేడి ఆవిరిని సృష్టించే వీలుంది. ఈ వేడి ఆవిరి ద్వారా టర్బయిన్లు తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. రెండేళ్ల శ్రమ బైనరీ సైకిల్ ప్లాంట్ ద్వారా జియో థర్మల్పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ రెండేళ్ల క్రితం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో జియో థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడానికి కేంద్రం రూ.1.72 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో సింగరేణి సంస్థ, సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రీస్ సంస్థలు సంయుక్తంగా మణుగూరు మండలం పడిగేరు వద్ద పనులు చేపట్టాయి. ఇటలీలో 20వ శతాబ్దంలోనే... ప్రపంచంలో తొలి జియో థర్మల్పవర్ ప్లాంట్ను 20వ శతాబ్దం ఆరంభంలో ఇటలీలోని టస్కనీలో ప్రారంభించారు. అక్కడ నీటి అడుగు భాగం నుంచి వేడి నీటి ఆవిరి ఉబికి వస్తుండటంతో తొలిసారిగా జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో జియో థర్మల్ ఎనర్జీని ఇరవైకి పైగా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అత్యధికంగా ఈ విధానంలో అమెరికాలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. తొలిసారిగా లఢక్లో.. ఇండియాలో తొలి ప్రాజెక్టును 2021 ఫిబ్రవరిలో లఢక్లోని పుగాలో ఓఎన్జీసీ ఈ చేపట్టింది. ఇక తాతాపాని(ఛత్తీస్గఢ్), మాణికరన్(హిమాచల్ప్రదేశ్), బక్రేశ్వర్(పశ్చిమబెంగాల్), తువా(గుజరాత్), ఉనాయ్(మహారాష్ట్ర), జల్గావ్(మహారాష్ట్ర), రాజ్గోర్, ముంగేర్(బిహార్), గోదావరి – ప్రాణహిత లోయ మణుగూరు(తెలంగాణ)లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు అవకాశాలు ఉన్నాయి. జియో థర్మల్పవర్ తయారీ ఇలా ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రొటోటైప్ జియో థర్మల్ పవర్ప్లాంట్లో వేడి భూ గర్భజలాలను ప్రత్యేకంగా తయారు చేసిన ఓ చాంబర్లోకి పంపిస్తారు. ఇందులో ఆర్గానిక్ ర్యాంకైన్ అనే ప్రత్యేకమైన ద్రావకాన్ని ఉంచుతారు. నీటి వేడితో ఈ ఆర్గానిక్ ర్యాంకైన్ అనే పదార్థం ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరిని టర్బయిన్లు ఉండే చాంబర్లోకి పంపిస్తారు. టర్బయిన్లను ఆవిరి తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. టర్బయిన్లు తిప్పిన ఆవిరిని తిరిగి కూలింగ్ చాంబర్లోకి పంపిస్తారు. అక్కడ చల్లబడిన ఆర్గానిక్ ర్యాంకైన్ సబ్స్టాన్స్ను తిరిగి ఉపయోగిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టును ‘క్లోజ్డ్ లూప్ బైనరీ డ్రైజెట్ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ప్రాసెస్ టెక్నాలజీ’గా పేర్కొంటున్నారు. ఈ విధానంలో వాతావరణ కాలుష్యం పరిమితంగా ఉంటుంది. బొగ్గును మండించాల్సిన అవసరం లేదు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. ర్యాంకైన్ సబ్స్టాన్స్ను మాత్రమే రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. పడిగేరు వద్ద 20 కిలోవాట్స్ సామర్థ్యంతో ప్రస్తు తం ప్రోటోటైప్ ప్రాజెక్టు సిద్ధమైంది. వచ్చే రెండు, మూడు నెలల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాలు జరగనున్నాయి. -
‘థర్మల్’కు కళ్లెం!.. ఆ మేరకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 55 శాతం నుంచి 40 శాతానికి కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యుత్ కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి అంశం. అంటే ఏ నిర్ణయమైనా రెండు ప్రభుత్వాల అంగీకారం మేరకు జరగాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విద్యుత్ రంగంలో తన నిర్ణయాలను అమలు చేయాల్సిందిగా బలవంతం చేస్తోందని తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తన నిర్ణయాలను అమలు చేయని రాష్ట్రాలపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడుతున్నాయి. 2025–26 నాటికల్లా.. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. సాంకేతికంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస ఉత్పత్తి (టెక్నికల్ మినిమమ్) సామర్థ్యం 55 శాతం ఉండాలి. కానీ వచ్చే మూడేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించాలని, థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా సౌర, పవన తరహా పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల, ప్రైవేటు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా సుమారు 58,000 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడం సాధ్యమేనని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు 2025–26 నాటికి థర్మల్ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించింది. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీకి నష్టాలే.. రాష్ట్రంలో ఎన్టీపీసీ, సింగరేణి, రాష్ట్ర జెన్కోల యాజమాన్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సాధారణంగా 70–85 శాతం వార్షిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సామర్ధ్యంతో విద్యుదుత్పత్తి చేస్తాయి. స్థాపిత సామర్థ్యంతో పోల్చితే వాస్తవిక ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. ఉదాహరణకు..100 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సగటున 80 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తే 80 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని సాంకేతిక పరిభాషలో చెబుతారు. కాగా సాధ్యమైనంత అధిక పీఎల్ఎఫ్తో విద్యుదుత్పత్తి చేస్తేనే జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి సంస్థలు లాభాలు ఆర్జించగలుగుతాయి. ఈ విధంగా అధిక పీఎల్ఎఫ్తో ఉత్పత్తి చేసినందుకు గతంలో కేంద్ర ఇంధన శాఖ నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్ పురస్కారాలను సైతం అందుకుంది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని తగ్గించాలని ఆదేశించడం గమనార్హం. కాగా కేంద్రం నిబంధనలను అమలు చేస్తే నష్టాలు తప్పవని జెన్కో, సింగరేణి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై ఫిక్స్డ్ చార్జీల మోత? విద్యుదుత్పత్తి సంస్థలకే కాదు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతో పాటు వినియోగదారులకు సైతం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు భారంగా మారబోతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కనీస జీవిత కాలం 25 ఏళ్లు. పెట్టుబడి రుణాలతో కలిపి వీటి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 25 ఏళ్ల కాలంలో రాబట్టుకునేందుకు వీలుగా వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్కు సంబంధించిన స్థిర చార్జీలు (ఫిక్స్డ్ కాస్ట్) నిర్ణయిస్తారు. మొత్తం వ్యయాన్ని ఈ 25 ఏళ్ల గడువులోగా రాబట్టుకోవడానికి వీలుగా జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి వంటి ఉత్పత్తి కంపెనీలు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటాయి. సాధారణంగా 85 శాతం పీఎల్ఎఫ్ను ప్రామాణికంగా తీసుకుని ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్పై స్థిర చార్జీలను లెక్కిస్తారు. ఈ విధంగా ఒక్కో యూనిట్ థర్మల్ విద్యుత్ స్థిర వ్యయం రూ.2–3 వరకు అవుతోంది. ఇప్పుడు కేంద్ర ఆదేశాల మేరకు కనీస పీఎల్ఎఫ్ను 40 శాతానికి తగ్గిస్తే.. విద్యుత్ స్థిర చార్జీలు రెట్టింపవుతాయని ,ఇవి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోక తప్పదని విద్యుత్రంగ నిపుణులు చెబుతున్నారు. బొగ్గు వినియోగం ప్రశ్నార్ధకం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు పూర్తిగా సింగరేణే సమకూరుస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ (విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడిసరుకులకు అయ్యే వ్యయం) కూడా కాస్త తక్కువే. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ బొగ్గు వినియోగం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని అంటున్నారు. తగ్గనున్న ప్లాంట్ల జీవిత కాలం... కొత్త విధానం ప్లాంట్ల జీవిత కాలాన్ని కుదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం వల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాల పనితీరు సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. తెలంగాణ జెన్కో ప్రస్తుతం 4042 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది, రెండేళ్లలో మరో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న మరో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం మరో కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది. వీటిద్వారా రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో కనీస ఉత్పత్తి సామరŠాధ్యన్ని 40 శాతానికి కుదించడం ప్రస్తుత ప్లాంట్లతో పాటు కొత్త ప్లాంట్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. సంప్రదాయేతర విద్యుత్ మేలు: కేంద్రం థర్మల్ విద్యుత్తో పోల్చితే పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరలకు లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. కాలుష్య కారకమైన థర్మల్ స్టేషన్ల కంటే సంప్రదాయేతర విద్యుత్ మేలని చెబుతోంది. అయితే ఇప్పటికే భారీ వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ప్లాంట్ల పరిస్థితేంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 2020–21లో జెన్కో 72.35 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసింది. గత ఐదేళ్లుగా 72–80 శాతం సామర్థ్యంతో ఉత్పత్తి సాధిస్తోంది. అయితే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో కోతపెట్టైనా సరే థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల..సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా 30 వేల మెగావాట్లు పెంచాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.