ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్‌’ ప్రారంభం | TSRTC Launches Singareni Darshan Bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్‌’ ప్రారంభం

Dec 28 2022 1:59 AM | Updated on Dec 28 2022 1:59 AM

TSRTC Launches Singareni Darshan Bus - Sakshi

జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్‌’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు.

సింగరేణి దర్శన్‌ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్‌ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్‌ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement